రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద ఆశ ల ధర్నా
Rudrangi, Telangana:తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఆశావర్కర్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. సుమారు రెండు గంటలపాటు ఎండలోనే నిరసన కొనసాగింది. మేము ఎండలో, మీరు ఏసీ గదుల్లో. అధికారులపై విమర్శలు చేశారు. ఈసందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ ఆశావర్కర్ల సమస్యల పరిష్కారానికి ఎన్నోసార్లు పోరాటాలు చేసిన నాటి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేసిందన్నారు తన మేనిఫెస్టోలో కూడా పేర్కొన్నాడు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
SRH Vs RR Preview: హైదరాబాద్ Vs రాజస్థాన్ ఎలిమినేటర్ పోరు..ఈ మ్యాచ్లో ఓడితే ఇంటికే! గెలుపు ఎవరిది?
New Chandigarh, Punjab:SRH Vs RR Preview 2026: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ పోరుకు సమయం ఆసన్నమైంది. న్యూ చండీగఢ్ వేదికగా టోర్నీలోనే అత్యంత విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ కలిగిన సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ చావో రేవో పోరులో గెలిచిన జట్టు ఫైనల్ రేసులో నిలుస్తుంది, ఓడిన జట్టు టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది.
ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 23 సార్లు తలపడగా, ఆధిపత్యం స్పష్టంగా హైదరాబాద్ వైపే ఉంది. మొత్తం మ్యాచ్లు 23 సార్లు తలపడగా.. సన్రైజర్స్ హైదరాబాద్ 14 సార్లు గెలుపొందగా, రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఈ సీజన్లో ఇప్పటికే రాజస్థాన్పై ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ హైదరాబాద్ విజయం సాధించింది. అంతేకాకుండా, ఆర్ఆర్ పై వరుసగా 6 మ్యాచ్ల్లో గెలిచిన బలమైన రికార్డు ఎస్ఆర్హెచ్ సొంతం.
పిచ్ రిపోర్ట్..
ఈ మ్యాచ్ న్యూ చండీగఢ్లోని పిచ్ నెం.4 పై జరగనుంది. ఐపీఎల్ 2026 అంతటా ఈ పిచ్పై భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఇక్కడి సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 210 పరుగులు దాటింది. ఈ సీజన్లో ఈ పిచ్పై జరిగిన 3 మ్యాచ్ల్లోనూ ఛేజింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఇక్కడ పేసర్ల కంటే స్పిన్నర్లు కొంతవరకు పరుగులు నియంత్రించగలుగుతున్నారు.
రాజస్థాన్పై ఉన్న అద్భుతమైన ట్రాక్ రికార్డ్, భీకరమైన ఫామ్ కారణంగా సన్రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్లో కొద్దిగా ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. అయితే, ఈ వేదికపై రాజస్థాన్కు మంచి పట్టు ఉండటంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఒక హై-స్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచ్లో ఆర్ఆర్పై ఎస్ఆర్హెచ్ విజయం సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సన్రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు అంచనా..
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), శివాంగ్ కుమార్, ఇషాన్ మలింగ, షకీబ్ హుస్సేన్, హర్షల్ పటేల్/ప్రఫుల్ హింగే.
ఎస్ఆర్హెచ్ క్యాంప్లో గాయాల సమస్యలు లేవు. రాజస్థాన్పై మంచి రికార్డు ఉన్నందున ప్రఫుల్ హింగే స్థానంలో హర్షల్ పటేల్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా 200+ స్ట్రైక్ రేట్తో దూసుకుపోతున్న అభిషేక్ శర్మ (560+ పరుగులు), మిడిల్ ఆర్డర్ బ్యాక్బోన్ హెన్రిచ్ క్లాసెన్ (600+ పరుగులు)లపైనే భారం ఉంది.
రాజస్థాన్ రాయల్స్ తుదిజట్టు అంచనా..
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జూరెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), డోనోవన్ ఫెరీరా, దాసున్ షనక, శుభమ్ దుబే, రవీంద్ర జడేజా/రవి బిష్ణోయ్, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, యశ్ రాజ్ పుంజా, బ్రిజేష్ శర్మ.
కెప్టెన్ రియాన్ పరాగ్, రవీంద్ర జడేజా చిన్నపాటి గాయాలతో బాధపడుతున్నారు. ఒకవేళ జడేజా ఫిట్నెస్ సాధించకపోతే రవి బిష్ణోయ్ జట్టులోకి వస్తాడు. ఈ సీజన్లో 583 పరుగులతో దుమ్మురేపుతున్న యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ, పవర్ప్లేలో వికెట్లు తీయగల స్పీడ్స్టర్ జోఫ్రా ఆర్చర్ ఆర్ఆర్కు అత్యంత కీలకం కానున్నారు.
Also Read: శ్రేయస్ అయ్యర్ సెంచరీ..ఎట్టకేలకు విజయం సాధించిన పంజాబ్ కింగ్స్..ప్లేఆఫ్స్ ఉన్నట్టే!
Also Read; ప్లేఆఫ్స్కు అడుగుదూరంలో పంజాబ్..రాజస్థాన్-కోల్కతా పరిస్థితి ఏంటి? అసలు కథ ఇది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Snake Video: వామ్మో.. నీటిలో దిగి ప్రమాదకరమైన పాముతో ఆడుకున్న చిన్నారి.. వీడియో..
Hyderabad, Telangana:Snake Video Viral: సోషల్ మీడియాలో రోజుకు ఒక వింతతో పాటు.. ఆశ్చర్యం కలిగించే ఘటన వెలుగులోకి నిత్యం ఎన్నో వస్తువుంటాయి. కొన్ని వీడియోలు నవ్వులు పూయిస్తే.. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యం కలిగిస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇంకొన్ని వీడియోలైతే సోషల్ మీడియా వినియోగదారులను భయాందోళనకు గురిచేస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి భయానక ఆశ్చర్యం కలిగించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఒక చిన్నారి ఏకంగా ఒక ప్రమాదకరమైన పాముతో చిన్న చెరువులో ఆడుతున్న దృశ్యాలు నెటిజన్లను షాక్కు గురిచేస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక చిన్న పాప నడుములోతు ఉన్న చిన్న చెరువుకి సంబంధించిన కాలువలు దిగింది. అక్కడ ఆమెకు ఒక పెద్ద పాము కనిపించింది.. సాధారణంగా పామును చూస్తేనే పెద్ద వాళ్లు అయితే అరుపులు కేకలు వేస్తూ దూరం పరిగెడుతూ ఉంటారు. కానీ ఆ చిన్నారి మాత్రం ఏ మాత్రం భయం లేకుండా పాము వైపుకు వెళ్లడం మీరు చూడొచ్చు.. అంతటితో ఆగకుండా.. ఆ ప్రమాదకరమైన పామును చేతుల్లోకి తీసుకొని.. ఏకంగా తన మెడలోకి వేసుకుంది. అనంతరం ఆ నీటిలోనే పాముతో ఎంతో అల్లారి ముద్దుగా ఆడుకుంటూ కనిపించింది..
ఈ వీడియోలో అందరినీ అత్యంత ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఏమిటంటే.. ఆ చిన్నారి పామును అంతలా పట్టుకొని అటు ఇటు ఆడుకుంటున్నప్పటికీ.. ఆ పాము ఆమెపై ఏమాత్రం దాడి చేయకపోవడం.. సాధారణంగా మనుషుల అలికిడి తగిలితేనే పాములు బుసలు కొడుతూ కాటు వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి.. అలాంటిది ఈ వీడియోలో మాత్రం ఆ పాము కూడా చాలా ప్రశాంతంగా.. ఆ చిన్నారి తనకు స్నేహితురాలు అన్నట్లుగా ఉండిపోవడం ఇప్పుడు ఆశ్చర్యం కలిగించేలా చేస్తోంది..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
ప్రస్తుతం ఈ వీడియో ఇంస్టాగ్రామ్తో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా ఎక్స్లో మిలియన్ల కొద్దీ వ్యూస్తో దూసుకుపోతోంది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. కొందరు ఆ చిన్నారి ధైర్యానికి ఆశ్చర్యపోతుంటే.. మరి కొంతమంది మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ఆట అని.. తల్లిదండ్రులు పిల్లల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు హెచ్చరిస్తున్నారు. పాములకు విషపు పళ్ళు పీకేసి ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతుంటే.. ఎలాంటి సందర్భాల్లోనైనా వన్యప్రాణులతో ఇలాంటి సాహసం చేయడం ప్రాణాలకే ముప్పని కొంతమంది నిపుణులు చెబుతూ వస్తున్నారు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Cobra Video: ప్రాణాలను పణంగా పెట్టి.. 9 అడుగుల కింగ్ కోబ్రాతో యువకుడి ప్రమాదకర స్టంట్.. వీడియో..
Hyderabad, Telangana:9-Foot King Cobra Video Watch: సోషల్ మీడియాలో రోజుకు ఒక వింతైన.. ఆశ్చర్యం కలిగించే వీడియో ప్రత్యక్షమవుతూనే ఉంటుంది.. కొన్ని వీడియోలు నవ్వు పుట్టిస్తే.. మరికొన్ని వీడియోలు మాత్రం ఆశ్చర్యం కలిగిస్తూ.. అప్పుడప్పుడు భయాందోళనకు కూడా గురి చేస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి కోవాకు చెందిన ఒక అత్యంత ప్రమాదకరమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది. కేవలం కొన్ని సెకండ్ల వ్యవధి ఉన్న ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు భయాందోళనతో పాటు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు ఈ వీడియోలో ఏముంది? ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలేంటి? పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా పాము కనిపిస్తేనే ఆమడ దూరం పరిగెత్తే ఈరోజుల్లో. ఒక యువకుడు ఏకంగా కాలసర్పంగా భావించే అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా తో చెలగాటం ఆడాడు.. సుమారు 8 నుంచి 9 అడుగుల పొడవున్న.. అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రాను ఆ యువకుడు అత్యంత చాకచక్యంగా పట్టుకున్న దృశ్యాలు ఈ వీడియోలో మీరు క్లియర్ గా చూడొచ్చు.. సదరు యువకుడు ఆ భారీ పాము తోక భాగాన్ని తన ఎడమ చేతితో.. అలాగే దాని శరీర భాగాన్ని కుడి చేతితో పట్టుకొని గాల్లోకి లేపడం కూడా మీరు క్లియర్గా చూడొచ్చు..
ఆ సమయంలో ప్రమాదకరమైన కింగ్ కోబ్రా ఏమాత్రం తగ్గకుండా తన భారీ పడగలను విప్పి.. గాల్లోనే బుసలు కొడుతూ కనిపించడం చూసే వారికి వెన్నులో వణుకు పుట్టిస్తోంది.. ఇలాంటి సాహసాలు ప్రాణాంతకం.. నిపుణుల పర్యవక్షణ లేకుండా, సరైన శిక్షణ లేకుండా పాములను పట్టుకోవడం చట్టరీత్యా నేరం, అలాగే ప్రాణాలకే ప్రమాదమని కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు.. ఈ ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ ప్లాట్ఫామ్లో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. వీడియో అప్లోడ్ చేసిన కొద్ది రోజులకే లక్షలాది వ్యూస్ తో పాటు వేలాది లైక్స్ రావడం విశేషం..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా కామెంట్ల రూపంలో స్పందిస్తూ వస్తున్నారు.. కొంతమంది సోషల్ మీడియా దారులు ఆ యువకుడి ధైర్యంతో పాటు నైపుణ్యాన్ని చూసి నేర్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. కొందరు మాత్రం ఇది ధైర్యం కాదు పిచ్చితనం.. ఒక్క చిన్న పొరపాటు జరిగిన ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి అంటూ కామెంట్లు రాస్తూ వస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియాలో లైకులతో పాటు వ్యూస్ కోసం ఇలాంటి ప్రాణాంతకమైన స్టన్స్ చేయడం సరికాదని.. వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Husband Sells Wife: భార్యను రూ.50 వేలకు అమ్మేసిన కిరాతక భర్త.. నరకయాతన అనుభవించిన బాధితురాలు!
Hyderabad, Telangana:Husband Sells Wife In Gujarat: కలకాలం తోడుండాల్సిన భార్యను తనకు నచ్చలేదనే రీజన్తో కేవలం 50 వేల రూపాయలకే స్నేహితులకు అమ్మేసిన ఘోరమైన ఘటన రాజస్థాన్లోని బనస్కాంత జిల్లాలో వెలుగు చూసింది.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భర్తనే కామాంధులకు భార్యను ఎరగా వేసిన ఈ ఉదాంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలన సృష్టిస్తుంది. ఆ తర్వాత సదరు మహిళపై ఆ కిరాతకులు అమానుష్యంగా సామూహిక అత్యాచారానికి వడిగట్టారు. ఈ ఘోరమైన ఘటన ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బనస్కాంత జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి కొన్ని ఏళ్ల క్రితం వివాహమైంది.. అయితే.. కొంతకాలంగా భార్య ప్రవర్తన నచ్చడం లేదంటూ ఆమెపై అతను ద్వేషం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలని చూసి.. తన స్నేహితులతో భేరసారాలు సాగించాడు.. మే 11న పక్కా ప్లాన్ ప్రకారం భార్యను వాళ్లకు 50 వేలకు విక్రయించాడు..
మిస్సింగ్ కంప్లైంట్..
సమాజానికి అనుమానం రాకుండా ఉండేందుకు ఆ కిరాతకుడు అదే రోజు పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. తన భార్య కనిపించడం లేదంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు.. అయితే కేసు నమోదు చేసిన కొన్ని రోజులకే సదరు భర్త కూడా అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు.. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి లోతుగా దర్యాప్తు ప్రారంభించడంతో అసలు విషయం ఏమిటనేది బయటపడింది. ఈ అసలు విషయాన్నీ తెలుసుకున్న పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు..
స్నేహితులకు అమ్మేశాడు..
ఎంతో ప్రేమగా చూసుకోవాల్సిన భర్తనే తనను డ్రామా ఆడి స్నేహితులకు అమ్మేశాడని.. వాళ్లు ఆమెను బంధించి నగలు లాక్కొని పదేపదే గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారని బాధితురాలు తెలిపింది. పోలీసులు నిందితుల స్థావరాలపై దాడి చేసి బాధితురాలిని సురక్షితంగా రక్షించారు. అనంతరం ఆమె పోలీసుల ఎదుట కన్నీరు మున్నీరవుతూ.. తన ఆవేదన పంచుకుంది. తనకు నచ్చలేదని కారణంతోనే తన భర్త క్రూరంగా తన స్నేహితులకు విక్రయించాడని.. కొనుగోలు చేసిన వ్యక్తులు తనను ఒకచోట బంధించి.. ఒంటిపై ఉన్న బంగారు నగలను బలవంతంగా లాక్కొని అమ్మేశారు అన్నారు.. అంతేకాకుండా పలుసార్లు తనపై సామూహిక అత్యాచారానికి కూడా పాల్పడ్డట్లు బాధితురాలు పోలీసులతో వాపోయింది..
ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు..
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రత్యేకమైన దర్యాప్తును ప్రారంభించారు. నిందితులపై కిడ్నాప్ తో పాటు సామూహిక అత్యాచారం, మానవ అక్రమ రవాణా తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన కిరాతక భర్తతో పాటు అతనికి సహకరించిన, అత్యాచారానికి పాల్పడ్డ మరో ఆరు గురు స్నేహితులను మొత్తం ఏడు గురిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆ బాధ్యత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి.. కేసును మరింత దగ్గరగా దర్యాప్తు చేస్తున్నారు..
Also Read: రాజీనామాకు సిద్దు సిద్ధమేనా..! డీకేను వరించనున్న కర్ణాటక సీఎం పదవి..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Samsung: ఫ్లాట్ డిస్ప్లే, Exynos 2500 ప్రాసెసర్తో Samsung Galaxy S26 FE.. లాంచ్ ఎప్పుడంటే?
Hyderabad, Telangana:Samsung Galaxy S26 Fe Design Leaked News: ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం Samsung తన గెలాక్సీ లైన్ అప్లో సరికొత్త మోడల్ ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. గెలాక్సీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న Samsung గ్యాలక్సీ s26 ఎఫ్ఈ (Samsung Galaxy S26 FE) స్మార్ట్ఫోన్ త్వరలోనే మార్కెట్లోకి విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన కంటే ముందే ఈ మొబైల్కు సంబంధించిన డిజైన్తో పాటు కొన్ని కీలకమైన ఫీచర్లు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఒక ప్రముఖ థర్డ్ పార్టీ ప్రొటెక్టివ్ కేస్ తయారీ సంస్థ ద్వారా ఈ మొబైల్ డిజైన్ రెండర్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే, ఈ మొబైల్కు సంబంధించిన అన్ని రకాల ఫీచర్స్ ఏంటో? దీనికి సంబంధించిన డిజైన్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
లీకైన వివరాల ప్రకారం.. సాంసంగ్ గాలక్సీ s26 ఎఫ్ఈ మోడల్ అద్భుతమైన ఫ్లాట్ డిస్ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. ఈ ఫోన్ చుట్టూ బెజెల్స్ చాలా స్లిమ్గా సమానంగా ఉండబోతున్నట్లు సమాచారం. సెల్ఫీ కెమెరా కోసం స్క్రీన్ పై భాగంలో సెంటర్ పంచ్ హోల్ కట్ అవుట్ ను అందిస్తున్నారు. అంతేకాకుండా ఫోన్ నాలుగు మూలలు రౌండ్గా ఉంటూ.. సైడ్ ఫ్రేమ్ పూర్తిగా ఫ్లాట్గా ఉంటుంది. కుడివైపు పవర్ బటన్ తో పాటు వాల్యూం బటన్స్ అందుబాటులో ఉండబోతున్నాయి. ఈ ఫోన్ డిజైన్ మునిపటి మోడల్ ఆయన గెలాక్సీ ఎస్ 25 FE, ప్రీమియం గెలాక్సీ s26 సిరీస్ లను పోలి ఉంటుందని లీకైన డిజైన్ చూస్తే తెలుస్తోంది..
ఇక ఈ Samsung Galaxy S26 FE మొబైల్కు సంబంధించిన వెనక భాగం వివరాల్లోకి వెళితే.. ఇందులో నిలువుగా అమర్చిన మూడు ప్రత్యేకమైన కెమెరా సెటప్లను కలిగి ఉంటుంది. కెమెరా మాడ్యూల్ ప్రత్యేకమైన పీల్ షేపులో ఉండి బ్యాక్ ప్యానెల్కు చక్కగా లుక్ను అందిస్తోంది. అంతేకాకుండా సాంసంగ్ తన మునుపటి డిజైన్ లాంగ్వేజ్కు పెద్దగా మార్చకుండా మరింత ప్రీమియం ఫినిషింగ్తో ఈ మొబైల్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ డిజైన్ చూడడానికి గత మోడల్స్ కంటే ఎంతో ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు సమాచారం..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ఇటీవలే ఈ Samsung Galaxy S26 FE స్మార్ట్ఫోన్ ప్రముఖ బెంచ్మార్కింగ్ వెబ్సైట్ గీక్బెంచ్ లో కూడా కనిపించింది.. ఇక ఇందులో పేర్కొన్న ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే. ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన ఎక్సినోస్ 2500 (Exynos 2500) ప్రాసెసర్ను అందించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్లో కంపెనీ గరిష్టంగా 8GB ర్యామ్ లభించే విధంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్, శామ్సంగ్ వన్ యూఐతో రన్ అవుతుంది.. గతంలో సాంసంగ్ గ్యాలక్సీ s25 fe మోడల్ ను సెప్టెంబర్ 2025లో విడుదల చేశారు. కాబట్టి ఈ సరికొత్త గెలక్సీ ఎస్ 26 ఎఫ్ఈ స్మార్ట్ఫోన్ ఈ ఏడాది సెప్టెంబర్ నెలలోనే విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ మొబైల్కు సంబంధించిన అధికారిక ప్రకటనను అతి త్వరలోనే చేసే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Redmi Turbo 5: వన్ప్లస్, వీవోలకు చెక్.. రూ.30 వేల బడ్జెట్లోనే ఫ్లాగ్షిప్ ఫీచర్లతో Redmi Turbo 5 ఫోన్!
Hyderabad, Telangana:Redmi Turbo 5 Price: ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ షావోమి తన సబ్ బ్రాండ్ Redmi నుంచి భారత వినియోగదారుల కోసం మరో సరికొత్త మొబైల్ను పరిచయం చేయడానికి Redmi అయింది.. చైనా మార్కెట్లో ఇప్పటికే భారీ విజయాన్ని అందుకుంటున్న Redmi Turbo 5 స్మార్ట్ఫోన్ను త్వరలోనే భారత మార్కెట్ లోకి విడుదల చేయనన్నట్లు కంపెనీ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. బడ్జెట్ ధరలు ఫ్లాగ్షిప్ స్థాయి పనితీరు కలిగిన ఈ మొబైల్ త్వరలో భారత్ మార్కెట్లోకి విడుదల కావడం విశేషం. అయితే, ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన ఫీచర్స్ ఏంటో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ Redmi Turbo 5 స్మార్ట్ఫోన్ ప్రధానంగా డ్యూయల్ రియల్ కెమెరా సెటప్తో అందుబాటులోకి రాబోతోంది. ఇందులో ప్రత్యేకంగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్టుతో ఉన్న ఎంతో శక్తివంతమైన 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాని కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్తో కూడిన 8-మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. ఈ కెమెరా సిస్టం ద్వారా తక్కువ వెలుగులో కూడా అద్భుతమైన స్పష్టమైన ఫోటోలను, వీడియోలను రికార్డు చేయవచ్చు. అలాగే సెల్ఫీ కోసం ముందు భాగంలో చాలా ప్రత్యేకమైన 20-మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.
రెడ్మి టర్బో 5 స్మార్ట్ఫోన్కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన 120Hz రిఫ్రెష్ రేట్తో కూడిన 6.59-ఇంచుల సూపర్ అమోలెడ్ (AMOLED) డిస్ప్లేతో భారత మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది మోస్ట్ పవర్ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500-ఆల్ట్రా (MediaTek Dimensity 8500 Ultra) ప్రాసెసర్తో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఇది శక్తివంతమైన 7,560mAh బ్యాటరీ ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా దీనికి తోడు ఈ బ్యాటరీని ఎంతో సులభంగా ఫుల్ ఛార్జ్ చేసేందుకు చాలా ప్రత్యేకమైన 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా అందిస్తున్నారు. దీనివల్ల కొద్ది నిమిషాల్లోనే సులభంగా ఫుల్ చార్జ్ అవుతుంది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ (HyperOS 3)తో నడిచే ఈ స్మార్ట్ఫోన్ బ్లాక్తో పాటు వైట్ మెంట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్లో అందుబాటులోకి రాబోతోంది. ఇక భారత మార్కెట్లో ఈ Redmi Turbo 5 మొబైల్ ధర వివరాల్లోకి వెళ్తే.. దీనిని Redmi కంపెనీ దాదాపు బేస్ వేరియంటును రూ.30 వేల నుంచి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక హై ఎండ్ వేరియంట్ రూ.40 వేల ధరతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సరికొత్త టర్బో సిరీస్ ఫోన్ మార్కెట్లోకి వస్తే వివోతో పాటు వన్ ప్లస్, ఐక్యూ వంటి దిగ్గజ బ్రాండ్ల మిటరేంజ్ స్మార్ట్ఫోన్స్తో గట్టిగా పోటీ ఎదరడం ఖాయమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ స్మార్ట్ఫోన్ విడుదలయితే amazonతో పాటు ఫ్లిప్కార్ట్ అధికారిక వెబ్సైట్లో విక్రయించబోతున్నట్లు సమాచారం..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Karimnagar: అకాల వర్షం బీభత్సం.. నీట మునిగిన ధాన్యం.. కన్నీరుమున్నీరవుతున్న రైతన్నలు!
Hyderabad, Telangana:Karimnagar Market Yards News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం అన్నదాతల గుండెల్లో గుబులు రేపింది.. కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి.. అమ్మకం కోసం ఆరబెట్టిన వేలాది క్వింటల ధాన్యం వర్షం నీటిలో పూర్తిగా తడిసి ముద్దయింది.. డ్రైనేజీ సరిగా లేకపోవడంతో పాటు మార్కెట్ ప్రాంగణంలో లోపాలు ఉండడం కారణంగా కొన్నిచోట్ల మార్కెట్ మొత్తం చెరువుల తలపించింది. వరద ఉధృతికి కొందరి రైతుల వడ్లు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది.. మరికొందరి ధాన్యం నీట మునిగింది. నెలల తరబడి కష్టపడి పండించిన పంట కళ్ళముందే వరద పాలవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు..
మార్కెట్ యార్డుకు ధాన్యం తీసుకువచ్చి.. వారాలు గడుస్తున్నప్పటికీ.. అధికారులు కొనుగోళ్లలో తీవ్ర జాప్యం చేస్తున్నారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మిల్లుల కేటాయింపు తో పాటు తూకాల నిర్వహణ, గిడ్డంగుల కోరత వంటి సాకులు చెబుతూ రోజులు వెల్లదీస్తున్నారని ఆరోపిస్తున్నారు. సకాలంలో కొనుగోలు జరిపి ఉంటే తమకు ఈ గతి పట్టేది కాదని.. అధికారుల నిర్లక్ష్యం వల్లే తాము రోడ్డున పడాల్సి వచ్చిందని రైతులు ధ్వజమెత్తుతున్నారు.. మూడు వారాల నుంచి ఇక్కడే తిండితో పాటు తిప్పలు లేకుండా కాపలాగా ఉన్నామని.. తీరా తూకం వేసే సమయానికి వర్షం వచ్చి సర్వం తడిచిపోయిందని.. వారి నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బాధిత రైతులు కోరుతున్నారు.
కొన్నిచోట్ల ధాన్యం తడిసిపోవడంతో ఆగ్రహించిన రైతులు ఈరోజు ఉదయం మార్కెట్ యార్డుల కార్యాలయం ముందు ప్రత్యేకమైన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి, మార్కెటింగ్ శాఖ అధికారులకు వ్యతిరేకంగా ధర్నాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వర్షం వస్తుందని ముందే వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ మార్కెట్ కమిటీ కనీసం కవర్లు కూడా సరఫరా చేయలేదని మండిపడుతున్నారు.. ప్రభుత్వం తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
తడిసిన రంగు మారిన ధాన్యానికి ఎలాంటి నిబంధనలతో పాటు తరుగు విధించకుండా మద్దతు ధరకే పూర్తిగా కొనుగోలు చేయాలని వారు కోరుతున్నారు. అలాగే వరద పాలైన ధాన్యానికి ఎకరాకు నష్టపరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని అంటున్నారు. లేదంటే కుమ్మరి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తామని రైతాంగం స్పష్టం చేసింది. అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిసినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Telangana: గ్రామ పంచాయతీలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త.. ఇకపై సొంత నిధులు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే!
Hyderabad, Telangana:Cm Revanth Reddy Big Boost To Gram Panchayats: తెలంగాణలోని గ్రామపంచాయతీల బలోపేతానికి.. వాటి ఆర్థిక పరిపుష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త నిర్ణయంతో శుభవార్త చెప్పారు. గ్రామాల వికాసమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. పంచాయతీలకు పూర్తిస్థాయి ఆర్థిక స్వాతంత్రం కల్పించే దిశగా ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. గ్రామపంచాయతీల సొంత ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీ ఖాతాల్లో కాకుండా నేరుగా ఆయా పంచాయితీల సొంత బ్యాంకు ఖాతాలోనే జమ చేసుకునేలా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలో తగిన మార్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు.
గతంలో గ్రామపంచాయతీలకు పన్నులతో పాటు ఇతర వనరుల ద్వారా వచ్చే సొంత ఆదాయాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్రెజరీ ఖాతాల్లో జమ చేయాల్సి వచ్చేది.. దీనివల్ల గ్రామంలో అత్యవసర పనులు చేపట్టాలన్న.. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వాలన్న.. వీధి దీపాల నిర్వహణ చూసుకోవాలన్న నిధుల విడుదల కోసం ట్రెజరీల చుట్టూ తిరగాల్సి వచ్చేది.. ప్రభుత్వ అనుమతులతో పాటు సాంకేతిక కారణాలవల్ల నిధుల డ్రా చేయడంలో తీవ్ర జాప్యం జరిగేది.. దీనివల్ల గ్రామాల్లో అభివృద్ధి కొంటుపడుతోందని భావించిన ముఖ్యమంత్రి.. ఈ ఈ వ్యవస్థకు గుడ్ బై పలకాలని నిర్ణయించుకున్నారు..
