Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Medchal-Malkajgiri500072

అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకు వచ్చిన లారీ

Jul 27, 2024 12:22:46
Hyderabad, Telangana

కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్ వద్ద పెను ప్రమాదం తప్పింది. కేపి.హెచ్.బి నుండి కూకట్ పల్లి కి వెళ్తున్న లారీ ఒక్కసారి వివేకానంద నగర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్ పైకు దూసుకుని వెళ్ళింది దీనితో అక్కడ ప్రజలు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Feb 13, 2026 08:54:10
Patancheruvu, Telangana:

Gudem Mahipal Reddy Gift: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కొన్ని ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురి చేసేలా బీఆర్‌ఎస్‌ పార్టీ కొన్ని సంచలన విజయాలను నమోదు చేసింది. వాటిలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీల ఫలితాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 5 మున్సిపాలిటీలు ఉండగా.. అన్నింటినీ బీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుని క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న గూడెం మహిపాల్‌ రెడ్డి పార్టీ ఫిరాయించి ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉన్నారు. తిరిగి బీఆర్‌ఎస్‌ పార్టీకి రావాలని చూస్తున్న గూడెం మహిపాల్‌ రెడ్డి అందులో భాగంగా మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ విజయానికి కృషి చేసినట్లు సమాచారం. ఈ ఫలితాలతో ఆయన తిరిగి బీఆర్‌ఎస్‌లోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: Municipal Election Results: ఈ మున్సిపాలిటీల్లో హంగ్‌.. హోరాహోరీ పోరులో ఎవరిదో పీఠం

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు అసెంబ్లీ పరిధిలోని మొత్తం ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇస్నాపూర్‌, ఇంద్రేశం, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ పార్టీకి షాకింగ్‌ ఫలితాలు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిన గూడెం మహిపాల్‌ రెడ్డి మున్సిపల్‌ ఎన్నికల్లో తనదైన వ్యూహం రచించారు. కాంగ్రెస్‌ అభ్యర్థులను కాకుండా బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు. దీంతో ఐదింటికి ఐదు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగిరింది. ఒక్క చోట కూడా అధికారంలోని కాంగ్రెస్‌ పార్టీ గెలకపోగా.. బీజేపీ అడ్రస్‌ లేదు.

Also Read: Bharat Gaurav Train: సమ్మర్‌లో మంచుకొండల్లో దైవ చింతన.. ఏప్రిల్ భారత్ గౌరవ్ రైలు షెడ్యూల్‌ ఇదే!

తిరిగి బీఆర్‌ఎస్‌ పార్టీలోకి..
అభివృద్ధి కోసం అంటూ కాంగ్రెస్‌ పార్టీలోకి ఫిరాయించిన గూడెం మహిపాల్‌ రెడ్డి తన తప్పు తెలుసుకున్నట్టు కనిపిస్తోంది. తన నియోజకవర్గంలోని మున్సిపాలిటీలను క్లీన్‌ స్వీప్‌ చేసి కేసీఆర్‌కు కానుకగా ఇచ్చినట్లు భావిస్తున్నారు. దీంతో తిరిగి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరేందుకు మార్గం సుగమమైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే తన సోదరుడిని కేసీఆర్‌ వద్దకు పంపించి రాయబారం నడిపిన మహిపాల్‌ రెడ్డి మున్సిపల్‌ ఎన్నికల విజయోత్సవంతో మళ్లీ కారెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిణామం గులాబీ పార్టీలో సరికొత్త జోష్‌ తీసుకువచ్చింది.

Also Read: Tirumala: గుండు చేయించుకున్న దర్శకుడు కె.రాఘవేంద్ర రావు.. ఎందుకో తెలుసా?

మున్సిపాలిటీల ఫలితాలు ఇవే
ఇస్నాపూర్ మున్సిపాలిటీ 26 వార్డులు
బీఆర్‌ఎస్‌ పార్టీ -12
కాంగ్రెస్‌ -10
స్వతంత్రులు -4

ఇంద్రేశం మున్సిపాలిటీ 18 వార్డులు
బీఆర్‌ఎస్‌ పార్టీ - 9
కాంగ్రెస్‌ -6
బీజేపీ - 2
స్వతంత్రులు -1

జిన్నారం మున్సిపాలిటీ 20 వార్డులు
బీఆర్‌ఎస్‌ పార్టీ - 8
కాంగ్రెస్‌ - 6
బీజేపీ - 4
స్వతంత్రులు - 2

గుమ్మడిదల మున్సిపాలిటీ 22 వార్డులు
బీఆర్‌ఎస్‌ పార్టీ -15
కాంగ్రెస్‌ -4
బీజేపీ -2
స్వతంత్రులు -1

గడ్డపోతారం మున్సిపాలిటీ 18 వార్డులు
బీఆర్‌ఎస్‌ పార్టీ -14
కాంగ్రెస్‌- 3
స్వతంత్రులు -1

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 13, 2026 08:27:27
Balapur, Telangana:

BRS Party vs Congress: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు దాదాపు పూర్తయ్యాయి. అత్యధికంగా కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించగా.. తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ సంచలన విజయాలు నమోదు చేసుకుంది. బీజేపీ సింగిల్‌ డిజిట్‌కు పరిమితమవగా.. కవిత ఫార్వార్డ్‌ బ్లాక్‌ ఒక చోట గెలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే దాదాపు పాతిక మున్సిపాలిటీల్లో మెజార్టీ ఎవరికీ రాలేదని తెలుస్తోంది.  కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ హోరాహోరీగా తలపడగా కొన్ని చోట్ల సమానంగా వార్డులు దక్కించుకోగా.. మరికొన్ని చోట్ల ఈ రెండు పార్టీలతోపాటు మిగతా పార్టీలు స్థానాలు దక్కించుకోవడంతో ఎవరికీ మెజార్టీ దక్కలేదు. ఆయా మున్సిపాలిటీలు హంగ్‌గా మారడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

Also Read: Govt Employees: ప్రభుత్వానికి ఉద్యోగుల సంచలన లేఖ.. పీఆర్‌సీ, పెండింగ్‌ డీఏల కోసం ఆల్టిమేటం

ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం 14 మున్సిపాలిటీల్లో హంగ్ వచ్చిందని తెలుస్తోంది. జిన్నారం, జమ్మికుంట, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కోహీర్, అలంపూర్, జనగామ, ఇస్నాపూర్‌, జహీరాబాద్‌, అలియాబాద్, మంచిర్యాల, కేసముద్రం, దేవరకద్ర, అమరచింత మున్సిపాలిటీల్లో ఎవరికీ మెజార్టీ దక్కలేదు. ఈ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అత్యధికంగా వార్డులు దక్కించుకున్నా మున్సిపల్‌ చైర్మన్‌ పీఠం సొంతం చేసుకునేందుకు మాత్రం మెజార్టీ దక్కలేదు.

Also Read: Govt Employees: తెలంగాణ ఉద్యోగులకు భారీ శుభవార్త.. నేడు ప్రభుత్వం కీలక నిర్ణయం?

==> మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా కాంగ్రెస్ 6, బీఆర్‌ఎస్‌ పార్టీ 4, బీజేపీ 1, స్వతంత్రులు ఒక చోట గెలిచారు.
==> సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 16 వార్డులు ఉండగా కాంగ్రెస్ 8, బీఆర్‌ఎస్‌ పార్టీ 5, బీజేపీ 1, స్వతంత్రులు రెండు చోట్ల గెలుపు.
==> మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో 16 స్థానాలు ఉండగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీ 8 చొప్పున వార్డులు గెలిచాయి.

ఎవరిదో పీఠం
ఈ మున్సిపాలిటీల్లో ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో రాజకీయం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీఆర్‌ఎస్‌ పార్టీ, కాంగ్రెస్‌ సమానంగా సీట్లు దక్కించుకున్న మున్సిపాలిటీల్లో ఏం జరుగుతుందనేది తెలియాల్సి ఉంది. కాకపోతే మిగిలిన స్థానాల్లో గెలిచిన స్వతంత్ర కౌన్సిలర్లు కీలకంగా మారనున్నారు. హంగ్ రావడంతో ఆయా మున్సిపాలిటీల్లో క్యాంపు రాజకీయాలకు తెర లేచింది. కౌన్సిలర్లు చేజారిపోకుండా.. ఇతర పార్టీల్లో చేరకుండా ఆయా పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. హంగ్‌ వచ్చిన మున్సిపాలిటీలను దక్కించుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక వ్యూహం రచిస్తోంది. ఎక్స్‌ అఫిషియో సభ్యుల ఓట్లతో మున్సిపాలిటీలను సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరి బీఆర్‌ఎస్‌ పార్టీ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 13, 2026 08:01:00
A.Konduru, Andhra Pradesh:

KGBV School Rats Bite News: ఎన్టీఆర్ జిల్లాలోని ఏ.కొండూరు మండలంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) హాస్టల్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి గాఢనిద్రలో ఉన్న బాలికలపై ఎలుకలు గుంపుగా దాడి చేయడంతో హాస్టల్ ప్రాంగణం ఒక్కసారిగా భీతావహంగా మారింది. ప్రభుత్వ హాస్టళ్లలో పారిశుధ్య లోపం ఏ స్థాయిలో ఉందో ఈ ఘటన అద్దం పడుతోంది. విద్యార్థినులు సురక్షితంగా ఉండాల్సిన చోట ఇలాంటి ప్రమాదం జరగడం తీవ్ర చర్చకు దారితీసింది.

ఘటన ఎలా జరిగింది?
ఫిబ్రవరి 13 తెల్లవారుజామున ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరులోని హాస్టల్‌లో విద్యార్థినులు నిద్రిస్తుండగా, ఒక్కసారిగా ఎలుకలు వారిపై దాడి చేశాయి. బాలికల చేతులు, కాళ్లు, ముఖాలను ఎలుకలు కొరకడంతో వారు నొప్పితో, భయంతో కేకలు వేశారు. ఈ ఘటనలో మొత్తం 11 మంది బాలికలకు గాయాలయ్యాయి. రక్తం రావడంతో సిబ్బంది వెంటనే స్పందించి వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తీవ్రంగా స్పందించారు. హాస్టల్‌లో అపరిశుభ్రతకు కారణాలేంటి? ఎలుకల బెడద ఉన్నా చర్యలు ఎందుకు తీసుకోలేదు? అనే అంశాలపై విచారణకు ఆదేశించారు. ఘటనపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

హాస్టల్‌లో పారిశుధ్యం మృగ్యమవ్వడం వల్లే ఎలుకలు పెరిగిపోయాయని స్థానికులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గాయపడిన బాలికలు ప్రస్తుతం కోలుకుంటున్నారని, వారికి యాంటీ-రాబిస్ వంటి అవసరమైన ఇంజెక్షన్లు ఇచ్చామని వైద్యులు తెలిపారు.

కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు నిరుపేద విద్యార్థినులకు ఆసరాగా ఉండాలి. కానీ, ఇలాంటి ఘటనలు జరగడం వల్ల విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో అభద్రతాభావం ఏర్పడుతోంది. ప్రభుత్వం తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని హాస్టళ్లలో పారిశుధ్య తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

Also Read: School Holiday: మహాశివరాత్రికి సెలవుల జాతర..వరుసగా 3 రోజులు స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు..ఎప్పటి నుంచి?

Also Read: EPS-95 Pension Update: ఉద్యోగులకు ముఖ్యమైన అప్‌డేట్..47 లక్షల మందికి రూ.9,000 పెన్షన్..ప్రభుత్వం ఏం చెబుతోంది?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 13, 2026 07:52:05
Hyderabad, Telangana:

How Did Valentine's Day Start History In Telugu: వరల్డ్ వైడ్‌గా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే వాలెంటెన్స్ డే రానే వచ్చేసింది.. గులాబీ పూలతో, ప్రత్యేకమైన గిఫ్టులతో, ప్రేమ కురిపించే శుభాకాంక్షలతో ఈరోజు ప్రేమికులంతా ఎంతో ఆనందంగా ఉంటారు. అయితే, ఈ రోజు కేవలం ఒక వేడుక మాత్రమే కాదని చరిత్ర చెబుతోంది.. దీని వెనక గొప్ప త్యాగంతో పాటు సుదీర్ఘ చరిత్ర దాగి ఉందని మీ అందరికీ తెలుసా? అసలు ఈ వాలెంటెన్స్ డే ఎలా మొదలైంది? ఫిబ్రవరి 14వ తేదీన ఉన్న అసలైన ప్రాముఖ్యత ఏంటి? అనే అంశాలను ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం.

వాలెంటెన్స్ డేకు సంబంధించిన మూలాలు క్రీస్తు శకం మూడో శతాబ్దపు రోమన్ సామ్రాజ్యం నుంచి ఉన్నాయి.  అప్పట్లో రోమన్ సామ్రాజ్యాన్ని రెండవ క్లాడియస్ పరిపాలించేవాడు. అయితే ఈ రాజు ఒక వింత నిబంధన అమలు చేస్తూ వచ్చేవాడు. ఈ రోమన్ రాజు వివాహం చేసుకున్న పురుషుల కంటే.. ఒంటరిగా ఉన్న యువకులే యుద్దంలో సమర్థవంతంగా పోరాడుతారని ఎక్కువగా నమ్మేవారు. అందుకే తన రాజ్యంలో ఉన్న యువకులంతా ఎవరూ పెళ్లి చేసుకోకూడదని రాజు ఆజ్ఞ జారీ చేస్తాడు..

కానీ ఆ సమయంలో సెయింట్ వాలెంటైన్ (Valentine) అనే ఒక క్రైస్తవ పాస్టర్ ఆ రాజు కళ్ళు కప్పి.. ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని.. వివాహం ఒక పవిత్ర బంధం అని భావించి.. ఆయన ఆరాధ్యంలో ఉన్న రాజుకు తెలియకుండా ప్రేమికులకు రహస్యంగా వివాహాలు జరిపించేవారు.. ఆ వాలెంటైన్ చేస్తున్న పనులను క్లాడియస్ చక్రవర్తి గుర్తించారు. ఆయనను బంధించి మరణశిక్ష విధిస్తాడు.  అయితే ఆ పాస్టర్ జైల్లో ఉన్న సమయంలో అక్కడే ఉన్న జైలర్ కుమార్తెతో స్నేహం పెంచుకుంటారు. అయితే, ఆమెకు కంటిచూపు ఉండదు.. ఆ పాస్టర్ తన శక్తిని ఉపయోగించి ఆమెకు కంటి చూపు తెప్పిస్తారని చరిత్రకారులు చెబుతున్నారు. 

ఆ పాస్టర్ను ఉరి తీసే ముందు.. ఆమెకు ఒక లేఖను రాస్తూ.. దాని కింద ఫ్రమ్ యువర్ వాలెంటైన్ అని సంతకం చేశారు. అది ఫిబ్రవరి 14వ తేదీ రోజే జరిగింది.. క్రీస్తు శకం 496 లో గెలాసియస్ ఈరోజును అధికారికంగా.. సెయింట్ వాలెంటైన్స్ డేగా ప్రకటించారు.  ప్రాచీన రోమన్లు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే లౌపర్కాలియా పండగను క్రమంగా క్రైస్తవ మతంలోకి మార్చి.. వాలెంటెన్స్ డేగా నామకరణం చేశారు. 14వ శతాబ్ద సమయంలో బ్రిటన్‌తో పాటు ప్రాన్స్ దేశాలకు సంబంధించిన కవులు వాలెంటెన్స్ డే పై రచనలు చేసి.. ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేశారు. దీంతో అప్పటినుంచి ప్రతి ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన వ్యాలెంటెన్స్ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

Also Read: Telangana Municipal Election Results 2026 LIVE: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ.. ఈ స్థానాల్లో ఇండిపెండెంట్స్ కీ రోల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Feb 13, 2026 07:37:44
Muhana, Rajasthan:

Rajasthan Royals Captain Riyan Parag: రాజస్థాన్ రాయల్స్ (RR) ఫ్రాంచైజీ ఒక సంచలన నిర్ణయానికి సిద్ధమైంది. యువ ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ జట్టు కొత్త కెప్టెన్‌గా నేడు అనగా ఫిబ్రవరి 13 సాయంత్రం నాటికి అధికారికంగా ఎంపిక కానున్నారు. యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా వంటి హేమాహేమీల పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ, జట్టు మేనేజ్‌మెంట్ పరాగ్ వైపు మొగ్గు చూపడం విశేషం. 2019లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టినప్పటి నుండి రాజస్థాన్ రాయల్స్‌తోనే ఉన్న రియాన్ పరాగ్‌పై ఫ్రాంచైజీకి ఉన్న నమ్మకం మరోసారి నిరూపితమైంది.

నాయకత్వ రేసులో పరాగ్ ముందంజ
రాజస్థాన్ రాయల్స్ థింక్ ట్యాంక్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ రేసులో స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, అనుభవజ్ఞుడైన రవీంద్ర జడేజా పేర్లు వినిపించినా.. ఫ్రాంచైజీతో పరాగ్‌కు ఉన్న సుదీర్ఘ అనుబంధం అతనికి ప్లస్ అయ్యింది. 2025 సీజన్ వేలానికి ముందు RR పరాగ్‌ను ఏకంగా రూ.14 కోట్లకు రిటైన్ చేసుకుంది.

సంజు సామ్‌సన్ సంకేతాలు
గత సీజన్‌లో సంజు సామ్‌సన్ గాయపడినప్పుడు పరాగ్ స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా వ్యవహరించడం ఒక ముందస్తు సూచనగా నిలిచింది. స్వయంగా సామ్‌సన్ కూడా భవిష్యత్తు నాయకత్వం గురించి గతంలోనే స్పష్టతనిచ్చారు. "నేను ఎప్పటికీ కెప్టెన్‌గా ఉండలేను, భవిష్యత్తు కోసం ఎవరైనా సిద్ధం కావాలి. రియాన్ పరాగ్ జట్టును నడిపించగలడని మేము నమ్ముతున్నాము" అని సామ్‌సన్ 2025లో పేర్కొన్నారు.

రియాన్ పరాగ్ కెరీర్‌లో 2024 సీజన్ ఒక మైలురాయిగా నిలిచింది. 16 మ్యాచ్‌ల్లో 52.09 సగటుతో, 149.22 స్ట్రైక్ రేట్‌తో 573 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో అతని అద్భుత ఫామ్ కారణంగా అదే ఏడాది టీమ్ ఇండియా తరపున టీ20, వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం దక్కింది.

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నాయకత్వం వహించనున్న అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా రియాన్ పరాగ్ రికార్డు సృష్టించబోతున్నాడు. 2008లో దివంగత షేన్ వార్న్ సారథ్యంలో మొదటి ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత, మళ్లీ ట్రోఫీని ముద్దాడని రాయల్స్.. పరాగ్ నేతృత్వంలో ఆ నిరీక్షణకు ముగింపు పలకాలని ఆశిస్తోంది.

రియాన్ పరాగ్ నిలకడ లేని ఆటగాడు అనే విమర్శల నుండి జట్టును నడిపించే స్థాయికి ఎదగడం ఒక గొప్ప ప్రయాణం. ఈ యువ కెప్టెన్ ఆధ్వర్యంలో రాజస్థాన్ రాయల్స్ 2026లో ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి.

Also REad: Pawan Kalyan Balakrishna Assembly: అసెంబ్లీలో పవన్-బాలయ్య సందడి..డిప్యూటీ సీఎం ఛాంబర్‌కు వెళ్లిన 'లెజెండ్'!

Also Read: School Holiday: మహాశివరాత్రికి సెలవుల జాతర..వరుసగా 3 రోజులు స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు..ఎప్పటి నుంచి?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Faceboo

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 13, 2026 07:31:25
Jangaon, Telangana:

Jangaon Municipality Telugu News: జనగామ జిల్లా కేంద్రంలో మున్సిపల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.. మున్సిపల్ పీఠం ఎక్కేది ఎవరని అంశంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.. ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుండగా.. చివరకు ఇండిపెండెంట్ కౌన్సిలర్లే ఈ చదరంగంలో కింగ్ మేకర్లుగా మారబోతున్నారు. మున్సిపల్ పీఠం ప్రక్రియలో భాగంగా వీరే ఇప్పుడు క్రియాశీలక పాత్ర పోషించబోతున్నారు. 

ఈ మున్సిపాలిటీలో స్పష్టమైన మెజారిటీ ఏ ఒక్క పార్టీకి లేకపోవడంతో ఇప్పుడు రెండు పార్టీలు స్వాతంత్ర అభ్యర్థుల మద్దతు కోసం వేచి చూస్తూ ఉన్నాయి.. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. నలుగురు ఇండిపెండెంట్ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా చీలిపోయారు.  ఇద్దరు స్వాతంత్రం అభ్యర్థులు ఇప్పటికే బీఆర్ఎస్ గూటికి చేరినట్లు ప్రచారం కూడా జరుగుతోంది... మిగిలిన ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి జై కొట్టినట్లు అధికారిక సమాచారం.. దీంతో ఇరు పక్షాల మధ్య బాల పరీక్ష నువ్వా నేనా అన్నట్లుగా మారింది. రెండు వైపులా సరైన ఫిగర్ ఉండడంతో ఇప్పుడు మున్సిపల్ పీఠం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. 

తమ కౌన్సిలర్లు చేజారి పోకుండా ప్రధాన పార్టీలు ఇప్పటికే క్యాంపు రాజకీయాలను తెరలేపినట్లు తెలుస్తోంది. రహస్య ప్రాంతాల్లో చర్చలు, ప్రలోభాలతో పాటు బుజ్జగింపులతో జనగామ రాజకీయం గంట గంటకు రంగులు మారుతూ వస్తోంది. చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి ఇప్పుడు అక్కడ ప్రతి ఓటు అత్యంత కీలకం.. మున్సిపల్ చైర్మన్ ఎన్నికలలో ఎక్స్-అఫీషియో ఓట్లు కూడా కీలకం కానున్న  సమయంలో, పార్టీల వ్యూహకర్తలు లెక్కలు  సరి చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.. ఇక ఇందులో బిఆర్ఎస్ వ్యూహం ఏంటంటే.. తమ పాత బలాన్ని కాపాడుకుంటూ.. ఇండిపెండెంట్‌ల మద్దతుతో పీఠాన్ని నిలబెట్టుకోవడానికి చూస్తోంది.. కాంగ్రెస్ అధికార బలంతో పాటు అసంతృప్త కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకొని చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. 

Also Read: Telangana Municipal Election Results 2026 LIVE: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ.. ఈ స్థానాల్లో ఇండిపెండెంట్స్ కీ రోల్

మొత్తానికి జనగామ మున్సిపాలిటీ భవిష్యత్తు ఇప్పుడు స్వాతంత్ర కౌన్సిలర్ల చేతిలో ఉండడం విశేషం.. వారు చివరి నిమిషంలో వేటు మొగ్గు చూపుతారో? ఎవరికి ఓటు వేస్తారో అనే అంశంపై చైర్మన్ ఎంపిక అనేది ఆధారపడి ఉంటుంది.. పట్టణ ప్రజలంతా ఈ రాజకీయ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది గంటల్లోనే ఈ రాజకీయ ఉత్కంఠకు స్థిరపడి అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Also Read: Telangana Municipal Election Results 2026 LIVE: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ.. ఈ స్థానాల్లో ఇండిపెండెంట్స్ కీ రోల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 13, 2026 05:02:20
Hyderabad, Telangana:

Rahu Transit 2026 Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాహువు గ్రహాన్ని చాయాగ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహం వ్యక్తుల జీవితాల్లో ఆకస్మిక కీర్తితో పాటు సంపదను తీసుకువస్తుంది. అయితే, ఈ గ్రహం నక్షత్ర సంచారం లేదా రాశి సంచారం చేసినప్పుడు మొత్తం 12 రాశుల ప్రభావితం అవుతాయి. మార్చి 29న రాహువు శతభిషా నక్షత్రం రెండో పాదంలోకి సంచారం చేస్తాడు. మే 31వ తేదీ వరకు ఇదే పాదంలో సంచార దశలో ఉంటాడు. నిజానికి రాహువు సంచారం కొన్ని రాష్ట్రాల వారికి లాభదాయకంగా ఉంటుంది. అలాగే కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది. నిజంగా ఈ సమయంలో నాలుగు రాశుల వారైతే జీవితంలో ఎన్నడు ఊహించని లాభాలు పొందబోతున్నారు. దీంతో ఈ రాశుల వారికి అనుకున్న ధన లాభాలు కూడా కలగబోతున్నాయి. అయితే ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందుబోయే రాశులేవో తెలుసుకోండి.

ఈ రాశులవారికి లాభాలు:
మేష రాశి 
రాహువు సంచార ప్రభావంతో మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో చాలా లాభదాయకంగా ఉండబోతోంది. వీరు అనేక నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. అలాగే ఆలోచన శక్తి కూడా మరింత పెరుగుతుంది. దీని కారణంగా వీరు సానుకూలమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే అదృష్టం విపరీతంగా పెరిగి ఆధ్యాత్మిక వైపు అడుగులు వేస్తారు. తల్లిదండ్రుల సపోర్టు కూడా ఈ సమయంలో లభించబోతోంది. 

మిథున రాశి 
మిథున రాశి వారికి రాహువు నక్షత్ర సంచార మార్పుతో ఈ సమయం చాలా శుభప్రదంగా మారే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఆలోచనతో పాటు విప్లవాత్మకమైన మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. చట్టపరమైన విషయాల్లో కూడా వీరు ఊహించని విజయాల సాధిస్తారు. అంతేకాకుండా విభేదాలు కూడా చాలావరకు ముగిసే అవకాశాలు ఉన్నాయి. 

తులారాశి 
శతభిషా నక్షత్రం రెండవ పాదంలోకి రాహువు ప్రవేశించడం వల్ల అనేక విధాలుగా ప్రయోజనాలు చేకూరే అవకాశాలున్నాయి దీర్ఘకాలిక కోరికలు చాలా వరకు నెరవేరుతాయి. డబ్బు సంబంధిత సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి.

మకర రాశి 
మకర రాశి వారికి రాహువు సంచార ప్రభావంతో అనేక రకాల కొత్త సంబంధాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ సమయంలో గణనీయమైన విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో నిలిచిపోయిన పనులు కూడా ఆకస్మికంగా ఉప్పందంటాయి. చదువుల్లో కూడా విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన దిమ్మతిరిగే లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 13, 2026 04:51:02
Hyderabad, Telangana:

First Solar Eclipse Zodiac Signs Prediction 2026 Telugu: ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి 7వ తేదీన ఏర్పడబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది ఖగోళ సంఘటన మాత్రమే కాదు.. ఈ సమయంలో చంద్రుడు రాశి సంచారం చేయడమే కాకుండా.. కొన్ని గ్రహాలు నక్షత్రం మార్పులు చేయబోతున్నాయి. దీని కారణంగా ఈ సూర్యగ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత సంతరించుకుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా సూర్యగ్రహణం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది.. సాయంత్రం ఏడు గంటలకు ఇది ముగుస్తోంది. ఇదే సమయంలో చంద్రుడు ఉదయం 9 గంటలకు శనిగ్రహం పాలించే కుంభంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత తొమ్మిది గంటల 15 నిమిషాలకు శతభిషా నక్షత్రంలోకి సంచారం చేస్తాడు. ఇలా డబుల్ సంచారం కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనేకమార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ రాశులవారికి బంపర్ ప్రయోజనాలు:
మేషరాశి 
చంద్రుడు రాశి సంచారంతో పాటు నక్షత్రం మార్పు కారణంగా మేష రాశి వారికి ఈ సమయంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరికి ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఎలాంటి ప్రణాళికలు అయినా విఫలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మానసిక ఆందోళన తో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైవాహిక జీవితంలో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ సంబంధాలు అనేక సమస్యలకు దారి తీయవచ్చు. అంతేకాకుండా శారీరక సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కర్కాటక రాశి 
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు చంద్రుని చంచారం మానసికంగా శారీరకంగా అలసటకు గురవుతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. వీరికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పూర్తిగా తగ్గిపోతుంది. తల్లిదండ్రులు ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కూడా అనేక రకాల ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రశాంతత కూడా పూర్తిగా తగ్గిపోతుంది. దీనికి కారణంగా ఎన్నో సమస్యలు వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

తులారాశి 
తులారాశి వారికి ఈ సమయంలో అనేక రకాల అదనపు పనులు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. కుటుంబంలో అనేక విభేదాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో రిస్కు తీసుకోవడం మంచిది కాదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేవారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. పెద్ద లావాదేవీల  పరంగా రిస్కు తీసుకోవడం మంచిది కాదు. అంతేకాకుండా ఈ సమయంలో ఏదైనా పెద్ద నిర్ణయాలు తీసుకునే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

కుంభరాశి 
కుంభరాశి వారికి చంద్రుడు సంసారం అనేక రకాల అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని సవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే వైవాహిక జీవితంలో వాదనలకు దూరంగా ఉండటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కుంభరాశి వారికి ఈ సమయంలో పొట్ట సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికపరంగా మెరుగుపడే అవకాశాలున్నప్పటికీ.. భారీ మొత్తంలో ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో వృద్ధాప్యంతో ఇబ్బంది పడుతున్న వారు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 12, 2026 15:26:48
Hyderabad, Telangana:

Bharat Gaurav Train Yatra: వేసవికాలం భారతదేశమంతటా ఎండలు భగభగమంటాయి. ఎక్కడా చూసినా ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయి. మరి అలాంటి సమయంలో మంచుకొండల్లో ఉంటే ఎలా ఉంటుంది మస్తుంటుంది కదా? అలాంటి మంచుకొండల్లో దైవచింతనలో మునిగిపోతే ఇంకా అద్భుతమే. అలాంటి సదుపాయాన్ని భారత రైల్వే శాఖ కల్పిస్తోంది. కశ్మీర్‌, వైష్ణోదేవి యాత్రకు షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏప్రిల్‌ నెలకు సంబంధించి భారత్‌ గౌరవ రైలు నడవనుంది. చల్లటి ప్రదేశాల్లో శక్తివంతమైన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

Also Read: YS Jagan: తిరుమల వివాదంపై మండలిలో చంద్రబాబును కడిగేయండి: వైఎస్ జగన్

ఏప్రిల్‌లో ప్రత్యేక భారత్ గౌరవ్ రైలు ద్వారా కుటుంబ విహారానికి వెళ్లే వారికి కాశ్మీర్ హాలిడే స్పెషల్ అందిస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. అన్ని వయసుల వారితో పాటు ప్రత్యేకంగా ఆధ్యాత్మిక చింతనలో గడిపే వృద్ధులకు వైష్ణో దేవి యాత్రలను ప్రవేశపెడుతున్నట్లు సౌత్ స్టార్ రైలు ప్రొడక్ట్ డైరెక్టర్ విఘ్నేష్ తెలిపారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టూర్ ఆపరేటింగ్ హెడ్ రమేష్ అయ్యంగార్లతో కలిసి ఆయన టూర్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

Also Read: Tirumala: గుండు చేయించుకున్న దర్శకుడు కె.రాఘవేంద్ర రావు.. ఎందుకో తెలుసా?

భారత గౌరవ రైలు యాత్ర ఏప్రిల్ 11వ తేదీన ప్రారంభం కానుంది. కాశ్మీర్ హాలిడే స్పెషల్ వైష్ణో దేవి యాత్ర రైలులో ప్రయాణించే వారికి అన్ని రకాల సౌకర్యాలతోపాటు, లగేజ్ మెయింటెనెన్స్, సెక్యూరిటీ, మెడికల్ ఫెసిలిటీ అన్ని రకాల ఉన్నత ప్రమాణాలతో నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు, పర్యాటకులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాల్సి ఉంది. యాత్ర బుకింగ్ ఐఆర్‌సీటీసీలో అందుబాటులో లేదని స్పష్టం చేశారు.

Also Read: KTR: మూడు ముక్కలు చేసినా హైదరాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానే!: కేటీఆర్‌

బుకింగ్ ఎలా..?
ఈ యాత్ర పూర్తిగా భారత మంత్రిత్వ శాఖ ద్వారా గుర్తింపు పొందిన సౌత్ స్టార్ రైలు టూరిజం ద్వారా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. యాత్ర సీట్లు బుక్ చేసుకోవడానికి 93550 21516లో లేక తమ వెబ్‌సైట్ www.tourtimes.in లో బుక్‌ చేసుకోవాలి. లేదంటే హైదరాబాద్‌ బేగంపేట్‌లోని టూరిజం ప్లాజాలోని ఉన్న వారి కార్యాలయంలో నేరుగా సంప్రదించవచ్చు. ఈ యాత్ర బుకింగ్ రేట్లు 33 శాతం రాయితీతో ఉన్నాయని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 12, 2026 14:18:52
Hyderabad, Telangana:

Realme 15 5G Price Cut: రియల్ మీ కంపెనీ గత సంవత్సరం విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్స్‌లో Realme 15 5G మొబైల్ ఒకటి. ఇది అద్భుతమైన బ్యాటరీతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన ప్రాసెసర్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, ఈ మొబైల్ ఇప్పుడే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు. ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ Realme 15 5G మొబైల్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీనిపై ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆఫర్స్ ఏంటో? పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Realme 15 5G స్మార్ట్‌ఫోన్‌ 6.8 అంగుళాల (17.27 cm) 1.5K HyperGlow 4D Curve+ AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 6500 nits పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీనికి కంపెనీ ప్రత్యేకమైన దీనికి గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ను కూడా అందిస్తోంది. ఇది ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 7300+ 5G (4nm) చిప్‌సెట్ ప్రాసెసర్పై రన్ అవుతుంది. అలాగే మల్టీ టాస్కింగ్ చేసే వారికి ఈ మొబైల్ చాలా సహాయపడుతుంది. కాబట్టి ఎక్కువగా గేమింగ్ చేసేవారు దీనిని కొనుగోలు చేయొచ్చు. 

ఈ Realme 15 5G స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన 7000mAh Titan బ్యాటరీని కలిగి ఉంటుంది. అలాగే ఈ బ్యాటరీని చార్జ్ చేసేందుకు ప్రత్యేకంగా 80W Ultra చార్జింగ్ సపోర్టును కూడా అందిస్తోంది. దీంతోపాటు ఈ మొబైల్ వెనక భాగంలో 50MP మెయిన్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అయితే ఇది చాలా ప్రత్యేకమైన Sony IMX882 సెన్సార్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు అదనంగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా లభిస్తోంది. అలాగే ఫ్రంట్ భాగంలో ఎంతో అద్భుతమైన 50MP AI సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ మొబైల్ చాలా ప్రత్యేకమైన 4k రికార్డింగ్ సపోర్టును కూడా కలిగి ఉంటుంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ 128 sGB  స్టోరేజ్‌తో పాటు 256జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇది ఎంతో ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది. దీంతోపాటు ఇందులో IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సపోర్టును కూడా కలిగి ఉంటుంది. ప్రస్తుతం భారత మార్కెట్‌లో బేస్ వేరియంట్ మొబైల్ ధర రూ.29,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఇప్పుడే ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసే వారికి ఆరు శాతం ప్రత్యేకమైన తగ్గింపుతో రూ.28,999తో లభిస్తోంది. ఇక ఈ మొబైల్‌ను మరింత తగ్గింపు ధరకే కొనుగోలు చేయాలనుకునే వారికి బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్, ఎస్బిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేస్తే రూ.1,400 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఈ మొబైల్ పై ఎక్స్చేంజ్‌ బోనస్ కూడా అందుబాటులో ఉంది. ఏదైనా స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడే ఎక్స్చేంజ్ చేస్తే ఏకంగా రూ.26 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్‌ను కేవలం రూ.2,999 లోపే పొందవచ్చు. అయితే, ఈ బోనస్ అనేది పాత మొబైల్ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. కండిషన్ బాగుంటేనే ఈ స్మార్ట్‌ఫోన్‌పైన పేర్కొన్న ధరకు పొందవచ్చు.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 12, 2026 14:09:10
Tadepalli, Andhra Pradesh:

YSRCP Meeting: 'అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ గొంతు వినిపించకూడదని ప్రభుత్వం కుట్ర చేస్తోంది. అందుకే ఏకైక ప్రతిపక్ష పార్టీ అయినా ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. మండలిలో మంచి సంఖ్యా బలం ఉండడంతో ప్రజా సమస్యలపై గట్టిగా గొంతెత్తాలి. తిరుమల లడ్డూ వివాదంపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి' అని వైఎస్సాఆర్‌సీపీ ఎమ్మెల్సీలకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు. 'లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టించి దానికి రెక్కలు కట్టారు. వైఎస్సార్‌సీపీపై నిరంతరం బురద జల్లుతూ దుష్ప్రచారం చేస్తున్నారు. లడ్డూ వ్యవహారంలో సమాధానం చెప్పాల్సింది, ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందీ చంద్రబాబే' అని స్పష్టం చేశారు.

Also Read: Tirumala: గుండు చేయించుకున్న దర్శకుడు కె.రాఘవేంద్ర రావు.. ఎందుకో తెలుసా?

'చంద్రబాబు హయాంలోనే ట్యాంకర్ల సరఫరా జరిగింది. రిజెక్ట్‌ అయినా నెయ్యి మళ్లీ చంద్రబాబు హయాంలోనే టీటీడీలోకి వచ్చింది. సీబీఐ సిట్‌ ఛార్జిసీటుకు సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే' అని వైఎస్సార్‌సీపీ వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ పాలనంతా స్కామ్‌ల మయం. విశాఖలో రూ.5 వేల కోట్ల భూమిని చంద్రబాబు తన బంధువుకు కట్టబెట్టారు. గతంలో ఏనాడూ అలా జరగలేదు.. ఏ ముఖ్యమంత్రి ఇలా బరి తెగించలేదు. వీటన్నింటినీ మండలిలో గట్టిగా నిలదీయాలి' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు.

Also Read: Govt Employees: తెలంగాణ ఉద్యోగులకు భారీ శుభవార్త.. నేడు ప్రభుత్వం కీలక నిర్ణయం?

శాసనసభ, మండలి బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేశారు. సమీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ..'తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రశ్నించడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. పార్టీ నాయకులపై దాడులు, అక్రమ కేసులు.. ఇవన్నీ కూడా లడ్డూ వ్యవహారంలో ప్రశ్నించడాన్ని తట్టుకోలేక చంద్రబాబు చేసినవే' అని ఎమ్మెల్సీలతో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. 'చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని గుళ్లలో పూజలు చేసినా చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ఏకంగా భౌతిక దాడులు చేస్తున్నారు' అని చెప్పారు. 'ఒక అబద్ధం సృష్టించి, దానికి రెక్కలు కట్టి ప్రచారం చేయడం తొలిసారి చూస్తున్నాం. అసలు కల్తీ నెయ్యి సరఫరాకు, వైఎస్సార్‌సీపీకి ఏమాత్రం సంబంధం లేదు' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

Also Read: Govt Employees: ప్రభుత్వానికి ఉద్యోగుల సంచలన లేఖ.. పీఆర్‌సీ, పెండింగ్‌ డీఏల కోసం ఆల్టిమేటం

'ప్రజల తరఫున గొంతు వినిపించకూడదనే ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీని గుర్తించడం లేదు. అసెంబ్లీలో బలం తక్కువ.. అక్కడ మన గొంతు వినపడకూడదనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది. సభలో ఉన్న ఏకైక ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉండగా.. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదు. శాసనమండలిలో బలం ఉండడంతో మాట్లాడే అవకాశం వస్తుంది. మైక్‌ ఇస్తారు కాబట్టి ప్రజల సమస్యలను గట్టిగా వినిపించే వీలుంది' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 12, 2026 14:03:53
Hyderabad, Telangana:

Xiaomi 18 Pro Max Price: ప్రముఖ Xiaomi స్మార్ట్ ఫోన్ కంపెనీ సెప్టెంబర్ నెలలో చైనా మార్కెట్‌లోకి తమ Xiaomi 18 సిరీస్‌ను విడుదల చేసింది. ఇది మొత్తం  మూడు మోడల్స్ లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో మరో మోడల్ Xiaomi 18 Ultra స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మొబైల్ కు సంబంధించిన ఫీచర్స్ కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అయితే, ఇటీవలే లీకైన ఫీచర్స్ ఏంటో? ఇది ఎప్పుడు విడుదల కాబతుందో? భారత మార్కెట్‌లో లాంచింగ్ తేదీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Xiaomi 18  స్మార్ట్ ఫోన్ సిరీస్ భారత మార్కెట్‌లో అతి త్వరలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, మార్కెట్‌లో అందుబాటులో ఉన్న Xiaomi 17, 17 Pro స్మార్ట్‌ఫోన్స్ 6.3-అంగుళాల డిస్ప్లేలను కలిగి ఉన్నాయి. ఇక ఇటీవల లీకైన వివరాల ప్రకారం.. Xiaomi 18 6.4-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది అద్భుతమైన కాంపాక్ట్ డిజైన్ తో పాటు ప్రీమియం కలర్ ఆప్షన్స్‌లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి. అలాగే Xiaomi 18 Pro స్మార్ట్ ఫోన్  6.4-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఇందులో కొన్ని స్పెషల్ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

Xiaomi 18 స్మార్ట్‌ఫోన్ సిరీస్ వెనక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కూడా అందిస్తోంది. అలాగే మొత్తం అతి త్వరలో విడుదల కాబోయే నాలుగు మోడల్స్ (Xiaomi 18, 18 Pro, 18 Pro Max, 18 Ultra) 200-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అద్భుతమైన పిక్చర్ క్వాలిటీని కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

ఇటీవల లీకైన వివరాల ప్రకారం.. Xiaomi 18 Pro, 18 Pro Max స్మార్ట్‌ఫోన్స్ డ్యూయల్ 200-మెగాపిక్సెల్ కెమెరాలను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రో మోడల్‌లోని రెండవ కెమెరా పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఇందులో కంపెనీ ప్రీమియం డిస్ప్లే సెటప్‌ను కూడా అందించబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ మోడల్స్ Qualcomm Snapdragon 8 Elite Gen 6 చిప్‌సెట్ ప్రాసెసర్‌పై రన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు అల్ట్రా మోడల్ మొబైల్ మాత్రం Snapdragon 8 Elite Gen 6 Pro ప్రాసెసర్‌ను కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 12, 2026 12:55:03
Tirupati Urban, Andhra Pradesh:

K Raghavendra Rao Head Shave: సినీ పరిశ్రమలో తన ఇంద్రజాలంతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసిన అలనాటి దర్శకుడు కె రాఘవేంద్ర రావు కొత్త లుక్‌లో కనిపించారు. ఎప్పుడూ తెల్ల గడ్డంతోపాటు తెల్ల వస్త్రాలు ధరించి ఉండే రాఘవేంద్ర రావు గడ్డం తీసి.. గుండు చేయించుకున్నారు. తిరుమల పర్యటనకు వెళ్లిన ఆయన తలనీలాలు సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గుండులో ఆయనను కొందరు గుర్తుపట్టలేకపోయారు. రాఘవేంద్ర రావు గుండు దృశ్యాలు వైరల్‌గా మారాయి.

Also Read: KTR: మూడు ముక్కలు చేసినా హైదరాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానే!: కేటీఆర్‌

తిరుమల శ్రీవారిని దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గురువారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి స్వామి ఆశీస్సులు అందుకున్నారు. రాఘవేంద్ర రావు కుటుంబానికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆ తర్వాత ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు ఇచ్చారు. దర్శనానంతరం ఆలయం వెలుపల రాఘవేంద్ర రావును కొందరు చూసి ఆశ్చర్యపరిచారు. ఎప్పుడూ ప్రత్యేక లుక్‌లో ఉండే ఆయన గుండు, గడ్డం తీసి కనిపించడంతో రాఘవేంద్ర రావును కొందరు గుర్తుపట్టలేకపోయారు. ఆ తర్వాత కొందరు గుర్తుపట్టి అతడితో ఫొటోలు దిగారు.

Also Read: Govt Employees: తెలంగాణ ఉద్యోగులకు భారీ శుభవార్త.. నేడు ప్రభుత్వం కీలక నిర్ణయం?

భారీ విరాళం
తిరుమల వేంకటేశ్వర స్వామి భక్తుల సౌకర్యార్థం టీటీడీకి భారీ విరాళం అందింది. చెన్నైకి చెందిన జస్పెర్ అనే భక్తుడు ఆలయానికి 5 అత్యాధునిక బ్యాటరీ వాహనాలను విరాళంగా అందించారు. ఈ వాహనాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుమలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. ఒక్కో వాహనం విలువ సుమారు రూ.7 లక్షలు ఉంటుందని తెలిపారు. పర్యావరణ హితంగా, ఎలాంటి శబ్ద కాలుష్యం లేకుండా ఉండే ఈ ఎలక్ట్రిక్ వాహనాలు భక్తుల రవాణాకు ఎంతో దోహదపడతాయని చెప్పారు. తిరుమల కొండపైకి వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు నడవడానికి ఇబ్బంది పడకుండా ఆలయ పరిసరాల్లో ఈ వాహనాలు ఉచితంగా సేవలు అందిస్తాయని అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు.

Also Read: Govt Employees: ప్రభుత్వానికి ఉద్యోగుల సంచలన లేఖ.. పీఆర్‌సీ, పెండింగ్‌ డీఏల కోసం ఆల్టిమేటం

సీపీఐ నారాయణ తీవ్ర విమర్శలు
తిరుమల పవిత్రతపై జరుగుతున్న రాజకీయ యుద్ధంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. కేరళకు చెందిన సీపీఐ నాయకుడు విమల్‌తో కలిసి తిరుమ శ్రీవారిని దర్శించుకున్న నారాయణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ వివాదాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ నేతలు చేస్తున్న విమర్శలు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు తమ పరిధిలో తాము ఉండాలని హితవు పలికారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో భక్తుల నమ్మకాన్ని బజారున పడేయద్దని సూచించారు. 'రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేసుకోండి కావాలంటే కత్తులతో దాడి చేసుకోండి. మాకేం అభ్యంతరం లేదు. కానీ భక్తుల మనోభావాలను మాత్రం దెబ్బతీయకండి' సీపీఐ నారాయణ విజ్ఞప్తి చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 12, 2026 11:53:52
Hyderabad, Telangana:

Hydra Demolition Latest Telugu News: నగరంలో చెరువులతో పాటు ప్రభుత్వ భూములు, అక్రమ కట్టడాల విషయంలో హైడ్రా ఏమాత్రం ఆగడం లేదు.. ముఖ్యంగా అక్రమ కట్టడాల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న హైడ్రాధికారులు మరోసారి తమ ప్రతాపం చూపారు.. గురువారం ఉదయం మాదాపూర్ ఖానామెట్ పరిధిలో సర్వేనెంబర్ 55లో ఉన్న అర్ధనారీశ్వర ఆలయ ప్రాంగణంలో వెలసిన దుకాణాలను అధికారులు భారీ పోలీస్ బందోబస్తుల మధ్య కూల్చివేశారు. 

అయితే ఈ కూల్చివేతకు సంబంధించిన సమాచారం ఆలయ కమిటీ సభ్యులతో పాటు అర్చకులు, స్థానికులకు తెలియడంతో అక్కడికి వారి చేరుకొని అధికారులను అడ్డుకున్నారు.. అంతేకాకుండా JCB వాహనాల ముందు బయటాయించి నిరసన వ్యక్తం చేయడం అక్కడ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.. అధికారులు, స్థానికులకు మధ్య జరిగిన చిన్న తోపులాటతో ఆలయ ప్రాంగణం ఒక్కసారిగా స్థానికులతో కిక్కిరిసిపోయింది.

హైడ్రా అధికారులు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆలయ నిర్వాహకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  అంతేకాకుండా బాధితులు ఈ సమయంలో రెండు ప్రధాన అంశాలు లేవనెత్తారు.. కనీసం ఖాళీ చేసేందుకు సమయం ఇవ్వకుండా దౌర్జన్యంగా కూల్చివేతను చేపట్టారని వారి ఆరోపించారు. అలాగే ఈ భూమికి సంబంధించి ప్రస్తుతం కోర్టులో స్టే అమల్లో ఉందని.. న్యాయస్థాన ఆదేశాలను కూడా ఖాదర్ చేయకుండా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని వారు వాపోతున్నారు..

Read more: Bhadradri Konthagudem: నా డబ్బులు, కుక్కర్‌లు ఇచ్చేయండి.. గల్లీలో రచ్చ చేస్తున్న మున్సిపల్ ఎన్నికల అభ్యర్థి.. ఏమైందంటే..?

మరోవైపు అధికారులు అక్రమ కట్టడాలను తొలగించడంలోనే భాగంగా ఈ చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్తున్నామని.. ప్రభుత్వానికి సంబంధించిన భూముల పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని వారి స్పష్టం చేశారు.. భారీగా ఘటన స్థలంలో మొహరించిన పోలీసులు.. నిరసనకారులను చెదరగొట్టి కూల్చివేత ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

Read more: Bhadradri Konthagudem: నా డబ్బులు, కుక్కర్‌లు ఇచ్చేయండి.. గల్లీలో రచ్చ చేస్తున్న మున్సిపల్ ఎన్నికల అభ్యర్థి.. ఏమైందంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Feb 12, 2026 11:30:26
Hyderabad, Telangana:

Shriya Saran Kathak Desire: దశాబ్ద కాలానికి పైగా తన అందం, అభినయంతో దక్షిణాది సినీ ఇండస్ట్రీని ఏలిన సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రియ శరణ్ మనసులో ఓ తీరని కోరిక ఉందట. కెరీర్ ప్రారంభించి పాతికేళ్లు కావస్తున్నా, ఇప్పటికీ ఆ కల నెరవేరలేదని ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించిన శ్రియ, పెళ్లై పాప పుట్టిన తర్వాత కూడా తన సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్నారు.

నృత్యంపై మక్కువ
శ్రియ కేవలం నటి మాత్రమే కాదు, ఆమె ఒక అద్భుతమైన కథక్ నృత్యకారిణి కూడా. సినిమాల్లో ఆమె చేసే డ్యాన్స్ మూమెంట్స్ చూసి ఫిదా అవ్వని ప్రేక్షకులు ఉండరు. అయితే, తనలోని అసలైన డ్యాన్సర్‌ను వెండితెరపై పూర్తిస్థాయిలో ప్రదర్శించే అవకాశం ఇంతవరకు రాలేదని ఆమె పేర్కొన్నారు.

ఆ డ్రీమ్ రోల్ ఏంటంటే?
"నాకు డ్యాన్స్ అంటే ప్రాణం. ఒక నృత్యకారిణి జీవిత ప్రయాణాన్ని, ఆమె ఎదుర్కొనే సవాళ్లను ప్రతిబింబించేలా ఉండే ఒక డ్యాన్స్ సెంట్రిక్ మూవీ (Dance-centric film) చేయాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. గత 25 ఏళ్లుగా అలాంటి పవర్‌ఫుల్ పాత్ర కోసం ఎదురుచూస్తున్నాను, కానీ ఆ అవకాశం ఇంకా తలుపు తట్టలేదు" అని శ్రియ వెల్లడించారు.

పెళ్లి తర్వాత తన వ్యక్తిగత జీవితాన్ని, కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తూ శ్రియ అందంలోనూ, ఫిట్‌నెస్‌లోనూ నేటి తరం హీరోయిన్లకు గట్టి పోటీనిస్తున్నారు. సహాయ నటిగా 'RRR' వంటి చిత్రాల్లో మెరిసినా, తనలోని కళాకారిణిని సంతృప్తి పరిచే ఆ ఒక్క పాత్ర కోసం ఆమె ఆశగా వేచి చూస్తున్నారు.

సినిమా ఇండస్ట్రీలో ఎంతటి స్టార్ హోదా ఉన్నా, మనసుకి నచ్చిన పని చేసే అవకాశం రాకపోతే ఆ వెలితి అలాగే ఉంటుందని శ్రియ మాటలు బట్టి అర్థమవుతోంది. మరి ఈ సీనియర్ బ్యూటీ కల ఏ దర్శకుడు నెరవేరుస్తాడో చూడాలి.

Also Read: Pawan Kalyan Balakrishna Assembly: అసెంబ్లీలో పవన్-బాలయ్య సందడి..డిప్యూటీ సీఎం ఛాంబర్‌కు వెళ్లిన 'లెజెండ్'!

Also REad: EPFO UPI Withdrawal: PF విత్‌డ్రా ఇక చిటికెలో! UPI ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి..ఏప్రిల్ 2026 నుండి కొత్త యాప్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top