icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

KTR: రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ హితవు.. 'నిరుద్యోగులను 5 వేల పోస్టులతో మోసం చేయొద్దు'

Hyderabad, Telangana:

Police Aspirants Protest: ఏడాదికి రెండు లక్షలు ఉద్యోగాలు అంటూ హామీ ఇచ్చిన రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మోసం చేయడంపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తుండగా వారికి అండగా బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ నిలిచారు. నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం లాఠీఛార్జ్ ప్రయోగించడాన్ని ఖండించారు. ఇది అత్యంత హేయమైన చర్యగా ప్రకటించారు. 5 వేల పోస్టులతో మరో మోసం చేయొద్దని.. 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని మాజీ మంత్రి డిమాండ్‌ చేశారు.

లాఠీచార్జ్ ఖండన
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో పోలీస్ కానిస్టేబుల్‌ ఉద్యోగాల అభ్యర్థులు ఆందోళన చేయగా.. పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని ఖండిస్తూ కేటీఆర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌లో తమ న్యాయమైన డిమాండ్ల కోసం, ఉద్యోగాల భర్తీ కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగ యువతపై, పోలీస్ అభ్యర్థులపై ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి లాఠీఛార్జ్ చేయించడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న అభ్యర్థులను వీధుల వెంట వెంటాడి వేటాడటం, అక్రమంగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి, నిరంకుశత్వానికి నిదర్శనమని కేటీఆర్‌ మండిపడ్డారు.

పోలీసులతో అణగదొక్కడమే ఇందిరమ్మ పాలనా?
విద్యార్థులను నిరుద్యోగులను పోలీసులతో అణగదొక్కడమే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఇందిరమ్మ ప్రజా పాలననా అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు అన్ని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయాలని అనేక రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాల్సిందేనని మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.

20 వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు
'ఎన్నికల ముందు ఒకే ఏడాది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, 'మెగా నోటిఫికేషన్లు', 'జాబ్ క్యాలెండర్' అంటూ కోతలు కోసి.. నిరుద్యోగ యువతను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, నేడు నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతోంది' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 20 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. 5 వేల పోస్టులతో చేతులు దులుపుకోవాలని చూడడం అన్యాయమని తెలిపారు. సుదీర్ఘకాలంగా కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటూ.. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే 20,000 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తూ మెగా నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

తక్షణమే విడుదల చేయాలి
దిల్‌సుఖ్‌నగర్‌లో హక్కుల కోసం పోరాడిన నిరుద్యోగ జేఏసీ నేతలను, విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించడాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. అరెస్టయిన ప్రతి ఒక్క నిరుద్యోగ బిడ్డను బేషరతుగా తక్షణమే విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ డిమాండ్ చేశారు. లాఠీలతో నిరుద్యోగుల గొంతు నొక్కాలని చూస్తే ఈ ప్రభుత్వానికి కాలం దగ్గరపడినట్టేనని హెచ్చరించారు.

లాఠీలతో అణచివేయలేరు
నిరుద్యోగుల ఆవేదనను, వారి న్యాయమైన డిమాండ్లను లాఠీలతో అణచివేయలేరని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్‌ రెడ్డి ఇప్పటికైనా తన మొండివైఖరి వీడి 20 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేయాలని కోరారు. అంతేకాకుండా వయో పరిమితి సడలింపు చేసి నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే.. నిరుద్యోగ, విద్యార్థి సమాజానికి అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ప్రకటించారు. భవిష్యత్‌లో తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తామని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు.

0
0
Report

Revanth Reddy: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి రేవంత్‌ రెడ్డి లేఖ.. రైల్వే మంత్రితో భేటీ ఏర్పాటు చేయండి

Baddipadaga, Telangana:

Hyderabad Metro Rail: హైదరాబాద్‌ మెట్రో రైలు అంశంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య కౌంటర్లు, ప్రతి కౌంటర్లు నడుస్తుండగా.. మంగళవారం ఇద్దరి మధ్య మరింత రాజుకుంది. ఉదయం కిషన్‌ రెడ్డి ప్రెస్‌మీట్‌ నిర్వహించగా.. సాయంత్రం రేవంత్‌ రెడ్డి లేఖ రాశారు. విబేధాలు కొనసాగుతున్న వేళ రైల్వే శాఖ మంత్రితో సమావేశం ఏర్పాటుచేయాలని.. అనుమతులు, రుణాల విడుదలలో జాప్యం చేయవద్దని లేఖలో విజ్ఞప్తి చేశారు.

Also Read: Kishan Reddy: రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కౌంటర్‌.. పనుల చిట్టా ఇదే

హైదరాబాద్ మెట్రో ఫేజ్–2కు కేంద్ర అనుమతులు, ఐఆర్‌ఎఫ్‌సీ రుణ విడుదలలో జాప్యం చేయవద్దని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి తెలంగాణ సీఎం బహిరంగ లేఖ రాశారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. మెట్రో ఫేజ్–2 కోసం 7 కారిడార్లు, 122.9 కి.మీ., రూ.38,595 కోట్ల ప్రతిపాదన కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిందని వివరించారు. కేంద్ర అభ్యంతరాల నేపథ్యంలో మెట్రో ఫేజ్–1ను స్వాధీనం చేసుకునే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

హైదరాబాద్‌ మెట్రో ఫేజ్–1 స్వాధీనానికి మొత్తం రూ.15,000 కోట్ల లావాదేవీలు పూర్తి చేశాం. కేంద్రం నామినేట్ చేసిన యూపీఎంఆర్‌సీఎల్ ఎండీ సుశీల్‌కుమార్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు' అని లేఖలో తెలంగాణ సీఎం గుర్తు చేశారు. 'డ్యూ డిలిజెన్స్ పూర్తి చేసి రుణ ఒప్పందం చేసిన ఐఆర్‌ఎఫ్‌సీ. రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ, ఆర్‌బీఐ డైరెక్ట్ డెబిట్ అంగీకరించింది' అని లేఖలో ప్రస్తావించారు. 'తొలి విడత రుణ విడుదల కోసం రూ.84.32 కోట్ల అప్‌ఫ్రంట్ ఫీజు తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది. రూ.1,461.47 కోట్ల ఈక్విటీని ఇప్పటికే ఎస్క్రో ఖాతాలో జమ చేశాం' అని లేఖలో సీఎం పేర్కొన్నారు.

జూన్ 15వ తేదీన విడుదల కావాల్సిన తొలి విడత రుణం ఇంకా విడుదల కాలేదని తెలంగాణ సీఎం లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం దానం అడగడం లేదని, ఒప్పందం ప్రకారం రుణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన సీనియర్ కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి బాధ్యత తీసుకోవాలని రేవంత్‌ రెడ్డి సూచించారు. మెట్రో ఫేజ్-2ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 50:50 జాయింట్ వెంచర్‌గా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. అనుమతులు ఆలస్యమైనా రాష్ట్ర వనరులు, సంస్థాగత రుణాలతో ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తామని తెలంగాణ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అవసరమైన ముందస్తు అనుమతులను వెంటనే మంజూరు చేయాలని లేఖలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అన్ని ఒప్పందాలు, ఆధారాలతో సమావేశానికి హాజరై వివరణ ఇవ్వడానికి సిద్ధమని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

0
0
Report
Advertisement

Kishan Reddy: రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కౌంటర్‌.. 'నేను చేసిన పనుల చిట్టా ఇదే!'

New Delhi, Delhi:

Kishan Reddy vs Revanth Reddy: 'హైదరాబాద్‌ మెట్రోప్రాజెక్టు విషయంలో అనేక రకాలుగా రేవంత్‌ రెడ్డి నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. ఏడేళ్లుగా కేంద్ర సహాయమంత్రిగా, కేబినెట్ మంత్రిగా నేను తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేశా. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరగాలనే కోరుకున్నా తప్ప ఏనాడూ  అడ్డుకునే ప్రయత్నం చేయలేదు' కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి వివరణ ఇచ్చారు. 'హైదరాబాద్‌ మెట్రో ఫేజ్ 1, ఫేజ్ 2 విషయంలో రేవంత్‌ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఫేజ్ 2 విషయంలో 50:50 నిష్పత్తిలో ముందుకెళ్లాలని సూత్రప్రాయంగా అంగీకరించింది. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నాతో, రేవంత్‌ రెడ్డి కలిసినప్పుడు కూడా ఈ విషయాన్ని తెలిపారు' అని వివరణ ఇచ్చారు.

కేంద్ర మంత్రిగా తెచ్చిన నిధులు
హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టుపై రేవంత్‌ రెడ్డి చేసిన విమర్శలపై మరోసారి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. రేవంత్‌ రెడ్డి విమర్శలను తిప్పి కొడుతూ తాను కేంద్ర మంత్రిగా తెలంగాణకు తెచ్చిన నిధులు, ప్రాజెక్టుల చిట్టాను బహిర్గతం చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కిషన్‌ రెడ్డి గట్టి బదులు ఇచ్చారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవే.

'మెట్రో ఫేజ్-1కు కేంద్ర ప్రభుత్వం రూ.1,250 కోట్లు ఇచ్చింది. మోదీ స్వయంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. దేశంలోని మిగిలిన నగరాల్లాగే హైదరాబాద్ విషయంలోనూ సాంకేతికతంగా చర్చించి కేంద్రం సహకరిస్తుంది. అంతే తప్ప కిషన్ రెడ్డి ఆపమంటే ఆపరు. తెలంగాణ అభివృద్ధిపై మాకు చిత్తశుద్ధి ఉంది. మాకు ఈ విషయంలో ఎవరి సర్టిఫికెట్లు అవసరం లేదు' అని రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు.

సర్టిఫికెట్లు అవసరం లేదు
నాకు, ప్రధానికి, కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్, రేవంత్ రెడ్డి సర్టిఫికెట్లు అవసరం లేదని.. తాను తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉంటానని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో మేం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తున్నామని.. జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, ఇతర మౌలికవసతుల ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తోందని వెల్లడించారు. 'ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బిడ్డగా నేను ఉద్యమాలు చేశా. అమరణ నిరాహార దీక్ష చేశా. బిల్లు పాసైన తర్వాతే దీక్ష విరమించా' అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వివరించారు.

ఎవరి సూచనలు అవసరం లేదు
తెలంగాణ విషయంలో, అభివృద్ధి విషయంలో ఎవరి సూచనలు తమకు అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. రూ.1.75 లక్షల కోట్లతో జాతీయ రహదారుల ప్రాజెక్టులు తెలంగాణలో నిర్మించామని.. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, 42 రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనులు ఇలా అనేక అభివృద్ధి పనులు చేశామని వెల్లడించారు. సికింద్రాబాద్, నాంపల్లి, చర్లపల్లి విషయంలో అభివృద్ధి పనుల కోసం భూసేకరణ కావాలని అడిగినా రేవంత్ రెడ్డి స్పందించలేదని ఆరోపించారు.

వడ్డీలేని రుణాలు
'ఎంఎంటీఎస్‌ ఫేజ్‌-2ను కేంద్ర నిధులతో నిర్మించాం. జహీరాబాద్ పారిశ్రామిక కారిడార్ వంటి ఎన్నో కార్యక్రమాలు తెలంగాణలో అమలు చేస్తున్నాం. ఏ ప్రభుత్వమైనా ఎలాంటి వివక్ష లేకుండా తమ సహకారం ఉంటుంది. రేవంత్ రెడ్డివి దిగజారుడు రాజకీయాలు. మేం ఉన్నన్ని రోజులు తెలంగాణ పురోగతికి కట్టుబడి ఉంటాం' అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. 'రూ.11వేల కోట్ల రుణాలను 50 ఏళ్ల కోసం వడ్డీలేని రుణాలు ఇచ్చింది. మూసీ పునరుజ్జీవనం కోసం ఏషియా డెవలప్‌మెంట్ బ్యాంకు నుంచి రూ.4,100 కోట్ల రుణం ఇప్పించాం. ఎస్‌సీడీసీ కోసం 12 ఏళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు ఇచ్చాం. ఈ ఏడాది ధాన్యం కొనుగోలుకు రూ.34 వేల కోట్లను అందించాం' అని వివరించారు. 

ఆ సంస్కృతి బీజేపీలో ఉండదు
ప్రాజెక్టులు ఆపే సంస్కృతి బీజేపీలో ఉండవని.. ఏదైనా చెప్పాలనుకుంటే.. ప్రాజెక్టు విషయంలో మార్పులు అవసరమైతే.. ధైర్యంగా చెబుతాం తప్ప.. ఇలా ప్రాజెక్టులను అడ్డుకోమని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రాజెక్టులకు సహకరిస్తామని.. అందులో సందేహం అక్కర్లేదని కుండబద్దలు కొట్టారు. దేశవ్యాప్తంగా అన్ని మెట్రోలు తీసుకున్న అప్పులను ముందే చెల్లించరు.. మెట్రో ఆదాయంలో.. ఆపరేషన్స్, మెయింటేనెన్స్‌కు ఖర్చు చేయాలని వివరించారు. ఆ తర్వాతే రుణాలు చెల్లించాలని చెప్పారు. ఆరు గ్యారంటీలపై వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి విమర్శించారు. 'కాంగ్రెస్‌ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీలు ఏమయ్యాయి? దాని గురించి ఏనాడూ మాట్లాడటం లేదు ఎందుకు?' అని ప్రశ్నించారు.

0
0
Report

Save The Tigers 3: ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3పై ప్రముఖుల రివ్యూ ఇదే!

Hyderabad, Telangana:

Save The Tigers Season 3 premiere: భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న తగాదాలను వినోదంగా మలచి తెరకెక్కించిన ‘సేవ్ ది టైగ‌ర్స్’ వెబ్‌ సిరీస్‌ సూపర్‌హిట్‌ నిలవగా.. మూడో సీక్వెల్‌ విడుదలకు సిద్ధమైంది. ఈనెల 19వ తేదీన విడుదలవుతున్న సందర్భంగా ప్రీమియర్‌ షో వేయగా.. చక్కటి స్పందన లభించింది. సరికొత్త సీజన్‌కు సంబంధించి పలువురు ప్రమఖులు తమ అభిప్రాయాలు పంచుకుని రివ్యూగా ఇచ్చారు. ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ఎలా ఉందో వారి మాటల్లో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో సోమవారం సాయంత్రం “సేవ్ ది టైగర్స్ సీజన్ 3” గ్రాండ్ ప్రీమియర్‌ నిర్వహించగా అద్భుతమైన స్పందన లభించింది. ప‌లువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. వారి న‌వ్వుల‌తో థియేటర్‌ సందడిగా మారింది. వెబ్‌ సిరీస్‌లోని నటీనటులు, సాంకేతిక బృందం, క్రియేటర్లతోపాటు అతిథులు, సెలబ్రిటీలు అంద‌రూ క‌లిసి ప్రీమియర్‌ షో చూశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెడ్ కార్పెట్లు, హై-ఫ్యాషన్‌లో సెలబ్రిటీలు మెరిశారు.

హాజరైన వారు వీరే..
సేవ్ ది టైగ‌ర్స్ 3 స్పెష‌ల్ సెల‌బ్రిటీ ప్రీమియ‌ర్ వేడుక‌లో యువ నటుడు సందీప్ కిషన్, సినీ ప్రముఖులు కామాక్షి భాస్కర్ల, రాగ్ మయూర్, బిగ్‌బాస్ తెలుగు 5 విజేత వీజే సన్నీ, సీజన్‌ 9 విజేత కల్యాణ్ పడాల, చైతన్య రావు, వెంకటేష్ కాకుమాను, కార్తీక్ రత్నం, ఆదిత్య మండల, శ్రీనాథ్ మాగంటి, జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్, నిరుపమ్, కిరీటి దామరాజు, మాన‌స్ తదితరులు పాల్గొని ప్రీమియ‌ర్‌ను చూసి తమ ఆనందాన్ని పంచుకున్నారు.

ఎప్పుడు రిలీజ్?
సేవ్‌ ది టైగర్‌ నటీనటులు ప్రియదర్శి, వెన్నెల కిషోర్, జోర్దార్ సుజాత, కృష్ణ చైతన్య, దేవియాని శర్మ, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి నటనకు ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన వ‌చ్చింది. మూడు జంటల కథతో పాటు ప్ర‌త్యేక‌మైన పాత్ర‌లో వెన్నెల కిశోర్ న‌టించిన ఈ సిరీస్‌ను ప్రేక్షకులు ఆదరించారు. జూన్ 19 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానున్న సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్‌-3కి కౌంట్‌డౌన్ ప్రారంభ‌మైంది.  రెండు ప్రపంచాలు ఢీకొట్టేలా చేసిన గర్జన! దీనిని దేవుడి ప్లాన్ అనాలా, లేక విధి అనాలా!… అంటూ ప్రొమోలతో ప్రేక్షకులను వెబ్‌సిరీస్‌ ఆకర్షిస్తోంది. ఓటీటీల్లో వీక్షణలప‌రంగా సేవ్ ది టైగర్స్ అతిపెద్ద తెలుగు వెబ్ సిరీస్‌గా నిలిచింది. తొలి రెండు సీజన్స్‌లు కామెడీ, ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లు, ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకున్నాయి. రెండు సీజన్‌లు ఊహించని విజయం పొందడంతో సీజ‌న్‌-3పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ కొత్త సీజ‌న్ ఎలా ఉంటుంది? మూడు జంటలు ఏం చేయబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

0
0
Report

The Suraka School: కొల్లూరులో ది సురాకా స్కూల్ కొత్త అకడమిక్ బ్లాక్ ప్రారంభం

Hyderabad, Telangana:

The Suraka School: సీబీఎస్‌ఈ, కేంబ్రిడ్జ్ పాఠ్యాంశాలను ఒకే వేదికపై అందిస్తూ విద్యా సంస్థల్లో విశేష గుర్తింపు పొందిన ది సురాకా స్కూల్ - ఫ్యూచురా ఎక్సలెన్స్ తన అత్యాధునిక క్యాంపస్‌లో కొత్తగా అకడమిక్ బ్లాక్‌ను ప్రారంభించుకుంది. హైదరాబాద్‌ శివారులోని కొల్లూరు పాఠశాల ప్రాంగణంలో అకడమిక్‌ బ్లాక్‌ను ప్రారంభించుకుని విద్యార్థులకు అత్యుత్తమ విద్యా బోధన అందించేందుకు సిద్ధమైంది. భవిష్యత్‌కు అనుగుణమైన, విలువల ఆధారిత విద్యను అందించాలనే సంస్థ లక్ష్యానికి ఈ ప్రారంభోత్సవం ఒక కీలక ఘట్టంగా నిలిచిందని ది సురాకా స్కూల్‌ యాజమాన్యం తెలిపింది. అట్టహాసంగా జరిగిన ఈ అకడమిక్‌ బ్లాక్‌ ప్రారంభోత్సవంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేశ్‌, మాజీ డీజీపీ ఎన్. సాంబశివరావు ముఖ్య అతిథులుగా హాజరై అకడమిక్‌ బ్లాక్‌ను ప్రారంభించారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ రమేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలు  అంకితభావంతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. నాణ్యమైన విద్య సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. మాజీ డీజీపీ  సాంబశివరావు మాట్లాడుతూ.. 'భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దడంలో విద్యాసంస్థల పాత్ర ఎంతో కీలకం. విద్య, విలువలు, ఆవిష్కరణ  వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యం ఇచ్చే విద్యా వాతావరణాన్ని సృష్టించారు' అని పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం జరిగిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థుల మార్చ్‌పాస్ట్ కలర్ పార్టీ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. క్యాంపస్‌లో భారత క్రికెట్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన క్రిక్‌కింగ్‌డమ్ క్రికెట్ అకాడమీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాల క్రీడా మౌలిక సదుపాయాలు  నిపుణుల శిక్షణను అందిస్తుంది.

ది సురాకా స్కూల్ – ఫ్యూచురా ఎక్సలెన్స్ అకాడమిక్ బ్లాక్ ప్రారంభం భవిష్యత్‌కు అనుగుణమైన విద్య, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, విలువల ఆధారిత బోధన, అనుభవాత్మక అభ్యాసం  సమగ్ర వికాసం వైపు సంస్థ చేస్తున్న ప్రయాణంలో ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచింది. ఈ కార్యక్రమంలో మాజీ ఐసీఎల్ఎస్ అధికారి డాక్టర్ డి. విజయ భాస్కర్, ది వింటేజ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మహమ్మద్ తాహిర్, ది కాశ్మీర్ ఫైల్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్, టీసీఎస్‌  హైదరాబాద్- సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వి. చెన్నారెడ్డి, హెక్సాగాన్ సీఈఓ భల్లవ్ ముండ్రా, వ్యవస్థాపక ప్రిన్సిపాల్ అకడమిక్ డైరెక్టర్ మరుతీ రాంప్రసాద్ పెళ్లూరి హాజరయ్యారు.

డ్జోనియా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ద్వారా 12 సంవత్సరాలకు పైగా విద్యారంగ అనుభవాన్ని కలిగి ఉన్న పాఠశాల వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ నిలోఫర్ షేక్ ఆధ్వర్యంలో పాఠశాల కొనసాగుతోంది. సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ షాహిద్ షేక్‌తోపాటు డైరెక్టర్లు సుభాష్ దాభాడే  శ్యామ్ సుందర్ మోదాని మార్గదర్శకత్వంలో సురాకా పాఠశాల వ్యవహారాలు కొనసాగుతున్నాయి. వారి తమ దూరదృష్టి, మార్గదర్శకత్వంతో విద్యా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు.

సురాకా అంటే?
సురాకా అనే పదం సంస్కృతంలో పవిత్ర జ్ఞానం అనే అర్థాన్ని సూచిస్తుంది. విద్యా ప్రావీణ్యం, ఆవిష్కరణ, వ్యక్తిత్వ వికాసం సమగ్ర అభివృద్ధి కలిసిన ఒక రూపాంతరాత్మక విద్యా వాతావరణాన్ని సృష్టించాలనే లక్ష్యంతో ఈ విద్యాసంస్థకు సురాకా అనే పేరు పెట్టారు.

క్యాంపస్‌లో ప్రత్యేక సదుపాయాలు
రోబోటిక్స్ ల్యాబ్, వండర్ ల్యాబ్, సుకూన్ ల్యాబ్

దరఖాస్తులు ప్రారంభం
2026–27 విద్యా సంవత్సరానికి సీబీఎస్‌ఈ, కేంబ్రిడ్జి ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. భవిష్యత్‌కు సిద్ధం చేసే.. విలువలతో కూడిన విద్యను కోరుకునే తల్లిదండ్రులు కొల్లూరులోని పాఠశాలను సందర్శించవచ్చు. క్యాంపస్ టూర్‌ను బుక్ చేసుకోవచ్చు లేదా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు వెబ్‌సైట్:
www.thesurakaschool.com సందర్శించవచ్చు

0
0
Report
Advertisement

Tecno కొత్త సంచలనం.. భారీ బ్యాటరీ, అడ్వాన్స్‌డ్ AI ఫీచర్లతో Tecno Spark 50 Pro లాంచ్..

Hyderabad, Telangana:

Tecno Spark 50 Pro Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ టెక్నో (Tecno) తన స్పార్క్ సిరీస్‌ను మరింత విస్తరిస్తూ మార్కెట్లోకి సరికొత్త మొబైల్‌ను లాంచ్‌ చేసింది.. అద్భుతమైన ఫీచర్లతో పాటు శక్తివంతమైన కెమెరాతో టెక్నో స్పార్క్ 50 ప్రో (Tecno Spark 50 Pro) స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఇది అధునాతన మీడియాటెక్ ప్రాసెసర్‌తో పాటు చాలా ప్రత్యేకమైన కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అద్భుతమైన డిస్‌ప్లే..
ఈ Tecno Spark 50 Pro స్మార్ట్‌ఫోన్‌ ఎంతో ప్రత్యేకమైన 6.78 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.. అంతేకాకుండా దీనికి తోడు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండటం విశేషం..  అయితే, ఇది డిస్ల్పే పరంగా ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రావడం వల్ల  గేమింగ్, వీడియోలు చూసేటప్పుడు డిస్‌ప్లే ఎంతో స్మూత్‌గా, స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇందులో SGS ఫైవ్-స్టార్ ప్రీమియం డ్రాప్ రెసిస్టెన్స్ సపోర్ట్‌ కూడా అందుబాటులో ఉంది. దీని వల్ల ఫోన్ పొరపాటున కింద పడినా త్వరగా పాడవ్వదని కంపెనీ క్లైమ్‌ చేస్తూ వస్తోంది..

50MP సోనీ కెమెరా.. 
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం టెక్నో కంపెనీ చాలా అద్భుతమైన కెమెరా సెటప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీని వెనక భాగంలోని కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ LYT-600 ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన ఫోటోలను క్లిక్ చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో ఫ్రంట్‌లో భాగంగా అద్భుతమైన  8 మెగాపిక్సెల్ కెమెరాను అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు కంపెనీ తెలిపింది. 

శక్తివంతమైన ప్రాసెసర్‌..
టెక్నో స్పార్క్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ హెలియో G100 అల్టిమేట్ (Helio G100 Ultimate) చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతున్నట్లు కంపెనీ తెలిపింది.. ఈ ఫోన్‌లో ఎంతో ప్రత్యేకమైన ఎల్లా AI ఏజెంట్‌తో పాటు AI హెల్త్ అసిస్టెంట్, AI రైటింగ్, AI నాయిస్ క్యాన్సలేషన్, AI ఎరేజర్ 2.0 వంటి ఎన్నో రకాల అడ్వాన్స్‌డ్ AI టూల్స్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

భారీ బ్యాటరీ.. 
ఈ స్మార్ట్‌ఫోన్‌ మొత్తం రెండు బ్యాటరీ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. ఇందులో మొదటి ఆప్షన్‌  5,600mAh ఉండబోతోంది. అంతేకాకుండా రెండవది 6,000mAh బ్యాటరీ ఆప్షన్లలో లభించనుంది. దీనికి 60W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఫీచర్‌ కూడా అందుబాటులో ఉండడం విశేషం.. అలాగే కేవలం 30 నిమిషాల్లోనే 63 శాతం వరకు బ్యాటరీ ఫుల్‌ అవుతుంది. దీంతో పాటు ఇందులో కంపెనీ  IP68తో పాటు IP69 రేటింగ్స్ ఇచ్చారు.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Redmi Turbo 5: రూ.38 వేలకే ఐఫోన్ రేంజ్ ఫీచర్స్.. 7540mAh బ్యాటరీతో సరికొత్త Redmi Turbo 5 లాంచ్!

Hyderabad, Telangana:

Redmi Turbo 5 India Launch News: భారతదేశ మొబైల్ మార్కెట్లోకి రెడ్‌మి (Redmi) సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. దీనిని కంపెనీ రెడ్‌మి టర్బో 5 (Redmi Turbo 5) స్మార్ట్‌ఫోన్‌ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది చైనాలో విడుదలైన కొద్ది రోజులకే భారత మార్కెట్‌లోకి అందుబాటులోకి రావడం విశేషం.. అయితే, దీనిని కంపెనీ రూ.34 వేల నుంచి రూ.38 వేల బడ్జెట్‌ విభాగంలో ఐఫోన్ రేంజ్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ ప్రియులను ఆకట్టుకునేందుకు ఇది సిద్ధమైంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ధర వివరాలు..
భారతదేశంలో రెడ్‌మి టర్బో 5 బేస్ వేరియంట్ (8GB RAM + 256GB స్టోరేజ్) ధర రూ. 37,999 నుంచి ప్రారంభమవుతుంది.. ఈ స్మార్ట్‌ఫోన్ అస్ఫాల్ట్ బ్లాక్, నైట్రో బ్లూతో పాటు టర్బో వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది.. కస్టమర్లు ఈ మొబైల్‌ను ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ (Amazon India)తో పాటు Mi.com, అధికారిక స్టోర్ల ద్వారా కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది.. అంతేకాకుండా మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

కళ్లు చెదిరే డిస్‌ప్లే.. 
ఈ రెడ్‌మి టర్బో 5 ఫోన్‌లో 6.59-ఇంచుల 1.5K అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌తో పాటు 3,500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది.. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా, ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది.. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఇచ్చారు. అంతేకాకుండా, ధూళి మరియు నీటి నుండి రక్షణ కోసం అత్యుత్తమమైన IP66, IP68, IP69 మరియు IP69K రేటింగ్స్‌ను కలిగి ఉండటం విశేషం.

సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్.. 
గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం ఇందులో శక్తివంతమైన ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా (MediaTek Dimensity 8500 Ultra) చిప్‌సెట్‌ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది.. ఇది గరిష్టంగా 3.4GHz క్లాక్ స్పీడ్‌ను అందిస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3 (HyperOS 3)పై  ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇందులో అడ్వాన్స్‌డ్ AI ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది..

7,540mAh మెగా బ్యాటరీ.. 
రెడ్‌మి టర్బో 5 స్మార్ట్‌ఫోన్‌లో అతిపెద్ద హైలైట్ దీని బ్యాటరీ.. ఇందులో కంపెనీ ఏకంగా శక్తివంతమైన 7,540mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి తీసుకు వచ్చింది.. దీనికి తోడు 100W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఫీచర్‌ కూడా లభిస్తోంది. ఇది ఫోన్‌ను చాలా త్వరగా చార్జ్ చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది.. అలాగే 27W రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. దీని ద్వారా ఇతర డివైజ్‌లను కూడా ఎంతో సులభంగా చార్జ్ చేసుకుని సదుపాయం లభిస్తుంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

50MP అల్ట్రా కెమెరా..
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది.. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్‌తో కూడిన మోస్ట్ పవర్‌ఫుల్‌ 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రధాన కెమెరాతో పాటు అదనంగా శక్తివంతమైన 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాలు కూడా లభిస్తున్నాయి. ఇక ఫ్రంట్‌ భాగంలో సెల్ఫీల కోసం 20-మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

 

0
0
Report

Sircilla: అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర.. దుర్గమ్మకు సిరిసిల్ల నేతన్న అద్భుత కానుక..

Hyderabad, Telangana:

Sircilla Matchbox Silk Saree: మన భారతీయ చేనేత కళా వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే.. మరో అద్భుతమైన అరుదైన ఘట్టం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆవిష్కృతమైంది. అగ్గిపెట్టెలో పట్టే.. అత్యంత సూక్ష్మమైన, అరుదైన పట్టుచీరను ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ఓ భక్తుడు భక్తిశ్రద్ధలతో సమర్పించారు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కార్మికుడు.. చేనేత కళారత్న అవార్డు గ్రహీత నల్ల విజయ్ కుమార్ తన చేతులతో మగ్గంపై అద్భుతంగా నేసిన ఈ ప్రత్యేక పట్టుచీరను మంగళవారం అమ్మవారికి కానుకగా అందించారు.

వారం రోజుల శ్రమ.. 
ఈ అద్భుతమైన లలిత కళాఖండాన్ని రూపొందించడానికి విజయ్‌ కుమార్‌ దాదాపు వారం రోజుల పాటు రాత్రి పగలు మగ్గంపై శ్రమించారు.. ఈ  పట్టుచీర పొడవు 5.5 మీటర్లు కాగా..వెడల్పు 48 అంగుళాలు ఉంది. ఇంత పెద్ద చీర అయినప్పటికీ.. దీని మొత్తం బరువు కేవలం 200 గ్రాములు మాత్రమే కావడం విశేషం.. సాంప్రదాయ ఇక్కత్‌ డిజైన్‌తో.. అత్యంత అద్భుతంగా.. ఆకర్షనీయమైన రంగులతో నేసిన ఈ చీరను మడత పెడితే.. ఒక చిన్న అగ్గిపెట్టేలో సులువుగా పడుతుంది. సిరిసిల్ల నేతన్నల మంచి నైపుణ్యానికి ఈ చీర నిదర్శనమని చెప్పొచ్చు..

అమ్మవారు కనకదుర్గమ్మపై ఉన్న భక్తితో.. మా సిరిసిల్ల చేనేత కళా వైభవాన్ని అమ్మవారి పాదాల చెంత ఉంచాలనే సంకల్పంతో ఈ చీరను నేచారని చేనేత కళారత్న నల్ల విజయ్ కుమార్ తెలిపారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న విజయ్ కుమార్.. దుర్గమ్మ ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్‌ను కలిసి ఈ పట్టుచీరను అధికారికంగా అందజేశారు.. ఒక చిన్న అగ్గిపెట్టెలోంచి 5.5 మీటర్ల పట్టుచీరను బయటకు తీసి చూపిస్తుంటే ఆలయ అధికారులతో పాటు అర్చకులు, అక్కడున్న భక్తులు ఆశ్చర్యపోతున్నట్లు తెలుస్తోంది.. 

ఇంతటి చాలా అద్భుతమైన కళాఖండాన్ని అమ్మవారికి సమర్పించిన విజయ్ కుమార్‌ను ఈవో శీనా నాయక్ శాలువాతో సత్కరించి.. అమ్మవారి ప్రసాదాన్ని అందించి ప్రత్యేకంగా అభినందించారు. తాజాగా ఈ వార్తకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు సిరిసిల్లకు చెందిన చాలా మంది చేనేతలు ఇలాంటి చీరలను ఎన్నో నేచారు. అంతేకాకుండా చాలా మంది విదేశీయులు కూడా ఇలాంటి చీరలను కొనుగోలు చేసిన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి చీరలను చాలా అరుదుగా మాత్రమే నేస్తారు.  

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

Cobra Video: శివలింగంపై కోబ్రా.. ప్రాణాలకు తెగించి అభిషేకం చేసిన మహిళ.. వీడియో..

Hyderabad, Telangana:

 Cobra Abhishekam Viral Video: హిందువుల మహా భక్తికి హద్దులు ఉండవని అంటూ ఉంటారు. కానీ ఇక్కడొక భక్తరాలు ఏకంగా తన ప్రాణాలనే పణంగా పెట్టి.. శివునిపై ఉన్న భక్తిని చూటుకుంది. సాధారణంగా పాము కనిపిస్తేనే కాళ్లూ చేతులూ వణికిపోతుతూ ఉంటాయి. అలాంటిది అత్యంత ప్రమాదకరమైన నాగుపాముకు ఓ మహిళ భయపడకుండా అభిషేక్ చేసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌ చల్‌ చేస్తున్నాయి. దీనికి సంబంధించి వీడియో చూసిన నెటిజన్స్‌ ఒక్కసారిగా షాక్‌ అవుతున్నారు. ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శివలింగంపై నాగుపాము..
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడిమో ప్రకారం.. ఒక శివాలయంలోని శివలింగంపై పెద్ద నాగుపాము పడగ విప్పి కూర్చిని ఉంది. అయితే, దాన్ని చూసి భయపడి పారిపోవాల్సింది పోయి.. అక్కడ ఉన్న ఇద్దరు భక్తులు ఆ స్వామికి అభిషేక్‌ చేయడం ప్రారంభించారు. అయితే, అక్కడే అసలైన ట్విస్ట్ ఉంది.. ఆ ఇద్దరిలో ఒక మహిళా భక్తురాలు ఏకంగా ఈ విషపూరితమైన కోబ్రా పడగను చేతులతో పట్టుకుని ఉండడం మీరు ఈ వీడియో క్లియర్‌గా చూడొచ్చు.. 

మరో భక్తుడు శివలింగంతో పాటు ఆ నాగుపాము తలపై నీళ్లు పోస్తూ అభిషేకం చేస్తుండగా.. సదరు మహిళ పామును కదలకుండా పట్టుకుని సహకరించడం మీరు ఈ వీడియోలో క్లయర్‌గా చూడొచ్చు.. ఆ పాము కూడా ఎలాంటి హాని చేయకుండా ప్రశాంతంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్‌ వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. కొంతమంది శివునిపై నమ్మకంతోనే ఆమె అలా చేయగలిగిందని కామెంట్స్‌ చేస్తుంటే.. మరికొంతమంది ఇది భక్తి కాదు, మూఢనమ్మకం.. ప్రాణాలతో చెలగాటం.. అంటూ మరికొందరు మండిపడుతున్నారు. చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

 
 
 
 
 

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు తీశారనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఏది ఏమైనప్పటికీ, ఈ నాగుపాము అభిషేకం వీడియో మాత్రం ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఈ అరుదైన, ఆశ్చర్యం కలిగించే వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే ఆలస్యం.. క్షణాల్లో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను bass.bhaskaran's అనే ఇన్‌స్టా అకౌంట్‌ నుంచి పోస్ట్‌ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియో 66 వేల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు లైక్‌ చేశారు. చాలా మంది వీక్షించిన్నట్లు తెలుస్తోంది. 

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

  

0
0
Report

Cobra Vs Rat Video: పాముకే చుక్కలు చూపించిన ఎలుక.. ఒకే డ్రమ్ములో కింగ్ కోబ్రా, ఎలుక ఫైట్ వీడియో వైరల్..

Hyderabad, Telangana:

 Cobra Vs Rat Video Watch Here: ప్రమాదకరమైన కింగ్‌ కోబ్రాలు కనిపిస్తేనే ఎలుకలు ప్రాణభయంలో పరుగులు తీస్తూ ఉంటాయి. మానవులు సైతం పరుగులు తీస్తూ ఉంటారు. అలాంటిది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన కింగ్‌ కోబ్రాతో ఓ ఎలుక తలపడితే.. ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? వినడానికే వింతగా ఉన్నప్పటికీ ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒకే ప్లాస్టిక్‌ డ్రమ్ములో చిక్కుక్కున్న కింగ్‌ కోబ్రాతో పాటు ఎలుక వీడియోకి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వీడియోలో అసలేం జరిగిందంటే..?
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక పెద్ద నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్ములో ప్రమాదవశాత్తు ఒక కింగ్ కోబ్రా, ఒక ఎలుక చిక్కుకుని ఉండడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు.. డ్రమ్ లోపల స్థలం తక్కువగా ఉండటంతో ఒకదానికొకటి ఎదురుపడక తప్పలేని సంర్భంగా కూడా గమనించవచ్చు.. సాధారణంగా పామును చూడగానే పారిపోయే ఎలుక, ఇక్కడ తప్పించుకునే దారి లేకపోవడంతో చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది..

కింగ్ కోబ్రా తన పడగ విప్పి ఎలుకపై దాడి చేయడానికి ప్రయత్నించడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు. అయితే, ఆ ఎలుక ఏమీ భయపడకుండా.. తన ప్రాణాలను కాపాడుకోవడానికి కోబ్రాపై ఎదురుదాడికి దిగడం మీరు గమనించవచ్చు.. పాము కాటు వేయడానికి ప్రయత్నించిన ప్రతిసారీ ఎలుక గాల్లోకి ఎటూ తప్పించుకుంటూ.. వీలైతే పాముపైనే దాడి చేస్తూ ఉండడం మీరు చూడొచ్చు..

 
 
 
 
 

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

నెటిజన్ల షాక్.. 
ఈ ఊహించని వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా ఈ వీడియోపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. పరిస్థితి ఎదురైతే ఎంతటి బలహీనుడైనా సింహంలా పోరాడతాడని ఈ ఎలుక నిరూపించిందని ఒకరు కామెంట్ చేయగా.. లక్, టైమింగ్ బాగుంటే కింగ్ కోబ్రా నుంచి కూడా ప్రాణాలతో బయటపడొచ్చని ఈ వీడియో చూస్తే అర్థమవుతోందని మరొకరు పేర్కొన్నారు. సాధారణంగా కోబ్రా ఒకసారి కాటు వేస్తే.. ఏనుగు అయినా సరే కొన్ని నిమిషాల్లో ప్రాణాలు కోల్పోతుంది. అలాంటిది ఆ డ్రమ్ములో ఎలుక చూపించిన ధైర్యం, చాకచక్యం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

  

0
0
Report

Sun Transit 2026: ఈ 4 రాశుల వారికి బంపర్ ఆఫర్.. అరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు.. ఇక తిరుగుండదు!

Hyderabad, Telangana:

Sun Transit In Ardra Nakshatra 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు రాజుగా భావించే సూర్యుడికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాన్ని అతి పెద్ద గ్రహంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. అయితే, ఇది ప్రతి నెల రాశి సంచారం చేస్తుంది. ఇలా సంచారం చేసే ప్రతిసారి అన్ని రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుంది. జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:31 గంటలకు సూర్యుడు మృగశిర నక్షత్రాన్ని వదిలిపెట్టి రాహువు నక్షత్రంగా భావించే అరుద్ర నక్షత్రంలోకి సంచారం చేస్తుంది. దీంతో అన్ని రాశులు ఊహించని స్థాయిలో ప్రభావితమవుతాయి. 

సూర్యుడు అరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించడం జ్యోతిష్య శాస్త్రం పరంగా.. చాలా అద్భుతమైన సంఘటనగా భావిస్తారు. దీని కారణంగా ఏర్పడిన ప్రభావం మొత్తం అన్ని రాశులవారిపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా 4 రాశులవారికి ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి జీవితంలో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికస్థితులు కూడా ఊహించని స్థాయిలో మెరుగుపడతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎక్కువగా మేలు జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మేష రాశి
అరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల మేష రాశివారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి ఊహించని స్థాయిలో ధైర్యం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా అన్ని పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు. ముఖ్యంగా ఈ సమయంలో ఊహించని  నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. వీరు తప్పకుండా ఉన్నతాధికారుల నుంచి కూడా ఊహించని సపోర్ట్‌ కూడా పొందుతారు. వీరికి నిలిపోయిన పనులు కూడా తిరిగి ప్రారంభమవుతాయి. అలాగే భారీ మొత్తంలో డబ్బులు కూడా తిరిగి పొందుతారు. ఈ సమయంలో తప్పకుండా కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

మిథున రాశి
అరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల మిథున రాశివారికి కూడా ఈ సమయం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో తప్పకుండా వ్యక్తిత్వ వికాశం కూడా పెరుగుతుంది. అలాగే సమాజంలో అద్భుతమైన గుర్తింపు కూడా లభిస్తుంది. అంతేకాకుండా చాలా మంది మీ మాటలు కూడా వింటారు. మిథున రాశివారికి నిలిచిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. వీరు తప్పకుండా జీవితంలో సులభంగా ముందుకు సాగుతారు. వ్యాపారాల పరంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. 

సింహ రాశి
సూర్యుడు నక్షత్ర సంచారం కారణంగా సింహ రాశివారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. ఆర్థిక సమస్యల నుంచి సులభంగా విముక్తి కలుగుతుంది. పాత అప్పులు కూడా వీరికి సులభంగా తిరిపోతాయి. దీంతో పాటు ఉద్యోగాల పరంగా కూడా అద్భుతమైన పురోగతి కూడా లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల చేస్తున్నవారికి ఈ సమయంలో తప్పకుండా మంచి పురోగతి కూడా లభించే చాన్స్‌లు ఉన్నాయి. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కూడా లభిస్తుంది. 

ధనుస్సు రాశి
ధనుస్సు రాశివారికి కూడా ఈ సమయంలో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. సూర్యుడు అరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. వ్యాపారాల పరంగా ఊహించని స్థాయిలో ముందుకు సాగుతాయి. అంతేకాకుండా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా లభిస్తాయి. దీని ద్వారా కూడా వీరు భారీగా డబ్బులు కూడా పొందుతారు. ఇక ఆందోళనతో పాటు మానసిక ఒత్తిడి వంటి సమస్యలో బాధపడేవారికి ఈ సమయంలో పరిష్కారం కూడా లభిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report
Advertisement

FIFA World Cup 2026: మూడుసార్లు బొక్కబోర్లా.. 90వ నిమిషంలో సీన్ రివర్స్‌.. ఈక్వెడార్ ఓటమికి కారణాలు ఇవే..!!

BBhoomi17h ago
Secunderabad, Telangana:

Ivory Coast vs Ecuador: ఫీఫా ప్రపంచ కప్ 2026 గ్రూప్ ఈ మ్యాచ్‌లో, మాంచెస్టర్ యునైటెడ్ వింగర్ అమాద్ డియల్లో చివరి నిమిషంలో గోల్ చేయడంతో ఐవరీ కోస్ట్, ఈక్వెడార్‌ను 1-0 తేడాతో ఓడించింది. ఈ విజయంతో..  ఐవరీ కోస్ట్ 2014 తర్వాత తమ మొదటి ప్రపంచ కప్ విజయాన్ని నమోదు చేసి, పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి చేరుకుంది.

ఈ మ్యాచ్ గోల్ రహిత డ్రాగా ముగుస్తుందని అంతా అనుకున్నారు.  కానీ అమాద్ ఒక అద్భుతమైన షాట్‌తో గోల్ చేసి..  2014 తర్వాత ఐవరీ కోస్ట్‌కు ప్రపంచ కప్‌లో తొలి విజయాన్ని అందించాడు. ఈ విజయంతో ఐవరీ కోస్ట్ గ్రూప్ Eలో జర్మనీ వెనుక రెండవ స్థానానికి చేరుకుంది. ఆదివారం కురకావోను 7-1 తేడాతో ఓడించిన జర్మనీ మొదటి స్థానంలో ఉంది. ఫస్ట్ హాఫ్ లో ఈక్వెడార్ అనేక మంచి అవకాశాలను సృష్టించుకుంది. జాన్ యెబోవా కొట్టిన పవర్ ఫుల్  షాట్ క్రాస్‌బార్‌ను తాకడంతో దానిని గోల్‌గా తీసుకోలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికే, అలాన్ మిండా గోల్ చేసేందుకు దగ్గరగా వచ్చాడు.  కానీ అతని షాట్ కూడా బార్‌ను తాకి టార్గెట్ నుండి పక్కకు వెళ్లింది. ఈ విధంగా.. తొలి ఆధిక్యం సాధించే అవకాశాన్ని ఈక్వెడార్ కోల్పోయింది.

అయితే ఐవరీ కోస్ట్ కూడా కొన్నిడేంజరస్ అటాక్స్ షురూ చేసింది. యాన్ డియోమాండే కుడి వైపు నుండి అద్భుతంగా ఆడి, ప్రత్యర్థి రక్షణ శ్రేణిపై నిరంతరం ఒత్తిడి తెచ్చాడు. ఈలోగా, బజౌమానా టూరే కొట్టిన భారీ షాట్‌ను ఈక్వెడార్ గోల్ కీపర్ హెర్నాన్ గాలిండెజ్ అద్భుతంగా అడ్డుకుని గోల్ కాకుండా కంట్రోల్ చేశాడు. ఈ మ్యాచ్‌లో యాన్ డియోమాండే ఒక ప్రత్యేకమైన ఘనతను కూడా సాధించాడు. 19 సంవత్సరాల 212 రోజుల వయస్సులో, అతను ఐవరీ కోస్ట్ తరపున ప్రపంచ కప్ మ్యాచ్ ఆడిన మొదటి యువ ఆటగాడిగా నిలిచాడు.

సెకండ్ ఆఫ్ లో  ఇరు జట్లకు అవకాశాలు లభించాయి. అనుభవజ్ఞుడైన ఈక్వెడార్ ఆటగాడు ఎన్నర్ వాలెన్సియా కొట్టిన షాట్ పోస్ట్‌ను తాకింది. ఐవరీ కోస్ట్ ఆటగాడు ఎలీ వాహి కూడా గోల్ చేయడానికి దగ్గరగా వచ్చాడు. కానీ అతని ప్రయత్నం క్రాస్‌బార్‌ను తాకి గోల్‌గా మారింది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ, ఐవరీ కోస్ట్ బంతిపై మరింత పట్టు సాధించడం ప్రారంభించింది.

ఎక్కడా కూడా తడబడ కుండా ఆ జట్టు  ఎదురు దాడి కొనసాగించగా, ఈక్వెడార్ సెల్ఫ్ డిఫెన్స్ లో ఆటను కొనసాగించింది. చివరకు, 90వ నిమిషంలో, అమాద్ డియల్లో ఎలాంటి పొరపాటు చేయకుండా, ఒక అద్భుతమైన గోల్ చేసి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ విజయంతో, ఐవరీ కోస్ట్ గ్రూప్ Eలో మూడు కీలక పాయింట్లను దక్కించుకుని, తదుపరి రౌండ్‌కు వెళ్లే తమ అవకాశాలను పటిష్టం చేసుకుంది.

Also Read: చివరి నిమిషంలో ఒగావా మ్యాజిక్‌.. నెదర్లాండ్స్‌, జపాన్‌ సూపర్‌ ఫైట్‌ హైలెట్స్ ఇవే..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Business Ideas: ఈ ఒక్క చెట్టు పెంచితే చాలు...లక్షల్లో లాభం... కేజీ రూ. 650 పలికే ఈ పండును సాగు చేస్తే రైతులకు డబ్బే డబ్బు..!!

BBhoomi20h ago
Secunderabad, Telangana:

Business Ideas: రైతులకు చక్కటి లాభాలు కావాలి అంటే ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలి అంటే వ్యవసాయాన్ని మించిన మరొక మార్గం లేదు అని చెప్పవచ్చు. నేల తల్లిని నమ్ముకున్న వాడికి ఎప్పుడు మోసం జరగదు. సరైన పంటలను ఎంపిక చేసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకున్నట్లయితే వ్యవసాయం ని మించిన ఆదాయ మార్గం లేదు అని చెప్పవచ్చు. 

కర్ణాటకలోని మంగుళూరు ప్రాంతానికి చెందినటువంటి లోహిత్ శెట్టి అనే ఒక రైతు దక్షిణ కన్నడ జిల్లా, పెరడకా గ్రామంలో మాంగోస్టీన్ అనే అరుదైన పండ్ల జాతి మొక్కలతో వ్యవసాయం చేసి ప్రస్తుతం చక్కటి ఆదాయం పొందుతున్నాడు. ఈ మ్యాంగో స్టీన్ అనే పండు కేజీ ధర 650 రూపాయల వరకు పలుకుతోంది. విదేశాల్లో మాత్రమే లభించే ఈ పండును ఫైవ్ స్టార్ హోటల్స్, అలాగే అరుదైన ఎగ్జోటిక్ పండ్ల మార్కెట్లలో భారీ డిమాండ్ కలిగి ఉంది. 

వీటిని విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటారు. 2006 సంవత్సరంలో లోహిత్ శెట్టి తాను రెగ్యులర్ గా చేసే రబ్బర్ పంట, వక్క పంట సాగులో ఆదాయం తగ్గడంతో, ఇతర డిమాండ్ కలిగినటువంటి పంటలను పండించాలని నిర్ణయం తీసుకొని కేరళ వెళ్లి అక్కడ మాంగోస్టీన్, రాంబుటాన్ వంటి ఎక్సోటిక్ (అరుదైన) పండ్ల గిరాకీని దృష్టిలో ఉంచుకొని తనకు ఉన్నటువంటి వక్క పిక్కల తోటలో 50 మ్యాంగోస్టిన్ చెట్లను అంతర పంటగా వేసి చూశాడు. 

నిజానికి మ్యాంగోస్టింగ్ చెట్లకు ఎక్కువగా ఎండ అవసరం లేదు. కనుక కొబ్బరి చెట్లలా పెరిగే వక్క పిక్కల తోటలో అంతర పంటగా వేయడం వల్ల, మ్యాంగోస్టింగ్ చెట్లకు నేరుగా ఎండ తాకలేదు. వేడి ఎక్కువగా లేదని నేపథ్యంలో చక్కటి అనుకూలమైన వాతావరణం ఏర్పడి మ్యాంగోస్టిన్ పండ్ల పరిమాణం భారీగా పెరిగింది. దీంతో చక్కటి రాబడి వచ్చింది. దీనికి తోడు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల నీరు కూడా తక్కువగా ఖర్చు అయింది.

Also Read: Cafe Niloufer సిబ్బంది జీతాలు తెలిస్తే నోరెళ్లబెడతారు..!!  

ఇక ఈ మ్యాంగోస్టీన్ చెట్ల విషయానికి వచ్చినట్లయితే, నాటిన 8 ఏళ్లకు ఫలసాయం మొదలవుతుంది. 15 ఏళ్లు దాటిన చెట్టు నుండి సీజన్‌కు 100 నుండి 120 కిలోల దిగుబడి వస్తుంది.ఒక కిలో మాంగోస్టీన్ ధర రూ. 650 వరకు పెరుగుతుంది. సీజన్ చివరలో దీని ధర రూ. 250 వరకూ పడే అవకాశం ఉంటుంది. తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఈ పంటకు చాలా అనుకూలంగా ఉన్నాయి. మాంగోస్టీన్ చెట్టు తేమతో కూడిన ఉష్ణమండల వాతావరణానికి  బాగా అలవాటుపడుతుంది. 

సముద్ర తీర ప్రాంతాలు, అలాగే తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ చెట్టు బాగా పెరుగుతుంది. తక్కువ శ్రమతో, అరుదైన పండ్లను పండించి అధిక ఆదాయం పొందవచ్చు. అయితే ఇలాంటి అరుదైన మొక్కలతో వ్యవసాయం చేయాలి అనుకునే వారు ముందుగా వ్యవసాయ నిపుణుల వద్ద సలహా తీసుకుంటే మంచిది. . మీ నేల స్వభావం వాతావరణం వంటివి అంచనా వేసుకున్న తర్వాత మాత్రమే ఇలాంటి అరుదైన మొక్కల వ్యవసాయం చేయవచ్చు. లేకపోతే రిస్క్ లో పడే అవకాశం ఉంటుంది.

Also Read:  1రూపాయి పెట్టుబడితో.. ఈ వానాకాలంలో ఆ ఒక్క పంట

Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Petrol Diesel Price: భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..ట్రంప్ ప్రకటనతో ఒక్కసారి పడిపోయిన ఇంధన ధరలు!

Petrol Diesel Price News: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గత కొన్ని నెలలుగా వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలకు త్వరలోనే బ్రేక్ పడనుంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందం ప్రపంచ దేశాలకు పెద్ద ఊరటనిచ్చింది. వ్యూహాత్మక సముద్ర మార్గమైన 'హోర్ముజ్ జలసంధి'ని ఎలాంటి టోల్ ఫీజులు లేకుండా తిరిగి తెరుస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

ఈ పరిణామంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఆదివారం రాత్రి బ్రెంట్ క్రూడ్ ధర 3.9 శాతం తగ్గి బ్యారెల్‌కు 84 డాలర్లకు పడిపోగా, యూఎస్ క్రూడ్ 4.8 శాతం మేర తగ్గి దాదాపు 81 డాలర్లకు చేరింది. గడిచిన మార్చి నెల తర్వాత చమురు ధరలు ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

హోర్ముజ్ జలసంధి ఎందుకు అంత కీలకం?
ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే ముడి చమురులో అత్యధిక భాగం ఈ హోర్ముజ్ జలసంధి ద్వారానే సాగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఈ మార్గాన్ని మూసివేశారు. ఈ దిగ్బంధనం కారణంగా వాణిజ్య నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం లేదా సురక్షిత ప్రయాణం కోసం సగటున 2 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.16 కోట్లకు పైగా) అదనపు భారాన్ని భరించాల్సి వచ్చింది.

ఒకవేళ ఈ దిగ్బంధనం ఇలాగే కొనసాగి ఉంటే, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లను దాటేసేవని, అమెరికాలో గ్యాసోలిన్ ధరలు రికార్డు స్థాయికి చేరేవని నిపుణులు హెచ్చరించారు. ఈ ఉద్రిక్తతలకు శాంతి ఒప్పందంతో తెరపడటంతో ప్రపంచ ఇంధన మార్కెట్ ఊపిరి పీల్చుకుంది.

భారతదేశానికి ఎలాంటి ప్రయోజనం?
భారతదేశం తన ముడి చమురు అవసరాలలో 85 శాతం కంటే ఎక్కువ భాగాన్ని ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం వల్ల భారత్‌కు రెండు రకాలుగా లాభం చేకూరుతుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం వల్ల దేశ దిగుమతి బిల్లు భారీగా తగ్గుతుంది. సముద్ర రవాణా మార్గం సుగమం కావడంతో రవాణా ఖర్చులు మరియు ఇన్సూరెన్స్ ప్రీమియంలు భారం తగ్గుతాయి.

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు 8 శాతం నుండి 8.5 శాతం వరకు పెరిగాయి. అయితే ప్రస్తుత సానుకూల పరిణామాలపై భారత పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందిస్తూ.. రాబోయే నెలల్లో చమురు, గ్యాస్ ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు.

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర 80 డాలర్ల స్థాయికి చేరినందున, దేశీయ చమురు కంపెనీలు త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 నుండి రూ.5 రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉంది. దీనితో పాటు సామాన్యుడిపై భారం తగ్గించేలా వంటగ్యాస్ (LPG) సిలిండర్ ధరలు కూడా తగ్గే ఛాన్స్ ఉంది.

(గమనిక: చమురు ధరల తగ్గింపుపై ప్రభుత్వ రంగ సంస్థల నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ రానున్న రోజుల్లో సామాన్యుడికి ఇంధన ధరల నుండి ఉపశమనం లభించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరిచడం లేదు.)

Also Read: అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం..యుద్ధం ముగిసిందని ట్రంప్ సంచలన ప్రకటన!

Also Read: భారీగా పడిపోతున్న బంగారం ధరలు..ఇదే జరిగితే గోల్డ్ రేటు కుప్పకూలిపోవడం ఖాయం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top