అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకు వచ్చిన లారీ
కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్ వద్ద పెను ప్రమాదం తప్పింది. కేపి.హెచ్.బి నుండి కూకట్ పల్లి కి వెళ్తున్న లారీ ఒక్కసారి వివేకానంద నగర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్ పైకు దూసుకుని వెళ్ళింది దీనితో అక్కడ ప్రజలు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Realme P4x 5G Price Cut: మీరు కూడా ఎప్పటినుంచో అతి తక్కువ ధరలోనే 7000mAh బ్యాటరీతో కూడిన మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకు ఫ్లిప్కార్ట్ ఇలాంటి జంబో బ్యాటరీస్తో కూడిన కొన్ని మొబైల్పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ ను అందిస్తోంది. ముఖ్యంగా రియల్మీ కంపెనీ గతంలో విడుదల చేసిన Realme P4x 5G చాలా తగ్గింపు ధరతో లభిస్తుంది. దీనిపై అదనంగా స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే, దీనిపై ఉన్న ఆఫర్స్ వివరాలేంటో? ఇది ఎలాంటి ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..
Realme P4x 5G మొబైల్ 6.72 అంగుళాల Full HD+ LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను కలిగి ఉంటుంది. కాబట్టి ఎండలో కూడా దీని స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా గేమింగ్ చేసే వారికి ఈ మొబైల్ స్క్రీన్ చాలా స్మూత్ గా ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ఫోన్ను కంపెనీ ఎంతో శక్తివంతమైన 7000mAh భారీ బ్యాటరీతో లాంచ్ చేసింది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 7400 Ultra 5G చిప్సెట్ ప్రాసెసర్తో అందుబాటులో ఉంది. అలాగే ఇందులో ప్రత్యేకంగా గేమింగ్ కోసం VC FrostCore కూలింగ్ సిస్టం కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇక ఈ మొబైల్ వెనుక భాగంలో ఉన్న కెమెరా వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ డ్యూయల్ కెమెరా సిస్టంతో విడుదల చేసింది. ఇది 50MP మెయిన్ కెమెరాతో పాటు 2MP మోనోక్రోమ్ సెన్సార్ సపోర్టుతో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు ఫ్రంట్ భాగంలో 8MP కెమెరా ఉంది..ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 ఆపరేటింగ్ సిస్టంతో పాటు ఐపీ64 (IP64) డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ వంటి ప్రత్యేకమైన ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఇది మార్కెట్లో రెండు స్టోరేజ్ ఆప్షన్స్లో అందుబాటులో ఉంది. 128 జీబీతో పాటు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో లభిస్తోంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
మార్కెట్లో ప్రస్తుతం 256జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్ఫోన్ ధర MRP రూ.20,999 కాగా.. ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్తో 10 శాతం తగ్గింపుతో కేవలం రూ.18,999కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా స్మార్ట్ఫోన్ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేస్తే అదనంగా రూ.1,800 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో మీరు కేవలం ఈ మొబైల్ను రూ.16,900 లోపే పొందవచ్చు. ఇక మరింత తగ్గింపు ధరకే ఈ మొబైల్ సొంతం చేసుకోవాలనుకునే వారు కచ్చితంగా ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్స్ ను వినియోగించుకోవాల్సి ఉంటుంది. దీనిని వాడాలనుకునే వారు తప్పకుండా ఏదైనా ఒక పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే రూ.15 వేల వరకు బోనస్ లభిస్తుంది. ఈ బోనస్ను ధర నుంచి మైనస్ చేస్తే రూ.1,900 లోపే దీనిని సొంతం చేసుకోవచ్చు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
EPFO Interest Rate 2026: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చే అవకాశముంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈపీఎఫ్ఓ (EPFO) వడ్డీ రేట్లను తగ్గించవచ్చని సంకేతాలు అందుతున్నాయి. ఇది నేరుగా కోట్ల మంది ఉద్యోగుల పదవీ విరమణ పొదుపుపై ప్రభావం చూపనుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) త్వరలో జరగబోయే తన 239వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకోనుంది.
వడ్డీ రేటు ఎంత తగ్గొచ్చు?
ప్రస్తుతం ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.25% వడ్డీ లభిస్తోంది. అయితే, మార్చిలో జరిగే సమావేశంలో దీనిని 8% నుండి 8.20% మధ్యకు తగ్గించాలని బోర్డు భావిస్తోంది.
'వికసిత భారత్ ఉపాధి పథకం' కింద కొత్తగా భారీ సంఖ్యలో సభ్యులు ఈపీఎఫ్ఓలో చేరుతున్నారు. నిధుల లభ్యత, ఆర్థిక నిలకడను కాపాడుకోవడానికి వడ్డీ రేటును స్వల్పంగా తగ్గించడం అవసరమని నిపుణులు భావిస్తున్నారు.
వడ్డీ రేటు తగ్గింపుపై బోర్డు నిర్ణయం తీసుకున్నప్పటికీ, దానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తప్పనిసరి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో, రాజకీయంగా వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసే అవకాశం కూడా ఉందని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి.
ఏప్రిల్ నుంచి UPI ద్వారా పీఎఫ్ విత్డ్రా!
