icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505307
Bandi SrikanthBandi SrikanthFollow22 Jul 2024, 12:45 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Women Health: మహిళలు అలర్ట్.. పదే పదే కడుపునొప్పి వస్తుందా? అయితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. ఆ భయంకర వ్యాధి కావచ్చు..!

BBhoomi2h ago
Lakshmapur, Telangana:

Women Health: చాలా మంది మహిళలు.. తరచుగా కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం లేదా తరచుగా టాయిలెట్‌కు వెళ్లడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు.  ప్రతిరోజూ తీసుకునే ఆహారం లేదంటే బలహీనమైన జీర్ణక్రియ అనుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు ఇది ప్రాణాంతకం అవుతుంది. ఇది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ సంకేతం అయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదొక తీవ్ర సమస్య.  ఈ వ్యాధితో బాధపడేవారికి ప్రేగులు సరిగ్గా పనిచేయవు. కడుపు సంబంధిత సమస్యలు పదే పదే ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సమస్య పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువ కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనికి కారణాలెన్నో ఉన్నాయి. శరీరంలో జరిగే కొన్ని సహాజ మార్పులు, ఒత్తిడి వల్ల కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉందంటున్నారు. మహిళల్లో ఐబీఎస్ ప్రమాదం ఎందుకు ఎక్కువగా ఉంటుందో తెలుసుకుందాం. 

హార్మోన్ల మార్పులు:
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళల శరీరంలో ఎప్పటికప్పుడు జరిగే హార్మోన్ల మార్పులు వారి జీర్ణవ్యవస్థ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. ఈ కారణంగానే మహిళల పేగులు సున్నితంగా మారుతాయి. ఇది కడుపు నొప్పి, గ్యాస్, మలబద్ధకం లేదా విరేచనాలు వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

నెలసరి సమయం:
అయితే చాలా మంది మహిళలు నెలసరి సమయంలో ఎక్కువ కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. కొందరిలో.. ఈ సమస్య గర్భధారణ సమయంలో లేదా మెనోపాజ్ సమయంలో కూడా తీవ్రతరం అయ్యే అవకాశం ఉంటుంది.  ఎందుకంటే ఈ సమయాల్లో శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ఇవి జీర్ణక్రియను కూడా ప్రభావితం చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. 

ఒత్తిడి :
మన మెదడుకు.. జీర్ణాశయానికి మధ్య సంబంధం ఉంటుంది. ఒక వ్యక్తి అధిక ఒత్తిడి, ఆందోళన లేదా మానసిక వత్తిడికి గురైనప్పుడు, అది జీర్ణాశయంపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే ఒత్తిడి పెరిగినప్పుడు ఐ.బి.ఎస్ లక్షణాలు మరింత ఇబ్బందికరంగా మారతాయి.

పేగుల సమతుల్యత:
మన ప్రేగులలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడే కొన్ని మంచి బాక్టీరియాలు ఉంటాయి. వాటి సమతుల్యతకు భంగం కలిగితే, జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. ఈ మార్పు మహిళల్లో ఐబీఎస్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

 చికిత్స:
కడుపు నొప్పి, మలబద్ధకం, విరేచనాలు లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఎక్కువ కాలం కొనసాగితే..  వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. సకాలంలో వైద్యుడిని సంప్రదించడం వల్ల సమస్యను నిర్ధారించి, సరైన చికిత్సను ప్రారంభిస్తారు. అంతేకాదు.. సమతుల్య ఆహారం, ఒత్తిడిని తగ్గించుకోవడం, తగినంత నిద్ర..  క్రమం తప్పకుండా శారీరక శ్రమ ద్వారా ఐబిఎస్ లక్షణాలను చాలా వరకు నియంత్రించవచ్చు. అందుకే పదేపదే వచ్చే కడుపు సమస్యలను తేలికగా తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు.

Also Read: 4 నెలల్లో 49వేలు తగ్గిన పసిడి.. చైనా తీసుకోబోయే ఈ నిర్ణయంతో త్వరలో మరింత పతనం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

0
0
Report

CM Revanth reddy: ఎవడు అడ్డుపడ్డా మూసీలో వేసి తొక్కుతా.!. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Hyderabad, Telangana:

CM Revanth reddy speech in Nalgonda public meeting:  తెలంగాణ రాజకీయాలు మరోసారి వెడెక్కాయి. సీఎం రేవంత్ రెడ్డి నల్గొండలో పర్యటించారు. ఈక్రమంలో నల్గొండలో సుమారు రూ. 13వేల కోట్లతో ఆర్ అండ్ బీ చేపట్టనున్న హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి కోమటిరెడ్డితో కలిసి శ్రీకారం చుట్టారు. నల్గొండ జిల్లా కనగల్ వేదికగా హ్యామ్ రోడ్ల పైలాన్ ను సైతం ఆవిష్కరించారు. నల్గొండ కార్పొరేషన్ లో తొలి దశ తాగునీటి  ప్రాజెక్టు పనులకు , రూ. 83 కోట్లతో తొలిదశ తాగునటి శుద్ది కేంద్రంకు పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ..  తెలంగాణ ఉద్యమ రోజుల్ని గుర్తుచేసుకుంటూ కొండా లక్ష్మణ్ బాపూజీ గతంలో మంత్రి పదవి త్యాగం చేశారని , ఆ తర్వాత మరల కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తన మంత్రి పదవి త్యాగం చేశారని గుర్తుచేశారు.  ఇక బీఆర్ఎస్ కు గతమే కానీ భవిష్యత్తు లేదని తీవ్రమైన ఆరోపణలు చేశారు. గత పదేళ్ల పాలనను, తమ రెండున్నరెళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై మాట్లాడేందుకు తాము సిద్దమని బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు.  

తులసి వనంలో గంజాయి మొక్కలాగా సూర్యాపేటలో ఒక జానెడు ఉన్న వ్యక్తి మిగిలిడాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై సెటైర్లు వేశారు. రాబోయే ఎన్నికల్లో ఆయన్నుకూడా  ఓడిస్తామని కొంతమంది యువకులు తనతో చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎవడు ఆత్మహత్య చేసుకున్నా, ఎవడు అడ్డం పడ్డా మూసీలో వేసి తొక్కి మరీ మూసీ పనులు పూర్తి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెల్చిచెప్పారు.

ఎస్ ఎల్ బీసీని 2028 వరకు  పూర్తి చేస్తామన్నారు. ఈ క్రమంలో పదేళ్ల పాటు తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం దోచుకున్నారని ఒక్క మహిళకు కూడా మంత్రి పదవిలో చాన్స్ ఇవ్వలేదని సీఎం రేవంత్ ఏకీపారేశారు.

0
0
Report

Director Nag Ashwin: మరోసారి తండ్రి కాబోతున్న ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. సోషల్ మీడియాలో క్రేజీ పోస్ట్ వైరల్!

Hyderabad, Telangana:

Director Nag Ashwin Became Father: 'మహానటి', 'కల్కి 2898 ఏడీ' వంటి మైండ్‌బ్లోయింగ్ సినిమాలతో పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్. తాజాగా ఆయన ఓ శుభవార్త చెప్పారు. తాను త్వరలో మరోసారి తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వేదికగా ఆయన ప్రకటించారు. తన భార్య ప్రియాంకా దత్ ప్రస్తుతం గర్భంతో ఉన్న ఫొటోలను పోస్ట్ చేశాడు. దీంతో సినీ ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

నాగ్ అశ్విన్ దర్శకుడిగా పరిచయమైన మొదటి సినిమా 'ఎవడే సుబ్రమణ్యం'. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రముఖ సీనియర్ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె, ప్రొడ్యూసర్ ప్రియాంక దత్‌తో ఆయన ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో వీరిద్దరూ 2015లో వివాహ బంధంతో ఒకటయ్యారు.

ఈ దంపతులకు 2017లో ఓ కుమారుడు జన్మించాడు. అయితే దర్శకుడిగా తన తొలి చిత్రమైన 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ పేరు అయిన 'రిషి'ని, నాగ్ అశ్విన్ తన కుమారుడికి పెట్టడం విశేషం. ఇప్పుడు దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఈ దంపతులు మళ్లీ తల్లిదండ్రులు కాబోతుండడంతో అటు నందిని నర్సింగ్ హోమ్ (స్వప్న సినిమాలు/వైజయంతీ మూవీస్) ఫ్యామిలీలోనూ, ఇటు అభిమానుల్లోనూ పండగ వాతావరణం ఉంది.

నాగ్ అశ్విన్ కెరీర్ 
'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టిన నాగ్ అశ్విన్.. తన తొలి సినిమాతోనే క్లాసిక్ హిట్ అందుకొని అందర్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఆ తర్వాత 'మహానటి' సావిత్రి బయోపిక్‌ను రూపొందించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అలాగే ఈ సినిమాకు గానూ నేషనల్ అవార్డుతో పాటు పాన్ ఇండియా రేంజ్ గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా 'కల్కి 2898 ఏడీ' సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి హిస్టరీ క్రియేట్ చేసింది.

కేవలం డైరెక్షనే కాకుండా 'జాతిరత్నాలు' వంటి బ్లాక్‌బస్టర్‌ను ప్రొడ్యూస్ చేశారు. అలాగే ఇటీవల ఆయన నిర్మించిన 'సింగీతం' సినిమా థియేటర్లలో డీసెంట్ హిట్‌గా నిలిచింది. నాగ్ అశ్విన్ ప్రస్తుతం 'కల్కి' సినిమాకు సంబంధించిన భారీ సీక్వెల్ (కల్కి పార్ట్ 2) స్క్రిప్ట్ పనుల్లో, ప్రీ-ప్రొడక్షన్‌లో పూర్తి స్థాయిలో ఉన్నారు. ఈ గ్యాప్‌లోనే తన పర్సనల్ లైఫ్‌లోని ఈ స్వీట్ న్యూస్‌ను షేర్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు.

Also Read: పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్..'ఓజీ యూనివర్స్' నుంచి మరో వీడియో రిలీజ్!

Also Read: 'వారణాసి' సినిమా స్టోరీ లీక్ చేసిన రాజమౌళి..రూ.3,000 కోట్లు పక్కా అంటున్న ఫ్యాన్స్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Netaji OG 2 Movie: సినిమా ప్రారంభం అవ్వకముందే 'ఓజీ 2' స్టోరీ లీక్..నేతాజీ చుట్టూ అసలు కథ!

Hyderabad, Telangana:

OG 2 Netaji Subhas Chandra Bose: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్‌లో 'ఓజీ 2'(OG 2) సినిమా తెరకెక్కబోతోంది. గతంలో విడుదలైన 'ఓజీ' సినిమాకు సీక్వెల్. తొలి పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో ఫ్యాన్స్‌లో ఈ సీక్వెల్ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. దీంతో అప్పటి నుంచి రోజుకో వార్త ఈ సినిమా గురించి లీక్ అవుతోంది. ఇటీవలే సుజీత్.. పవన్ కళ్యాణ్‌ను కలిసి 'ఓజీ 2' స్టోరీ లైన్ గురించి చర్చించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కథకు సంబంధించి ఫిలిం నగర్ వర్గాల నుంచి ఒక సెన్సేషనల్ లీక్ బయటకు వచ్చింది.

'దేశభక్తి' బ్యాక్‌డ్రాప్!
మొదటి భాగంలో కేవలం ముఠా రాజకీయాలు, ముంబై గ్యాంగ్‌స్టర్ డ్రామాను చూపించిన సుజీత్.. 'ఓజీ 2'లో మాత్రం దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌తో కూడిన ఒక భారీ చరిత్రాత్మక చిత్రం జోడించబోతున్నట్లు తెలుస్తోంది. 'ఓజీ' మొదటి భాగంలో కథ 1940లలో మొదలై, 1973 ప్రాంతంలో సాగుతూ 1993లో ముగుస్తుంది. అయితే 'ఓజీ సీక్వెల్'లో మాత్రం 1940ల నాటి కాలానికి సంబంధించిన పూర్తి ఫ్లాష్‌బ్యాక్ కథను ప్రధానంగా చూపించబోతున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ లింక్..
ఈ సీక్వెల్‌లో దర్శకుడు సుజీత్ ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ప్లాన్ ప్రకారం టాక్ నడుస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎలిమెంట్‌ను ఈ స్టోరీకి ముడిపెట్టారట. 1940లలో ఆజాద్ హింద్ ఫౌజ్ (INA) కోసం నేతాజీ దాచిన రహస్య నిధులు లేదా ఆ కాలం నాటి ఒక కీలకమైన మిస్టరీ చుట్టూనే హీరో 'ఓజీ' (పవన్ కళ్యాణ్) ప్రయాణం సాగుతుందని ఇండస్ట్రీ సమాచారం.

ఈ చరిత్రాత్మక సినిమా లింక్ స్థాయిని, పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించనున్నారు. 'ఓజీ' పార్ట్ 1కు తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎంతో ప్లస్ అయ్యింది. ఇప్పటికీ ఆ మూవీ ఓఎస్టీ కోసం ఫ్యాన్స్ ఊర్రూతలూగుతారు. అయితే తొలి భాగాన్ని డీవీవీ దానయ్య నిర్మించగా.. ఇప్పుడు సీక్వెల్ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నిర్మించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు మరో సంయుక్త నిర్మాత ఉంటారా? లేదా పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తారా అనేది కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది. 

అయితే 'ఓజీ 2'లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి ప్రస్తావన రావడంతో ఈ క్రేజీ హిస్టారికల్ లీక్‌పై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే.. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఇదొక బిగ్గెస్ట్ అడ్వెంచరస్ అండ్ హిస్టారికల్ యాక్షన్ ఫిలిం కావడం ఖాయంగా కనిపిస్తోంది!

Also Read: 'వారణాసి' సినిమా స్టోరీ లీక్ చేసిన రాజమౌళి..రూ.3,000 కోట్లు పక్కా అంటున్న ఫ్యాన్స్!

Also Read: పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్..'ఓజీ యూనివర్స్' నుంచి మరో వీడియో రిలీజ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

White Cobra Video: వామ్మె.. శ్వేతనాగు.. చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

Hyderabad, Telangana:

 White Cobra Video Watch: ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో వింతలతో పాటు విశేషాలు దాగి ఉన్నాయి.. ముఖ్యంగా వన్యప్రాణుల ప్రపంచంలో కొన్ని జీవులు చాలా అరుదుగా కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఒక అరుదైన ఘటనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. సాధారణంగా మనం నలుపు.. ఎరుపు, గోధుమ రంగులో ఉండే కింగ్ కోబ్రాలను చూస్తూ ఉంటాం.. కానీ ఊహించని విధంగా ఒక వైట్ కలర్ మెరిసిపోతున్న కింగ్ కోబ్రా ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలు ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తున్నాయి.

ఒక ప్రాంతంలో కొత్తగా ఇల్లు నిర్మిస్తున్న ఓ ప్రాంగణంలో ఈ వింత పాము ప్రత్యక్షమైంది.. ఆ ఇంటి నిర్మాణంలో భాగంగా కడుతున్న ఒక గోడ సందు గుండా ఈ తెల్ల కింగ్ కోబ్రా అత్యంత నెమ్మదిగా.. పాకుతూ బయటికి రావడం స్థానికుల కంటపడింది.. సాధారణంగానే కింగ్ కోబ్రాల్ అంటేనే భయంతో వణికిపోయే జనం.. ఇక అస్సలు ఎప్పుడు చూడని తెల్లటి రంగులో అంత పెద్ద పామును చూసేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైపోతున్నారు.. ఆ పాము పరిమాణంతో పాటు దాని తెల్లటి రూపం స్థానికులను అటు భయాందోళనకు.. ఇటు తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుంది.. కొందరు ధైర్యం చేసి ఆ అద్భుత దృశ్యాన్ని మొబైల్స్ లో చిత్రీకరించారు..

నిర్మిస్తున్న గోడల సమీపంలో నుంచి ఆ తెల్లటి సర్పం బయటికి వస్తుంటే ఏదో సినిమా గ్రాఫిక్స్ చూస్తున్నట్లు అనిపిస్తుంది. నిజంగా ఇలాంటి పాము ఉంటుందని మేము ఎప్పుడూ ఊహించలేము అని స్థానికులు సైతం ఆశ్చర్యపోతున్నారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ లలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. ఇది నిజంగా శ్వేత నాగు అని కొందరు అంటుంటే.. ల్యూసిజం (Leucism) లేదా అల్బినిజం (Albinism) అనే జన్యులోపం వల్లే పాములకు ఇలాంటి తెల్లటి రంగు వస్తుందని వన్యప్రాన్ని విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు..

 
 
 
 
 

Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..

విషయం తెలుసుకున్న వెంటనే స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.. వారి వెంటనే స్నేక్ క్యాచర్స్కు సమాచారం అందించి వారిని ఈ ప్రదేశానికి పంపినట్లు తెలుస్తోంది. ఈ అరుదైన జీవికి ఎలాంటి హానిక అలగకుండా.. సురక్షితంగా రక్షించి దట్టమైన అడవి ప్రాంతంలో విడిచి పెట్టినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రకృతిలోని ఈ అరుదైన పాముకు సంబంధించిన వీడియోను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఈ వీడియో ఒక ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి వైరల్ అవుతుంది.

Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

  

0
0
Report

Cobra Video: సాక్షాత్తు శివుడి లీల.. నంది విగ్రహంపై పడగ విప్పిన కోబ్రా.. వీడియో వైరల్!

Hyderabad, Telangana:

 Cobra Sits On Nandi Idol Video Watch: ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒక అద్భుతమైన, అత్యంత అరుదైన వీడియో సోషల్ మీడియా వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సాధారణంగా పాములను చూస్తేనే ప్రజలు భయాందోళనతో పరుగులు తీస్తూ ఉంటారు.. అలాంటిది అత్యంత ప్రమాదకరమైన ఒక నాగుపాము.. శివాలయంలోని నంది విగ్రహంపై తిష్ట వేసి కూర్చున్న దృశ్యాలు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ఈ వైరల్ అవుతున్న వీడియోలో.. ఆలయ ప్రాంగణంలో ఉన్న నంది విగ్రహం తలపై నాగుపాము ఎంతో ప్రశాంతంగా కూర్చొని ఉంది.. అంతటితో ఆగకుండా.. ఆ పాము తన పడగలను విప్పి అటూ ఇటూ ఊగుతూ భక్తులకు దర్శనం ఇవ్వడం ఈ వీడియోలోనే అత్యంత ప్రధాన ఆకర్షణీయంగా నిలిచింది. నంది వాహనుడైన ఆ శివుడి చెంతనే ఉండే నాగేంద్రుడు.. ఇలా ప్రత్యక్షంగా నంది పైనే కొలువుదీరడం చూసి భక్తులు భక్తిశ్రద్ధలతో చేతులు జోడిస్తున్నారు. అంతేకాకుండా అక్కడికి వచ్చిన భక్తులంతా ఈ నాగేంద్రుడి దర్శనం కూడా చేసుకుంటున్నారు..

సాక్షాత్తు ఆ మహాశివుడి స్వరూపమే..
ఈ దృశ్యాలు చూసిన సోషల్ మీడియా వినియోగదారులతో పాటు శివ భక్తులు నంది విగ్రహం పై ఉన్న నాగుపాము సాక్షాత్తు ఆ మహా శివుడి లీలేనని.. కామెంట్లలో చెబుతూ వస్తున్నారు.. అంతేకాకుండా ఇది మహా శివుడి లీల అని నమ్మిన వారి. ఓం నమశ్శివాయ అంటూ కామెంట్ల రూపంలో నెటిజన్లు తమ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు.. శివుని మెడలో ఉండే సర్పరాజం.. శివుడి వాహనమైన నందిపై ఇలా పడగ విప్పి కూర్చోవడం కలియుగంలో దైవత్వానికి నిదర్శనమని పలువురు పండితులు భావిస్తున్నారు..

Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..

ఊహించని స్థాయిలో వ్యూస్..
ఈ వీడియో ఎక్కడ.. ఏ ప్రాంతంలో జరిగిందని దానిపై స్పష్టమైన సమాచారం లేనప్పటికీ.. దీనికి వస్తున్న ఆదరణ మాత్రం అంతా కాదు.. క్షణాల్లోనే ఈ వీడియో లక్షలాది వ్యూస్ తో పాటు వేలాది షేర్లతో దూసుకుపోతోంది.. వాట్సాప్ స్టేటస్ లతోపాటు ఇంస్టాగ్రామ్ రీల్స్ లో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందని వివరాలు తెలియక పోయినప్పటికీ.. వీడియో మాత్రం ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. అంతేకాకుండా సోషల్ మీడియా వినియోగదారులను ఆకట్టుకుంటుంది..

 
 
 
 
 

Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

  

0
0
Report

Rajasthan: సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫొటో.. ఆ కానిస్టేబుల్ చేసిన పని చూడండి!

Hyderabad, Telangana:

  Rajasthan Police Controversy News: శాంతిభద్రతలను కాపాడడమే కాకుండా.. ప్రజల సమస్యలను ఓపికగా.. విని పరిష్కరించాల్సిన బాధ్యత కలిగిన పోలీస్ శాఖలో కొందరి అధికారుల బాధ్యత రాహిత్యం వల్ల యావత్ శాఖకే.. తీరని మచ్చ వస్తోంది.. తాజాగా రాజస్థాన్‌లోని డూంగర్‌పూర్ జిల్లాలో మానవత్వాన్ని మంటగలిపేలా.. కనీస మర్యాదను విస్మరించిన ఘటన.. వెలుగు చూసింది.. తన సమస్యను చెప్పుకోవడానికి వచ్చిన ఒక వృద్ధుడి పట్ల ఒక మహిళ కానిస్టేబుల్ ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది...

అసలేం జరిగిందంటే..?
డూంగర్‌పూర్ జిల్లాలోని బిచ్చివారా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఒక వృద్ధుడు తన వ్యక్తిగత సమస్యపై ఫిర్యాదు చేసేందుకు.. ఎన్నో ఆశలతో పోలీస్ స్టేషన్‌ కు వచ్చాడు.. అక్కడ డ్యూటీలో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్‌ను కలిసి తన సమస్యలను చెప్పుకునేందుకు ప్రయత్నించాడు..

అయితే, సదరు కానిస్టేబుల్ ఆ వృద్ధుడి వయసుకు గానీ.. ఆయన బాధకు గానీ కనీస గౌరవం ఇవ్వలేదు. ఆ వృద్ధుడు చేతులు కట్టుకుని దీనంగా నిలబడి తన సమస్యను వివరిస్తుంటే.. ఆమె మాత్రం తన సీట్లో దర్జాగా కూర్చుని, ఎదురుగా ఉన్న టేబుల్‌పై రెండు కాళ్లు చాపి అత్యంత అహంకారపూరితంగా వ్యవహరించింది. వృద్ధుడి ఆవేదనను వినడం పక్కన పెడితే.. ఆమె ప్రదర్శించిన బాడీ లాంగ్వేజ్ తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

 
 
 
 
 
 

నెటిజన్ల ఆగ్రహం.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ దృశ్యాన్ని ఎవరో ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు సదరు మహిళా కానిస్టేబుల్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాకీ యూనిఫాం వేసుకున్నంత మాత్రానా సామాన్య ప్రజలను అంత చులకనగా చూస్తారా అంటూ నెటిజన్లు ఎక్స్, ఫేస్‌బుక్‌లలో పోలీస్ శాఖను ఏకిపారేశారు.

వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు..
ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో డూంగర్‌పూర్ జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు తక్షణమే రంగంలోకి దిగారు. డిపార్ట్‌మెంట్ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించిన ఆ మహిళా కానిస్టేబుల్‌ను తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Read more: Ketan Agarwal Murder Case: పూణె బిజినెస్ మెన్ మర్డర్ కేసు.. జైలులో మందు, సిగరెట్ కావాలని సియా డిమాండ్.!. పోలీసులు ఏమన్నారంటే..?

ఈ ఘటనపై పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించడానికి, విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గానూ సదరు కానిస్టేబుల్‌పై శాఖాపరమైన విచారణకు (Departmental Inquiry) ఆదేశించారు. ఎంతటి వారైనా సరే చట్టం ముందు సమానమేనని.. ప్రజలతో దురుసుగా లేదా అమర్యాదగా ప్రవర్తించే సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని ఉన్నతాధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సస్పెన్షన్ వేటుతోనైనా పోలీస్ సిబ్బందిలో మార్పు వస్తుందో లేదో చూడాలి.

Read more: Ketan Agarwal Murder Case: పూణె బిజినెస్ మెన్ మర్డర్ కేసు.. జైలులో మందు, సిగరెట్ కావాలని సియా డిమాండ్.!. పోలీసులు ఏమన్నారంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

  

  

0
0
Report
Advertisement

Snake Video: గుండెలు గుభేల్.. కరెంట్ డబ్బాలో బుసలు కొడుతున్న భారీ నాగు పాము.. వీడియో వైరల్..

Hyderabad, Telangana:

Snake hulchul in electrical box video:  సోషల్ మీడియాలో చాలా మంది పాములతో జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా వానాకాలం నేపథ్యంలో పంటపొలాలల్లో కోబ్రాలు సంచరిస్తాయి. రైతులు ఎక్కువగా ఈ సీజన్ లో పాము కాటులకు గురౌతుంటారు. కోబ్రాల వీడియోలు నిత్యం వార్తలలో ఉంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక రైతు తన పొలంలో ఉన్న కరెంట్ డబ్బాను తెరిచాడు. ఇంతలో దానిలో ఒక నాగు పాము బుసలు కొడుతూ కోపంతో కాటు వేయడానికి ప్రయత్నించింది.

 

ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న కూడా అది కాటు వేసేది. కానీ అతను పామును గుర్తించి తన లాగా ఎవరు కూడా ప్రమాదంలో పడొద్దని వీడియో కూడా తీశాడు. పొలాల వద్ద ఉన్న కరెంట్ డబ్బా తెరిచేటప్పుడు చిన్న కర్రలతో దాని చిన్న డొర్ లు తీయాలని చెబుతున్నాడు. అంతే కాకుండా కోబ్రాలు దానిలో నక్కి ఉంటాయని చెప్పాడు.  వాటితో అలర్ట్ గా ఉండాలని చెప్పాడు.

Read more: Python Video: వామ్మో.. కొండ చిలువకు సుస్సు పోయించిన తాబేలు.!. నోటితో పట్టుకుని మరీ.!. వీడియో వైరల్..

 ఈ వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు బాబోయ్ అంటూ షాక్ అవుతున్నారు. మరికొంత మంది మాత్రం నిజంగా రైతు తెలివికి హ్యట్సాఫ్ చెప్పాల్సిందే.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న కూడా ప్రాణాలు పోయేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  పాము వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
 

0
0
Report

AP Employees Promotion: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట..ప్రమోషన్స్, ట్రాన్స్‌ఫర్స్‌పై గడువు పొడిగింపు..

Vijayawada, Andhra Pradesh:

AP Employees Promotion News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురు చెప్పింది. ఉద్యోగులు ప్రమోషన్లు (పదోన్నతులు), పోస్టుల అప్‌గ్రేడేషన్, బదిలీలకు (ట్రాన్స్‌ఫర్)కు సంబంధించిన అంశంపై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రకటించిన ఫ్రీజింగ్ గడువును జులై 5 వరకు పొడిగిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.

గడువు ఎందుకు పొడిగించారంటే.. 
రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమలులో భాగంగా సాధారణ పరిపాలన శాఖ మొదట జూన్ 25 నుంచే ఫ్రీజింగ్ నిలిపేస్తూ మెమో జారీ చేసింది. అంటే జూన్ 25 తర్వాత ఎలాంటి ప్రమోషన్లు బదిలీలు చేయడానికి వీలుండేది కాదు. 

అయితే దీనిపై ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది. ఉద్యోగుల విజ్ఞప్తులను, అవసరాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. ఫ్రీజింగ్ గడువును జూన్ 25 నుంచి జూలై 5 వరకు మారుస్తూ తాజాగా సవరణ మెమో విడుదల చేసింది. 

ప్రభుత్వ తాజా మార్గదర్శకాలు..
ప్రమోషన్లు, పోస్ట్ అప్‌గ్రేట్ ప్రక్రియను పూర్తి చేయటానికి జులై 5వ తేదీ వరకు సమయం లభించింది. జూన్ 30వ తేదీ నాటికి ఏర్పడే అన్ని రకాల ఉద్యోగ ఖాళీలను పరిగణలోకి తీసుకొని, వాటికి సంబంధించిన ప్రమోషన్ల ప్రక్రియను జూలై 5 లోపే వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. 

ఈ గడువు పొడిగింపు వల్ల అర్హులైన మరి కొంతమంది ఉద్యోగులకు పదోన్నతులు దక్కే అవకాశం కలగడమే కాకుండా, బదిలీల ప్రక్రియ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్..మరో 3 శాతం పెరగనున్న డీఏ..అకౌంట్లోకి అప్పటి నుండే?

Also Read: రాష్ట్ర చరిత్రలో అరుదైన రికార్డు..జూలైలో అత్యధికంగా 27 రోజులు స్కూల్ వర్కింగ్ డేస్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

DA July Hike: ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్..మరో 3 శాతం పెరగనున్న డీఏ..అకౌంట్లోకి అప్పటి నుండే?

Hyderabad, Telangana:

DA July Hike 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు.. ప్రభుత్వం నుండి రెండు కీలక ప్రకటనల కోసం ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటిది 7వ వేతన సంఘం పరిధిలో జరగనున్న కరువు భత్యం (DA)సవరణ కాగా, రెండోది ఇంకా సంప్రదింపుల దశలోనే ఉన్న 8వ వేతన సంఘానికి అమలుపై క్లారిటీ కోసం ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. మరోవైపు జూలై నెల సమీపిస్తుండటంతో.. ప్రభుత్వం త్వరలోనే తదుపరి డీఏ పెంపును ప్రకటించవచ్చనే అంచనాలు పెరుగుతున్నాయి. అదే సమయంలో, దేశవ్యాప్తంగా 8వ వేతన సంఘం కింద జీతాల సవరణపై చర్చలు కొనసాగుతున్నాయి.

8వ వేతన సంఘం ఏర్పాటు అయినప్పటికీ, దాని సిఫార్సులు ఇంకా అమలులోకి రాలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం నిబంధనల ప్రకారమే డీఏ సవరణలను పొందుతూ ఉంటారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయాల ప్రభావాన్ని తట్టుకోవడంలో ఉద్యోగులు, పెన్షనర్లకు సహాయపడేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా జనవరి, జూలై నెలల్లో డీఏను సమీక్షిస్తుంది. తుది ద్రవ్యోల్బణ గణాంకాలు, ప్రభుత్వ లెక్కల ఆధారంగా.. జూలై 2026లో జరగబోయే డీఏ సవరణలో 2-3% పెంపు ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

డీఏను ఎలా లెక్కిస్తారు?
గత 12 నెలల్లో నమోదైన సగటు ద్రవ్యోల్బణం ఆధారంగా కరువు భత్యం సవరిస్తారు. ఈ గణన 'వినియోగదారుల ధరల సూచీ' (CPI)తో ముడిపడి ఉంటుంది. ఇది వస్తువులు, సేవల ధరలలో వచ్చే మార్పులను కొలుస్తుంది. 8వ వేతన సంఘం తన సిఫార్సులను ఇంకా ఖరారు చేయకపోవడం వల్ల, డీఏ సవరణలను నిర్ణయించడానికి 7వ వేతన సంఘం కింద ఉన్న ప్రస్తుత విధానమే (ఫార్ములా) కొనసాగుతుంది.

ఇటీవలి ద్రవ్యోల్బణ గణాంకాలు కరువు భత్యంలో మరో పెంపు ఉంటుందనే అంచనాలను బలపరిచాయి. గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) విడుదల చేసిన డేటా ప్రకారం.. ఏప్రిల్ నెలతో పోలిస్తే మే 2026లో రిటైల్ ద్రవ్యోల్బణం ఎక్కువగా నమోదైంది. పెరుగుతున్న ఆహార ధరలు అధిక ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణాలలో ఒకటిగా నిలిచాయి. ద్రవ్యోల్బణం, వినియోగదారుల ధరల సూచిక (CPI) సంబంధిత డేటాలో ఇటీవలి కదలికల కారణంగా జూలైలో మరో కరువు భత్యం (DA) పెంపు ఉంటుందని చాలా మంది నిపుణులు అంచనా వేస్తున్నారు.

గత సవరణ తర్వాత, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రస్తుతం తమ మూల వేతనంలో 58% కరువు భత్యం పొందుతున్నారు. జూలై 2026 సవరణకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ.. ప్రభుత్వం 2-3 శాతం పాయింట్ల పెంపును ఆమోదిస్తుందని చాలా మంది ఆశిస్తున్నారు. అయితే, తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వం చేసే అధికారిక లెక్కింపుపై ఆధారపడి ఉంటుంది.

Also Read: 2005 ముందు నాటి కరెన్సీ నోట్లు పనిచేయవా? షాకింగ్ న్యూస్ చెప్పిన నేషనల్ బ్యాంక్!

Also Read: విద్యార్థులకు గుడ్‌న్యూస్..జూన్ 29న స్కూళ్లు కాలేజీలకు సెలవు..ఎక్కడంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Fee Reimbursement Funds: కాలేజీ విద్యార్థులకు గుడ్‌న్యూస్..ఫీజు రీయింబర్స్‌మెంట్ మనీ విడుదల..ఎలా అప్లై చేయాలి?

Hyderabad, Telangana:

Telangana Fee Reimbursement: తెలంగాణలోని లక్షలాదిమంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. జూన్ 27న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల కింద రూ.100 కోట్లను విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని నెలలుగా బకాయిల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు, కాలేజీ యాజమాన్యాలకు ఈ వార్త ఎంతో ఊరటని కలిగించింది.

కొత్త విధానం ప్రకారం.. రాబోయే 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రతినెల రూ.200 కోట్ల విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగమే ఈ మొదటి విడత రూ.100 కోట్ల రూపాయలు విడుదల చేశారని అధికారులు స్పష్టం చేశారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. 

ఎవరెవరు అర్హులు..
ఈ పథకం ద్వారా కింద వర్గాలకు చెందిన పేద, గ్రామీణ విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ బీసీ, ఈడబ్యూఎస్, మైనారిటీ, దివ్యంగ విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. అయితే ఆ విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, నర్సింగ్ వంటి అన్ని రకాల ప్రొఫెషనల్, ఉన్నత కోర్సులు చదువుతున్న వారు అయ్యుండాలి. ఆయా విద్యార్థులు కనీసం 75% అటెండెన్స్ (హాజరు) తప్పనిసరిగా కలిగి ఉండాల్సి ఉంటుంది. ఈ నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వం సదరు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తుంది.

కొత్త జీవోలు..
హైకోర్టు స్టే తర్వాత ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలతో జీవో నెంబర్ 8, 9లను విడుదల చేసింది. వీటి ప్రకారం.. నిధులు మొత్తం నాలుగు విడతల్లో నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోని జమవుతాయి. ఖాతాలో డబ్బులు పడిన ఒక వారంలోపు విద్యార్థులు ఆ డబ్బును తమ కాలేజీలకు చెల్లించాల్సి ఉంటుంది. 

అప్లై చేసుకోవడం ఎలా? 
ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందాలనుకునే అర్హులైన విద్యార్థులు కింది విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: ముందుగా అధికారిక ఈ-పాస్ పోర్టల్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 

డాక్యుమెంట్ అప్‌లోడ్: వెబ్‌సైట్‌లో అడిగిన వివరాలను నమోదు చేసి, అవసరమైన అన్ని రకాల సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి. 

అధికారులు వెరిఫికేషన్: మీ దరఖాస్తులను సంబంధిత జిల్లా సంక్షేమ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. 

ఖాతాలో జమ: వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, నిధులు నేరుగా మీ బ్యాంకు ఖాతాలో వచ్చేస్తాయి. 

గమనిక: నిధులు విడుదలతో హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కాలేజీల్లో అడ్మిషన్లు ప్రక్రియ ఇకపై సాఫీగా సాగనుంది. తదుపరి విడతల నిధులను కూడా త్వరలోనే క్లియర్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

Also Read: రాష్ట్ర చరిత్రలో అరుదైన రికార్డు..జూలైలో అత్యధికంగా 27 రోజులు స్కూల్ వర్కింగ్ డేస్..

Also Read: విద్యార్థులకు గుడ్‌న్యూస్..జూన్ 29న స్కూళ్లు కాలేజీలకు సెలవు..ఎక్కడంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

జగన్నాథుడి విగ్రహంలో కొట్టుకునే గుండె చప్పుడు.. పూరిలో దాగున్న 5 అంతుచిక్కని అద్భుతాలు!

Hyderabad, Telangana:

Puri Jagannath Temple Latest News: భారతదేశంలోని అత్యంత పవిత్రమైన చార్ ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం ఒకటి.. ఈ ఆలయం కేవలం భక్తికే కాదు.. ఆధునిక సైన్స్ సైతం సమాధానం చెప్పలేని ఎన్నో అతీంద్రియ, అద్భుత రహస్యాలకు నిలయంగా మారింది.. యుగయుగాలుగా ఇక్కడ జరిగే సంఘటనలు స్వామివారి అపారమైన దైవశక్తికి నిదర్శనంగా నిలుస్తూ వస్తోంది..

1999 సంవత్సరంలో అక్టోబర్ 29న ఒడిశా తీరాన్ని వణికించిన పరదీప్ మహా తుఫాన్‌ సమయంలో పూరి క్షేత్రంలో ఒక అద్భుతం జరిగింది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు.. కుండపోత వర్షం పూరి వైపు ఊహించని స్థాయిలో దూసుకొచ్చాయి. ఆలయానికి, భక్తులకు పెద్ద ప్రమాదం పొంచి ఉన్న ఆ రాత్రి వేళ.. ఆలయ శిఖరంపై ఉన్న నీలచక్రం నుంచి ఒక రహస్య నీలి రంగు కాంతి కిరణం (Blue Light Ray) అత్యంత వేగంగా సముద్రం వైపు వెళ్లడాన్ని భక్తులు గమనించారు. ఆ మరుక్షణమే పూరి వైపు రావలసిన తుఫాను ఒక్కసారిగా ఆగిపోయి.. జగన్నాథుడు తన ఆలయాన్ని, భక్తులను కాపాడుకున్నాడనేందుకు ఈ ఘటనే సజీవ సాక్ష్యంగా భావించవచ్చు.

గాలికి వ్యతిరేకంగా ఎగిరే జెండా..
ఈ ఆలయంపై ఉన్న జెండా సాధారణ వాతావరణానికి చాలా భిన్నంగా ఎల్లప్పుడూ గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో ఎగురుతుంది. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకు ఎలాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకుండా కేవలం ఒక తాడు సహాయంతో వంశపారంపర్యంగా వస్తున్న పూజారులు వందల అడుగుల ఎత్తుకు ఎక్కి ఈ జెండాను మారుస్తారు. ఈ జెండాపై పక్షులు వాలడం అత్యంత అరుదు.. ఒకవేళ పక్షి వాలితే అది రాబోయే విపత్తుకు సంకేతంగా భావిస్తారట. గతంలో ఒడిశా రైలు ప్రమాదానికి రెండు రోజుల ముందు, అలాగే కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభానికి ముందు ఈ జెండాపై పక్షులు వాలడం, జెండా గాలికి ఎగిరిపోవడం వంటి అశుభ సూచికలు జరిగాయని స్థానికులు నమ్ముతారు.

ముస్లిం భక్తుడి కోసం ఆగిన స్వామి రథం..
15వ శతాబ్దంలో లాల్ బెగ్ అనే మొగల్ సైన్యాధిపతికి.. ఒక బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన సలాబేగ ముస్లిం అయినప్పటికీ.. జగన్నాథుని పరమ భక్తుడిగా మారారు. ఒకసారి రథయాత్ర సమయంలో ఆయన పూరికి రావడం ఆలస్యమైంది. తన ఆరాధ్య దైవాన్ని చూడలేకపోతున్నానని ఆయన మార్గమధ్యంలో బాధపడ్డాడు.. బాలగండి అనే ప్రదేశంలో జగన్నాథుడి రథం నిలిచిపోయింది. వందలాది ఏనుగులు, వేలాది మంది భక్తులు లాగినా రథం ఒక్క ఇంచు కూడా ముందుకు కదల్లేదు... కలలో స్వామి రాజుకు ఆదేశించినట్లుగా.. మూడు రోజుల తర్వాత సలాబేగ వచ్చి స్వామివారిని దర్శించుకున్నాకే రథం ముందుకు కదిలింది. ఈనాటికీ రథయాత్రలో సలాబేగ సమాధి వద్ద రథాన్ని కాసేపు ఆపడం ఒక ఆచారంగా వస్తోంది.

విగ్రహాలకు గుండె చప్పుడు..
పూరి ఆలయంలోని విగ్రహాలు రాతితో చేసినవి కావు.. వీటిని ప్రత్యేక వేప చెట్టు దుంగలతో చేస్తారు. ప్రతి 8, 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి పాత విగ్రహాలను తీసివేసి కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. దీనిని నవకలేబర ఉత్సవంగా చెప్పకుంటారు. పాత విగ్రహం నుంచి కొత్త విగ్రహంలోకి మార్చే అత్యంత పవిత్రమైన అంతర్లీన శక్తినే బ్రహ్మ పదార్థం అంటారు. ఇది శ్రీకృష్ణుని గుండె లేదా నాభి అని జానపద కథలు చెబుతున్నప్పటికీ.. అది సైన్స్ వివరించలేని.. ఒక అపారమైన దైవ శక్తిగా భావిస్తారు. ఈ మార్పిడి ప్రక్రియ అర్ధరాత్రి వేళ.. ఆలయంలోని లైట్లన్నీ ఆర్పివేసి పూర్తి చీకట్లో జరుగుతుంది. పూజారులు కళ్ళకు గంతలు కట్టుకుని.. చేతులకు వస్త్రాలు చుట్టుకుని ఈ బ్రహ్మ పదార్థాన్ని మారుస్తారు. దానిని ఇప్పటివరకు ఎవరూ చూడలేదు.

తరిగిపోని మహాప్రసాదం..
లక్షలాది మంది భక్తులు ఒక్కసారిగా వచ్చినా ఇక్కడ వండే ప్రసాదం ఎప్పుడు తరిగిపోదని భక్తులు భావిస్తారు. అలాగని వృధా కూడా కాదట.. అలాగే ఆలయంలో ఉండే 22 మెట్లలో మూడవ మెట్టును యమశీల అంటారు. దీనిని తొక్కితే పుణ్యం పోతుందని భక్తులు దీనిపై అడుగు పెట్టకుండా దాటుకుంటూ వెళతారు. ఇటువంటి ఎన్నో అంతుచిక్కని అద్భుత రహస్యాలకు నిలయమే.. పూరి జగన్నాథ పుణ్యక్షేత్రం.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

 

0
0
Report

July School Working Days: రాష్ట్ర చరిత్రలో అరుదైన రికార్డు..జూలైలో అత్యధికంగా 27 రోజులు స్కూల్ వర్కింగ్ డేస్..

Hyderabad, Telangana:

July 2026 School Working Days: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జులై నెలలో పాఠశాలకు ఏకంగా 27 రోజులపాటు పని దినాలు రాబోతున్నాయి. సాధారణంగా ఏ నెలలోనైనా కనీసం నాలుగు ఆదివారాలు ఒక రెండో శనివారం కలిపి ఐదు రోజులు సెలవులు కచ్చితంగా ఉంటాయి. ఈ నెలలో 31 రోజులు ఉన్న అదే కూడా గరిష్టంగా 26 రోజులు పనిదినాలు మాత్రమే వస్తుంటాయి. కానీ, ఈ జులై నెల అందుకు భిన్నంగా సరికొత్త రికార్డును నమోదు చేయనుంది. 

27 పని దినాలు ఎలా వచ్చాయంటే.. 
వేసవి సెలవులు తర్వాత పాఠశాల పునః ప్రారంభం కావాల్సిన సమయంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఈ మార్పు చోటుచేసుకుంది. ఎండల కారణంగా జూలై 12న పాఠశాల ప్రారంభోత్సవానికి ప్రభుత్వం ఒకరోజు సెలవు ప్రకటించింది. 

జూన్ 13న రెండో శనివారం, 14 ఆదివారం కావడంతో పాఠశాలలో జూన్ 15న అధికారింగా తెరుచుకున్నాయి. జూన్ 12 నాటి సెలవును భర్తీ చేసేందుకు జూలై నెలలోని రెండో శనివారాన్ని పనితరంగా విద్యాశాఖ ప్రకటించింది. 

దీనివల్ల జులై నెలలో కేవలం నాలుగు ఆదివారాలు మాత్రమే సెలవులుగా మిగిలాయి. ఫలితంగా మొత్తం 31 రోజుల్లో నాలుగు రోజులు పోగా మిగిలిన 27 రోజులు పాఠశాలలు తెరిచే ఉంటాయి. 

ఉపాధ్యాయులు ఏమంటున్నారంటే..
పాఠశాలల్లో రెండో శనివారం సెలవు విధానాన్ని ప్రవేశపెట్టిన నాటి నుంచి, ఒకే నెలలో 27 పని దినాలు రావడం విద్యాశాఖ చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ అరుదైన మార్పుతో సిలబస్ పూర్తి చేయడానికి ఉపాధ్యాయులకు తగినంత సమయం దొరుకుతుందని పలువురు టీచర్లు అభిప్రాయపడుతున్నారు.

Also Read: AP Rain Alert: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన!

Also Read; Aarna Funny Video: ఫన్నీ వీడియో షేర్ చేసిన ఏపీ సీఎం చంద్రబాబు..వెంకటేష్ మూవీ డైలాగ్‌తో మీమ్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
0
Report
Advertisement
Advertisement
Back to top