icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505307
Bandi SrikanthBandi SrikanthFollow22 Jul 2024, 12:45 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Cobra Video: స్నానం చేసి ప్యాంట్ వేసుకున్నాడు.. కట్ చేస్తే జేబులో కింగ్ కోబ్రా.. వీడియో..

Hyderabad, Telangana:

  Baby King Cobra In Pocket Viral Video Watch: మనం రోజు వేసుకునే దుస్తుల్లోకి పాము దూరితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటూనే ఎంతో భయం కలుగుతుంది.. సరిగ్గా అలాంటి ఘటనే ఒక యువకుడికి ఎదురైంది.. స్నానం ముగించుకొని ప్యాంట్ వేసుకున్న ఒక యువకుడి జేబులో ఏకంగా ప్రమాదకరమైన కింగ్ కోబ్రా పిల్ల దర్శనం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, ఆ పాము అతడు జేబులోకి ఎలా వచ్చింది? అతను ఎలా గుర్తించాడు? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

అసలు ఏం జరిగిందో తెలుసా?
వైరల్ అవుతున్న వీడియో వివరాల ప్రకారం.. ఒక యువకుడు ఉదయాన్నే స్నానం పూర్తిచేసుకుని.. పక్కన ఉన్న ప్యాంటును తీసుకొని వేసుకున్నాడు. అయితే ప్యాంటు వేసుకున్న కొద్దిసేపటికే జేబు భాగంలో ఏదో కదులుతున్నట్టు అతడికి అనిపించింది.. అనుమానంతో ప్యాంటు ప్యాకెట్ సైడ్ పరిశీలించగా.. అందులో ఒక చిన్న నాగుపాము పిల్ల నక్కి ఉండటం చూసి అతడు ఒక్కసారిగా షాక్ గురయ్యాడు.. భయంతో వణికి పోతున్నప్పటికీ.. సదర్ యువకుడు ఏమాత్రం కంగారు పడకుండా.. చాకచక్యంగా వ్యవహరించాడు.. వెంటనే స్నేక్ క్యాచర్స్‌కి సమాచారం అందించారు..

 
 
 
 
 
 

సురక్షితంగా బయటకు తీసిన స్నేక్ క్యాచర్..
సమాచారం అందుకున్న వెంటనే స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకొని.. ఆ యువకుడి ప్యాంటులో ఉన్న నాగుపాముని పరిశీలించి చూసాడు. అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. ప్యాంట్ జేబును ఒక చిన్న కర్ర సహాయంతో తెరిచి.. అందులో ఉన్న చిన్న నాగుపాము పిల్లను బయటికి ఎలా తీసుకురావాలని పరిశీలించి చూసాడు.. వెంటనే ఆ స్నేక్ క్యాచర్.. జేబుపై భాగం కదిలించగానే అందులో నుంచి నాగుపాము పిల్ల బయటికి వచ్చేసింది.. వెంటనే అతను దాని తలభాగాన్ని పట్టుకొని.. జేబులో నుంచి బయటికి తీసేసాడు. 

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

నెటిజన్లు హడల్.. 
ఈ షాకింగ్ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు భయాందోళనలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు.. ఇకపై బట్టలు వేసుకునే ముందు 100 సార్లు చెక్ చేసుకోవాలి.. అంటూ కొంతమంది కామెంట్ పెడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంతో పాటు ఎండాకాలం ఎక్కువగా ఉన్న రోజుల్లో చల్లదనం కోసం పాములు ఇళ్లలోకి, ఆరుబయట ఆరేసిన బట్టల్లోకి, బూట్లలోకి నక్కుతాయని.. కాబట్టి ప్రజలు వీటిని ధరించే క్రమంలో తప్పకుండా ఒకటికి రెండుసార్లు దులపడం మంచిదని.. దులిపిన తర్వాత చెక్ చేసుకోవడం మరింత మంచిదని వన్యప్రాణి సంరక్షకులు సూచిస్తూ ఉన్నారు.

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

  

  

0
0
Report

Nagamani Video: వామ్మె.. నాగమణికి నాలుగు నాగుపాముల పహారా.. వీడియో ఇదే..

Hyderabad, Telangana:

Nagamani Viral Video Watch: పురాణాలతో పాటు జానపద కథల్లో మనం ఎంతో ఆసక్తిగా విన్న నాగమణి గురించి చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ ఊపందుకుంది. అత్యంత అరుదైన, పవిత్రమైన నాగమణిని పోలిన ఒక వస్తువుకు.. నాలుగు ప్రమాదకరమైన నాగుపాములు చుట్టూ ముట్టి రక్షణగా నిలిచినట్లు ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వింత దృశ్యం చూసి చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. కొంతమంది అయితే ఈ వీడియో చూసి ఆ నాలుగు పాములు నిజమైన నాగమణికి కాపలాక ఉన్నాయా.? లేదా ఇది ఫేక్ వీడియోనా అని కామెంట్లు చేస్తూ వస్తున్నారు..

పురాణాల్లో నాగమణి విశిష్టత..
మన పురాణాల ప్రకారం.. నాగమణి అనేది కేవలం కొన్ని వందల ఏళ్ల వయస్సున్న విశిష్టమైన సర్పాల తల భాగంలో మాత్రమే పెరుగుతుందని నమ్ముతూ ఉంటారు.. పూర్వకాలంలో ఈ మనీని కేవలం చక్రవర్తులతో పాటు రాజులు మాత్రమే ధరించే వారని కథలు ఉన్నాయి.. నాగమణి ధరించిన వారికి ఊహించని విజయాలు దక్కుతాయని.. సకల ఐశ్వర్యాలు కలుగుతాయని.. ఎలాంటి ప్రాణాపాయం జరగదని నాటి ప్రజల బలమైన నమ్మకం.. ఈ నేపథ్యంలోనే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో వెలుగులు చిమ్ముతున్న ఒక మని చుట్టూ నాలుగు నాగు పాములు పడగవిప్పి పహార కాస్తున్నట్లు కనిపించడం తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

3D గ్రాఫిక్స్?
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో పై సోషల్ మీడియా వినియోగదారులు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు దీనిని దైవిక శక్తులకు నిదర్శనం అని నమ్ముతుండగా.. మెజారిటీ సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం ఇదంతా ఫేక్ అని కొట్టి పారేస్తున్నారు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టూల్స్ లేదా 3dడీ గ్రాఫిక్స్ సహాయంతో ఈ వీడియోను తయారు చేశారని సాధారణ పాముల వీడియోలకు డిజిటల్ లైటింగ్ తో కూడిన మణిని జోడించి.. ప్రజలను భ్రమల్లోకి నెడుతున్నారని కొంతమంది టెక్నాలజీ తెలిసిన నిపుణులు చెబుతున్నారు..

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

సైన్స్ చెబుతుంది ఇదే..
జీవశాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. పాములు తలపై ఎలాంటి మణులు లేదా రత్నాలు పెరగవని.. పాము తలభాగం పై ఉండే చర్మం లేదా ఎముకల నిర్మాణం సాధారణ జంతువుల లాగే ఉంటుందని.. కేవలం సోషల్ మీడియాలో వ్యూస్‌తో పాటు లైకుల కోసం కొందరు ఇలాంటి గ్రాఫిక్స్ వీడియోలను సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని నిపుణులు హెచ్చరిస్తూ వస్తున్నారు.. సాధారణంగా ఆర్టిఫిషియన్ ఇంటిలిజెన్సీ వచ్చిన తర్వాత ఇలాంటి వీడియోల సంఖ్య పెరుగుతూ వస్తోందని వారు చెబుతూ ఉన్నారు..

 
 
 
 
 

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

 

0
0
Report

Cobra Selfie Video: చావుతో చెలగాటం.. నాగుపాముతో సెల్ఫీ.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్!