వడ్డీ రేట్ల విషయంలో చేదు వార్త ఉన్నప్పటికీ, సాంకేతిక పరంగా ఒక తీపి కబురు ఉంది. పీఎఫ్ 3.0 సంస్కరణల్లో భాగంగా ఏప్రిల్ నుంచి కొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది. చందాదారులు తమ యూపీఐ (UPI) పిన్ ఉపయోగించి పీఎఫ్ సొమ్మును సురక్షితంగా విత్డ్రా చేసుకోవచ్చు.
పీఎఫ్ నుంచి విత్డ్రా చేసిన సొమ్ము నేరుగా బ్యాంకు ఖాతాకు చేరుతుంది. దానిని మీరు ఏటీఎంలు లేదా డెబిట్ కార్డుల ద్వారా వెంటనే వాడుకోవచ్చు. సభ్యుల మొత్తం చందాలో కొంత భాగాన్ని భవిష్యత్తు అవసరాల కోసం రిజర్వ్ చేసి, మిగిలిన మొత్తాన్ని విత్డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు.
వడ్డీ రేట్లు తగ్గితే దీర్ఘకాలంలో ఉద్యోగుల పొదుపుపై ప్రభావం పడుతుంది. అయితే యూపీఐ వంటి డిజిటల్ సేవలు అందుబాటులోకి రావడం వల్ల అత్యవసర సమయాల్లో పీఎఫ్ సొమ్మును వాడుకోవడం సులభతరం అవుతుంది. మార్చిలో జరిగే అధికారిక సమావేశం తర్వాతే వడ్డీ రేటుపై పూర్తి స్పష్టత రానుంది.
Also Read: PF New Rules 2026: ఉద్యోగులకు అలర్ట్..పీఎఫ్ కొత్త రూల్స్..రూ.25,000కు పెరగనున్న కనీస జీతం!
Also Read: Allu Arjun Tweet: మెగా కాంపౌండ్కు ఐకాన్ స్టార్..చరణ్-ఉపాసనలకు బన్నీ విషెస్..సెలబ్రేషన్స్ షురూ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Dashanka Raja Yogam Effect On Zodiac: ఫిబ్రవరి 3న ఎంతో శక్తివంతమైన బుధ, శని గ్రహాలు ఒకదానికొకటి 36 డిగ్రీల కోణంలోకి వచ్చాయి. జ్యోతిష్య శాస్త్రంలో ఈ ఘటనను అత్యంత అరుదైనదిగా భావిస్తారు. అయితే, ఇలాంటి సమయంలోనే ప్రత్యేకమైన రాజయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఎంతో పవిత్రమైన దశాంతక రాజయోగం ఏర్పడింది. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడింది. ముఖ్యంగా ఈ రాజయోగంతో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా పెద్ద పెద్ద మార్పులు వస్తాయి. అలాగే కెరీర్ పరంగా విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి.
దశంక రాజయోగంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. ఈ యోగ ప్రభావంతో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా కలిసి రావడమే కాకుండా.. అద్భుతమైన ధన లాభాలు కలుగుతాయి. అలాగే అదృష్టం పెరిగి అనుకుంటున్న పనుల్లో విజయాలు సాధిస్తారు. అయితే, ఈ సమయంలో అదృష్టాన్ని సొంతం చేసుకునే రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారిపై దశంక రాజయోగం ఎఫెక్ట్:
మిథున రాశి
మిధున రాశి వారికి దశంక రాజయోగ ప్రభావంతో జీవితం కొత్త మలుపు తిరగబోతోంది. ముఖ్యంగా వీరికి వచ్చే నెలలో పనుల్లో అద్భుతమైన మెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం చాలా లావుగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఊహించని లాభాలు కూడా పొందగలుగుతారు. అలాగే వీరికి తెలివితేటలు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతాయి. కృషికి తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది.
సింహరాశి
సింహ రాశి వారికి బుధుడు శని ప్రభావాల కారణంగా ఏర్పడిన దశంక యోగంతో జీవితం చాలా శుభప్రదంగా మారుతుంది. అలాగే ఈ సమయంలో వీరి కొత్త కొత్త ప్రాజెక్టులను కూడా పొందగలుగుతారు. దీంతోపాటు కార్యాలయాల్లో గౌరవం కూడా విపరీతంగా పెరుగుతుంది. వ్యాపారాలు లావు తగ్గంగా మారుతాయి. ఆర్థికంగా చాలావరకు కలిసి రాబోతోంది.
మకర రాశి
మకర రాశి వారికి ఫిబ్రవరి నెల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి అదృష్టం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అంతేకాకుండా కొన్ని అద్భుతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దీంతోపాటు సకాలంలో నిర్ణయాలు అద్భుతమైన అవకాశాలను కూడా అందిస్తాయి. విశ్వాసం ఊహించని స్థాయిలో పెరిగి కొన్ని రకాల కఠినమైన పనులు కూడా సులభంగా చేస్తారు.
కుంభరాశి
కుంభరాశి వారికి దశంక యోగం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వీరికి కూడా ఊహించని స్థాయిలో తెలివితేటలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు చేయడం వల్ల అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. కెరీర్ పరంగా విశేషమైన లాభాలు కలుగుతాయి. ఆర్థికపరంగా అద్భుతమైన మెరుగుదల కనిపించే అవకాశాలున్నాయి. కృషికి తగ్గ ప్రశంసలు కూడా పొందగలుగుతారు.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభంa
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Powerful Ruchaka Raja Yoga Effect On Zodiac Telugu: గడిచిన ఫిబ్రవరి మూడవ తేదీకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉండేది. ఈరోజు బుధుడు కుంభరాశిలో, చంద్రుడు సింహరాశిలో కదలికలు జరుపుతాడు. ఫలితంగా కుజుడు వచ్చేస్థితిలోకి వెళ్లి.. మకర రాశిలో రుచకరాజు యోగం ఏర్పడింది. అలాగే కుజుడు, సూర్యుడి కలయిక కారణంగా ఈరోజే ఆదిత్య మంగళ రాజయోగం కూడా ఏర్పడింది. దీంతో ఈ ప్రభావం ఫిబ్రవరి మూడవ తేదీ నుంచి 5వ తేదీ వరకు కొనసాగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో రుచక రాజయోగానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రాజయోగ ప్రభావం వల్ల అన్ని రాశుల వారికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారు ఊహించని ధన లాభాలు పొందగలుగుతారు. అయితే ఈ మంగళవారం నుంచి గురువారం వరకు ఏ రాశుల వారికి అత్యధికంగా మేలు జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రెండు రోజుల అదృష్ట రాశులు..
మేషరాశి
మేషరాశి వారికి కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. రుచక రాజయోగ ప్రభావంతో వీరికి పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగాలు చేసే అధికారులకు మద్దతు కూడా లభిస్తుంది. దీని కారణంగా అన్ని రకాల పెండింగ్ పనులను ఎంతో సులభంగా చేయగలుగుతారు. అలాగే సామాజిక రంగంలో గౌరవం కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ జీవితం చాలా శృంగార భరితంగా మారుతుంది. స్నేహితుల సపోర్టుతో కొన్ని రకాల పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు.
కన్య రాశి
రుచక రాజయోగ ప్రభావంతో కన్యా రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఈరోజు నుంచి అదృష్టం సహకరించబోతోంది. తద్వారా రెండు రోజులపాటు అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అలాగే ఈరోజు మీకు ఇష్టమైన స్నేహితులతో కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రత్యర్ధులు, శత్రువుల నుంచి కూడా ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్న వ్యక్తులకు ఇది అద్భుతమైన అవకాశం.
తులారాశి
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయంలో ఎంతో కొంత మేలు జరుగుతుంది. ముఖ్యంగా రెండు రోజులపాటు వీరికి అదృష్టం సహకరించి అన్ని ప్రయత్నాల్లో విజయాలు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో విశేషమైన ఫలితాలు పొందుతారు. అలాగే మీ ప్రత్యర్థులతో వస్తున్న వాగ్వాదాలు కూడా ఈరోజు తొలగిపోతాయి. శత్రువుల బాధ నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడతాయి.
మకర రాశి
మకర రాశి వారికి మంగళవారం నుంచి గురువారం వరకు చాలా శుభప్రదంగా ఉంటుంది. రాజయోగ ప్రభావంతో వీరికి అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా అదృష్టం సహకరించబోతోంది. అలాగే గతంలో చేసిన పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. తల్లిదండ్రుల నుంచి అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం అద్భుతమైన అవకాశాన్ని అందించబోతోంది. అలాగే అత్తమామల సహకారంతో విశేషమైన ఫలితాలు పొందుతారు.
కుంభరాశి
కుంభ రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి వస్తున్న గందరగోల సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు కాస్త పరిష్కారం కూడా లభిస్తుంది. తెలివితేటలతో ముందుకెళ్లడం వల్ల కొన్ని రకాల పనుల్లో ఊహించని విజయాలు కూడా సాధించగలుగుతారు. దీంతోపాటు దౌత్యపరమైన తెలివితేటలతో వ్యాపారాలను అద్భుతమైన విజయాలు సాధిస్తారు.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rajahmundry: ఆంధ్రప్రదేశ్లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఒక పులి తెలంగాణ మీదుగా ఏపీలోకి ప్రవేశించి ఇప్పుడు రాజమండ్రి పట్టణ ప్రజలను వణికిస్తోంది. కొంత అటవీ ప్రాంతం కాకుండా జనారణ్యంలో పులి సంచరిస్తుండడంతో రాజమండ్రి తీవ్ర భయాందోళన నెలకొంది. పులి ఎటు వైపు వెళ్తుందో.. ఏం చేస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. పులి సంచారంపై స్థానిక ఎమ్మెల్యేతోపాటు అటవీ శాఖ అధికారులు అప్రమత్తం ప్రకటించారు.
Also Read: Nandi Awards: టాలీవుడ్కు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. త్వరలోనే నంది అవార్డులు
రాజమండ్రి పట్టణంలో రాత్రి 9 గంటల సమయంలో పెద్దపులి దివా చెరువు హైవేపై కనిపించింది. ఎస్వీ పీసీ ఫంక్షన్ హాల్కి ఆనుకుని ఉన్న రోడ్డుపై తిరిగి.. పక్కనే ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైపు పెద్దపులి వెళ్లింది. రాజమండ్రి నగరానికి అతి సమీపంలో పెద్దపులి సంచరించడం కలకలం రేపుతోంది. దివాన్ చెరువు వద్ద ఆటోనగర్ ప్రాంతానికి చేరుకోవడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆటో నగర్, దివాన్ చెరువు, కొంతమూరు, లాలా చెరువు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సూచించారు.
Also Read: YS Sharmila: ఉపాధి హామీని మోదీ ఖూనీ చేస్తున్నారు.. అందరం తిరగబడాలి: వైఎస్ షర్మిల
ఒకే రోజు వివిధ ప్రాంతాల్లో పులి సంచరించింది. ఉదయం గాడాల ప్రాంతంలో పెద్ద పులి సంచరించిన ఆనవాళ్లు కనిపించాయి. అక్కడ పెద్దపులి పాదముద్రలు లభించాయి. గాడాల ప్రాంతం నుంచి దిశ మార్చుకొని రాజమండ్రి శివారులోని దివాన్ చెరువు ఆటోనగర్ ప్రాంతానికి పులి చేరుకుంది. ఛత్తీస్ఘడ్ నుంచి వచ్చినట్లుగా భావిస్తున్న పెద్దపులి పది రోజుల కిందట తెలంగాణలోకి ప్రవేశించి.. కావడిగుంట్ల అటవీ ప్రాంతం నుంచి కన్నాపురం ఫారెస్ట్ ఏరియా మీదుగా ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి బుట్టాయిగూడెం ప్రాంతంలోకి వచ్చింది. నాలుగు రోజుల కిందట పోలవరం మండలం పట్టిసీమ వద్ద గోదావరి నదిని ఈదుకుని తూర్పుగోదావరి జిల్లాలోకి పులి ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. సీతానగరం మండలం కొండేపూడి నుంచి ఏటిపట్టు ప్రాంతంలో సంచరిస్తూ తొర్రేడు వద్దకు చేరుకుని జనావాసాలకు దగ్గరగా అరటి, మొక్కజొన్న తోటలు వరి పొలాల వద్ద పులి సంచరిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోకి వచ్చాక మూడుచోట్ల పశువులను పులి చంపి తన ఆకలిని తీర్చుకుంది.
Also Read: Pawan Kalyan: అరవ శ్రీధర్ రాసలీలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. సమావేశం నుంచి వాకౌట్
కాగా రాజమండ్రి పట్టణ పరిసరాల్లో పులి సంచరిస్తుండడంతో దానిని బందించేందుకు అటవీ శాఖ అధికారులు స్థానిక పోలీసుల సహాయంతో ఏర్పాట్లు చేశారు. ఫారెస్ట్ అధికారులు బోన్లు ఏర్పాటుచేయగా.. ట్రాప్ కెమెరాలు, డ్రోన్ల ద్వారా పులిని గాలిస్తున్నారు. కాగా రాజమండ్రి పట్టణంలో పులి సంచరిస్తున్న వీడియోలు వైరల్గా మారాయి. సోషల్ మీడియాలో పులి సంచారంపై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Janasena Party MLA Issue: ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం రేపిన తన రాసలీలల వ్యవహారంపై జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలు.. చక్కర్లు కొడుతున్న వీడియోలపై కీలక ప్రకటన చేశారు. అస్సలు ఈ వ్యవహారం తన జనసేన పార్టీకి సంబంధం లేదని.. ఇది ఆ మహిళకు.. తనకు సంబంధించిన వ్యక్తిగత అంశం అని ప్రకటించారు. ఇది వ్యక్తిగత విషయం అని స్పష్టం చేశారు.
Also Read: Wild Tiger: రాజమండ్రి ప్రజలకు బిగ్ అలర్ట్.. జనారణ్యంలో చిరుతపులి సంచారం
తన రాసలీలల వ్యవహారంపై జనసేన పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ విచారణకు జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరయ్యారు. కొన్ని గంటల పాటు విచారణ జరిగిన అనంతరం అరవ శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. 'నాకు, వీణకు మధ్య జరిగింది వ్యక్తిగత విషయం' అని ప్రకటించారు. పార్టీ ఆదేశాల మేరకు విచారణకు హాజరయ్యానని.. తన వాదనను ఆధారాలతో కమిటీకి తెలిపినట్లు వెల్లడించారు. త్వరలో అన్నీ విషయాలు చెబుతానని చెప్పారు.
Also Read: Nandi Awards: టాలీవుడ్కు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. త్వరలోనే నంది అవార్డులు
కమిటీ తన నివేదికను జనసేన పార్టీ అధిష్టానానికి ఇచ్చాక నిర్ణయం తీసుకుంటారని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తెలిపారు. 'ఇది నా వ్యక్తిగత వ్యవహారం.. జనసేన పార్టీకి ఆపాదించవద్దు' అని విజ్ఞప్తి చేశారు. 'నాపై కేసు నమోదైన విషయం నాకు తెలియదు. వాళ్లు ఎన్ని కేసులు పెట్టుకున్నా చట్ట ప్రకారం ఎదుర్కోడానికి నేను సిద్ధం' అని ప్రకటించారు. ఇక ప్రజా జీవితంలోకి ఎప్పుడు వస్తారని ప్రశ్నించగా.. ఈ వ్యవహారం చక్కబడ్డాక వస్తానని తెలిపారు. విచారణ తర్వాత పార్టీ తీసుకోబోయే నిర్ణయం ఎలాంటి ఉంటుందో చూడాలని చెప్పారు. కమిటీ ఇచ్చిన తీర్పు.. పార్టీ అధిష్టానం తీసుకోబోయే నిర్ణయం తర్వాత అన్నీ విషయాలు మీడియాతో పంచుకుంటానని అరవ శ్రీధర్ వివరించారు. ఆధారాలతో సహా తాను మరోసారి మీడియా ముందుకు వస్తానని తెలిపారు. అసెంబ్లీలో మహిళతో చాటింగ్ వీడియో విషయమై స్పందించేందుకు అరవ శ్రీధర్ వెనుకంజ వేశారు.
Also Read: Pawan Kalyan: అరవ శ్రీధర్ రాసలీలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. సమావేశం నుంచి వాకౌట్
వేధింపులపై కేసు నమోదు
జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీకి ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై లైంగిక దాడి చేశాడని మహిళ జాతీయ మానవ హక్కుల సంఘానికి బాధితురాలు ఫిర్యాదు చేయడంతో.. మానవ హక్కుల సంఘం ఆదేశాల మేరకు తిరుపతి పోలీసులు బీఎన్ఎస్ 318(2), 318(4), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Yumnam Khemchand Singh: జాతుల మధ్య చెలరేగిన హింస మణిపుర్ రాష్ట్రాన్ని రావణకాష్టం చేసింది. వివిధ వర్గాల మధ్య జరిగిన ఘర్షణతో అక్కడ ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. దీంతో ప్రజాస్వామ్య ప్రభుత్వం తొలగిపోయి రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పాలనకు ఏడాది పూర్తికానుండడంతో కేంద్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వాన్ని నెలకొల్పనుంది. ఈ నేపథ్యంలో మణిపూర్కు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. మణిపూర్కు కాబోయే ముఖ్యమంత్రిని బీజేపీ ఎన్నుకుంది.
Also Read: Nandi Awards: టాలీవుడ్కు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. త్వరలోనే నంది అవార్డులు
దేశ రాజధాని ఢిల్లీలో సమావేశమైన బీజేపీ నాయకులు మణిపూర్కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. మణిపూర్ బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు మాజీ మంత్రి యుమ్నం ఖేమ్చంద్ సింగ్ ఎన్నికయ్యారు. త్వరలోనే ఆయన మణిపూర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసనసభ పక్ష నాయకుడిగా ఖేమ్చంద్ను ఎంచుకోగా.. మహిళా నాయకురాలు నెమ్చా కిప్జెన్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మణిపుర్లో కొత్తగా కొలువుదీరే ప్రభుత్వానికి పదవీకాలం 2027 వరకు ఉంది.
Also Read: YS Sharmila: ఉపాధి హామీని మోదీ ఖూనీ చేస్తున్నారు.. అందరం తిరగబడాలి: వైఎస్ షర్మిల
మణిపూర్లో జాతుల మధ్య ఘర్షణలు 2023 మే నుంచి తీవ్ర స్థాయిలో హింస చెలరేగింది. ఘర్షణలతో మణిపుర్ రాష్ట్రం అట్టుడుకిపోయింది. ఈ ఘర్షణలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించగా.. 250 మందికిపైగా మృతి చెందారని సమాచారం. ఇక ఈ ఘర్షణలతో మణిపూర్లో వేలాదిమంది నిరాశ్రయులు కాగా.. లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఘర్షణలు, హింస చెలరేగడంతో నియంత్రించలేని బీజేపీ సీఎం బీరెన్ సింగ్ ఫిబ్రవరి 9, 2025లో తన పదవికి రాజీనామా చేశారు. అతడి రాజీనామాతో మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు. ఏడాది కాలంగా కొనసాగుతున్న రాష్ట్రపతి పాలనతో కొంత ఘర్షణలు, హింసలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం మణిపూర్లో పరిస్థితి చక్కదిద్దుకుందని.. అంతేకాకుండా రాష్ట్రపతి పాలన ఏడాది ముగుస్తుండడంతో అక్కడ ప్రజా ప్రభుత్వం ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిని నియమించారు.
Also Read: Pawan Kalyan: అరవ శ్రీధర్ రాసలీలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. సమావేశం నుంచి వాకౌట్
వస్తున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 9వ తేదీన మణిపుర్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది. మణిపూర్ అసెంబ్లీలో బలాబలాలు పరిశీలిస్తే.. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే స్థానం ఖాళీ ఉండగా.. అత్యధికంగా బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 6 మంది నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్సీపీ), కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఐదుగురు, నాగా పీపుల్స్ ఫ్రంట్ ఐదుగురు ఉన్నారు. ఇద్దరు కుకీ పీపుల్స్ అలయన్స్ నుంచి ఎమ్మెల్యేలు ఉండగా.. జేడీయూ 1, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. మెజార్టీ కన్నా అధికంగా సీట్లు ఉండడంతో మణిపూర్లో బీజేపీ ప్రభుత్వం కొలుదీరబోతున్నది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Re Launch Nandi Awards: సినీ పరిశ్రమకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులు ఇచ్చి ప్రభుత్వం గౌరవించింది. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన అనంతరం సినీ పరిశ్రమకు సంబంధించి అవార్డులు ఆగిపోయాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డులకు పేరు మార్చి అందిస్తుండగా.. ఏపీలో మాత్రం పుష్కర కాలంగా ఎలాంటి అవార్డులు లేదు. తాజాగా నంది అవార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే నంది అవార్డులు ఇస్తామని సినీ పరిశ్రమకు తీపి కబురు వినిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఏప్రిల్ నుంచి అవసరమైన కార్యాచరణను ప్రారంభిస్తామని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు.
Also Read: YS Sharmila: ఉపాధి హామీని మోదీ ఖూనీ చేస్తున్నారు.. అందరం తిరగబడాలి: వైఎస్ షర్మిల
వెలగపూడిలోని సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ఏపీ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ - 2026 పోటీల విజేతలను సత్కరించారు. అనంతరం మంత్రి దుర్గేశ్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో చర్చించి త్వరలోనే నంది అవార్డులు, నంది నాటకోత్సవాల నిర్వహణపై ప్రకటన చేస్తామని తెలిపారు. హైదరాబాద్కు ధీటుగా అమరావతిని సినిమా రంగానికి కేంద్ర బిందువుగా మార్చాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉందని చెప్పారు. సామాజిక చైతన్యంతో కూడినటువంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకులు దిలీప్ రాజా ఏపీలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి చేయాలని నిరంతరం తపిస్తున్నారని మంత్రి దుర్గేశ్ తెలిపారు. సినిమా రంగం అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Also Read: Pawan Kalyan: అరవ శ్రీధర్ రాసలీలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. సమావేశం నుంచి వాకౌట్
ఏపీ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ వివరాలు
ఆంధ్రప్రదేశ్లోని ఔత్సాహిక కళాకారులను మాత్రమే ప్రోత్సహించేందుకు నిర్వహించిన ఏపీ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 203 షార్ట్ ఫిల్మ్ ఎంట్రీలు రాగా 2 వేల మంది నటీనటులు పాల్గొన్నారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు రూ.లక్ష రూపాయల నగదు బహుమతి అందించారు. ఉత్తమ నటిగా సుజిత (మనం), ఉత్తమ కేరెక్టర్ ఆర్టిస్ట్గా సాయి ప్రకర్ష (అబద్దం వర్సెస్ నిజం), ఉత్తమ నటుడు పవన్ శర్మ (మన్ను-మిన్ను), ఉత్తమ బాలనటి హర్షతున్నీసా, యంగ్ టాలెంట్ రిత్విక్ రెడ్డి (అస్త్ర), త్రివిక్రమ్ (డెబ్యూ డైరెక్టర్ ) విలన్ మీసాల భాస్కర్, తెలుగు స్క్రిప్ట్ పరిశీలకులు మంజులూరి లక్ష్మీపతి మాస్టర్, జగదీష్, ఉత్తమ దర్శకత్వం నరేష్ దోనె అవార్డులు పొందారు.
Also Read: Revanth Reddy: తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఎలా అవుతాడు?: రేవంత్ రెడ్డి
షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ విజేతలు వీరే..
ప్రథమ బహుమతి: 'మహావృక్షం'. చంద్రశేఖర్ శకునాల (విశాఖపట్టణం)
ద్వితీయ బహుమతి: సింహాద్రి అప్పన్న, శ్రీనివాసరావు (శ్రీకాకుళం)
తృతీయ బహుమతి: అబద్దం వర్సెస్ నిజం, నవీన్ కుమార్ (పాలకొల్లు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Pawan kalyan wife anna lezhneva visits Warangal Bhadrakali temple: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నాలెజీనోవా వరంగల్ లోని భద్రకాళి అమ్మవారి ఆలయంకు వచ్చారు. ఈ క్రమంలో ఆలయ అర్చకులు, దేవాలయం సిబ్బంది ప్రత్యేకంగా స్వాగతం పలికారు. అదే విధంగా సంప్రదాయ దుస్తుల్లో ప్రసిద్దమైన అమ్మవారి ఆలయంను అన్నా లెజీనోవా దర్శించుకున్నారు. అక్కడ మొక్కులు కూడా తీర్చుకున్నారు. ముఖ్య అర్చకులు వెంకట నాగరాజ శర్మ, వేద పండితులు ప్రదీప్ కుమార్ శర్మ వేదాశీర్వచనం అందించారు.
అమ్మవారి శేషవస్త్రాలను, తీర్థ ప్రసాదాలను పవన్ సతీమణికి అందజేశారు. పవన్ సతీమణి భద్రకాళి అమ్మవారి ఆలయంకు రావడంతో జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. పవన్ సతీమణితో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇటీవల కరీంనగర్ లోని కొండగట్టు అంజన్నస్వామిని దర్శించుకున్నారు.
ఇటీవల నాందేడ్ లోని గురుద్వారాను అన్నా లెజీనోవాతన భర్తతో పాటు కలిసి వెళ్లారు. అక్కడ తలపాగతో కలిసిదిగిన ఫోటోలు బాగా వైరల్గా మారాయి. తన కొడుకుకు గతంలో అగ్ని ప్రమాదంనుంచి బైటపడ్డాక అవకాశం చిక్కినప్పుడల్లా పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి తరచుగా ఆలయాలను సందర్శిస్తు వార్తలలో ఉంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Shani Dev Effect On Zodiac Telugu: రాబోయే ఐదు నెలలు శని గ్రహం రెండుసార్లు సంచారం చేయడంతో అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శని మొదటి నక్షత్ర సంచారంతో పాటు ఆ తర్వాత తిరోగమనం చేయబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో ఏలినాటి శని తో పాటు ఇతర శని ప్రభావాలతో బాధపడుతున్న వ్యక్తులపై ఊహించని ప్రభావం పడుతుంది. కాబట్టి వారి జీవితాల్లో అనేక మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
ఈ ఏడాది మే నెలలో శని గ్రహం నక్షత్ర సంచారం చేయబోతోంది.. మే 17వ తేదీన ఈ గ్రహం రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. అయితే ఈ నక్షత్రానికి బుధుడు అధిపతిగా వ్యవహరిస్తాడని జ్యోతిష్యులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమయంలో శని బుధ రెండు గ్రహాల ప్రభావం కొన్ని రాశుల వారిపై పడబోతుందని.. దీని కారణంగా ఆయారాశుల వారి జీవితాల్లో అనేకమైన మార్పులు సంభవించే అవకాశాలున్నట్లు వారు తెలుపుతున్నారు.
ప్రస్తుతం శని సక్రమ మార్గంలో కొనసాగుతోంది. జూలై 2026 సంవత్సరంలో మీన రాశిలో ఉన్నప్పుడే శని తిరోగమనం చేయబోతోంది. ఈ గ్రహం మొత్తం 138 రోజులపాటు తిరోగమన దిశలో తిరగబోతోంది. దీంతో డిసెంబర్ వరకు కొన్ని రాశుల వారిపై నేరుగా శని ప్రభావం పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు కలిగితే.. మరికొన్ని రాశుల వారికి సానుకూలమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందబోయే రాశులేవో? ఆరు నెలలపాటు ఎవరు అదృష్టాన్ని సొంతం చేసుకుంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
కుంభరాశి
కుంభ రాశి వారికి శని అధిపతిగా వ్యవహరిస్తాడు. కాబట్టి శని తిరోగమన ప్రభావంతో పాటు నక్షత్ర సంచార ప్రభావంతో వీరికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో భారీగా లాభాలను ఆర్జించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో నిజాయితీగా వ్యాపారాలు చేయడం వల్ల భారీ మొత్తంలో డబ్బులు పొందగలుగుతారు. అలాగే వీరు ఈ సమయంలో వ్యాపారాల్లో పెట్టుబడును పెట్టడం కూడా చాలా మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, ఈ సమయంలో కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి.
మీన రాశి
మీన రాశి వారికి శని తిరోగమన ప్రభావం, నక్షత్ర సంచారం వల్ల ఉద్యోగాలపరంగా విపరీతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో కృషికి తగ్గ ప్రతిఫలం లభించబోతోంది. అలాగే మీ జీవితంపై శని ప్రత్యేకమైన ప్రభావం పడి.. ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ప్రేమ సంబంధాల్లో మెరుగుదల కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో వీరికి పెళ్లిళ్లు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మేషరాశి
శని ప్రభావంతో మేషరాశి వారికి చాలా మేలు జరుగుతుంది. వీరికి ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ ఈ సమయంలో కొన్ని అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఖర్చులు భారీగా నియంత్రణలో ఉంటాయి. ఆర్థికంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. అలాగే అంతర్జాతీయ కంపెనీలో పనులు చేసే వ్యక్తులకు అద్భుతమైన బహుమతులు లభిస్తాయి. ప్రేమ జీవితంలో కాస్త జాగ్రత్తగా ఉండడం మేలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆర్థికపరంగా లావాదేవీలు చేసే క్రమంలో కూడా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Oppo K14x 5g Launch Date In India Telugu: ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ కంపెనీ ఒప్పో వచ్చేవారం భారత మార్కెట్లోకి తమ కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ ఒప్పో k14 ఎక్స్ అనే పేరుతో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఇప్పటికీ ఈ మొబైల్కు సంబంధించిన కొన్ని వివరాలను అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల సోషల్ మీడియాలో మాత్రం ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన కొన్ని రకాల ఫీచర్స్తో పాటు వేరియన్స్ వివరాలు లీకయ్యాయి. అవేంటో? ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఒప్పో K14x స్మార్ట్ఫోన్ గతంలో విడుదల చేసిన అన్ని మొబైల్స్ డిస్ప్లే కంటే ప్రత్యేకమైన పెద్ద 6.75-అంగుళాల HD+ డిస్ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. దీంతోపాటు ఇది ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో రన్ అవుతుంది. అలాగే ఈ స్మార్ట్ఫోన్ను కంపెనీ గతంలో విడుదల చేసిన ఒప్పో K13x 5G మొబైల్కి సక్సెస్గా విడుదల చేయబోతోంది.
ఇప్పటికే ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన మైక్రోసైట్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంది. ఇందులో ఉన్న వివరాల ప్రకారం కంపెనీ ఒప్పో k14 ఎక్స్ స్మార్ట్ఫోన్ను భారతదేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 10న లాంచ్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది గత మోడల్స్ కంటే అద్భుతమైన డిజైన్తో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది కె సిరీస్ స్మార్ట్ ఫోన్స్ మాదిరిగానే కొన్ని ప్రత్యేకమైన స్పెసిఫికేషన్స్ కలిగి ఉంటుంది.
ముఖ్యంగా ఈ మొబైల్ వెనక భాగంలో పిల్ ఆకారపు కెమెరాను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు రెండు ప్రత్యేకమైన కెమెరాలతో పాటు LED ఫ్లాష్ లైట్ను కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ మొబైల్ ColorOS 15 పై రన్ అవుతుంది. ఇక ఈ మొబైల్ కెమెరాలు ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ని కూడా కలిగి ఉంటాయి. ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన రెండు కెమెరాలు వివరాల్లోకి వెళితే.. ఇందులో రెండు 50-మెగాపిక్సెల్ కెమెరా ప్రధాన కెమెరాలు ఉంటాయి. అలాగే 45 W ఛార్జింగ్ సపోర్టుతో ఎంతో శక్తివంతమైన 6,500 mAh బ్యాటరీతో విడుదల కాబతునట్లు తెలుస్తోంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 17 గంటల వరకు నాన్ స్టాప్ వీడియో ప్లే బ్యాక్ అందిస్తుంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ఈ స్మార్ట్ఫోన్లు ఇవే కాకుండా మరెన్నో అద్భుతమైన ఫీచర్లను ఒప్పో కంపెనీ అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ పరంగా మాత్రం కాస్త కొత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొన్ని కొత్త కలర్స్లో ఈ మొబైల్ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ అతి త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశాలున్నాయి.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cobra Hood Video Watch Now: ఓ నగర శివారులో సాయంత్రం పూట నాగుపాము ప్రత్యక్షమవడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. అయితే స్థానికుల సమాచారం మేరకు అక్కడికి వన్యప్రాణి సంరక్షకులు చేరుకొని ఆ పాముని రెస్క్యూ చేశాడు ఈ సందర్భంలో తీసిన వీడియో ఇప్పుడు ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. మున్నా అనే స్నేక్ క్యాచర్ పట్టుకున్న అత్యంత ప్రమాదకరమైన పామును ఓ డబ్బాలో బంధించాడు. ఇలా బంధించిన పామును వీడియో తీసి సోషల్ మీడియాలో సరదాగా పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్లో వైరల్ అవుతుంది. ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ తెల్లని ప్లాస్టిక్ డబ్బాలలో అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా ను బంధించిన దృశ్యాలు మీరు చూడొచ్చు. అలాగే ఆ డబ్బాలో పాము ఎంతో భయానకంగా పడగవిప్పి బయటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సందర్భం కూడా మీకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ వీడియోలో ఆ పాము ఆకారం, దాని వెనక భాగంలో ఉండే పడగా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఆ పాము అలాగే పడక విప్పి ఉండిపోయింది.. స్నేక్ క్యాచర్ బృందం ఆ పాము ఎప్పుడైనా బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయని.. వారు అక్కడే అది బయటికి రాకుండా కాపలాగా ఉండడం మీరు చూడొచ్చు
సుమారు 30 సెకండ్ల నిడివి గల ఈ వీడియోలో ఆ కోబ్రా ఎంత ఉగ్రరూపం లో ఉందో మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ వీడియోలో ఆ పాము పదేపదే పడగలను అటు ఇటు కదుపుతూ.. తన రక్షణ కోసం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. స్నేక్ క్యాచర్స్ కూడా పాము కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచి డబ్బాలోనే బంధించినట్లు తెలుస్తోంది. అందుకే ఆ పాము ఏమాత్రం బయటికి రాలేకపోయింది.
గత కొద్ది రోజుల నుంచి ఇలా పాములు అడవుల్లో నుంచి జనాభాసాల మధ్యలోకి వస్తున్నాయి. ఇవి ప్రమాదమని భావించి కొంతమంది వీటిని చంపేస్తున్నారు.. నిజానికి ఇలా చేయడం వల్ల ప్రకృతికి ఎంతో హాని కలిగే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలా వన్యప్రాణులను చంపే బదులు.. మీకు దగ్గరలో ఉన్న వన్యప్రాణి సంరక్షకులకు సమాచారం అందించడం మేలు. వాళ్లు ఇలాంటి పాములను పట్టికెళ్లి సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెడతారు. తద్వారా పర్యావరణ సమతుల్యత పెరుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook