icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505307
Bandi SrikanthBandi SrikanthFollow22 Jul 2024, 12:45 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

మాదాపూర్‌లోని పాన్ షాప్‌లో గంజాయి దందా..

Hyderabad, Telangana:

Hyderabad Paan Shop News: మీటా పాన్, సాదా పాన్, కలకత్తా పాన్, జర్థా పాన్.. ఇలా పాన్ ప్రియులు తమకు నచ్చిన పాన్లను ఆస్వాదించడానికి పాన్ షాప్‌ల ముందు క్యూ కడుతూ ఉంటారు. మరికొందరు సిగరెట్లు, ఇతర పదార్థాల కోసం వెళ్లడం చూస్తుంటాం.. కానీ.. ఐటీ కారిడార్‌గా పేరున్న హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో ఉన్న ఓ పాన్ షాపునకు వెళ్తే మాత్రం ప్రత్యేకమైన మత్తు పదార్థాలు లభిస్తాట.. పాన్ మసాలాల చాటున ఏకంగా గంజాయి విక్రయాలు చేస్తున్న ఓ కేటుగాడిని ఎక్సైజ్ ఎస్టీఎఫ్ అధికారులు పట్టుకున్నారు. పాన్ షాప్‌ను అడ్డాగా మార్చుకుని సాగిస్తున్న ఈ అక్రమ దందాను చూసి అధికారులే విస్తుపోయారు..

మాదాపూర్ పరిధిలోని చందానాయక్ నగర్ రోడ్డులో ఉన్న ఓ పాన్ షాప్ కేంద్రంగా అక్రమంగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం ఎస్టీఎఫ్ (STF) ఎక్సైజ్ అధికారులకు అందింది. సమాచారం అందడమే ఆలస్యం ఎస్టీఎఫ్ డీ-టీమ్‌ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో సిబ్బంది సత్వరమే స్పందించి సదరు పాన్ షాప్‌పై ఆకస్మిక దాడి నిర్వహించారు. అధికారులు షాప్‌ను చుట్టుముట్టి తనిఖీలు చేయగా.. అమ్మడానికి సిద్ధంగా ఉంచిన 500 గ్రాముల గంజాయి దొరికింది.. దాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈజీ మనీ కోసం షార్ట్‌కట్ దారి..
తక్కువ శ్రమతో త్వరగా డబ్బు సంపాదించాలనే  ఈజీ మనీ ఆశతోనే నిర్వాహకుడు ఈ అక్రమ దందాకు తెరలేపినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం... నిందితుడు బయటి వ్యక్తుల నుంచి గంజాయిని పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుని.. తన షాప్‌లోనే 10 గ్రాముల చొప్పున చిన్న చిన్న ప్యాకెట్లుగా విడగొట్టేవాడని.. ఒక్కో 10 గ్రాముల గంజాయి ప్యాకెట్‌ను రూ. 300కు కొనుగోలు చేసి.. దాన్ని మత్తుకు బానిసలైన వినియోగదారులకు రూ.500 చొప్పున విక్రయించేవాడు. అంటే ఒక్కో ప్యాకెట్‌పై ఏకంగా రూ.200 లాభం అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నాడన్నారు.

Read more: Secunderabad: అయ్యో... సికింద్రాబాద్‌లో ఘోరం.. అత్తను ఈడ్చుకుంటూ కత్తితో దాడి చేసిన కోడలు.. వీడియో..

నిందితుడి అరెస్ట్..
పాన్ షాప్‌లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తున్న మాలిక్ ఆస్లామ్ టామ్ బోలీ అనే వ్యక్తిని ఎస్టీఎఫ్ బృందం అక్కడికక్కడే అరెస్ట్ చేసింది.. స్వాధీనం చేసుకున్న 500 గ్రాముల గంజాయితో పాటు నిందితుడిని తదుపరి చట్టపరమైన విచారణ.. కఠిన చర్యల నిమిత్తం మాదాపూర్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు. నగరంలో చట్టవిరుద్ధంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాలను విక్రయించినా.. రవాణా చేసినా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని.. పాన్ షాప్‌లు లేదా ఇతర వ్యాపారాలను అడ్డం పెట్టుకుని.. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.

Read more: Secunderabad: అయ్యో... సికింద్రాబాద్‌లో ఘోరం.. అత్తను ఈడ్చుకుంటూ కత్తితో దాడి చేసిన కోడలు.. వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

0
0
Report

Hindu Temple Beliefs: నాన్‌వెజ్ తిని ఆలయానికి వెళ్తున్నారా? హిందూ ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెబుతోంది?

Hyderabad, Telangana:

Eating Non Veg Before Temple: హిందూ సంప్రదాయంలో దేవాలయం అత్యంత పవిత్రమైన స్థలం. ఆలయ దర్శనానికి వెళ్లే ముందు స్నానం చేయడం, శుభ్రమైన దుస్తులు ధరించడంతో పాటు సాత్విక ఆహారం తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా మాంసాహారం తిని దేవుడి దర్శనానికి వెళ్లకూడదనే నియమం వెనుక ఉన్న ఆధ్యాత్మిక, మానసిక, శారీరక కారణాలను కొందరు జ్యోతిష్కులు చెబుతున్నారు.

ఆహార రకాలు, తామసిక ఆహార ప్రభావం
హిందూ శాస్త్రాల ప్రకారం మనం తినే ఆహారాన్ని మూడు రకాలుగా విభజిస్తారు. సాత్విక ఆహారం, రాజసిక ఆహారం, తామసిక ఆహారం వంటి రకాలుగా విభజించారు. అందులో సాత్విక ఆహారంలో పండ్లు, పాలు, కూరగాయలు (మనస్సుకు ప్రశాంతతనిస్తాయి) వంటివి వస్తాయి. అలాగే రాజసిక ఆహారంలో మసాలాలు, ఘాటైన ఆహారాలు ఉండగా.. మాంసాహారం, మద్యం మొదలైనవి తామసిక ఆహారం లెక్కలోకి వస్తాయి.

మాంసాహారం తామసిక గుణాన్ని పెంచుతుంది. ఇది తీసుకోవడం వల్ల మనస్సులో బద్ధకం, అలసట, కోపం, అసహనం వంటి భావాలు పెరుగుతాయి. ఆలయం అనేది సానుకూల (పాజిటివ్) శక్తి నిండిన ప్రదేశం కాబట్టి, ప్రశాంతమైన మనస్సుతో ఉన్నప్పుడే అక్కడ ఆధ్యాత్మిక అనుభూతి లభిస్తుంది.

జీర్ణక్రియ, శారీరక చురుకుదనం
మాంసాహారం జీర్ణం కావడానికి శరీరానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల శరీరం బరువుగా అనిపించి, నిద్రమత్తు లేదా అలసట కలుగుతుంది. గుడిలో ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయడానికి లేదా ప్రార్థనలు చేయడానికి శరీరం తేలికగా ఉండటం అవసరం. శాకాహారం తేలికగా జీర్ణమై శరీరాన్ని, మనస్సును చురుగ్గా ఉంచుతుంది.