Hyderabad, Telangana:

 Vava Suresh Cobra Selfie Video Watch Now: సోషల్ మీడియాలో లైకులతో పాటు వ్యూస్ కోసం సోషల్ మీడియా వినియోగదారులు రకరకాల విన్యాసాలు చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఏకంగా చావుతో చెలగాటమాడుతూ ఒక భయంకరమైన నాగుపాముతో సెల్ఫీ దిగితే ఎలా ఉంటుందో ఊహించడానికే భయం వేస్తుంది కదా.. గతంలో కేరళకు చెందిన ప్రముఖ స్నేక్ క్యాచర్ వావ సురేష్ అత్యంత ప్రమాదకరమైన పాముతో సెల్ఫీ దిగిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియోను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. 

ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యం..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. వావ సురేష్ ఒక పెద్ద నాగుపామును రక్షించి చేత్తో పట్టుకొని ఉండటం మీరు క్లియర్ గా చూడొచ్చు. అయితే ఎవరు ఊహించని విధంగా ఆయన ఒక చేతితో విషాదం నడుము భాగాన్ని పట్టుకొని.. మరో చేతితో తన మొబైల్ ఫోన్ను పట్టుకొని ఉన్నారు.. అంతటితో ఆగకుండా.. ఆ పామును నెమ్మదిగా తన ముఖం దగ్గరకు.. తలభాగం వైపుకు తీసుకువచ్చారు.. ఆ పాము ఎప్పుడు కాటేస్తుందో తెలియని అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఆయన ఎంతో కూల్ గా నాగుపాముతో సెల్ఫీ దిగాడు.. ఈ ఊహించని దృశ్యాన్ని చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు..

ఇదే సమయంలో అక్కడున్న కొంతమంది ఈ దృశ్యాన్ని తమ స్మార్ట్ ఫోన్స్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే అప్పటినుంచి వైరల్ అవుతూ వస్తోంది. అయితే ఈ వీడియో పాతదే అయినప్పటికీ తాజాగా సోషల్ మీడియాలో మాత్రం రీ పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతుంది. షేర్ చేసిన కొద్ది రోజుల్లోనే లక్షలాది వ్యూస్ ను సంపాదించింది. సురేష్ ధైర్యాన్ని చూసి కొందరు సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. వన్యప్రాణి ప్రేమికులతో పాటు నెటిజన్లలోని మెజారిటీ వర్గం మాత్రం ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

 
 
 
 
 

వావ సురేష్ గతంలో ఎన్నోసార్లు పాముకాటుకు గురై ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాకుండా అతను పాముకాటుకు గురైన సందర్భానికి సంబంధించిన వీడియోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి మనందరికీ తెలుసు. అంత అనుభవం ఉండి కూడా.. కేవలం సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం ఇలాంటి ప్రాణాంతక విన్యాసాలు చేయడం అస్సలు మంచిది కాదని.. ఇది చూసి వేరే వాళ్ళు కూడా ఇలాగే ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు హెచ్చరిస్తూ వస్తున్నారు.

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

  

0
0
Report
Advertisement

Jagtial: జగిత్యాల డిపోలో అద్దె బస్సు డ్రైవర్ల మెరుపు ధర్నా.. నిలిచిన సర్వీసులు..

Hyderabad, Telangana:

Jagtial RTC Bus Drivers Strike: జగిత్యాల ఆర్టీసీ డిపోలో అద్దె బస్సు డ్రైవర్లు ఒక్కసారిగా ఆందోళన బాట పట్టారు.. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిపో ఎదుట మెరుపు ధర్నాకు దిగారు. డ్రైవర్లు హఠాత్ నిర్ణయంతో అద్దె బస్సులన్ని డిపోకే పరిమితం అవడంతో రవాణా రవాణా వ్యవస్థ పై తీవ్ర ప్రభావం పడింది.. ముఖ్యంగా జగిత్యాల్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులన్నీ ఆగిపోయినట్లు తెలుస్తోంది. దీంతో చాలామంది ప్రయాణికులు బస్టాండ్ కి పరిమితమైనట్లు సమాచారం. అసలు ఈ ధర్నాకు గల కారణాలేంటి? వారి డిమాండ్ లేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

అధికారుల ఏకపక్ష నిర్ణయాలపై..
ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న డ్రైవర్లు ఆర్టీసీలోని కొందరు అధికారులు తీరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.. డిపోలోని కొందరు ఉన్నతాధికారులు బస్సు యజమానులతో చేతులు కలిపి.. వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చిన్న చిన్న కారణాలను సాకుగా చూపిస్తూ.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా డ్రైవర్లను విధుల్లోంచి పక్కన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యాల ఒత్తిళ్లకు లొంగి అధికారులు తమ పొట్ట కొడుతున్నారని.. డ్రైవర్ల హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తుతూ వస్తున్నారు. అధికారులతో పాటు యజమానులు కలిపి వారిని కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. విధుల నుంచి తొలగించిన డ్రైవర్లను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని.. అప్పటివరకు వారి పోరాటం ఆగదని బస్ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

స్తంభించిన రవాణా..
అద్దె బస్సుల డ్రైవర్లు విధులను బహిష్కరించి నిరసనలకు దిగడంతో జగిత్యాల బస్టాండులో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే సర్వీసులతో పాటు పలు సుదూర ప్రాంతాల బస్సులు నిలిచిపోయాయి.. దీనితో ప్రయాణికులతో పాటు ముఖ్యంగా మహిళలు వృద్ధులు విద్యార్థులు బస్టాండ్లలో గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ఆర్టీసీ అధికారులు విఫలమయ్యారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. తమకు ఉద్యోగ భద్రతను కల్పించాలని.. అధికారుల వేధింపులు ఆపాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.. 

న్యాయమైన సమస్యలను పరిష్కరించే వరకు అద్దె బస్సులను నడిపించేది లేదని.. ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి చర్చలు జరిపాలని.. డ్రైవర్లకు న్యాయం చేయాలని స్థానికులు సైతం కోరుతున్నారు. ఉద్యోగ భద్రతతో పాటు వేధింపులు ఆపే వరకు అసలు బస్సులు కదలవని డ్రైవర్లు చెబుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పుడు సాధారణ ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డ్రైవర్లతో చర్చలు జరిపి ఈ సమస్యలను పరిష్కరించుకోవడం చాలా మేలని కొంతమంది కార్మిక సంఘానికి సంబంధించిన నాయకులు చెబుతూ వస్తున్నారు..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Samsung Galaxy A27 ఫోన్‌ ధర, ఫీచర్స్‌ లీక్‌.. రూ. 25 వేల బడ్జెట్లో సూపర్ కెమెరా 5G ఫోన్!

Hyderabad, Telangana:

Samsung Galaxy A27 Price Leaked Ahead of Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం సాంసంగ్ తన గెలాక్సీ A సిరీస్‌లో మరో కొత్త మోడల్ ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. సాంసంగ్ గెలాక్సీ A27 పేరుతో మార్కెట్లోకి మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ అధికారికంగా విడుదల కావడానికి ముందే దీనికి సంబంధించిన కీలక వివరాలతో పాటు కొన్ని ఫీచర్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రముఖ గ్యాడ్జెట్స్ వెబ్‌సైట్ కథనాల ప్రకారం.. ఈ ఫోన్ ధరతో పాటు డిజైన్, కెమెరా వివరాలు, ప్రాసెసర్ కు సంబంధించిన వివరాలు ఆన్లైన్‌లో లీకయ్యాయి.. వీటన్నిటికీ సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

లీకైన ధరల వివరాలు..
సాంసంగ్ కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని అత్యంత రీజనబుల్ ధరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం సాంసంగ్ గెలాక్సీ ఏ 27 భారత మార్కెట్లో సుమారు రూ.22 వేల నుంచి రూ.25 వేల బడ్జెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇది విభిన్న స్టోరేజ్ వేరియంట్లను బట్టి ధరల్లో స్వల్ప మార్పులను కలిగి ఉంటుందని తెలుస్తోంది..

ఇటీవల సోషల్ మీడియాలో లీకైన వివరాల ప్రకారం.. ఈ మొబైల్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ ప్లస్ (FHD+) అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లేను  కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది గేమింగ్, వీడియో స్ట్రీమింగ్‌కు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. అంతేకాకుండా మల్టీటాస్కింగ్, వేగవంతమైన పనితీరు కోసం  సాంసంగ్ ఇందులో శక్తివంతమైన ఆక్టా-కోర్ ఎక్సీనోస్ (Exynos) లేదా మీడియాటెక్ డైమెన్సిటీ సిరీస్ 5G ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు సమాచారం. అలాగే ఫోటోగ్రఫీ ప్రియుల కోసం వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ (OIS సపోర్ట్‌తో) ఉండే అవకాశం  ఉందని లీకైన వివరాలు చెబుతున్నాయి.. అలాగే సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు. రోజంతా నిరంతరాయంగా పనిచేసేందుకు వీలుగా ఇందులో 5,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని  కూడా అందిస్తున్నారు. ఇది 25W వేగవంతమైన ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని లీకైన వివరాలు చెబుతున్నాయి. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

అధికారికంగా లాంచ్ డేట్ అప్పుడే..
ఈ స్మార్ట్‌ఫోన్‌ సరికొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో సామ్సంగ్ సొంత One UI యూజర్ ఇంటర్‌ఫేస్‌తో అందుబాటులోకి రాబోతోంది. సెక్యూరిటీ పరంగా ఇండిపెండెంట్ సెన్సార్‌తో పాటు చాలా ప్రత్యేకమైన నాక్స్ సెక్యూరిటీ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే అధికారికంగా samsung galaxy a27 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. అద్భుతమైన కెమెరాతో పాటు డిస్ప్లే కలిగిన బడ్జెట్ ఫోన్ కోసం చూసేవారికి ఇది ఒక మంచి ఆప్షన్ గా భావించవచ్చు..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

CCTV Video: చార్జింగ్ పెట్టలేదు, వేడి కాలేదు.. అయినా జేబులోనే పేలిపోయిన ఫోన్!

Hyderabad, Telangana:

 Mobile Phone Explodes CCTV Video: స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులను వనికించే మరో ఘోర ప్రమాదం వెలుగు చూసింది. ప్యాంట్ జేబులో పెట్టుకున్న మొబైల్ ఫోన్ ఒక్కసారిగా బాంబుల పేలడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.. ఈ నమ్మలేని ఘటన రాజస్థాన్‌లోని జోధ్పూర్ నగరంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.. 

ఏం జరిగిందో తెలుసా? 
జోధ్‌పూర్‌కు చెందిన గోపాల్ సోనీ అనే స్థానిక వ్యాపారి ఎప్పటిలాగే తన దుకాణంలో పనుల్లో నిమగ్నం అయిపోయాడు.. ఆ సమయంలోనే ఆయన ప్యాంట్ జేబులో ఉన్న మొబైల్ ఫోన్ నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు రావడం ప్రారంభమయ్యాయి. జేబులో ఏదో కాలుతున్నట్లు గమనించిన గోపాల్.. కంగారుగా ఫోనును బయటకు తీసేందుకు ప్రయత్నించాడు.. కానీ ఆయన చేతిలోకి తీసుకునే లోపలే ఆ ఫోన్ పెద్ద శబ్దంతో సడన్గా పేలిపోయింది. 

ఈ ఆకస్మిక పేలుడు కారణంగా గోపాల్ తొడ భాగంతో పాటు ఫోన్ తీయడానికి ప్రయత్నించిన చేతి వేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.. దుకాణంలో ఉన్న మిగతావారు వెంటనే స్పందించి ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లు వైద్యులు తెలిపారు.. అంతేకాకుండా కొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అవుతుందని వివరించారు.

సాధారణ ఫోన్లు ఓవర్ హీట్ అవ్వడం వల్లనో.. లేదా చార్జింగ్ పెట్టి మాట్లాడడం వల్లనో పేలుతూ ఉంటాయి. కానీ ఈ ఘటన ఎలాంటి ముందస్తు సంకేతాలు లేవని బాధితుడు గోపాల్ తెలిపారు.. అతను రెండేళ్ల క్రితం వివో కంపెనీకి చెందిన ఫోన్ కొన్నారని.. ప్రమాదం జరగడానికి ముందు ఫోన్ అసలు వేడి కాలేదని.. కనీసం చార్జింగ్ కూడా పెట్టలేదని జేబులో ఉన్నప్పుడు 87 శాతం బ్యాటరీ ఉందని.. అందులో నుంచి పొగలు వస్తాయని అస్సలు ఊహించలేదని తెలిపారు..

 
 
 
 
 

ఈ ఘటనపై టెక్ నిపుణులు స్పందిస్తూ.. ఒక్కొక్కసారి లిథియం అయాన్ బ్యాటరీలపై ఒత్తిడి పడడం వల్ల కానీ.. లోపల షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల కానీ ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని.. కాబట్టి ఇలాంటి మొబైల్స్ వినియోగించేటప్పుడు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని తెలుపుతున్నారు. ఎంతో పాత ఫోన్ అయినా బ్యాటరీ ఉబ్బినట్లు అనిపించిన.. జేబులో గట్టిగా నలిగిన జాగ్రత్తగా ఉండాలి. బ్రాండెడ్ చార్జర్లను మాత్రమే వినియోగించాలని సూచిస్తున్నారు. కంపెనీ ఫోన్ జేబులోనే పేలిపోవడంతో స్థానిక వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

  

0
0
Report
Advertisement

Budha Gochar 2026: జూన్ 11న బుధుడి సంచారం.. ఈ 3 రాశుల వారికి దిమ్మతిరిగే ధన లాభం, బంపర్ జాక్‌పాట్!

Hyderabad, Telangana:

Budha Gochar 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారాలతో పాటు నక్షత్ర మార్పులకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే అవి ఒక వ్యక్తి జీవితంతో పాటు ఆలోచనలు విధిపై ప్రత్యక్షమైన ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. ముఖ్యంగా తెలివితేటలతో పాటు వాక్చాతుర్యం వ్యాపారానికి కారకుడిగా భావించే బుధుడు త్వరలో సంచారం చేయబోతున్నాడు. జూన్ 11వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో బుధుడు ఆరుద్ర నక్షత్రాన్ని వదిలిపెట్టి పునర్వాసు నక్షత్రంలోకి సంచారం చేస్తాడు. ఆ తర్వాత బుధుడు జులై 8వ తేదీ వరకు అదే నక్షత్రంలో ఉండి అనంతరం ఇతర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బుధుడు, గురుడు నక్షత్రంలోకి ప్రవేశించడం చాలా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. దీని కారణంగా కొన్ని రాశుల వారందరికీ పురోగతి లభించడమే కాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో వివిధ రాజయోగాలు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో ఆయారాశుల వారికి దిమ్మతిరిగే ధన లాభాలు కలుగుతాయి. అయితే, ఈ సమయంలో ఏ రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్ జాక్‌పాట్..
మిథున రాశి 
బుధ గ్రహం సంచారం కారణంగా మిథున రాశి వారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉండబోతుంది ముఖ్యంగా ఈ సమయంలో వీరి మానసిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఒత్తిడి కూడా తగ్గి ఆందోళన వంటి సమస్యలు దూరం అవుతాయి.. ముఖ్యంగా దీనివల్ల కొన్ని అద్భుతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వృత్తిలో అనేక మార్పులు రావడం కారణంగా విశేషమైన లాభాలు కూడా పొందగలుగుతారు. అలాగే ఆఫీసుల్లో ప్రశంసలు కూడా లభిస్తాయి. మీతోటి ఉద్యోగులతో సమన్వయంగా మెరుగ్గా ఉండగలుగుతారు. విద్యారంగంలో కూడా పురోగతికి సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా ప్రభుత్వ పని నిలిచిపోయి ఉంటే ఈ సమయంలో తప్పకుండా పూర్తవుతుంది. అలాగే వైవాహిక జీవితంలో మాధుర్యం కూడా కనిపిస్తుంది.

సింహరాశి 
సింహరాశిలో జన్మించిన వ్యక్తులందరికీ ఈ సమయంలో ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. విజయాలు పొందడమే కాకుండా సమాజంలో మంచి గౌరవాన్ని పొందగలుగుతారు. వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులందరికీ ఆకస్మిక ఆర్థికల లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే వివిధ రంగాల్లో పనులు చేస్తున్న ఉద్యోగస్తులకు తప్పకుండా ఈ సమయంలో విశేషమైన లాభాలు కలుగుతాయి. ఐటీ లేదా టెక్నాలజీ రంగాలకు చెందిన వారికి మంచి పదోన్నతులు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ జీవితంలో తోబుట్టులతో సంబంధాలు మెరుగుపడతాయి. కొంతమందికి ఈ సమయంలో విదేశాలకు వెళ్లే ఆఫర్స్ కూడా లభిస్తాయి.

తులారాశి 
తులారాశిలో జన్మించిన వ్యక్తులందరికీ జీవితంలో సామాజికంగా ఎంతో మేలు జరుగుతుంది. బుధుడు శక్తివంతమైన ప్రభావంతో మాటలకు ఆదరణ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా సామాజిక స్థాయిలో వీరికి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. రాజకీయ రంగాల్లో లేదా ఏదైనా సామాజిక రంగాల్లో చెరుకుగా ఉంటే ప్రజాదరణ కూడా విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా వృత్తి జీవితం కొనసాగిస్తున్న వ్యక్తులందరికీ అద్భుతమైన విజయాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగాలు లేదా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వ్యక్తులు తప్పకుండా ఈ సమయంలో విజయాలు సాధించగలుగుతారు. అలాగే మతపరమైన కార్యకలాపాలపై కూడా విపరీతమైన ఆసక్తి పెరుగుతుంది. ఈ సమయంలో ఆర్థికంగా కూడా ఎంతో బలపడతారు. కాబట్టి డబ్బులు కూడా ఎక్కువగా సంపాదించి బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకునే అవకాశాలు కలిగి ఉంటారు.

గమనిక.. ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలతో పాటు సమాచారం పై ఆధారపడి ఉంటుంది. దీనిని జీ తెలుగు న్యూస్ అస్సలు ధ్రువీకరించరు..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Kaal Sarp Yog: రాహు-కేతువుల సంచారంతో శక్తివంతమైన కాలసర్పదోషం.. జూన్ 23 వరకు ఆ రాశులకు కష్టాల కాలం..

Hyderabad, Telangana:

Powerful Kaal Sarp Yog Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాలసర్ప దోషాన్ని అత్యంత ప్రమాదకరమైన అశుభయోగంగా పరిగణిస్తూ ఉంటారు. అయితే పంచాంగం ప్రకారం 2026 సంవత్సరం జూన్ 9 నుంచి 23 మధ్య చంద్రుడితోపాటు రాహువు కేతువుల కలయిక జరగబోతోంది. దీని ఫలితంగానే కాలసర్పయోగం ఏర్పడింది. నిజానికి ఈ యోగానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. జాతకంలో ఈ యోగం ఏర్పడితే చాలా రాశుల వారికి ఎన్నో రకాల కష్టాలు కలుగుతాయి. ముఖ్యంగా జూన్ 9న చంద్రుడు కుంభరాశిలోకి ప్రవేశించడం కారణంగా అక్కడి ఇప్పటికే కేతువు గ్రహం సంచార దశలో ఉంది. ఆ తర్వాత రాహువు కలయిక కూడా జరగడం కారణంగా మొత్తం 14 రోజుల కాలంలో కొన్ని రాశుల వారికి మానసిక ఒత్తిడి పెరగడమే కాకుండా ఆర్థిక నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వృత్తిలో అనేక రకాల అడ్డంకులు ఎదురవుతాయి. అయితే ఈ కాలసర్పయోగంతో ఏ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్..
వృషభ రాశి 
వృషభ రాశి వారికి ఎంతో శక్తివంతమైన కాలసర్ప యోగం కారణంగా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వీరికి నాలుగవ స్థానంలో ఈ యోగం ఏర్పడడం వల్ల తల్లి ఆరోగ్యం క్షీణించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఆందోళన వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలున్నాయి. అలాగే కుటుంబంలో ఆస్తులకు సంబంధించిన తగాదాలు కూడా రావచ్చు. ముఖ్యంగా పూర్వీకుల ఆస్తులు లేదా ఇంటికి సంబంధించిన ఏవైనా ప్రధాన సమస్యలు ఉంటే శాంతియుతంగా చర్చించుకోవడం మంచిది. లేదంటే ఎన్నో రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా కొన్ని రకాల పనులను ఈ సమయంలో చేయకపోవడం మంచిది.

సింహరాశి 
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. భాగస్వామి పరంగా అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరి లగ్నంలో కేతు, ఏడవ స్థానంలో అహువు ఉండడం వల్ల తీవ్రమైన సైద్ధాంతిక విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న అనేక సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అలాగే ఎలాంటి కొత్త వ్యాపార ఒప్పందాలతో పాటు భాగస్వామ్య వ్యాపారాల్లోకి అడుగుపెట్టడం మంచిది కాదు. దీంతోపాటు అనుకున్న పనుల్లో ఆటంకాలు తీవ్రంగా ఎదురవుతాయి. 

వృశ్చిక రాశి 
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో అనేక రకాల అడ్డంకులు ఎదురవుతాయి. ముఖ్యంగా రాహువు కేతువు గ్రహాలు వీరికి నాలుగవ స్థానంలోకి రావడం వల్ల రాజకీయంగా ఉన్న వ్యక్తులకు కొన్ని రకాల సమస్యలు ఎదురవుతాయి. అలాగే మీకు వ్యతిరేకంగా పెద్ద పెద్ద కుట్రలు జరిగే అవకాశాలున్నాయి. ఉద్యోగాలు మారాలని ఆలోచిస్తున్న వ్యక్తులకు.. కాస్త ఈ సమయం నష్టాలను తెచ్చిపెట్టే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఇంట్లో అశాంతి వాతావరణం నెలకొంటుంది. అలాగే ఉద్యోగస్తులకు ఇతర ఉద్యోగస్తుల నుంచి అనేక సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

కుంభరాశి 
కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో ఆరోగ్యం చెరిపోవడమే కాకుండా.. ఆర్థికంగా అనేక నష్టానికి చవిచూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాలసర్పయోగంతో వ్యక్తిత్వం పై ఊహించని ప్రభావం పడుతుంది. అలాగే అకస్మాత్తుగా ఊహించని ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం కూడా చాలా వరకు క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరు ఈ సమయంలో గాయపడే ప్రమాదం కూడా ఉంది.. కాబట్టి వాహనాలు నడిపే క్రమంలో తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే క్రమంలో పెద్దలతో చర్చించి తీసుకోవడం మంచిది. లేదంటే తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Hyderabad Traffic: తొలి వానకే హైదరాబాద్ దిగ్బంధం.. రోడ్లపై నిలిచిన వాహనాలు

Hyderabad, Telangana:

Traffic Jam In IT Corridor: విశ్వనగరంగా గుర్తింపు పొందుతున్న హైదరాబాద్‌ ఒక్కవానకే వణికిపోయింది. అధికార యంత్రాంగం వైఫల్యంతో నగర ప్రజలు నరకం అనుభవించారు. వర్షం బీభత్సం సృష్టించడంతో నగరంపై వరదతోపాటు వాహనాల వరద కూడా కొనసాగింది. రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. నత్తకు పోటీపడుతూ నెమ్మదిగా కదిలాయి. నగరంలోని అన్నీ ప్రాంతాల్లో కుండపోత వర్షం పడడంతో హైదరాబాద్‌ చిగురుటాకులా వణికిపోయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Hyderabad Rain Tragedy: పాతబస్తీలో ఇద్దరు యువకులు మృతి.. హైదరాబాద్‌లో విషాదం మిగిల్చిన వర్షం

నగరానికి వన్నె తీసుకువస్తున్న ఐటీ ప్రాంతం వర్షంతో.. వాహనాలతో నిండిపోయింది. మాదాపూర్‌, రాయదుర్గం, ఐకియా చౌరస్తా, నిలోఫర్‌ కేఫ్‌, నాలెడ్జ్‌ సిటీ, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, కేబుల్‌ బ్రిడ్జి, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఇక పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్‌ ప్రాంతాలు వాహనాలతో కిటకిటలాడాయి. అటు మియాపూర్‌, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, జీడిమెట్ల, వై జంక్షన్‌ ప్రాంతాల్లో వాహనాలు నత్తతో పోటీపడుతూ మెల్లగా వెళ్తున్నాయి.

ఎందుకీ పరిస్థితి?
ఒక్క వర్షానికే హైదరాబాద్‌ అతలాకుతలం ఎందుకు అయ్యిందనే ప్రశ్న వ్యక్తమవుతోంది. కుండపోత వర్షం పడడంతో హైదరాబాద్‌లో ఎక్కడికక్కడ వరద రోడ్లపై నిలిచిపోయింది. కోటిన్నరకు పైగా జనాభా జీవించే ఈ నగరం ఒక్క వానకే ఇలా అయితే ఎలా అని హైదరాబాద్‌ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా వర్షాకాలం ప్రారంభానికి ముందే అధికార యంత్రాంగం అప్రమత్తం కావాల్సి ఉంది. లోతట్టు ప్రాంతాలు.. వరద నిలిచే ప్రాంతాల్లో మరమ్మతు పనులు, డ్రైనేజీల పూడికతీత, కాలువల పునరుద్ధరణ, ప్రమాదకరంగా ఉన్న చెట్లు కొట్టివేయడం.. జలాశయాల్లో చెత్తాచెదారం తీసేయడం.. డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించడం వంటివి చేయాల్సి ఉంది. కానీ వర్షాకాలం ప్రారంభమైన తర్వాత కూడా అధికార యంత్రాంగం మేల్కొనలేదు. ట్రాఫిక్ విభాగం, పోలీస్ వ్యవస్థ, మున్సిపల్ శాఖ, విద్యుత్ శాఖ, హైడ్రా తదితర విభాగాలు అప్రమత్తం కాకపోవడంతో తొలి వానకే హైదరాబాద్ ప్రజలు నరకం చవిచూశారు. ఇక రానున్న వర్షాకాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయోమోనని నగర ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో విషాదం నింపిన వర్షం.. పాతబస్తీలో ఇద్దరు మృతి

విద్యుత్‌ అంతరాయం
వర్షాకాలం ప్రారంభమే తొలి వాన దంచికొట్టింది. కుండపోత వర్షం పడడంతో హైదరాబాద్‌లో చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కొన్ని చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. మరికొన్ని చోట్ల విద్యుత్‌ తీగలు తెగి పడిపోయాయి. దీంతో పాతబస్తీలో ఇద్దరు మృతి చెందారు. ఇక వర్షం కారణంగా నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యానగర్‌, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు, స్టీల్‌ బ్రిడ్జి, ఇందిరాపార్క్, కవాడిగూడ, నారాయణగూడ, సుందరయ్య పార్కు, బర్కత్‌పుర తదితర ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల నుంచి దాదాపు 10.30 గంటలకు విద్యుత్‌ కోతలు వచ్చాయి. చెట్లు కూలడం.. ట్రాన్స్‌ఫార్మర్లు పేలడంతోనే విద్యుత్‌ అంతరాయం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు మరమ్మతు పనులు చేసి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు విద్యుత్‌ అధికారులు చెబుతున్నారు. అధికారులకు ఫోన్ చేసినా స్పందించడం లేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.

0
0
Report
Advertisement

Hyderabad Rain Tragedy: పాతబస్తీలో ఇద్దరు యువకులు మృతి. హైదరాబాద్‌లో విషాదం మిగిల్చిన వర్షం

Hyderabad, Telangana:

Hyderabad Rains: వేసవికాలం ముగిసిన తర్వాత వచ్చిన తొలి వర్షానికే హైదరాబాద్‌లో తీవ్ర విషాదం అలుముకుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం నగరంలోని అన్ని ప్రాంతాల్లో కురవడంతో హైదరాబాద్‌ అతలాకుతలమైంది. భారీ వర్షానికి అన్నీ ప్రాంతాలు తడిసి ముద్దవగా ఈ వర్షం ప్రభావంతో పలుచోట్ల విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. పాతబస్తీలోని ఓ ప్రాంతంలో ఇద్దరు యువకులు మృతిచెందగా.. మరికొన్ని చోట్ల చెట్లు కూలిపోగా.. ఒక చోట కమాన్‌ కుప్పకూలింది.

Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో విషాదం నింపిన వర్షం.. పాతబస్తీలో ఇద్దరు మృతి

హైదరాబాద్‌లో వర్షానికి విద్యుత్‌ తీగలు కిందపడడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. పాతబస్తీలోని బండ్లగూడలో ఉన్న రాయల్‌ సీ హోటల్‌ సమీపంలో వర్షానికి విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. అయితే ఆ విషయం తెలియని జాఫర్ (25), అబూ (16) అప్పుడే ఆటోలో నుంచి కిందకు దిగారు. దిగిన వారు నీళ్లలో పడి ఉన్న విద్యుత్‌ తీగలు తగిలి ఆ ఇద్దరు యువకులు మృతి చెందారు. వెంటనే స్పందించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించేలోపు చనిపోయారు. ఈ సంఘటనతో అక్కడ ఒక్కసారిగా భయాందోళన నెలకొంది.  వెంటనే స్థానికులు నీళ్లలో పడిన విద్యుత్‌ తీగలు తొలగించారు. విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కూలిన కమాన్‌, చెట్లు
హైదరాబాద్‌లోని పాతబస్తీలో వర్షం బీభత్సం సృష్టించింది. చత్తాబజార్‌లోని చిన్న కమాన్‌ కూలిపోగా.. ఆ సమయంలో ఎవరూ రోడ్డుపై లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. భారీ వ‌ర్షంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. ముషీరాబాద్‌లో ఈదురుగాలులు, వర్షానికి విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంతరాయం ఏర్పడింది. రాంన‌గ‌ర్‌లోని వీఎస్టీ రోడ్డులో భారీ వృక్షం కూలిపోగా.. హైద‌ర్‌గూడ‌ ప్రాంతంలో మరో చెట్టు నేల‌కొరిగింది.

స్తంభించిన ట్రాఫిక్‌
వర్షం దంచికొట్టడంతో హైద‌రాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. హైదరాబాద్‌లోని అమీన్‌పూర్‌, రాయ్‌దుర్గ్, ఖైర‌తాబాద్‌, కూక‌ట్‌ప‌ల్లి, లింగంప‌ల్లి, మియాపూర్, ముషీరాబాద్‌, ల‌క్డీకాపూల్‌, స‌రూర్‌న‌గ‌ర్, కోఠి, అబిడ్స్, బ‌షీర్‌బాగ్‌, హిమాయ‌త్‌న‌గ‌ర్‌, ట్యాంక్‌బండ్‌, నారాయ‌ణ‌గూడ‌లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్‌ సిటీలో స్తంభించిన వాహనాల రాకపోకలు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌లో కూడా వాహనదారుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మియాపూర్‌, కేపీహెచ్‌బీకాలనీ, కూకట్‌పల్లి, వై జంక్షన్‌, ఎర్రగడ్డ, అమీర్‌పేట, పంజాగుట్ట ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

అత్యధిక వర్షపాతం
తొలికరి రోజే హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. దీంతో హైదరాబాద్‌లో అత్యధిక వర్షపాతం బన్సీలాల్‌పేట్‌లో నమోదైంది. 87.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. విఠల్‌వాడిలో 78.8 మి.మీ, జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం 78.0 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.

