న్యూఢిల్లీ: ఆలస్యంగా వచ్చేవారిపై కొరడా ఝులిపిస్తూ, గరిష్టంగా 15 నిమిషాల ఆలస్యాన్ని క్షమించాలని కేంద్ర సిబ్బంది మరియు శిక్షణ విభాగం (DOPT) నిర్ణయించింది మరియు దేశవ్యాప్తంగా ఉద్యోగులను ఉదయం 9.15 గంటలకు కార్యాలయంలోకి వచ్చి వారి హాజరును గుర్తించాలని ఆదేశించింది. సీనియర్ అధికారులతో సహా ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ఉపయోగించాలని చెప్పబడింది, నాలుగేళ్ల క్రితం కోవిడ్ వ్యాప్తి చెందినప్పటి నుండి వారిలో చాలా మంది బయోమెట్రిక్ ఉపయోగించడం లేదు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు టైం టేబుల్.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి స్థానిక మురికివాడలో తన ఇంటి ముందున్న భూమిని స్థానిక కౌన్సిలర్, ఆయన భార్య కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఓ వితంతువు ఆరోపించింది. 30 ఏళ్ల క్రితం ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుని నివాసం ఉండేదన్నారు. పట్టాదారు సర్టిఫికెట్, మున్సిపల్ కార్పొరేషన్ ఇంటి పన్ను, ఇంటి ప్లాట్కు సంబంధించి తహసీల్దార్ ఇచ్చిన విద్యుత్ బిల్లు రశీదు తన వద్ద ఉన్నాయని తెలిపారు.
మంచిర్యాల జిల్లా జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా వద్ద బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం కూలీలు,బాటసారులకు అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారుకూరి సదానందం కుమారుడు శ్రీనాథ్ మహర్షి జయంతి సందర్భంగా అయన జ్ఞాపకార్ధం అల్పాహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో రోజువారి కూలీలు బాటసారులు, నిరుపేదలు సుమారు 200 మంది పాల్గొని అల్పాహారం స్వీకరించారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో కాంట చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. సీపీఐ నాయకులు మాట్లాడుతూ, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. డీజిల్, వంటనూనె, పప్పు దినుసుల ధరలు గణనీయంగా పెరిగి పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే ధరలు తగ్గించాలని, లేనిపక్షంలో సీపీఐ ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తుందని హెచ్చరించారు।