'అహింసా పరమో ధర్మః'..భక్తి సిద్ధాంతం
హిందూ ధర్మంలో జీవదయ, కరుణలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మాంసాహారం హింసతో కూడుకున్నది కాబట్టి, దేవుని సన్నిధికి వెళ్లేముందు దానికి దూరంగా ఉండటం ద్వారా జీవుల పట్ల కరుణను, భక్తిలో పవిత్రతను కాపాడుకోవచ్చని భావిస్తారు.

గర్భగుడిలోని ఆధ్యాత్మిక శక్తిని పొందడం
ఆలయ గర్భగుడిలో సానుకూల ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ శక్తిని పూర్తిగా అనుభవించాలంటే.. శరీరం (పరిశుభ్రత, సాత్విక ఆహారం), మనస్సు (కోపం, అసూయ వంటి ప్రతికూల ఆలోచనలు లేకుండా ఉండటం) రెండు స్వచ్ఛంగా ఉండాలని పెద్దలు సూచిస్తారు.

ఈ నియమాలు ప్రధానంగా హిందూ మతంలోని విశ్వాసాలు, కుటుంబ సంప్రదాయాలపై ఆధారపడి ఉంటాయి. వీటిని ఖచ్చితంగా పాటించడం లేదా తమ సంప్రదాయాల ప్రకారం నడుచుకోవడం అనేది భక్తుల నమ్మకాన్ని బట్టి ఉంటుంది. ఏదేమైనా, శరీర పరిశుభ్రతతో పాటు మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని, పవిత్ర భావనతో దేవుడిని దర్శించుకోవడమే అంతిమ లక్ష్యం.

Also Read: ఆగస్టులో ఈ 5 రాశుల వారికి రాజయోగం.. ధన వర్షంతో పాటు ఊహించని అదృష్టం!

Also Read: శ్రావణ మాసంలో శని దేవుడి కీలక మార్పు.. ఈ రాశుల వారికి డిసెంబర్ వరకు హెచ్చరిక!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

కిచెన్ స్పాంజ్‌తో ప్రాణాంతక వ్యాధులు.. క్యాన్సర్, లివర్ ఇన్ఫెక్షన్ల ముప్పు..

Hyderabad, Telangana:

Kitchen Sponge Health Risks: ఇంట్లో వంట చేయడం ఎంత ముఖ్యమో.. వంట పాత్రలను శుభ్రంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం.. అయితే, పాత్రలను తోమడానికి మీరు వాడే కిచెన్ స్పాంజ్ (Kitchen Sponge) మీ ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతోందని మీకు తెలుసా?. అవును మీరు చదువుతుంది నిజమే.. రోజూ మనం వాడే ఈ చిన్న స్పాంజ్ వల్ల ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ప్రముఖ వైద్యులు తెలుపుతున్నారు.

టాయిలెట్ సీట్ కంటే 200 రెట్లు ప్రమాదకరం..
డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కిచెన్ స్పాంజ్‌లో ఉండే బాక్టీరియా, క్రిములు టాయిలెట్ సీట్ కంటే దాదాపు 200 రెట్లు ఎక్కువగా ఉంటాయట.. నిత్యం నీటితో నాని.. తేమగా ఉండే స్పాంజ్ వాతావరణం మైక్రోస్కోపిక్ క్రిములు వేగంగా పెరగడానికి అత్యంత అనుకూలమైనదిగా మారుతుంది.. మనం పాత్రలు కడిగేటప్పుడు ఈ క్రిములు గిన్నెలకు, ప్లేట్లకు అంటుకుంటాయి. ఆ తర్వాత మనం అదే పాత్రల్లో ఆహారం తిన్నప్పుడు.. ఆ క్రిములు నేరుగా కడుపులోకి చేరుతూ ఉంటాయి.

క్యాన్సర్, లివర్ సమస్యలు..
ఈ బాక్టీరియా శరీరంలోకి చేరడం వల్ల కేవలం సాధారణ కడుపునొప్పి, విరేచనాలు, ఇన్ఫెక్షన్లు మాత్రమే కాకుండా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కడుపు, జీర్ణశయాంతర ఇన్ఫెక్షన్లు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆహారం ద్వారా లోపలికి వెళ్లే బాక్టీరియా జీర్ణవ్యవస్థను పాడుచేస్తుందని వారు చెబుతున్నారు. దీర్ఘకాలికంగా ఈ క్రిములు శరీరంలోకి చేరడం వల్ల కాలేయం (Liver)పై తీవ్ర ప్రభావం పడి లివర్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. నిరంతరం హానికరమైన మైక్రో-ఆర్గానిజమ్స్ శరీరంలోకి వెళ్లడం వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Also Read:  కొత్తిమీర కాడలు పారేస్తున్నారా? వంటల్లో ఈ 5 అద్భుతమైన మార్గాల్లో వాడేయండి!

ఈ హెల్త్ రిస్క్ నుంచి తప్పించుకోవడానికి నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు.. కిచెన్ స్పాంజ్‌ను నెలల తరబడి వాడకూడదని వారు తెలుపుతున్నారు. ప్రతి వారం కచ్చితంగా కొత్త స్పాంజ్‌ను వినియోగించాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు.. సింథటిక్ స్పాంజ్ కంటే పురాతన కాలం నుంచి వాడుతున్న కొబ్బరి పీచు (Coconut Coir) చాలా మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది సహజ సిద్ధమైనది, తేమను త్వరగా పీల్చుకోదు.. క్రిములు చేరే అవకాశం చాలా తక్కువ ఉంటుందని వారు తెలుపుతున్నారు.

Also Read:  కొత్తిమీర కాడలు పారేస్తున్నారా? వంటల్లో ఈ 5 అద్భుతమైన మార్గాల్లో వాడేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

డ్యూటీ చేయరు.. సంతకాలు మాత్రం ముందే.. సంగారెడ్డి ఆసుపత్రిలో అక్రమాల పుట్ట..

Hyderabad, Telangana:

Sangareddy GGH Scandal: పేద ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించాల్సిన సంగారెడ్డి గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి (GGH) అక్రమాలకు, నిర్లక్ష్యానికి నిలయంగా మారింది. ఆసుపత్రి పాలనా యంత్రాంగం నిద్రమత్తులో ఉన్నట్లు వ్యవహరించడంతో కొందరు వైద్యులు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు.. విధులకు రాకుండానే హాజరు పట్టికలో సంతకాలు చేయిస్తూ.. సర్కారు జీతాలు గుంజుతూ పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

డ్యూటీకి డుమ్మా.. 
సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో అంతా గోల్ మాల్ వ్యవహారం నడుస్తోంది. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలతో వచ్చే రోగులకు వైద్యం అందించాల్సిన కీలకమైన కార్డియాలజిస్ట్ (Cardiologist) ఆసుపత్రి ముఖమే చూడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోజువారీ విధులకు హాజరుకాకుండానే.. ఆసుపత్రిలోని కొందరు సిబ్బందితో మాట్లాడి హాజరు రిజిస్టర్‌లో ముందస్తుగానే, వివిధ తేదీల్లో దొంగ సంతకాలు పెట్టిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. రోగులకు అందుబాటులో ఉండాల్సిన సమయంలో సదరు వైద్యుడు సొంత ప్రైవేట్ ప్రాక్టీస్‌లో లేదా ఇతర పనుల్లో నిమగ్నమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

జిల్లా నలుమూలల నుంచి నిత్యం వందలాది మంది పేద రోగులు గుండె జబ్బుల చికిత్స కోసం ఈ ఆసుపత్రిపైనే ఆధారపడతారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి ఎదురుచూసినా డాక్టర్ దర్శనం కాకపోవడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర అల్లాడుతున్నారు. అత్యవసర పరిస్థితిల్లో వచ్చిన రోగులు చేసేదేమీ లేక.. అప్పులు చేసి మరీ ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. సర్కారు ఉచిత వైద్యం అందిస్తుందని వస్తే.. ఇక్కడ వైద్యులు లేకపోవడంతో జేబులు ఖాళీ చేసుకుంటున్నారు.

అధికారుల అలసత్వం.. 
వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించేలా చూడటంలోనూ.. విధులను క్రమబద్ధీకరించడంలోనూ ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓ (RMO) పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్యులు ఏ సమయంలో వస్తున్నారు? ఎవరు విధుల్లో ఉంటున్నారు? అనే ప్రాథమిక విషయాలపై ఆర్‌ఎంఓ పర్యవేక్షణ అసలే లేకపోవడంతో అక్రమార్కులకు ఆసరాగా మారింది. కార్డియాలజిస్ట్ దొంగ సంతకాల వ్యవహారం రచ్చకెక్కినా.. ఆసుపత్రి సూపరింటెండెంట్ కఠిన చర్యలు తీసుకోకుండా పట్టనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Read more: Yuva Sangrama Sadassu: ఉద్యోగాలు అడిగితే ఎండ్రిన్ తాగి చావమంటారా..?.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ సెన్సెషనల్ కామెంట్స్..

కఠిన చర్యలకు డిమాండ్..
పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి బాధ్యతారాహిత్య వైద్యులపై, వారికి సహకరిస్తున్న సిబ్బందిపై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు తక్షణమే.. స్పందించి విచారణ జరిపించాలని సంగారెడ్డి ప్రజలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులను సస్పెండ్ చేసి.. పేదలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read more: Yuva Sangrama Sadassu: ఉద్యోగాలు అడిగితే ఎండ్రిన్ తాగి చావమంటారా..?.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ సెన్సెషనల్ కామెంట్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Satya Sri Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లోకి 'జబర్దస్త్' క్రేజీ బ్యూటీ..అసలు కారణం బయటపెట్టిన నటి సత్యశ్రీ!

Hyderabad, Telangana:

Satya Sri Bigg Boss Offer: రియాలిటీ షో 'బిగ్ బాస్' సందడి మొదలవ్వడంతో సోషల్ మీడియాలో పోటీదారుల పేర్లపై జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే తనకు బిగ్ బాస్ నుండి ఆఫర్ వచ్చినట్లు, అయితే ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు జబర్దస్త్ లేడీ కమెడియన్, నటి సత్యశ్రీ ఇటీవలి ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

బిగ్ బాస్ ఆఫర్‌పై స్పష్టత
బిగ్ బాస్ సీజన్ 10 నుండి తనకు పిలుపు వచ్చిన మాట వాస్తవమేనని నటి సత్యశ్రీ ధృవీకరించారు. అయితే ఆ షోలో పాల్గొనకపోవడానికి గల బలమైన కారణాన్ని ఆమె వెల్లడించారు. "మా కుటుంబ బాధ్యతలన్నీ నేనే చూసుకుంటున్నాను. నా తల్లిదండ్రులను వదిలి అంతకాలం దూరంగా ఉండలేను. నేను లేకపోతే వారు ఇబ్బంది పడతారు" అని నటి సత్యశ్రీ చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరికీ కుటుంబం ఉన్నప్పటికీ, వారిని చూసుకోవడానికి ఇతరులు ఉంటారని, కానీ తన ఇంట్లో ఆ పరిస్థితి లేకపోవడం వల్లే ఆ ఆఫర్‌ను వద్దనుకున్నానని ఆమె వివరించారు.

గత మూడేళ్లుగా బుల్లితెరకు దూరంగా ఉంటూ, వెండితెరపై బిజీగా ఉండటంపై సత్యశ్రీ స్పందించారు. జబర్దస్త్ తర్వాత సినిమాల్లో వరుస అవకాశాలు రావడంతోనే టెలివిజన్‌కు దూరమయ్యానని తెలిపారు. "ప్రస్తుతం ఒక దశకు చేరుకున్నాను. స్వీయ గౌరవం, రెప్యూటేషన్‌ను దృష్టిలో ఉంచుకుని సెలెక్టివ్‌గా పాత్రలను ఎంచుకుంటున్నాను. గ్లామర్ ఉన్నంత కాలమే మంచి పాత్రలు ఎంచుకోవాలనే ఆలోచన ఉంది" అని పేర్కొన్నారు.

హీరో నవీన్ పొలిశెట్టితో అనుభవం
ఇటీవల విడుదలైన 'అనగనగా ఒక రాజు' చిత్రంలో మంచి పాత్రతో మెప్పించిన సత్యశ్రీ, హీరో నవీన్ పొలిశెట్టి పనితీరును ప్రశంసించారు. "హీరో నవీన్ పొలిశెట్టి సెట్స్‌లో ఫుల్ ఎనర్జీతో ఉంటారు. 24/7 పనికే ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి షాట్ తర్వాత తర్వాతి పనిపైనే దృష్టి పెడతారు" అని నటి సత్యశ్రీ వెల్లడించింది.
 
గతంలో 'జాతిరత్నాలు' సినిమాలో తాను ఒక చిన్న పాత్ర చేసినప్పుడు, నవీన్ తనతో "కచ్చితంగా తర్వాత మూవీలో మంచి రోల్ చేద్దురు గానీ" అని చెప్పారని గుర్తుచేసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం 'అనగనగా ఒక రాజు'లో అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

Also Read: 'ఓం భీమ్ బుష్' హీరోయిన్ ఆయేషా ఖాన్ అరెస్ట్..నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లిన ముంబై పోలీసులు!

Also REad: తమిళనాడు సీఎం విజయ్ చివరి సినిమా 'జన నాయగన్'..ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

రూ.20 వేల లోపే 50MP కెమెరా, OLED డిస్‌ప్లే.. మార్కెట్‌లోకి రెడ్‌మీ నోట్ 17 ఫోన్‌!

Hyderabad, Telangana:

Redmi Note 17 Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమి (Xiaomi) తన సబ్‌బ్రాండ్ Redmi ద్వారా మళ్లీ మార్కెట్‌లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెడ్‌మీ నోట్ 17 (Redmi Note 17) సిరీస్ త్వరలోనే భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ప్రముఖ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫారమ్ గీక్‌బెంచ్ (Geekbench) వెబ్‌సైట్‌లో Xiaomi 26021RN18I అనే మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ కనిపించడంతో, దీని లాంచ్ ఖాయమని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్‌ కూడా లీక్ అయ్యాయి..

పెర్ఫార్మెన్స్ వివరాలు..
గీక్‌బెంచ్ టెస్టింగ్‌లో రెడ్‌మీ నోట్ 17 ఆకట్టుకునే స్కోర్లను సాధించిన్నట్లు తెలుస్తోంది.. ఇది సింగిల్-కోర్ టెస్ట్‌లో 950 పాయింట్లతో పాటు మల్టీ-కోర్ టెస్ట్‌లో 2,324 పాయింట్లను సాధించిందని సమాచారం. ఇది ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 4 చిప్‌సెట్‌పై రన్‌ అయ్యే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అడ్రినో (Adreno) GPU గ్రాఫిక్స్ పవర్‌ను అందిస్తుందని తెలుస్తోంది.. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత షావోమి హైపర్ ఓఎస్ 3 (HyperOS 3) పై రన్ అవుతుందని సమాచారం.. ఇది 8 GB ర్యామ్ వేరియంట్‌తో ప్రారంభం కాబోతోంది. అంతేకాకుండా ఈ డివైజ్, బడ్జెట్ ధరలో అద్భుతమైన మల్టీ టాస్కింగ్ అనుభవాన్ని అందిస్తున్నట్లు తెలుస్తోంది..

ఫీచర్ల సునామీ..
ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని భారీ బ్యాటరీగా భావిస్తారు.. సాధారణంగా ఉండే బ్యాటరీలకు భిన్నంగా, ఇందులో ఏకంగా 8,000 mAh సామర్థ్యం గల బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.. దీనికి తోడు 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో పాటు 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది..

డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఇందులో కంపెనీ 7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్‌ OLED ప్యానెల్‌ను కలిగి ఉంటుంది.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో డిస్‌ప్లే కంటెంట్ చూడటానికి ఎంతో స్పష్టంగా ఉంటుంది.. కెమెరా విభాగంలో f/1.8 అపెర్చర్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను, ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కూడా అందిస్తోంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

లాంచ్ వివరాలు..
కంపెనీ దీనిపై అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఆగస్టు మొదటి వారం ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి. అత్యంత ముఖ్యమైన ధర విషయానికొస్తే.. ఇది రూ.20,000 లోపు ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండే ఛాన్స్‌లు ఉన్నాయి. భారీ బ్యాటరీతో పాటు అదిరిపోయే OLED డిస్‌ప్లే కావాలనుకునేవారికి రెడ్‌మీ నోట్ 17 ఒక పర్ఫెక్ట్ ఛాయిస్‌గా మారబోతోంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Samsung, రియల్‌మీలకు గట్టి పోటీగా మార్కెట్‌లోకి Redmi కొత్త 5G ఫోన్!

Hyderabad, Telangana:

Redmi 17C 5G India: సామ్‌సంగ్, రియల్‌మీ వంటి దిగ్గజ సంస్థలకు గట్టి పోటీ ఇస్తూ.. బడ్జెట్ రేంజ్‌లో అత్యంత అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌లను అందించే ప్రముఖ టెక్ బ్రాండ్ రెడ్‌మి (Redmi) త్వరలోనే తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ Redmi 17C 5G పేరుతో భారత మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమైంది.. అధికారిక ప్రకటనకు ముందే ఈ ఫోన్ ప్రముఖ సర్టిఫికేషన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌తో పాటు థాయిలాండ్‌కు చెందిన NBTC వెబ్‌సైట్లలో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ అత్యంత త్వరలోనే లాంచ్‌ కూడా కాబోతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

లీక్‌ అయిన వివరాలు..
తాజాగా లీకైన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ మోడల్ నంబర్‌తో BIS, NBTC పోర్టళ్లలో నమోదు చేసింది.. బిఐఎస్ (BIS) గుర్తింపు లభించడమే.. కాకుండా ఈ ఫోన్ భారతీయ మార్కెట్లోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వడం ఖాయమైన్నట్లు తెలుస్తోంది.. గతంలో విడుదలైన Redmi C-సిరీస్ ఫోన్‌లకు కొనసాగింపుగా ఈ Redmi 17C 5G మోడల్‌ను కంపెనీ రూపొందించినట్లు సమాచారం..

Redmi 17C 5G మొబైల్‌ ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌..
లీక్‌ అయిన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో లభించినప్పటికీ ఫీచర్ల విషయంలో ఎక్కడా తగ్గకుండా రూపొందించిన్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.88 అంగుళాల పెద్ద హెచ్‌డీ ప్లస్‌ (HD+) LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.. స్మూత్ స్క్రోలింగ్ అనుభూతి కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌ను కూడా అందిస్తోంది.. వేగవంతమైన 5G కనెక్టివిటీ.. మెరుగైన గేమింగ్ అండ్ మల్టీటాస్కింగ్ కోసం ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ (MediaTek Dimensity) లేదా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 5G ప్రాసెసర్‌ను వినియోగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత లేటెస్ట్ HyperOS పై పనిచేసే అవకాశాలు ఉన్నాయి..

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం.. వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించిన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్‌ భాగంలో 8MP లేదా 13MP కెమెరా ఉండబోతున్నట్లు సమాచారం.. అద్భుతమైన బ్యాటరీ లైఫ్ కోసం.. ఇందులో 5,160mAh నుంచి 6,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందుబాటులోకి తీసుకువచ్చిన్నట్లు తెలుస్తోంది.. ఇది టైప్-సి (USB Type-C) ద్వారా ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ అందిస్తుంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు 3.5mm ఆడియో జాక్, డ్యూయల్ సిమ్ 5G సపోర్ట్ వంటి ముఖ్యమైన ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ విభాగంలో (Budget Segment) రావడంతో పాటు దీని ప్రారంభ ధర రూ.10,000 నుంచి రూ. 13,000 మధ్యలో ఉండే అవకాశం ఉందని మార్కెట్ లీక్‌ అయిన వివరాలు తెలుపుతున్నాయి.. దీనిని కంపెనీ 4GB ర్యామ్‌, 6GB ర్యామ్‌తో పాటు 64GB స్టోరేజ్‌, 128GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

చిట్‌చాట్‌లో రేవంత్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. కేటీఆర్‌ను బర్త్‌డే దావత్‌ అడగాలి

Hyderabad, Telangana:

KTR Birth Day: రేపు 50వ పుట్టినరోజు చేసుకుంటున్న బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై రేవంత్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ను బర్త్‌డే దావత్‌ అడగాలి అని.. అయితే ఆయన ఇచ్చే పార్టీ తాను తీసుకుంటానో లేదోనని.. ఆయనవి వేరే పార్టీలు అంటూ పరోక్షంగా విమర్శలు చేశారు. గ్లోబరీనా సంస్థతో ఇంటర్‌ పేపర్ల లీక్‌ జరిగాయని.. ఈ కంపెనీ కేటీఆర్‌కు బినామీ అని మరోసారి రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్‌లో గురువారం మీడియాతో రేవంత్‌ రెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పార్టీతోపాటు కేటీఆర్‌, హరీశ్ రావుపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. 'బీఆర్ఎస్ పార్టీ పేదలకు ఇచ్చే ఇళ్లను దళారులకు అమ్ముకుంది. పేదలకు లాభం జరుగుతుందనే అక్కసుతో బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. గ్లోబరీనా కేటీఆర్ బినామీ సంస్థ. ఇంటర్ పేపర్లు సరిగా దిద్దకపోవడంతో 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి కేటీఆర్ క్షమాపణ చెప్పాలి' అని రేవంత్ రెడ్డి డిమాండ్‌ చేశారు.

Also Read: CM Revanth reddy: SIR పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే.!. బీజేపీ టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

'గ్లోబరీనా సంస్థపై కేటీఆర్ సీసీఎస్‌పైన ఫిర్యాదు చేయాలి. మేము విచారణ చేస్తే కక్ష సాధింపు అంటారు' అని చిట్‌చాట్‌లో రేవంత్‌ రెడ్డి తెలిపారు. అమరవీరుల స్థూపం దగ్గర ముక్కు నేలకు రాయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. 'గ్లోబారినాపై మేం విచారణ చేస్తే కక్ష సాధింపు అంటారు. కేటీఆర్ ఒక్క చిన్న ఫిర్యాదు ఇస్తే గ్లోబారినాపై విచారణ చేస్తాం. గ్లోబరినాపై విచారణ జరగడం లేదని ఎందుకు అనుకుంటున్నారు. గ్లోబారినాపై ఫిర్యాదు చేసి కేటీఆర్ చిత్తశుద్ధి నిరూపించుకోవచ్చు. గ్లోబరినాపై నివేదిక వచ్చాక ఏం చేయాలో అది చేస్తాం' అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు డిమాండ్ చేయలేదు?.. ఏమిటి ఈ కుమ్మక్కు? అని రేవంత్‌ రెడ్డి నిలదీశారు. 'పరువు ఉన్నవాడు వేస్తే పరువు నష్టం దావా వేస్తాడు. జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఏ రాజుల భూముల ఉన్నాయో కేటీఆర్ విచారణకు అడగాలి. మేము వచ్చాకే ధర్నా చౌక్ ఓపెన్ చేశాం. మేం తెరిచిన ధర్నా చౌక్‌లోనే కేటీఆర్ ధర్నా చేస్తామని అంటున్నారు' అని రేవంత్ రెడ్డి తెలిపారు.

'ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో కేటీఆర్ ప్రశ్న వేయాలి. పేర్లతో సహా నియామకాల లిస్ట్ ఇస్తా. 55 రోజుల్లో 11 వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేశాం. నోటిపికేషన్ ఇవ్వడం పేపర్ లీక్ చేయడం సొమ్ము చేసుకోవడం వాళ్ల పని. సీట్లపైన నేను, కేటీఆర్ వేసిన అంచనాలను విశ్లేషించాలి. జూబ్లీహిల్స్‌లో కేటీఆర్ 50 వేల మెజార్టీ అని చెప్పాడు. నేను 30 వేలతో గెలుస్తామని చెప్పా' అని రేవంత్ రెడ్డి తెలిపారు.

'కేటీఆర్ పుట్టిన రోజు దావత్ ఇస్తాడో అడగాలి. కేటీఆర్ ఇచ్చే దావత్ నేను తీసుకోలేనేమో. ఆయనవి అన్ని వేరే పార్టీలు' అని రేవంత్ రెడ్డి తెలిపారు. 'కేసీఆర్ కుటుంబసభ్యులెవరూ రక్తదానం చేయలేదు. తీసిన రక్తం ఎవరికి అమ్ముకున్నారో చెప్పాలి. కొవ్వెక్కి ఉన్నవాళ్లు రక్తం ఇస్తే కరిగిపొద్ది. తీసిన రక్తం గాంధీకి, ఉస్మానియా ఆస్పత్రులకు ఇస్తే బాగుండు. ఉద్యమంలో ఇలాగే రెచ్చగొట్టారు. ప్రాణాలు తీసుకున్న వాళ్లే ఇప్పుడు రక్తం తీసుకుంటున్నారు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

0
0
Report

Kajal Aggarwal: "హీరోయిన్ నడుముని ఇప్పుడు ఎవ్వరూ చూడడం లేదు".. బాలీవుడ్‌పై కాజల్ సంచలన వ్యాఖ్యలు!

Hyderabad, Telangana:

Kajal Aggarwal On Bollywood: దక్షిణాది, హిందీ చిత్రసీమల్లో నటిగా తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. సినీ పరిశ్రమలో సమయపాలన, మహిళలను చూపించే విధానం, తన కెరీర్ నిర్ణయాలపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

హీరోయిన్ల చిత్రీకరణ
గతంలో దక్షిణాది సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు ఎక్కువగా గ్లామర్‌కే పరిమితమయ్యేవని, నాభి (బొడ్డు) భాగంపై దృష్టి పెట్టే ధోరణి ఉండేదని వ్యాఖ్యానించిన కాజల్, ప్రైవేట్ సన్నివేశాల చిత్రీకరణపై తన స్పష్టమైన వైఖరిని వెల్లడించారు. "నా కెరీర్ ప్రారంభం నుంచే కొన్ని విషయాల్లో స్పష్టమైన హద్దులు గీసుకున్నాను. బొడ్డుపై పండ్లు విసిరే సన్నివేశాల్లో నేను ఎప్పుడూ నటించలేదు, అలాంటివాటికి ఒప్పుకోలేదు" అని కాజల్ అన్నారు.

ప్రస్తుతం పరిస్థితి మారిందని, కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం చేయకుండా మహిళలకు కథలో బలమైన పాత్రలు, బాధ్యతలు ఇస్తున్నారని కాజల్ ఆనందం వ్యక్తం చేశారు.

బాలీవుడ్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది!
బాలీవుడ్, సౌత్ సినిమాల పని సంస్కృతిని పోలుస్తూ కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరూ సమయానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారని, పనులన్నీ గడియారం ముల్లులా ఖచ్చితంగా జరుగుతాయని ప్రశంసించారు. బాలీవుడ్‌లో షూటింగ్‌లు సమయానికి ప్రారంభం కావు అని చెబుతూ, సమయపాలన అనేది వృత్తి నైపుణ్యానికి, తోటి కళాకారుల కృషికి ఇచ్చే గౌరవమని పేర్కొన్నారు.

"ఏ నటుడి కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సి వచ్చింది?" అని అడిగినప్పుడు, కాజల్ సూటిగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పేరు చెప్పారు. సల్మాన్ మధ్యాహ్నం లేదా సాయంత్రం సెట్స్‌కు వచ్చేవారని, ఆ వేచి ఉండే సమయంలో తాను సెట్స్‌లోని జిమ్‌లో వర్కౌట్స్ చేసుకునేదాన్ని అని కాజల్ గుర్తుచేసుకున్నారు.

దక్షిణాది సినిమాలకే ప్రాధాన్యత ఎందుకు?
హిందీ సినిమాల కంటే దక్షిణాది ప్రాజెక్టులకే ఎక్కువ మొగ్గు చూపడానికి ప్రధాన కారణం పాత్రల నాణ్యతే అని కాజల్ స్పష్టం చేశారు. బాలీవుడ్‌లో తనకు ఆశించిన స్థాయిలో వైవిధ్యమైన పాత్రలు లభించలేదని, దక్షిణాది చిత్రసీమ మాత్రం మంచి కథలతో కూడిన విభిన్నమైన పాత్రలను అందించిందని వివరించారు.

కాజల్ రాబోయే సినిమాలు
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ పలు కీలకమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. 'ది ఇండియా స్టోరీ'సినిమాతో పాటు నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణం' (ఈ చిత్రంలో ఆమె మండోదరి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం). మహిళా నటుల గౌరవం, వృత్తిపరమైన క్రమశిక్షణ, నాణ్యమైన కథల ప్రాముఖ్యతపై కాజల్ చేసిన ఈ వ్యాఖ్యలను నెటిజన్లు మరియు సినీ విశ్లేషకులు విశేషంగా ప్రశంసిస్తున్నారు.

Also Read: తమిళనాడు సీఎం విజయ్ చివరి సినిమా 'జన నాయగన్'..ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే?

Also Read: 'ఓం భీమ్ బుష్' హీరోయిన్ ఆయేషా ఖాన్ అరెస్ట్..నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లిన ముంబై పోలీసులు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

గొర్రెలు కాస్తూనే.. NEETలో 694వ ర్యాంక్ సాధించిన కర్ణాటక విద్యార్థి!

Hyderabad, Telangana:

Puttaraju Neet Success Story: పట్టుదలతో పాటు కఠోర శ్రమ, అంకితభావం ఉంటే.. ఎలాంటి పరిస్థితులనైనా.. పేదరికాన్ని అయినా అధిగమించి విజయ తీరాలకు చేరవచ్చని కర్ణాటకకు చెందిన విద్యార్థి పుట్టరాజు నిరూపించాడు.. నిత్యం గొర్రెలను కాస్తూ.. తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో ఆసరాగా నిలుస్తూనే.. నీట్ - NEETలో అత్యుత్తమ ర్యాంకు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఎస్టీ విభాగంలో 694వ ర్యాంకు..
కొప్పళ జిల్లా హనుమనహళ్లి గ్రామానికి చెందిన పుట్టరాజు ఇటీవల నీట్ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో గిరిజన (ఎస్టీ) విభాగంలో 694వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. నీట్ పరీక్షలో 720 మార్కులకు గానూ.. 511 మార్కులు సాధించి.. తన వైద్యుడి కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. పీయూసీ (PUC)లో 98 శాతం మార్కులతో పాసైన రాజు.. తొలి ప్రయత్నంలో నీట్‌లో ఆశించిన ఫలితం సాధించలేకపోయినా నిరాశ చెందలేదు.. ప్రత్యేక శిక్షణ తీసుకుని.. మలి ప్రయత్నంలో అద్భుత ప్రతిభ కనబరిచి.. విజయాన్ని సాధించాడు.

కష్టాల కడలి దాటి.. 
పుట్టరాజు ఎంతో కష్టతరమైన జీవితాన్ని గడిపేవాడు.. ఓవైపు చదువుకుంటూనే.. మరోవైపు రోజూ ఉదయాన్నే.. లేచి గొర్రెలకు మేత పెట్టడం.. వాటిని మేపడానికి పొలాలకు తీసుకెళ్లడం, షెడ్డును శుభ్రం చేయడం వంటి పనులన్నీ స్వయంగా చేసేవాడు.. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ.. కష్టపడుతుండటంతో వారికి బాసటగా నిలుస్తూనే.. లభించిన సమయాన్ని పుస్తకాలతో గడిపేవాడు.. ఇటీవల నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వివాదాల వల్ల దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొన్న సమయంలో కొంత నిరాశ ఎదురైనా.. తన లక్ష్యం నుంచి పక్కకు తప్పుకోకుండా దృఢ సంకల్పంతో చదువుకున్నాడు..

తల్లిదండ్రుల ప్రోత్సాహం..
పుట్టరాజు తండ్రి మహాబలేశ్ వ్యవసాయంతో పాటు బోర్వెల్ మరమ్మతు పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుమారుడి ఉన్నత చదువు కోసం ఆయన నిరంతరం ప్రోత్సాహాన్ని అందించేవారు.. తల్లి సావిత్రి తన కుమారుడి భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేసింది. వ్యవసాయ క్షేత్రంలోనే ఒక చిన్న ఇల్లు నిర్మించుకుని నివాసముంటూ.. కుమారుడికి తోడుగా నిలిచారు. కుమారుడు సాధించిన ఈ ఘన విజయంపై తండ్రి మహాబలేశ్ సంతోషం వ్యక్తం చేస్తూ.. నా కొడుకు గొర్రెలు మేపుతూనే కష్టపడి చదివాడు.. ఈ రోజు దేశ స్థాయిలో మంచి ర్యాంకు సాధించి డాక్టర్ కాబోతుండటం.. మా కుటుంబానికే కాకుండా, గ్రామానికి ఎంతో గర్వకారణమని తెలిపారు.

Also Read: ప్రొటెస్ట్ చేయడం ఎందుకు? స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా!!: నీట్ ర్యాంకర్

సమాజ సేవయే లక్ష్యం..
పుట్టరాజు సాధించిన విజయంతో హనుమనహళ్లి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.. గ్రామస్థులు, బంధువులు అతడిని ఘనంగా అభినందించారు. భవిష్యత్తులో మంచి వైద్యుడిగా మారి పేదలకు.. సమాజానికి సేవ చేయడమే తన ప్రధాన లక్ష్యమని పుట్టరాజు తెలిపాడు. పేదరికంతో పాటు వసతుల లేమి సాకులు కావని.. కష్టపడే తత్వం ఉంటే ఆశించిన గమ్యాన్ని చేరుకోవచ్చని పుట్టరాజు జర్నీ నిరూపిస్తోంది.

Also Read: ప్రొటెస్ట్ చేయడం ఎందుకు? స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా!!: నీట్ ర్యాంకర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

WTC Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2027 ఫైనల్ షెడ్యూల్ ఖరారు..ఈ సారి ఫైనల్ ఎక్కడ జరుగుతుందంటే?

England:

WTC Final 2027 Schedule: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC 2025-27) సైకిల్ ఫైనల్ మ్యాచ్‌కి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రతిష్టాత్మక టైటిల్ పోరుకు లండన్‌లోని చారిత్రాత్మక 'ది ఓవల్' (The Oval) మైదానం వేదికగా నిలవనుంది.

ఈ మ్యాచ్ 2027 జూన్ 9 నుండి 13 వరకు జరగనుందని ఐసీసీ అధికారికంగా ధృవీకరించింది. మొదట ఈ ఫైనల్‌ను 'లార్డ్స్' మైదానంలో నిర్వహించాలని భావించినప్పటికీ, తుది నిర్ణయంలో లార్డ్స్ నుండి 'ది ఓవల్'కు వేదికను మార్చారు.

విశేషాలు, ముఖ్యాంశాలు..
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు 'ది ఓవల్' మైదానం ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండోసారి. గతంలో 2023 WTC ఫైనల్‌లో ఇక్కడే ఆస్ట్రేలియా, భారత్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే 2027 నాటికి టెస్ట్ క్రికెట్ ప్రారంభమై 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, ఈ ఫైనల్ మ్యాచ్‌ మరింత చారిత్రాత్మక ప్రాధాన్యతను సంతరించుకోనుంది.

ఈ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు సంబంధించిన వరుస ఫైనల్ మ్యాచ్‌లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిర్వహించడం గమనార్హం. 2027, 2029, 2031 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ నిర్వహణ హక్కులను ఐసీసీ ఇప్పటికే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB)కి అప్పగించింది. ప్రస్తుతం జరుగుతున్న WTC (2025-27) సైకిల్‌లో ఫైనల్ బెర్త్ దక్కించుకోవడానికి మొత్తం 9 జట్లు తీవ్రంగా పోటీపడుతున్నాయి.

"గత రెండేళ్లుగా నిలకడైన ప్రతిభ కనబరిచిన రెండు అత్యుత్తమ టెస్ట్ జట్లు ఈ ఫైనల్‌లో తలపడతాయి. టెస్ట్ క్రికెట్ 150వ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ జరిగే ఈ 2027 ఫైనల్ ప్రపంచవ్యాప్త అభిమానులకు ఒక అద్భుతమైన అనుభూతిగా మిగిలిపోతుంది" అని ఐసీసీ ఈవెంట్స్, ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ గౌరవ్ సక్సేనా తెలిపారు.

అలాగే వరుస డబ్ల్యూటీసీ ఫైనల్స్ నిర్వహించడంపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ నీల్ స్నోబాల్ స్పందించారు. "వరుసగా మూడు డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం రావడం మాకు దక్కిన గౌరవం. 2023లో 'ది ఓవల్'లో జరిగిన ఫైనల్ ప్రేక్షకులు, ప్రసారకర్తలను విశేషంగా ఆకట్టుకుంది. 2027లో టెస్ట్ క్రికెట్ 150 ఏళ్ల వేడుకల సందర్భంగా జరిగే ఈ మ్యాచ్ మరిన్ని కొత్త రికార్డులను, జ్ఞాపకాలను అందిస్తుందని నమ్ముతున్నాం" అని నీల్ స్నోబాల్ అన్నారు.

Also Read: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు జైలు శిక్ష?! ఆ కేసులో అడ్డంగా బుక్కయ్యాడు!

Also Read: కావ్యా పాప కొంపముంచిన పాకిస్థాన్ స్పిన్నర్..రూ.2.45 కోట్లు దండగ..గెలిచే మ్యాచ్ ఇలా..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Faceboo

0
0
Report

'సర్‌'తో ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర.. అప్రమత్తంగా ఉండాలి: రేవంత్‌ రెడ్డి

Hyderabad, Telangana:

Telangana SIR: 'భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ముందు కొడంగల్  కర్ణాటకలో ఉండేది. సర్ ప్రకియతో గ్రామాల్లో దళితులు, గిరిజనుల ఓట్లు పోయే అవకాశం ఉంది. ఓటు పోతే సంక్షేమ పథకాలు ఆగిపోయే అవకాశం ఉంది' అని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లక్ష్యంగా సర్ ప్రక్రియ జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా సర్ ప్రక్రియ ఉందని విమర్శించారు. 'బీజేపీ నాయకుల మధ్య అంతర్గత కొట్లాటలు ఉన్నాయి. 

దేశ, రాష్ట్ర పరిణామాలపై హైదరాబాద్‌లో మీడియాతో రేవంత్ రెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. నీట్‌ పేపర్‌ లీక్‌, సర్‌ ప్రక్రియ, బీఆర్‌ఎస్‌ పార్టీ రాజకీయాలు తదితర అంశాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 'తెలిసీ తెలియక రెండు ఓట్లు ఉన్నాయని అంటున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయమని చెప్పండి. కలెక్టర్ అనుమతి తీసుకొని నా గ్రామంలో ఉన్న ఓటును కొడంగల్‌కు మార్చుకున్నా. గతంలో కొడంగల్ ప్రాంతం కర్ణాటకలోని జిల్లాలో ఉండేది. భాష ప్రయుక్త రాష్ట్రాలు చేసినప్పుడు కొడంగల్ పాలమూరులోకి వచ్చింది. బీజేపీ కుట్ర పూరితంగా ఓట్లు తొలగించే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతంలో అమాయకుల ఓట్లు పోయేలా ఉన్నాయి. సర్‌ ఉద్దేశం ప్రక్షాళన. కానీ కుట్రపూరితంగా సర్‌ను వాడుతున్నారు. సర్‌ పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే' అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ,  మైనారిటీ ఓట్లు పోతే కాంగ్రెస్ ఓట్లు పోయినట్టే. అవగాహన లేకపోవడం, సరైన సమయంలో స్పందించకపోవడంతో ఓట్లు పోయే అవకాశం ఉంది. ఓటు హక్కు లేకపోతే పథకాలు పోతాయి. ఓటుహక్కు లేకపోతే ఆధార్ పోతుంది. ఓటుహక్కు లేకపోతే గుర్తింపే ఉండదు కదా? ఓటు హక్కు లేకపోతే సంక్షేమం రాదు' అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

'సర్‌ ముగిసే వరకు గ్రామాల్లోనే ఉండమని చెప్పా. ఎమ్మెల్యేలకు కావాలనే గట్టిగా చెప్పా. 30 పర్సంటేజ్ కావాల్సి ఉంది. 30 పర్సంటేజ్ చాలా కీలకం. సర్‌ నాయకులకు సంబంధించింది కాదు.. ప్రజలకు సంబంధించింది' అని రేవంత్ రెడ్డి తెలిపారు. 'హైడ్రా బ్రహ్మాండంగా పని చేస్తుంది. చెరువులను పునరుద్ధరించింది. ప్రభుత్వ భూములను కాపాడింది' హైడ్రాపై ప్రశంసలు కురిపించారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలు రెఫరెండం అన్నాడు.. ఏమైంది? అని ప్రశ్నించారు. పెట్టుబడి పెట్టాడు కాబట్టే రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టామని వివరణ ఇచ్చారు.

నీటిపారుదల శాఖ మంత్రి పదవి నుంచి ఎందుకు తొలగించారో హరీష్ రావు చెప్పాలని రేవంత్‌ రెడ్డి కోరారు. కేసీఆర్‌కు తెలియకుండా కాళేశ్వరంలో రూ.వందల కోట్లు తీసుకున్నాడనే హరీశ్‌ రావును కేసీఆర్ పక్కనపెట్టాడని ఆరోపించారు. 'కన్నెపల్లి పంపుహౌస్ హరీశ్‌ రావు మంత్రిగా ఉన్నప్పుడు నిర్మాణమైంది. అతి తెలివితో మాట్లాడితే పిచ్చిలేసిందని మెంటల్ ఆస్పత్రిలో హరీశ్ రావుని చేరుస్తారు. కాళేశ్వరంలో గేట్లు ఎత్తి వేయాలని నిపుణులు స్పష్టం చేశారు. ఎన్డీఎస్‌ఏ చెర్మన్ స్వయంగా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాడు. ఈ విషయాన్ని హరీశ్‌ రావు మాట్లాడటం లేదు' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

'దేవాదులలో అన్ని పంపులు పని చేస్తున్నాయి. మేడిగడ్డ దగ్గర కాపర్ డ్యామ్ ఆకాశం నుంచి దిగి రాదు. మరో డ్యామ్ కట్టాలి. 5 మీటర్ల నీళ్లు ఉండాలంటే మేడిగడ్డ గేట్లు దిగాల్సిందే. ఒక్క రోజు మాత్రమే లక్ష క్యూసెక్కుల నీళ్లు మాత్రమే వచ్చాయి. నీళ్లు నిలపకపోతే బ్యారేజులు ఎందుకు కట్టారు. మేడిగడ్డ అంటే ప్రజలు తన్నుతారనే కన్నెపల్లి పంపుహౌస్ గురించి మాట్లాడుతున్నారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ, పీసీ ఘోష్ నివేదిక స్పష్టం ఉంది. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఇచ్చాం' అని రేవంత్‌ రెడ్డి వివరించారు.

'కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది. ఎన్నికల్లో అవయవదానం చేసి బీఆర్ఎస్ పార్టీ బీజేపీని గెలిపించింది. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలో లోకసభ ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు మెజారిటీ వచ్చింది?' అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ రావు, సంతోశ్‌ రావు చుక్క రక్తం ఇచ్చారా అని ఎద్దేవా చేశారు. ఉద్యమంలో విద్యార్థుల రక్తం ధారపోశారు. ప్రతిపక్షంలో  ఉన్నపుడు కూడా పేదల రక్తం అమ్ముకుంటున్నారు.

'బీజేపీలో అంతర్గత కలహాలు ఉన్నాయి. బీజేపీ నాయకులకు ఒకరంటే ఒకరికి పడదు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లు ఎక్కడుంటాయో బీజేపీకి తెలుసు. చిన్నచిన్న కారణాలతో ఓట్లు తొలగిస్తున్నారు' అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు రూ.5 లక్షలు ఇవ్వాలని డిసైడ్ అయిందని చెప్పారు. తాము ఏం చేస్తున్నామో అదే చెప్తున్నట్లు ప్రకటించారు. 'ఘోష్ ఇచ్చిన నివేదికను సీబీఐ విచారణ కోసం పంపాం. సీబీఐ ఏదైనా విచారణ చెయ్యొచ్చు. ప్రజలు అధికారం ఇచ్చింది చట్టబద్దమైన పాలన చేయమని' అని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆహార కల్తీపై కఠినంగా ఉన్నామని తెలిపారు.

'నచ్చితే నజరానా నచ్చకపోతే జరిమానా నా విధానం కాదు. చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ తప్పులపై విచారణ జరుగుతోంది. నాకు నచ్చలేదని వెంటనే శిక్ష వేయాలా? చార్లెస్ శోభ రాజు, బిల్లా రంగాలు కూడా జైల్లో ఉన్నారు. జైలుకు వెళ్తే ముఖ్యమంత్రులు అవుతారా?' అని చిట్‌చాట్‌లో రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. 'ఉద్యోగాలపై చర్చకు నేను సిద్ధం. నోటిఫికేషన్ ఇవ్వాలి.. ప్రశ్నాపత్రం అమ్ముకోవాలనేది బీఆర్ఎస్ పార్టీ విధానం. నోటిఫికేషన్లు ఇచ్చి నియామక పత్రాలు ఇవ్వడం మా విధానం. టీఎస్పీఎస్‌సీని ప్రక్షాళన చేశా' అని చిట్‌చాట్‌లో రేవంత్‌ రెడ్డి తెలిపారు.

0
0
Report

Jana Nayagan Remuneration: తమిళనాడు సీఎం విజయ్ చివరి సినిమా 'జన నాయగన్'..ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే?

Hyderabad, Telangana:

Jana Nayagan Vijay Salary: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు 'దళపతి' విజయ్ నటించిన ఆఖరి చిత్రం 'జన నాయగన్' నేడు (జూలై 23) గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చింది. తొలి షో నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోగా, ప్రపంచవ్యాప్తంగా విజయ్ అభిమానులు థియేటర్ల వద్ద బాణాసంచా కాలుస్తూ పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ భారీ ప్రాజెక్ట్ కోసం విజయ్‌తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

విజయ్ ఆల్ టైమ్ రికార్డ్ పారితోషికం!
తమిళ మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. తన చివరి చిత్రం 'జన నాయగన్' కోసం విజయ్ ఏకంగా రూ.220 కోట్ల నుంచి రూ.275 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది నిజమైతే భారతీయ సినిమా చరిత్రలోనే ఒక నటుడు తీసుకున్న అత్యధిక రెమ్యూనరేషన్లలో ఇది ఒకటిగా నిలవడం ఖాయం. ఒక సాదాసీదా నటుడిగా ప్రస్థానం ప్రారంభించి, 30 ఏళ్ల నటనా జీవితానికి రికార్డు స్థాయి విజయం, రాజకీయ ప్రవేశంతో వీడ్కోలు పలకడం విశేషం.

మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్స్ వివరాలు ఇలా ఉన్నాయి. 
దర్శకుడు హెచ్. వినోద్ రూ.25 కోట్లు (ఆయన కెరీర్‌లోనే ఇది అత్యధికం),  సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ రూ.13 కోట్లు, కథానాయిక పూజా హెగ్డే రూ.6 కోట్లు, విలన్/కీలక పాత్రలో బాబీ డియోల్ రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లు, ప్రకాష్ రాజ్ రూ.5 కోట్లు, ప్రియమణి రూ.3 కోట్లు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ రూ.3 కోట్లు, నరైన్ రూ.2.5 కోట్లు, మమితా బైజు రూ.60 లక్షల నుండి రూ.2 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు కోలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి.

అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే వసూళ్ల సునామీ!
వివాదాలు, వాయిదాల ఆందోళనల నడుమ విడుదలైన ఈ 'జన నాయగన్' సినిమాకు తమిళనాడు వ్యాప్తంగా 1,000కి పైగా స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. ఇది విజయ్ చివరి సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కేవలం ముందస్తు టికెట్ బుకింగ్‌ల ద్వారానే ఈ సినిమా రూ.40 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది.

Also Read: 'ఓం భీమ్ బుష్' హీరోయిన్ ఆయేషా ఖాన్ అరెస్ట్..నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లిన ముంబై పోలీసులు!

Also Read: Divya Bharathi: సుడిగాలి సుధీర్ హీరోయిన్ హాట్ ఘాటు అందాలు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top