0
0
Report

2026 FIFA World Cup: ఫిఫా ప్రపంచకప్‌లో 48 జట్లు ఏవి? వాటి కెప్టెన్లు ఎవరో తెలుసా?

Mezquitillo, Zacatecas:

FIFA World Cup 2026 Captains: క్రీడా ప్రపంచాన్ని ఉర్రూతలూగించేందుకు ఫిఫా ప్రపంచ కప్ 2026 వచ్చేస్తోంది. కళ్లు చెదిరే షాట్లతో క్రీడా అభిమానులను అలరించే ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ జూన్ 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. విశ్వఖ్యాతి పొందిన ఈ ప్రపంచకప్‌ కోసం కోట్లాది మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రపంచకప్‌ను భారతీయ ప్రేక్షకులు జీ మీడియాలో చూడవచ్చు. జీ5 యాప్‌తోపాటు యునైట్‌8 స్పోర్ట్స్‌ ఛానల్స్‌లో ఫిఫా ప్రపంచకప్‌ ప్రసారాలు జరగనున్నాయి. 48 దేశాలు పోటీపడుతున్న ఈ ప్రపంచకప్‌లో ఆయా జట్లకు ఎవరు సారథ్యం వహించనున్నారో తెలుసుకుందాం.

ఫిఫా ప్రపంచకప్‌లో జూన్ 12వ తేదీన గ్రూప్ దశ ప్రారంభం కానున్నాయి. ఈ ప్రపంచ కప్ చరిత్రలోని అనేక రికార్డులు, ఘనతలను తిరగరాయబోతున్నది. అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నమెంట్ 32 సంవత్సరాల తర్వాత ఉత్తర అమెరికా గడ్డపైకి ఈ క్రీడ సంబరం తిరిగి వచ్చింది. సాధారణంగా 32 దేశాలకు బదులుగా 48 దేశాలు పోటీపడుతున్నాయి. దీంతో మొత్తం మ్యాచ్‌ల సంఖ్య 94 నుంచి 104కు పెరిగింది. ఈ ప్రపంచకప్‌లో లియోనెల్ మెస్సీ, ఫాబియో కన్నవారో, ఫ్రాంజ్ బెకెన్‌బాయర్ వంటి దిగ్గజాలు స్టేడియంలో ఆడుతుండడంతో ప్రేక్షకులకు మరింత వినోదం లభించనుంది.

ఫిఫా ప్రపంచ కప్ 2026 జట్టు కెప్టెన్లు
మెక్సికో: ఎడ్సన్ అల్వారెజ్
దక్షిణాఫ్రికా: రాన్‌వెన్ విలియమ్స్
దక్షిణ కొరియా: సన్ హ్యూంగ్-మిన్
చెక్ రిపబ్లిక్: లాడిస్లావ్ క్రెజి
కెనడా: అల్ఫోన్సో డేవిస్
బోస్నియా, హెర్జెగోవినా: ఎడిన్ డ్జెకో
ఖతార్: హసన్ అల్-హేడోస్
స్విట్జర్లాండ్: గ్రానిఫ్రాస్ 
బ్రెజిల్‌: మర్కోకన్
మొరకో: హకిమి
అమెరికా: టిమ్ రీమ్
పరాగ్వే: గుస్తావో గోమెజ్
ఆస్ట్రేలియా: మాథ్యూ ర్యాన్
టర్కీ: హకన్ కల్హనోగ్లు
జర్మనీ: జాషువా కిమ్మిచ్
కురాకో: లియాండ్రో బకునా
ఐవరీ కోస్ట్: ఫ్రాంక్ కెస్సియెన్
జపాన్: వాటరు ఎండో
స్వీడన్: లిండెలోఫ్
బెల్జియం: టైలెమాన్స్
ఈజిప్ట్: మొహమ్మద్ సలా
ఇరాన్: మెహదీ తరేమి
న్యూజిలాండ్: క్రిస్ వుడ్
స్పెయిన్: రోడ్రి
కేప్ వెర్డే: ర్యాన్ మెండిస్
సౌదీ అరేబియా: సేలం అల్-దవ్సారి
ఉరుగ్వే: జోస్ మరియా గిమెనెజ్
ఫ్రాన్స్: కైలియన్ ఎంబాప్పె
సెనెగల్: కాలిడౌ కౌలిబాలీ
ఇరాక్: జలాల్ హసన్
నార్వే: మార్టినెల్
అర్జెంటీనా: మెస్సీ
అల్గెరియా: రియాద్ మహ్రెజ్
ఆస్ట్రియా: డేవిడ్ అలబా
జోర్డాన్: ఇషాన్‌
ఉజ్బెకిస్తాన్: ఎల్డోర్ షోమురోడోవ్
కొలంబియా: జేమ్స్ రోడ్రిగ్జ్
ఇంగ్లాండ్: హ్యారీ కేన్
క్రొయేషియా: లుకా మోడ్రిక్
ఘనా: జోర్డాన్ అయేవ్
పనామా: అనిబల్ గోడోయ్

0
0
Report

Cobra Video: శివాలయంలో భోళాశంకరుడి లీలా.. శివలింగంపై నాగుపాము.. వీడియో..

Hyderabad, Telangana:

 Cobra Video Watch Here: మన మన భారతదేశం ఆధ్యాత్మికతకు అద్భుతాలకు నిలయం.. తరచుగా భక్తులను ఆశ్చర్యం కలిగించే సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. తాజాగా సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చిన ఒక అరుదైన వీడియో సోషల్ మీడియా వినియోగదారులతో పాటు శివ భక్తులను విపరీతంగా ఆకర్షిస్తోంది. అత్యంత ప్రమాదకరమైన ఓ భారీ నాగుపాము.. ఓ దేవాలయంలోని శివలింగం చుట్టూ చుట్టుకుని దర్శనం ఇవ్వడం ఈ వీడియోలో మనం చూడొచ్చు. ప్రస్తుతం ఈ దృశ్యాలు ఇంటర్నెట్ను ఊపేస్తున్నాయి. అన్ని సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా కనిపిస్తుంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

శివలింగం పై నాగుపాము..
వైరల్ అవుతున్న వీడియోను పరిశీలించి చూస్తే.. ఒక పురాతన శివాలయంలోని గర్భగుడికి ముందుగా ఉన్న శివలింగానికి ఒక అత్యంత ప్రమాదకరమైన నాగుపాము చుట్టుకొని ఉండడం మీరు చూడొచ్చు. ఆ పాము శివలింగంపై అటు ఇటు కదులుతూ.. తన పడగలను పైకెత్తి స్వామివారికి ఒక గొడుగుల పట్టినట్లు కూర్చుండిపోయింది. సాధారణంగా పాములను చూస్తేనే జనాలు ఆమడ దూరం పరిగెడతారు. కానీ ఇక్కడ సాక్షాత్తు ఆ పరమశివుడి మెడలోని ఆభరణమైన సర్పరాజే ఇలా శివలింగాన్ని అలంకరించి దర్శనం ఇవ్వడంతో భక్తులు భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తున్నారు. ఈ అద్భుత దృశ్యాన్ని అక్కడున్న వారి తమ స్మార్ట్‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..

మహాశివరాత్రి వేళలో కూడా ఇలాంటి ఘటనలే..
ఇలాంటి వింతలు జరగడం ఇదే మొదటిసారి కాదు.. గతంలోనూ దేశంలోపాలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు వెలుగు చూసాయి.. ముఖ్యంగా ప్రతి ఏటా వచ్చే మహాశివరాత్రి పర్వదినం వేల లేదా శ్రావణమాసంలోని ప్రముఖ శివాలయాల్లో నాగుపాములు వచ్చి శివలింగంపై కూర్చోవడంతో పాటు భక్తులు ఇచ్చే పాలు తాగడం వంటి దృశ్యాలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం..

 
 
 
 
 

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

భక్తులు దీనిని దైవ లీలగా భావిస్తున్నారు.. సాక్షాత్తు భోళాశంకరుడే ఈ నాగుపాము రూపంలో దర్శనం ఇచ్చారని కొంతమంది భక్తులు అభిప్రాయపడుతున్నారు. శివాలయాల్లో ఉండే ప్రశాంతతతో పాటు గర్భగుడిలోని చల్లదనం, అభిషేకాలు చేయడం వల్ల వచ్చే తేమ వైపు పాములు ఎక్కువగా ఆకర్షితమవుతాయని.. అందుకే అవి శివలింగాల పైకి చేరుకుంటాయని మరి కొంతమంది చెబుతూ వస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ.. భక్తి, సైన్స్ పక్కన పెడితే.. సోషల్ మీడియా వినియోగదారులను మాత్రం ఈ అరుదైన వీడియో ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేస్తూ వస్తోంది.. అయితే, ఈ వీడియో చూసిన మరి కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం.. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ జనరేట్ చేసిన ఒక ఫేక్ వీడియో అని కామెంట్లు రాస్తూ వస్తున్నారు.

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

  

0
0
Report
Advertisement

Cobra Video: కింగ్ కోబ్రా ప్రాణాంతక దాడి.. కళ్లద్దాలు ఉండబట్టి బతికాడు.. వీడియో వైరల్!

Hyderabad, Telangana:

 King Cobra Venom Spit Video Watch: సోషల్ మీడియాలో ప్రతిరోజు అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిల్లో కొన్ని వినోదాన్ని పంచితే.. మరికొన్ని మాత్రం గుండెల్లో భయం నింపేలా చేస్తూ ఉంటాయి.. తాజాగా ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ఒక వీడియో చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక తప్పదు.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన.. అత్యధిక విషపూరితమైన విషం చిమ్మె కింగ్ కోబ్రా ఒక యువకుడి పై నేరుగా దాని విషాన్ని చిమ్మిన భయానక దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. పాములు ఇలా కూడా చేస్తాయా అని కొంతమంది సాధారణ సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లను వ్యక్తం చేస్తున్నారు.

టేబుల్‌పై కూర్చోబెట్టి ఆటలు.. 
ఫైనల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక యువకుడు అత్యంత ప్రమాదకరమైన విషం చిమ్మె కింగ్ కోబ్రాతో నిర్లక్ష్యంగా ఆడుకుంటూ కనిపించాడు.. ఆ పామును ఒక బల్లపై కూర్చోబెట్టి.. దానికి చాలా దగ్గరగా.. వెళ్లి వింత చేష్టాలు చేయడం మీరు వీడియోలో చూడొచ్చు. సాధారణంగా కింగ్ కోబ్రాలు తనను ఎవరైనా కదిలిస్తే అస్సలు సహించవు.. ఆ యువకుడు ప్రవర్తనతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ పాము.. క్షణాల వ్యవధిలో ఊహించని రీతిలో దాడికి దిగింది. అయితే ఈసారి అది కలవడానికి ప్రయత్నించకుండా.. నేరుగా తన నోటి నుంచి ఆ యువకుడి ముఖంపై విషాన్ని చిమ్మింది. 

కాపాడిన కళ్లద్దాలు.. 
పాము విషం చిమ్మిన వేగానికి ఆ యువకుడు ఒక్కసారిగా షాప్ కు గురై.. వెనక్కి తగ్గాడు.. అయితే ఈ ప్రమాదంలో అతడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఆ సమయంలో సదరు యువకుడు కళ్లద్దాలు ధరించి ఉండడమే అతడి పాలిట వరంగా మారింది.. కింగ్ కోబ్రా చిమ్మిన విషం నేరుగా అతడి కళ్లద్దాలపై పడింది. ఒకవేళ అతడు కళ్లద్దాలు పెట్టుకోకపోయి ఉంటే.. ఆ విషం నేరుగా కళ్ళలోకి పోయేది. అది కళ్ళలో పడితే కంటి చూపు శాశ్వతంగా పోవడమే కాకుండా క్షణాల్లో ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు చెబుతూ ఉన్నారు..

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

నెటిజన్ల ఆగ్రహం.. 
ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు సదరు యువకుడి నిర్లక్ష్యపు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సోషల్ మీడియాలో లైకులతో పాటు వ్యూస్ కోసం ఇలా ప్రాణాలతో చెలగాటమాడటం ఏంటని కామెంట్లలో ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఈ మూగజీవులతో పాటు ముఖ్యంగా ఇలాంటి విశేషాలు పాలను కెమెరాల ముందు ప్రదర్శించి స్టంట్ లు చేయవద్దని.. ఇవి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఊహించడం అసాధ్యమని హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా ఆ యువకుడు తృటిలో ఆ పాము విషం నుంచి తప్పించుకొని బయటపడగలిగాడు. లేదంటే శాశ్వతంగా కంటి చూపు కోల్పోయేవాడు..

 
 
 
 
 

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

  

0
0
Report

Karimnagar: ముందస్తు వర్షాలకు మురిసిపోవద్దు.. విత్తనాలు విత్తితే ఆ తిప్పలు తప్పవు!

Karimnagar, Telangana:

Pre Monsoon Rains Sowing Risk: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటీవల కురిసిన ముందస్తు వర్షాలతో రైతాంగం ఒక్కసారిగా సాగు పనుల్లో వేగవంతం పెంచేసింది. తొలకరి తొలకరింపుతో మురిసిపోతూ చాలామంది రైతులు అప్పుడే పొలాలను సిద్ధం చేసుకుని.. విత్తనాలు నాటే పనుల్లో నిమగ్నమయ్యారు.. అయితే, ఈ ముందస్తు ఉత్సాహం మునుముందు పెద్ద కష్టానికి దారి తీసే ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ అధికారులతో పాటు శాస్త్రవేత్తలు గట్టిగా హెచ్చరిస్తూ వస్తున్నారు. కేవలం ఈ తృప్తికరమైన వర్షాలను చూసి తొందరపడి విత్తనాలు వెతితే పెట్టుబడులు నష్టపోవాల్సి వస్తుందని వారు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఈ అంశంపై వ్యవసాయ శాఖ అధికారులు ఏమంటున్నారో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఎల్నినో ముప్పు.. తక్కువ వర్షపాతం!
ఈ ఏడాది వానకాలం సీజన్ పై వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఈ సారి పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన El Nino ప్రభావం బలంగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ వస్తున్నారు. దీనివల్ల సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయట. జూన్ ప్రారంభంలో వర్షాలు పడినప్పటికీ.. ఆ తర్వాత ఋతుపవనాలు ఊహించనంతగా సహకరించకపోవచ్చు అని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ముందస్తుగా విత్తనాలు నాటిన తర్వాత సుదీర్ఘ కాలం పాటు వర్షాలు కురవకపోతే.. మొలకలు మాడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపడం మంచిది..
మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు తమ సాంప్రదాయ సాగు పద్ధతులను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తూ వస్తున్నాయి. ఈ ఏడాది నీటి లభ్యత తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున.. ఎక్కువ నీరు అవసరమయ్యే వరి పంటల కంటే తక్కువ నీటితో.. తక్కువ కాలంలో పండే పంటల వైపు రైతులు మగ్గుచూపాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయాల్లో పప్పు ధాన్యాలతో పాటు నూనె గింజలు, మొక్కజొన్న, సజ్జలు వంటి పంటలు వేయడం మంచిదని వారు సూచిస్తున్నారు..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

