Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Medchal-Malkajgiri500072

అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకు వచ్చిన లారీ

Jul 27, 2024 12:22:46
Hyderabad, Telangana

కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్ వద్ద పెను ప్రమాదం తప్పింది. కేపి.హెచ్.బి నుండి కూకట్ పల్లి కి వెళ్తున్న లారీ ఒక్కసారి వివేకానంద నగర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్ పైకు దూసుకుని వెళ్ళింది దీనితో అక్కడ ప్రజలు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
TKTA Kiran Kumar
Jan 15, 2026 14:53:11
Hyderabad, Telangana:

Congnizant New Office in Vizag: ఆంధ్ర ప్రదేశ్ కు ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ముఖ్యంగా స్టీల్ సిటీ విశాఖ పట్నాన్ని  బేస్ చేసుకొని ఒక్కో ఐటీ కంపెనీ అక్కడికి క్యూ  కడుతున్నాయి. అంతేకాదు అక్కడ  తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. ఇప్పటికే ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీతో పాటు పలు ఐటీ కంపెనీలు తమ కార్యాలయాలను విశాఖలో ప్రారంభించాయి. తాజాగా ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ తమ ఆఫీసును ప్రారంభించబోతుంది. 

జనవరి 26వ తేదీ నుంచి తాత్కాలిక కార్యాలయంలో 800 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు మొదలుపెడుతోంది. విశాఖపట్టణంలోని కాపులుప్పాడలో 22.19 ఎకరాల్లో నిర్మిస్తున్న శాశ్వత క్యాంపస్‌కు గతేడాది డిసెంబరు 12న సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అదే సమయంలో, హిల్-2లోని మహతి బ్లాక్‌లో తాత్కాలిక కార్యాలయ భవనాన్ని కూడా ప్రారంభించారు. 

Read more:​ సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!

Read more:​  సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

ప్రస్తుతం ఈ తాత్కాలిక కార్యాలయంలో 800 మంది ఉద్యోగులతో జనవరి 26 నుంచి కార్యకలాపాలు మొదలవుతాయి.వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న కాగ్నిజెంట్ ఉద్యోగులలో 500 మందిని విశాఖకు బదిలీ చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. అదనంగా, మరో 300 మంది సీనియర్ ఉద్యోగులను కూడా ఇక్కడికి బదిలీ చేశారు. లాజిస్టిక్స్, ఆపరేషనల్ సమస్యలను పరిష్కరించుకుని, ఈ నెల 26వ తేదీ నుంచి కార్యకలాపాలు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..

Also Read: ఒకప్పుడు తెలుగు సహా అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్.. నేడు రూ.2 వేల కోట్లకు యజమాని.. 5 కంపెనీలకు బాస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

కాపులుప్పాడలో నిర్మించబోయే శాశ్వత క్యాంపస్‌లో విడతలవారీగా మొత్తంగా 8 వేల మందికి ఉపాధి కల్పించాలని ముందుగా నిర్ణయించారు. అయితే, శంకుస్థాపనకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కాగ్నిజెంట్ సీఈవో మధ్య జరిగిన చర్చల వల్ల  25,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని నిర్ణయించారు. 

 

0
comment0
Report
TKTA Kiran Kumar
Jan 15, 2026 14:52:22
Hyderabad, Telangana:

ZEE5 Telugu Sambaralu: రాకింగ్ స్టార్ మంచు మ‌నోజ్ యాక్ట్ చేసిన బ్రాండ్ ఫిల్మ్‌ను తెలుగు జీ 5 ప్రెజెంట్ చేసింది.  సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా తెలుగు ప్రేక్ష‌కుల కోసం  దీన్ని విడుదల చేశారు.  ఇందులో సంక్రాంతి పండుగ ఆత్మీయతను చూపించారు. అలాగే నిజంగా తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తామ‌నే జీ5 హామీ మ‌రింత కనిపిస్తుంది. మన పండగ, మన ఎంటర్‌టైన్‌మెంట్, మన తెలుగు జీ5’ అనే కమ్యూనికేషన్ లైన్‌తో రూపొందిన ఈ క్యాంపెయిన్, ప్రాంతీయ సంస్కృతి, ప్రేక్షకులతో జీ5కి ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెస్తుంది.  సంక్రాంతి సంబరాల మధ్య తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని వినోదాన్ని అందించాల‌నే ఉద్దేశంతో ఈ బ్రాండ్ ఫిల్మ్‌ను రూపొందించినట్లు మేకర్స్ తెలియజేశారు. 

Read more:​ సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!

Read more:​  సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

సంక్రాంతి సంద‌ర్భంగా రూపొందించిన సంప్ర‌దాయ గ్రామీణ మండువ ఇంటి సెట్‌లో రూపొందించిన ఈ బ్రాండ్ ఫిల్మ్‌ను గ‌మ‌నిస్తే.. సంక్రాంతి పండుగ‌కి అల్లుడు (మంచు మ‌నోజ్‌) పల్లెకు వస్తుంటాడు. బ‌స్సులో టికెట్ కండెక్ట‌ర్ అంద‌రికీ కొరియ‌న్ సినిమా చూపెడుతుంటాడు. అదెవ‌రికీ అర్థం కాకుండా బాధ‌ప‌డుతుంటారు. అప్పుడు మ‌నోజ్‌.. ఆ డ్రైవ‌ర్‌ను పేరు సుబ్బ‌రావు అయితే అప్పారావు అని పిలుస్తాడు. ‘ఎన్ని సార్లు చెప్పాలి స‌ర్‌.. నా పేరు సుబ్బారావు అని, అప్పారావు కాద‌ని  అంటాడు. ‘నువ్వు చెప్పింది నాకు అర్థ‌మైంది.. కానీ నువ్వు పెట్టిన సినిమానే మాకు అర్థం కాలేదని చెబుతాడు.  మ‌న పండ‌గంటే మ‌న ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉండాలంటూ’ మ‌నోజ్ చెప్పి త‌న ఫోన్‌లో ఉండే జీ 5 యాప్‌ను చూపెడ‌తాడు. బ‌స్సులో అంతా సంక్రాంతి హడావుడి మొదలవుతుంది.  

ఇంటికెళ్లగానే..భార్య‌తో మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్‌గారు సినిమాలోని శ‌శిరేఖ‌.. పాట‌ను సింగ్ చేస్తాడు.  దానికి భార్య అత‌ని హుషారు చూసి ‘ఏంటి బాస్ సంగ‌తి’ అన‌గానే.. ‘అదిరిపోద్ది సంక్రాంతి’ అంటూనే మ‌న పండ‌గకి మ‌న ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉండాలిగా అని అంటాడు. స‌ర‌దాగా చిన్న పిల్ల‌ల‌తో ఆడుకుంటూనే ఇంట్లో అత్త, మామలను కాస్త ఆట ప‌ట్టిస్తుంటాడు. అలాగే భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి అంటూ ర‌వితేజ చెప్పే డైలాగ్‌ను చూపిస్తూ కుటుంబం అంతా క‌లిసి మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్‌గారు, భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి సినిమాల‌ను చూస్తారు. 

అంతేకాదు త్వరలో  జీ 5లో మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్‌గారు, భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి చిత్రాలు రాబోతున్నట్టు చెప్పుకొచ్చారు. అలాగే బ్రాండ్ ఫిల్మ్‌లో పండుగ సంద‌ర్భంలో కుటుంబ స‌భ్యుల మ‌ధ్య ఉండే అనురాగం, ఆత్మీయ‌త‌, సునిశిత‌మైన హాస్యాన్ని చూపించాడు.  ఇలా చూపించ‌టం ద్వారా జీ 5 ఈ ఏడాదంతా తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుంద‌నే విష‌యాన్ని ప్రేక్షకులకు చెప్పాడు.   

ఈ బ్రాండ్ ఫిల్మ్‌కు సాయి మార్తాండ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పాపులర్ మూవీ లిటిల్ హార్ట్స్‌కు వర్క్ చేసిన సూర్య బాలాజీ  కెమెరామెన్‌గా వ‌ర్క్ చేశారు. ఇది పండుగ స్మృతుల‌ను, ఆధునికమైన ప‌ద్ధ‌తిలో చెప్పేలా దీన్ని తెరకెక్కించారు. ఇప్ప‌టికే న‌య‌నం, భైర‌వం, సంక్రాంతికి వ‌స్తున్నాం, కిష్కింధ‌పురి, హ‌ను మాన్ వంటి హిట్ కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌కు మ‌రింత‌గా చేరువైంది జీ5.  

రాబోయే రోజుల్లోజీ5 మ‌రింత‌గా ప్రేక్ష‌క ఆద‌ర‌ణ పొందేలా సినిమాల‌ను అందించ‌నుంది. ఇందులో చిరంజీవి, న‌య‌న‌తార హీరో హీరోయిన్లుగా న‌టించిన మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు, ర‌వితేజ హీరోగా న‌టించిన భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి, గుర్రం పాపిరెడ్డ వంటి సినిమాలున్నాయి. ఇలాంటి చిత్రాల‌తో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్ష‌కుల‌కు అందించ‌టంలో త‌న స్థానాన్ని మ‌రింత బ‌లోపేతం చేసుకుంటోంది జీ 5 ఓటీటీ. 

ఈ సంద‌ర్బంగా తెలుగు జీ 5, బిజినెస్ హెడ్ అనురాధ గురు మాట్లాడుతూ ‘‘తెలుగు ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని, వైవిధ్య‌మైన ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందించ‌ట‌మే మా ఎయిమ్ అన్నారు. సంప్ర‌దాయ కుటుంబ క‌థ‌ల నుంచి పండుగ థీమ్ ఉన్న ఎంట‌ర్‌టైన‌ర్స్‌, ఆస‌క్తిని రేకెత్తించే థ్రిల్ల‌ర్స్‌, స్టార్ హీరోల‌కు సంబంధించిన బ‌డా ప్రాజెక్ట్స్ ఇలా అన్నీ ర‌కాల కంటెంట్‌ను అందిస్తున్నట్టు చెప్పారు.  

సంక్రాంతి క్యాంపెయిన్‌లో ప్ర‌ధాన భూమిక‌ను పోషించిన మంచు మ‌నోజ్ మాట్లాడుతూ ‘‘సంక్రాంతి అంటేనే కుటుంబం. ఇందులో భాగం కావ‌టం వ‌ల్ల‌.. నేను ఇది వ‌ర‌కు ఫన్నీగా, స‌ర‌దాగా న‌వ్వుకునేలా చేసిన క్యారెక్టర్స్  గుర్తుకొచ్చాయి. ఇప్పుడు ఆ ఫీలింగ్‌ను పొంద‌టం చాలా కొత్త‌గా ఉందన్నారు.  పండుగ వాతావ‌ర‌ణాన్ని ఇందులో స‌హ‌జ సిద్ధంగా పిక్చరైజ్ చేసినట్టు చెప్పుకొచ్చారు.  ఇలా కుటుంబ భావాలను సెలబ్రేట్ చేసే జీ5 తెలుగు క్యాంపెయిన్‌లో భాగమవడం మరింత సంతోషంగా ఉందన్నారు. 

ZEE5 గురించి...

జీ5 భార‌త‌దేశ‌పు యంగ‌స్ట్ అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ ఓటీటీగా ప్ర‌సిద్ధి పొందింది. మిలియ‌న్ల కొద్దీ అభిమానుల‌ను సంపాదించుకుంది. గ్లోబ‌ల్ కంటెంట్ ప‌వ‌ర్ హౌస్ జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్‌) నుంచి శాఖ‌గా మొద‌లైంది జీ5. అత్య‌ద్భుత‌మైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా  తన కంటూ సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. 4071 సినిమాల లైబ్ర‌రీ ఉన్న అతిపెద్ద ప్లాట్‌ఫార్మ్ ఇది. 1800 టీవీ షోలు, 422కు పైగా ఒరిజిన‌ల్స్, 1.35 ల‌క్ష‌ల‌కు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం అంటూ చెప్పుకొచ్చారు.  12 భాష‌ల్లో హిందీ, ఇంగ్లిష్‌,గుజ‌రాతీ, పంజాబీ,  బెంగాలీ, మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్‌, మ‌రాఠీ, ఒరియా, భోజ్‌పురి, లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజిన‌ల్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీస్‌, టీవీ షోస్‌, మ్యూజిక్‌, కిడ్స్ షోస్‌, ఎడ్‌టెక్‌, సినీ ప్లేస్‌, న్యూస్‌, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్ష‌కుల‌ను అలరిస్తుందని చెప్పుకొచ్చారు.  

Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..

Also Read: ఒకప్పుడు తెలుగు సహా అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్.. నేడు రూ.2 వేల కోట్లకు యజమాని.. 5 కంపెనీలకు బాస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

0
comment0
Report
BBhoomi
Jan 15, 2026 14:37:40
Lakshmapur, Telangana:

Government Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య అవసరాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సీజీహెచ్ఎస్ లబ్ధిదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమా( Perfect Mediclaim Ayush Insurance) ను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు ప్రభుత్వ ఆసుపత్రులు, ఎంపిక చేసిన కేంద్రాల్లో మాత్రమే చికిత్స పొందే పరిమితి ఉండేది. అయితే ఈ కొత్త బీమా పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కార్పొరేట్ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో కూడా నగదు రహిత చికిత్స పొందే వెసులుబాటు కలుగుతోంది. ఇది ప్రస్తుత సీజీహెచ్ఎస్ సదుపాయాలకు అదనపు రక్షణగా పనిచేస్తుంది.

ఈ బీమా పథకం వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా కుటుంబం మొత్తాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించింది. ఒకే పాలసీ కింద గరిష్టంగా ఆరుగురు కుటుంబ సభ్యులకు రక్షణ లభిస్తుంది. పాలసీదారులు తమ అవసరాన్ని బట్టి రూ. 10 లక్షల నుంచి రూ. 20లక్షల వరకు బీమా కవరేజీని ఎంచుకునే అవకాశం ఉంది. తీవ్రమైన అనారోగ్యాలు, ఖరీదైన శస్త్రచికిత్సలు లేదా అత్యవసర వైద్య పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ బీమా కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది.

ప్రీమియం భారం తగ్గించేందుకు కో-పేమెంట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో 70:30 లేదా 50:50 నిష్పత్తిలో ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది. ఉదాహరణకు 70:30 ఎంపికలో మొత్తం ప్రీమియంలో 70 శాతం ఇన్సూరెన్స్ సంస్థ భరిస్తే, మిగిలిన 30 శాతం పాలసీదారుడు చెల్లిస్తాడు. 50:50 ఎంపికను ఎంచుకుంటే ప్రీమియం ఖర్చు మరింత తగ్గుతుంది. ఈ విధానం తక్కువ ఆదాయం ఉన్న ఉద్యోగులకు కూడా బీమాను అందుబాటులోకి తెస్తుంది. ఆసుపత్రిలో రూమ్ రెంట్ గురించి కూడా స్పష్టమైన నియమాలు ఉన్నాయి. బీమా మొత్తంలో రోజుకు 1 శాతం వరకు సాధారణ గదికి, 2 శాతం వరకు ఐసీయూ గదికి అనుమతి ఉంటుంది. ఆసుపత్రిలో చేరడానికి ముందుగా 30 రోజుల వరకు చేసిన వైద్య పరీక్షలు, మందుల ఖర్చులు కవర్ అవుతాయి. అలాగే డిశ్చార్జ్ అనంతరం అరవై రోజుల వరకు అయ్యే వైద్య ఖర్చులను కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు.

Also Read:  Gold Reserves: ఈ 4 జిల్లాల్లో బంగారు నిధి.. అక్కడికి వెళ్తే మీ పంట పండినట్లే..కావల్సినంత తవ్వుకోవచ్చు..!!

ఈ పాలసీలో ఆయుష్ చికిత్సలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి వంటి భారతీయ వైద్య విధానాలకు పూర్తి కవరేజీ లభిస్తుంది. ఆధునిక వైద్య చికిత్సలు, రోబోటిక్ శస్త్రచికిత్సలకు కూడా నిర్దిష్ట పరిమితిలో ప్రయోజనాలు ఉన్నాయి. అదనపు రైడర్ ద్వారా మరింత విస్తృత కవరేజీ పొందవచ్చు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ పాలసీలతో పోలిస్తే ఈ పథకం చాలా తక్కువ ప్రీమియంతో అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ పాలసీపై జీఎస్టీ పన్ను వర్తించదు. ఆరోగ్యంగా ఉండి క్లెయిమ్ చేయని వారికి ప్రతి సంవత్సరం 10 శాతం చొప్పున బీమా మొత్తాన్ని పెంచే క్యుములేటివ్ బోనస్ కూడా ఉంటుంది. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ ద్వారా ఈ పాలసీ అమలులో ఉంది. సీజీహెచ్ఎస్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారుడు ఈ పథకాన్ని ఉపయోగించుకుని తమ కుటుంబ ఆరోగ్య భవిష్యత్తును మరింత భద్రం చేసుకోవచ్చు.

Also Read: Switzerland VS Indian Rupee: మన బడాబాబులు డబ్బులు దాచుకునే దేశంలో.. భారత కరెన్సీ విలువ ఎంతో తెలుసా? అస్సలు ఊహించి ఉండరు..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 15, 2026 13:03:54
Hyderabad, Telangana:

Happy Kanuma 2026 Wishes Quotes Telugu: పశువుల పండుగగా పిలిచే కనుమకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. సంవత్సరం పొడవునా రైతన్నలతో కలిసి కష్టపడే మూగజీవుల పాత్ర విశేషమైంది. వీటి కష్టాన్ని గుర్తించుకొని కృతజ్ఞత భావంతో ఈ కనుమ పండుగను జరుపుకుంటారు. అయితే ఈరోజు పంట పొలాల్లో పనిచేసే మూగజీవులకు మెడలో గజ్జలు కట్టి పూలదండలు వేసి ఎంతో ఆనందంగా ముస్తాబు చేస్తారు. ఆ తర్వాత ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పించి పూజలు చేస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగను పాడిపంటలు కలిగిన ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ.. ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి. 

శుభాకాంక్షలు:
పొలంపాకలోని పశువుల పాడి.. గుమ్మం నిండా సిరి సంపదల రాశులు.. కష్టానికి తోడుగా నిలిచే మూగజీవాల పండగ కనుమ.. ఈ మూగ జీవులన్నీ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా రైతుకు సహాయపడేలా ఉండాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు..

పల్లెల్లోని ముంగిట ముగ్గుల హరివిల్లులు.. పశువుల పాకలో మూగజీవుల గంటల సవ్వడి.. పాడిపంటల తోడుగా.. పల్లె మురిసే వేడుకగా.. మీ అందరికీ పేరుపేరునా కనుమ పండుగ శుభాకాంక్షలు..

నేలను దున్నిన నాగలికి.. మన పొట్టను నింపే మూగజీవులకి.. ఈ కనుమ పండగ వేళ కృతజ్ఞత తెలుపుకుందాం.. ప్రతి ఏడాదిలాగా మీ ఇంట పాడి పంటలు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ.. మీ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు..

గంగిరెద్దుల అద్భుతమైన ఆటలు.. గాలిపటాల కోలాహాలం.. కనుమ పండగ రైతుల్లో తెచ్చింది కొత్త ఉత్సాహం.. ఈ సంక్రాంతి ముగింపు వేడుక మీకు ఎంతో ఉత్సాహాన్ని అందించాలని కోరుకుంటూ.. మీ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు..

రైతులకు ఒక వెన్నుముకగా నిలిచి.. మట్టిలోని అద్భుతమైన పంటలు పండించే.. నందివర్ధనాల వంటి పశుసంపదకు హారతి పట్టాల్సిన రోజు ఈ రోజు.. ఇంతటి శుభప్రదమైన రోజున అందరూ బాగుండాలని.. ప్రతి ఒక్కరికి సిరిసంపదలు కలగాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు..

కుండల్లో పాలు పొంగే సంక్రాంతి.. పాడి పెరిగే కనుమ.. ప్రతి ఇంత కలకాలం ఆనందోత్సాహాల మధ్య జరగాలని.. ఆ గౌరమ్మని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు..

ఎల్లప్పుడూ ప్రకృతిని ప్రేమిద్దాం.. పశువులను దైవంగా పూజిద్దాం.. మన సాంస్కృతిని అన్ని తరాలకు అందిద్దాం.. ప్రతి ఏడాది కనుమ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుందాం.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు.

పల్లెటూర్లో చుట్టూ పలకరింపులు.. పిండి వంటల అద్భుతమైన ఘుమఘుమలు.. కనుమ అంటేనే మమతల కలయిక.  ఈ పండగ మనందరి జీవితాల్లో మధుర జ్ఞాపకాలని నింపాలని ఆ దేవుని మనసారా కోరుకుంటూ.. మీ అందరికీ కనుమ పండుగ ప్రత్యేకమైన శుభాకాంక్షలు..

Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..

నాగలి కట్టి కడుపు నింపుతున్న చేతులు చల్లగా ఉండాలి.. పాడి ఆవుల అంకెలు లోగిలి నిండాలి... రైతన్నలు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి.. వ్యవసాయం చేసే ప్రతి ఒక రైతన్నకు కనుమ పండుగ శుభాకాంక్షలు.

భోగిమంటల నుంచి వచ్చే అద్భుతమైన వేడి.. సంక్రాంతి వెలుగుల జోడి.. కనుమ తెచ్చిన పాడి.. మీ అందరి ఇంట నిండాలి ఆనందాల కోడి.. మీ అందరికీ హృదయపూర్వక కనుమ శుభాకాంక్షలు..

Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
Jan 15, 2026 11:58:54
Gollet, Telangana:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గురువారం సంక్రాంతి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. గురువారం ఉదయం మహిళలు పెద్ద ఎత్తున రంగురంగుల ముగ్గులతో వాకిట్లను అలంకరించారు.అదేవిధంగా పేడతో చేసిన గొబ్బిళ్లను ముగ్గుల పైన ఉంచి రంగురంగుల పూలతో అలంకరించారు. అలాగే పూలు పండ్లు పెట్టి సంక్రాంతి పండగ విశిష్టతను చాటారు. చిన్నపిల్లలు పెద్దలు గాలిపటాలతో హుషారుగా ఎగిరేయడం చూపరులను ఆకట్టుకుంది. జిల్లాలోని బాబాపూర్ గ్రామంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎడ్ల పందాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పాల్గొని ఎడ్ల పందాలు నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడో ఆంధ్రాలో నిర్వహిస్తారని విన్నాం కానీ మన దగ్గర మన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహించుకోవడం గొప్ప విషయమని అన్నారు ఎడ్ల పందాలలో మొదటి బహుమతి 10 వేలు,రెండో బహుమతి 5 వేలు ఇవ్వడం అభినందనీయమన్నారు. జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్ తో పాటు కాగజ్నగర్ పట్టణాలలో ప్రజలు పెద్ద ఎత్తున సంక్రాంతి పండగను నిర్వహించుకున్నారు. జిల్లాలోని ఆసిఫాబాద్, కేరమేరి, వాంకిడి, కౌటాల, చింతల మానేపల్లి, బెజ్జూర్,సిర్పూర్, కాగజ్నగర్, రెబ్బెన, తిర్యాని మండలాలలో ప్రజలు ఉత్సాహంగా సంక్రాంతి పండుగను నిర్వహించుకున్నారు. పండగ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు ఇండ్లకు రాగా గ్రామాలు సందడిగా మారాయి.
0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 15, 2026 09:21:49
Hyderabad, Telangana:

Kanuma Festival 2026: తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.. భోగిమంటలతో సంక్రాంతి నోములతో అలరించిన పండగ.. మూడవ రోజు కనుమగా రూపాంతరం చెందుతూ వస్తుంది. ఇది కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలు పండగగానే భావించకుండా.. మనుషులకు మూగజీవాలకు మధ్య ఉన్న విడదీయలేని బంధానికి ప్రతీకని పురాణాలు చెబుతున్నాయి.. ఏడాది పొడవునా రైతులకు అడుగడుగునా తోడుండే పశువులను గౌరవించుకునేందుకు ఈ గొప్ప పర్వదినం ప్రతి ఏడాది సంక్రాంతి మూడవ రోజున జరుపుకుంటారు. ఈ పండగను కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా ఇప్పటికీ జరుపుకుంటూ వస్తున్నారు. అయితే కనుమ పండగ వెనక ఉన్న అసలైన చరిత్ర ఏంటో? ఈ పండగ ప్రాముఖ్యతను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కనుమ పండగ చరిత్ర నేపథ్యం లోకి వెళ్తే.. ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ లీలలకు సంబంధించిన పురాణ గాథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. పురాణాల్లో తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రుడు గర్వాన్ని అణిచివేసేందుకు ఈరోజు శ్రీకృష్ణుడు గోకులం ప్రజలను ఇంద్రయాగానికి బదులుగా.. గోవర్ధనగిరిని పూజించమని ఆదేశిస్తాడు.. దీని ఆగ్రహానికి గురైన ఇంద్రుడు ప్రళయ వర్షాన్ని ఈ రోజునే కురిపిస్తాడు.. ఈ సమయంలో శ్రీకృష్ణుడు తన చిటికెన వేలుతో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తేసి గోవులను ప్రజలను సురక్షితంగా కాపాడుతాడు. ఈ విజయానికి గుర్తుగానే ఆ ప్రజలు, పశువులు ఆనందోత్సాహాలతో ఈ కనుమ పండుగను జరుపుకుంటారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ పండగను జరుపుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుందని పూర్వీకులు చెబుతున్నారు.

అలాగే రైతులకు వ్యవసాయంలో ప్రధాన వెన్నుముకగా నిలిచే ఎద్దులతో పాటు పాలిచ్చే పశువులను గౌరవిస్తూ ఈరోజు  దేవతా స్వరూపాలుగా భావించి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఉదయాన్నే రైతులందరూ నిద్రలేచి పశువులను చెరువు దగ్గరికి తీసుకెళ్లి వాటిని శుభ్రంగా కడిగి.. కొమ్ములకు మంచి మంచి రంగులను పూసి.. మెడలో గంటలు కట్టి అద్భుతంగా ముస్తాబు చేస్తారు. అంతేకాకుండా కొత్త బియ్యంతో వండిన పొంగలిని పశువులకు నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో పశువుల పరువుల పందాలు కూడా నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తోంది.

Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..

కనుమ పండుగ విశిష్టత, ప్రత్యేకమైన ఆచారాలు..
చాలామంది పెద్దవారు కనుమ నాడు కాకైనా కదలదని చెబుతూ ఉంటారు.. ఈరోజు ప్రయాణాలు చేయకూడదని ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం ఉంది. ప్రకృతి తో పాటు కుటుంబ సభ్యులతో ఇంట్లోనే కలిసి గడపాలని దీని అంతరార్థం.. కాబట్టి ఇప్పటికీ కొంతమంది ఎలాంటి ప్రయాణాలు చేయకుండా ఇంట్లోనే కనుమ పండుగను జరుపుకుంటూ వస్తున్నారు.. కనుమ రోజు మినుములు కూడా తినడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. శీతాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మినుములతో తయారుచేసిన గారెలు లేదా ఇతర పదార్థాలను తీసుకోవడం ఈ పండగ ప్రత్యేకత.. అంతేకాకుండా కనుమ పండగ రోజున కొన్ని పల్లెలు ధాన్యపుకు అంకులను ఇంటి గుమ్మానికి కట్టి.. పక్షులను ఇంట్లోకి ఆహ్వానిస్తారు.. ఇలా చేయడం ప్రకృతి పట్ల కృతజ్ఞత చాటిన వారు అవుతారని పూర్వికులు చెబుతున్నారు.

Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 15, 2026 06:14:12
Hyderabad, Telangana:

Rahu Effect 2026 Effect On Zodiac Telugu: శని గ్రహం తర్వాత అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహాల్లో రాహు ఒకటి. రాహువు గ్రహం కూడా చాలా నెమ్మదిగా రాశి మారుతూ ఉంటుంది. ఇది సంచారం చేయడానికి దాదాపు ఒకటిన్నర సంవత్సరాల వరకు సమయం పడుతుంది. అయితే, శని గ్రహానికి ఎంత ప్రాముఖ్యత ఉందో రాహువు గ్రహానికి కూడా సంచారానికి అంతే ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ గ్రహం సంచారం చేయడం కారణంగా కూడా మొత్తం అన్ని రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారిపై కీడు ప్రభావం కూడా పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

రాహువు గ్రహాన్ని అత్యంత కీడు గ్రహంగా పరిగణిస్తారు. అంతేకాకుండా దీనిని నీడ గ్రహంగా కూడా చెప్పుకుంటారు. దీని కదలిక ఎల్లప్పుడూ వ్యతిరేక దశలో మాత్రమే కొనసాగుతూ ఉంటుంది. ఇది ఎప్పుడు అశుభ ఫలితాలను మాత్రమే అందిస్తుంది. ముఖ్యంగా ఈ గ్రహం వ్యక్తి జాతకాల్లో అశుభ స్థానంలో ఉంటే, జీవితంలో సమస్యలతో పాటు గందరగోళం ఏర్పడుతుంది. అలాగే అస్థిరత తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి. జీవితాన్ని విధ్వాంసానికి దారితీస్తుంది. అదే ఈ గ్రహం శుభ స్థానంలో ఉంటే వ్యాపారాలు సమాజంలో ఊహించని వ్యక్తులకు వెతుకుతారు. అంతేకాకుండా విధిరాత పూర్తిగా మారుతుంది.

ఇదిలా ఉంటే 2026 సంవత్సరంలో రాహువు గ్రహం రెండుసార్లు రాశి మారబోతున్నాడు. ముఖ్యంగా ఈ సంవత్సరం ఆగస్టు 2వ తేదీన ధనిష్ట నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.. ఆ తర్వాత డిసెంబర్ 5న మకర రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా మూడు రాశుల వారికి అశుభ ఫలితాలు గలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. అలాగే ఎన్నో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

వృషభ రాశి 
2026 సంవత్సరంలో రాహువు గ్రహం చేసే సంచారం వల్లభ వృషభరాశి వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఎన్నో రకాల సమస్యలతో పాటు ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థికంగా కూడా చాలా వరకు నష్టపోతారు ముఖ్యంగా ఏమైనా నిర్ణయాలు తీసుకునే క్రమంలో తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ప్రయాణాలు చేస్తున్న వ్యక్తులు కూడా ఈ సమయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

సింహరాశి 
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా రాహువు ప్రభావం పడుతుంది దీని కారణంగా ఆందోళన పెరిగే అవకాశాలున్నాయి. వ్యాపారాల్లో నష్టాలు కూడా జరగవచ్చు. ఈ సమయంలో ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించిన అనేక సమస్యలను ఎదుర్కొంటారు. పనిచేసే వారికి అనేక సమస్యలు తలెత్తవచ్చు. ఇంట్లో గొడవలు జరగడమే కాకుండా ఆర్థికంగా నష్టపోతారు.. ఈ సమయంలో కొత్త రిస్క్ తీసుకోవడం అంత మంచిది కాదు.

కన్యా రాశి 
కన్యారాశి వారికి కూడా రాహువు రెండుసార్లు సంచారం చేయడం వల్ల ఎన్నో రకాల సమస్యలు తలెత్తవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరు కోరికలు తీర్చుకోవడం మానుకుంటే మంచిదని.. ఇతరులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వ్యాపారాల్లో ఆకస్మిక నష్టాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది..కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కన్య రాశిలో జన్మించిన వ్యక్తులు కూడా రాహువు సంచార ప్రభావంతో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఒత్తిడి విపరీతంగా పెరిగివచ్చని నిపుణులు తెలుపుతున్నారు. వ్యాపారాల్లో పెద్ద పెద్ద మార్పులు కూడా వచ్చే అవకాశాలుంటాయి. ముఖ్యంగా రాహు సంచార ప్రభావంతో అనేక విధాలుగా నష్టపోతారు.. ఈ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి.

Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..

Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 15, 2026 06:01:25
Hyderabad, Telangana:

Mars In Capricorn Effect On Zodiac 2026: జనవరి నెల సంచారాలపరంగా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే కుజుడు సూర్యుడు ఇదే నెలలో మకర రాశిలోకి ప్రవేశిస్తాయి. ఇప్పటికే మకరంలోకి సూర్యుడు ప్రవేశించాడు. ఇదిలా ఉంటే జనవరి 16వ తేదీన కుజుడు కూడా మకరంలోకి సంచారం చేస్తాడు. దీని కారణంగా ఈ సమయంలో శుభయోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా జనవరి 16వ తేదీ ఉదయం నాలుగు గంటల సమయంలో కుజుడు సంచారం చేయడం, సూర్య శుక్ర గ్రహాలతో కలయిక జరపడం వల్ల ఎంతో శక్తివంతమైన త్రిగ్రహ యోగం కూడా ఏర్పడబోతోంది. దీనివల్ల ఆయారాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా జనవరి 17వ తేదీ తర్వాత మేషరాశి, కర్కాటక రాశి వారి జీవితాల్లో అనేకమైన మార్పులు సంభవిస్తాయి. అలాగే ఊహించని పురోగతి కూడా లభిస్తుంది. కుజుడి సంచారం మకర సంక్రాంతి తర్వాత ఏ రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులను తీసుకువస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ రాశులవారికి బంపర్‌ జాక్‌పాట్:
మేషరాశి 
మేష రాశి వారికి పదవ స్థానంలో కుజుడి సంచారం జరగబోతోంది. దీని ఫలితంగా వీరు అనేక ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా కొత్త బాధ్యతలను స్వీకరించడమే కాకుండా అనేక శుభ అవకాశాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయంలో తప్పకుండా పదోన్నతులు కూడా కలుగుతాయి. అలాగే వ్యాపారాలు సమృద్ధిగా సాగుతాయి. ప్రభుత్వ రంగాల్లో పనులు చేస్తున్న వ్యక్తులకు అద్భుతమైన అవకాశాలు కూడా లభిస్తాయి.. పనికి తగ్గ గుర్తింపు కూడా లభిస్తుంది. వ్యక్తిగత జీవితంలో సమతుల్యం ఏర్పడి.. ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

మకర రాశి 
మకర రాశి వారికి మొదటి స్థానంలో కుజుడు సంచారం చేయబోతున్నాడు. అయితే ఇప్పటికే సూర్యుడు బుధుడు కలయిక జరగడం కారణంగా ఏర్పడిన ప్రభావం ఈ రాశి వారిపై పడుతోంది. ఫలితంగా వీరికి ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అలాగే వీరు సంబంధాలను కూడా మెరుగుపరచుకుంటారు. కెరీర్ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా కెరీర్ పరంగా అద్భుతమైన ధైర్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రాబోయే రోజుల్లో వీరికి అంతా శుభమే జరగబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్నవారు అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు.

కర్కాటక రాశి 
కర్కాటక రాశి వారికి కుజుడు ఏడవ స్థానంలో ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా ఈ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రేమ జీవితం చాలా అద్భుతంగా మారబోతోంది. అలాగే ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భాగస్వామ్య జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పటినుంచో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఒంటరిగా ఉన్న వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతోంది. మీరు మీ కుటుంబ సభ్యులకు అద్భుతమైన ఆనందకరమై క్షణాలు గడపగలుగుతారు. అలాగే కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. దీంతోపాటు వీరు అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు కష్టపడతారు. 

Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..

కర్కాటక రాశి 
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా కుజుడి సంచారం చాలా అద్భుతంగా ఉండబోతోంది. ముఖ్యంగా వీరి ఆలోచనలు ఎప్పుడూ ఎప్పుడూ లేనంతగా చాలా బలంగా మారుతాయి. దీనివల్ల సంబంధాల్లో బాగోద్వేగాలతో పాటు విశ్వాసం కూడా పెరుగుతుంది. అలాగే వృత్తి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాలతో అద్భుతమై జీవితం గడుపుతున్న వ్యక్తులకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. నాయకత్వ లక్షణాలతో ఉన్న వ్యక్తులకు ఈ సమయంలో ఎంతో మేలు జరగబోతోంది. అంతేకాకుండా మధురమైన క్షణాలను గడపగలుగుతారు.

Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..

Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Jan 15, 2026 05:38:47
Nellore, Andhra Pradesh:

Nellore Train Accident: నెల్లూరు జిల్లాలో గురువారం ఉదయం ఒక పెద్ద రైలు ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి తిరుపతి వైపు వెళ్తున్న గూడ్స్ రైలు కావలి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పడంతో రైల్వే అధికారులు, ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

అసలేం జరిగింది?
విజయవాడ నుండి సరుకుతో తిరుపతికి బయలుదేరిన ఈ గూడ్స్ రైలు, కావలి స్టేషన్ సమీపానికి చేరుకోగానే హఠాత్తుగా పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో రైలుకు చెందిన రెండు వ్యాగన్‌లు (బోగీలు) పట్టాల నుండి పక్కకు పడిపోయాయి. అప్రమత్తమైన లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేసి అధికారులకు సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పింది.

ప్రస్తుత పరిస్థితి..
ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. లోకో పైలట్ కూడా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. సమాచారం అందిన వెంటనే రైల్వే సాంకేతిక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ల సహాయంతో పట్టాలు తప్పిన వ్యాగన్లను తొలగించి, ట్రాక్‌ను పునరుద్ధరించే పనులు యుద్ధప్రతిపాదికన జరుగుతున్నాయి.

రైళ్ల రాకపోకలకు అంతరాయం: ఈ ప్రమాదం కారణంగా విజయవాడ - నెల్లూరు - తిరుపతి మార్గంలో నడిచే పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని రైళ్లను సమీప స్టేషన్లలోనే నిలిపివేశారు.

Also Read: IT Hub Vizag: విశాఖకు క్యూ కడుతున్న ఐటీ కంపెనీలు..జనవరి 26 నుంచి 'కాగ్నిజెంట్' కార్యకలాపాలు ప్రారంభం!

Also Read: AP Employees DA Arrears: సంక్రాంతి ధమాకా..60 నెలల DA బకాయిలు విడుదల..ఉద్యోగుల ఖాతాల్లో రూ.60 వేల వరకు జమ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 15, 2026 02:30:24
Visakhapatnam, Andhra Pradesh:

Cognizant Vizag: ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో కీలక ముందడుగు పడబోతోంది. ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ (Cognizant) విశాఖపట్నంలో తన తాత్కాలిక కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. జనవరి 26 నుండి సుమారు 800 మంది ఉద్యోగులతో ఈ కేంద్రం పని ప్రారంభించనుంది.

800 మంది ఉద్యోగులతో శ్రీకారం
హిల్‌-2లోని 'మహతి' బ్లాక్‌లో తాత్కాలిక కార్యాలయాన్ని కాగ్నిజెంట్ సిద్ధం చేసింది. వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న 500 మంది ఉద్యోగులను ఇప్పటికే విశాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరో 300 మంది సీనియర్ ఉద్యోగులు కూడా ఇక్కడ చేరనున్నారు. కాపులుప్పాడలోని 22 ఎకరాల శాశ్వత క్యాంపస్‌లో భవిష్యత్తులో 25,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా సంస్థ పనిచేస్తోంది.

ఫిబ్రవరిలో టీసీఎస్ (TCS)
కాగ్నిజెంట్ బాటలోనే మరో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కూడా విశాఖలో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. మిలీనియం టవర్స్-2లో తాత్కాలికంగా 2,000 మంది ఉద్యోగులతో ఫిబ్రవరి నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.

హిల్‌-3లో కేటాయించిన 21.76 ఎకరాల్లో త్వరలో శాశ్వత క్యాంపస్‌కు భూమిపూజ జరగనుంది. ఇప్పటికే టీసీఎస్ బోర్డులు ఏర్పాటు చేసి, జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేసింది.

విశాఖకు క్యూ కడుతున్న ఇతర దిగ్గజాలు
కాగ్నిజెంట్, టీసీఎస్ మాత్రమే కాకుండా మరికొన్ని అంతర్జాతీయ సంస్థలు విశాఖపై కన్నేశాయి. డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ రంగంలో పేరుగాంచిన క్యాప్‌జెమినీ (Capgemini) సంస్థ విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు చర్చలు జరుపుతోంది. అలాగే ఆర్ఎంజేడ్ (RMZ) సంస్థ కూడా విశాఖలో అడుగుపెట్టే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న దావోస్ సదస్సులో ఈ కంపెనీల రాకపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఐటీ నిపుణులు భావిస్తున్నారు.

Also Read: AP Employees DA Arrears: సంక్రాంతి ధమాకా..60 నెలల DA బకాయిలు విడుదల..ఉద్యోగుల ఖాతాల్లో రూ.60 వేల వరకు జమ!

Also Read: Salary Hike: ఉద్యోగులకు సంక్రాంతి కానుక..17 శాతం జీతాల పెంపునకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్?!..మూడేళ్ల నిరీక్షణకు తెర!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 15, 2026 01:29:57
Nunna, Vijayawada, Andhra Pradesh:

AP Govt Employees DA Arrears: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలో ఈ సంక్రాంతి కొత్త వెలుగులు నింపింది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన 60 నెలల కరువు భత్యం (DA) బకాయిలను ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం ఒకేసారి విడుదల చేసింది. భోగి పండుగ రోజే నగదు ఖాతాల్లో జమ కావడంతో లక్షలాది మంది ఉద్యోగులు, పింఛనుదారులు పండుగను రెట్టింపు ఉత్సాహంతో జరుపుకొంటున్నారు.

ఎవరికి ఎంత ప్రయోజనం?
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సుమారు 2.25 లక్షల మంది సీపీఎస్ (CPS) ఉద్యోగులకు, 2.70 లక్షల మంది పింఛనుదారులకు నేరుగా లబ్ధి చేకూరింది. సీపీఎస్ ఉద్యోగులు, పింఛనుదారులకు నేరుగా నగదు రూపంలో వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఒక్కో ఉద్యోగికి వారి అప్పటి మూలవేతనం (Basic Pay) ఆధారంగా రూ.30,000 నుండి రూ.60,000 వరకు లభించింది. అదే విధంగా రెగ్యులర్ ఉద్యోగులకు ఈ బకాయిలు వారి జీపీఎఫ్ (GPF) ఖాతాలకు మళ్లించారు.

బకాయిల లెక్క ఇలా..
ఈ బకాయిలు 2018, 2019 సంవత్సరాలకు సంబంధించినవిగా తెలుస్తోంది. వాటిలో 2018 కరువు భత్యం (DA) 30 నెలల బకాయిలు ఉండగా..  2019 కరువు భత్యం 30 నెలల బకాయిలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ బకాయిలను ప్రస్తుత జీతంపై కాకుండా, 2018-19 కాలంలో ఉన్న అప్పటి మూలవేతనంపై లెక్కించి ప్రభుత్వం చెల్లించినట్లు సమాచారం.

పోలీసులకు 'సరెండర్ లీవు' కానుక
కేవలం సాధారణ ఉద్యోగులే కాకుండా, రాష్ట్రంలోని దాదాపు 55 వేల మంది పోలీసు ఉద్యోగులకు కూడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి రావాల్సిన సరెండర్ లీవు బకాయిలను బుధవారం నాడే ఖాతాల్లో జమ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంతో ఏపీ పోలీసు అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది.

గుత్తేదారులకు (Contractors) కూడా ఊరట
అభివృద్ధి పనులు చేపట్టిన గుత్తేదారులకు నాబార్డు, విదేశీ ఆర్థిక సాయం కింద రావాల్సిన రూ.1,243 కోట్ల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. దీనివల్ల సుమారు 10 శాతం మంది గుత్తేదారులకు తక్షణ ఆర్థిక ఊరట లభించింది.

మొత్తంగా భోగి పండుగ నాడే సుమారు రూ.1,100 కోట్లు ఉద్యోగుల ఖాతాల్లోకి చేరడం విశేషం. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ సానుకూల స్పందనకు ధన్యవాదాలు తెలిపారు. మిగిలిన పెండింగ్ సమస్యలను కూడా ప్రభుత్వం ఇదే రీతిన పరిష్కరిస్తుందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Salary Hike: ఉద్యోగులకు సంక్రాంతి కానుక..17 శాతం జీతాల పెంపునకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్?!..మూడేళ్ల నిరీక్షణకు తెర!

Also Read: Allu Arjun Lokesh Kanagaraj: అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా ఫిక్స్..బాక్సాఫీసు షేక్ అయ్యే న్యూస్..అఫీషియల్ వీడియో వచ్చేసింది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 15, 2026 00:58:12
Bengaluru, Karnataka:

KSRTC Employees 17 Percent Hike: దాదాపు మూడు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) ఉద్యోగులకు సంక్రాంతి పండుగ వేళ శుభవార్త అందుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న జీతాల సవరణపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడంతో రవాణా రంగ కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

ఎందుకు ఆలస్యమైంది?
సాధారణంగా ప్రభుత్వ విభాగాల్లో కాలానుగుణంగా జీతాల సవరణ జరుగుతుంది. అయితే KSRTCలో గత కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. చివరిసారి గత బీజేపీ ప్రభుత్వం 2020లో జీతాలను సవరించినప్పటికీ, కరోనా సంక్షోభం కారణంగా అప్పట్లో పెంపుదల ఆశించిన స్థాయిలో లేదు. ఆ తర్వాత 2023లో సవరణకు ప్రయత్నాలు జరిగినప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు.

జీతాల పెంపు - కీలక వివరాలు:
ప్రస్తుత సమాచారం ప్రకారం.. ఉద్యోగుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. గతంలో 15 శాతం పెంపు ఉండగా, ఈసారి ఆలస్యాన్ని పరిగణనలోకి తీసుకుని 17 శాతం వరకు జీతాలు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ జీతాల పెంపు మార్చి 2027 నుండి అధికారికంగా అమలులోకి రానుందని విశ్వసనీయ సమాచారం. కానీ, ఈ పెంపుదల జనవరి 2026 నుండి వర్తించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

కార్మిక సంఘాల డిమాండ్ ఇదే?
ప్రభుత్వం జనవరి 2026 నుండి పెంపును వర్తింపజేయాలని చూస్తుండగా, ఉద్యోగ సంఘాలు మాత్రం జనవరి 2024 నుండే ఈ పెంపును వర్తింపజేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం నుండి మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.

ఏకసభ్య కమిటీ సిఫార్సులు, కార్మిక సంఘాల చర్చల అనంతరం ఈ పెంపు నిర్ణయం తీసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ, సంక్రాంతి పండుగ పూట జీతాల పెంపు ప్రకటన రావడం KSRTC కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపింది.

Also Read: Allu Arjun Lokesh Kanagaraj: అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా ఫిక్స్..బాక్సాఫీసు షేక్ అయ్యే న్యూస్..అఫీషియల్ వీడియో వచ్చేసింది!

Also Read: Gruhalakshmi Yojana: మహిళలకు సంక్రాంతి కానుక..ఖాతాల్లోకి రూ.4,000 జమ..ఎప్పటిలోగా ఇస్తారంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 14, 2026 13:52:27
Hyderabad, Telangana:

Allu Arjun Lokesh Kanagaraj Movie: ఈ సంక్రాంతి వేళ సినీ ప్రియులకు అతిపెద్ద 'బ్లాక్ బస్టర్' శుభవార్త అందింది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ హిట్ మెషిన్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఒక భారీ పాన్-ఇండియా చిత్రం పట్టాలెక్కబోతోంది. గత కొంతకాలంగా వినిపిస్తున్న ఈ వార్తలను నిజం చేస్తూ, అల్లు అర్జున్ స్వయంగా ఒక పవర్‌ఫుల్ వీడియో ద్వారా ఈ ప్రాజెక్ట్‌ను ధృవీకరించారు.

వీడియోలో 'సింహం'లా బన్నీ..
ఈ చిత్ర ప్రకటన కోసం విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇందులో అల్లు అర్జున్ రాచరికం, ఆధిపత్యానికి ప్రతీకగా 'సింహం'లా కనిపిస్తుండగా, అతని చుట్టూ మోసపూరితమైన 'నక్కలు' ఉన్నట్లు చూపించారు. లోకేష్ కనగరాజ్ మార్క్ ఇంటెన్స్ యాక్షన్, పదునైన స్క్రీన్ ప్లే ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నాయని ఈ వీడియో సంకేతాలిస్తోంది.

ప్రధాన ఆకర్షణలు ఇవే..
పాన్-ఇండియా లెవల్: ఈ చిత్రం కేవలం దక్షిణాదికే పరిమితం కాకుండా, హిందీతో పాటు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. అల్లు అర్జున్ స్టైల్, లోకేష్ కనగరాజ్ రా (Raw) అండ్ రస్టిక్ యాక్షన్ మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అతని నేపథ్య సంగీతం (BGM) సినిమాకు ప్రధాన బలం కానుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను #AA23 అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్నారు.

భారీ అంచనాలతో..
లోకేష్ కనగరాజ్ తన సినిమాలతో ఒక సొంత యూనివర్స్ (LCU)ను సృష్టించారు. మరి అల్లు అర్జున్ సినిమా కూడా ఆ యూనివర్స్‌లో భాగమవుతుందా? లేదా ఇది ఒక కొత్త తరహా గ్యాంగ్‌స్టర్ డ్రామానా? అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

Also Read: Sesame Seeds Sankranti: సంక్రాంతి రోజున నువ్వుల లడ్డూలు ఎందుకు తినాలి? సూర్యుడు-శని మధ్య ఉన్న ఆసక్తికర రహస్యం ఇదే!

Also Read: Cervical Cancer: స్త్రీల ఆరోగ్యంలో కీలకమైన 'సెర్విక్స్'..గర్భాశయ క్యాన్సర్ ముప్పు నుండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top