కొత్త విధానం అమల్లోకి వస్తే గ్రామాల్లోని వసులయ్యే ఆస్తి పన్నులతో పాటు నాళాల ఫీజులు లేఅవుట్ ఫీజులు ఇతర రూపాల్లో వచ్చే సొంత ఆదాయం నేరుగా పంచాయతీల స్థానిక బ్యాంకుల్లోనే ఉంటాయి. దీనివల్ల నిధుల వినియోగంలో సర్పంచులకు, పంచాయితీ పాలకవర్గానికి పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. ఈ నిర్ణయం పై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్పంచులతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిధుల కోసం ప్రభుత్వ కార్యాలయాలను చుట్టూ తిరిగే తిప్పలు తప్పుతాయని.. గ్రామాల తక్షణ అవసరాలకు ఈ నిధులు వెంటనే వాడుకునే వీలుంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ శాఖ అధికార చట్ట సవరణకు అవసరమయ్యే ముసాయిదాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.. త్వరలో ఈ నూతన విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా అమలు చేయబోతున్నారు. ఈ నిర్ణయం ద్వారా తెలంగాణలోని పల్లె ప్రగతి పథంలో దూసుకుపోతాయని మేధావులు అభిప్రాయపడుతున్నారు.. అతి త్వరలోనే చట్ట సవరణ జరిగిన తర్వాత అమల్లోకి వస్తే.. గతంలో లాగా ట్రెజరీలకు సంబంధం లేకుండానే నేరుగా గ్రామపంచాయతీకి సంబంధించిన అకౌంట్ ద్వారా డబ్బులను గ్రామం పనులకు వినియోగించుకోవచ్చు.
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Saturn-Mars Effect: శని, కుజ గ్రహాల అద్భుత కలయిక.. అక్టోబర్ వరకు ఈ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు!
Hyderabad, Telangana:Saturn-Mars Conjunction Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కుజ, శని గ్రహాల ప్రభావం వల్ల అక్టోబర్ వరకు నాలుగు నాలుగు రాశుల వారి తలరాతలు మారబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో వృత్తి, వ్యాపారం, సామాజిక గౌరవం వంటి విషయాల్లో ఊహించని మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ గ్ర హాన్ని బలంతో పాటు ధైర్యం, శ్రమ ఫలితాలకు సూచికగా భావిస్తారు. అలాగే శనిని కర్మ స్థిరత్వం, వ్యక్తిగత జీవితంలో ఊహించని మార్పులకు సూచికగా చెప్పుకుంటాయి. ఇలాంటి రెండు గ్రహాలు కొన్ని రాశుల వారిపై ప్రభావం చూపితే.. జీవితంలో అనుకోని మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఈ సమయంలో అనుకోని అద్భుతమైన లాభాలు పొందే అవకాశాలుంటాయి. అయితే అక్టోబర్ నెల వరకు ఏ రాశుల వారికి ఈ సమయం శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారికి బంఫర్ జాక్పాట్..
మేషరాశి
మేషరాశి వారికి శని కుజ గ్రహాల ప్రభావంతో ఈ సమయంలో ఉద్యోగాల్లో గొప్ప గొప్ప అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా పదోన్నతులు లభించి వ్యాపారాల పరంగా కూడా అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. పోటీ పరీక్షలలో కూడా మంచి విజయాలు సాధిస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు. చాలాకాలంగా ఉన్న పెయింటింగ్ లో ఉన్న పనులు ఈ సమయంలో తప్పకుండా పూర్తవుతాయి. కుటుంబ జీవితంలో కూడా అద్భుతమైన ఆనందం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సింహరాశి
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. అంతేకాకుండా సమాజంలో ఒక గౌరవం లభించి గుర్తింపు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఇది చాలా శుభ్రంగా ఉంటుంది.. ముఖ్యంగా కొత్త పెట్టుబడులో నుంచి భారీ మొత్తంలో ధన లాభాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. అంతేకాకుండా భారీ మొత్తంలో ధనాన్ని కూడా సొంతం చేసుకోగలుగుతారు.
తులారాశి
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు శని, కుజ గ్రహాల ప్రభావంతో ఆర్థికంగా చాలా వరకు అదృష్టాన్ని సొంతం చేసుకోగలుగుతారు. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. పనుల్లో కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. కోపాన్ని అదుపులో ఉంచుకొని జీవితాన్ని ముందుకు సాగించడం చాలా మంచిది. లేదంటే వీరికి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మకర రాశి
మకర రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా కుజ శని గ్రహాల ప్రభావంతో కెరీర్లో పెద్దపెద్ద మార్పులు సంభవించబోతున్నాయి. అంతే కాకుండా ఉద్యోగ రంగాల్లో మంచి పురోగతి కూడా సాధించగలుగుతారు. వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలకు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలాకాలంగా కఠోరంగా శ్రమ పడే వ్యక్తులకు ఈ సమయంలో మంచి ఫలితాలు లభించబోతున్నాయి. వీరికి తప్పకుండా ఈ సమయంలో ఆత్మవిశ్వాసం కూడా విపరీతంగా పెరుగుతుంది.. కుటుంబ జీవితంలో కూడా అనేక మార్పులు వస్తాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Navapanchami Rajayoga: శని, శుక్రుల అద్భుత కలయిక.. నవపంచమి రాజయోగంతో ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం!
Hyderabad, Telangana:Navapanchami Rajayoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవ పంచమి రాజయోగాన్ని అత్యంత శుభప్రదమైన శక్తివంతమైనదిగా భావిస్తూ ఉంటారు. ఈ యోగం ఏర్పడితే కొన్ని రాశుల వారి జీవితాల్లో ఆకస్మిక మార్పులు సంభవించడమే కాకుండా.. అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది. అందుకే ఈ యోగాన్ని శుభప్రదమైనదిగా చెప్పుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే జూన్ 25వ తేదీన శుక్రుడు, శని గ్రహాలు ఒకదానికొకటి 120 డిగ్రీల కోణంలోకి రావడం వల్ల ఈ పంచమి రాజయోగం ఏర్పడింది. శుక్ర, శని రెండు గ్రహాలు ఒకదానికొకటి 120 డిగ్రీల కోణంలోకి రావడం వల్లే ఏర్పడిన ఈ పంచమి రాజయోగంతో నాలుగు రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాల్లో అభివృద్ధి లభించడమే కాకుండా ఆయా రాశుల వారు ఊహించని ధన లాభాలు సొంతం చేసుకోబోతున్నారు. అలాగే కష్టపడి పనులు చేసే వ్యక్తులకు దైవం తప్పకుండా తోడు ఉండబోతోంది.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మేష రాశి
నవ పంచమి రాజయోగంతో మేషరాశి వారికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కుటుంబాలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఇప్పుడు ఎంతో సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా కెరీర్తో పాటు వ్యాపారాలపరంగా విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. దీంతోపాటు చాలా కాలంగా ఉన్న కొన్ని రకాల కేసులు తప్పకుండా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి.
మేష రాశి వారికి కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. అనవసరంగా డబ్బులు ఖర్చు చేసినప్పటికీ కొన్ని రకాల విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే ఉద్యోగాలు చేస్తున్న మారి ఎంతో కఠినమైన పనులు చేసి అద్భుతమైన విజయాలు సాధించి ప్రశంసలు కూడా పొందగలుగుతారు. దీంతోపాటు అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా కాస్త పరిష్కారం లభిస్తుంది.
వృషభ రాశి
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు నవ పంచమి రాజయోగం ప్రభావంతో ఈ సమయం సువర్ణ అవకాశాలను అందిస్తుంది. అంతేకాకుండా కుటుంబ జీవితంలో ప్రేమ విపరీతంగా పెరుగుతుంది. అలాగే జీవితంలో అనేక సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి. ముఖ్యంగా చిక్కులు తొలగిపోవడమే కాకుండా కష్టానికి తగిన గుర్తింపు లభించబోతోంది.
తులారాశి
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు నవ పంచమి రాజయోగం ప్రభావంతో కొత్త ఆదాయ మార్గాలు తెలుసుకునే అవకాశాలున్నాయి. ఆర్థికంగా పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో ఈ సమయంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా ఆందోళన తగ్గి, మానసిక సమస్యలు పరిష్కారం అవుతాయి.
కుంభరాశి
కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు జూన్ నెల నుంచి విశేషమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా వీరికి శనీశుక్ర గ్రహాల ప్రభావంతో అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు కలగబోతున్నాయి. వీరికి పదోన్నతులు లభించడమే కాకుండా దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభించబోతోంది. అనుకున్న పనుల్లో దిమ్మతిరిగే ధన లాభాలు పొందుతారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Pawan Kalyan Nageshwar: "ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ వద్దు" ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం!
Nunna, Vijayawada, Andhra Pradesh:Pawan Kalyan On Nageshwar Arrest: తెలంగాణ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుపై ఎలాంటి కేసులు పెట్టొద్దని చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అరెస్టు చేసందుకు వెళ్లిన పోలీసులను వెనక్కి పిలిచినట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ భావోద్వేగంతో పొరపాటున మాట్లాడి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. నాగేశ్వర్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పినట్లు ఈ సందర్భంగా పవన్ చెప్పుకొచ్చారు.Telangana Weather: తెలంగాణలో భారీ వడగాలుల హెచ్చరిక..హైదరాబాద్లో భారీ వర్షం!
Hyderabad, Telangana:Telangana Weather Alert: తెలంగాణ వ్యాప్తంగా ఎండల తీవ్రత, వడగాలులు ఒక్కసారిగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భానుడి అగ్నిప్రవేశంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. వాతావరణ శాఖ అందించిన తాజా సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో వడగాలుల తీవ్రత పెరగనుంది. అదే విధంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది.IPL Business: కావ్య మారన్ బిజినెస్ మైండ్ మామూలుగా లేదుగా.. రూ. 85 కోట్ల నుంచి రూ. 13 వేల కోట్లకు SRH వాల్యూ..సక్సెస్ మ్యాజిక్ ఏంటంటే?
Lakshmapur, Telangana:Kavya Maran IPL Business: భారత్ లో ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారత క్రికెట్ చరిత్రను మార్చిందే ఐపీఎల్. బీసీసీఐ ఐపీఎల్ దెబ్బకు ఒక్కసారిగా ప్రపంచంలోనే రిచ్చెస్ట్ స్పోర్ట్స్ బోర్డుల్లో ఒకటిగా నిలిచింది. ఐపీఎల్ ను ఏ ముహూర్తంలో ప్రారంభించారో తెలియదు కానీ.. అప్పటి నుంచి ఒక రేంజ్ లో అదరగొడుతోంది. ఐపీఎల్ ను నమ్ముకున్న ఫ్రాంచైజీలు కూడా వందల కోట్ల లాభాలను అందుకుంటున్నాయి. కొన్ని ఫ్రాంచైజీలు మాత్రం తమ తప్పిదాలతో కనుమరుగవుతున్నాయి. మరికొన్ని ఫ్రాంచైజీలు తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ వందల కోట్ల లాభాలను తమ ఖాతాలో వేసుకుంటున్నాయి. అందులో ఒకటి సన్ రైజర్స్ హైదరాబాద్.
ఒక్కప్పుడు హైదరాబాద్ ఐపీఎల్ టీమ్ పేరు డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ గా ఉండేది. 2008లో జర్నీ ప్రారంభించిన ఈ ప్రాంచైజీ 2009లో టోర్నీ విన్నర్ గా నిలిచి సంచలనం రెకెత్తించింది. ఎలాంటి అంచనాలు లేకుండానే కప్పు కొట్టి అందరికీ షాకిచ్చింది. కానీ ఆ క్రేజ్ ను ఫ్రాంచైజీ ఓనర్స్ నిలుపుకోలేకపోయారు. దీంతో దివాలా దీశారు. బీసీసీఐ.. హైదరాబాద్ ఫ్రాంచైజీ జట్టును వేలం వేశారు.
అప్పుడే మాస్ ఎంట్రీ ఇచ్చింది సన్ నెట్ వర్క్. చెన్నైకు చెందిన ఈ మీడియా సంస్థ ఎలాగైనా ఐపీఎల్లో ఒక టీమ్ గా ఉండాలని కంకణం కట్టుకుని మరీ ఎంట్రీ ఇచ్చింది. అయితే హైదరాబాద్ ఫ్రాంచైజీ కోసం జరిపిన వేలంపాటలో మొదట పీవీపీ వెంచర్స్ ఒక సంవత్సరానికి 69కోట్లు ఆఫర్ చేసింది. ఎందుకంటే అప్పట్లో ఐపీఎల్ ఇంకా అంత బ్రాండ్ వాల్యూను పొందలేదు. కానీ సన్ నెట్ వర్క్ సంస్థ ఏకంగా రూ. 85కోట్ల బిడ్ వేసి 5ఏళ్లకు గాను రూ. 424 కోట్ల ఫైనాన్షియల్ కమిట్ మెంట్ తో హైదరాబాద్ ఫ్రాంచైజీని తన సొంతం చేసుకుంది.
ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా కంటెంట్:
ఇక్కడే అసలు మజా షురూ అయ్యింది. నిజానికి ఫ్రాంచైజీని కొన్న మొదట్లో సన్ రైజర్స్ జట్టులో చెప్పుకోదగ్గ ఆటగాళ్లు లేరు. ఒకరిద్దరు విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. ఉరుములు, మెరుపులు మెరిపించే ప్లేయర్స్ ఎవరూ లేరు.. అయినా సన్ రైజర్స్ టీమ్ మేనేజ్ మెంట్ ఒక కొత్త మార్కెటింగ్ విధానంతో ప్రమోషన్స్ ను ప్రారంభించింది. జట్టులో ఏదో అద్బుతం చేశారు. అంటూ ఓ సరికొత్త థీమ్ సాంగ్ ను తీసుకువచ్చారు. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే విధంగా కంటెంట్ ఇవ్వడం.. సోషల్ మీడియాను పక్కాగా వాడుకుంది.
ఒక్కొక్క సీజన్ లో సరికొత్త మార్కెటింగ్ విధానాలతో బ్రాండ్ ప్రమోషన్స్ చేసింది. ప్రస్తుతం సన్ రైజర్స్ మార్కెట్ వ్యాల్యూ 13వేల కోట్ల భారీ బిజినెస్ సామ్రాజ్యంగా ఎదిగింది. కేవలం 85కోట్లతో ప్రారంభించిన సన్ రైజర్స్ ప్రయాణం 13వేల కోట్ల కు చేరిందంటే మామూలు విషయం కాదు. ఇదంతా 13ఏళ్లలోనే జరిగింది. నిజానికి ఐపీఎల్ జట్లకు కేవలం మ్యాచులు గెలిస్తే డబ్బులు వస్తాయనుకుంటే పప్పులో కాలేసినట్లే. దీని వెనక ఒక పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటుంది.
2023లో అద్భుతం జరిగింది:
ప్రసార హక్కుల ద్వారా రెవెన్యూలో ఎక్కువ భాగం ప్రాంచైజీలకు కూడా ఇస్తుంది. 2023లో అద్భుతం జరిగింది. 4ఏళ్లకు సంబంధించి మీడియారైట్స్ వయాకామ్ 18, స్టార్ స్పోర్ట్స్ సంస్థలు 48వేల కోట్లకు బ్రాడ్ కాస్టింగ్ హక్కులు దక్కించుకున్నాయి. ఈ మీడియా రైట్స్ లో వచ్చిన ఆదాయం అంతకు ముందు సీజన్ తో పోల్చితే దాదాపు 129 శాతం పెరిగిందని చెప్పాలి. దీంతో ఫ్రాంచైజీలకు భారీ మొత్తంలో లాభాలు వచ్చాయి. సాధారణంగా ఫ్రాంచైజీలకు ఆటగాళ్ల కొనుగోలు, స్టేడియం ఖర్చులు, లాజిస్టిక్స్ తోపాటు ఇతర ఖర్చులు పోను సుమారు 330కోట్ల రూపాయల వరకు సర్ ప్లస్ మిగులుతుంది.
సన్ రైజర్స్ జట్టు అడ్వర్టైజింగ్ ఇంజిన్:
సన్ నెట్ వర్క్ వ్యూహం.. కంపెనీ యజమాని కావ్య మారన్ తమ జట్టును కేవలం ఆట కోసమే కాకుండా.. కార్పొరేట్ అడ్వాంటేజ్ కోసం కూడా ఉపయోగించుకుంటున్నారు. సన్ రైజర్స్ జట్టు వీరికి ఒక అడ్వర్టైజింగ్ ఇంజిన్ అని చెప్పాలి. సాధారణంగా పలు బ్రాండ్లు టీవీల్లో యాడ్స్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. కానీ సన్ నెట్ వర్క్ మాత్రం తమ ఎంటర్టైన్ మెంట్ ఛానల్స్ లో ఐపీఎల్ ప్లేయర్స్, హైదరాబాద్ ఫ్రాంచైజీని మొత్తం ఉపయోగించుకుంటుంది. దీంతో పెద్ద మొత్తంలో ప్రమోషన్లు చేయించుకుంటుంది.
కావ్య మారన్ నిర్ణయాలకు తిరుగుండదు:
ఇక కావ్యమారన్ తీసుకునే నిర్ణయాలకు తిరుగుండదనే చెప్పాలి. ఆమెకు బిజినెస్ వర్గాల్లోనూ మంచి పేరుంది. పైకి ఎమోషనల్ గా కనిపిస్తున్నప్పటికీ నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది. డేటా, ఫెర్ఫార్మెన్స్ ఈ రెండు విషయాలనే ఎక్కువగా నమ్ముతుంటారు. సాధారణ ఎమోషన్స్ ను పెద్దగా పట్టించుకోరని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. 2016 జట్టుకు కప్ అందించిన డేవిడ్ వార్నర్ ను తొలగించి మేనేజ్ మెంట్ తో కయ్యం కూడా పెట్టుకున్నారు. వార్నర్ ను తొలగించి బాస్ ఈజ్ రైట్ అనే సూత్రాన్ని ఫాలో అయ్యారు కావ్య.
గ్లోబల్ క్రికెట్ ఫ్రాంచైజీపై కన్ను:
ఐపీఎల్ తో నే సన్ రైజర్స్ ప్రస్థానం ఆగలేదు. గ్లోబల్ క్రికెట్ ఫ్రాంచైజీపై కూడా కన్నేసింది. సౌతాఫ్రికాలో జరిగే లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ పేరుతో ఒక ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. 2023, 2024 ,2026లో వరుసగా మూడుసార్లు చాంపియన్ గా నిలిచింది. ప్రస్తుతం ఇంగ్లండ్ క్రికెట్ లీగ్ లో కూడా సుమారు 100 మిలియన్ బ్రిటిష్ పౌండ్స్ అంటే 1050 కోట్ల రూపాయల ఖర్చుతో టీంను సొంతం చేసుకుని క్రికెట్ ప్రపంచంలో సన్ నెట్ వర్క్ గ్రూప్ బలంగా దూసుకుపోతుందని చెప్పాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Silver Rate Today: వెండి ధరల్లో భారీ మార్పులు.. మే 27వ తేదీ బుధవారం ధరలు ఇవే..!!
Lakshmapur, Telangana:Silver Rate Today: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు వెండి ధరలు నిరంతరం హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈరోజు మార్కెట్ ప్రారంభం కావడానికి ముందు, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో వెండి ఫ్యూచర్స్ ధర 0.13%, అంటే రూ. 358 తగ్గి, కిలోకు రూ. 2,70,270కి చేరింది. గత ట్రేడింగ్ రోజున ఇది కిలోకు రూ. 2,70,628 వద్ద ముగిసింది. జనవరి 29న వెండి ఫ్యూచర్స్ ధర కిలోకు రూ. 4,20,048 వద్ద సర్వకాలీన గరిష్ట స్థాయికి చేరుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, వెండి ధర కిలోకు రూ. 2,73,000 కి పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ వెండి ధర ఔన్సుకు US$ 76.49కి పడిపోయింది. గుడ్రిటర్న్స్ ప్రకారం, వెండి ధర కిలోకు రూ. 2,85,000గా ఉంది. కాగా, ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, వెండి ధర రూ. బుధవారం ఉదయం నాటికి కిలోకు 2,66,213 రూపాయలుగా ఉంది.
ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, జాతీయ రాజధానిలో వెండి ధరలు కిలోగ్రాముకు ₹2,000 పెరిగి ₹273,000 కు చేరుకున్నాయి. సెషన్లో ఇది కిలోగ్రాముకు ₹271,000 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ వెండి ధర 2 శాతానికి పైగా తగ్గి ఔన్సుకు $76.49 కు పడిపోయింది.బలహీనమైన స్పాట్ డిమాండ్ మధ్య వ్యాపారులు తమ డీల్స్ పరిమాణాన్ని తగ్గించడంతో, మంగళవారం ఫ్యూచర్స్ ట్రేడ్లో వెండి ధరలు కిలోకు రూ. 4,947 మేర తగ్గి రూ. 2,71,769కి చేరాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో జూలై డెలివరీకి సంబంధించిన వెండి కాంట్రాక్ట్ ధర కిలోకు రూ. 4,947 లేదా 1.79 శాతం తగ్గి రూ. 2,71,769కి చేరింది. వెండి ఫ్యూచర్స్ ధరల తగ్గుదలకు ప్రధాన కారణం వ్యాపారులు అమ్మకాలు జరపడమేనని మార్కెట్ నిపుణులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా, న్యూయార్క్లో వెండి ధరలు 2.01 శాతం తగ్గి ఔన్సుకు $76.51కి చేరాయి.
ఒక సంభావ్య ఒప్పందం దిశగా ఏదైనా పురోగతి సాధిస్తే అది ఇంధన మార్కెట్లోని ఉద్రిక్తతలను తగ్గించి, ద్రవ్యోల్బణ ఆందోళనలను ఉపశమింపజేస్తుందని, తద్వారా విలువైన లోహాలకు మరింత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చర్చలు విఫలమైతే, పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా ద్రవ్యోల్బణ భయాలు మళ్లీ తలెత్తవచ్చని, ఇది కఠినమైన ద్రవ్య విధానంపై అంచనాలను మరింత బలపరిచి, బంగారం, వెండి ధరలపై అదనపు ఒత్తిడిని పెంచుతుందన్నారు.
రాబోయే యూఎస్ కోర్ పర్సనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్స్ (పీసీఈ), ద్రవ్యోల్బణం జీడీపీ డేటా కోసం పెట్టుబడిదారులు ఇప్పుడు ఎదురుచూస్తున్నారని, ఇవి సమీప భవిష్యత్తులో ఫెడరల్ రిజర్వ్ అంచనాలను బులియన్ కదలికలను గణనీయంగా ప్రభావితం చేయగలవని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: హైకోర్టు సంచలన తీర్పు.. ఆ ఉద్యోగులకు భారీ పెన్షన్ పొందేందుకు లైన్ క్లియర్..!!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Unite8 Sports Channels: క్రీడా రంగంలోకి 'జీ'.. యునైట్8 పేరిట నాలుగు ఛానల్స్ ప్రారంభం
Wadgaon, Maharashtra:Unite8 Sports Channels: వినోదం... వార్తా ప్రసారాలతోపాటు ఓటీటీలతో కుటుంబాలను మొత్తం సంతోషంతో నింపుతున్న జీ మీడియా ఇప్పుడు మరో గొప్ప ముందడుగు వేసింది. భారతీయ మీడియా రంగంలో ప్రముఖ కంటెంట్, టెక్నాలజీ సంస్థగా అగ్రస్థానంలో ఉన్న 'జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్' ఇప్పుడు స్పోర్ట్స్ బ్రాడ్కాస్టింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇన్నాళ్లు ప్రేక్షకుల విశేష ఆదరణ, తన ముద్రను చూపించిన జీ మీడియా ఇకపై క్రీడారంగంలో కూడా మరింత బలోపేతం చేసేందుకు సరికొత్త ఛానళ్లను ప్రారంభించింది.
జీ మీడియా క్రీడలకు సంబంధించి 'యునైట్8 స్పోర్ట్స్' (Unite8 Sports) పేరుతో సరికొత్త క్రీడా ఛానళ్ల పోర్ట్ఫోలియోను ప్రారంభించబోతున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. క్రీడారంగంలోని సరికొత్త ఫార్మాట్లు, ప్రతిష్టాత్మక టోర్నమెంట్లు, ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్తో క్రీడాభిమానులకు అత్యుత్తమ వినోదం, అనుభూతిని అందించడమే లక్ష్యంగా జీ మీడియా క్రీడా ఛానళ్లను ప్రారంభించనుంది.
దశాబ్దాలుగా జీ సంస్థ వినోద ఛానళ్లలలోనే ముఖ్యమైన క్రీడా ఈవెంట్లను ప్రసారం చేస్తూ స్పోర్ట్స్ రంగంలో విశేష గుర్తింపు సాధించింది. ప్రత్యక్ష ప్రసారాలపై ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణను ఉపయోగించుకుని భారీ ప్రేక్షకాదరణ (వ్యూయర్షిప్)ను సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే బలమైన పునాదితో క్రీడా రంగంలో మరింత విస్తరించడానికి భారీ ప్రణాళికతో జీ మీడియా కీలక నిర్ణయం తీసుకుంది. వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా సంస్థ ఒకేసారి నాలుగు ప్రత్యేక స్పోర్ట్స్ ఛానళ్లను తీసుకురానుంది.
సరికొత్త ఛానళ్లు ఇవే
హిందీలో: యునైట్8 స్పోర్ట్స్ 1 (Unite8 Sports 1), యునైట్8 స్పోర్ట్స్ 1 HD (Unite8 Sports 1 HD)
ఇంగ్లీష్లో: యునైట్8 స్పోర్ట్స్ 2 (Unite8 Sports 2), యునైట్8 స్పోర్ట్స్ 2 HD (Unite8 Sports 2 HD)
క్రీడా రంగం అంటే ఒక్క క్రికెట్ కాదు అంతకుమించిన ఆటలు ఉన్నాయి. కొత్త ప్రారంభించనున్న ఈ ఛానళ్లలో ఫుట్బాల్, కబడ్డీ, క్రికెట్, బాడ్మింటన్, రెజ్లింగ్, బాక్సింగ్, కాంబాట్ స్పోర్ట్స్ (మార్షల్ ఆర్ట్స్) వంటి ప్రముఖ క్రీడలను ప్రసారం చేయనున్నారు. ఈ ఛానళ్ల ప్రారంభానికి అవసరమైన దరఖాస్తులను సంస్థ ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించినట్లు జీ మీడియా తెలిపింది. జీ సంస్థలోని మానవ వనరుల నైపుణ్యాలను, మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ పనిచేస్తున్న భావేష్ జనావ్లేకర్క్కు క్రీడారంగంలో స్పోర్ట్స్ అందించనుంది. జీ సంస్థకు చెందిన మరాఠీ మూవీస్ క్లస్టర్ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించడం విశేషం. యునైట్8 స్పోర్ట్స్ ఛానళ్లకు చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (సీబీఓ)గా వ్యవహరిస్తారు. బిజినెస్పై ఉన్న ఆయన అవగాహన, వ్యూహాత్మక చొరవతో జీ స్పోర్ట్స్ విభాగాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లనున్నారు.
ఈ సందర్భంగా భావేష్ జనావ్లేకర్ మాట్లాడుతూ.. "భారత్లాంటి సువిశాల దేశంలో ప్రపంచవ్యాప్త ఆదరణతో పాటు స్థానిక మూలాలు ఉన్న క్రీడలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో లైవ్ కంటెంట్ చూడాలనే ఆసక్తి, విభిన్న క్రీడా ఫార్మాట్లపై ఉన్న క్రేజ్తో స్పోర్ట్స్ వ్యూయర్షిప్ వేగంగా దూసుకుపోతోంది. మా కంటెంట్ పోర్ట్ఫోలియోను విస్తరించడానికి, వృద్ధి చెందుతున్న అవకాశాలను అందుకోవడానికి ఈ నాలుగు లీనియర్ స్పోర్ట్స్ ఛానళ్ల ప్రారంభం ఎంతగానో దోహదపడుతుంది' అని ధీమా వ్యక్తం చేశారు.
జీ ఛానళ్లలో ఫిఫా వరల్డ్ కప్?
క్రీడా విభాగంలో ప్రత్యర్థులకు గట్టి పోటీని ఇచ్చేందుకు జీ సంస్థ భారీ ప్రణాళిక వేసింది. యునైట్8 పేరిట ప్రారంభించే ఈవెట్ల సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్లను భారతదేశంలో టీవీల్లో, డిజిటల్ ప్లాట్ఫారమ్లలో ప్రసారం చేసేందుకు అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (FIFA)తో చర్చలు చేస్తోంది. ప్రత్యేకంగా లీనియర్ స్పోర్ట్స్ ఛానళ్లను తీసుకురావడంతో వేగంగా వృద్ధి చెందుతున్న స్పోర్ట్స్ బ్రాడ్కాస్టింగ్ విభాగంలో దీర్ఘకాలిక ప్రయోజనాలను అందుకోవడానికి.. సరికొత్త ఆవిష్కరణలతో ప్రేక్షకులను అలరించడానికి 'జీ' గ్రూప్ సిద్ధమైంది.
