రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద ఆశ ల ధర్నా
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఆశావర్కర్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. సుమారు రెండు గంటలపాటు ఎండలోనే నిరసన కొనసాగింది. మేము ఎండలో, మీరు ఏసీ గదుల్లో. అధికారులపై విమర్శలు చేశారు. ఈసందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ ఆశావర్కర్ల సమస్యల పరిష్కారానికి ఎన్నోసార్లు పోరాటాలు చేసిన నాటి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేసిందన్నారు తన మేనిఫెస్టోలో కూడా పేర్కొన్నాడు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
How 10 Minute Delivery Model Works: క్విక్ కామర్స్ యాప్లు ఈరోజుల్లో 10 నిమిషాల్లో డెలివరీ చేయడం చూస్తే అది ఏదో మాయలా అనిపిస్తుంది. కానీ దీని వెనుక రిస్క్ డ్రైవింగ్ ...టెక్నాలజీ.. డేటా విశ్లేషణ.. చక్కటి ప్లానింగ్ నెట్వర్క్ ఉంది. జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్, ఫ్లిప్కార్ట్ మినిట్స్ వంటి కంపెనీలు ఈ వ్యవస్థను ఉపయోగించి మన రోజువారీ షాపింగ్ అలవాట్లనే మార్చేశాయి. ఒక ఉదాహరణగా తీసుకుంటే.. మీరు టీ పెట్టేటప్పుడు చక్కెర అయిపోయింది అనుకోండి.. వెంటనే మొబైల్ యాప్ ఓపెన్ చేసి ఆర్డర్ చేస్తారు. డికాషన్ మరిగేలోపే.. చక్కెర మీ ఇంటి గుమ్మం వద్ద ఉంటుంది. ఇంత ఫాస్టుగా ఎలా డెలివరీ చేస్తారు. తెలుసుకుందాం.
క్విక్ కామర్స్ అంటే ఏమిటి?
క్విక్ కామర్స్ అనేది రోజువారీ అవసరాలైన కిరాణా, స్నాక్స్, పానీయాలు వంటి వస్తువులను చాలా తక్కువ సమయంలో వినియోగదారులకు చేరవేసే మోడల్. ఇందులో ప్రధానమైన అంశం ఏమిటంటే.. వస్తువులు మీ ఇంటికి చాలా దగ్గరలో ఉన్న గిడ్డంగిలోనే స్టోర్ అయి ఉంటాయి. సాధారణంగా ఈ గిడ్డంగి మీ ఇంటికి 1–2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందుకే డెలివరీకి ఎక్కువ సమయం పట్టదు.
డార్క్ స్టోర్స్ – వేగానికి అసలైన బలం:
10 నిమిషాల డెలివరీకి ప్రధాన కారణం డార్క్ స్టోర్స్. ఇవి సాధారణ షాపులు కావు. కస్టమర్లు లోపలికి వెళ్లి కొనుగోలు చేసే అవకాశం ఉండదు. ఇవి జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చిన్న గిడ్డంగులు. బేస్మెంట్లు, ఖాళీ వాణిజ్య భవనాలు లేదా సందుల్లో ఇవి పనిచేస్తుంటాయి. మీ ఇంటికి దగ్గరగా ఉండటం వల్ల డెలివరీ సమయం గణనీయంగా తగ్గిపోతుంది.
డేటానే నిర్ణయం తీసుకుంటుంది:
ఈ డార్క్ స్టోర్స్లో ఏ వస్తువులు నిల్వ చేయాలన్నది మేనేజర్ ఇష్టానికి వదిలేయరు. ఏ ప్రాంతంలో ఏ సమయంలో ఏ వస్తువు ఎక్కువగా అమ్ముడవుతుందో కంపెనీలు డేటా ద్వారా తెలుసుకుంటాయి. ఉదాహరణకు.. రాత్రి సమయంలో ఒక ప్రాంతంలో ఐస్క్రీమ్ లేదా స్నాక్స్ డిమాండ్ ఎక్కువగా ఉంటే.. ఆ స్టోర్లో అవే ఎక్కువగా నిల్వ చేస్తారు. దీనివల్ల కస్టమర్ ఆర్డర్ చేసిన వెంటనే వస్తువు అందుబాటులో ఉంటుంది.
ఆర్డర్ చేసేలోపే పని మొదలవుతుంది:
మీరు యాప్లో ఒక ఉత్పత్తిని సెర్చ్ చేసిన క్షణంలోనే సిస్టమ్ పని చేయడం మొదలుపెడుతుంది. సమీపంలోని డార్క్ స్టోర్లో స్టాక్ ఉందా లేదా చెక్ చేస్తుంది. ఏ ఉద్యోగి ప్యాక్ చేయాలి.. ఏ రైడర్ డెలివరీ చేయాలి అన్నది ముందుగానే నిర్ణయిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు చెల్లింపు పూర్తి చేయకముందే ప్యాకింగ్ ప్రారంభమవుతుంది. సాధారణంగా మొత్తం ఆర్డర్ 60 నుంచి 90 సెకన్లలో ప్యాక్ అయిపోతుంది.
రియల్ టైమ్ GPS, రైడర్ ప్లానింగ్:
డెలివరీ రైడర్లు స్టోర్ దగ్గరే సిద్ధంగా ఉంటారు. GPS, AI ఆధారిత సాఫ్ట్వేర్ ద్వారా ఎవరు దగ్గరగా ఉన్నారు. ఏ రూట్లో ట్రాఫిక్ తక్కువగా ఉందో సిస్టమ్ నిర్ణయిస్తుంది. దీనివల్ల రైడర్ వేగంగా లేదా ప్రమాదకరంగా డ్రైవ్ చేయాల్సిన అవసరం లేకుండా.. సమయానికి డెలివరీ పూర్తవుతుంది. ప్రతి నిమిషం టెక్నాలజీ ద్వారానే లెక్కిస్తుంది.
మన షాపింగ్ అలవాట్లలో మార్పు:
ఈ 10 నిమిషాల డెలివరీ సౌలభ్యం మన ఆలోచన విధానాన్ని కూడా మార్చింది. ఒక నెలకు సరిపడా సరుకులు కొనడం తగ్గి.. అవసరమైనప్పుడు అవసరమైనంత మాత్రమే ఆర్డర్ చేసే అలవాటు పెరిగింది. దీని వల్ల కొనుగోళ్లు ఎక్కువసార్లు జరుగుతున్నాయి. సౌలభ్యం పెరిగింది కానీ ముందుగా ప్లాన్ చేసుకునే అలవాటు కొంత తగ్గింది.
Also Read: Future Metal: బంగారం, వెండి, ప్లాటినం, రాగి కాదు.. భవిష్యత్ అంతా ఈ లోహానిదే..లాభాలే లాభాలు..!!
క్విక్ కామర్స్ భవిష్యత్తు:
జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్, డన్జో వంటి కంపెనీలు తమ నెట్వర్క్ను మరింత బలోపేతం చేస్తున్నాయి. భవిష్యత్తులో డెలివరీలు ఇంకా వేగంగా, వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టుగా మారే అవకాశం ఉంది. 10 నిమిషాల డెలివరీ ఇక కేవలం సౌలభ్యం కాదు. పట్టణ జీవనశైలిలో ఒక భాగంగా మారుతోంది. టెక్నాలజీ, డేటా, స్థానిక ఉనికిని సమర్థంగా కలపగలిగినవారే ఈ రంగంలో ముందుండనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
EPFO Big Update: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పరిధిలో ఉన్న ఉద్యోగులకు ఈ ఏడాది మంచి శుభవార్త అందే అవకాశం ఉంది. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో జమయ్యే వార్షిక వడ్డీ ఈసారి భారీగా ఉండే అవకాశం ఉంది. సుమారు 8.75 శాతం వడ్డీ రేటు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పీఎఫ్ అకౌంట్లో రూ. 5లక్షలు ఉన్న ఉద్యోగులకు వేలల్లో లాభం దక్కనుంది.
ఉదాహరణకు.. ఒక ఉద్యోగి PF ఖాతాలో రూ.5 లక్షల బ్యాలెన్స్ ఉంటే.. ఏడాదికి దాదాపు రూ.44,000 వరకు వడ్డీ జమ అవుతుంది. ఇదే బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఉంటే.. వడ్డీ మొత్తం సుమారు రూ.51,000 వరకు చేరుతుంది. అంటే బ్యాలెన్స్ ఎంత ఎక్కువగా ఉంటే.. వడ్డీ రూపంలో వచ్చే ప్రయోజనం కూడా అంతగా పెరుగుతుందన్న మాట. ఈ విధంగా EPF దీర్ఘకాలంలో ఉద్యోగుల పదవీ విరమణ పొదుపును మరింత బలోపేతం చేస్తోంది.
ప్రతి సంవత్సరం EPFO వడ్డీ రేటును ప్రకటించినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వ ఆమోదం తర్వాతే ఖాతాల్లో వడ్డీ మొత్తం జమ అవుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. వడ్డీ మొత్తం ఆటోమెటిగ్గా PF పాస్బుక్లో కనిపిస్తుంది. ఇందుకోసం సభ్యులు ఎలాంటి ప్రత్యేక దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉండదు.
Also Read: Future Metal: బంగారం, వెండి, ప్లాటినం, రాగి కాదు.. భవిష్యత్ అంతా ఈ లోహానిదే..లాభాలే లాభాలు..!!
తమ PF బ్యాలెన్స్.. వడ్డీ వివరాలను ఉద్యోగులు చాలా సులభంగా ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. UMANG యాప్ లేదా EPFO సభ్యుల పోర్టల్ ద్వారా ఈ సమాచారం అందుబాటులో ఉంటుంది. UMANG యాప్లోకి వెళ్లి EPFO సేవలను ఎంచుకుని పాస్బుక్ వ్యూ.. అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. అక్కడ మీ UAN నంబర్ నమోదు చేసి, మొబైల్కు వచ్చిన OTP ద్వారా ధృవీకరణ పూర్తిచేస్తే, సభ్యుల IDని ఎంచుకుని పాస్బుక్ను చూడవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఎటువంటి అదనపు పెట్టుబడి చేయకుండానే ప్రతి ఏడాది వడ్డీ రూపంలో వచ్చే ఈ ఆదాయం ఉద్యోగులకు పెద్ద ఊరట అని చెప్పవచ్చు. భద్రత, స్థిరత్వం, పన్ను ప్రయోజనాల పరంగా EPF ఇప్పటికీ జీతం పొందే ఉద్యోగులకు అత్యంత నమ్మకమైన పొదుపు పథకాలలో ఒకటిగా కొనసాగుతోంది. ముఖ్యంగా వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా ఉన్నప్పుడు, EPF ఖాతా భవిష్యత్తుకు బలమైన ఆర్థిక ఆధారంగా నిలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
KTR Chit Chat: జీహెచ్ఎంసీ విభజనపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. 'జీహెచ్ఎంసీని మూడు చేస్తారు. ఫోర్త్ సిటీ అని పెట్టాడు కదా దాన్ని కూడా ఏదో కార్పొరేషన్ చేస్తాడు కావచ్చు. ఏం చేసినా శాస్త్రీయంగా ఉండాలి కానీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకుంటారా? అన్నింటికి సమాధానం చెప్పాలి' అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీలో చర్చ పెట్టాలి.. చర్చలో మేము అన్ని మాట్లాడతామని తెలిపారు.
Also Read: KTR Chit Chat: కేసీఆర్కు పేరు.. చంద్రబాబుకు కోపం వస్తుందని రేవంత్ రెడ్డి డ్రామాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ సోమవారం కేటీఆర్ మీడియాతో కేటీఆర్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ పరిపాలన యంత్రాంగం విభజనపై స్పందించిన కేఈఆర్.. 'జీహెచ్ఎంసీలో కాంగ్రెస్, ఎంఐఎం ఏం చేసుకుంటారో..? ఎవరికి లాభం చేకూర్చేలా చేసుకుంటారో వాళ్ల ఇష్టం. మాకు 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నిక చరిత్రాత్మక ఎన్నిక. అలాంటి ఎన్నిక ఇప్పటివరకు చూడలేదు. మళ్లీ చూడబోము' అని తెలిపారు. కేవలం డబ్బులు సేకరణ కోసం మర్చంట్ బ్యాంకర్ బ్రోకర్లు చెప్పినట్లు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. 'ఈ డిలిమిటేషన్ కేవలం డబ్బుల కోసం చేస్తున్నదే. అడ్డగోలుగా విభజన చేశారు. గతంలో ఓల్డ్ సిటీలో కూడా మేము రెండో స్థానంలో గెలవడం జరిగింది. గతంలో మేం గెల్చిన సీట్లు ఇంకా ఎవరు గెలవలేరు' అని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు.
Also Read: Tirumala Temple: ఇల వైకుంఠంగా తిరుమల ఆలయం.. శ్రీవారికి ఎవరూ దిష్టి పెట్టొద్దు
టెలిఫోన్ ట్యాపింగ్పై నానా హడావుడి చేస్తున్న రేవంత్ రెడ్డి తీరుపై కేటీఆర్ స్పందిస్తూ.. 'ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ వస్తుంది. గుడాచారి వ్యవస్ధ నెహ్రు నుంచి నేటి దాకా ఉంది. శాంత్ర భద్రతలు, రాష్ట్ర రక్షణ కోసం చేస్తున్నారు. ఈ రోజు నిఘా వ్యవస్ధ లేదా? ఫోన్ ట్యాపింగ్ నడుస్తలేదా? ప్రతిపక్షనాయకుల ఫోన్ ట్యాప్ చేయడం లేదా?' అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. ఫోన్లు ట్యాపింగ్ చేయడం లేదని రేవంత్ రెడ్డి చెప్పగలడా? అని సవాల్ చేశారు.
Also Read: KTR: రైతుబంధు పాలన పోయింది రాబందు పాలన వచ్చింది: కేటీఆర్
'ట్యాపింగ్ నిజం అయితే అధికారులు ఎందుకు ప్రెస్మీట్ పెట్టడం లేదా? ఇప్పుడున్న డీజీపీ కూడా అప్పుడు అధికారులుగా ఉన్నారు. అయనకు కూడా నిఘా వ్యవస్ధ గురించి తెలుసు. ఏ విధంగా నిఘా వ్యవస్ధ పనిచేస్తుందో ముఖ్యమంత్రికి అధికారులు చెప్పరు. వారికున్న నిబంధనల మేరకు ఎలాం సమాచారం వస్తుందో కూడ సీఎం అడగరు' అని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. 'ఈ సిట్ వంటి డ్రామాలతో ఎన్ని రోజులు ప్రజల దృష్టిని తప్పిస్తారు. ఈ అటెన్షన్ డైవర్షనతో ఎన్ని రోజులు కాలం వెల్లదీస్తారు? ఇన్ని సిట్లు, విచారణలు, కేసుల పేరుతో సాధించింది ఏమిటి?' అని కేటీఆర్ ప్రశ్నించారు.
కనీసం ఒక్క దాంట్లో అయినా నిజం ఉందని తేలిందా? అని కేటీఆర్ నిలదీశారు. 'ప్రజలు ఈ డైవర్షన్లను గ్రహిస్తున్నారు. అందుకే మాకు సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు మాకు ఒటు వేశారు. కాంగ్రెస్ పార్టీకి పరిపాలన రాదు అని తేలిపోయింది. కాంగ్రెస్ అప్పుల ప్రచారం కూడా ప్రజలు నమ్మడం లేదు. కాగ్ లెక్కలు నిజాల కూడా ప్రజలకు తెలుసు. 24 నెలల్లో చేసిన రెండున్నర లక్షల కోట్ల అప్పుతో ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Hyderabad police filed case against Actress madhavi latha: నటి మాధవీలత ఇటీవల తరచుగా కాంట్రవర్సీలలో ఉంటున్నారు. గతంలో ఏడాది క్రితం అచ్చం ఇలానే న్యూ ఇయర్ వేళ తాడిపత్రిలో మహిళలు రాత్రిపూట న్యూ ఇయర్ సంబరాల్లో మహిళలు పాల్గొనడంపై మాట్లాడారు. రాత్రిపూట ఏదైన జరిగితే ఎవరు బాధ్యులని అన్నారు. ఈవెంట్లకు రాత్రిపూట వెళ్లడం అవసరమా..?. అంటూ మాట్లాడారు .దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి నటి మాధవీలత మధ్య వివాదం పీక్స్ కు చేరింది. దీనిపై తాడిపత్రిలో మాధవీలతపై మహిళలు కేసు నమోదుచేశారు. ఇదిలా ఉండగా.. మరోవైపు మాధవీలత మరోసారి చిక్కుల్లో పడ్డారు.
ఇటీవల మహా రాష్ట్రలో ప్రసిద్దమైన ఆలయమైన షిర్డీసాయిపై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. సాయి బాబా ఒక ముస్లిం ఫకీరు అని, ఆయనను ముస్లింవారు కొలవరని అన్నారు. అంతే కాకుండా..మన హిందువులే సిగ్గులేకుండా సాయిబాబాను పూజిస్తున్నారని మండిపడ్డారు.
అంతేకాకుండా.. వీరికి అసలు బుద్దిలేదని ఎందుకు పూజిస్తారో వారికి తెలియదని అన్నారు. చాలా మంది తమ జీవితాల్లో సాయిబాబా వల్ల ఏదో అద్బుతం జరిగిందని అంటారని, అది అవాస్తవమని మీ టైమ్ బాగుండి మంచి జరిగిందని మాధవీలత మాట్లాడారు. దీనిపై ప్రస్తుతం వివాదం రాజుకుంది.
నటి మాధవీలతపై కొంత మంది సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మాధవీలతతో పాటు, మరికొంత మందిపై కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వివాదంపై రేపు తమ ఎదుట విచారణకు హజరు కావాలని మాధవీలతతో పాటు మరో 14 మంది యూట్యూబర్ లపై పోలీసులు నోటీసులు జారీ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Dmart: డీమార్ట్..ఈ పేరు వినగానే ఠక్కున గుర్తుకు వచ్చేది తక్కువ ధరలకు వస్తువులు లభిస్తాయని. సామాన్యుల నుంచి మధ్య తరగతి వరకు అందరూ డీమార్ట్ లోనే షాపింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే ప్రతిరోజూ అనేక రకాల వస్తువులపై డిస్కౌంట్లు, ఆఫర్లు లభిస్తాయి. అంతేకాదు అన్ని రకమైన వస్తువులు, ఇతర సూపర్ మార్కెట్ల కంటే తక్కువ ధరలకు లభిస్తాయి. మార్ట్ మొత్తం తిరుగుతూ అవసరమైన వస్తువులన్నీ ఒకేచోట కొనుగోలు చేయవచ్చు. దీన్ని క్యాష్ చేసుకున్న డీమార్ట్ దేశవ్యాప్తంగా మరిన్ని స్టోర్లను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. తక్షణ లాభాలకన్నా దీర్ఘకాలిక వృద్ధిపై దృష్టి పెట్టి భారీ స్టోర్ విస్తరణను కొనసాగిస్తోంది. జియో మార్ట్, బ్లింకెట్ వంటి యాప్స్ దూకుడు చూపిస్తున్న వేళ డీమార్ట్ ఈ కీలక నిర్ణయం తీసుకుందని.. CLSA నివేదిక పేర్కొంది.
CLSA ఇండియా విడుదల చేసిన తాజా వీకెండర్ ఆల్ థింగ్స్ ఇండియా నివేదిక ప్రకారం.. భారతీయ రిటైల్ రంగంలో అగ్రగామిగా ఉన్న డీమార్ట్ (DMart) తక్షణ లాభాలకన్నా దీర్ఘకాలిక వృద్ధికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం సంస్థ భారీ స్థాయిలో స్టోర్ విస్తరణ వ్యూహాన్ని అమలు చేస్తోంది. అయితే ఈ దూకుడు విస్తరణ వల్ల సమీప కాలంలో కంపెనీకి పెద్దగా ఫ్రీ క్యాష్ ఫ్లో లభించకపోవచ్చని నివేదిక పేర్కొంది.
డీమార్ట్ ప్రస్తుతం వేగవంతమైన విస్తరణ దశలో ఉందని CLSA రిపోర్టు పేర్కొంది. కంపెనీ ప్రతి ఏడాది సుమారు 15 నుంచి 20 శాతం వరకు కొత్త స్టోర్లు కొత్త ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. రిటైల్ రంగంలో విస్తరణ ప్రారంభ దశలో ఉన్న పెద్ద సంస్థలకు ఇది సాధారణమైన వ్యూహమేనని నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుతం డీమార్ట్ మేనేజ్మెంట్కు దాదాపు 2,200 స్టోర్లు ఏర్పాటు చేయాలన్న ప్లాన్ లో ఉన్నట్లు తెలిపింది. రాబోయే రోజుల్లో ప్రారంభించాల్సిన ప్రాజెక్టుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. కంపెనీ స్వల్పకాలిక ఫ్రీ క్యాష్ ఫ్లో తక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాల్మార్ట్, కాస్ట్కో వంటి దిగ్గజ సంస్థలను పరిశీలిస్తే.. స్టోర్ విస్తరణ వేగం తగ్గి అది సాధారణ స్థాయికి చేరుకున్నప్పుడు క్యాష్ ఫ్లో గణనీయంగా మెరుగుపడుతుందని CLSA నివేదిక చెబుతోంది.
పోటీకి ఎదురొడ్డి నిలవడానికి డీమార్ట్ తన ప్రైవేట్ లేబుల్ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ ఉత్పత్తుల ధరలు పేరొందిన బ్రాండ్లతో పోలిస్తే 40 నుంచి 50 శాతం వరకు తక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అయితే బ్రాండెడ్ ఉత్పత్తుల ధరలో మూడో వంతు మాత్రమే ఉండడం డీమార్ట్కు పెద్ద ప్రయోజనంగా మారుతోంది. ఇక స్పీడ్ డెలివరీ కోసం క్విక్ కామర్స్ యాప్ల వినియోగం పెరుగుతున్నప్పటికీ.. 2035 నాటికి ఈ సేవలు పట్టణ వినియోగంలో 20 శాతం కంటే తక్కువగానే ఉంటాయని CLSA అంచనా వేస్తోంది. దీని వల్ల డీమార్ట్ వంటి భౌతిక దుకాణాలకు భవిష్యత్తులో కూడా మంచి డిమాండ్ కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
డిజిటల్ ప్లాట్ఫారమ్ల పనితీరును కూడా ఈ నివేదిక విశ్లేషించింది. డిసెంబర్ 8తో ముగిసిన వారంలో జియోమార్ట్ వారపు యాక్టివ్ యూజర్ల సంఖ్యలో అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. దాని తర్వాత స్థానంలో బ్లింకిట్ నిలిచింది. చాలా వరకు ప్రధాన ఈ-కామర్స్ యాప్లకు యూజర్లు తగ్గినప్పటికీ.. మీషో మాత్రం తన యూజర్ బేస్ను పెంచుకుని 169.8 మిలియన్లకు చేరుకుంది.
ఫుడ్, కిరాణా డెలివరీ రంగంలో పోటీ మరింత తీవ్రంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఫుడ్ డెలివరీలో జొమాటో, స్విగ్గీ ప్రధాన పోటీదారులుగా కొనసాగుతుండగా.. క్విక్ కామర్స్ విభాగంలో బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్స్టామార్ట్ మధ్య పోటీ కొనసాగుతోంది. ఈ డిజిటల్ వృద్ధి ఉన్నప్పటికీ, డీమార్ట్ వంటి సంప్రదాయ రిటైలర్లు భవిష్యత్ లాభాల కోసం తమ భౌతిక స్టోర్ నెట్వర్క్ను విస్తరించడంపైనే దృష్టి సారిస్తున్నారని CLSA నివేదిక తేల్చి చెప్పింది.
Also Read: Future Metal: బంగారం, వెండి, ప్లాటినం, రాగి కాదు.. భవిష్యత్ అంతా ఈ లోహానిదే..లాభాలే లాభాలు..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Hindustan Copper Share Price: సోమవారం భారత స్టాక్ మార్కెట్లు ప్రారంభం నుంచే మందకొడిగా ట్రేడ్ అయ్యాయి. ప్రధాన సూచీలు.. పెద్దగా కదలిక చూపకుండా.. పరిమిత శ్రేణిలోనే కొనసాగాయి. అయితే ఈ నమ్మది మార్కెట్ వాతవరణంలో కూడా హిందూస్థాన్ కాపర్ షేర్లు మాత్రం ఇన్వెస్టర్లను ఆకర్షించాయి. ఉదయం ట్రేడింగ్ లో ఈ షేర్ ఒక్కసారిగా దాదాపు 11శాతం లాభపడింది. బీఎస్ఈలో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో హిందూస్థాన్ కాపర్ షేర్ ధర రూ. 11.13శాతం పెరిగి రూ. 528.55 వద్ద ట్రేడ్ అవుతోంది.
అయితే హిందూస్థాన్ కాపర్ షేర్ల ర్యాలీ అనేది ఒక్కరోజుకే పరిమితం కాలేదు. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో గమనిస్తే.. ఈ షేర్ ధర దాదాపు 32శాతం మేర పెరిగింది. దలాల్ స్ట్రీట్ లో ఈ మధ్యకాలంలో అత్యధిక రాబడులు అందించిన షేర్లలో ఒకటిగా నిలిచింది. మొత్తం మార్కెట్ ఒత్తిడిలో ఉన్నా.. హిందూస్థాన్ కాపర్ షేర్లు బలంగా ముందుకు సాగడంతో ఇన్వెస్టర్లు పండగ చేసుకుంటున్నారు.
ఇక ఈ బలమైన పెరుగుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో రాగి ధరలు పెరగడమేనని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా రాగికి డిమాండ్ వేగంగా పెరుగుతుండటంతోపాటు సరఫరా పరిమితంగా ఉండటం వల్ల ధరలకు రెక్కలు వచ్చాయి. ఫలితంగా రాగి భారీ స్థాయిలో పెరిగింది. ఈ పరిస్థితి హిందూస్థాన్ కాపర్ వంటి మైనింగ్, లోహ రంగ సంస్థలకు ప్రత్యక్ష లాభాలను తెచ్చిపెడుతోంది.
ఎలక్ట్రిక్ వెహికల్స్, విద్యుత్ ప్రసార నెట్ వర్క్స్, సౌరశక్తి ప్రాజెక్టులు..పెద్దెత్తున మౌలిక సదుపాయల అభివ్రుద్ధిలో కాపర్ వినియోగం భారీగా పెరుగుతోంది. ఈ రంగాల విస్తరణలో రాగి డిమాండ్ మరింత పెరుగుతోంది. రాగి ధరలు పెరగడంతో హిందూస్థాన్ కాపర్ వంటి కంపెనీలకు కొత్త ఆదాయ అవకాశాలు లభిస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గ్లోబల్ అంశాలతో పాటు, కంపెనీ అంతర్గతంగా చేపడుతున్న చర్యలు కూడా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతున్నాయి. హిందుస్తాన్ కాపర్ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంపై, విస్తరణ ప్రణాళికలను అమలు చేయడంపై దృష్టి పెట్టింది. ఉత్పత్తి పెరిగితే ఆదాయం, లాభదాయకత మెరుగవుతాయన్న అంచనాలు ఉన్నాయి. ఈ కారణంగానే పెట్టుబడిదారులు ఈ షేరుపై సానుకూల దృక్పథంతో ఉన్నారు.
ఇటీవలి ర్యాలీకి రిటైల్ పెట్టుబడిదారులతో పాటు సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి వచ్చిన బలమైన కొనుగోళ్లు కూడా కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బలమైన డిమాండ్, స్థిరంగా కొనసాగుతున్న గ్లోబల్ రాగి ధరలు, కంపెనీ విస్తరణ ప్రణాళికలపై ఉన్న అంచనాలు కలిసి హిందుస్తాన్ కాపర్ షేర్లకు మద్దతుగా నిలుస్తున్నాయి. లోహ రంగంపై సానుకూల సెంటిమెంట్ కొనసాగితే.. అంతర్జాతీయ మార్కెట్లలో రాగి ధరలు బలంగా ఉంటే.. హిందుస్తాన్ కాపర్ షేర్లు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని లాభాలు సాధించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే.. ప్రపంచ మార్కెట్ పరిణామాలు లోహ ధరల్లో వచ్చే మార్పులను దృష్టిలో ఉంచుకొని పెట్టుబడిదారులు జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Future Metal: బంగారం, వెండి, ప్లాటినం, రాగి కాదు.. భవిష్యత్ అంతా ఈ లోహానిదే..లాభాలే లాభాలు..!!
Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Silver Cobra Video Viral News: థాయ్లాండ్లోని బ్యాంకాక్ నగరంలో ఆహారం కోసం మాంసం మార్కెట్లోకి సంచారం చేసిన సిల్వర్ కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు చాండ్లర్స్ వైల్డ్ లైఫ్ అనే యూట్యుబ్ ఛానెల్ నుంచి పోస్ట్ చేశారు. అయితే, ఈ వీడియోలో కింగ్ కోబ్రా అత్యంత విచిత్రంగా ఉండడం నెటిజన్స్ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆహారం కోసం మాంసం మార్కెట్లో ఈ పాము హల్చల్ చేయడానికి సంబంధించిన ఘటన వైరల్గా మారింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
నాగుపాములు అంటే ప్రజలు ఎంతగానో భయపడుతూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది వాటిని చూసి వణికిపోతారు. అలాంటిది బ్యాంకాక్లోని ఒక స్థానిక మాంసం మార్కెట్లో ఇప్పుడు ఓ వింతమైన సిల్వర్ కలర్ నాగుపాము దర్శనమిచ్చింది. అంతేకాకుండా ఈ పాము శరీరం వింతగా దగదగ మెరిపోవడం కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు.. అయితే, ఈ వీడియో చూసిన కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు ఇది కాలికో మర్ఫ్ మోనోక్లెడ్ కోబ్రా గుర్తించారు. ప్రకృతిలో ఇలాంటి పాములు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అందులో ఇది ఒకటని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు తెలుపుతున్నారు.
బ్యాంకాక్లోని ఈ పాము పాముల మాంసం విక్రయించే షాపుల సమీపంలోకే రావడం వల్ల అక్కడే ఉన్న కొంతమంది దీనిని పట్టుకుని చంపేందుకు ప్రయత్నించారు. అయితే, ఓ యుకుడు ఈ పామును వారి నుంచి కొనుగోలు చేసి, రెస్క్యూ చేసినట్లు తెలుస్తోంది. దీనికి అక్కడున్న కొంతమంది స్థానికులు కూడా ప్రశంసించినట్లు సమాచారం.. నిజానికి ఇలాంటి అరుదైన జీవులను రక్షించడం ప్రకృతికి చాలా మంచిదని.. వీటివల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని కొంతమంది స్నేక్ క్యాచర్స్ తెలుపుతున్నారు.
ఈ సిల్వర్ కింగ్ కోబ్రా చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉండడం మీరు చూడొచ్చు. ఇది చూడడానికి చాలా బాగున్నప్పటికీ ఎంతో డేంజర్ అని కొంతమంది వన్యప్రాణి నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇలాంటి పాములు అత్యంత దూకుడు స్వభావాన్ని కూడా కలిగి ఉంటాయి. అలాగే శక్తివంతమైన కింగ్ కోబ్రాలకు ఉండే విషమే వీటికి కూడా ఉంటుంది. కానీ ఇలాంటి కొన్ని పాములు మాత్రం స్వల్ప పరిమాణంలో విషాన్ని కలిగి ఉంటున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hindus Safety Muslim country: మనకు పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో.. హిందూ మైనార్టీలపై జరుగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలు తరచుగా వార్తల్లోకి వస్తూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన దాడుల్లో ఒక హిందూ యువకుడు ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు అక్కడి పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో చెప్పకనే చెబుతున్నాయి. ఇలాంటి పరిణామాల మధ్య.. ప్రపంచంలోనే ఒక ముస్లిం దేశం మాత్రం హిందువులకు అసాధారణ స్థాయిలో భద్రత, గౌరవం కల్పిస్తూ ప్రత్యేకంగా నిలుస్తోంది.ఆ దేశం ఏదో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు.
హిందువులకు అత్యంత భద్రమైన ముస్లిం దేశం:
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) హిందువులకు అత్యంత సురక్షితమైన ముస్లిం దేశంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.ఇతర దేశాల్లో మైనారిటీలు భయం.. వివక్షను ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నప్పటికీ.. UAEలో మాత్రం హిందువులు తమ మతాన్ని స్వేచ్ఛగా.. బహిరంగంగా ఆచరిస్తున్నారు. ఇక్కడ మత స్వేచ్ఛను కేవలం మాటలకే పరిమితం చేయకుండా.. కఠినమైన చట్టాల ద్వారా అమలు చేస్తున్నారు.
2023లో అమల్లోకి వచ్చిన ఫెడరల్ లా నంబర్ 34 ప్రకారం.. ఏ మతానికైనా వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగం, మతపరమైన అవమానం లేదా వివక్ష ప్రదర్శించడం నేరంగా పరిగణిస్తారు. ఈ చట్టం హిందువులతో పాటు అన్ని మతాలకు సమానంగా రక్షణ కల్పిస్తుంది. నేరానికి పాల్పడిన వారికి భారీ జరిమానాలు, జైలు శిక్ష విధిస్తారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికల్లో కూడా ఈ చట్టం కఠినంగా అమలు అవుతుంది. దీనివల్ల UAEలో నివసిస్తున్న హిందువులకు భద్రతపై గట్టి నమ్మకం ఏర్పడింది.
అబుదాబి హిందూ దేవాలయం ..సహనానికి ప్రతీక:
UAEలో మత సహనానికి నిలువెత్తు నిదర్శనంగా అబుదాబిలోని BAPS హిందూ దేవాలయం నిలుస్తోంది. ఫిబ్రవరి 2024లో ప్రారంభమైన ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందింది. అంతకుముందే, దుబాయ్లోని జెబెల్ అలీ హిందూ దేవాలయం 2022లో ప్రారంభమై ప్రతిరోజూ వేలాది మంది భక్తులను ఆకర్షిస్తోంది. అంతేకాదు.. బుర్ దుబాయ్లోని శ్రీ కృష్ణ దేవాలయం 1958 నుంచే కొనసాగుతూ రావడం.. UAEలో హిందూ ఆరాధనకు దశాబ్దాలుగా ఉన్న అంగీకారాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
ప్రభుత్వ విధానాల్లో సహజీవనానికి ప్రాధాన్యం:
ప్రపంచంలోనే సహనం, సహజీవనానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన ఏకైక దేశం UAE. వివిధ మతాలు, సంస్కృతులు కలసి జీవించాలనే దృక్పథంతో ప్రభుత్వం పనిచేస్తోంది. 200కి పైగా దేశాలకు చెందిన ప్రజలు నివసిస్తున్న UAEలో ఐక్యతను పెంపొందించేందుకు 2025 సంవత్సరాన్ని కమ్యూనిటీల సంవత్సరంగా ప్రకటించారు.
హిందువుల పండుగలను కూడా ఇక్కడ అధికారికంగా.. బహిరంగంగా జరుపుకుంటారు. దీపావళి, హోలీ, నవరాత్రి వంటి వేడుకలకు ప్రభుత్వ మద్దతు ఉంటుంది. దీపావళి సందర్భంగా బుర్జ్ ఖలీఫా వంటి ప్రపంచ ప్రఖ్యాత కట్టడాలను వెలుగులతో అలంకరించడం UAEలో మత గౌరవానికి ఇచ్చే విలువను ప్రతిబింబిస్తుంది.
భద్రతా సూచికల్లో UAE స్థానం:
ప్రపంచవ్యాప్తంగా భద్రతను అంచనా వేసే సూచికల్లో UAE ఎప్పటికప్పుడు అగ్రస్థానాల్లో నిలుస్తోంది. 2025 నంబియో భద్రతా సూచిక ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాల్లో UAE ఒకటిగా నిలిచింది. దేశ జనాభాలో భారతీయుల వాటా దాదాపు 30 నుంచి 35 శాతం వరకు ఉండటం విశేషం. వ్యాపారం, నిర్మాణ రంగం, ఆరోగ్య సేవలు, ఐటీ, సేవా రంగాల్లో భారతీయులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.
మొత్తంగా.. మత భేదాలను దాటి సహజీవనాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా UAE ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలుస్తోంది. హిందువులకు భద్రత, గౌరవం కల్పించే ముస్లిం దేశంగా ఇది ప్రత్యేకంగా గుర్తింపు పొందుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Harish rao fires on cm revanth reddy govt on employees benefits: తెలంగాణలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే విధంగా మాజీ సీఎం కేసీఆర్ దగ్గరకు వెళ్లి మరీ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మొత్తంగా అసెంబ్లీలో సమావేశాలు ప్రస్తుతం వాడి వేడిగా జరుగుతున్నాయి. అయితే.. హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగుల సమస్యలపై మాట్లాడారు. పెండింగ్ డీఏ హైక్ లు, పీఆర్సీ హైక్ ల జాప్యంపై మండిపడ్డారు.
ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన హరీష్ రావు
పోలీసులకు అనేక సరెండర్ లీవులు, డీఏలు, టీఏలు పెండింగ్ ఉన్నాయి, వారికి రావాల్సిన ఆరోగ్య భద్రత స్కీమ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది
రిటైర్డ్… pic.twitter.com/rWw1me8oB8
— Telugu Scribe (@TeluguScribe) December 29, 2025
అంతే కాకుండా.. రెండెళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు వారికి అందాల్సిన బెనిఫిట్ ల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన హమీలు ఇంకా అమలులో జాప్యం ఎందుకు చేస్తున్నారంటూ మండిపడ్డారు. గతంలో కేసీఆర్ హయాంలో పీఆర్సీ 43.39 శాతం ఇచ్చారన్నారు. కానీ ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి రెండెళ్ల నుంచి ఆరు డీఏలు పెండింగ్ లో పెట్టారని, పీఆర్సీ, ఆరోగ్య స్కీమ్ లను అమలుచేయలేదన్నారు.
అదే విధంగా జీపీఎఫ్ బకాయిలు అలానే ఉన్నాయన్నారు. ఇటీవల 39 మంది రిటైర్డు ఉద్యోగులు తమకు రావాల్సిన బెనిఫిట్స్ అందక సరిగ్గా వైద్యం చేయించుకోలేక చనిపోయారన్నారు. చాలా మంది ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు నరకం అనుభవిస్తున్నారంటూ హరీష్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
గతంలో.. సీపీఎస్ ఉద్యోగులను ఓపీఎస్ గా మారుస్తామన్నారు. అదే విధంగా రాష్ట్రం ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రీబ్యూషన్ కూడా ఏమిచేయలేదన్నారు. పోలీసుల సరెండర్ లీవ్ లు, స్టేషన్ అలవెన్సులు, టీఏల విషయంలో ప్రభుత్వం ఇంకా పట్టించుకోవడంలేదన్నారు. గతంలో ఎప్పటికప్పుడు ఉద్యోగులకు, రిటైర్డు అయిన వారికి పెండింగ్ బకాయిలు జారీచేసినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలనను గాలికొదిలేసిందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Railway stocks: గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో రైల్వే రంగానికి చెందిన స్టాక్స్ స్టాక్ మార్కెట్ను షేక్ చేశాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని రైల్వే PSU షేర్లు ఒక్కసారిగా జోరుగా పరుగులు పెట్టాయి. ముఖ్యంగా RVNL, IRFC, IRCON, RailTel, Texmaco Rail వంటి కంపెనీల షేర్లు పెట్టుబడిదారులకు తక్కువ సమయంలోనే డబుల్ డిజిట్ రాబడులు అందించాయి. ఐదు రోజుల్లోనే ఈ స్టాక్స్ 20 శాతం నుంచి 26 శాతం వరకు లాభాలను నమోదు చేయడం మార్కెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
ఈ ర్యాలీలో ముందంజలో నిలిచింది రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL). ఈ కంపెనీ షేరు ధర సుమారు రూ. 306 స్థాయి నుంచి రూ. 387.25 వరకు ఎగబాకింది. అంటే కేవలం ఐదు సెషన్లలోనే 26.5 శాతం లాభం. ఇదే సమయంలో IRFC షేరు రూ. 110.81 నుంచి రూ.133.60కి చేరి దాదాపు 20 శాతం రాబడిని ఇచ్చింది. IRCON ఇంటర్నేషనల్ కూడా రూ.150 నుంచి రూ.178.25 వరకు పెరిగి సుమారు 19 శాతం లాభాన్ని నమోదు చేసింది. వీటితో పాటు RailTel, Texmaco Rail, IRCTC షేర్లలో కూడా కొనుగోళ్ల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది.
అయితే.. ఇక్కడ ఒక కీలక ప్రశ్న ఏంటంటే.. కంపెనీల ప్రాథమిక అంశాల్లో పెద్ద మార్పులు లేనప్పటికీ రైల్వే స్టాక్స్ ఎందుకు ఇంత వేగంగా పెరిగాయి? మార్కెట్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ర్యాలీకి ప్రధాన కారణం కంపెనీల ఫండమెంటల్స్ కంటే మార్కెట్ సెంటిమెంట్లో వచ్చిన మార్పే . గత ఏడాది అధిక విలువలు, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు, మార్జిన్ ఒత్తిళ్ల కారణంగా రైల్వే స్టాక్స్ తీవ్రంగా పడిపోయాయి. ఆ దిద్దుబాటు తర్వాత ఇప్పుడు పెట్టుబడిదారులు ఈ రంగంలో కొత్త అవకాశాలను వెతుకుతున్నారు.
ఇక మరో కీలక అంశం బడ్జెట్ ముందు ఏర్పడిన అంచనాలు. ఫిబ్రవరి 2026లో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో రైల్వే మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తారనే ఆశలు మార్కెట్లో బలంగా ఉన్నాయి. నెట్వర్క్ విస్తరణ, కొత్త కోచ్లు, సిగ్నలింగ్ వ్యవస్థలు, భద్రతా అప్గ్రేడ్లు, ఆధునీకరణ వంటి ప్రాజెక్టులకు భారీ కేటాయింపులు ఉంటాయనే భావన పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతోంది. చరిత్రలోనూ బడ్జెట్ ముందు రైల్వే స్టాక్స్ బలంగా ర్యాలీ చేసిన సందర్భాలు ఉన్నాయి.
దీనికి తోడు.. FY26లో రెండో దశ ప్రయాణీకుల ఛార్జీల పెంపు కూడా తక్షణ ఉత్సాహానికి కారణమైంది. డిసెంబర్ 26, 2025 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఛార్జీల పెంపు ప్రయాణ తరగతిని బట్టి కిలోమీటరుకు 1 నుంచి 2 పైసల మేరే అయినప్పటికీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 600 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. ఇది రైల్వే ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందనే సంకేతంగా మార్కెట్ భావిస్తోంది.
అయితే.. ఈ ర్యాలీ మధ్య పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న లాభాలు ఎక్కువగా అంచనాలు, భావోద్వేగాల ఆధారంగా నడుస్తున్నాయని వారు చెబుతున్నారు. దీర్ఘకాలంలో నిజమైన రాబడులు రావాలంటే బడ్జెట్లో వచ్చే వాస్తవ కేటాయింపులు, ప్రాజెక్టుల అమలు వేగం, నగదు ప్రవాహం, ఛార్జీల సంస్కరణలు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి, తక్షణ లాభాలకే ఆకర్షితులవకుండా, కంపెనీల ప్రాథమిక బలాలు మరియు అమలు సామర్థ్యాన్ని పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం మేలని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి.
Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.