Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rajanna Sircilla505307

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద ఆశ ల ధర్నా

Jul 22, 2024 12:45:15
Rudrangi, Telangana

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఆశావర్కర్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. సుమారు రెండు గంటలపాటు ఎండలోనే నిరసన కొనసాగింది. మేము ఎండలో, మీరు ఏసీ గదుల్లో. అధికారులపై విమర్శలు చేశారు. ఈసందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ ఆశావర్కర్ల సమస్యల పరిష్కారానికి ఎన్నోసార్లు పోరాటాలు చేసిన నాటి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేసిందన్నారు తన మేనిఫెస్టోలో కూడా పేర్కొన్నాడు.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Mar 16, 2026 10:47:39
Nuzendla, Andhra Pradesh:

AP Govt Employees: తమ డిమాండ్లు, సమస్యలపై ఆందోళన చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వేతన సవరణ సంఘం, డీఏ పెంపుతోపాటు ఐఆర్‌, పెండింగ్‌ బిల్లుల కోసం ప్రభుత్వానికి ఆల్టిమేటం జారీ చేశారు. ఉగాదిలోపు తమకు హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ రెండేళ్లలో మీరు ప్రభుత్వ ఉద్యోగులకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  పీఆర్సీ లేదు.. ఐఆర్‌ లేదు.. బకాయిల ఊసే లేదని తమ ఆవేదనను వివరించారు.

తాడేపల్లిలోని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య కార్యాలయంలో జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడారు. ఉగాది నాటికి రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఐఆర్‌ ప్రకటించకపోతే ఆందోళనలకు దిగుతామని  కూటమి ప్రభు­త్వాన్ని హెచ్చరించారు. తొలుత అన్ని జిల్లాల్లో నిరసన ప్రదర్శలు చేస్తామని, అనంతపురం జిల్లాతో నిరసనలు ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంతటి దయనీయ పరిస్థితి ఎప్పుడూ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు అడుగుతున్న ప్రశ్నలకు ఉద్యోగ సంఘం నాయకులుగా తాము సమాధానం చెప్పలేకపోతున్నట్లు తెలిపారు.

'పీఆర్సీ దూరమవుతుందనే ఆందోళన అందరిలో ఉంది. ఐఆర్‌ ప్రకటించకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి' అని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి గుర్తుచేశారు. సరెండర్‌ లీవులు, డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని.. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రిటైర్మెంట్‌ బకాయిలు రావడం లేదని వివరించారు. పెన్షనర్లు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉందని వాపోయారు.

ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్లలో ఒక్క రూపాయీ అందలేదని.. రిటైరైన వారు రావాల్సిన బెనిఫిట్లు తీసుకోకుండానే మరణిస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఉద్యోగులకు రూ.30 వేల కోట్లు, పెన్షనర్లకు రూ.10 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని వివరించారు. పాలనలో తాము ప్రభుత్వానికి సహకరిస్తున్నా.. ప్రభుత్వం నుంచి తమకు సహకారం లేదని పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కానే కాదు.. ముంచిన ప్రభుత్వం అని ప్రకటించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను బానిసల కంటే హీనంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగాదిలోపు ఐఆర్‌ ప్రకటించకపోతే పోరాటం తథ్యం అని జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు.

‘అధికారంలోకి రాగానే పీఆర్సీ వేస్తామన్నారు.. అంతకుముందే ఐఆర్‌ ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పుడు ఇవ్వడం లేదు' బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డి అని తెలిపారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే పీఆర్సీ దూరమవుతోందని తమకు ఆందోళన నెలకొందని.. గతంలో ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ఐఆర్‌ను ప్రకటిస్తూ వచ్చాయని గుర్తుచేశారు. రెండేళ్లవుతున్నా ఐఆర్‌ ప్రకటించకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి అని ప్రకటించారు. ఉగాదిలోపు ఐఆర్‌ ప్రకటించకపోతే పోరాటమేనని తేల్చిచెప్పారు.

ప్రభుత్వం హామీలు నిలబెట్టుకుంటుందని.. సమస్యలు పరిష్కరిస్తుందనే నమ్మకంతో ఇన్నాళ్లూ ఓపికగా ఉన్నామని.. ఇప్పుడు ఊరుకునేది లేదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. జిల్లా స్థాయి నిరసన ప్రదర్శనల తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే విజయవాడలో  మహా ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఐఆర్‌ ప్రకటించి, పీఆర్సీ కమిషన్‌ను వెంటనే ఏర్పాటుచేయాలని, లేనిపక్షంలో ఏప్రిల్‌ ఒకటి నుంచి ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా అణచివేస్తున్నారని.. అనివార్యంగా పోరా­­డక తప్పని పరిస్థితి ఏర్పడిందని జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. ఒక్క డీఏతో ఎన్ని పండుగలు చేసుకోవాలని.. ఉగాదికి ఉద్యోగులకు సంబంధించి ఒక ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

40
comment0
Report
HDHarish Darla
Mar 16, 2026 10:40:32
Chhota Bainan, West Bengal:

Bengali Wedding Lip Kiss Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ పాపులర్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన వీడియోలు తెగ హల్‌చల్ చేస్తుంటాయి. ఇప్పుడు అలాంటి ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఆ వీడియోలో అప్పుడే పెళ్లైన నవ దంపతులు.. నిగ్రహంగా ఉండలేక పెళ్లిపీటలపై లిక్‌ కిస్‌లతో రెచ్చిపోయారు. పెళ్లిలో పెద్దల ముందే ఈ పాడుపని చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 

