icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

సముద్రంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. సీఎం చంద్రబాబు హై అలర్ట్‌

Visakhapatnam, Andhra Pradesh:

Navy Officers: చేపల కోసం వేటకు వెళ్లిన మత్య్సకారులు దురదృష్టవశాత్తు సముద్రంలో గల్లంతయ్యారు. గల్లంతై 24 గంటలు దాటినా ఇంకా వారి ఆచూకీ లభించకపోవడంతో వెంటనే ఆంధ్రప్రదేశ్‌ అప్రమత్తమైంది. మత్య్సకారుల ఆచూకీ కోసం స్థానిక అధికార యంత్రాంగంతోపాటు నౌకాయాన అధికారులు కూడా రంగంలోకి దిగారు. అయితే ఏడుగురు మత్స్యకారులు గల్లంతవడంతో వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఈనెల 1వ తేదీన తెల్లవారుజామున 3 గంటలకు విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి మత్య్సకారులతో IND-AP-MM-V5-83 బోటు వేట కోసం వెళ్లింది. ఆ సమయంలో బోటులో మొత్తం 7 మంది మత్స్యకారులు ఉన్నట్లు సమాచారం. జూలై 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కుటుంబసభ్యులకు ఫోన్ చేసిన మత్స్యకారులు సాయంత్రం వరకు వస్తాయని చెప్పారు. అయితే తుఫాన్ కారణంగా మరో గంటలో  విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు చేరుకుంటామని చెప్పిన వారు తర్వాత ఆచూకీ కనిపించలేదు. సాయంత్రం 5 గంటలు దాటినా బోటు హార్బర్‌కు చేరుకోలేదు. బోటులోని మత్స్యకారుల వద్ద ఉన్న ఆరు మొబైల్ ఫోన్ నంబర్లు స్విచ్ ఆఫ్‌ అయ్యాయి. వారితో ఎలాంటి సంబంధం లేకపోవడం కుటుంబసభ్యుల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమైంది. 

గల్లంతైన వారు వీరే..
గల్లంతైన వారి  కుటుంబసభ్యులు విశాఖ ఫిషింగ్ హార్బర్ దగ్గర జాలారిపేట జబ్బర్ తోట ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. గల్లంతైన వారిలో ఆరుగురు విజయనగరం జిల్లా భోగాపురం మండలం, ముక్కాం గ్రామానికి చెందిన వారు. మరొకరు విశాఖ జిల్లా భీమిలి మండలం పెద నాగమయ్య పాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు.

బోటు బోల్తా
సముద్రంలో వాతావరణ పరిస్థితుల కారణంగా మత్స్యకారులు ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడిందని తెలుస్తోంది. సముద్రంలో అలల తాటికి బోటు బోల్తాపడడంతో మత్స్యకారులు  గల్లంతైనట్టు సమాచారం. ఈ బోటులో ప్రయాణిస్తున్న మత్య్సకారుడు కారె చిన్న ప్రాణాలతో బయటపడ్డాడు. 

విశాఖపట్టణంలోని సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సముద్రంలో మత్య్సకారుల గల్లంతయ్యారనే విషయం తెలిసిన వెంటనే ఆయన కుప్పం నుంచి ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. బంగాళాఖాతంలో గల్లంతైన మత్స్యకారుల బోటును గాలించేందుకు కోస్టుగార్డు నౌక ప్రయత్నిస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి INDAP-VS-MM-83 అనే బోటు ఏడుగురు మత్స్యకారులతో జూన్ 1 తేదీ సాయంత్రం 4 గంటలకు సముద్రంలోకి చేపల వేటకు బయల్దేరి వెళ్లిందని సీఎంకు అధికారులు తెలిపారు. 4 తేదీ మధ్యాహ్నానికి ఆ బోటు ఫిషింగ్ హార్బర్‌కు తిరిగి రావాల్సి ఉందని అయితే సాంకేతిక కారణాలతో బోటు తిరిగి రాలేదని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. గంగవరం సముద్ర తీరం సమీపంలో వారి బోటుకు సాంకేతిక సమస్య ఉత్పన్నమైనట్టుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

మత్య్సకారుల కోసం ఉదయం నుంచి నౌకాదళానికి చెందిన హెలికాప్టర్ల ద్వారా కూడా గాలింపు చర్యలు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కోస్టుగార్డు, నేవీ, మెరైన్ పోలీసు విభాగాలు గాలింపు చర్యలు చేపట్టినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన సీఎం సముద్రంలో చేపడుతున్న గాలింపు చర్యలను సమన్వయం చేసుకోవాల్సిందిగా మెరైన్ ఐజీ, విశాఖ సీపీలను ఆదేశించారు. గాలింపు చర్యలకు సంబంధించిన అంశాలను తనకు ఎప్పటికప్పుడు తెలియచేయాలని సూచించారు. మత్స్యకారుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలని మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక విశాఖ ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు.

హోంమంత్రి సమీక్ష
విశాఖపట్టణంలో మత్స్యకారుల గల్లంతు ఘటనపై హోం మంత్రి అనిత ఆరా తీశారు. కలెక్టర్, ఎస్పీ, మత్స్య శాఖ అధికారులతో ఫోన్‍లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కోస్టుగార్డ్ నౌకలతో గాలింపు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశించారు. గల్లంతైన మత్స్యకారుల కోసం యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని చెప్పారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

మంత్రి అచ్చెన్నాయుడు ఆరా
విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపలవేటకు వెళ్లి  7 మంది మత్స్యకారులు గల్లంతైన ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. కలెక్టర్, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గల్లంతైన మత్స్యకారుల కోసం యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. వర్షం ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు.

0
0
Report

అరుదైన కేంద్ర దృష్టి యోగం.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు, అపార ధనలాభం!

Hyderabad, Telangana:

Mars-venus Square Conjunction July 2026 Effect: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలు, వాటి కలయికలు అన్ని రాశులవారి మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతూ ఉంటాయి. జూలై నెలలో ఒక అత్యంత అరుదైన, శక్తివంతమైన గ్రహాల కలయిక జరగబోతోంది. ప్రేమ, ఐశ్వర్యాలకు కారకుడైన శుక్రుడు, ధైర్య సాహసాలు, పరాక్రమానికి కారకుడైన అంగారకుడు కలిసి ఒక అద్భుతమైన యోగాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి.

జ్యోతిష్య శాస్త్రం.. జూలై 29, బుధవారం మధ్యాహ్నం 12 గంటల 34 నిమిషాలకు శుక్ర, కుజ గ్రహాలు ఒకదానికొకటి.. 90 డిగ్రీల కోణంలోకి రాబోతున్నాయి. దీని వల్ల అత్యంత పవిత్రమైన కేంద్ర దృష్టి యోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ శుభ యోగం కారణంగా ప్రధానంగా నాలుగు రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోబోతున్నాయి. వీరికి అపారమైన ధనలాభాలు, ఆస్తి కలిసిరావడంతో పాటు జీవితంలో ఊహించని సంతోషం లభిస్తుంది. అయితే, ఈ సమయంలో అదృష్టాన్ని పొందే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి (Aries)
ఈ కేంద్ర దృష్టి యోగం ఎఫెక్ట్‌తో మేష రాశివారికి మానసిక బలం, ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. చాలా కాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తొలగిపోయి.. సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. చేపట్టే ప్రతి పనిలోనూ విజయం తప్పకుండా లభిస్తుంది. ఆర్థికంగా ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్తగా ఇల్లు లేదా భూమి కొనుగోలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని జ్యోతిష్యలు చెబుతున్నారు. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో ఉన్న తండ్రి తరపున ఆస్తులు లభిస్తాయి.. ఇక వైవాహిక జీవితం, ప్రేమ వ్యవహారాలు చాలా మధురంగా ఉంటుంది.

సింహ రాశి (Leo)
సింహ రాశి వారికి ఈ యోగం ఒక సువర్ణ అవకాశాన్ని అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి బంపర్ పురోగతి లభిస్తుంది.. సమాజంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి. జీవితంలో కొత్త ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోతాయి.. ఆదాయ వనరులు విపరీతంగా పెరుగుతాయి. కొత్త ఆస్తులను సొంతం చేసుకుంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు, ప్రశాంతత నెలకొంటాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

కన్యా రాశి (Virgo)
శుక్ర, మంగళ గ్రహాల కేంద్ర దృష్టి యోగం ప్రభావంతో కన్యా రాశి వారికి ఈ సమయం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. మీరు గతంలో పడిన కష్టానికి, శ్రమకు తగిన ప్రతిఫలం ఇప్పుడు లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కార్యాలయాల్లో పైఅధికారుల ప్రశంసలు అందుతాయి. సహోద్యోగుల నుంచి సపోర్ట్‌ కూడా విపరీతంగా లభిస్తుంది. ఆర్థిక వృద్ధి బలంగా ఉంటుంది. దీనివల్ల డబ్బులు భారీగా లభించే అవకాశాలు ఉన్నాయి.. చాలా కాలంగా నడుస్తున్న ఆస్తి తగాదాలు, కోర్టు వివాదాలు కూడా పరిష్కారమవుతాయి..

తులా రాశి (Libra)
తులా రాశి వారికి ఈ యోగం అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది.. ఉద్యోగంలో మీ స్థానం మరింత స్థిరపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పాత, నిలిచిపోయిన ప్రాజెక్టులతో పాటు వ్యాపార ప్రణాళికలు కూడా మెరుగుపడతాయి. జీవితంలో నెలకొన్న అన్ని రకాల గొడవలు, అశాంతి తొలగిపోతాయని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఊహించని ధనలాభాలు కూడా విపరీతంగా కలుగుతాయి.. కొత్త ఆస్తులు కొనుగోలు చేయడమే కాకుండా ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందుతారు. ప్రేమ జీవితంలో భాగస్వామితో సత్సంబంధాలు మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి..

నోట్: ఈ సమాచారం కేవలం జ్యోతిష్య శాస్త్ర అంచనాలతో పాటు నమ్మకాలను ఆధారంగా తీసుకు రాసింది మాత్రమే. దీనికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు.. వ్యక్తిగత జాతకాలను బట్టి ఫలితాలలో మార్పులు ఉంటాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

England Viagra World Cup: ఫీఫా వరల్డ్ ‌కప్‌లో విచిత్ర సంఘటన..ఇంగ్లాండ్ ప్లేయర్లకు వయాగ్రా ఇచ్చారు! ఎందుకంటే?

Burtinle, Nugaal:

England Viagra Mexico: ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్‌లో భాగంగా సోమవారం (జూలై 6న) మెక్సికోతో జరగబోయే కీలకమైన 'రౌండ్ ఆఫ్ 16' మ్యాచ్‌లో గెలవడానికి ఇంగ్లాండ్ జట్టు ఒక వినూత్నమైన మార్గాన్ని ఎంచుకుంది. మెక్సికో సిటీలోని తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, ఎత్తైన ప్రదేశాల వల్ల కలిగే శారీరక శ్రమను తట్టుకునేందుకు వీలుగా ఇంగ్లాండ్ జట్టుకు 'వయాగ్రా' మాత్రలను వినియోగించేందుకు అనుమతి లభించింది. ఫీఫా ప్రపంచకప్ చరిత్రలోనే ఇలాంటి విన్నూత్న అనుమతి లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

అసలు సమస్య ఏమిటి?
ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ సముద్ర మట్టానికి ఏకంగా 2,200 మీటర్ల ఎత్తులో ఉన్న 'ఎస్టాడియో అజ్టెకా' స్టేడియంలో జరగనుంది. పర్వత ప్రాంతాలు, పలుచని గాలి ఉండే ఇటువంటి చోట్ల ఆడటం అలవాటు లేని ఆటగాళ్లకు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఇంగ్లాండ్ తమ గ్రూప్ దశ మ్యాచ్‌లను, రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌ను అమెరికాలో ఆడింది. అక్కడ డీఆర్ కాంగోపై 2-1తో గెలిచిన తర్వాత, మెక్సికోతో మ్యాచ్‌కు వారికి కేవలం 3 రోజుల సమయం మాత్రమే దొరికింది.

"మేము మ్యాచ్‌కు ఒక రోజు ముందే ఇక్కడికి చేరుకుంటున్నాం. కేవలం మూడు రోజుల్లో శరీరం ఇలాంటి ఎత్తైన వాతావరణానికి అలవాటుపడటం అసాధ్యం. ఇందుకు కనీసం 12 నుండి 14 రోజుల సమయం పడుతుంది. తక్కువ సమయం ఉండటం మాకు పెద్ద ప్రతికూలత, మెక్సికోకు అది కలిసొచ్చే అంశం" అని ఇంగ్లాండ్ హెడ్ కోచ్ థామస్ టూచెల్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఎత్తైన ప్రదేశాలలో 'వయాగ్రా' ఎలా?
సాధారణంగా అంగస్తంభన సమస్యకు వాడే ఈ మందుకు ప్రత్యేకమైన హృదయ సంబంధ ప్రయోజనాలు ఉన్నాయి. వైద్య పరిశోధనల ప్రకారం.. ఇది ఊపిరితిత్తులలోని రక్తనాళాలను విస్తరింపజేసి, రక్తపోటును తగ్గిస్తుంది. దీనివల్ల గుండె శరీరాంతటా ఆక్సిజన్‌ను మరింత వేగంగా, సమర్థవంతంగా పంప్ చేస్తుంది.

తక్కువ ఆక్సిజన్ ఉండే ఎత్తైన ప్రదేశాలలో అథ్లెట్లకు ఎదురయ్యే అలసట, తల తిరగడం, ఆయాసం వంటి సమస్యలను ఇది గణనీయంగా తగ్గిస్తుంది.

ఇది డోపింగ్ పరిధిలోకి రాదా?
ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (WADA) నిబంధనల ప్రకారం, వయాగ్రా నిషేధిత పదార్థాల జాబితాలో లేదు. ఇది ఇతర డ్రగ్స్ లాగా క్రీడా సామర్థ్యాన్ని కృత్రిమంగా, అక్రమంగా పెంచేది కాదని WADA సంస్థ చేసిన పరిశోధనల్లో తేలింది. కాబట్టి దీని వాడకం పూర్తిగా చట్టబద్ధంగా నిర్ధారించారు. అయితే మ్యాచ్ రోజున ఇంగ్లాండ్ ఆటగాళ్లు నిజంగా ఈ మాత్రలు వేసుకుంటారా లేదా అనేది ఇంకా అధికారికంగా నిర్ధారణ కానప్పటికీ, వైద్యపరంగా వారికి ఈ వెసులుబాటు ఉంది.

మ్యాచ్ వివరాలు, లైవ్ స్ట్రీమింగ్..
మెక్సికోలోని ఎస్టాడియో అజ్టెకా స్టేడియం వేదికగా భారత కాలమాన ప్రకారం.. సోమవారం జూలై 6న ఉదయం 5:30 గంటలకు (IST) మ్యాచ్ ప్రారంభం కానుంది. 

లైవ్ ఎక్కడ చూడాలి?
భారతదేశంలోని ఫుట్‌బాల్ అభిమానులు ఈ ప్రపంచ కప్ మ్యాచ్‌లను Zee5 యాప్, వెబ్‌సైట్‌లో ఉచితంగా స్ట్రీమ్ చేయవచ్చు. అలాగే టీవీల్లో Unite8 Sports 1, Unite8 Sports 1 HD, Unite8 Sports 2, Unite8 Sports 2 HD ఛానెళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు.

Also Read: గ్రౌండ్‌లో కంటతడి పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీ..క్యాప్ అందుకున్న తర్వాత భావోద్వేగం!

Also Read: IND Vs ENG Match: భారత్ Vs ఇంగ్లాండ్ రెండో టీ20కి వరుణ గండం..ఇది కూడా రద్దైనట్టే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

బుధ, కుజ గ్రహాల కలయికతో దశాంశ రాజయోగం.. ఈ 5 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం!

Hyderabad, Telangana:

Dashank Rajyog 2026 Effect On Zodiac: జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల కదలికలతో పాటు వాటి కలయికలకు ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.. గ్రహాలు నిర్దిష్ట కాలంలో ఒకదానితో ఒకటి కలిసినప్పుడు లేదా ప్రత్యేక కోణాల్లో వచ్చిన్నప్పుడు అత్యంత శుభప్రదమైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే రాబోయే ఆగస్టు నెలలో ఒక అద్భుతమైన గ్రహాల కలయిక జరగబోతోంది. బుధ, కుజ  గ్రహాల కలయిక వల్ల ఎంతో శక్తివంతమైన దశాంశ రాజయోగం (Dashank Rajyog) ఏర్పడబోతోంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి.. ముఖ్యంగా 5 రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఊహించని రీతిలో ధనలాభం కలగబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

దశాంశ రాజయోగం అంటే ఏమిటి?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. 2026 ఆగస్టు 14వ తేదీన బుధుడు కుజ  గ్రహాలు ఒకదానికొకటి 36 డిగ్రీల ప్రత్యేక కోణంలో రాబోతున్నాయి. ఈ గ్రహాల అరుదైన గ్రహాల కలయితో అత్యంత శక్తివంతమైనదిగా భావించే దశాంశ యోగం ఏర్పడుతుంది. దీనిని ఎంతో పవిత్రమైనదిగా, శుభ ఫలితాలను ఇచ్చేదిగా చెప్పకుంటారు. ఈ యోగ ప్రభావంతో ఆగస్టు నెల నుంచి ప్రధానంగా ఐదు రాశుల వారికి ఆర్థికంగా భారీ ప్రయోజనాలు కలగడమే కాకుండా.. కెరీర్ పరంగా కూడా అద్భుతమైన పురోగతి లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

భారీగా అదృష్టాన్ని పొందే 5 రాశులు:
మేష రాశి (Aries)

మేష రాశివారికి ఈ దశాంశ యోగం వల్ల వృత్తిపరంగా సరికొత్త అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పదోన్నతులు లేదా కొత్త బాధ్యతలు లభించే అవకాశాలు కలుగుతాయి. గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని.. కెరీర్‌లో ముందుకు సాగడానికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఆరోగ్యం పరంగా ఎటువంటి పెద్ద సమస్యలు ఉండవు. అయితే, ఈ సమయంలో శారీరక వ్యాయామంపై మరింత శ్రద్ధ పెట్టడం మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

సింహ రాశి (Leo)
సింహ రాశికి కూడా వ్యాపారాల పరంగా ఈ సమయం ఒక అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. కొత్త భాగస్వాములు లేదా సహచరులతో కుదుర్చుకునే ఒప్పందాల వల్ల వ్యాపారంలో భారీ లాభాలు కలుగుతాయి.. ఆర్థిక పరిస్థితి మెరుగుపడడమే కాకుండా.. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి తగినంత సమయం దొరుకుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా, దీర్ఘకాలికంగా వేధిస్తున్న శారీరక అనారోగ్య సమస్యల నుంచి కూడా ఈ కాలంలో ఉపశమనం లభిస్తుంది.

కన్యా రాశి (Virgo)
కన్యా రాశి వారికి పని వాతావరణంలో గణనీయమైన సానుకూల మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్యాలయంలో ఒత్తిడి తగ్గి.. మీ వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి తగినంత సమయం కేటాయించగలుగుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీనివల్ల కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్య పరంగా చూస్తే.. కంటి సమస్యల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది. ఈ కాలంలో రుచికరమైన విందు వినోదాలలో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి.

ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ శక్తివంతమైన రాజయోగం ప్రభావంతో పెద్ద పెద్ద వ్యాపార ఒప్పందాలు (Business Deals) కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఇవి భవిష్యత్తులో భారీ లాభాలను తెచ్చిపెడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వ్యాపార లేదా వ్యక్తిగత పనుల నిమిత్తం సుదూర ప్రాంతాలకు ప్రణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ జీవితంలో ఉన్న విభేదాలు, మానసిక ఒత్తిళ్లు తొలగిపోతాయి. భాగస్వామితో సంబంధాలు మళ్లీ మధురంగా మారుతాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

Bus Accident Gadwal: ట్రావెల్స్ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు.. ఐదుగురి పరిస్థితి విషమం

Gadwal, Telangana:

Bus Accident In Gadwal: జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ కి చెందిన ప్రైవేట్ బస్సు రోడ్డుపై వెళ్తుండగా, అతివేగంగా వచ్చిన ఒక లారీ ఆ బస్సును బలంగా ఢీ కొట్టింది. లారీ ఢీకొట్టిన తీవ్రతకు బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డుపైన పల్టీలు కొట్టి బోల్తా పడింది. 

10 మందికి గాయాలు..ఆసుపత్రికి తరలింపు 
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. లారీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా ప్రయాణికులు కేకలతో ప్రాంతం మారుమోగిపోయింది. ఈ ఘటనలో పదిమంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు.. తోటి వాహనదారులు వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టారు. బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులు బయటకు తీశారు. ప్రమాదంలో గాయపడిన వారందిని చికిత్స నిమిత్తం సమీపంలోని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఐదుగురు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు తీవ్ర దిగ్భ్రాంతికి, ఆందోళనకు గురయ్యారు. తాము నిబంధనల ప్రకారం ప్రయాణిస్తున్నప్పటికీ.. వెనుక నుంచి వచ్చే వాహనాలు ఇలా బలంగా ఢీకొడితే ప్రాణాలు రక్షణ ఎక్కడ ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రోజు రోజుకు రహదారులపై పెరుగుతున్న ప్రమాదాలు, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రయాణాలు చేయాలంటేనే సామాన్లు వణికి పోతున్నారు. ప్రాణాలను ఎలాంటి గ్యారెంటీ లేని పరిస్థితి నెలకొందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: బెంగళూరులో గ్యాంగ్ రేప్..మత్తు ఇచ్చి యువతిని అత్యాచారం..ఐదుగురు అరెస్టు!

Also Read: రైతన్నలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త..రూ.100లకే వారసత్వ భూములు రిజిస్ట్రేషన్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Sai Krishna Case: "నా కొడుకుని మేకులు కొట్టి చంపారు..బూడిదైనా ఇవ్వండి!" సాయికృష్ణ తల్లి ఆవేదన!

Vijayawada, Andhra Pradesh:

Sai Krishna Case Update: విజయవాడ గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు విషయంలో ఆయన తల్లి విజయలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తన కొడుకును పోలీసులు అత్యంత అమానుషంగా హింసించి చంపేశారని ఆమె ఆరోపించారు. "నా కొడుకు కాళ్లు, చేతుల్లో మేకులు కొట్టి దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆగకుండా ఇప్పుడు మమ్మల్ని (కుటుంబ సభ్యులను) కూడా చంపాలని చూస్తున్నారు" అంటూ ఆమె భయాందోళనలు వ్యక్తం చేశారు.

ఈ లాకప్ డెత్ వెనుక పెద్దల హస్తం ఉందని విజయలక్ష్మి స్పష్టం చేశారు. పోలీసులు కేవలం నలుగురైదుగురు చిన్న ఉద్యోగులను మాత్రమే అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. "నా కొడుకును థర్డ్ డిగ్రీతో విచక్షణారహితంగా హింసించిన అసలు నిందితులు, ఈ లాకప్ డెత్ వెనుక ఉన్న పెద్దలు ఇంకా బయటే తిరుగుతున్నారు.వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదు?" అని ఆమె ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానమే అయినప్పుడు, సూత్రధారులను ఎందుకు కాపాడుతున్నారని నిలదీశారు.

బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం!
తన కొడుకు మృతదేహాన్ని కడసారి చూసుకునే భాగ్యం కూడా కల్పించలేదని, కనీసం అంత్యక్రియల తర్వాత మిగిలిన సాయికృష్ణ బూడిదను (అస్థికలను) కూడా తమకు అప్పగించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "నా కొడుకు బూడిదైనా మాకు ఇవ్వండి.. లేకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటా" అంటూ ఆమె తీవ్ర హెచ్చరిక చేశారు.

బాధిత తల్లి విజయలక్ష్మి చేసిన ఈ వ్యాఖ్యలు విజయవాడతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. లాకప్ డెత్ కేసులో పోలీసుల వైఫల్యాలను, వైఖరిని ఎండగడుతూ ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు ఉన్నతాధికారులపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, అసలైన సూత్రధారులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

ALso Read: బెంగళూరులో గ్యాంగ్ రేప్..మత్తు ఇచ్చి యువతిని అత్యాచారం..ఐదుగురు అరెస్టు!

Also Read: ఇథనాల్ పెట్రోల్‌తో మీ కారు, బైక్‌కి ప్రమాదమా? ఇంజిన్ తుప్పు పడుతుందా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

తులంపై 35వేలు తక్కువ పలుకుతున్న బంగారం ధర.. జులై 5వ తేదీ ధరలివే..!!

PPINEWZ4h ago
Secunderabad, Telangana:

Gold Rate Today: ఈరోజు.. ఆదివారం.. జూలై 5వ తేదీన బంగారం ధరలు 10 గ్రాముల 24-క్యారెట్ల బంగారం ధర రూ. 1,47,490 ఉండగా.. 10 గ్రాముల 22-క్యారెట్ల బంగారం ధర  రూ. 1,36,790 పలుకుతోంది. ఒక కిలోగ్రాము వెండి ధర రూ. 2,36,665 వద్ద ట్రేడ్ అవుతోంది. గత వారం బంగారం ధరలు తీవ్రంగా పడిపోయి, ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగానే బంగారం ధరలు పెరుగుతున్నాయని చెప్పవచ్చు. బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం డాలర్ బలహీనపడటమే.. మనం యూఎస్ మార్కెట్‌ను పరిశీలిస్తే.. ఒక ఔన్సు బంగారం ధర ప్రస్తుతం  4,165 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుదల అని కూడా చెప్పాలి. యూఎస్ డాలర్ విలువ బలపడితే, బంగారం ధరలు తగ్గుతాయి. యూఎస్ డాలర్ విలువ బలహీనపడితే, బంగారం ధరలు కూడా పెరుగుతాయి. ఈ రెండింటి మధ్య బలమైన సంబంధం ఉంది.

బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడి. పెట్టుబడిదారులు తమ లాభాలను కోల్పోకుండా తరచుగా దీనిలో పెట్టుబడి పెడతారు. ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పుడు, పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ నష్టాలను నివారించుకోవడానికి ప్రయత్నిస్తారు. అదేవిధంగా, యూఎస్ బాండ్ మార్కెట్‌లో వడ్డీ రేట్లు తగ్గినప్పుడు, బాండ్ రాబడులు కూడా తగ్గుతాయి. అయినప్పటికీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లించడానికి సుముఖంగా ఉన్నారు. గత వారం బంగారం ధరలు భారీగా పడిపోవడంతో, బంగార ప్రియులకు కొంత ఊరట లభించింది. నగల దుకాణాల్లో కొంత సందడి కనిపించింది. కానీ ఇప్పుడు, ధరలు మళ్లీ పెరుగుతుండటంతో, ప్రజలు బంగారు ఆభరణాలు కొనడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని దుకాణ యజమానులు చెబుతున్నారు.

బంగారం ధరలు భారీగా పెరిగినప్పటి నుంచి, సగటు బంగార ప్రియుడు తన కొనుగోళ్లను తగ్గించుకున్నాడని బంగారు నగల వ్యాపారులు చెబుతున్నారు. అనేక ఆఫర్లు ఉన్నప్పటికీ బేస్ ధర తగ్గకపోవడంతో బంగార ప్రియులు వెనకడుగు వేస్తున్నారని నిపుణులు అంటున్నారు. అయితే, తేలికపాటి బంగారు ఆభరణాల డిజైన్లకు డిమాండ్ పెరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం, మార్కెట్‌లో 10 గ్రాముల కంటే తక్కువ బరువున్న బంగారు ఆభరణాలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. వాటిని కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని నగల దుకాణాల యజమానులు చెబుతున్నారు. మరోవైపు, భవిష్యత్తులో బంగారం ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా అనే దానిపై చాలా అనిశ్చితి నెలకొని ఉందని చెప్పవచ్చు. అయితే, బంగారం ధరలు పూర్తిగా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులపైనే ఆధారపడి ఉంటాయి కాబట్టి, ఈ సమయంలో దీనిని అంచనా వేయడం కష్టమని నిపుణులు అంటున్నారు.

Also Read: మరో 15రోజులు బంగారం, వెండి జోలికి వెళ్లకండి.. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం బులియన్ మార్కెట్లో

Also Read: భారీగా పడిపోనున్న గోల్డ్ రేట్.. 2 నెలల్లో తులం 1లక్షకు చేరే ఛాన్స్

Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

తిరుమల భక్తులకు బిగ్‌ అలర్ట్‌.. రెండు రోజులు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

Tirupati Urban, Andhra Pradesh:

Tirumala Temple: తిరుమల ఆలయానికి వెళ్తున్న భక్తులకు బిగ్‌ అలర్ట్‌. రెండు రోజుల పాటు తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేశారు. తిరుమలలో అత్యంత వైభవంగా జరిగే రెండు వేడుకల సందర్భంగా వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సిఫారసు లేఖలు కూడా స్వీకరించమని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. ఇంతకీ ఎందుకు? ఎప్పుడు? అనే వివరాలు ఇలా ఉన్నాయి.

జూలై 14వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. జూలై 17వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ రెండు రోజులు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జూలై 17న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఆణివార ఆస్థానం, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా ఈ రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా ఇతరులకు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. జూలై 13, 16వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించలేమని టీటీడీ అధికారులు వెల్లడించారు. వీటితోపాటు ఆణివారం ఆస్థానం రోజు నిత్యం జరిగే ఆర్జిత సేవలు కూడా రద్దు చేశారు. జూలై 17న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటన చేసింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.

0
0
Report

Renault Kwid 2026: రూ.4.53 లక్షలకే సూపర్ గ్రేడ్ కారు..బడ్జెట్‌లో సూపర్ ఫీచర్స్ ఏంటో తెలుసా?

Hyderabad, Telangana:

Renault Kwid 2026 Price: భారతదేశంలోని బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు రెనాల్ట్ ఇండియా కొత్త 2026 రెనాల్ట్ క్విడ్‌ను విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.53 లక్షలు నుంచి అందుబాటులో ఉండడం విశేషం. ఇది కొత్త డిజైన్, అదనపు ఫీచర్లు, సవరించిన వేరియంట్లతో వస్తుంది.  

కొత్త రెనాల్ట్ క్విడ్‌ను ఎవల్యూషన్, క్లైంబర్ అనే రెండు వేరియంట్లలో పరిచయం చేశారు. ఈ రెండు వేరియంట్లు 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) ఆప్షన్‌లతో అందుబాటులో ఉన్నాయి. కంపెనీ మునుపటి ఆథెంటిక్, టెక్నో వేరియంట్లను నిలిపివేసి, మోడల్‌ను సరళీకరించింది.  

డిజైన్ పరంగా చూస్తే, కొత్త క్విడ్ బయట 3D రెనాల్ట్ లోగో, కొత్త డ్యూయల్-టోన్ వీల్ కవర్లు, టెయిల్‌గేట్‌పై కొత్త స్టైల్ "క్విడ్" బ్యాడ్జ్‌ను పొందుతుంది. ఇంటీరియర్‌లో కొత్త కైగర్-స్టైల్ స్టీరింగ్ వీల్, సవరించిన క్యాబిన్, ఆధునిక డిజైన్ ఉన్నాయి.  

ఫీచర్ల పరంగా కూడా రెనాల్ట్ అనేక అప్‌గ్రేడ్‌లను చేసింది. ఈ కారులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్ విండోస్, మాన్యువల్ ఏసీ ఉన్నాయి. టాప్ క్లైంబర్ వేరియంట్‌లో భద్రతా ఫీచర్లుగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హిల్ స్టార్ట్ అసిస్ట్ (AMT మోడళ్లలో), కీలెస్‌ ఎంట్రీ, EBDతో కూడిన ABS లభిస్తాయి.  

ఇంజన్ విభాగంలో ఎలాంటి మార్పు లేదు. ఈ కారుకు మునుపటిలాగే అదే 1.0-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది సుమారు 69 hp పవర్, 92.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రోజువారీ నగర వినియోగానికి ఈ ఇంజన్ తగినంత పనితీరును అందిస్తుందని కంపెనీ పేర్కొంది. మాన్యువల్ వేరియంట్‌ల కోసం అదనపు ఖర్చుతో రెట్రోఫిట్ CNG కిట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.  

ఈ కారులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్ విండోస్, మరియు మాన్యువల్ ఏసీ ఉన్నాయి.

దాని ధర, ఫీచర్ల దృష్ట్యా, కొత్త రెనాల్ట్ క్విడ్ మారుతి ఆల్టో కె10, మారుతి ఎస్-ప్రెస్సో, టాటా టియాగో వంటి బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్‌లతో నేరుగా పోటీపడుతుంది. రెనాల్ట్ కొత్త డిజైన్, భద్రతా అప్‌గ్రేడ్‌లు, ఆకర్షణీయమైన ధరలతో మొదటిసారి కారు కొనుగోలు చేసేవారిని ఆకర్షించడంపై దృష్టి సారిస్తోంది.  

Also Read; రైతన్నలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త..రూ.100లకే వారసత్వ భూములు రిజిస్ట్రేషన్!

ALso Read: టెలిగ్రామ్‌కు మరోసారి కేంద్ర ప్రభుత్వం నోటీసులు..15 రోజుల్లో పైరసీ ఆపాల్సిందే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో మరో సంచలనం.. గోల్డెన్‌ బూట్‌ రేసులో లియోనిల్‌ మెస్సీ

Golden Boot Race: ఫుట్‌బాల్‌ ఫీవర్‌ ప్రపంచ దేశాలకు సోకింది. ఫిఫా ప్రపంచకప్‌ను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తుండగా.. అదే స్థాయిలో ఆటగాళ్లు తమ ప్రదర్శన చేస్తూ సంచలన ఫలితాలు నమోదు చేస్తున్నారు. నరాలు తెగే ఉత్కంఠతో జరుగుతున్న మ్యాచ్‌లు ప్రేక్షకులకు వినోదం అందిస్తున్నాయి. ఇక అర్జెంటీనా స్టార్‌ ప్లేయర్‌ లియోనిల్‌ మెస్సీ తన హవాను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్‌లో సంచలన ప్రదర్శనలు చేస్తూ మరో రికార్డుకు చేరువయ్యాడు. గోల్డెన్ బూట్ రేసులో మెస్సీ ముందంజలో ఉండగా.. అతడికి పోటీగా ఎంబాపే కూడా వస్తున్నాడు.

2026 ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లో గోల్డెన్ బూట్ గెలుచుకునే పోటీ ఇప్పుడు మరింత ఉత్సాహంగా మారుతోంది. ప్రస్తుతం అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఈ రేసులో ముందున్నాడు. మెస్సీ ఇప్పటివరకు 7 గోల్స్ చేసి గోల్డెన్ బూట్ గెలుచుకోవడానికి ప్రధాన పోటీదారుగా నిలిచాడు. అతడి కంటే ఒకటి తక్కువ చేసిన ఎంబాపే కూడా తాను పోటీలో ఉన్నానని చెబుతున్నాడు. దీంతో గోల్డెన్‌ బూట్‌ ఎవరికీ దక్కుతుందనేది ఉత్కంట నెలకొంది.

జూలై 4వ తేదీ ఉదయం 2026 ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లోని రౌండ్ ఆఫ్-32 మ్యాచ్‌లన్నీ పూర్తయిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ (రౌండ్ ఆఫ్ 16)పై ఉంది. రౌండ్ ఆఫ్-32లో కేప్ వెర్డేతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా 3-2 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జట్టు కెప్టెన్, స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఒక కీలకమైన గోల్ చేశాడు. ఈ గోల్‌తో మెస్సీ 2026 ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లో గోల్డెన్ బూట్ రేసులోకి దూసుకొచ్చాడు. దీంతోపాటు అతడు వరుసగా 8 ప్రపంచకప్ మ్యాచ్‌లలో కనీసం ఒక గోల్ చేసిన అరుదైన రికార్డును కూడా నెలకొల్పాడు.

లియోనెల్ మెస్సీ తన కెరీర్‌లో ఎన్నడూ గోల్డెన్ బూట్ గెలుచుకోలేదు. అయితే ఈసారి అది సాధించడానికి అతడికి ఒక సువర్ణావకాశం లభించింది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు మొత్తం 7 గోల్స్ చేసిన మెస్సీ అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. కేప్ వెర్డేపై చేసిన గోల్ ప్రపంచ కప్ చరిత్రలో మెస్సీకి 20వ గోల్‌గా నిలిచింది. ఈ గోల్‌తో అతడు గోల్డెన్‌ బూట్‌ పొందడానికి రేసులోకి వచ్చాడు.

ఎంబాపే గట్టి పోటీ
చిరకాలంగా అందని గోల్డెన్‌ బూట్‌ కోసం మెస్సీ ఎదురుచూస్తుండగా.. అయితే ఈసారి తనకు కావాలని ఎంబాపే తీవ్ర పోటీలో నిల్చున్నాడు. గోల్డెన్ బూట్ రేసులో మెస్సీకి అతిపెద్ద ప్రత్యర్థి ఫ్రాన్స్‌కు చెందిన కైలియన్ ఎంబాపే ఉన్నాడు. ఎంబాపే ఇప్పటివరకు 6 గోల్స్ చేయగా.. నార్వేకు చెందిన ఎర్లింగ్ హాలాండ్, ఇంగ్లాండ్‌కు చెందిన హ్యారీ కేన్ చెరో 5 గోల్స్‌తో మూడో స్థానంలో సమంగా ఉన్నారు.

2026 ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లో అత్యధిక గోల్స్ చేసినవారు
లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా) - 7 గోల్స్
కైలియన్ ఎంబాపే (ఫ్రాన్స్) – 6 గోల్స్
ఎర్లింగ్ హాలాండ్ (నార్వే) - 5 గోల్స్
హ్యారీ కేన్ (ఇంగ్లాండ్) – 5 గోల్స్

ఈజిప్ట్‌తో అర్జెంటీనా 
రౌండ్ ఆఫ్ -32లో గెలిచిన తర్వాత అర్జెంటీనా ఇప్పుడు ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌లో ఈజిప్ట్‌తో తలపడనుంది. రౌండ్ ఆఫ్ 32లో ఆస్ట్రేలియాతో 1-1తో డ్రా చేసుకున్న ఈజిప్ట్, పెనాల్టీ షూటౌట్‌లో 4-2 తేడాతో విజయం సాధించింది. అర్జెంటీనా, ఈజిప్ట్ జట్ల మధ్య రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ జూలై 7న రాత్రి 9:30 గంటలకు జరగనుంది. మెస్సీ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించి.. జట్టును క్వార్టర్ ఫైనల్స్‌కు నడిపించగలడా లేదా అనేది ఇప్పుడు చూడాల్సి ఉంది.

0
0
Report

Bengaluru Crime News: బెంగళూరులో గ్యాంగ్ రేప్..మత్తు ఇచ్చి యువతిని అత్యాచారం..ఐదుగురు అరెస్టు!

Bengaluru, Karnataka:

Bengaluru Rape Case: బెంగళూరులోని మారుతినగర్‌లో దారుణమైన ఘటన జరిగింది. ఓ ఇంట్లో తనపై సామూహిక అత్యాచారం జరిగిందని ఓ యువతి ఫిర్యాదు మేరకు, తలఘట్టపుర పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. 

పోలీసుల వివరాల ప్రకారం.. దేవనహళ్లికి చెందిన బాధితురాలికి శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రధాన నిందితుడు అమరేష్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేసే సోమశేఖర్ అనే వ్యక్తి, కలబురిగి నుండి తన స్నేహితులు బెంగళూరుకు వచ్చారని, ఆమెను కలవాలనుకుంటున్నారని ఆమెకు చెప్పాడు.

ఆ యువతి సాయంత్రం 7 గంటల సమయంలో బైక్ టాక్సీలో ఆ ప్రదేశానికి చేరుకుంది. నిందితులు ఐదుగురిలో ఇద్దరు ఆమెకు పరిచయస్తులేనని పోలీసులు తెలిపారు. ఈ దాడి జరగడానికి ముందు ఆ బృందం కొంత సమయం కలిసి గడిపి, మద్యం సేవించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమెకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ సమయంలో నిందితులలో ఒకరైన అమరేష్ ఆమెపై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఘటనలో మిగిలిన నలుగురు నిందితుల పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు వారి బారి నుండి తప్పించుకుని, వెంటనే 112 అత్యవసర హెల్ప్‌లైన్‌కు కాల్ చేసింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, ఆమెను రక్షించి, అక్కడే ఉన్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టు అయిన వారిలో అమరేష్, సోమశేఖర్ మరో ముగ్గురు ఉన్నారు. వైద్య పరీక్షల కోసం బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. తలఘట్టపుర పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను విచారిస్తున్నారు. సీన్ రీక్రియేషన్, ప్రతి అనుమానితుడి పాత్రను బట్టి తదుపరి దర్యాప్తును కొనసాగుతోంది. బాధితురాలి వాంగ్మూలం, వైద్యపరమైన ఆధారాలు, దర్యాప్తులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తుది అభియోగాలు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

Also Read: Mumbai Floods 2026: సముద్రాన్ని తలపిస్తున్న ముంబై..భారీ వరదలతో ఆర్థిక నగరం అల్లకల్లోలం!

Also Read: టెలిగ్రామ్‌కు మరోసారి కేంద్ర ప్రభుత్వం నోటీసులు..15 రోజుల్లో పైరసీ ఆపాల్సిందే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Siya Goyal: సియా గోయల్ మిడిల్ ఫింగర్ వివాదం.. అసలు నిజం బైటపెట్టిన తండ్రి.. ఏమన్నాడంటే..?

Hyderabad, Telangana:

Siya goyal father on Middle finger gesture row: కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో పోలీసులు దర్యాప్తు స్పీడ్ ను పెంచారు. ఇటీవల పూణె కోర్టు సైతం మరోసారి సియాకు పోలీసుల కస్టడీకి అనుమతించింది. జులై 16 వరకు సియా, చేతన్ చౌదరీలకు పూణె కోర్టురిమాండ్ విధించింది. ఈ క్రమంలో సియా గోయల్ ఇటీవల పోలీసుల విచారణలో భాగంగా పూణేలోని మార్కెట్ యార్డ్ ప్రాంతంలో ఉన్న ఆమె నివాసానికి తీసుకెళ్లారు అక్కడ ఆమె నేరం జరిగిన రోజున ఆమె ధరించినట్లు ఆరోపించబడిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు.

 

ఆ తర్వాత బైటకు వచ్చే క్రమంలో సియా తన మధ్య వేలు చూపిస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెట్టింట దుమారం చెలరేగింది. సియాకు ఇంత కూడా పశ్చాత్తాపంలేదు.. మిడిల్ ఫింగర్ చూపిస్తు నీచంగా ప్రవర్తించందని తెగ ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై తాజాగా.. సియాగోయల్ తండ్రి ప్రవీణ్ గోయల్ స్పందించాడు.

సియా గోయల్ విచారణకు వచ్చినప్పుడు ఆమె చేతి వేలు కారు డోర్ లో ఇరుక్కుందని చెప్పాడు. ఆమె చేతి వేలికి గాయమైందని చెప్పాడు.వేలికి ప్లాస్టర్ కూడా ఉందని చెప్పాడు. కావాలంటే పోలీసులకు కూడా అడగొచ్చని స్పష్టం చేశాడు. సియా చేతికి గాయమైనట్లు ఒక ఫోటో ను సైతం సియా తండ్రి చూపించాడు. 

సియా మధ్య వేలు చూపించిందని ఆరోపణల్లో నిజంలేదని కొట్టిపారేశాడు. ఆమె చేతి వేలు వాచిపోయిందని. గోళ్లు కూడా నీలి రంగులోకి మారిపోయిందని ఆయన అన్నారు. దయచేసి ఫెక్ ప్రచారాలు చేయోద్దని ప్రవీణ్ గోయల్ అసలు విషయం బైటపెట్టాడు.

Read more: Siya Goyal: కేతన్‌ అగర్వాల్‌తో పెళ్లి జరగదు.!. స్నేహితురాలితో చాట్‌లో బైటపడ్డ సియా గోయల్ బండారం.!. పోలీసుల చేతికి కీలక ఆధారం..

మరోవైపు పూణే మర్డర్ కేసులో సియా తన స్నేహితురాలితో పెళ్లిపై చేసిన చాట్ బైటకు వచ్చింది. ఈ కేసులో చేతన్ చౌదరీ క్లాస్ మెట్ ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మొత్తంగా ఈ కేసులో రోజులు గడుస్తున్న కొలది ట్విస్ట్ ల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

రేవంత్‌ రెడ్డి పాలనలో రియల్ ఎస్టేట్ వ్యాపారం రివర్స్ అయ్యింది: హరీశ్ రావు

Siddipet, Telangana:

Telangana Real Estate: కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ వ్యాపారం రివర్స్ అయ్యిందని.. వచ్చేది మన ప్రభుత్వమే అని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు ధీమా వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ ఒక పెద్ద వ్యాపారం రియల్ ఎస్టేట్ బాగుంటే దానికి అనుబంధంగా ఎన్నో రంగాలు బాగుంటాయని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ రంగం బాగా నడిస్తే ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుగుతుందని గుర్తుచేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చాక సిద్దిపేట అభివృద్ధి వంద కిలోమీటర్ల వేగంతో ప్రగతి పరుగులు పెట్టిస్తానని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.

సిద్దిపేట జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌ రావు పాల్గొని కీలక ప్రసంగం చేశారు. 'రియల్‌ ఎస్టేట్‌ వారందరి తలరాత మారాలి అంటే కేసీఆర్ అనే గీత పెట్టుకోవాలి.. ఆ గీతనే మీ భవిష్యత్ మారుస్తుంది' అని తెలిపారు. సిద్దిపేటకు రేవంత్ రెడ్డి గ్రహణం పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ ఒక పెద్ద వ్యాపారం రియల్ ఎస్టేట్ బాగుంటే దానికి అనుబంధంగా ఎన్నో రంగాలు బాగుంటాయని వెల్లడించారు.

'రియల్ ఎస్టేట్ రంగం బాగా నడిస్తే ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుగుతుంది. సిమెంట్, స్టీల్, టైల్స్, శానిటరీ, మార్బుల్స్ వంటి అనేక రంగాలకు ఉపాధి లభిస్తుంది. వందలాది వ్యాపారాలు సజావుగా సాగుతాయి' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోయిందని విమర్శించారు. రేవంత్‌ రెడ్డి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయిందని, దాని ప్రభావంతో చిన్న వ్యాపారాలు, టీ హోటళ్లు, దుకాణాలు, ఇతర అనుబంధ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

'ఇది ఒక్క సిద్దిపేట పరిస్థితి కాదు. రాష్ట్రం మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోయిన పరిస్థితి. హైదరాబాద్‌లో చూసినా ఇదే, కరీంనగర్‌లో చూసినా ఇదే, నల్గొండలో చూసినా ఇదే, మహబూబ్‌నగర్‌లో చూసినా ఇదే, నిజామాబాద్‌లో చూసినా ఇదే పరిస్థితి' అని రియల్‌ ఎస్టేట్‌ సంక్షోభాన్ని మాజీ మంత్రి హరీశ్‌ రావు వివరించారు. 'ఎక్కడ చూసినా వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దుకాణాలు నడవడం లేదు. షాపులకు గిరాకీ లేదు. వ్యాపారం పూర్తిగా దెబ్బతింది' అని కాంగ్రెస్‌ వైఫల్యాన్ని వెల్లడించారు.

హైడ్రా దెబ్బతో వ్యాపారాలు దెబ్బతిన్నాయని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సమస్యలు తీర్చడం కాదని.. సమస్యలు తెచ్చి పెడుతుందని ఆరోపించారు. 'సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. నాడు కోటి రూపాలు పలికిన ఎకరం భూమి, నేడు రూ.60 లక్షలకు కొనేవారు లేరు. గతంలో ఎకరం భూమి రూ.10 లక్షల కంటే ఎక్కువ ఉండేది కాదు. కానీ బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోఇ వచ్చాక భూముల ధరలు పెరిగాయి' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు గుర్తు చేశారు. కుంభకోణాల ప్రభుత్వం పోయి.. పథకాల ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. మళ్లీ కేసీఆర్‌ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని హరీశ్‌ రావు తెలిపారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తుందని చెప్పారు.

0
0
Report

జగిత్యాల KVకి 5 ఎకరాలు సరిపోవు.. 10 ఎకరాలు కేటాయించండి: సీఎంకు ఎంపీ అర్వింద్ లేఖ!

Hyderabad, Telangana:

Jagtial Kendriya Vidyalaya: జగిత్యాల జిల్లాలో ప్రతిపాదిత కేంద్రీయ విద్యాలయానికి (కేవీ) కనీసం 10 ఎకరాల భూమిని కేటాయించాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్‌కు ఒక లేఖ రాశారు. చల్గల్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి ఇటీవల రాష్ట్ర కేబినెట్ 5 ఎకరాల స్థలాన్ని కేటాయించడాన్ని స్వాగతిస్తూనే.. విద్యార్థుల భవిష్యత్తు, మౌలిక వసతుల దృష్ట్యా ఆ స్థలం ఏమాత్రం సరిపోదని ఎంపీ స్పష్టం చేశారు.

భవిష్యత్తు విస్తరణకు ఎలా?
కేంద్రీయ విద్యాలయ సంస్థ (KVS) నిబంధనల ప్రకారం.. మెట్రోయేతర ప్రాంతాల్లో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కనీసం 10 ఎకరాల స్థలం అవసరమని ఎంపీ అర్వింద్ గుర్తుచేశారు. ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాలు కేవలం ప్రాథమిక తరగతుల గదుల నిర్మాణానికి, కనీస అవసరాలకు మాత్రమే సరిపోతాయని ఆయన లేఖలో రాసిన్నట్లు తెలుస్తోంది.. భవిష్యత్తులో పాఠశాల విస్తరణ, ఆధునిక సైన్స్ ల్యాబ్‌లు, కంప్యూటర్ రూమ్‌లు, అధునాతన డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలంటే మరికొంత స్థలం తప్పనిసరి అని లేఖలో పేర్కొన్నారు.

ప్లే గ్రౌండ్స్, హాల్స్ లేకుంటే ఎలా?
విద్యార్థుల మేధో వికాసంతో పాటు శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరమని.. కానీ 5 ఎకరాల పరిమిత స్థలంలో ఇండోర్, అవుట్‌డోర్ ప్లే గ్రౌండ్స్, అసెంబ్లీ హాల్స్, ఆడిటోరియంల నిర్మాణానికి వీలుండదని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందించే క్రమంలో నాణ్యమైన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

రాజకీయాలకు తావివ్వకుండా నిర్ణయం తీసుకోవాలి..
విద్యాసంస్థల ఏర్పాటు విషయంలో చిల్లర రాజకీయాలకు తావివ్వకుండా.. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అర్వింద్ డిమాండ్ చేశారు. గతంలోనూ భూమి కేటాయింపు ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని నష్టపోయారని.. ఇకనైనా కాలయాపన చేయకుండా స్పందించాలని కోరారు. జగిత్యాల కేంద్రీయ విద్యాలయం ఒక మోడల్ క్యాంపస్‌గా రూపుదిద్దుకోవాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని.. భూ కేటాయింపును 5 ఎకరాల నుంచి 10 ఎకరాలకు పెంచుతూ తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

జగిత్యాలలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల రచ్చ.. అధికారుల తీరుపై లబ్ధిదారులు ఫైర్!

Hyderabad, Telangana:

Jagtial 2BHK Housing Row: జగిత్యాల పట్టణంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపుల వ్యవహారం తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఇండ్ల లబ్ధిదారులు శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయానికి భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలు చెప్పకుండా.. కండిషన్స్‌పై గుడ్డిగా సంతకాలు పెట్టించుకుంటున్నారంటూ.. అధికారుల తీరుపై లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

లబ్ధిదారుల సంతకాల సేకరణ..
హౌసింగ్ డిపార్ట్‌మెంట్ పంపిన లబ్ధిదారుల జాబితా ఆధారంగా మున్సిపల్ అధికారులు ప్రస్తుతం లబ్ధిదారుల నుంచి సంతకాలను సేకరిస్తున్నారు. అయితే, తాము ఏ పత్రాలపై సంతకాలు పెడుతున్నామో.. ఆ నిబంధనలు ఏంటో తమకు కనీసం వివరించడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి అవగాహన కల్పించకుండా కేవలం సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేయడంపై వారు మండిపడ్డారు.

అధికారుల తీరుపై మండిపడ్డ బాధితులు..
సాధారణంగా ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరే సమయంలో పారదర్శకత ఉండాలని.. కానీ ఇక్కడ అధికారులు లబ్ధిదారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా గోప్యత పాటిస్తున్నారని ఆందోళనకారులు ధ్వజమెత్తారు. నిరక్షరాస్యులైన పేద ప్రజలను గందరగోళానికి గురిచేస్తూ.. భయాందోళనల మధ్య సంతకాలు సేకరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ప్రక్రియపై తక్షణమే లబ్ధిదారులందరికీ మున్సిపల్ యంత్రాంగం పూర్తి అవగాహన కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

హౌసింగ్ అధికారులదే బాధ్యత..
కార్యాలయం వద్ద లబ్ధిదారుల ఆందోళన తీవ్రం కావడంతో మున్సిపల్ కమిషనర్ స్పందించారు. గందరగోళాన్ని తగ్గించేందుకు కొంతమంది అధికారులు సంబంధిత అధికారులతో మాట్లాడిన్నట్లు తెలుస్తోంది. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల వివరాల సేకరణ, లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిగా హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల సంబంధించిన అన్ని వివరాలు వారి వద్దే ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా అన్ని వివరాలు హౌసింగ్ అధికారులే వివరిస్తారని కొంతమంది మున్సిపల్ అధికారులు తెలిపిన్నట్లు సమాచారం..

ఈ క్రమంలో హౌసింగ్ అధికారులే నేరుగా రంగంలోకి దిగి.. లబ్ధిదారులకు పూర్తి వివరాలు వివరించి.. వారి సందేహాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వివరాల సేకరణ చేపట్టాలని కమిషనర్ సంబంధిత అధికారులకు గట్టిగా సూచించారు. కమిషనర్ హామీతో లబ్ధిదారులు కొంత శాంతించినప్పటికీ.. తమకు న్యాయం జరిగే వరకు అప్రమత్తంగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనతోనైనా అధికారులు పారదర్శకంగా వ్యవహరిస్తారో లేదో చూడాలి.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement
Advertisement
Back to top