బదిలీపై వెళుతున్న ఆడిట్ అధికారికి రాజన్న ఆలయ ఉద్యోగుల సంఘం ఘన సన్మానం
వేములవాడ రాజన్న దేవాలయం లోకల్ ఫండ్ ఆడిట్ అధికారిగా పనిచేస్తూ హైదరాబాద్ జీహెచ్ ఎంసీ ఆడిట్ అధికారిగా బదిలీపై వస్తున్న రమేష్ ను రాజన్న ఆలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు సిరిగిరి శ్రీరాములు ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఏఈవో ప్రతాప్ నవీన్, సూపర్ వైజర్లు వెల్ది సంతోష్, అరుణ్, మహేశ్ గౌర్, సీనియర్ అసిస్టెంట్లు నూగూరి నరేంద్ర, నక్కా తిరుపతి, పెరిక శ్రీనివాస్, ఎడ్ల సాయి, పురాణం వంశీ, పోల్సాని రాజు పాల్గొన్నారు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
AI Boyfriends Telugu News: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చైనాలో సరికొత్త రూపం దాల్చింది. తోడు కోసం మనుషుల కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సృష్టించిన బాయ్ ఫ్రెండ్స్ వైపు అక్కడ యువతులు విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. ఒంటరితనం నుంచి విముక్తి పొందడానికి కోట్లాదిమంది అమ్మాయిలు ఈ వర్చువల్ తోడును ఎంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అయితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బాయ్ ఫ్రెండ్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత పెరగడంతో చైనా ప్రభుత్వం కలవర పడుతోంది. నిజానికి ఇంతలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అమ్మాయిలను ఆకర్షించడానికి గల కారణాలేంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఎప్పుడు తెలుసుకుందాం.
చైనాలో పెరుగుతున్న విపరీతమైన పని ఒత్తిడి, సామాజిక ఆంక్షలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల యువతకు తమ రిలేషన్ షిప్ కొనసాగించడం పెద్ద భారం అవుతుందట.. పెళ్లి పట్ల విరక్తిగా ఉన్న యువతులు.. గొడవలు పడని, ఎల్లప్పుడూ ప్రేమగా మాట్లాడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ చాట్ బాట్లను తమ జీవిత భాగస్వాములుగా భావిస్తూ వస్తున్నారట.. మిన్మో తో పాటు తో పాటు గ్లో వంటి యాపుల ద్వారా తమకు నచ్చిన లవర్స్ ను డిజైన్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా వీరికి 24 గంటలు అందుబాటులో ఉంటూ.. బాధల్లో ఉన్నప్పుడు మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఓదార్చడం వంటి పనులు చేయడంతో యువతులు ఎక్కువగా వీటికి బానిసలు అవుతున్నారట..
అయితే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇప్పుడు చైనా కమ్యూనిస్టు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.. ఇప్పటికే దేశంలో జననాల రేటు విపరీతంగా పడిపోయి ఆందోళన కలిగిస్తుంటే.. యువతులు పెళ్లిళ్లు చేసుకోకుండా ఇలా కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తోనే కాలం గడిపితే భవిష్యత్తులో దేశ జనాభా మరింత తగ్గిపోతుందని అక్కడి ప్రభుత్వం ఊహించని స్థాయిలో భయపడుతుందని వార్తలు వస్తున్నాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ పై కూడా ఊహించని ప్రభావం పడుతుందని కొంతమంది నిపుణులు చైనా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
చైనా ప్రభుత్వం ఈ వర్చువల్ లవ్ ను అరికట్టేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపడుతూ వస్తుంది. చాట్ బాట్లతో గడిపే సమయం పై ప్రత్యేకమైన పరిమితి కూడా విధించినట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్లు సామాజిక విలువలను దెబ్బతీయకుండా.. అశ్లీలతకు తావు లేకుండా ఉండేలా కఠినమైన ఫిల్టర్లను అమర్చాలని కంపెనీలకు చైనా ప్రభుత్వం ఆదేశించింది. యువత మనస్తత్వాలను ప్రభావితం చేసే యాపులపై చైనా ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేకమైన నిఘాలు కూడా ఏర్పాటు చేసింది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
LPG, LNG, PNG Difference: మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్కు సంబంధించిన పరిస్థితులు ప్రపంచ ఇంధన మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా గ్యాస్ సరఫరాలపై ఒత్తిడి పెరిగింది. దాని ప్రభావం భారతదేశంలో కూడా కనిపించడం ప్రారంభమైంది. గ్యాస్ ధరలు పెరగడం, కొంత ప్రాంతాల్లో సరఫరా అంతరాయం ఏర్పడడం వల్ల కొన్ని నగరాల్లోని చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు తమ వ్యాపారాన్ని కొనసాగించడం కష్టంగా మారింది. కొన్ని చోట్ల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది.
ఈ పరిస్థితుల్లో చాలా మంది ప్రజలకు ఒక సందేహం వస్తోంది. ఇంట్లో ఉపయోగించే గ్యాస్ ఏది? పైపుల ద్వారా వచ్చే గ్యాస్, సిలిండర్ గ్యాస్, LNG అన్నీ ఒకటేనా? వాస్తవానికి ఈ మూడు గ్యాస్ రకాల మధ్య స్పష్టమైన తేడాలు ఉన్నాయి. అవి ఏమిటి? భారత్లో అవి ఎలా సరఫరా అవుతున్నాయి? అనే విషయాలను సరళంగా తెలుసుకోవడం అవసరం. LPG, LNG, PNG మధ్య అసలు తేడా ఏంటీ? భారత్ ఈ గ్యాస్ ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తుందో తెలుసుకుందాం.
PNG అంటే ఏమిటి?
PNG అంటే పైప్డ్ నేచురల్ గ్యాస్ . ఇది సహజ వాయువు. ఇందులో ప్రధానంగా మీథేన్ గ్యాస్ అధికంగా ఉంటుంది. ఈ గ్యాస్ను ప్రత్యేక పైప్లైన్ నెట్వర్క్ ద్వారా నేరుగా ఇళ్లకు సరఫరా చేస్తారు. ఢిల్లీ, ముంబై, నోయిడా, గురుగ్రామ్ వంటి పెద్ద నగరాల్లో ఇప్పటికే లక్షలాది ఇళ్లకు ఈ విధంగా గ్యాస్ అందుతోంది. PNG ఉపయోగించే ఇళ్లలో గ్యాస్ వినియోగాన్ని కొలవడానికి మీటర్ అమర్చుతారు. విద్యుత్ బిల్లుల మాదిరిగానే ప్రతి నెల గ్యాస్ వినియోగానికి అనుగుణంగా బిల్లు చెల్లించాలి. ఈ గ్యాస్ను ప్రధానంగా వంటకు, గీజర్లకు ఉపయోగిస్తారు. PNG తేలికపాటి వాయువు కావడంతో లీక్ అయినా అది గాల్లోకి పైకి వెళ్లిపోతుంది. అందువల్ల ఇది తక్కువ ప్రమాదకరమైన, శుభ్రమైన ఇంధనంగా పరిగణిస్తారు.
LPG అంటే ఏమిటి?
LPG అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఇది మన ఇళ్లలో సాధారణంగా ఉపయోగించే సిలిండర్ గ్యాస్. ఇందులో ప్రొపేన్, బ్యూటేన్ అనే వాయువుల మిశ్రమం ఉంటుంది. ఈ వాయువులను అధిక ఒత్తిడితో ద్రవ రూపంలోకి మార్చి సిలిండర్లలో నింపుతారు. సాధారణంగా భారతదేశంలో 14.2 కిలోల సిలిండర్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అమలు తర్వాత దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు LPG కనెక్షన్లు అందాయి. ప్రస్తుతం భారతదేశంలో 32 కోట్లకు పైగా LPG కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. LPGలో పెద్ద భాగం మధ్యప్రాచ్య దేశాల నుంచి దిగుమతి అవుతుంది. ఈ గ్యాస్ గాలి కంటే బరువుగా ఉంటుంది. అందువల్ల గ్యాస్ లీక్ అయితే అది నేల దగ్గర చేరి ప్రమాదం కలిగించే అవకాశం ఉంటుంది. అందుకే LPG వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
LNG అంటే ఏమిటి?
LNG అంటే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్. ఇది కూడా సహజ వాయువే కానీ దీన్ని చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద, సుమారు -162 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లబరచి ద్రవ రూపంలోకి మార్చుతారు. ఇలా ద్రవ రూపంలోకి మారిన గ్యాస్ను పెద్ద ట్యాంకర్లలో ఒక దేశం నుంచి మరొక దేశానికి రవాణా చేస్తారు. భారతదేశంలో LNGను సాధారణ గృహాల్లో ఉపయోగించరు. ఇది ప్రధానంగా పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, పెద్ద వాణిజ్య రంగాల్లో ఉపయోగిస్తారు. భారత్కు LNG ప్రధానంగా ఖతార్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి దిగుమతి అవుతుంది.
భారత్లో గ్యాస్ సరఫరా ఎలా జరుగుతుంది?
భారతదేశంలో పైప్డ్ నేచురల్ గ్యాస్ను గృహాలకు సరఫరా చేసే పనిని గ్యాస్ పంపిణీ సంస్థలు నిర్వహిస్తాయి. నగరాల్లో పైప్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఇళ్లకు గ్యాస్ అందిస్తాయి. LPG సిలిండర్లను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తాయి. LNG దిగుమతులు మాత్రం ప్రత్యేక టెర్మినల్స్ ద్వారా జరుగుతాయి. అక్కడికి చేరిన LNGను మళ్లీ వాయు రూపంలోకి మార్చి పరిశ్రమలకు లేదా గ్యాస్ పంపిణీ నెట్వర్క్కు పంపిస్తారు.
ధరల పరంగా ఏది చౌక?
ధరల విషయానికి వస్తే నగరాల్లో పైప్డ్ గ్యాస్ సాధారణంగా తక్కువ ఖర్చుతో లభిస్తుంది. ఉదాహరణకు కొన్ని నగరాల్లో PNG ధర యూనిట్కు సుమారు రూ. 30–రూ. 32 వరకు ఉంటుంది. మరోవైపు LPG సిలిండర్ ధర సాధారణంగా రూ. 800 నుండి రూ. 1100 మధ్య ఉంటుంది. LNG ప్రధానంగా పరిశ్రమల్లో ఉపయోగించే ఇంధనం కావడంతో దాని ధర మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి మారుతూ ఉంటుంది. ప్రపంచ మార్కెట్లో ఏర్పడే మార్పులు, ముఖ్యంగా మధ్యప్రాచ్య ప్రాంతంలో జరిగే పరిణామాలు గ్యాస్ సరఫరా, ధరలపై ప్రభావం చూపుతాయి. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో PNG, LPG, LNG వంటి గ్యాస్ రకాల మధ్య తేడాలు తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మూడింటి మధ్య అసలు తేడా ఇదే…!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Congress 6 Guarantees: 'కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలపై ఈ అసెంబ్లీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాం' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 'రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ బుల్డోజర్లను పంపి ఇళ్లను కూలగొడుతున్న తీరుగానే శాసనసభలోనూ మంద బలంతో బుల్డోజర్ టాక్టిక్స్ని ప్రయోగిస్తున్నది. శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో అబద్ధాలు, అసత్యాలను పచ్చిగా మాట్లాడుతూ అంకెలను తారుమారు చేస్తూ అసెంబ్లీ సమావేశాలను తూతూమంత్రంగా నిర్వహిస్తున్నది' అని విమర్శించారు. 'ఆరు గ్యారెంటీలకు తొలి మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకొని చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దానికి తగ్గట్టు చట్టబద్దత కల్పించాలని ప్రైవేటు బిల్లు పెడతాం' అని కేటీఆర్ తెలిపారు.
Also Read: Tirumala: తిరుమలలో భారీగా కరెన్సీ కట్టలు.. ఎన్ని లక్షలు తీసుకెళ్లవచ్చో తెలుసా?
హైదరాబాద్లోని గోల్కొండ రిసార్ట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఉమ్మడి ఓరియంటేషన్ సమావేశం నిర్వహించారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. 'ఈసారి కాంగ్రెస్ పెడుతున్న బడ్జెట్ మూడోది. ఈసారి బడ్జెట్ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇప్పటికే సగం ప్రభుత్వ పదవీ కాలం అయిపోయింది. హామీల అమలులో ప్రజలు ఇచ్చిన వ్యవధి అయిపోయింది. వారి హామీల అమలు వైఫల్యాన్ని మోసాన్ని ఎండగట్టేందుకు ఈ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాం' అని వెల్లడించారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాకిచ్చిన తెలంగాణ సీఎం.. ఏం చెప్పారంటే?
'రెండన్నరేళ్ల తర్వాత కూడా చట్టబద్ధత పక్కన పెట్టి కనీసం అమలు కూడా చేయడం లేదు. అందుకే ఈ సమావేశాల్లో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును మా పార్టీ తరఫున తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మేము పెట్టే ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లుకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా. ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి అసెంబ్లీలో నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలంగా నిలదీస్తాం' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Also Read: Deputy CM Rahu Kethu Pooja: శ్రీకాళహస్తిలో తెలంగాణ డిప్యూటీ సీఎం రాహు కేతు పూజ
'రాహుల్ గాంధీకి రూ.వెయ్యి కోట్లు ఇస్తామని చెబుతున్న రేవంత్ రెడ్డి రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధును మాత్రం పక్కన పెట్టాడు. ఖమ్మంలో ప్రభుత్వ దాష్టీకంతో ఇళ్లు కోల్పోయిన ఖమ్మం వెలుగుమట్ల తరపున.. మూసీ బాధితుల తరఫున, పేద దళిత గిరిజన ప్రజల కోసం ఈ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం' అని కేటీఆర్ తెలిపారు. 'అసెంబ్లీలో ప్రభుత్వం చేస్తున్న అంకెల గారడీని, లేని అప్పులను ఉన్నవిగా చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ అబద్ధాలను అంకెలతో సహా ఎండగట్టాలని ఈరోజు జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇస్తామన్న నిధులు ఎందుకు కేటాయించలేదో నిలదీస్తాం. దీంతోపాటు ఆయా వర్గాలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీపై రేవంత్ రెడ్డిని నిలదీస్తాం' అని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
EPS 95 Pension Hike Update: దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 81 లక్షల మంది EPS-95 పెన్షనర్లకు సంబంధించిన ఒక కీలక పరిణామం తెరపైకి వచ్చింది. తమ కనీస పెన్షన్ను ఏకంగా 7 రెట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ పెన్షనర్లు మరోసారి పోరాట బాట పట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అందుతున్న సమాచారం, పెన్షనర్ల ఆందోళనల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత ద్రవ్యోల్బణం దృష్ట్యా నెలకు రూ.1,000 పెన్షన్ ఏమాత్రం సరిపోదని నిరసిస్తూ, పెన్షనర్లు తమ గొంతు వినిపిస్తున్నారు.
మార్చి 9 (నిన్న) నుండి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మూడు రోజుల పాటు సాగే నిరసన కార్యక్రమాన్ని పెన్షనర్లు ప్రారంభించారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ ఫ్యాక్టరీలు, మీడియా సంస్థల మాజీ ఉద్యోగులు ఈ పోరాటంలో భాగస్వాములయ్యారు. 30-35 ఏళ్లు విరాళాలు అందించినప్పటికీ, ప్రస్తుతం సగటున కేవలం రూ.1,171 మాత్రమే పెన్షన్ వస్తోందని వారు వాపోతున్నారు.
ప్రధాన డిమాండ్లు ఏమిటి?
EPS-95 జాతీయ పోరాట కమిటీ ప్రభుత్వం ముందు ఉంచిన ప్రధాన కోరికలు ఇవే. ప్రస్తుతమున్న రూ.1,000 ని రూ.7,500 కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కరువు భత్యం (DA), ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నవంబర్ 4, 2022 నాటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అర్హులైన వారందరికీ అధిక పెన్షన్ ప్రయోజనాలు అందించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నారు.
పెన్షన్ నిధిని నిర్వహించడంపై ప్రభుత్వం తన పరిమితులను వివరిస్తోంది. పెన్షన్ నిధిలో బీమా అకౌంటింగ్ లోటు ఉందని, అకస్మాత్తుగా పెన్షన్ మొత్తాన్ని భారీగా పెంచడం ఆర్థికంగా భారమని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం గరిష్ట జీత పరిమితి రూ.15,000పై లెక్కలు కడుతున్నారు. దీనిని పెంచితే తప్ప పెన్షన్ పెరగడం కష్టమని ప్రభుత్వం వాదిస్తోంది.
పెన్షన్ ఎంత పెరిగే అవకాశం ఉంది?
ప్రస్తుతం జరుగుతున్న నిరసనలు, ఒత్తిడిని గమనిస్తే పెన్షన్ పెంపుపై ప్రభుత్వం ఒక మధ్యేమార్గాన్ని అన్వేషించే అవకాశం ఉంది. ప్రస్తుత కనీస పెన్షన్ రూ.1,000 ఉండగా.. దాన్ని రూ.7,500 వరకు పెంచాలంటూ ఉద్యోగులు పోరుబాట పట్టారు. అయితే నిపుణుల అంచనా ప్రకారం.. కనీస పెన్షన్ రూ.2,500 నుంచి రూ.3,000 వరకు పెరిగే అవకాశం ఉంది.
పెన్షనర్లు కోరుతున్నట్లుగా 7 రెట్లు పెంపు వెంటనే జరగడం కష్టమైనప్పటికీ, కనీస పెన్షన్ను రూ.3,000 వరకు పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్చి 11న ముగిసే ఈ నిరసనల తర్వాత ప్రభుత్వం నుండి ఏదైనా అధికారిక ప్రకటన వెలువడుతుందేమో చూడాలి.
Also Read: Washing Clothes At Night: రాత్రిపూట బట్టలు ఉతుకుతున్నారా? ఇలా చేస్తే మీ జీవితంలో వచ్చే మార్పులు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tirumala Currency Permission: కలియుగ వైకుంఠవాసుడు కొలువుదీరిన తిరుమల కొండపైకి భక్త కోటి భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. తాజాగా జరిగిన ఓ పరిణామం భక్తులకు కొత్త సందేహం వ్యక్తమవుతోంది. తిరుమల కొండపైకి వెళ్లే సమయంలో అలిపిరి చెక్ పోస్టు వద్ద భారీగా డబ్బులు పట్టుబడ్డాయి. ఓ వ్యక్తి కారులో దాదాపు అర కోటికి పైగా డబ్బులు తీసుకెళ్తుండగా పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాకిచ్చిన తెలంగాణ సీఎం.. ఏం చెప్పారంటే?
తిరుమల శ్రీవారికి భక్తులు తమకి తోచిన కానుకలు సమర్పిస్తుంటారు. తాజాగా తమిళనాడులోని చెన్నైకి చెందిన ఓ పారిశ్రామికవేత్త శ్రీవారికి రూ.65 లక్షలు హుండీలో వేయడానికి తన డ్రైవర్తో పంపించాడు. తిరుమల కొండ ఎక్కేందుకు కారు నిలవగా అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు, భద్రతా సిబ్బంది తనిఖీ చేస్తుండగా డబ్బులు గుర్తించారు. రూ. 65 లక్షల డబ్బును విజిలెన్స్ అధికారులు గుర్తించారు. డబ్బుకు సంబంధించి ప్రూఫ్ చూపించి డబ్బును తిరుమలకి తీసుకెళ్లాలని అధికారులు చెప్పారు. అయితే కారు డ్రైవర్ డబ్బుకు సంబంధించిన ఆధారాలు సమర్పించలేదు. విజిలెన్స్ అధికారుల సూచన మేరకు డ్రైవర్ తన యజమాని అయిన పారిశ్రామికవేత్తకు సమాచారం అందించాడు.
Also Read: Deputy CM Rahu Kethu Pooja: శ్రీకాళహస్తిలో తెలంగాణ డిప్యూటీ సీఎం రాహు కేతు పూజ
కొండపైకి డబ్బులు తీసుకెళ్లాలంటే తప్పక ఆధారాలు చూపించాల్సిందేనని చెప్పడంతో చెన్నై నుంచి పారిశ్రామికవేత్త తిరుమలకు బయల్దేరారు. ఆయన వచ్చాక డబ్బుకు సంబంధించిన ఆధారాలు చూపిస్తే కొండపైకి డబ్బులు అనుమతి ఇస్తారు. ఆధారాలు చూపించకపోతే విజిలెన్స్ అధికారుల ఆధీనంలో ఆ డబ్బులు ఉంటాయి. తాజా సంఘటనతో తిరుమల కొండపైకి ఎంత డబ్బు తీసుకెళ్లవచ్చనే సందేహం అందరిలో మెదలుతోంది. సాధారణంగా కోటి రూపాయల వరకు నగదును తిరుమలకు తీసుకెళ్లవచ్చు. అయితే ఆ నగదుకు సంబంధించి వివరాలు తప్పక ఉండాల్సిందే. లేదంటే మాత్రం తనిఖీల సమయంలో పట్టుబడితే విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకుంటారు.
Also Read: Adulterated Wheat Flour: హైదరాబాద్ ప్రజల్లారా జరభద్రం! గోధుమ పిండి కూడా కల్తీ
మళ్లీ తిరుమల వచ్చిన బండ్ల గణేశ్
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని మరోసారి సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బండ్ల గణేష్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం తన కుటుంబంతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని బండ్ల గణేశ్ వెలుపలకు వచ్చారు. కొన్ని వారాల కిందట హైదరాబాద్ నుంచి తిరుమలకు బండ్ల గణేశ్ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. అనంతరం చంద్రబాబు, నారా లోకేశ్ను బండ్ల గణేశ్ కలిశాడు. ఇప్పుడు మరోసారి తిరుమలను సందర్శించడం చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Washing Clothes At Night: రాత్రిపూట బట్టలు ఉతుకుతున్నారా? ఇలా చేస్తే మీ జీవితంలో వచ్చే మార్పులు ఇవే!
Washing Clothes At Night Vastu: నేటి బిజీ లైఫ్లో సమయం సరిపోక చాలామంది రాత్రి వేళల్లో బట్టలు ఉతుకుతుంటారు. అయితే, వాస్తు శాస్త్రం, జ్యోతిష్య నిపుణులు ఈ అలవాటు పట్ల హెచ్చరిస్తున్నారు. రాత్రి పూట బట్టలు ఉతకడం వల్ల జీవితంలో ప్రతికూల మార్పులు వస్తాయని, కొన్ని వాస్తు దోషాలకు దారితీస్తుందని వారు చెబుతున్నారు. వాస్తు, శాస్త్రీయ దృక్కోణంలో రాత్రి వేళ బట్టలు ఉతకడం వల్ల కలిగే నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు, ఆధ్యాత్మిక కారణాలు
ప్రతికూల శక్తి: వాస్తు శాస్త్రం ప్రకారం పగలు సానుకూల శక్తితో నిండి ఉంటుంది. రాత్రి వేళలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాత్రి పూట బట్టలు ఉతకడం వల్ల ఈ ప్రతికూలత దుస్తుల ద్వారా ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉందని నమ్ముతారు.
ఆర్థిక ఇబ్బందులు: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అనవసరంగా రాత్రి వేళ నీటిని పారబోయడం ఇంటి శ్రేయస్సును తగ్గిస్తుంది. ఇది ఆర్థిక ఇబ్బందులకు, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలకు దారితీయవచ్చు.
వాస్తు దోషాలు: సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకడం లేదా ఆరబెట్టడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు పెరిగి, మానసిక అశాంతికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శాస్త్రీయ, ఆరోగ్య పరమైన సమస్యలు
కేవలం నమ్మకాలే కాదు, సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. సూర్యరశ్మి ఒక సహజ క్రిమిసంహారకంగా ఉంటారు. రాత్రిపూట ఆరబెట్టిన బట్టలకు సూర్యకాంతి తగలదు. దీనివల్ల బట్టల్లోని తేమ వల్ల బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు పూర్తిగా నశించవు. సరిగ్గా ఆరని, బ్యాక్టీరియా ఉన్న బట్టలు ధరించడం వల్ల చర్మ అలెర్జీలు, దురద వంటి రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంది.
ఏ సమయంలో ఉతకడం ఉత్తమం?
వీలైనంత వరకు ఉదయం లేదా మధ్యాహ్నం వేళల్లో బట్టలు ఉతకడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఉతికిన బట్టలను సూర్యరశ్మి బాగా తగిలే చోట ఆరబెట్టడం వల్ల అవి పూర్తిగా క్రిమిరహితంగా మారుతాయి. ఇది ఇంట్లో సానుకూల శక్తిని నింపడమే కాకుండా, మీ దుస్తులకు తాజాగా ఉండేలా చేస్తుంది.
బిజీ షెడ్యూల్ వల్ల ఉదయం కుదరకపోతే, బట్టలను రాత్రి ఉతికినప్పటికీ, ఆరబెట్టే ప్రక్రియను మాత్రం పగలు సూర్యకాంతిలో ఉండేలా చూసుకోండి. సరైన పద్ధతుల్లో బట్టలు ఉతకడం వల్ల మీ ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు రెండూ మెరుగుపడతాయి.
Also Read: Snake Viral Video: నల్లత్రాచు పాము మరణశాసనం..విషాన్ని చిమ్మి, అక్కడికక్కడే కుప్పకూలిపోయింది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
King Cobra Death Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ కొన్ని మాత్రం మనల్ని ఆశ్చార్యాని గురిచేస్తాయి. తాజాగా కింగ్ కోబ్రా (నాగుపాము) మరణానికి సంబంధించిన ఒక అరుదైన, భయంకరమైన వీడియో నెటిజన్లను వణికిస్తోంది.
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాముగా పేరుగాంచిన కింగ్ కోబ్రా, చనిపోయే చివరి క్షణాల్లో ఎలా ప్రవర్తించిందో ఈ వీడియోలో తెలుస్తోంది. సాధారణంగా పాములు పడగ విప్పడం మనం చూస్తుంటాం, కానీ ఒక పాము చనిపోయే ముందు ఇంత భయంకరంగా ప్రవర్తించడం చాలా అరుదు.
వీడియోలో ఏముంది?
వైరల్ అవుతున్న వీడియో ప్రారంభంలో ఒక భారీ కింగ్ కోబ్రా నేలపై చుట్టుకుని కనిపిస్తుంది. అయితే, అకస్మాత్తుగా అది బుసకొడుతూ పైకి లేచి శత్రువుపై దాడికి సిద్ధమైనట్లు పడగ విప్పుతుంది. తన నోరును వెడల్పుగా తెరిచి, తీవ్రమైన ఒత్తిడితో కోరల నుండి విషాన్ని బయటకు చిమ్ముతుంది. ఆ దృశ్యం చూస్తుంటే అది తన చివరి శక్తినంతా కూడగట్టుకుని పోరాడుతున్నట్లు అనిపిస్తుంది.
విషాన్ని ఉమ్మిన మరుక్షణమే, ఆ పాము తన నియంత్రణను కోల్పోయి ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోతుంది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే అది ప్రాణాలు వదలడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
నెటిజన్ల స్పందన
@NR LIFE అనే సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ అయిన ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. "పాము మరణం ఇంత భయంకరంగా ఉంటుందా?" అని కొందరు ఆశ్చర్యపోతుంటే, మరికొందరు ఇది ప్రకృతిలో కనిపించే అత్యంత అరుదైన "సహజ మరణం" అని వ్యాఖ్యానిస్తున్నారు.
గమనిక: ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు తీశారనే దానిపై స్పష్టమైన సమాచారం లేనప్పటికీ, కింగ్ కోబ్రా వంటి శక్తివంతమైన జీవి అంత వేగంగా ప్రాణాలు వదలడం సంచలనంగా మారింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాములకు తీవ్రమైన అంతర్గత గాయాలు అయినప్పుడు లేదా నాడీ వ్యవస్థ విఫలమైనప్పుడు ఇలాంటి ప్రవర్తన కనిపించే అవకాశం ఉంది. ప్రకృతిలో ప్రతి జీవి మరణం ఒక రహస్యమే. ఈ వీడియో కింగ్ కోబ్రా భీకరమైన అంతిమ క్షణాలకు సాక్ష్యంగా నిలుస్తోంది.
Also Read: LPG Shortage In Hyderabad: తెలంగాణలో మొదలైన గ్యాస్ సెగ..రంజాన్ పండుగ వేళ హోటల్ యజమానుల ఆందోళన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Poco C85x 5g Price In India: భారత మార్కెట్లోకి పోకో కంపెనీ అద్భుతమైన స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. దీనిని కంపెనీ పోకో C85x 5G పేరుతో అందుబాటులోకి తీసుకు వచ్చింది.. దీనిని కంపెనీ గత ఏడాది డిసెంబర్లో విడుదల చేసిన పోకో C85 కొత్త వేరియంట్లో భాగంగా దీనిని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్తో లాంచ్ చేసింది. అయితే, దీనికి సంబంధించిన ఫీచర్స్, ధర వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పోకో C85x 5G స్మార్ట్ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో కూడిన 6.9-అంగుళాల HD+ డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా నాచ్ డిజైన్తో 8MP ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్ అందుబాటులోకి వచ్చింది. అలాగే ఇది అద్భుతమైన యూనిసోక్ T8300 చిప్సెట్ ప్రాసెసర్పై రన్ అవుతుంది. దీంతో పాటు 4GB ర్యామ్ వేరియంట్లో బేస్ వేరియంట్ ప్రారంభమవుతుంది. ఇవే కాకుండా ఈ స్మార్ట్ఫోన్ ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్ లభిస్తున్నాయి.
ఈ Poco C85x 5G స్మార్ట్ఫోన్కి సంబంధించిన వేరియంట్స్ వివరాల్లోకి వెళితే.. మొదటి వేరియంట్ 4GB + 64GB ధర రూ.10,999 నుంచి ప్రారంభమవుతుంది. అంతేకాకుండా 4GB + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.11,999 ధరతో అందుబాటులోకి రాబోతోంది. అయితే, మార్చి 14వ తేదిన ఫ్లిప్కార్ట్లో ఈ స్మార్ట్ఫోన్ విక్రయాలు ప్రారంభం కాబోతున్నట్లు కంపెనీ అధికారంగా వెల్లడించింది. ఈ ఫోన్ బ్లాక్, గోల్డ్తో పాటు గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
Poco C85x 5G స్మార్ట్ఫోన్కి సంబంధించిన స్పెషిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 1600 × 720 పిక్సెల్ల రిజల్యూషన్తో 6.9-అంగుళాల HD+ డిస్ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో అందుబాటులోకి రాబోతోంది. ఈ డిస్ప్లే 810 నిట్ల వరకు గరిష్ట బ్రైట్నెస్ సపోర్ట్ను కూడా అందిస్తోంది. ఇది ఆక్టా-కోర్ యూనిసోక్ T8300 6nm ప్రాసెసర్పై రన్ అవుతుంది. దీంతో పాటు మాలి G57 MC2 GPUను కలిగి ఉంటుంది. అలాగే ఫ్రంట్ భాగంలో 32MP ప్రైమరీ రియర్ కెమెరాను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా అందుబాటులో ఉంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ఈ స్మార్ట్ఫోన్ ఎంతో శక్తివంతమైన 6300mAh బ్యాటరీని కలిగి ఉంది. అంతేకాకుండా 15W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఈ బ్యాటరీ 1000 ఛార్జింగ్ సైకిల్స్ను కూడా అందిస్తున్నట్లు కంపెనీ క్లైమ్ చేస్తోంది. దీంతో పాటు 7.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్కు కూడా సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. ఇక ఈ మొబైల్లో కంపెనీ 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac, బ్లూటూత్ 5.4 కనెక్టీవిటీ ఫీచర్స్ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. దీంతో పాటు ఇది IP52 రేటింగ్తో వస్తుంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Amit Mishra Police Case: ప్రముఖ క్రికెటర్పై ఆయన భార్య తీవ్ర ఆరోపణలు చేసింది. నటి గరీమా తివారీ తన భర్తపై కోర్టును ఆశ్రయించింది. తనను బలవంతంగా మద్యం తాగించడమే కాకుండా..డబ్బు, అదనపు కట్నం కోసం ఎంతో క్రూరంగా హింసించినట్లు ఆపే ఆరోపించింది.
ఐపీఎల్ క్రికెటర్ అమిత్ మిశ్రా, అతని కుటుంబంపై గరిమా తివారీపై ఇప్పుడు కోర్టుకు వెళ్లింది. వరకట్నం కోసం శారీరకంగా, మానసికంగా హింసించడంతో పాటు ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఆమె చేశారు.
జాతీయ మీడియా నివేదికల ప్రకారం..ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన 35 ఏళ్ల మోడల్ గరిమా తివారీ అదనపు సివిల్ జడ్జి కోర్టులో ఫిర్యాదు చేసింది. వివాహం తర్వాత తన భర్త, అతని కుటుంబం నుండి అనేక సార్లు శారీరక, మానసిక హింసను ఎదుర్కొంటున్నానని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అమిత్ మిశ్రాతో పాటు, అతని తల్లి బీనా మిశ్రా, తండ్రి శశికాంత్ మిశ్రా, సోదరుడు అమర్ మిశ్రా, వదిన రీతు మిశ్రా, సోదరి స్వాతి మిశ్రాలను కూడా ఆమె తన ఫిర్యాదులో నిందితులుగా పేర్కొన్నారు.
"అమిత్ మిశ్రా..నేను 2019లో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యింది. మేము దాదాపు మూడేళ్లు ప్రేమలో ఉండి.. 2021 ఏప్రిల్ 26న కాన్పూర్లోని ఒక క్లబ్లో పెళ్లి చేసుకున్నాము. మా వివాహం జరిగిన వెంటనే.. నా భర్త, అత్తమామలు నాకు హోండా సిటీ కారు రూ.10 లక్షల కట్నం ఇవ్వాలని మా కుటుంబంపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు. పెళ్లి తర్వాత నన్ను పంపించేటప్పుడు మా కుటుంబం రూ.2.5 లక్షలు ఏర్పాటు చేసింది. కానీ ఆ తర్వాత కూడా, మరిన్ని డబ్బుల డిమాండ్ చేస్తున్నారని" గరిమ ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
అమిత్ మిశ్రా తరచూ మద్యం సేవించి తనను తీవ్రంగా కొట్టి, హింసించేవాడని ఆమె భార్య గరిమా తివారీ ఆరోపింది. అయితే కొన్నిసార్లు రోజుల తరబడి ఆహారం, నీరు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆమె చెప్పుకొచ్చింది. చివరికి తాను మోడలింగ్ పని ద్వారా సంపాదించిన డబ్బును లాక్కునేవాడని, విడాకులు తీసుకుంటానని పదే పదే బెదిరించేవాడని కూడా ఆమె ఆరోపించింది. ఇలాంటి నిరంతర వేధింపుల కారణంగా, తాను నిరాశకు గురయ్యానని తన మోడలింగ్ వృత్తిని వదులుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్పింది.
ఈ వేధింపులతో విసుగు చెందిన గరిమ తివారీ కఠినమైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించింది. ఆమె ఒకసారి ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించి ప్రాణాపాయం నుంచి బయటపడింది. పోలీస్ కమిషనర్ కార్యాలయంతో సహా అనేకసార్లు పోలీసులను ఫిర్యాదు చేసినా.. క్రికెటర్ అమిత్ మిశ్రాపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆమె కోర్టుకు విన్నవించుకుంది.
Also REad: LPG Shortage In Hyderabad: తెలంగాణలో మొదలైన గ్యాస్ సెగ..రంజాన్ పండుగ వేళ హోటల్ యజమానుల ఆందోళన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Motorola G57 Power 5g Price Cut: ప్రముఖ మోటోరోలా కంపెనీకి సంబంధించిన మంచి స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ వార్త మీ కోసమే.. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్కార్ట్లో చాలా తగ్గింపు ధరలకే ఈ బ్రాండ్ మొబైల్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా జీ సిరీస్ స్మార్ట్ఫోన్ అత్యంత చీప్ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడే Moto G57 Power 5G స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే అద్భుతమైన స్పెషల్ బ్యాంక్ ఆఫర్స్తో పాటు ఎక్చేంజ్ ఆఫర్ లభిస్తోంది. అయితే, ఈ స్మార్ట్ఫోన్పై ఉన్న ఆఫర్స్, స్పెషిఫికేషన్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ Moto G57 Power 5G స్మార్ట్ఫోన్ అద్భుతమైన భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఇది చాలా ప్రత్యేకమైన 6.72-అంగుళాల Full HD+ LCD డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ డిస్ల్పే 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు 1050 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తోంది. అంతేకాకుండా ప్రొటక్షన్గా Corning Gorilla Glass 7i గ్లాస్ సపోర్ట్ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి Qualcomm Snapdragon 6s Gen 4 (4nm) చిప్సెట్ ప్రాసెసర్తో ఈ స్మార్ట్ఫోన్ పని చేస్తుంది.
ఈ స్మార్ట్ఫోన్ ఎంతో శక్తివంతమైన భారీ 7000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.. అంతేకాకుండా ఇది 33W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటు బ్యాక్ సెటప్లో Sony LYT-600 సెన్సార్ ఎంతో శక్తివంతమైన 50MP మెయిన్ కెమెరాతో అందుబాటులో ఉంది. అలాగే అదనంగా 8MP అల్ట్రా-వైడ్ కెమెరా కూడా లభిస్తోంది. దీంతో పాటు ఫ్రంట్ భాగంలో 8MP సెల్ఫీల కెమెరా కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం మార్కెట్లో 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్తో అందుబాటులో ఉంది. దీంతో పాటు ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆధారిత Hello UI పై ఆపరేటింగ్ సిస్టమ్పై రన్ అవుతుంది. అలాగే ఇది IP64 రేటింగ్, డాల్బీ అట్మోస్ స్టీరియో స్పీకర్లు, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అందుబాటులో ఉంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ప్రస్తుతం మార్కెట్లో Moto G57 Power 5G స్మార్ట్ఫోన్ MRP ధర రూ.17,999 కాగా.. ఇప్పుడే ఫ్లిప్కార్డ్లో దీనిని కొనుగోలు చేసేవారికి 17 శాతం ఫ్లాట్ తగ్గింపుతో కేవలం రూ.14,999 లోపే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్లను వినియోగించి ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసేవారికి ఏకంగా రూ.750 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇవే కాకుండా ఎక్చేంజ్ ఆఫర్తో ఈ స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేస్తే ఏకంగా రూ.11 వేల వరకు బోనస్ లభిస్తుంది. ఈ మొబైల్ను ధర నుంచి మైనస్ చేస్తే ఏకంగా రూ.3,999కే పొందవచ్చు. ఇవే కాకుండా దీనిపై ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి మరింత తగ్గింపు ధరకే పొందవచ్చు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
LPG Shortage In Hyderabad Today: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు సామాన్యుడి వంటగదిపై పడుతోంది. అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో ఏర్పడిన ఆటంకాల వల్ల హైదరాబాద్తో సహా దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడిందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చమురు, గ్యాస్ దిగుమతులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దీనివల్ల నెలకొన్న తాజా పరిస్థితులు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్లో ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రంజాన్ మాసం కావడంతో హోటళ్లకు గ్యాస్ అవసరం చాలా ఎక్కువగా ఉంది. కానీ, 100 బుకింగ్లు ఉంటే కనీసం 10 నుండి 20 సిలిండర్లు కూడా సరఫరా చేయలేని పరిస్థితి ఉందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్లో బుక్ చేసినా దొరకకపోవడం, బయట బ్లాక్లోనూ సిలిండర్లు లభ్యం కాకపోవడంతో దాదాపు 2 లక్షల మంది వినియోగదారులపై దీని ప్రభావం పడుతోంది.
గృహ అవసరాలకు తిప్పలు
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల విషయంలోనూ వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. గృహ అవసరాల సిలిండర్ బుక్ చేసుకుంటే వారం రోజుల వరకు రావడం లేదని కొందరు వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుండి 25 రోజులకు పెంచిన సంగతి తెలిసిందే.
గ్యాస్ కొరతపై వస్తున్న వార్తలను కొందరు డిస్ట్రిబ్యూటర్లు తోసిపుచ్చుతున్నారు. గృహ అవసరాల సిలిండర్ల కొరత లేదని, బుక్ చేసిన ఒక్క రోజులోనే అందజేస్తున్నామని హెచ్పీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ తెలిపారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని ఆయన వినియోగదారులకు సూచించారు.
అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉన్నందున, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వాణిజ్య గ్యాస్ సరఫరాలో కొంత నెమ్మది ఉన్నప్పటికీ, గృహ అవసరాల సిలిండర్ల విషయంలో డిస్ట్రిబ్యూటర్లు భరోసా ఇస్తున్నారు. అయినప్పటికీ, గ్రౌండ్ లెవల్లో కొరత ఉందని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bangalore Hotels Close: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘర్షణ.. అలజడులు నేపథ్యంలో అన్నీ దేశాలపై తీవ్ర ప్రభావం పడుతుండగా.. భారతదేశంపై మరింత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడిన భారత్కు చిక్కులు వచ్చిపడ్డాయి. ఇంధనం, గ్యాస్పై అంతా బాగానే ఉంది.. ఏం భయం అవసరం లేదని భారత ప్రభుత్వం పైకి గట్టిగానే చెబుతుండగా అంతర్గతంగా మాత్రం భయాందోళన చెందుతోంది. వంట గ్యాస్ కొరత ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే గృహ వినియోగదారుల గ్యాస్పై ఎలాంటి ఆందోళన లేకపోయినా కమర్షియల్ గ్యాస్పై మాత్రం గందరగోళం ఏర్పడింది. ఈ గ్యాస్ కొరత ఉందని పుకార్లు వస్తున్న నేపథ్యంలో హోటల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. ఈ కారణం చేత హోటళ్ల బంద్ చేపడతామని బెంగళూరులోని హోటళ్ల సంఘం ప్రకటించింది.
Also Read: Telangana CM: శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యం: తెలంగాణ సీఎం
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణ వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, ఇంధన వనరులపై తీవ్ర ప్రభావం పడింది. అంతర్జాతీయంగా నెలకొన్న సంఘర్షణలతో ఎగుమతులు, దిగుమతులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ముఖ్యంగా చమురు, ఇంధనంపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ కారణంగా వంటగ్యాస్ కొరత ఏర్పడిందనే వార్తలు వస్తున్నాయి. గ్యాస్ సరఫరాలో ఏర్పడిన ఆకస్మిక అంతరాయం కారణంగా బెంగళూరు నగరంలోని హోటళ్లను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాకిచ్చిన తెలంగాణ సీఎం.. ఏం చెప్పారంటే?
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడిందని హోటళ్ల నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ కారణంతో బెంగళూరు హోటళ్ల సంఘం సోమవారం కీలక ప్రకటన చేసింది. గ్యాస్ సరఫరాలో అంతరాయం కారణంగా రేపటి నుంచి హోటళ్ల బంద్ కార్యక్రమం చేపడతామని సంచలన ప్రకటన చేసింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోతుండడంతో మంగళవారం బెంగళూరులోని హోటళ్లు మూతపడతాయని ప్రకటించింది. హోటళ్ల బంద్ పిలుపుతో ఒక్కసారిగా బెంగళూరులో ఆందోళన నెలకొంది.
హోటళ్ల బంద్తో హోటల్ పరిశ్రమ కుదేలయ్యే అవకాశం ఉంది. రోజువారీ ఆహారం కోసం హోటళ్లపై ఆధారపడే విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, వృద్దులు, అత్యవసర సేవలు చేసేవారు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. గతంలో చమురు కంపెనీలు కనీసం 50 రోజుల పాటు గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని ప్రకటించింది. అయితే అకస్మాత్తుగా సరఫరా ఆపివేయడంతో హోటల్ పరిశ్రమను కోలుకోలేని దెబ్బ తీసిందని హోటల్ సంఘం తెలిపింది.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ నేపథ్యంలో అంతర్జాతీయం ఎల్పీజీ సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బపడింది. ఈ పరిస్థితుల్లో రిఫైనరీలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. గృహ వినియోగ ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు ఆటంకం కలగరాదని.. ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. గ్యాస్ కొరతను నివారణ కోసం ఆస్ట్రేలియా, కెనడా, నార్వే, యూఏఈ వంటి దేశాల నుంచి ఎల్పీజీని దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్పై తీవ్ర ప్రభావం పడింది. గృహ వినియోగదారులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుండడంతో ఇక కమర్షియల్ గ్యాస్ సరఫరా కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే బెంగళూరు హోటల్ యజమానుల సంఘం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి