అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకు వచ్చిన లారీ
కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్ వద్ద పెను ప్రమాదం తప్పింది. కేపి.హెచ్.బి నుండి కూకట్ పల్లి కి వెళ్తున్న లారీ ఒక్కసారి వివేకానంద నగర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్ పైకు దూసుకుని వెళ్ళింది దీనితో అక్కడ ప్రజలు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
RRB Group D Recruitment 22,000 Posts: రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భారతీయ రైల్వే శాఖ తీపి కబురు అందించింది. RRB గ్రూప్-డి (లెవల్-1) రిక్రూట్మెంట్ 2026 ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 22,000 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) దీనికి సంబంధించి CEN 09/2025 నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ విడుదల: జనవరి 2026
దరఖాస్తులు ప్రారంభం: 21 జనవరి 2026
చివరి తేదీ: 20 ఫిబ్రవరి 2026
ఖాళీల వివరాలు & అర్హతలు
ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, పాయింట్స్మన్, అసిస్టెంట్ లోకో షెడ్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత లేదా ITI (NCVT/NAC) సర్టిఫికేట్ కలిగి ఉండాలి. లేదా ఇంజనీరింగ్ డిప్లొమా/డిగ్రీ ఉన్నవారు కూడా అర్హులే. 18 నుండి 33 ఏళ్ల మధ్య ఉండాలి. (SC/ST/OBC/PWBD అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది).
ఎంపిక ప్రక్రియ, పరీక్షా విధానం..
అభ్యర్థులను నాలుగు దశల్లో ఎంపిక చేస్తారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT): 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో నెగటివ్ మార్కింగ్ (1/3) కలదు. విశేషమేమిటంటే, ఈ పరీక్షను తెలుగుతో పాటు 13 ప్రాంతీయ భాషల్లో రాసుకోవచ్చు.
శారీరక సామర్థ్య పరీక్ష (PET): శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్: ధృవీకరణ పత్రాల పరిశీలన.
వైద్య పరీక్షలు (Medical Exam): రైల్వే ప్రమాణాల ప్రకారం మెడికల్ టెస్ట్ ఉంటుంది.
జీతం, ఇతర ప్రయోజనాలు
ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతభత్యాలు లభిస్తాయి.
ప్రాథమిక జీతం (Basic Pay): రూ. 18,000.
అదనపు అలవెన్సులు: డియర్నెస్ అలవెన్స్ (DA), హెచ్ఆర్ఏ (HRA), ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, నైట్ డ్యూటీ అలవెన్స్, మెడికల్ సౌకర్యాలు.
మొత్తం జీతం: అన్ని అలవెన్సులు కలుపుకుని నెలకు సుమారు రూ.22,500 నుండి రూ.25,380 వరకు అందుతుంది.
దరఖాస్తు రుసుము & ఎలా అప్లై చేయాలి?
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.rrbapply.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
జనరల్ అభ్యర్థులకు: రూ.500
SC/ST/మహిళలు/దివ్యాంగులు/మైనారిటీలకు: రూ. 250
దరఖాస్తు విధానం: ముందుగా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. అనంతరం ఫోటో, సంతకం వంటి పత్రాలను అప్లోడ్ చేసి, ఫీజు చెల్లించి దరఖాస్తును సమర్పించాలి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ప్రింటవుట్ తీసుకోవడం మర్చిపోవద్దు.
Also Read: Ladki Bahin Yojana: మహిళలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక..ఖాతాల్లోకి రూ.3,000..పండక్కి ఆడవాళ్లకు వరం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Pension Hike 5 Times: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులతోపాటు ప్రైవేటు ఉద్యోగులకు భారీ శుభవార్త. కొత్త సంవత్సరం 2026తోపాటు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈపీఎఫ్ఓకు సంబంధించిన కనీస పింఛన్ భారీగా పెరగనుందని సమాచారం. ఈ పెంపుదలతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనం కలగనుంది. నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా పెన్షనర్లకు ప్రభుత్వం అందిస్తున్న ఐదు రెట్ల పింఛన్ పెంపు అనే అంశం ఆసక్తిగా మారింది. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
Also Read: KTR: నీ డ్రామాలు, అబద్ధాలు ఎక్కువ రోజులు నడవవు.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్
ఉద్యోగుల భవిష్య నిధి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతోపాటు పింఛన్దారులకు ఉంటుంది. ఈ సంస్థలో సభ్యులైన వారందరికీ భారీ శుభవార్త. కేంద్ర ప్రభుత్వం త్వరలో ఈపీఎఫ్ సభ్యులకు నిధులు అందించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఉద్యోగుల పెన్షన్ పథకం (ఈపీఎస్) కింద చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని రూ.5,000కి పెంచవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ పెంపుపై బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Also Read: Konda Surekha: మేడారం జాతరకు దూరంగా కొండా సురేఖ.. ఇంకా పొంగులేటితో పొసగలేదా?
ప్రస్తుతం ఈపీఎఫ్లో 75 లక్షలకు పైగా సభ్యులు పెన్షన్ ప్రయోజనాలను పొందుతున్నారు. పీఎఫ్ ఉద్యోగి సంస్థలు చాలా కాలంగా ఈపీఎస్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తుండగా.. తాజాగా దానికి మోక్షం లభించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ తర్వాత ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లోక్సభ సమావేశాల్లో ప్రభుత్వం అటువంటి ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాధానంలో చెప్పినా ఆ సమస్యను అర్థం చేసుకున్నట్లు పేర్కొంది.
Also Read: Kakinada TDP: కాకినాడ టీడీపీలో ఆధిపత్య పోరు.. ఎమ్మెల్సీ వర్సెస్ ఎంపీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ పథకం కనీస మొత్తాన్ని రూ.5,000కి పెంచుతారని కొన్నాళ్లుగా ఉద్యోగులు ఆశాభావంతో ఉన్నారు. కనీస ఈపీఎస్ మొత్తం రూ.1,000 ఉండగా దీనిని పెంచాలని ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రైవేటు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తుండగా.. ఈ ప్రయోజనాన్ని కనీసం 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులకు మాత్రమే వర్తించనుంది. 58 సంవత్సరాల వయస్సు తర్వాత ఖాతాలో పెన్షన్ జమ చేయడం ప్రారంభమవుతుంది.
పెంపు ఎంత?
కేంద్ర ప్రభుత్వం కనీస నెలవారీ పెన్షన్ను రూ.2,000 నుంచి రూ.3 వేలకు పెంచవచ్చని ప్రచారం జరుగుతుండగా.. ఇప్పుడు అది రూ.5,000 కు పెరగవచ్చని కూడా చెబుతున్నారు. అయితే ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. ప్రభుత్వ వర్గాల్లో దీనిపై చర్చ జరుగుతోందని సమాచారం. సాధారణ బడ్జెట్ తర్వాత కనీస పింఛన్ పెంపుపై నిర్ణయం తీసుకుంటారని అందరూ ఆశిస్తున్నారు. 2014లో ప్రైవేట్ రంగ ఉద్యోగుల పెన్షన్ పెంచిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
KTR vs Revanth Reddy: 'తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి వెనుకటి రోజులు తెస్తానని.. మోసం చేసేవారికే ప్రజలు అధికారం కట్టబెడతారని ముందే చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సరిగ్గా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి నిజాయితీ కలిగిన మోసగాడు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆనాడు రెట్టింపు పెన్షన్లు, రైతుబంధు, దళిత బంధు, రెండు లక్షల ఉద్యోగాలు, పీఆర్సీ ఇలా అనేక కార్యక్రమాలను ప్రకటించి ఒక్కదాన్ని అమలు చేయకుండా విజయవంతంగా ప్రజలను 24 నెలలుగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read: Konda Surekha: మేడారం జాతరకు దూరంగా కొండా సురేఖ.. ఇంకా పొంగులేటితో పొసగలేదా?
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. నిరుద్యోగులు నిరసనలు, ఆందోళనను గౌరవించి ఉద్యోగాలు ఇస్తామని భరోసా ఇవ్వాలని రేవంత్ రెడ్డికి సూచించారు. 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెంటనే ఇవ్వాలని.. జాబ్ క్యాలెండర్పై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో బట్టల షాపు ప్రారంభోత్సవానికి వెళ్లిన రేవంత్ రెడ్డి పక్కనే గతంలో రాహుల్ గాంధీ నిరుద్యోగులతో సమావేశమైన గాంధీనగర్ కి పోలేకపోయిండు అని గుర్తుచేశారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని… కానీ ఆ అబద్ధాలు ఎక్కువ రోజులు నడవవు అని కేటీఆర్ ఉన్నారు.
Also Read: Kakinada TDP: కాకినాడ టీడీపీలో ఆధిపత్య పోరు.. ఎమ్మెల్సీ వర్సెస్ ఎంపీ
రేవంత్ రెడ్డి రైతులను రైతు కూలీలను కౌలుదారులను విద్యార్థులను మహిళలను వృద్ధులను ప్రభుత్వ ఉద్యోగులను ఇలా అందరిని మోసం చేశారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డికి తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలు రావు కానీ బూతుల భాష ఒక్కటే వచ్చు అని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కనిపిస్తే ధైర్యం వస్తదని పేర్కొన్నారు.
Also Read: River Water: నదీ జలాల వివాదంపై చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి కీలక విజ్ఞప్తి.. ఏమిటో తెలుసా?
24 నెలల రేవంత్ రెడ్డి వైఫల్య పాలనను కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. సన్నాసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కారణంగా ప్రజలకు ఆదాయ మార్గాలు తగ్గిపోయాయని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కేసీఆర్ అత్యంత నిష్ఠతో పనిచేశారని చెప్పారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నదని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Virat Kohli Sets New Record: భారత క్రికెట్ చరిత్రలో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ తన ఖాతాలో మరో అరుదైన మైలురాయిని చేర్చుకున్నాడు. వన్డే ఫార్మాట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న కోహ్లీ, తాజాగా మాజీ కెప్టెన్, 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ రికార్డును అధిగమించాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో బరిలోకి దిగడం ద్వారా, భారత్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ఒక మెట్టు పైకి ఎగబాకాడు.
గంగూలీని వెనక్కి నెట్టిన కోహ్లీ
ఇప్పటివరకు 308 వన్డే మ్యాచ్లతో సౌరవ్ గంగూలీ ఐదో స్థానంలో ఉండగా, కోహ్లీ తన 309వ వన్డే మ్యాచ్ ఆడటం ద్వారా గంగూలీని ఆరో స్థానానికి నెట్టి తాను ఐదో స్థానానికి చేరుకున్నాడు. విశేషమేమిటంటే, ప్రస్తుతం టాప్-6 జాబితాలో కొనసాగుతున్న ఏకైక యాక్టివ్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మాత్రమే. తన అద్భుతమైన ఫిట్నెస్, స్థిరమైన ప్రదర్శనతో కోహ్లీ మరిన్ని రికార్డులను తిరగరాసే దిశగా దూసుకుపోతున్నాడు.
భారత్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన దిగ్గజాలు
భారత క్రికెట్ చరిత్రలో వన్డే ఫార్మాట్లో అత్యధిక మ్యాచ్లు ఆడి, జట్టును ఉన్నత శిఖరాలకు చేర్చిన టాప్-6 ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
| ర్యాంక్ | ఆటగాడి పేరు | ఆడిన వన్డే మ్యాచ్లు |
| 1 | సచిన్ టెండూల్కర్ | 463 |
| 2 | ఎంఎస్ ధోనీ | 347 |
| 3 | రాహుల్ ద్రవిడ్ | 340 |
| 4 | మహ్మద్ అజారుద్దీన్ | 334 |
| 5 | విరాట్ కోహ్లీ | 309* |
| 6 | సౌరవ్ గంగూలీ | 308 |
ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేక శైలి
సచిన్ టెండూల్కర్: 463 మ్యాచ్లతో ప్రపంచ రికార్డు సృష్టించడమే కాకుండా, వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ చేసిన వీరుడిగా చరిత్రకెక్కారు.
ఎంఎస్ ధోనీ: 347 మ్యాచ్లు ఆడిన ధోనీ, కేవలం ఆటగాడిగానే కాకుండా కెప్టెన్గా భారత్కు 2011 వన్డే ప్రపంచకప్తో సహా అనేక ఐసీసీ ట్రోఫీలను అందించారు.
రాహుల్ ద్రవిడ్: 'ది వాల్'గా పేరుగాంచిన ద్రవిడ్ 340 మ్యాచ్ల్లో తన నిబద్ధతతో భారత మిడిల్ ఆర్డర్ను బలోపేతం చేశారు.
మహ్మద్ అజారుద్దీన్: 334 వన్డేలు ఆడిన అజార్, తన రిస్ట్ వర్క్ బ్యాటింగ్తో పాటు కెప్టెన్సీలోనూ అనేక విజయాలు సాధించిపెట్టారు.
విరాట్ కోహ్లీ: ప్రస్తుత తరం రన్ మెషిన్ కోహ్లీ, దూకుడైన ఆటతీరుతో ఇప్పటికే వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డును తన పేరిట లిఖించుకున్నారు.
వడోదర వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ కోహ్లీ కెరీర్లో మరో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోయింది. గంగూలీ వంటి దిగ్గజం రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ, రాబోయే రోజుల్లో అజారుద్దీన్, ద్రవిడ్ రికార్డులను కూడా అధిగమించే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Budget 2026 Petrol Increase: కేంద్ర బడ్జెట్ (2026-27) ప్రవేశపెట్టడానికి కౌంట్డౌన్ మొదలైన వేళ, సామాన్యులకు ఇంధన ధరల సెగ తగిలేలా కనిపిస్తోంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి బడ్జెట్ను సమర్పించనున్న నేపథ్యంలో, పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఓ ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ తన నివేదికలో విశ్లేషించింది.
లీటరుకు రూ.3 - 4 పెరిగే అవకాశం!
ప్రభుత్వ ఆదాయ వనరులను పెంచుకోవడంలో భాగంగా, ఆటో ఇంధనాలపై ఎక్సైజ్ సుంకాన్ని (Excise Duty) లీటరుకు 3 నుండి 4 రూపాయల వరకు పెంచవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి సుమారు రూ.50,000 కోట్ల నుండి రూ.70,000 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
ధరల పెంపునకు కారణాలేంటి?
2025 ఏప్రిల్ నుండి నవంబర్ వరకు ప్రభుత్వ ఆదాయ వసూళ్లు బడ్జెట్ అంచనాల్లో కేవలం 56 శాతానికే పరిమితమయ్యాయి. గత ఏడాది (60%) తో పోలిస్తే ఇది తక్కువగా ఉండటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. జీడీపీలో ఆర్థిక లోటును 4.4 శాతానికి తగ్గించాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వానికి భారీగా నిధులు అవసరం.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు సుమారు $61 డాలర్ల వద్ద తక్కువగా ఉండటంతో, చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) భారీ మార్జిన్లను ఆర్జిస్తున్నాయి. ఈ ప్రయోజనాన్ని పన్ను రూపంలో ప్రభుత్వం తన వైపు తిప్పుకోవాలని భావిస్తోంది.
ప్రభుత్వానికి కలిగే లాభం ఎంత?
ఫైనాన్షియల్ నివేదిక ఇచ్చిన లెక్కల ప్రకారం.. ఇంధనంపై లీటరుకు రూ.1 సుంకం పెంచితే.. ఏడాదికి రూ. 17,000 కోట్ల ఆదాయం వస్తుంది. లీటరుకు రూ. 4 వరకు పెంచితే అది జీడీపీలో 0.15 నుండి 0.2% ఆదాయానికి సమానం అవుతుంది.
ప్రభావం ఎలా ఉంటుంది?
ఒకవేళ ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పెంచితే, చమురు కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపైకి నెట్టే అవకాశం ఉంది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, రవాణా ఖర్చులు ఖరీదవ్వడం ద్వారా నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉంది. అయితే, ఈ పెంపుపై ప్రభుత్వం నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఫిబ్రవరి 1న బడ్జెట్ రోజున దీనిపై పూర్తి స్పష్టత రానుంది.
Also Read: Ladki Bahin Yojana: మహిళలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక..ఖాతాల్లోకి రూ.3,000..పండక్కి ఆడవాళ్లకు వరం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Horoscope Telugu News 2026: 2026 సంవత్సరం ప్రారంభమై ఇప్పటికి 11 రోజులు కావస్తోంది. ఈ సంవత్సరంలో అనేక ప్రధాన గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాదిలో కొన్ని గ్రహాలు తిరోగమన నుంచి సక్రమ మార్గంలోకి కూడా రాబోతున్నాయి. ఇక ఇదే సమయంలో మరికొన్ని గ్రహాలు తిరోగమనం కూడా చేయబోతున్నాయి. ఈ జాబితాలోని అంగారక గ్రహంతో పాటు శని గ్రహం గృహస్పతి విరహాలు ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారక గ్రహంమే రెండవ తేదీన అస్తమించబోతోంది. అలాగే బృహస్పతి గ్రహం ఆగస్టు 12వ తేదీన తిరోగమనం చేయబోతోంది. శని ఏప్రిల్ 22వ తేదీన అస్తమించబోతోంది. మొత్తం మీద ఈ ఏడాదిలో మూడు ప్రధాన గ్రహాలు అస్తమించబోతున్నాయి.
ప్రతి గ్రహం ఏదో ఒక సమయంలో తప్పకుండా అస్తమిస్తుంది. దీనివల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో ఆకస్మిక మార్పులు సంభవించే అవకాశాలుంటాయి. ముఖ్యంగా ఈ అన్ని గ్రహాలు శుభస్థానంలో ఉన్న రాష్ట్ర వారికి తప్పకుండా ఆకస్మిక లాభాలు కలుగుతూ ఉంటాయి. జీవితంలో పెద్ద పెద్ద మార్పులు రావడమే కాకుండా. ఖగోళ మార్పులు కూడా వచ్చే అవకాశాలుంటాయి. అలాగే ఈ సమయంలో కొన్ని రాశుల వారు కూడా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆయా రాశుల వారిపై ఈ సమయంలో కీడు ప్రభావం కూడా పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ మూడు గ్రహాలు అస్తమించడం వల్ల ప్రధాన ప్రభావం ఏ రాశుల వారిపై పడుతుందో తెలుసుకోండి.
ఈ రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం..
మేషరాశి
మేషరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ శక్తివంతమైన మూడు గ్రహాలు అస్తమించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా ఆదాయం క్రమంగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఆదాయ ఖర్చులు కూడా పూర్తిగా తగ్గిపోయే సూచనలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో స్టాక్ మార్కెట్లలో తొందరపడి పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు. అలాగే గతంలో చేసిన తప్పులనుంచి పరిష్కారం కూడా పొందుతారు. ఎలాంటి పెట్టుబడులు పెట్టిన ఈ సమయంలో అద్భుతమైన ధన లాభాలు పొందే అవకాశాలున్నాయి. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత బలంగా మారే అవకాశాలున్నాయి.
వృషభ రాశి
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఆర్థిక పరిస్థితులు ఊహించని స్థాయిలో మారిపోతాయి. గతంలో నిలిచిపోయిన డబ్బులు ఈ సమయంలో తిరిగి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా కుటుంబ జీవితం కూడా చాలా ప్రశాంతంగా సాగుతుంది. జీవిత భాగస్వామితో ఆర్థిక విషయాల్లో వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా ముందుకు కొనసాగుతుంది. స్టాక్ మార్కెట్లతో పాటు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో పొదుపు ఊహించని స్థాయిలో పెరుగుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ సమయంలో సంపాదన అనుకున్నంత స్థాయిలో పెరుగుతుంది. అంతేకాకుండా పొదుపు కూడా ఊహించని స్థాయిలో పెరగడం విశేషం. అలాగే ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సహాయం పొందడమే.. కాకుండా కొన్ని ఇంటికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆలోచనాత్మకంగా పెట్టుబడులు పెట్టి దీర్ఘకాలిక లాభాలు కూడా పొందుతారు. స్టాక్ మార్కెట్లలో నష్టాలు తగ్గి వీరు లాభాల బాటలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎప్పటినుంచో అనుకుంటున్న పనుల్లో విజయాలు కూడా సాధిస్తారు.

Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Admission Without Aadhaar: పాఠశాలల్లో అడ్మిషన్లకు సంబంధించి యూపీలోని యోగి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు RTE చట్టం కింద ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశం కావాలంటే తల్లిదండ్రులు, పిల్లలు ఇద్దరికీ ఆధార్ తప్పనిసరి అనే నిబంధన ఉండేది. అయితే ఈ కారణంగా పేద, వెనుకబడిన వర్గాల కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యను గుర్తించిన యూపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ నిబంధనకు బ్రేక్ వేసింది.
ఇకపై RTE కోటా కింద పాఠశాలల్లో అడ్మిషన్ పొందాలంటే పిల్లలకైనా, తల్లిదండ్రులకైనా ఆధార్ కార్డు తప్పనిసరి కాదని పేర్కొంది. అంటే ఆధార్ లేకపోయినా పిల్లలు స్కూల్లో అడ్మిషన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. డాక్యుమెంట్లు లేవనే కారణంతో చదువుకు దూరమయ్యే పరిస్థితి ఇక ఉండకూడదన్నదే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశం అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక రీయింబర్స్మెంట్ విషయంలో మాత్రం ఆధార్ అవసరం ఉంటుంది. RTE కింద పేద విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు చెల్లిస్తుంది. ఆ మొత్తాన్ని నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయాలంటే కనీసం ఒక తల్లిదండ్రుడి ఆధార్, ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా తప్పనిసరి. అంటే అడ్మిషన్కు ఆధార్ అవసరం లేకపోయినా, రీయింబర్స్మెంట్ కోసం మాత్రం ఆధార్ తప్పనిసరి.
ప్రైవేట్ పాఠశాలల్లో RTE అడ్మిషన్లకు సంబంధించిన నిబంధనలను కూడా ప్రభుత్వం మరోసారి స్పష్టంగా తెలిపింది. RTE చట్టంలోని సెక్షన్ 12(1)(c) ప్రకారం, ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో మొత్తం సీట్లలో 25 శాతం సీట్లు మాత్రమే RTE కోటాకు కేటాయిస్తారు. ఈ పరిమితిని ఎట్టి పరిస్థితుల్లోనూ మించరాదని ఆదేశించింది. ప్రతి జిల్లాకు ఎంతమంది పిల్లలను చేర్చుకోవాలన్న లక్ష్యాన్ని ముందుగానే నిర్ణయిస్తారు. వయస్సు ఆధారంగా కూడా స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. 3 నుంచి 4 ఏళ్ల వయస్సు గల పిల్లలు నర్సరీకి అర్హులు. 4 నుంచి 5 ఏళ్ల పిల్లలు ఎల్కేజీకి, 6 నుంచి 7 ఏళ్ల పిల్లలు ఫస్ట్ క్లాస్లో ప్రవేశానికి అర్హులు. ఈ వయోపరిమితిని కచ్చితంగా పాటించాలని విద్యాశాఖ పేర్కొంది.
దరఖాస్తు చేసిన పిల్లల వివరాల పరిశీలన బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ స్థాయిలో జరుగుతుంది. ఆ తర్వాత రెండు దశల్లో ఆన్లైన్ లాటరీ నిర్వహించి పాఠశాలలను కేటాయిస్తారు. ఈ లాటరీ ప్రక్రియ పూర్తయ్యాక తుది ఎంపిక జాబితాను జిల్లా మేజిస్ట్రేట్ ఆమోదిస్తారు. అంటే మొత్తం ప్రక్రియలో పారదర్శకత ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విద్యాశాఖ సీనియర్ అధికారులు చెబుతున్నదేమిటంటే… ఈ మార్పు పూర్తిగా RTE చట్టానికి అనుగుణంగా ఉంది. డాక్యుమెంట్లు లేవనే కారణంతో చదువు కోల్పోయే పరిస్థితి ఇకపై ఉండకూడదు. నిజంగా అవసరం ఉన్న పేద, వెనుకబడిన వర్గాల పిల్లలు విద్యా ప్రయోజనాలను పొందాలన్నదే ఈ నిర్ణయానికి ప్రధాన లక్ష్యమని పేర్కొంది. యూపీ ప్రభుత్వ ఈ తాజా నిర్ణయం వల్ల వేలాది కుటుంబాలకు పెద్ద ఊరట లభించనుంది. చదువు ఒక హక్కు అనే భావనను మరింత బలంగా అమలు చేయడంలో ఇది కీలక అడుగుగా చెప్పుకోవచ్చు.
Also Read: Budget 2026: పన్ను చెల్లింపుదారులకు నిర్మలమ్మ గుడ్ న్యూస్.. బడ్జెట్లో ఈ 5 పెద్ద ప్రకటనలు..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chaturgrahi Raja Yoga 2026 Effect On Zodiac: కొత్త సంవత్సరం మొదటి నెల మరో 20 రోజులైతే ముగుస్తుంది. ఆ తర్వాత ఫిబ్రవరి నెల ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి నెల జ్యోతిష్య శాస్త్రం పరంగా చాలా ప్రత్యేకమైనదిగా భావించవచ్చు. ఫిబ్రవరి నెలలో అనేక గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో అనేక శుభసంయోగాలు కూడా ఏర్పడతాయి. దీని ప్రభావం ప్రపంచం పైనే కాకుండా మొత్తం అన్ని రాశుల వారిపై పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో ఎంతో ప్రత్యేకత కలిగిన చతుర్గ్రహి రాజయోగం (Chaturgrahi Raja Yoga 2026) ఏర్పడబోతోంది. ఈ నెలలో సూర్యుడు బుధుడు కుజుడు శుక్రుడు గ్రహాలు కుంభరాశిలో సంయోగం చేయబోతున్నాయి. దీనికి కారణంగానే ఈ యోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. యోగ ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా కూడా చాలా మేలు జరుగుతుంది. ఈ యోగం జాతకంలో శుభ స్థానంలో ఉంటే ఆనందం సంపద ప్రతిష్టకు ఎలాంటి లోటు ఉండదు. అంతేకాకుండా భారీ మొత్తంలో ధన లాభాలు పొందగలుగుతారు.
ఈ రాశులవారికి ఊహించని లాభాలు:
మిథున రాశి
ఈ శక్తివంతమైన చతుర్గ్రహి రాజయోగం (Chaturgrahi Raja Yoga) ప్రభావంతో మిథున రాశి వారికి కెరీర్ ఊపందుకుంటుంది. అంతేకాకుండా ఉద్యోగాల్లో ఉన్నవారికి పదోన్నతులు కూడా లభించబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు లభించడమే కాకుండా భాగస్వామ్యుల నుంచి మంచి సపోర్టు లభించి వ్యాపార విస్తరణ కూడా జరిగే అవకాశాలున్నాయి. దీనివల్ల సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ శక్తివంతమైన Chaturgrahi Raja Yoga ప్రభావంతో సంపాదన ఊహించని స్థాయిలో పెరగబోతోంది ఆస్తిపరంగా చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ సమయంలో భారీ మొత్తంలో లాభాలు తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల్లో శాంతి ఆనందం కూడా నెలకొంటుంది ముఖ్యంగా కొత్త ప్రణాళికలు ఈ సమయంలో విజయవంతం అవుతాయి.
కుంభరాశి
కుంభ రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళ్తున్న వ్యక్తులకు మంచి ప్యాకేజీ తో ఉద్యోగాలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడి.. ఖర్చులు చేసే అవకాశాలున్నాయి.
కుంభరాశి
ఈ Chaturgrahi Raja యోగ ప్రభావంతో కుంభరాశి వారికి కొత్త ఒప్పందాలు కూడా జరుగుతాయి. వ్యాపారాలు చేస్తున్నవారు పెద్ద మొత్తంలో ఆర్డర్లు కూడా పొందగలుగుతారు. అలాగే కొత్త ఒప్పందాలు కూడా కుదుర్చుకొని భారీ మొత్తంలో సంపాదించగలుగుతారు. ఈ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా అందరికీ అనుకూలమైన నిర్ణయాలు తీసుకొని విజయాలు కూడా సాధిస్తారు.

Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mana Shankara Vara Prasad Movie Ticket Price Hike: మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శివశంకర్ వరప్రసాద్ గారు' చిత్ర యూనిట్కు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే సంక్రాంతి కానుకను అందించింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు, ప్రత్యేక షోలకు అనుమతినిస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేసింది. స్పెషల్ షోలతో పాటు టికెట్ రేటును ఎంత మేర పెంచిందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా సినిమాలు విడుదల రోజున సందడి మొదలవుతుంది, కానీ మెగాస్టార్ సినిమా కోసం ఒక రోజు ముందే థియేటర్లు ముస్తాబవుతున్నాయి. జనవరి 11వ తేదీ రాత్రి 8:00 PM కి ప్రీమియర్ షోలు ప్రదర్శించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రత్యేక షో కోసం టికెట్ ధరను రూ.600 గా నిర్ణయించారు.
టికెట్ ధరల పెంపు వివరాలు
సంక్రాంతి రద్దీతో పాటు సినిమాపై ఉన్న అంచనాలను దృష్టిలో ఉంచుకుని, వారం రోజుల పాటు (జనవరి 12 నుండి 18 వరకు) పెంచిన ధరలు అమలులో ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాను సింగిల్ స్క్రీన్ టికెట్పై రూ.50..అలాగే మల్టీప్లెక్స్ల్లో ఒక్కో టికెట్పై రూ.100 పెంచుకునేందుకు రేవంత్ సర్కార్ చిత్రబృందానికి అనుమతిని ఇచ్చింది. ఈ పెంపు జనవరి 18వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత సాధారణ ధరలు వర్తిస్తాయి.
మెగాస్టార్ బాక్సాఫీస్ మేనియా
చిరంజీవి అసలు పేరుతో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. సంక్రాంతి సీజన్ కావడంతో ఈ ధరల పెంపు చిత్ర వసూళ్లకు పెద్ద ఎత్తున ఊతమివ్వనుంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఈ వెసులుబాటుతో మెగా అభిమానులు పండగకు ఒక రోజు ముందే థియేటర్ల వద్ద హంగామా చేయడానికి సిద్ధమవుతున్నారు.
ముఖ్య గమనిక: ప్రభుత్వం కేవలం వారం రోజుల పాటు మాత్రమే ఈ ధరల పెంపునకు అవకాశం కల్పించింది. కాబట్టి, పండగ సెలవుల్లో సినిమా చూడాలనుకునే వారు ఈ మార్పులను గమనించి టికెట్లు బుక్ చేసుకోవడం ఉత్తమం.
Also Read: Ladki Bahin Yojana: మహిళలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక..ఖాతాల్లోకి రూ.3,000..పండక్కి ఆడవాళ్లకు వరం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Broccoli For Weight Loss: బరువు తగ్గడానికి కఠినమైన డైట్ లేదా జిమ్ కోసం వెతకాల్సిన అవసరం లేకుండా, మన ఆహారంలో ఒక చిన్న మార్పు ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. అదే బ్రోకలీ. చూడ్డానికి క్యాలీఫ్లవర్ లాగే ఉండే ఈ ఆకుపచ్చని కూరగాయ ఆరోగ్యానికి ఒక సంజీవిని వంటిది. శరీరాన్ని దృఢంగా, చురుకుగా ఉంచుకోవాలనుకునే వారికి బ్రోకలీ ఎంత అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వేగంగా బరువు తగ్గడం (Weight Loss)
బ్రోకలీలో కొవ్వు (Fat) చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా ఉంటుంది. దీనిని తిన్న తర్వాత కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. తద్వారా అనవసరమైన చిరుతిళ్లు తినకుండా నియంత్రించవచ్చు. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు జీవక్రియను వేగవంతం చేసి, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి.
2. మధుమేహ నియంత్రణ (Sugar Control)
బ్రోకలీలోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మధుమేహం ఉన్నవారు దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రించుకోవచ్చు.
3. గుండె ఆరోగ్యం (Heart Health)
బ్రోకలీలో పొటాషియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలోనూ, రక్తపోటును (Blood Pressure) అదుపులో ఉంచడంలోనూ తోడ్పడతాయి. పరిశోధనల ప్రకారం.. బ్రోకలీని తరచుగా తినేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.
4. ఎముకల పుష్టి (Strong Bones)
కాల్షియం, విటమిన్ K నిల్వలు అధికంగా ఉండే బ్రోకలీ ఎముకలను బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా వృద్ధులలో వచ్చే ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను నివారించడానికి ఇది ఒక సహజ సిద్ధమైన ఔషధంలా పనిచేస్తుంది.
5. రక్తహీనత నివారణ
శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు (Anemia) బ్రోకలీని తీసుకోవడం వల్ల ఐరన్ అందుతుంది. ఇది రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది.
బ్రోకలీని ఎలా తీసుకోవాలి?
దీనిని పూర్తిగా ఉడకబెట్టడం కంటే, లైట్గా స్టీమ్ (ఆవిరి మీద ఉడికించడం) చేసి తింటే పోషకాలు అలాగే ఉంటాయి. సలాడ్లు, సూప్లు లేదా కూరల్లో కూడా దీనిని వాడుకోవచ్చు.
(గమనిక: ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా లేదా కొత్త డైట్ ప్రారంభించాలనుకున్నా తప్పనిసరిగా వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించండి. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: Ladki Bahin Yojana: మహిళలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక..ఖాతాల్లోకి రూ.3,000..పండక్కి ఆడవాళ్లకు వరం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Shani Dev Transit Effect 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు రాశి సంచారంతో పాటు నక్షత్ర మార్పులకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా కొన్ని గ్రహాల సంచారాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. అందులో శని గ్రహానికి మరింత ప్రత్యేకత ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జనవరి 20వ తేదీన శని ఉత్తరభాద్రపదంలోకి ప్రవేశిస్తుంది. ఈ నక్షత్రానికి శనీశ్వరుడే అధిపతిగా వ్యవహరిస్తాడు. కాబట్టి కొన్ని రాశుల వారిపై ప్రభావం రెట్టింపు అవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో మరికొన్ని రాశుల వారికి సమస్యలు కూడా రావచ్చు.
ఉత్తరభాద్రపదంలోకి శని ప్రవేశించడం చాలా శుభ్రమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా జనవరి 20వ తేదీన నక్షత్ర సంచారం జరగడంతో ఈ క్రింది రాశుల వారికి పురోగతి లభించడమే కాకుండా కొత్త ఉద్యోగాల్లో పదోన్నతులు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఆర్థికపరమైన లాభాలు కూడా కలుగుతాయి. అలాగే అనుకున్న పనుల్లో ఆకస్మాత్తుగా విజయాలు కూడా సాధించగలుగుతారు.
ఈ రాశులవారిపై శని అనుగ్రహం
మకర రాశి
శని గ్రహం నక్షత్ర సంచారంతో మకర రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ధైర్యం విశ్వాసం ఊహించిన స్థాయిలో పెరగబోతోంది. అలాగే పనుల్లో పురోగతి కూడా సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత పనుల ద్వారా లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. తోబుట్టువుల సపోర్టుతో ఎన్నో రకాల మంచి పనులు చేయగలుగుతారు. అలాగే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
మిథున రాశి
శని గ్రహ సంచారంతో మిధున రాశి వారికి చర్య పరంగా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు లభించడమే కాకుండా. వ్యాపారాలు లాభసాటిగా మారుతాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యుల నుంచి ఆస్తులు కూడా పొందగలిగే అవకాశాలు కల్పిస్తున్నాయి. తల్లిదండ్రులతో సంబంధాలు మరింత మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించగలుగుతారు. గత కొద్ది రోజుల నుంచి వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. దీంతోపాటు ఆరోగ్యం కాస్త కుదుటుపడే అవకాశాలున్నాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ సమయంలో అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. నిలిచిపోయిన పనులన్నీ ముందుకు సాగుతాయి. విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వ్యక్తులు తప్పకుండా ఈ సమయాల్లో విదేశాలకు వెళ్లగలుగుతారు. అంతేకాకుండా వీరికి సామాజిక హోదా కూడా పెరుగుతుంది. చదువుతున్న విద్యార్థులకు ఈ సమయంలో సానుకూలమైన ఫలితాలు రావడం ప్రారంభమవుతాయి. విదేశాల్లో చదవాలనుకుంటున్న వారి కోరికలు నెరవేరుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించగలుగుతారు.

Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ladki Bahin Yojana Payment Status: మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం 'ముఖ్యమంత్రి లడ్కీ బహిన్ యోజన' లబ్ధిదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతోంది. మున్సిపల్ ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన నిధులు, పండుగ వేళ మహిళల ఖాతాల్లోకి చేరే అవకాశం కనిపిస్తోంది.
ఒకేసారి రెండు నెలల డబ్బు?
ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ.1,500 ఆర్థిక సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికల నిబంధనల వల్ల గత నెలలో నిధుల విడుదల ఆలస్యమైంది. తాజా సమాచారం ప్రకారం.. డిసెంబర్, జనవరి నెలలకు కలిపి మొత్తం రూ.3,000 ఒకేసారి జమ అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 14 లేదా 15 తేదీల్లో ఈ నగదును లబ్ధిదారుల ఖాతాల్లోకి పంపాలని ప్రభుత్వం భావిస్తోంది. వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల కంటే తక్కువ ఉన్న కుటుంబాలలోని మహిళలకు ఈ ప్రయోజనం చేకూరుతుంది.
ఎన్నికల కోడ్, రాజకీయ దుమారం..
నిధుల విడుదలపై క్షేత్రస్థాయిలో సన్నాహాలు జరుగుతున్నప్పటికీ, దీనిపై రాజకీయంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జనవరి 15న మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఇప్పుడు నగదు పంపిణీ చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (Code of Conduct) ఉల్లంఘించడమేనని ప్రతిపక్ష పార్టీలు వాదిస్తున్నాయి.
ఓటర్లను ప్రభావితం చేసేలా ఈ చర్య ఉండకూడదని ప్రతిపక్షాలు ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాయి. దీనివల్ల పండుగకు ముందే డబ్బు వస్తుందా లేక ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఖాతాల్లో జమ అవుతుందా అనేది ఉత్కంఠగా మారింది.
అధికారిక ప్రకటన కోసం నిరీక్షణ
ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతి లోపే నిధులు విడుదల చేయాలని చూస్తున్నప్పటికీ, దీనిపై ఇంకా అధికారిక ధృవీకరణ వెలువడలేదు. ఎన్నికల కమిషన్ అనుమతి పొందితేనే జనవరి 14న మహిళల ఖాతాల్లోకి నగదు చేరుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Panchagrahi Raja Yoga 2026 Effect On Zodiac Telugu: ఈ ఏడాది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తేదీల్లో మకర సంక్రాంతిని జరుపుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది గ్రహాలకు రాజుగా భావించే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు.. ఈ పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే మకర రాశిలో సూర్యుడితో పాటు మరో నాలుగు గ్రహాల కలయిక జరగబోతోంది. దీనికి కారణంగానే పంచగ్రహి రాజయోగం ఏర్పడుతుంది.
జనవరి 19వ తేదీన సూర్యుడు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు, కుజుడు గ్రహాలు మకర రాశిలో కలయిక జరపబోతున్నాయి. దీని కారణంగానే పంచగ్రహ రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల నాలుగు రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఆర్థికంగా లాభాలు కలగడమే కాకుండా ఆయా రాశుల వారికి అదృష్టం సహకరించి సంపాదన కూడా పెంచుకోగలుగుతారు. అయితే సంక్రాంతి తర్వాత ఏ రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
పంచగ్రహి రాజయోగం కారణంగా వృషభ రాశి వారికి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఆదాయం వృద్ధి కోసం కొత్త కొత్త అవకాశాన్ని లభించే సూచనలు కనిపిస్తున్నాయి. పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో రాబడులు కూడా పొందగలుగుతారు. అలాగే కృషికి తగ్గ ప్రతిఫలం కూడా లభించి ఎన్నో రకాల లాభాలు పొందుతారు. జీవితంలో సమతుల్యత కూడా పెరుగుతుంది. భవిష్యత్తులో అనుకున్న పనులు అనుకున్నట్లుగా చేయగలుగుతారు.
కర్కాటక రాశి
పంచగ్రహి రాజయోగం ప్రభావంతో కర్కాటక రాశి వారికి కూడా ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి పాత అప్పుల నుంచి పూర్తిగా ఉపయోగం లభించబోతోంది. సృజనాత్మకత కూడా విపరీతంగా పెరిగి.. పిల్లలనుంచి కొన్ని రకాల శుభవార్తలు కూడా వింటారు. ప్రేమలో మాధుర్యం కూడా విపరీతంగా పెరిగి అనుకున్న పనులు మానసిక ప్రశాంతతతో చేయగలుగుతారు. అలాగే అకస్మాత్తుగా శుభవార్తలు కూడా వింటారు.
Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..
తులారాశి
తులారాశి వారికి కూడా పంచగ్రహి రాజయోగం వల్ల కెరీర్ వ్యాపారాలపరంగా చాలావరకు కలిసి రాబోతోంది. ముఖ్యంగా వ్యాపారాల్లో అనుకున్న పురోగతి కూడా సాధించగలుగుతారు ఉద్యోగాలతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులు ఈ సమయంలో కొత్త కొత్త పరిచయాలను ఏర్పరచుకుంటారు. అంతేకాకుండా వీరికి ఈ సమయంలో విశ్వాసం కూడా విపరీతంగా పెరుగుతుంది. వీరికి ఈ సమయంలో ఊహించని స్థాయిలో బ్యాంకు బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది.
మకర రాశి
మకర రాశి వారికి ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన పాత వివాదాలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా పూర్వీకుల ఆస్తులు కూడా పొందగలుగుతారు. అనేక రకాల తగాదాలు కూడా పరిష్కారం కాబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. బంగారంతో పాటు వెండి, ఆస్తుల్లో పెట్టుబడులు కూడా పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు సామాజికంగా కూడా సేవలు చేసే సూచనలు ఉన్నాయి. అనుభవం కలిగిన వ్యక్తులతో సంబంధాలు ఏర్పడి.. భవిష్యత్తులో అద్భుతమైన లాభాలు పొందుతారు.

Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Almont Kid Cough Syrup Ban: పిల్లల ఆరోగ్యానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. చిన్నపిల్లల్లో అలర్జీలు, ఆస్తమా, హే ఫీవర్ వంటి సమస్యల చికిత్సకు వాడే 'అల్మాంట్-కిడ్' (Almont-Kid) సిరప్ను తక్షణమే వాడటం నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఔషధ నియంత్రణ మండలి (DCA) కఠిన ఆదేశాలు జారీ చేసింది.
నిషేధానికి గల కారణం ఏమిటి?
తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ శనివారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ సిరప్లో 'ఇథిలీన్ గ్లైకాల్' (Ethylene Glycol) అనే రసాయనం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. మోతాదుకు మించి ఉన్న ఇథిలీన్ గ్లైకాల్ పిల్లల ప్రాణాలకే ముప్పు కలిగించవచ్చు. ఇది మూత్రపిండాల వైఫల్యం, తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
కల్తీ గుర్తింపు..
బీహార్కు చెందిన 'ట్రిడస్ రెమెడీస్' (Tridus Remedies) అనే సంస్థ తయారు చేసిన ఈ సిరప్లో కల్తీ జరిగినట్లు తొలుత బెంగాల్ అధికారులు గుర్తించారు. ఆ తర్వాత అప్రమత్తమైన తెలంగాణ అధికారులు పరీక్షలు నిర్వహించగా కల్తీ నిజమేనని తేలింది.
తల్లిదండ్రులు ఏం చేయాలి?
ఔషధ నియంత్రణ మండలి అధికారులు తల్లిదండ్రులకు, మెడికల్ షాపుల యాజమాన్యాలకు కీలక సూచనలు చేశారు. మీ పిల్లలకు ఈ 'అల్మాంట్-కిడ్' సిరప్ను వాడుతుంటే వెంటనే ఆపేయండి. ఇప్పటికే ఈ సిరప్ బాటిల్ మీ ఇంట్లో ఉంటే దానిని పారవేయండి. మీ పిల్లలకు ఇప్పటికే ఈ సిరప్ ఇచ్చినట్లయితే, ముందు జాగ్రత్తగా ఒకసారి శిశువైద్యులను (Pediatrician) సంప్రదించి పరీక్షలు చేయించడం మంచిది.
అధికారుల చర్యలు
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫార్మసీలు, డ్రగ్ స్టోర్ల నుండి ఈ సిరప్ నిల్వలను వెంటనే ఉపసంహరించుకోవాలని (Recall) ఆదేశించింది. నిబంధనలు అతిక్రమించి ఈ సిరప్ను విక్రయించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
గమనిక: మీ పరిసరాల్లో ఎవరైనా ఈ సిరప్ను విక్రయిస్తున్నట్లు గమనిస్తే వెంటనే డ్రగ్ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేయండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chiranjeevi Sankranthi Movies: ఎప్పటిలాగే మన టాలీవుడ్ హీరోలు సంక్రాంతి పండుగకి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. మంచి కథలతో తమ అభిమానులను ఖుషీ చేసేందుకు థియేటర్లలో వచ్చేందుకు రెడీ అయ్యారు. అయితే ఈ సంక్రాంతికి మునుపటి కంటే సినిమాల పోటీ ఎక్కువగానే ఉంది. ఏకంగా 5 సినిమాలు.. 'ది రాజాసాబ్', 'మన శంకరవరప్రసాద్ గారు', 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 'అనగనగా ఒక రాజు', 'నారీనారీ నడుమ మురారి' విడుదల కానున్నాయి.
అయితే వీరిలో మెగాస్టార్ చిరంజీవి ఇంతకు ముందు ఎన్నో సంక్రాంతి పండుగలకు తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. సినిమాలతో అలరించడమే కాకుండా సూపర్ హిట్స్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా విడుదల కానున్న క్రమంలో చిరు సంక్రాంతి సెంటిమెంట్ కొనసాగుతుందా? తన కెరీర్లో సంక్రాంతి రేసులో ఎన్ని సినిమాలు విడుదలయ్యాయి? ఎన్ని హిట్స్ కొట్టాయనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవికి, సంక్రాంతి పండుగకు విడదీయలేని అనుబంధం ఉంది. బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సెంటిమెంట్ చిరంజీవికి చాలా బాగా కలిసొచ్చింది. తన కెరీర్లో దాదాపు 15 కి పైగా చిత్రాలు సంక్రాంతి సీజన్లో విడుదల కాగా, అందులో మెజారిటీ సినిమాలు బ్లాక్బస్టర్ హిట్లుగా నిలిచాయి. ప్రస్తుతం విడుదల కాబోతున్న 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా నేపథ్యంలో, గతంలో సంక్రాంతి రేసులో నిలిచిన చిరంజీవి సినిమాల ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
| సినిమా పేరు | విడుదల సంవత్సరం | ఫలితం (Result) | విశేషాలు |
| వాల్తేరు వీరయ్య | 2023 | బ్లాక్బస్టర్ | చిరంజీవి వింటేజ్ మాస్ లుక్తో బాక్సాఫీస్ను ఊపేసింది. |
| ఖైదీ నంబర్ 150 | 2017 | బ్లాక్బస్టర్ | 10 ఏళ్ల విరామం తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చి రికార్డులు సృష్టించింది. |
| అంజి | 2004 | యావరేజ్ / ఫ్లాప్ | గ్రాఫిక్స్కు ప్రశంసలు దక్కినా, కమర్షియల్గా వర్కౌట్ కాలేదు. |
| మృగరాజు | 2001 | డిజాస్టర్ | భారీ అంచనాలతో వచ్చి నిరాశపరిచింది. |
| అన్నయ్య | 2000 | హిట్ | ఫ్యామిలీ ఆడియన్స్ను మెప్పించి మంచి వసూళ్లు రాబట్టింది. |
| స్నేహం కోసం | 1999 | హిట్ | చిరంజీవి ద్విపాత్రాభినయం మరియు సెంటిమెంట్ బాగా పండింది. |
| హిట్లర్ | 1997 | బ్లాక్బస్టర్ | చిరంజీవి కెరీర్లో మర్చిపోలేని కమ్బ్యాక్ మూవీ ఇది. |
| ముఠా మేస్త్రి | 1993 | బ్లాక్బస్టర్ | మాస్ ఆడియన్స్లో చిరు ఇమేజ్ను శిఖరాగ్రానికి చేర్చింది. |
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద 'మెగా' రికార్డులు..
సక్సెస్ రేట్: చిరంజీవి సంక్రాంతికి వస్తున్నారంటే థియేటర్ల వద్ద సందడి వేరే స్థాయిలో ఉంటుంది. ఆయన సంక్రాంతి సినిమాల్లో 70% కంటే ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది. రాజకీయాల తర్వాత చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది 'ఖైదీ నంబర్ 150'తో సంక్రాంతికే కావడం విశేషం. గత ఏడాది (2023) 'వాల్తేరు వీరయ్య'తో మరోసారి సంక్రాంతి మొనగాడు అనిపించుకున్నారు.
ఈ ఏడాది పోటీ..
ఈసారి సంక్రాంతికి 'ది రాజాసాబ్' (ప్రభాస్) వంటి భారీ చిత్రాలతో పోటీ ఉన్నప్పటికీ, చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ ఆశలు ఉన్నాయి. టైటిల్ సెంటిమెంట్, సంక్రాంతి ట్రాక్ రికార్డ్ చూస్తుంటే ఈసారి కూడా చిరంజీవి తన సక్సెస్ పరంపరను కొనసాగించేలా కనిపిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook