icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505307
Bandi SrikanthBandi SrikanthFollow22 Jul 2024, 12:45 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Tirumala Darshan: తిరుమల దర్శనానికి భారీ రద్దీ.. రేపు కొండపైకి రాకపోవడమే మంచిది

Tirupati Urban, Andhra Pradesh:

Tirumala Devotees Rush: తిరుమలలో భక్తుల రద్దీ ఊహించని స్థాయిలో పెరుగుతోంది. వేసవి సెలవులు ముగిసిపోతుండడంతో ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవులకు తోడు వరుసగా సెలవులు లభించడంతో భక్తులు తిరుమలకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. తిరుమల గిరులు భక్తజన సంద్రంతో నిండిపోయాయి. ఎటు వైపు చూసినా భక్తులు తండోపతండాలుగా కనిపిస్తున్నారు. దీంతో రేపు ఆదివారం కొండపైకి మరింత తీవ్ర స్థాయిలో రద్దీ కొనసాగే అవకాశం ఉంది.

Also Read: Tirumala: తిరుమల భక్తులకు భారీ శుభవార్త.. ఉచిత బస్సుకు మరో కానుక

వేసవి సెలవులు, వారాంతపు సెలవులు కావడంతో వైకుంఠనాథుడిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాలినడక మార్గం, రోడ్డు మార్గాల ద్వారా భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. దీంతో కొండపై వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయి.. క్యూలైన్లు వెలుపలికి వచ్చేశాయి. శ్రీవారి ఉచిత దర్శనానికి ఏకంగా 24 గంటల సమయం పడుతోంది.

తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. శని, ఆదివారాలు.. వారాంతపు సెలవులు కావడంతో భక్తుల తాకిడి ఊహించని స్థాయిలో పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని మొత్తం 31 కంపార్టుమెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. క్యూలైన్లు కాంప్లెక్స్ వెలుపలకి వచ్చి కిలోమీటర్ల మేర భక్తులతో నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న షెడ్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల సంఖ్య గంటగంటకు పెరుగుతుండడంతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. అక్కడ నుంచి క్యూలైన్ ఏటీసీ గుండా.. కృష్ణతేజ సర్కిల్ మీదుగా ఏకంగా శిలాతోరణం రహదారి వరకు భక్తులు వరుసలో వేచి ఉన్నారు.

Also Read: IPL 2026: చాంపియన్‌ రేసులో గుజరాత్‌ టైటాన్స్‌.. వైభవ్‌ పోరాడినా రాజస్థాన్‌కు నిరాశ

భక్తుల రద్దీ
ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీవారి సర్వదర్శనం (ఉచిత దర్శనం) కోసం వేచి ఉన్న భక్తులకు దాదాపు 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లు, స్లాటెడ్ సర్వ దర్శనం  కలిగిన భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో గంటల కొద్దీ సమయం వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు, చల్లని మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. టీటీడీ తీసుకుంటున్న ఈ చర్యలతో క్యూలైన్‌లలో ఉన్న భక్తులకు తీవ్ర ఎండ, అలసట నుంచి ఉపశమనం లభిస్తోంది.

దర్శనానికి ఇలా ఉండగా.. గదులు, లాకర్లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. తిరుమలలో గదులకు తీవ్ర కొరత ఏర్పడింది. భక్తుల సంఖ్య లక్షకు చేరడంతో  గదులన్నీ బుక్ అయిపోయాయి. గదులు దొరకని వేలాది మంది భక్తులు తిరుమలలోని పార్కులు, ఓపెన్ షెడ్లలోనే తలదాచుకుంటున్నారు. ఈ రద్దీ మరో వారం పాటు ఉండే అవకాశం ఉంది. పరిస్థితి మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా భక్తులకు కల్పించాల్సిన మౌలిక వసతులపై టీటీడీ ఉన్నతాధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారు. దర్శనంతోపాటు టీటీడీ సేవల కోసం భక్తులు ఓపిక.. సంయమనంతో వ్యవహరించి.. తమకు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

0
0
Report
Advertisement

Jagtial: జగిత్యాలలో త్వరలోనే SIR ప్రారంభం.. జూన్ 15 నుంచి బీఎల్వోలకు ప్రత్యేక శిక్షణ!

Jagtial, Telangana:

Jagtial Voter List Special Revision 2026: జగిత్యాల జిల్లాలోని ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. భారత ఎన్నికల సంఘం ఆదేశాలకు మేరకు ఓటర్ల జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు అధికారులు కసరత్తును ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడంతోపాటు.. జాబితాలో ఉన్న తప్పులను సరిదిద్దుకోవడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. అంతేకాకుండా అర్హులైన వారికి ప్రత్యేకమైన ఓటర్ గుర్తింపు కార్డును కూడా అందించే ప్రక్రియను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలున్నట్లు కూడా తెలుస్తోంది..

డిజిటలైజ్ ప్రక్రియ..
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా బూత్ స్థాయి అధికారులు 2002తో పాటు 2026 ఓటరు జాబితాల మ్యాపింగ్ పనుల్లో నిమగ్నమైనట్లు సమాచారం.. పాత ఓటరు జాబితాలను.. ప్రస్తుతం తాజా జాబితాలతో సరిపోల్చుతూ.. ఎక్కడైనా లోపాలు ఉన్నాయా? ఓటర్ల విభజన సరిగ్గా జరిగిందా? లేదా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల వివరాలను డిజిటలైజ్ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం..

జూన్ 15 నుంచి శిక్షణా కార్యక్రమాలు..
ఈ భారీ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించేందుకు వీలుగా క్షేత్రస్థాయి సిబ్బందితో పాటు బీఎల్వోలకు అధికారులు ప్రత్యేకమైన శిక్షణను అందించబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 15వ తేదీ నుంచి జూన్ 24వ తేదీ వరకు వివిధ విడుదల్లో ఈ ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాలు కొనసాగబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఓటర్ల నమోదు తో పాటు మార్పులు చేర్పులు, సాంకేతిక యాపుల వినియోగంపై సిబ్బందికి ఈ శిక్షణలో భాగంగా పూర్తిస్థాయి అవగాహన కల్పించబోతున్నట్లు తెలుస్తోంది..

సర్వే ప్రారంభ తేది..
జూన్ 25వ తేదీ నుంచి నెలరోజులపాటు ఇంటింటి సర్వే శిక్షణ పూర్తి కాగానే.. అసలైన ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 25 నుంచి జూలై 24 వరకు నెల రోజులపాటు బీఎల్వోలు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటినీ సందర్శించి సర్వే నిర్వహించబోతున్నారు. ఈ ఇంటింటి సర్వేలో భాగంగా ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో నమోదు చేసుకోబోతున్నట్లు సమాచారం. 

Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..

జగిత్యాల జిల్లా ఓటర్ల సంఖ్య..
ఒకే ఇంట్లో ఉంటూ వేర్వేరు పోలింగ్ కేంద్రాలలో ఓట్లు ఉన్న వారిని గుర్తించడంతోపాటు మరణించిన వారి పేర్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించడం, కొత్తగా 18 ఏళ్లు నిండిన యువతి యువకులను ఓటర్లుగా నమోదు చేయడం వంటి పనులను ఈ సర్వేలోనే పూర్తి చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుత గణాంకాల ప్రకారం జగిత్యాల జిల్లాలో మొత్తం.. 7 లక్షలకు మందికి పైగా ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియ ముగిసిన అనంతరం తుది ఓటరు జాబితాను ప్రకటిస్తామని.. ప్రజలందరూ బీఎల్వోల సర్వేకు సహకరించాలని అధికారులు కోరినట్లు సమాచారం..

Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Bank Holidays: ఏకంగా 11 రోజులు బ్యాంకులకు సెలవు..ఈ రోజుల్లో బ్యాంకులకు వెళ్లకపోవడమే మంచిది!

Hyderabad, Telangana:

Bank Holidays In June 2026: మే నెల ముగుస్తుండటంతో.. జూన్ నెలలో వివిధ ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంకులకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీరు ఈ వార్తను తప్పక చదవాలి. వచ్చే నెలలో బ్యాంకులకు వెళ్లే కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) సెలవుల జాబితాను విడుదల చేసింది.

సాధారణ వారాంతపు సెలవులతో (శని, ఆదివారాలు) పాటు వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పండుగలు, స్థానిక ఆచారాల ఆధారంగా జూన్ నెలలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మొత్తం 11 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అందువల్ల మీ నగరంలో ఏ రోజు బ్యాంకుకు సెలవు ఉందో ముందుగానే తెలుసుకొని మీ పనులను ప్లాన్ చేసుకోవడం మంచిది.

జూన్‌లో బ్యాంక్ సెలవుల పూర్తి జాబితా..
జూన్ నెలలో వచ్చే సాధారణ సెలవులు (4 ఆదివారాలు, 2 శనివారాలు) కాకుండా, నిర్దిష్ట తేదీల్లో రాష్ట్రాల వారీగా ఉన్న సెలవుల వివరాలు కింద ఇవ్వబడ్డాయి. జూన్ 13, జూన్ 27న రెండో, నాలుగో శనివారాల కారణంగా బ్యాంకులు మూతపడనున్నాయి.

అలాగే జూన్ 15న 'వైఎంఏ డే' సందర్భంగా ఐజాల్ (మిజోరం) సహా 'రాజా సంక్రాంతి' సందర్భంగా భువనేశ్వర్ (ఒడిశా)లో బ్యాంకులకు సెలవు ఉండనుంది. జూన్ 17న 'మహారాణా ప్రతాప్ జయంతి' సందర్భంగా హర్యానాలో బ్యాంకులు బంద్ కానున్నాయి. జూన్ 18న 'శ్రీ గురు అర్జున్ దేవ్ జీ అమరత్వ దినోత్సవం' కారణంగా పంజాబ్‌లో బ్యాంకులు సెలవు ప్రకటించారు.

మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. జూన్ 25న మొహరం పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో (హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో) మొహరం సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

జూన్ నెలలో అత్యధిక రాష్ట్రాలలో వచ్చే ప్రధాన సెలవు జూన్ 26 కావడం విశేషం. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, లక్నోలలో బ్యాంకులు మూతపడతాయి. (గమనిక: గుజరాత్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ రోజు సెలవు వర్తించదు).

జూన్ 29న 'సంత్ గురు కబీర్ జయంతి' సందర్భంగా సిమ్లా (హిమాచల్ ప్రదేశ్), హర్యానా, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌లలో సెలవు పాటిస్తారు. జూన్ 30న 'రెంమ్నా ని' (శాంతి దినం) సందర్భంగా ఐజాల్ (మిజోరం)లో బ్యాంకులు మూసి ఉంటాయి.

గమనిక: అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాలలో జూన్ నెలలో ఎలాంటి అదనపు ప్రాంతీయ సెలవులు లేవు. అక్కడ కేవలం సాధారణ శని, ఆదివారాల సెలవులు మాత్రమే వర్తిస్తాయి.

సెలవు దినాల్లో బ్యాంక్ బ్రాంచ్‌లు మూసి ఉన్నా.. వినియోగదారుల అవసరాల కోసం ఆన్‌లైన్ సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి. యూపీఐ (UPI) లావాదేవీలు, ఏటీఎంలు (ATMs), మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా పనిచేస్తాయి. నేరుగా బ్యాంక్ శాఖలకు వెళ్లి చేసుకునే నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్ క్లియరెన్స్‌లు, పాస్‌బుక్ ప్రింటింగ్, కొత్త అకౌంట్ ఓపెనింగ్ వంటి సేవలు మాత్రం సెలవు రోజుల్లో లభించవు. కాబట్టి, బ్యాంకులకు వెళ్లి పూర్తి చేసుకోవాల్సిన పనులను ఈ సెలవుల జాబితా ఆధారంగా ముందే ప్లాన్ చేసుకోండి!

Also REad: 'ఆపరేషన్ సింధూర్ 2.0'కి త్రివిధ దళాలు రెడీ..ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కీలక ప్రకటన!

Also Read: బస్సు టికెట్టు ధరకే విమానం ఎక్కొచ్చు..సగం ధరకే విమానం టికెట్‌తో ఎయిర్ ఇండియా ఆఫర్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Tirumala: తిరుమల భక్తులకు భారీ శుభవార్త.. ఉచిత బస్సుకు మరో కానుక

Tirupati Urban, Andhra Pradesh:

TTD Free Bus Service: తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులకు మరింత మెరుగైన, పర్యావరణహితమైన సేవలు అందుబాటులోకి వచ్చాయి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమలలో నడుస్తున్న ఉచిత బస్సుల విభాగంలోకి మరో సరికొత్త ఎలక్ట్రిక్ బస్సు వచ్చి చేరింది. లీలా రజియా అనే మహిళా భక్తురాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆధునిక ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందజేశారు. తిరుమల కొండపై కాలుష్యాన్ని తగ్గించి.. ఎకో ఫ్రెండ్లీ వాతావరణాన్ని పెంపొందించడమే లక్ష్యంగా టీటీడీ వేస్తున్న అడుగులకు స్పందన లభిస్తోంది.

తిరుమల క్షేత్రంలో పర్యావరణ పరిరక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగానే డీజిల్ వాహనాల వాడకాన్ని తగ్గిస్తూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని భారీగా పెంచుతోంది. తాజాగా లీలా రజియా అనే మహిళా భక్తురాలు స్వామివారిపై భక్తితో ఒక అధునాతన ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా ఇచ్చారు. తిరుమలలోని అన్నదాన భవనం వద్ద టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ బస్సును ప్రారంభించారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పాల్గొన్నారు. కాగా అంతకుముందు బస్సు అందించిన దాత రజియా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమెకు దర్శన ఏర్పాట్లు టీటీడీ అధికారులు దగ్గరుండి చూసుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేశారు.

బస్సుకు సంబంధించిన పత్రాలు, తాళం చెవిని అందుకున్న అనంతరం అదనపు ఈఓ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. తిరుమలలో భక్తుల కోసం నడుపుతున్న ఉచిత బస్సుల (ధర్మ రథాలు) సంఖ్య ఈ కొత్త బస్సుతో కలిపి మొత్తం 20 బస్సులు అయ్యాయని వెల్లడించారు. తిరుమలలో ప్రస్తుతం తిరుగుతున్న 20 ఉచిత బస్సుల్లో 14 బస్సులు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలే ఉన్నాయని తెలిపారు. శ్రీవారి భక్తులకు రవాణా ఇబ్బందులు లేకుండా తిరుమల వీధుల్లో రోజుకు ఏకంగా 320 ట్రిప్పులు తిరుగుతూ ఈ బస్సులు నిరంతర సేవలు అందిస్తున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మంది ప్రయాణించేలా ఈ కొత్త బస్సును డిజైన్ చేయగా.. ఈ బస్సులో 40 మంది భక్తులు నిలబడి ప్రయాణించేలా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు.

కాలుష్య రహిత తిరుమలే లక్ష్యంగా భవిష్యత్తులో డీజిల్ బస్సులను పూర్తిగా పక్కన పెట్టి.. కేవలం ఎలక్ట్రిక్ వాహనాలనే నడపాలని టీటీడీ యోచిస్తోంది. భక్తులకు ఉచితంగా.. సౌకర్యవంతంగా సేవలందిస్తున్న ఈ గ్రీన్ బస్సుల సంఖ్య పెరగడంపై హర్షం వ్యక్తమవుతోంది. కాగా తిరుమలలో భక్తుల అసాధారణ రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 24 గంటలకు సమయం పడుతోంది. దీంతో కిలోమీటర్ల మేర క్యూలైన్లు నిలిచిపోయాయి. నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌లలో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ సహాయ చర్యలు చేస్తోంది. నిరంతరాయంగా అన్నప్రసాదం, మజ్జిగ పంపిణీ కొనసాగుతోంది.

0
0
Report
Advertisement

Operation Sindoor 2.0: 'ఆపరేషన్ సింధూర్ 2.0'కి త్రివిధ దళాలు రెడీ..ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కీలక ప్రకటన!

Hyderabad, Telangana:

Upendra Dwivedi On Operation Sindoor: భారత సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శనివారం అనగా మే 30 నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శత్రు దేశాల కుట్రలను అడ్డుకోవడానికి, జాతీయ రక్షణ లక్ష్యంతో 'ఆపరేషన్ సింధూర్ 2.0'కు భారత్ సన్నద్ధమవుతోందని ఆయన స్పష్టం చేశారు. కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ చర్యలకు ప్రతిస్పందనగా భారత్ తీసుకున్న కఠినమైన సైనిక వైఖరి ఇప్పటికీ కొనసాగుతోందని ఆయన అన్నారు.

ఏఎన్ఐ మీడియా సంస్థతో మాట్లాడిన జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఆపరేషన్ సింధూర్ ఇప్పటికీ కొనసాగుతోందని స్పష్టం చేశారు. ప్రస్తుత సరిహద్దు పరిస్థితిని ఆయన తాత్కాలిక ఘర్షణల విరమణగా అభివర్ణించారు. పాకిస్థాన్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే శత్రువుకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

భవిష్యత్తులో కొత్త ఆపరేషన్ చేపట్టాల్సి వస్తే, కేవలం సైన్యం మాత్రమే కాకుండా వాయుసేన, నావికా దళం కూడా సంయుక్త దాడికి సిద్ధంగా ఉన్నాయని ఆయన వివరించారు. తదుపరి యుద్ధం కోసం ఈ మూడు దళాలు రోజుకు 24 గంటలూ సిద్ధంగా ఉన్నాయని, వాటి మధ్య సమన్వయం పెంచబడుతోందని ఆయన అన్నారు.

ఆధునిక యుద్ధ వ్యూహాల గురించి మాట్లాడుతూ, సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. "ఈ రోజుల్లో యుద్ధరంగం చాలా పారదర్శకంగా మారింది. మన ప్రతి కదలిక ఇతరులకు తెలిసిపోతోంది. కాబట్టి మన సైనికులను, సరిహద్దు ప్రాంతాల్లోని పౌరులను రక్షించడానికి వ్యూహాత్మక రక్షణ, సైనిక మోహరింపు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి" అని ఆయన అన్నారు.

అంతేకాకుండా, కేవలం సరిహద్దుల వెంబడి మాత్రమే కాకుండా, సమాచార యుద్ధంలో గెలవడం కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు. యావత్ దేశం ఐక్యంగా ఉండి, అధికారిక సమాచారాన్ని విశ్వసించినప్పుడే సమాచార యుద్ధంలో గెలవగలమని, అటువంటి ఐక్యత ఉన్న దేశం ఎల్లప్పుడూ యుద్ధంలో విజయం సాధిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

'ఆపరేషన్ సింధూర్' అంటే?
గత ఏడాది (2025 మే 7 - మే 8 మధ్య), పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి గట్టి ప్రతీకారంగా భారతదేశం 'ఆపరేషన్ సింధూర్'ను ప్రారంభించింది. అంతకుముందు ఏప్రిల్ 22న, కాశ్మీర్‌లోని పహల్గామ్ జిల్లా, బైసారన్ లోయలో పాకిస్థాన్ మద్దతుగల ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాద దాడులకు గట్టి హెచ్చరిక ఇవ్వడానికే భారత సైన్యం ఈ ఆపరేషన్‌ను చేపట్టింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా.. రెండవ భాగం (ఆపరేషన్ సింధూర్ 2.0) కోసం మూడు దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ చేసిన ప్రకటన అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read: బస్సు టికెట్టు ధరకే విమానం ఎక్కొచ్చు..సగం ధరకే విమానం టికెట్‌తో ఎయిర్ ఇండియా ఆఫర్!

Also Read; ఉద్యోగులకు అలర్ట్..పీఎఫ్ డబ్బు ఏటీఎం ద్వారా ఎలా విత్‌డ్రా చేసుకోవాలి?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

RCB Vs GT Final Preview: ఐపీఎల్ ఫైనల్లో పక్కా గెలుపు ఆర్సీబీదే! ఈ లెక్కలు చూస్తే నిజం తెలిసిపోతుంది!

Ahmedabad, Gujarat:

RCB Vs GT IPL Final Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 2026 గ్రాండ్ ఫినాలేకు సర్వం సిద్ధమైంది. మే 31 (ఆదివారం) రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT)ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. క్వాలిఫైయర్-1లో జీటీపై ఆర్సీబీ గెలవగా, క్వాలిఫైయర్-2లో రాజస్థాన్‌ను ఓడించి గుజరాత్ ఫైనల్‌కు దూసుకొచ్చింది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల బలాబలాల గురించి ఇప్పుడు అంచనా వేద్దాం.

అయితే ఈ రెండు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నప్పటికీ.. ప్రస్తుత ఫామ్ ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్‌లో స్వల్ప ఆధిక్యంతో బరిలోకి దిగుతోంది. గత సీజన్ (2025) ఛాంపియన్ అయిన ఆర్సీబీ, ఈసారి కూడా అద్భుతమైన బ్యాటింగ్ లైన్అప్‌తో ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా కూడా తనదైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. బౌలింగ్ దళం భువనేశ్వర్ కుమార్, ఢఫీ, హేజిల్ వుడ్, రసిఖ్ సలామ్, సుయాష్ శర్మ వంటి వారితో బలంగా కనిపిస్తోంది.

మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శుభ్‌మన్ గిల్‌తో పాటు సాయి సుదర్శన్ మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. అలాగే బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్, కగిసో రబడా, రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి వారితో ఎంతో బలంగా కనిపిస్తోంది. అయితే, అహ్మదాబాద్ పిచ్‌పై ఆర్సీబీ బ్యాటింగ్ లోతు, అనుభవజ్ఞులైన బౌలింగ్ అటాక్ వల్ల ఆర్సీబీ వరుసగా రెండోసారి టైటిల్ గెలిచే అవకాశాలు (53%) ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య పోటీ ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ఐపీఎల్ చరిత్రలో మొత్తంగా 9 సార్లు ఇరుజట్లు తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ 5 సార్లు గెలుపొందగా.. గుజరాత్ 4 సార్లు గెలుపొందింది. ఇటీవల జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 92 పరుగుల భారీ తేడాతో గుజరాత్‌ను ఓడించి హెడ్-టు-హెడ్ రికార్డులో ముందంజ వేసింది.  

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు అంచనా..
వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, రసిఖ్ సలామ్. (ఇంపాక్ట్ ప్లేయర్: సుయాష్ శర్మ)

గుజరాత్ టైటాన్స్ తుదిజట్టు అంచనా..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు, రాహుల్ తెవాటియా, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్/సాయి కిషోర్, కగిసో రబడా, మహ్మద్ సిరాజ్.(ఇంపాక్ట్ ప్లేయర్: ప్రసిద్ధ్ కృష్ణ)  

Also Read: IPL Final Tickets: ఐపీఎల్ ఫైనల్ టికెట్ ధర ఒక్కొక్కటి రూ.2,20,000 మాత్రమే..ఖంగుతిన్న క్రికెట్ ఫ్యాన్స్!

Also Read: ఐపీఎల్‌లో ఆటగాళ్ల కళ్లద్దాలు నిషేధించిన బీసీసీఐ..ఉల్లంఘిస్తే భారీ జరిమానా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

IPL Final Tickets: ఐపీఎల్ ఫైనల్ టికెట్ ధర ఒక్కొక్కటి రూ.2,20,000 మాత్రమే..ఖంగుతిన్న క్రికెట్ ఫ్యాన్స్!

Ahmedabad, Gujarat:

IPL 2026 RCB Vs GT: ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫినాలేకు సమయం ఆసన్నమైంది! అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT)ల మధ్య ఈ చారిత్రాత్మక టైటిల్ పోరు జరగనుంది.

మొత్తం 73 మ్యాచ్‌ల ఉత్కంఠభరిత పోరు ముగిసిన తర్వాత ఈ రెండు జట్లు ఫైనల్‌కు చేరాయి. ఈ మెగా మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే అభిమానుల కోసం టిక్కెట్ల ధరలు, ఆన్‌లైన్ బుకింగ్ ప్రక్రియ, స్టేడియం నియమ నిబంధనల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఫైనల్ టిక్కెట్ల ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ టిక్కెట్ల ధరలు మీరు ఎంచుకునే స్టాండ్ మరియు లభించే సౌకర్యాల ఆధారంగా ఉంటాయి. కనీస ధర రూ.5,000 (బ్యాక్ స్టాండ్ టికెట్లు) ఉండగా.. గరిష్ట ధర రూ.2,20,000 (హాస్పిటాలిటీ యాక్సెస్, విలాసవంతమైన సీటింగ్, విందు సౌకర్యాలతో కూడిన ప్రీమియం టిక్కెట్లు) అమ్మకాలు జరుగుతున్నాయి. 

ఈ మ్యాచ్ అధికారిక టిక్కెట్లను 'డిస్ట్రిక్ట్ బై జొమాటో' యాప్ లేదా వారి వెబ్‌సైట్ ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు. ఈ మ్యాచ్ టికెట్‌ను బుక్ చేసుకునేందుకు వీలుగా ముందు మీ మొబైల్‌లో 'డిస్ట్రిక్ట్ బై జొమాటో' యాప్ లేదా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. సెర్చ్ బార్‌లో 'IPL 2026 Final' అని టైప్ చేసి వెతకండి. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను ఎంచుకుని, మీకు నచ్చిన స్టాండ్, సీట్లను సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేసి, ఆన్‌లైన్ ద్వారా చెల్లింపు (Payment) పూర్తి చేయండి. బుకింగ్ పూర్తయ్యాక, కన్ఫర్మేషన్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

అయితే క్రికెట్ ప్రేమికులకు ఓ గమనిక. ఒకే అకౌంట్/ఖాతా నుండి గరిష్టంగా 4 టిక్కెట్లను మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఆన్‌లైన్ కన్ఫర్మేషన్ లభించిన తర్వాత, మ్యాచ్‌కు ఒక రోజు ముందు అహ్మదాబాద్‌లోని నిర్దేశిత టిక్కెట్ కౌంటర్‌కు వెళ్లి మీ ఫిజికల్ (అసలు) టిక్కెట్లను సేకరించాల్సి ఉంటుంది.

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రేక్షకులను సాయంత్రం 4:30 గంటల నుంచే మైదానంలోకి అనుమతిస్తారు. స్టేడియంలోకి ప్రవేశించడానికి ఎటువంటి వయోపరిమితి లేదు. అయితే, 2 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలందరికీ విడిగా టిక్కెట్ తీసుకోవడం తప్పనిసరి. లక్షకు పైగా ప్రేక్షకుల సమక్షంలో జరిగే ఈ రసవత్తర పోరును మైదానంలో చూసేందుకు ఇప్పుడే మీ టిక్కెట్లను సిద్ధం చేసుకోండి!

Also Read: ఐపీఎల్‌లో ఆటగాళ్ల కళ్లద్దాలు నిషేధించిన బీసీసీఐ..ఉల్లంఘిస్తే భారీ జరిమానా!

Also Read: ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త..కనీస జీతం రూ.69,000కి పెంపు..18 నెలల బకాయిలు అకౌంట్లో!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Transgenders: ట్రాన్స్‌జెండర్లకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. ఉస్మానియాలో ఉచితంగా లింగ మార్పిడి సర్జరీలు!

Hyderabad, Telangana:

Telangana Govt Telugu Latest News: సమాజంలో తీవ్ర వివక్షకు, ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న ట్రాన్స్ జెండర్ల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక, మానవయ్య నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ట్రాన్స్ జెండర్లకు లింగమార్పిడి చికిత్స పూర్తిగా ఉచితంగా అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కీలకమైన కసరత్తును ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఉచితంగా శస్త్రచికిత్స..
సాధారణంగా లింగ మార్పిడి ప్రక్రియ అనేది సుదీర్ఘమైనది, అత్యంత ఖరీదైనది.. దీనికోసం నిర్వహించే హార్మోనల్ తెరపి తో పాటు SRS సర్జరీలకు ఖర్చులను సాధారణ ప్రజలు భరించడం దాదాపు అసాధ్యం.. ఈ విషయాన్ని గమనించిన తెలంగాణ ప్రభుత్వం ఈ చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి ప్రత్యేక లెటర్ ఆఫ్ క్రెడిట్ మంజూరు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా అర్హులైన ట్రాన్స్ జెండర్లకు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా శస్త్రచికిత్సలతో పాటు మందులు అందుతాయి..

కార్పొరేట్ స్థాయి వైద్యం..
ప్రస్తుతం ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఈ తరహా లింగమార్పిడి సర్జరీలకు సుమారు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించలేక.. సరైన వైద్య సదుపాయాలు లేని చోట తక్కువ ఖర్చులతో సర్జరీలు చేయించుకొని ఎంతోమంది ట్రాన్స్ జెండర్లు తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఈ ఆర్థిక భారాన్ని పూర్తిగా తగ్గించి.. వారికి అధునాతన కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోనే అందుబాటులోకి తీసుకురావడం ద్వారా నిరుపేద ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వం పెద్ద అండగా నిలిచింది..

Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..

ప్లాస్టిక్ సర్జరీలు కూడా..
ఉస్మానియా ఆసుపత్రిలో ఇప్పటికే ట్రాన్స్ జెండర్‌ల కోసం ప్రత్యేకమైన క్లినిక్ నడుపుతున్నారు. ఇప్పుడు ఈ ఉచిత సర్జరీల నిర్ణయంతో ప్లాస్టిక్ సర్జరీలతో పాటు ఎండోక్రినాలజీ, సైకియాట్రీ, గైనకాలజీ విభాగాల నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఈ ఆధ్యాధునిక శాస్త్ర చికిత్సలు జరగబోతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ అద్భుతమైన నిర్ణయంపై ట్రాన్స్ జెండర్ హక్కుల సంఘాలతో పాటు సామాజిక విశ్లేషకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో తాము గౌరవంగా బ్రతకడానికి ఇదొక గొప్ప అవకాశం అని వారు  కొనియాడుతున్నట్లు తెలుస్తోంది..

Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

 

0
0
Report

Ts Police Recruitment: తెలంగాణలో పోలీస్ కొలువుల జాతర.. త్వరలోనే 5,000 పోస్టులతో తొలి విడత నోటిఫికేషన్!

Hyderabad, Telangana:

Ts Police Recruitment Latest News: తెలంగాణలో కొలువుల వేటలో ఉన్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మరో భారీ శుభవార్త అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పోలీస్ శాఖను మరింత బలోపేతం చేయడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా భారీ భారీ సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో దాదాపు 19వేల కంటే ఎక్కువ పోస్టులు ఖాళీ ఉన్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా తొలి విడత సుమారు 5000 పోస్టుల భర్తీకి అడుగులు పడుతున్నాయి..

ఐదు వేల కానిస్టేబుల్‌ ఉద్యోగాలు..
మొదటి విడత కింద భర్తీ చేయబోతున్న ఐదు వేల కానిస్టేబుల్‌తో పాటు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించిన సమగ్ర నివేదికను పోలీస్ నియామక బోర్డు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ పోస్టుల భర్తీకి అనుమతి కోరుతూ పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారికంగా ప్రతిపాదనలు పంపించినట్లు సమాచారం.. ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన వెంటనే.. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు ద్వారా ఉద్యోగ ప్రకటన విడుదల అయ్యే అవకాశం ఉంది..

సైబర్ సెక్యూరిటీ బ్యూరో..
ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి.. అత్యాధునిక సాంకేతికతతో కూడిన భద్రతను ప్రతిష్ట చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ రిక్రూట్మెంట్‌లో భాగంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరోను, అలాగే ఈగల్ ఫోర్స్ ను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్తగా ఎంపికయ్యే అభ్యర్థులకు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌తో పాటు టెక్నికల్ ఇంటెలిజెన్స్ వంటి విభాగాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వబోతున్నట్లు సమాచారం..

Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..

ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్..
గత కొంతకాలంగా నోటిఫికేషన్‌ల కోసం ఎదురుచూస్తున్న పోలీసు ఉద్యోగ అభ్యర్థులకు ఈ వార్త పెద్ద ఊరటన ఇస్తోంది.. నోటిఫికేషన్ వెలుపడే అవకాశాలు ఉండడంతో అభ్యర్థులు అప్పుడే కోచింగ్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు.. అంతేకాకుండా తమ శారీరక, రాత పరీక్షల సాధనను ముమ్మరం చేస్తున్నారు. త్వరలోనే ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ రావడంతో పాటు వెంటనే ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేయడం ఖాయమని కనిపిస్తోంది.. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలను ప్రభుత్వం త్వరలోనే వెల్లడించే ఛాన్స్ ఉన్నట్లు కూడా సమాచారం..

Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Saraswati Yoga 2026: మిథున రాశిలో సరస్వతి యోగం.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు, కుబేరులవ్వడం ఖాయం!

Hyderabad, Telangana:

Rare Saraswati Yoga 2026 Effect: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ సంచారాలతో పాటు వాటి సంయోగాలకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. మే నెల చివరి వారంలో చాలా అరుదైన శుభప్రదమైన కొన్ని గ్రహాల సంచారం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని గ్రహాలు కదలికలు కూడా చేస్తాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే మే 29వ తేదీన బుద్ధితో పాటు వాక్కుకు అధిపతిగా భావించే భూతగ్రహం మిథున రాశిలోకి ప్రవేశించింది. అలాగే  శుక్రుడితో పాటు గురుడు ఇప్పటికే  మిథున రాశిలో సంచార దశలో కొనసాగుతున్నాయి. ఫలితంగా మే 29న మిథున రాశిలో బుధుడు కూడా సంచారం చేయడంతో మూడు గ్రహాలు కలయిక జరిగింది. ఈ సంచార కలయికనే సరస్వతి యోగాన్ని ఏర్పాటు చేసిందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుంది.. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా వేరవేరబోతున్నాయి.

సరస్వతి యోగం అంటే ఏమిటి? 
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జ్ఞానానికి అధిపతి అయిన గురుడితో పాటు బుద్ధికి అధిపతి అయిన బుధుడు.. సృజనాత్మకత కళకు సూచికగా చెప్పుకునే.. శుక్రుడు ఒకే రాశిలో కలిసినప్పుడు ఎంతో శక్తివంతమైన ఈ సరస్వతి యోగం ఏర్పడుతుంది.. ఈ యోగం జ్ఞానంతో పాటు విద్యా, కళా, సంగీతం, రచన సమాచార రంగాల్లో ఉన్న వారికి ఒక వరంలా మారుతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా మానసికంగా మెరుగుపడడమే కాకుండా ఎప్పుడు పొందలేదు జ్ఞానాన్ని కూడా సొంతం చేసుకుంటారు. 

వృషభ రాశి 
ఈ గ్రహల సంయోగంతో వృషభ రాశి వారికి రెండవ స్థానంలో సరస్వతి యోగం ఏర్పడడం కారణంగా వృషభ రాశి వారికి ఆర్థిక విషయాలపరంగా చాలా శుభప్రదంగా ఉంటుంది.. అంతే కాకుండా డబ్బు సంపాదించడంతో పాటు పొదుపు చేయడంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు.. వీరు ఆకస్మికంగా గణనీయమైన ఆర్థిక లాభాలు పొందుతారు పూర్వీకుల ఆస్తుల నుంచి వారసత్వంగా భూములు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాటల్లో బలమైన ఆకర్షణ కూడా పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలతో పాటు అసంపూర్తిగా ఉన్న పనుల్లో త్వరగా విజయాలు సాధించగలుగుతారు.

మిథున రాశి 
మిధున రాశి వారికి ఈ గ్రహాల సంయోగంతో విశేషమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి సమాజంలో ఊహించని స్థాయిలో గౌరవం లభించడమే కాకుండా వ్యక్తిత్వ వికాసం విపరీతంగా పెరుగుతుంది. పనుల్లో అద్భుతమైన ధన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యాతో పాటు మీడియా రంగాల్లో ఉన్న వ్యక్తులకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే రచన రంగాల్లో పనులు చేసే వారికి కూడా గణనీయమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

సింహరాశి 
సింహరాశి వారికి 11వ స్థానంలో సరస్వతి యోగం ఏర్పడడం కారణంగా కోరుకున్న కోరికలు ఎంతో సులభంగా నెరవేరుతాయి. అలాగే వీరు కొత్త శాశ్వతమైన ఆదాయ మార్గాలు కూడా పొందగలుగుతారు. చాలాకాలంగా నిలిచిపోయిన డబ్బులు కూడా తిరిగి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులకు విశేషమైన ధన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ల నుంచి డబ్బులు పొందడమే కాకుండా స్నేహపూర్వకమైన సంబంధాలు పొందగలుగుతారు. అలాగే కొత్త ప్రాజెక్టులు ఒప్పందాలు కూడా జరుగుతాయి.

కన్య రాశి 
కన్యా రాశి వారికి పదవ స్థానంలో సరస్వతి యోగం ఏర్పడడం కారణంగా వ్యాపారంతో పాటు ఇతర రంగాల్లో ఎంతో మేలు జరుగుతుంది.. ముఖ్యంగా వీరికి కోరుకున్న కోరికలు చాలా కాలం తర్వాత నెరవేరబోతున్నాయి.. పనుల్లో ప్రశంసలు కూడా లభిస్తాయి.. దీంతో పాటు అధికారుల నుంచి అద్భుతమైన సపోర్టు లభించి విశేషమైన ధన లాభాలు పొందుతారు ఏవైనా కొత్త పనులు ప్రారంభించాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. వ్యాపార ఒప్పందాలు ఖరారు కావడమే కాకుండా వ్యాపార విస్తరణ కూడా జరుగుతుంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Vaibhav Suryavanshi: ఆరెంజ్ క్యాప్‎తో కన్నీళ్లు దాచుకుంటూ...గ్రౌండ్‌లోనే వెక్కివెక్కి ఏడ్చిన వైభవ్.. గుండెల్ని పిండేస్తున్న సీన్ ఇది..!!

BBhoomi8h ago
Lakshmapur, Telangana:

Vaibhav Suryavanshi: మే 29వ తేదీ శుక్రవారం ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 2 మ్యాచులో గుజరాత్ టైటాన్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్ లో ఆ జట్టు ఐపీఎల్ జర్నీ అత్యంత బాధాకరంగా ముగిసిందనే చెప్పాలి. మ్యాచ్ ముగిసిన వెంటనే ఆ ఓటమి తాలుకా బాధ 15ఏండ్ల వైభవ్ సూర్యవంశీ ముఖంలో కనిపించింది. గుజరాత్ విజయం ఖరరాైన కొన్ని నిమిషాలకే.. వైభవ్ రాజస్థాన్ డకౌట్ లో ఒంటరిగా కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చాడు. తనలో తాను బాధను దిగమింగుకున్నాడు. మొదట తన ఆరెంజ్ క్యాప్ తో కన్నీళ్లు దాచుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఓటమిని తట్టుకోలేక ముఖానికి టవల్ అడ్డుపెట్టుకుని బోరున విలపించాడు. ఈ ఒత్తిడితో కూడిన నాకౌట్ మ్యాచులోనూ ఈ చిన్నోడు అద్బుత ఇన్నింగ్స్ ఆడినా.. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చివరకు తీవ్ర నిరాశే మిగిలింది. 

ఎస్ఆర్ హెచ్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో 97 పరుగులతో చెలరేగిపోయిన వైభవ్.. గుజరాత్ తో జరిగిన ఈ మ్యాచులోనూ అదే జోరును కొనసాగించాడు. భయం లేని బ్యాటింగ్ చేస్తూ అందర్నీ ఆకట్టుకున్నాడు. యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ వికెట్లను ప్రారంభంలోనే కోల్పోయి.. తీవ్ర ఇబ్బందుల్లో పడ్డా... ఈ బుడతడి సంచలనం ఎదురుదాడికి దిగి ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. ఒకానొక దశలో రాజస్థాన్ తక్కువ పరుగులకే కుప్పకూలినట్లు కనిపించినా.. వైభవ్ మిడిల్ ఓవర్ లో గేర్ మార్చాడు. ఓవైపు వికెట్లు పడుతును్నా.. ఏమాత్రం భయపడకుండా సంయమానం పాటించాడు. గుజరాత్ బౌలింగ్ అటాన్ కు తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేశాడు. 18 ఓవర్ లో కాగిసో రబడా వేసిన షార్ట్ డెలివరీకి వైభవ్ వెనుతిరిగాడు. 

Also Read: RBI Polymer Notes: త్వరలోనే మార్కెట్లోకి సరికొత్త ప్లాస్టిక్ కరెన్సీ

కేవలం 47 బంతుల్లోనే 96 పరుగులు  చేసి పెవిలియన్ బాట పట్టాడు. వైభవ్ ఆడిన చివరి నాలుగు ఐపీఎల్ ఇన్నింగ్స్ లో సెంచరీ మార్కును చిటికెలో చేజార్చుకోవడం ఇది మూడోసారి. కేవలం 4 పరుగుల తేడాతో మరోసారి సెంచరీని అందుకోలేకపోయాడు. ఆ బాధ వైభవ్ ముఖంలో కనిపించింది. దీంతో ఎంతో నిరాశగా, మైదానాన్ని విడిచిపెట్టాడు. 

Also Read: 10వ తరగతి పాసైన మహిళలకు ఎల్‌ఐసీ బంపర్ ఆఫర్.. ఇంట్లోనే ఉంటూ నెలకు రూ .7,000

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
0
Report

RBI Warning Fake Notes: రూ. 500 నోట్లపై ఆర్బీఐ బిగ్ అలర్ట్.. కీలక విషయం వెల్లడించిన రిజర్వ్ బ్యాంక్..!!

BBhoomi9h ago
Lakshmapur, Telangana:

RBI Warning Fake Notes: 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశంలో రూ. 500 నోట్ల చలామణి 11.2 శాతం పెరిగి.. , కరెన్సీ వ్యవస్థలో అతిపెద్ద వాటాను నిలుపుకుంది. అయితే, ఈ డినామినేషన్‌లో నకిలీ నోట్ల కేసులు కూడా వేగంగా పెరిగాయి. ఈ సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  వార్షిక నివేదికలో వెల్లడించింది. శుక్రవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఏడాది క్రితం 6,34,458 లక్షలుగా ఉన్న రూ. 500 నోట్ల సంఖ్య, మార్చి 2026 చివరి నాటికి 7,05,482 లక్షలకు పెరిగింది. విలువ పరంగా చూస్తే, ఈ నోట్ల మొత్తం చలామణి గత ఆర్థిక సంవత్సరంలో రూ. 31.72 లక్షల కోట్లుగా ఉండగా, ఇప్పుడు అది రూ. 35.27 లక్షల కోట్లకు చేరుకుంది.

చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో రూ. 500 నోట్ల వాటా అత్యధికంగా 41.2 శాతంగా ఉందని ఆర్‌బిఐ తెలిపింది. విలువ పరంగా చూస్తే, వాటి వాటా 86 శాతానికి పైగా ఉంది. అయితే, ఇదే కాలంలో గుర్తించిన నకిలీ రూ. 500 నోట్ల సంఖ్య 20 శాతానికి పైగా పెరిగింది. మొత్తమ్మీద, బ్యాంకింగ్ వ్యవస్థలో గుర్తించిన నకిలీ నోట్ల సంఖ్య గత ఏడాది 217,396 నుండి 2025-26 నాటికి 5.7 శాతం పెరిగి 229,746కు చేరింది. వీటిలో, ₹500 నోట్ల సంఖ్య అత్యధికంగా 141,907కు చేరుకుంది.

నకిలీ కరెన్సీ కేసుల పెరుగుదల:
రూ. 20 నకిలీ నోట్లలో కూడా గణనీయమైన పెరుగుదల కనిపించగా, రూ. 100, రూ. 50, రూ. 200 నకిలీ నోట్లు తగ్గుముఖం పట్టాయని నివేదిక పేర్కొంది. రూ. 2,000 నోట్ల రద్దు కూడా ఈ డినామినేషన్‌లో నకిలీ నోట్లను గణనీయంగా తగ్గించింది. ఆర్‌బిఐ ప్రకారం, 2025-26లో చలామణిలో ఉన్న నోట్ల పరిమాణం 10.5 శాతం, విలువ 11.9 శాతం పెరిగాయి. ఇది ఆర్థిక వ్యవస్థలో నగదుకు ఉన్న బలమైన డిమాండ్‌ను ప్రతిబింబిస్తుంది.

Also Read: 10వ తరగతి పాసైన మహిళలకు ఎల్‌ఐసీ బంపర్ ఆఫర్.. ఇంట్లోనే ఉంటూ నెలకు రూ .7,000

ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా రూ. 2000 నోట్ల ఉపసంహరణ కొనసాగుతుంది:
2023 మేలో ప్రారంభమైన రూ. 2,000 నోట్ల ఉపసంహరణ ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగిందని నివేదిక పేర్కొంది. 2026 మార్చి నాటికి, ఈ డినామినేషన్‌లోని మొత్తం నోట్లలో 98.45 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి. నాణేలలో కూడా పెరుగుదల కనిపించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో, మొత్తం నాణేల సంఖ్య 4.5 శాతం, వాటి విలువ 11.4 శాతం పెరిగింది. మొత్తం నాణేలలో దాదాపు 80 శాతం వాటా ఒకటి, రెండు, ఐదు రూపాయల నాణేలదే.

గత ఏడాదితో పోలిస్తే 2025-26లో నోట్ల ముద్రణకు డిమాండ్ తక్కువగా ఉందని, దీని ఫలితంగా ముద్రణ వ్యయం గత ఏడాది రూ.6,379 కోట్ల నుండి రూ. 4,875 కోట్లకు తగ్గిందని ఆర్‌బిఐ తెలిపింది. అధిక విలువ గల నోట్ల ముద్రణకు డిమాండ్ తగ్గగా, చిన్న విలువ గల నోట్లకు పెరుగుతున్న అవసరాన్ని ప్రతిబింబిస్తూ రూ. 10 నోట్ల ముద్రణ పెరిగింది. అంతేకాకుండా, పాడైన నోట్ల పారవేయడం కూడా సుమారు 28.6 శాతం తగ్గింది.

రియల్, ఫేక్ రూ. 500 నోట్లను ఎలా గుర్తించాలి? 

ఆర్బిఐ తెలిపిన వివరాల ప్రకారం.. అసలైన రూ. 500 నోట్లలో పలు సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. అందులో

-మహాత్మాగాంధీ ఫొటో

-సెక్యూరిటీ థ్రెడ్

-రంగే మారే సిరా

-వాటర్ మార్క్

ఉబ్బుగా ఉండే ప్రింటింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఇందులో ఉంటాయి. నోటు కలర్, కాగితం క్వాలిటీ లేదా ప్రింటింగ్ లో ఏవైనా అనుమాస్పద మార్పులు కనిపించినట్లయితే వెంటనే జాగ్రత్త పడాలని ఆర్బిఐ సూచిస్తోంది. 

Also Read: RBI Polymer Notes: త్వరలోనే మార్కెట్లోకి సరికొత్త ప్లాస్టిక్ కరెన్సీ

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Gold Rate Today: బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. తగ్గుతున్నపసిడి ధరలు.. నేడు మే 30వ తేదీ హైదరాబాద్, విజయవాడలో ధరలు ఇవే..!!

BBhoomi9h ago
Lakshmapur, Telangana:

Gold Rate Today: బంగారం కొనాలనుకునేవారికి ఊరట కలిగించే విషయం. బంగారం ధరలు గత రెండు మూడు రోజులుగా భారీగా తగ్గుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అటు విజయవాడలోనూ తగ్గాయి. 10 గ్రాముల స్వచ్చమైన 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,56,060 పలుకుతుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ. 1,43,050 వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 1,17,040 వద్ద ఉంది. బంగారంతోపాటు వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర ప్రస్తుతం రూ. 2,84,900 రూపాయలు పలుకుతోంది.

ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర రూ. 1.62 లక్షలకు చేరింది. ఇదిలా ఉండగా, ఎంసీఎక్స్ లో 24-క్యారెట్ల బంగారం ఫ్యూచర్స్ ధర ఈ ఉదయం 0.59శాతం లేదా రూ. 925 తగ్గి, 10 గ్రాములకు రూ. 1,56,000కు చేరింది. గత ట్రేడింగ్ రోజున ఇది 10 గ్రాములకు రూ. 1,56,925 వద్ద ముగిసింది. గుడ్‌రిటర్న్స్ ప్రకారం, 24-క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,57,790కి పెరిగింది. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి ఇది 10 గ్రాములకు రూ. 1,56,463కి చేరుకుంది. 

24 క్యారెట్ల (999) బంగారం 10 గ్రాములకు రూ. 156463

23 క్యారెట్ల (995) బంగారం 10 గ్రాములకు రూ. 155836

22 క్యారెట్ల (916) బంగారం 10 గ్రాములకు రూ. 143320

18 క్యారెట్ల (750) బంగారం 10 గ్రాములకు రూ. 117347

14 క్యారెట్ల (585) బంగారం 10 గ్రాములకు రూ. 91531

అమెరికా-ఇరాన్ ఒప్పందం త్వరగా కుదిరే అవకాశం, దేశీయ మార్కెట్లో పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ అంచనాల కారణంగా, శుక్రవారం జాతీయ రాజధాని బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,600 పెరిగి రూ.1.62 లక్షలకు చేరింది. స్థానిక మార్కెట్ నిపుణుల ప్రకారం, 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం ధర  10 గ్రాములకు రూ.1,600 పెరిగి రూ.1,62,900కు చేరింది. ఈద్-ఉల్-అజ్హా పండుగ కారణంగా గురువారం బులియన్ మార్కెట్లు మూసిఉన్నాయి. బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,300గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో, స్పాట్ గోల్డ్ ధర దాదాపు ఒక శాతం పెరిగి ఔన్సుకు $4,530.72కు చేరింది.

స్పాట్ డిమాండ్ బలహీనంగా ఉండటం.. స్పెక్యులేటర్లు తమ డీల్స్ పరిమాణాన్ని తగ్గించుకున్నారు. దీని కారణంగా శుక్రవారం ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 259 మేర తగ్గి రూ. 62,507కి పడిపోయింది. ఎంసీఎక్స్ లో జూన్ డెలివరీ కాంట్రాక్ట్ ధర 10 గ్రాములకు రూ. 259 లేదా 0.17 శాతం తగ్గి రూ. 1,56,666కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా, న్యూయార్క్‌లో బంగారం ధర 0.28 శాతం పెరిగి ఔన్సుకు $ 4,508కి చేరింది. స్పాట్ డిమాండ్ బలహీనంగా ఉండటం వల్లే బంగారం ఫ్యూచర్స్ ధరలు పడిపోయాయని మార్కెట్ నిపుణులు తెలిపారు.

అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణకు సంబంధించిన పరిణామాలు, ఇటీవలి ద్రవ్యోల్బణ గణాంకాల నేపథ్యంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై వెలువరించిన అంచనాలే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. దేశీయ మార్కెట్లో పెళ్లిళ్లకు డిమాండ్ ఉంటుందనే అంచనాల కారణంగా ఈ విలువైన లోహాల ధరలు బలంగా నిలబడ్డాయని అన్నారు. మార్కెట్ మౌలిక అంశాలు ధరలకు మద్దతునిస్తూనే ఉన్నందున, సమీప భవిష్యత్తులో చెప్పుకోదగ్గ అమ్మకాల ఒత్తిడిని తాము చూడటం లేదని  చెప్పారు.  సేఫ్ హెవెన్  డిమాండ్, పారిశ్రామిక రంగ అవకాశాల మద్దతుతో వెండి కూడా బంగారం ధోరణినే అనుసరించే అవకాశం ఉంది.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top