అధికారుల సూచనలు ఇవే..
కనీసం 50 నుంచి 60 మిల్లీలీటర్ల వర్షాపాతం నమోదై.. భూమి లోపల పొరల వరకు పచ్చి చేరిన తర్వాతే విత్తనాలు వేయాలని.. వాతావరణ శాఖ ఇచ్చే రోజువారి సమాచారాన్ని గమనిస్తూ సాగు పనులు ప్రారంభించాలని.. ముఖ్యంగా విత్తన శుద్ధి తప్పనిసరి చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. అంతేకాకుండా రైతులు తొందరపాటు నిర్ణయాన్ని తీసుకోకుండా వ్యవసాయ అధికారుల సలహాలతో పాటు సూచనలు పాటించి ఈ వానాకాలం సీజన్లో నష్టాల బారిన పడకుండా జాగ్రత్తలు పడాలని విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో పంటలు వేసేవారు తప్పకుండా అన్ని సూచనలు అనుసరిస్తూ ఉండడం చాలా మంచిదని వారు చెబుతున్నారు..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Hyderabad: రెచ్చిపోతున్న నేపాలీ ముఠా.. గచ్చిబౌలి లగ్జరీ విల్లాలో కేజీ బంగారం, డైమండ్స్ లూటీ, పనిలో చేరిన కొద్దిరోజులకే స్కెచ్!

Hyderabad, Telangana:

Nepali Gang Another Huge Theft In Gachibowli Villa: ఇప్పటికే ఇంట్లో పనివారు నేపాలీలు వద్దని హైదరాబాద్‌ పోలీసులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రధాన కారణం ఇటీవలె మాజీ డీజీపీ భార్యను హైదరాబాద్‌లో నేపాలీ గ్యాంగ్‌ హత్య చేశారు. ఇంట్లో పనివారిగా చేరుతున్న ఈ గ్యాంగ్‌ ఆ తర్వాత తమ బుద్ధి చూపిస్తున్నారు. ఇంకో ఘటనలో కూడా ముందుగా ఇంట్లో పనివారిగా జంటగా చేరి.. పుట్టిన రోజు అని చెప్పి కేక్‌ కట్‌ చేసి మత్తుమందు కూడా ఇచ్చి యజమానికి కుర్చీలకు కట్టేసి డబ్బు, బంగారం దోచుకెళ్లారు. ఆ ఘటన గురించి మరువక ముందే తాజాగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ హిల్‌ బ్రిడ్జ్‌ విల్లాస్‌లో మరో భారీ చోరీకి తెరతీశారు. యజమాని కుటుంబం ముంబై వెళ్లి వచ్చేసరికి కేజీ బంగారం, వజ్రాలు కూడా ఒక నేపాలీ దంపతులు ఎత్తుకెళ్లారు. ఇందులో ట్వీస్ట్‌ ఏంటంటే వారు పనివారుగా చేరి కేవలం ఒక నెల మాత్రమే అయింది.

పోలీసుల ప్రకారం..
గచ్చిబౌలి హిల్ రిడ్జ్ విల్లాలో ఉంటున్నటువంటి వ్యాపారి ఇంట్లో కేజీ బంగారు నగలు వజ్రాలను నేపాల్ ముట్ట ఎత్తుకెళ్ళింది. ఇంట్లో పని చేసే నేపాల్ దంపతులు చోరీ చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం యజమాని కుటుంబం ముంబైకి వెళ్లి ఆదివారం తిరిగి వచ్చేసరికి నేపాలీ దంపతులు మాయమయ్యారు. ఇంట్లో తాళాలు పగలగొట్టినట్టు ఎలాంటి గుర్తులు లేకపోవడంతో మొదట వారు చెప్పకుండా వెళ్ళిపోయారని భావించిన వ్యాపారవేత్త పూజా గదిలోని విగ్రహానికి ఉన్న బంగారు గొలుసుతోపాటు మరికొన్ని ఆభరణాలు మాయమైనట్టు పోలీసులు గుర్తించారు. రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్త బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి.

ముంబైకి వెళ్లి వచ్చే సరికి ఈ నేపాలీ దంపతులు ఇల్లంతా కూడా గుల్ల చేసిపోయారు. ఇంట్లో ఉన్న వస్తువులను కూడా చెల్లా చెదురుగా పడిపోయి ఉండటం, విలువైన వస్తువులన్నీ కూడా కనిపించకుండా పోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ వ్యాపారి ఇటీవలె తన కుటుంబంతోసహా ముంబై వెళ్లాక ఈ భారీ చోరీ చేశారు. ఇంట్లో నేపాల్‌కు చెందిన  భార్యాభర్తలు పని మనుషులుగా ఉన్నారు. ఇద్దరికి కూడా ఇంటి బాధ్యతలు అప్పగించి తిరిగి వచ్చేసరికి ఎలాంటి ప్రాబ్లం అవ్వకుండా ఇంటిని చక్కగా చూసుకోండి అని యజమాని చెప్పి వెళ్లినట్లు సమాచారం.

Read Also: సిటీలో మళ్లీ రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్.. డాక్టర్‌కే మత్తుమందిచ్చి సినీ ఫక్కీలో 60 తులాల బంగారం ఊడ్చేశారు!

Read Also: ఇంట్లో పనివారుగా నేపాలీలు వద్దు.. హైదరాబాద్ ప్రజలకు పోలీస్‌ కమిషనర్‌ కీలక సూచన

భారీ బంగారం చోరీ..
పూజ గదిలో ఉన్న విగ్రహము బంగారు గొలుసు, బెడ్రూమ్‌లో ఉండే విలువైన వస్తువులు బంగారు క్యాష్ కూడా కనిపించకపోవడంతో ఆ పని మనుషులపైనే అనుమానం వ్యక్తం చేస్తూ గచ్చిబౌలి పోలీసులకు యజమాని ఫిర్యాదు ఇచ్చినట్టుగా సమాచారం. నెల రోజుల క్రితమే ఈ ఇద్దరిని పనిలోకి పెట్టుకున్నట్టుగా కూడా యజమాని పోలీసులకు చెప్పారు. ఇప్పటికే నేపాలికి చెందినటువంటి వారిని ఇంట్లో నమ్మకంగా ఉంచుకోకండి.. వాళ్ళని పనిలో పెట్టుకోకండి వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్ హైదరాబాద్‌లో పెరిగిపోతా ఉన్నాయి. ఒక క్రిమినల్ గ్యాంగ్‌ పని పేరుతో ఇంట్లోకి వచ్చి అన్ని వస్తువులు ఎక్కడెక్కడ ఉంటాయో ఇవన్నీ ముందస్తుగానే గుర్తించి ఆ  ఇన్ఫర్మేషన్ ఇచ్చి దోపిడీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ నేపాలీ గ్యాంగ్లని నేపాలీ వ్యక్తులని అసలే నమ్మకండి అంటూ కూడా పోలీసులు దీనిపైన అవగాహన కల్పిస్తూనే  ఉన్నారు. అయినా ఈ వ్యాపారవేత్త ఆ నేపాలీ వ్యక్తులనే నమ్మి భార్యా భర్తలని ఇద్దరిని  కూడా పిలిపించి ఇంట్లో పని కోసం పెట్టి ఆ ఇంటిని వాళ్ళకు బాధ్యతలు చూసుకోమని అప్పగించి వెళ్ళడం ఈ యజమాని నిర్లక్ష్యం.. పోలీసులు యజమానికి విషయాన్ని కూడా తెలియజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారికోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement
Advertisement
Back to top