ఏం జరిగింది?
నేటితరం యువత పెళ్లి తర్వాత నాలుగు గోడల మధ్య జరగాల్సిన కార్యాన్ని నలుగురిలో (సోషల్ మీడియాలో షేర్ చేయడం) పెద్ద ట్రెండ్ అయ్యింది. అలాంటి కొన్ని విచిత్రమైన పనులు వీడియోలుగా మారి ఇప్పుడు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోలో అప్పుడే పెళ్లైన ఓ జంట చేసిన పాడుపని గురించి నెట్టింట రకరకాలుగా చర్చ జరుగుతుంది.

వివరాల్లోకి వెళితే..అదొక బెంగాలీ పెళ్లి. పెళ్లిపందిరిలో ఘనంగా ముస్తాబై, నూతన వధూవరులు వివాహంతో ఒక్కటైన క్షణం అది. అయితే అకస్మాత్తుగా ఆ జంట బంధువులున్నారని పట్టించుకోకుండా పెళ్లిపీటలపై వధూవరులు ఇద్దరూ లిప్ కిస్ లు పెట్టుకుంటున్నారు. పందిట్లో పెద్దలు, పిల్లలు ఉన్నారనే ఇంగితం లేకుండా విచక్షణారహితంగా ప్రవర్తించారు. పెళ్లికూతురు తీరును చూస్తే ఆమె అంతటితో ఆగేలా కనిపించలేదు. అలాగే పెళ్లికొడుకు కూడా తానేం తక్కువ తినలేదంటూ ముద్దుల్లో రెచ్చిపోయాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

దాదాపుగా 35 సెకన్ల పాటు సాగిన ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు హిందూ వివాహ ఆచారాల సాంప్రదాయ పవిత్రతకు విరుద్ధమని ఆగ్రహిస్తున్నారు. సంప్రదాయ భారతదేశంలో పాశ్చాత్య పోకడలు తగవని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ సంప్రదాయానికి విరుద్ధంగా ఈ ముద్దులాట ఏంటని పలువురు తిట్టిపోస్తున్నారు. అలాగే మరికొందరు ఈ నూతన వధూవరులకు మద్దతుగా నిలుస్తున్నారు. 

Also Read: KCR Fires On Congress: కాంగ్రెస్‌ను అసెంబ్లీలో పొట్టు పొట్టు తిట్టిన కేసీఆర్..ఎప్పుడు జరిగింది ఇదంతా?

Also Read: EPFO New Employee Scheme: ఉద్యోగులకు మోదీ సర్కార్ తీపికబురు..వారి అకౌంట్లోకి రూ.15,000 జమ..ఉగాది పండుగ ముందు బంపర్ ఆఫర్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

66
comment0
Report
HDHarish Darla
Mar 16, 2026 10:14:06
Hyderabad, Telangana:

LPG Cylinder Price 7000 News: దేశవ్యాప్తంగా కమర్షియల్ LPG సిలిండర్ల కొరత తీవ్రమైంది. ఈ కొరత హోటల్ పరిశ్రమను పెద్ద సంక్షోభంలోకి నెట్టివేసింది. ఒకప్పుడు సాధారణ మిస్డ్ కాల్‌తో గ్యాస్ సిలిండర్లను పొందిన హోటల్ యజమానులు ఇప్పుడు సరఫరాలను పొందటానికి ఇబ్బంది పడుతున్నారు. దీని వలన రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. అయితే ఇదే అదునుగా కొందరు దళారులు కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌ను రూ.7,000లకు బ్లాక్‌లో అమ్మకాలు చేస్తున్నారు. 

కొంతమంది మధ్యవర్తులు ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో అమ్మడం ద్వారా డబ్బు దండుకుంటున్నారని హోటల్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉదాహరణకు బెంగళూరులో కమర్షియల్ LPG సిలిండర్ అధికారిక ధర దాదాపు రూ.1,900 విక్రయిస్తుండగా.. ఇప్పుడు కొరత ఉందని గ్రహించిన దళారులు సిలిండర్లను బ్లాక్‌లో అమ్మకానికి ఉంచారు. ఒక్కో గ్యాస్ సిలిండర్‌ను రూ.7,000‌కు అమ్ముతున్నట్లు సమాచారం. ఇలాంటి కృత్రిమ కొరత ఏర్పరిచిన వారిపై ప్రభుత్వం జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని హోటల్ యజమానాలు డిమాండ్ చేస్తున్నారు. 

బెంగళూరుతో పాటు మైసూరు నుండి కూడా ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి. హోటల్ యజమానులు సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో ఒక్కొక్కటి రూ.4,000 నుండి రూ.5,000 వరకు అమ్ముతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఫాస్ట్ ఫుడ్ సెండర్లు, రెస్టారెంట్లపై ఆర్థిక భారం పెరుగుతుందని హోటల్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విధంగా గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా అనేక హోటళ్లు ఆహార ధరలను భారీగా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో టిఫిన్స్ అమ్మకాలపై ప్లేట్‌కు రూ.10 చొప్పున పెంచేశారు. కొన్ని హోటల్ యజమానులు గ్యాస్ కొరత కారణంగా కట్టెల పొయ్యిని వినియోగిస్తున్నారు. అలా చేసినా అల్పాహారాల ధరలు రూ.5 నుంచి రూ.20 పెంచుతున్నట్లు కస్టమర్లు వాపోతున్నారు.

అయితే కొన్ని హోటళ్లలో కమర్షియల్ సిలిండర్ల కొరత కారణంగా ఇంటికి ఉపయోగించిన LPG గ్యాస్ సిలిండర్లను చట్టవిరుద్ధంగా వినియోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆహార, పౌర సరఫరాల శాఖ పలుచోట్ల దాడులను నిర్వహించి అనేక సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు బెంగళూరు సిటీలో దాదాపుగా 316 సిలిండర్లను జప్తు చేశారు.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ఆసుపత్రులు, విద్యాసంస్థలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ క్యాంటీన్లు, ప్రసాదం పంపిణీ చేసే దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి ముఖ్యమైన సంస్థలకు కమర్షియల్ LPG సిలిండర్లలో దాదాపు 20 శాతం ప్రాధాన్యత ఇవ్వాలని ఆ శాఖ పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో హోటళ్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. 

Also Read: EPFO New Employee Scheme: ఉద్యోగులకు మోదీ సర్కార్ తీపికబురు..వారి అకౌంట్లోకి రూ.15,000 జమ..ఉగాది పండుగ ముందు బంపర్ ఆఫర్!

Also Read: LPG vs Induction: LPG గ్యాస్ vs ఇండక్షన్..ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఏది డబ్బు ఆదా చేస్తుంది? పూర్తి వివరాలు ఇవే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

140
comment0
Report
HDHarish Darla
Mar 16, 2026 08:48:19
Hyderabad, Telangana:

KCR Fires On Congress Govt: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేడు (మార్చి 16) గవర్నర్ ప్రసంగంతో మొదలయ్యాయి. ఈ సమావేశాల్లోనే డిప్యూటీ సీఎం, మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత స్వీచ్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇది పాత వీడియోనే అయినా అందులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నట్లుగా ఉండడంతో బీఆర్ఎస్ నేతలు ఇప్పుడా వీడియోను వైరల్ చేస్తున్నారు. 
 
సామాజిక మాధ్యామాల్లో వైరల్‌గా మారిన వీడియో ప్రకారం.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (KCR) అసెంబ్లీలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై చేసిన విమర్శలు ఈ వీడియోలో ఉన్నాయి. అందులో భాగంగా తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ పాత్రను ఎండగట్టారు. అంతకుముందు ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీయే అని కేసీఆర్ విమర్శించారు. 

1956లో జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో తెలంగాణను బలవంతంగా ఆంధ్రలో కలిపారని, ఆనాడు విద్యార్థులు, మేధావులు వ్యతిరేకించినా పట్టించుకోలేదని గుర్తుచేశారు. అలాగే 1969 ఉద్యమంలో ఇందిరా గాంధీ "నో తెలంగాణ" అని చెప్పి ఉద్యమాన్ని అణచివేశారని, వందలాది మంది విద్యార్థులు చనిపోవడానికి కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు.

గత ప్రభుత్వాల వైఫల్యాలు..
ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్నా కాంగ్రెస్ నాయకులు మౌనంగా ఉన్నారని బీఆర్ఎస్ అధినేత విమర్శించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచి బషీర్‌బాగ్‌లో రైతులను కాల్చి చంపిన ఘటనను గుర్తుచేశారు. తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేసి, కంపల్షన్ (కచ్చితమైన పరిస్థితి) క్రియేట్ చేయడం వల్లనే తెలంగాణ వచ్చిందని ఆయన అన్నారు.

మరోవైపు దేశంలో తెలంగాణ ప్రస్తుతం తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో అగ్రగామిగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం కాబట్టే ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధి కింద రూ.5 కోట్లు ఇస్తున్నామని, ఇది భారతదేశంలో మరే రాష్ట్రంలో లేదని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా నీరు ఇచ్చామని, విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించామని వివరించారు.

Also Read: EPFO New Employee Scheme: ఉద్యోగులకు మోదీ సర్కార్ తీపికబురు..వారి అకౌంట్లోకి రూ.15,000 జమ..ఉగాది పండుగ ముందు బంపర్ ఆఫర్!

Also Read: LPG vs Induction: LPG గ్యాస్ vs ఇండక్షన్..ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఏది డబ్బు ఆదా చేస్తుంది? పూర్తి వివరాలు ఇవే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

138
comment0
Report
HDHarish Darla
Mar 16, 2026 07:35:10
Hyderabad, Telangana:

LPG vs Induction Cooking: మన దేశంలో చాలామంది వంటగదిలో LPG గ్యాస్ సిలిండర్‌నే ఉపయోగిస్తున్నారు. దాదాపుగా గ్రామాల్లో కూడా కట్టెల పొయ్యిని పక్కన పెట్టి గ్యాస్ పొయ్యిలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. గత కొన్నేళ్లుగా సిటీల్లో ఇండక్షన్ కుక్‌టాప్ బాగా ఫేమస్ అయ్యింది. మరీ ముఖ్యంగా ఇటీవలే ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో ఎప్పీజీ గ్యాస్ కొరత ఏర్పడనుందనే వార్తలు ఇప్పుడు ఇండక్షన్ స్టవ్‌లపై డిమాండ్ భారీగా పెరిగి పోయింది. అయితే ఈ రెండింటిలో ఏది ఉత్తమ ఎంపిక అనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ కరెంట్ పొయ్యిలతో పోలిస్తే గ్యాస్ సిలిండర్ ఒక నెల రోజులు పనిచేస్తుంది. ఒక్కో సిలిండర్ ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.900 నుంచి రూ.1,100 వరకు అమ్మకాలు జరుపుతున్నారు. మరోవైపు, ఇండక్షన్ కుక్‌టాప్ కరెంట్‌తో నడుస్తుంది. కాబట్టి దీనికి కరెంట్ బిల్లు కట్టాల్సిన పని ఉంది. అయితే దీని వాడకంలో యూనిట్‌కు రూ.6 నుంచి రూ.9 వరకు వసూలు చేస్తున్నారు. 

ఇండక్షన్ కుక్‌టాప్‌ల ప్రయోజనాలు
LPG (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్), ఇండక్షన్ కుక్‌టాప్‌ల మధ్య అతి ముఖ్యమైన వ్యత్యాసం వాటి వంట సామర్థ్యంలో ఉంది. LPG స్టవ్‌లో, దాదాపు 50 నుండి 60 శాతం శక్తి మాత్రమే నేరుగా వంట కోసం వినియోగిస్తారు. మిగిలినది వేడిమిగా చుట్టుపక్కల వాతావరణంలోకి కలిసి పోతుంది. అయితే ఇండక్షన్ స్టవ్ అందుకు భిన్నంగా 80 నుంచి 90 శాతం వరకు వేడిని నేరుగా వంట పాత్రలపై ప్రభావం చూపుతుంది. చాలా సార్లు ఇండక్షన్ స్టవ్‌లపై ఆహారం త్వరగా ఉడుకుతుందని చాలామంది అంటుంటారు. గ్యాస్ సిలిండర్‌తో పోలిస్తే ఇండక్షన్ స్టవ్ ఎంతో పొదుపుగా వినియోగం అవుతందని.. రోజూ వారి ఆహారాన్ని రెడీ చేసేందుకు తక్కువ సమయం తీసుకుంటుందని పలువురు భావిస్తారు. 

అయినా దేశంలోని వంటగదుల్లో ఇప్పటికీ 90 శాతం గ్యాస్ సిలిండర్లనే ఉపయోగిస్తారు. ఎందుకంటే చాలా మంది వీటికి అలవాటు పడడం సహా ఇండక్షన్ స్టవ్ గురించి గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి అవగాహన లేకపోవడం మరో కారణం కావచ్చు. దీంతో పాటు ప్రస్తుత కాలంలో చాలా మంది హైబ్రిడ్ కిచెన్ సెటప్‌లను వినియోగిస్తున్నారు. రోజువారీ వంటలకు ఇండక్షన్ స్టవ్, స్పెషల్ వంటకాలకు LPG సిలిండర్లను వినియోగిస్తున్నారు. కొన్నిసార్లు గ్రామీణ ప్రాంతాల్లో కరెంట్ కోతల కారణంగా LPG సిలిండర్‌కే ఎక్కువ మొగ్గు చూపుతారు. 

ఏది డబ్బు ఆదా చేస్తుంది?
14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర దాదాపు రూ.900 నుంచి రూ.1,000 లకు మార్కెట్లో లభిస్తుంది. అయితే, ఈ సిలిండర్ సాధారణంగా ఒక నెల పాటు వినియోగానికి వస్తుంది. ఇంతలో ఇండక్షన్ స్టవ్‌పై వంట చేయడానికి దాదాపు 78 యూనిట్ల విద్యుత్ అవసరం. విద్యుత్ ధర యూనిట్ కు రూ.8 అయితే, ఖర్చు 78 × 8 = రూ. 624. అంటే LPG సిలిండర్ తో పోలిస్తే మనం దాదాపు రూ.289 ఆదా చేయవచ్చు.

మరోవైపు దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ వంటి నగరాల్లో కొందరు PNG (పైప్డ్ నేచురల్ గ్యాస్) ఉపయోగిస్తున్నారు. ఇది గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. అయితే, దీని ధర అంతర్జాతీయ LNG మార్కెట్‌తో సమానంగా ఉంది.

Also Read: Vivo T5x 5G Price: రేపే Vivo T5x 5G మొబైల్ లాంఛ్..ధర చూస్తే అవాక్కవుతారు..7200mAh బ్యాటరీతో 2 రోజులు ఛార్జింగ్!

Also Read: Moinabad Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్‌ పార్టీలో ఒకేఒక్క మహిళ? ఎవరీ ప్రియాంక రెడ్డి?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

120
comment0
Report
HDHarish Darla
Mar 16, 2026 07:03:05
Hyderabad, Telangana:

Vivo T5x 5G Price In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో (Vivo) టి-సిరీస్‌లో మరో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ రానుంది. వివో T5x 5G మొబైల్‌ను 2026 మార్చి 17న భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు దేశంలో లాంఛ్ చేయనున్నారు. ఈ మొబైల్ ప్రముఖ షాపింగ్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్, అలాగే వివో ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ మొబైల్ ఫీచర్స్ గురించి ఇప్పటికే కంపెనీ ఓ క్లారిటీ ఇచ్చింది. వాటిలో ప్రధానంగా బ్యాటరీ సైజ్ పెంచడమే కాకుండా మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో చిప్‌సెట్‌తో పాటు దీనికి పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ మొబైల్ ధర, ఇతర ఆకర్షణీయమైన ఫీచర్స్ ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వివో T5X 5G స్మార్ట్‌ఫోన్ ధర
భారతదేశంలో Vivo T5X 5G ధర ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ వివోలో వాటి గత వేరియంట్స్‌తో పోలిస్తే రూ.10,000 నుంచి రూ.23,000 మధ్యలో ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరికొంత మంది రూ.23,000 కంటే తక్కువ ధరకే అనగా.. రూ.15,999 నుంచి రూ.20,000 మధ్య ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఏదిఏమైనా రేపటితో ఈ మొబైల్ ధర, ఫీచర్స్‌ గురించి జరుగుతున్న చర్చపై తెరపడనుంది.

వివో T5X 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
వివో T5X 5G మెయిన్ ఫీచర్స్‌లో ఒకటి బ్యాటరీ సెటప్. 7,200mAh బ్యాటరీ కెపాసిటీతో దాని విభాగంలో ఇది అత్యున్నతంగా తయారు చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా 44W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో.. 40 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్, 93 గంటల సంగీతం, BGMI వంటి 15 గంటలకు పైగా గేమింగ్, 18+ గంటల సోషల్ మీడియా వినియోగం లేదా ఒకే ఛార్జ్‌పై 14+ గంటల GPS నావిగేషన్ వంటి వాటిని పేర్కొంది.

ఈ వివో T5X 5G స్మార్ట్‌ఫోన్ కూడా మీడియాటెక్ డైమన్‌సిటీ 7400 టర్బో చిప్‌సెట్ (ఆక్టా-కోర్)తో ప్యాక్ చేశారని నిర్ధారించారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారంగా OriginOS 6పై నడుస్తుంది. అలాగే ఇందులో ఫ్లూయిడ్ గేమింగ్ కోసం ఆల్ట్రా గేమ్ మోడ్, 4D గేమింగ్ వైబ్రేషన్లు, హాప్టిక్ ఫీడ్‌బ్యాక్, వాయిస్ ఎఫెక్ట్‌లను ఎనేబుల్ చేసే గేమ్ వాయిస్ ఛేంజర్ ఉన్నాయి. 50MP ప్రైమరీ సెన్సార్, LED ఫ్లాష్, రింగ్ లైట్‌తో సహా డ్యూయల్ రియర్ సెటప్‌ను కలిగి ఉంటుంది. 

ఈ మొబైల్ దుమ్ము, వాటర్ ఫ్రూవ్ కోసం IP69+ రేటింగ్‌తో పాటు SGS డ్రాప్ రెసిస్టెన్స్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌లను కూడా పొందుతుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్, 1,250 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌తో 6.72-అంగుళాల FHD+ LCD ప్యానెల్‌గా ఉంటుందని భావిస్తున్నారు. సైబర్ గ్రీన్, స్టార్ సిల్వర్ అనే రెండు రంగు ఎంపికలలో వస్తుంది. కనీసం 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌తో అందుబాటులోకి రానుంది.

Also Read: Moinabad Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్‌ పార్టీలో ఒకేఒక్క మహిళ? ఎవరీ ప్రియాంక రెడ్డి?

Also Read: Pawan Kalyan Speech: 'ఉస్తాద్ భగత్ సింగ్' పవన్ కళ్యాణ్ చివరి సినిమా కాదు! ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో కుండబద్ధలు కొట్టిన డిప్యూటీ సీఎం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

246
comment0
Report
RGRenuka Godugu
Mar 16, 2026 06:30:53
169
comment0
Report
RGRenuka Godugu
Mar 16, 2026 03:52:15
Hyderabad, Telangana:

Odisha Cuttack SCB Medical College Fire Accident: ఒడిశాలోని కటక్ ఏసీబీ మెడికల్ కాలేజీలో ఘోర అగ్ని ప్రమాదం ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న 10 మంది రోగులు మంటలు అంటుకొని అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తిగా కాలిపోయిన మృతదేహాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదంలో మరో 23 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై సీఎం మోహన్‌ చరణ్‌ మాంఝీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను పరామర్శించి ఇక మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఇక ప్రమాదంపై కూడా విచారణకు ఆదేశాలు జారీ చేశారు. 

 

168
comment0
Report
HDHarish Darla
Mar 15, 2026 17:50:24
Hyderabad, Telangana:

Ustaad Bhagat Singh Pawan Kalyan Speech: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈరోజు (మార్చి 15) అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వేదికగా తాను ఛాన్స్ దొరికినప్పుడల్లా సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతానని ఫ్యాన్స్‌కు అభయమిచ్చారు పవన్ కళ్యాణ్. మొత్తానికి తాను రాజకీయాల్లో ఉన్నా.. సినిమాల్లో నటించడం పూర్తిగా మానేయనంటూ స్పష్టం చేశారు. 

ఈ ఈవెంట్‌లో హీరో పవన్ కళ్యాణ్ ప్రసంగం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తన అభిమానుల పట్ల తనకున్న ప్రేమాభిమానాలను వ్యక్తపరుస్తూ, సినిమా ఆలస్యమైనా తన వెంటే ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. సినిమాలోని తన పాత్ర, హరీష్ శంకర్ మేకింగ్ గురించి ప్రస్తావించారు.

"నా గుండెల్లో కొలువై ఉన్న ఫ్యాన్స్‌కు, ఇంట్లో కూర్చొని కార్యక్రమాన్ని టీవీల్లో వీక్షిస్తున్న తెలుగు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సుమ గారు మాట్లాడుతూ నన్ను ఏదో పాత కాలం నటుడిని చేస్తున్నట్లు అనిపించింది (నవ్వుతూ..). 'ఓజీ' మొన్ననే రిలీజ్ అయ్యింది. అయినా నేను రెగ్యులర్ గా సినిమాలు చేయకపోవడం వల్ల నన్ను వెనక్కి నెట్టేస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం బల్లగుద్ది చెబుతున్నా.. నాకు అన్నం పెట్టింది, ఈరోజు ప్రజలకు సేవ చేసే స్థాయికి నన్ను చేర్చింది సినిమానే. సినిమా నా నరనరాల్లో జీర్ణించుకుపోయింది, దాన్ని నా నుంచి ఎవరూ వేరు చేయలేరు" అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

'ఫ్యాన్ వార్స్ వద్దు'
"నాకు ఎప్పటికీ ఒకే ఒక్క హీరో చిరంజీవి గారు. ఆయన పక్కన ఉంటే నేను హీరోననే విషయం కూడా మర్చిపోతాను. రామ్ చరణ్ నా ట్రైలర్ గురించి ట్వీట్ చేయడం సంతోషంగా ఉంది. ఇకపోతే, సినిమా ఇండస్ట్రీకి ప్రాంతీయత ఉండదు. అందరు హీరోల సినిమాలు ఆడాలి, అందరూ బాగుండాలి. నాకు 'ఫ్యాన్ వార్స్' నచ్చవు. నా సినిమా కలెక్షన్లు అందరినీ దాటేయాలని నేను కోరుకోను, అందరూ విజయం సాధించాలని ఆశిస్తాను" అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

"హరీష్ శంకర్ నన్ను బాగా నమ్ముతాడు. నాకు గుర్రపు స్వారీ రాకపోయినా 'గబ్బర్ సింగ్' లో చేయించాడు, ఇప్పుడు ఈ సినిమాలో నాతో డాన్స్ కూడా చేయించాడు. రాజకీయాల వల్ల నేను డేట్స్ ఇవ్వలేకపోయినా, కేవలం 40-45 రోజుల్లోనే రోజుకు 2-3 గంటలు కష్టపడి హరీష్ ఈ సినిమాను అద్భుతంగా ప్లాన్ చేశాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు పెద్ద ఊపునిచ్చింది. శ్రీలీల, రాశీ ఖన్నా తమ పాత్రల్లో ఒదిగిపోయారు."

"సినిమా ఫలితం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు, కానీ మేం మాత్రం ఎక్కడా తప్పు లేకుండా కష్టపడి పనిచేశాం. 'ఉస్తాద్ భగత్ సింగ్' లో ఎంటర్‌టైన్‌మెంట్ తో పాటు సామాజిక అవగాహన కూడా ఉంటుంది. మార్చి 19న విడుదల కాబోతున్న ఈ చిత్రం 'గబ్బర్ సింగ్' అంతటి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. చివరిగా ఒక్క మాట.. మిమ్మల్ని ప్రేమించే గోత్రం.. సేవ చేసే నక్షత్రం నాది" అని పవన్ కళ్యాణ్ ముగించారు.

ఆ తర్వాత డైరెక్టర్ హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. సినిమా ఆలస్యానికి తానే బాధ్యుడినని సరదాగా వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్‌ను "మా ఎమ్మెల్యే" అని సంబోధిస్తూ, ఆయన ఇమేజ్‌కు తగినట్లుగా పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని ధీమా వ్యక్తం చేశారు. ప్రమోషన్ కోసం ఆయన ధరించిన ప్రత్యేకమైన షర్ట్ అందరినీ ఆకట్టుకుంది.

హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం ఉగాది పండుగ సందర్భంగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్, రవిశంకర్ నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా.. ఎస్ఎస్ తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు. 

Also Read: Pawan Kalyan Remuneration: 'ఉస్తాద్ భగత్‌సింగ్' సినిమాకు పవన్‌కు షాకింగ్ రెమ్యూనరేషన్..మరీ ఇంత తక్కువ ఇచ్చారేంటి?

Also Read: Ustaad Bhagat Singh Trailer: పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ వచ్చేసింది! ఈసారి కొంచెం కొత్తగా..పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

154
comment0
Report
RGRenuka Godugu
Mar 15, 2026 12:43:34
Hyderabad, Telangana:

Nalgonda Auto Accident 4 Dead: నల్గొండ జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతపల్లి మండలం దేవతపల్లి గేటు వద్ద ఆటోని వేగంగా వచ్చిన భారీ లారీ ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఈ ప్రమాదంలో మరో ఆరుగురు కూడా తీవ్ర గాయాలైనట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక క్షతగాత్రులకు మెరుగైన సేవల కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని హైదరాబాద్‌కు వైద్యం నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

221
comment0
Report
HDHarish Darla
Mar 15, 2026 11:36:47
Moinabad, Telangana:

Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫార్మ్ హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో ఆయనది కీలకపాత్ర అని ఈగల్ టీమ్ గుర్తించింది. ఇందులో పట్టుబడ్డ తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్‌ను వదిలిపెట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే వీరితో ఉన్న ప్రియాంకా రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసినట్లు ఈగల్ పోలీసులు వెల్లడించారు. అయితే ఈ మాదకద్రవ్యాల పార్టీలో ముఖ్యులతో పాటు ఉన్న ఆ ప్రియాంక రెడ్డి ఎవరంటూ ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది. 

ఏం జరిగిందంటే?
మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫార్మ్ హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీని భగ్నం చేసేందుకు తొలుత ఈగల్ టీమ్ వెళ్లింది. దీంతో అక్కడి వాళ్లు అలర్ట్ అయ్యి వచ్చిన పోలీసులపై కాల్పులు జరిపడం సంచలనానికి గురిచేసింది. ఈ పార్టీలో మొత్తంగా 11 మంది పట్టుబడినట్లు తెలుస్తోంది.  ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ (టీడీపీ), మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడు రితీష్ రెడ్డితో పాటు ప్రియాంకరెడ్డి, పలువురు వ్యాపారవేత్తలు, రియల్టర్లు, కాంట్రాక్టర్లు ఉన్నట్లు ఈగల్ టీమ్ పోలీసులు వెల్లడించారు.

ప్రియాంక రెడ్డి ఎవరు?:
మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో దొరికిన ఏకైక మహిళ ప్రియాంక రెడ్డి (34 ఏళ్లు). ఈమె ఫిలింనగర్‌కు చెందిన హోమ్ మేకర్ అని సమాచారం. ఈమె శ్రీధర్ రెడ్డి అనే కాంట్రాక్టర్ భార్యగా పోలీసులు గుర్తించారు. 10 మంది పురుషుల మధ్య ఈమె ఒక్కరే ఉండటంతో పాటు ఈ పార్టీలో ఆమె పాత్ర ఏమిటన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ పార్టీలో ఈగల్ టీమ్ డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకుంది. సిమ్లా నుండి కొకైన్ ప్యాకెట్లు తెప్పించి పార్టీలో సరఫరా చేసినట్లు ఈగల్ పోలీసులు గుర్తించారు. రోహిత్ రెడ్డి పీఏ శ్రవణ్ కుమార్ వద్ద కూడా డ్రగ్స్ ప్యాకెట్లు దొరికినట్లు సమాచారం. దీంతో ఈగల్ పోలీసులు NDPS చట్టంతో పాటు ఆర్మ్స్ యాక్ట్ కింద్ కేసులు నమోదు చేసారు. ఈ పార్టీలో పాల్గొన్న 11 మందిలో 6 మందికి డ్రగ్స్ టెస్టులో పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు చెబుతున్నారు. 

గతంలో పైలట్ రోహిత్ రెడ్డి ఈ ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేసే సమయంలో దీని చుట్టూ సీసీ కెమెరాలు ఉండేవట.. కానీ, ఇప్పుడు వాటి జాడ కనిపించడం లేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలో రేంజ్ రోవర్, బెంజ్, డిఫెండర్, వోల్వో వంటి అత్యంత ఖరీదైన వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. 

Also Read: Pawan Kalyan Remuneration: 'ఉస్తాద్ భగత్‌సింగ్' సినిమాకు పవన్‌కు షాకింగ్ రెమ్యూనరేషన్..మరీ ఇంత తక్కువ ఇచ్చారేంటి?

Also Read: Kavya Maran Controversy: కావ్య మారన్‌కు దెబ్బ మీద దెబ్బ..సన్‌రైజర్స్ టీమ్‌లో ఆడనని చెప్పిన పాకిస్థాన్ ప్లేయర్..ఎందుకో తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

138
comment0
Report
HDHarish Darla
Mar 15, 2026 11:11:38
Hyderabad, Telangana:

Ustaad Bhagat Singh Pawan Kalyan Remuneration: సినిమాలు చేసినా చేయకపోయినా తెలుగు సినీఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయ్యాక ఆయన పాపులారిటీ మరింత పెరిగింది. డిప్యూటీ సీఎం పదవి చేపట్టాక.. ఆయన గురించి నేషనల్ వైడ్ గుర్తింపు అమాంతం పెరిగిపోయింది. ఈ సమయంలో ఎంతోమంది డైరెక్టర్లు, సినీ నిర్మాతలు ఆయనతో సినిమా చేసేందుకు క్యూ కడుతున్నారు. దాదాపుగా రూ.100 కోట్లు ఇచ్చైనా ఆయన డేట్స్ తీసుకునేందుకు బడా నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. కానీ, ఆయన రీసెంట్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకు పవన్ కల్యాణ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. 

పవన్ కల్యాణ్ హీరోగా  హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ఉగాది సందర్భంగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా రిలీజైన సినిమా ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. దానికి తోడు పవన్ కల్యాణ్‌కు 'గబ్బర్ సింగ్' లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన హరీశ్ శంకర్ మరోసారి ఈ సినిమాకు డైరెక్షన్ చేయడం వల్ల సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో పవర్ స్టార్ సరసన శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్, రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చగా.. ఎస్ఎస్ తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. అయితే ఈ సినిమాలో ఇంతమంది స్టార్ నటీనటులు ఉన్న నేపథ్యంలో వారి రెమ్యూనరేషన్ ఎంత అనే చర్చ ఇప్పుడు చిత్రసీమలో జరుగుతోంది. 

టాలీవుడ్ ఇండస్ట్రీ విశ్లేషకుల కథనం ప్రకారం.. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా కోసం హీరో పవన్ కల్యాణ్ కేవలం రూ.25 కోట్లు రెమ్యూనరేషన్‌తో పాటు రూ.5 కోట్లు అడ్వాన్స్ పుచ్చుకున్నట్లు సమాచారం. అయితే పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలో ఆయన రూ.50 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాకు ఎందుకు అంత తక్కువ తీసుకున్నాడనే చర్చ జరుగుతోంది. 

మైత్రీ మూవీస్ నిర్మాతలతో పవన్ కు ఉన్న సత్సంబంధాల కారణంగా ఆయన తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అంతే కాకుండా 'హరిహర వీరమల్లు' సినిమా విడుదల సమయంలో ఆయా ప్రొడ్యూసర్లు పవన్‌కు అండగా నిలిచి కృతజ్ఞతతో వీరికి తక్కువ రెమ్యూనరేషన్‌తో సినిమాలో నటించినట్లు తెలుస్తోంది. పవన్ గత సినిమాలు, పొలిటికల్ కెరీర్ కారణంగా ఆయన సినిమాలకు ఎన్నికల ముందు కొంత గ్యాప్ ఇవ్వడం వల్ల ఈ సినిమాపై ఎలాంటి భారం పడకుండా పవన్ తనకు రావాల్సిన రెమ్యూనరేషన్ తగ్గించుకొని నిర్మాతలకు న్యాయం చేశాడని చిత్రసీమలో అనుకుంటున్నారు. 

మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన శ్రీలీల రూ.2.5 నుంచి రూ.3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందని సమాచారం. అలాగే రెండో హీరోయిన్ రాశీ ఖన్నా కోటిన్నర రూపాయలు పారితోషకం తీసుకున్నట్లు చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా విడుదల  కానున్న నేపథ్యంలో ఈరోజు అనగా మార్చి 15న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. 

Also Read: Cobra Viral Video: పాముతో ఈ ఆటలు ఏంటి అక్క! బొమ్మతో ఆడినట్లు పామును పట్టిన ముద్దుగుమ్మ! వైరల్ వీడియో!

Also Read: Kavya Maran Controversy: కావ్య మారన్‌కు దెబ్బ మీద దెబ్బ..సన్‌రైజర్స్ టీమ్‌లో ఆడనని చెప్పిన పాకిస్థాన్ ప్లేయర్..ఎందుకో తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

374
comment0
Report
IPInamdar Paresh
Mar 15, 2026 10:44:06
Hyderabad, Telangana:

Woman attacks on passengers in running train video: సోషల్ మీడియాలో తరచుగా అనేక వీడియోలు వైరల్గా మారుతుంటాయి. ముఖ్యంగా నెటిజన్లు వైరల్ వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుంటారు. అందుకే ఎక్కడ ఎలాంటి ఫన్నీ ఘటనలు జరిగిన వెంటనే తమఫోన్ లలో రికార్డు చేసి చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. దీంతో అవి కాస్త వైరల్గా మారతాయి. ఇటీవల రన్నింగ్ ట్రైన్ లలో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. కొంతమంది మహిళలు సీట్ల విషయంలో తోటి ప్రయాణికులతో గొడవలు పడుతున్నారు.జుట్టు పట్టుకుని కొట్టుకుంటున్నారు. ఈ గొడవలు కాస్త పీక్స్ కు వెళ్లిపోతున్నాయి. మరికొంతమంది రైళ్లలో వాష్ రూమ్ లలో రొమాన్స్ లు చేసుకుంటున్నారు.

 

మొత్తంగా రైల్వే వ్యవస్థను కొంతమంది తమఛెండాలమైన పనులకు అడ్డాలుగా మార్చుకుంటున్నారు. తాజాగా.. వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతి తోటి ప్రయాణికులతో గొడవలకు దిగింది. మరీ ఆమె ఎందుకు గొడవలు పడిందో తెలీదు.

ఇద్దరుమహిళలపై విరుచుకుపడింది. అక్కడి వారు చెబుతున్న వెనక్కు తగ్గలేదు. కిందపడేసి మరీ దాడులు చేసింది.ఇంతలో ఒక యువకుడు కల్గచేసుకున్నారు. కొపంలో ఆమె అతడ్ని కూడా ట్రైన్ లో కిందపడేసి కొట్టింది.

Read more: Video Viral: రన్నింగ్ ట్రైన్‌లో మహిళ ఓవరాక్షన్.. ఏకంగా తోటి ప్రయాణికుడి మీద కాళ్లతో.. వీడియోపై దుమారం..

ఆతర్వాత అందరు కలిసి ఆమెను కూల్ చేశారు.  మొత్తంగా సీటు విషయంలో గొడవలు పడ్డారో లేదా ఏమైన తిట్టుకున్నారో కానీ వీరు జుట్టు పట్టుకుని గొడవలు పడటంకు చెందిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు.ఏంట్రా బాబోయ్ ఈ  అరాచకం అంటూ బిత్తరపోతున్నారు.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

177
comment0
Report
Advertisement
Back to top