మల్కాజిగిరి లో గురు పౌర్ణమి వేడుకలు
Hyderabad, Telangana:మల్కాజిగిరి : గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు మల్కాజిగిరి లోని సాయిబాబా దేవాలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి వేడుకలకు భక్తులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Hanuman Jayanthi: రేపు హనుమాన్ జయంతి.. తిరుమల జాపాలి తీర్థంలో భారీ ఏర్పాట్లు
Tirupati Urban, Andhra Pradesh:Tomorrow Hanuman Jayanthi: తిరుమల కొండల్లో కొలువుదీరిన హనుమంతుడికి రేపు పెద్ద ఎత్తున పూజలు, ఉత్సవాలు జరగనున్నాయి. హనుమంతుడు జన్మించాడని చెబుతున్న జాపాలి తీర్థంలో హనుమాన్ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయగా.. హనుమాన్ జయంతికి జాపాలి తీర్థం ముస్తాబైంది.
Also Read: Harish Rao: గుప్త నిధుల వేటలో 800 ఏళ్ల శివాలయం రేవంత్ రెడ్డి కూల్చివేత: హరీశ్ రావు
హనుమాన్ జయంతి సందర్భంగా తిరుమల గిరులు హనుమ నామస్మరణతో మారుమోగుతున్నాయి. అంజనీపుత్రుడు జన్మించిన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందిన జపాలి తీర్థం హనుమాన్ జయంతి వేడుకలకు సర్వంగాసుందరంగా ముస్తాబైంది. రేపు జరగనున్న ఈ వేడుకల కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హనుమంతుడు జపాలిలోనే జన్మించాడని పురాణ చరిత్ర చెబుతుండగా.. టీటీడీ కూడా ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. దీంతో ఈ క్షేత్రానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది.
Also Read: Chandrababu: ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇవ్వండి.. కేంద్ర మంత్రులకు చంద్రబాబు విజ్ఞప్తి
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జపాలి ఆంజనేయ స్వామి ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, సుగంధభరిత పుష్పాలతో అత్యంత శోభాయమానంగా అలంకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లు, తాగునీరు, అన్నప్రసాదం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. రేపు జయంతి సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు సిబ్బందిని నియమించారు.
ఏడు కొండల పైన వెలసిన అద్భుత క్షేత్రం జపాలి తీర్థం. వాయుపుత్రుడు హనుమంతుడు ఇక్కడే జన్మించాడనే చారిత్రక ఆధారాలతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రేపు హనుమాన్ జయంతి కావడంతో జపాలిలోని ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించేందుకు ఆలయ అర్చకులు సిద్ధమయ్యారు. దట్టమైన అడవి మధ్యలో ఉండే ఈ క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో రవాణా, భద్రతా పరంగా టీటీడీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Chandrababu: ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇవ్వండి.. కేంద్ర మంత్రులకు చంద్రబాబు విజ్ఞప్తి
New Delhi, Delhi:Chandrababu Delhi Tour: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర పథకాలతోపాటు గతంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు సాగునీటి అవసరాలకు సంబంధించి విజ్ఞప్తులు చేశారు. ప్రధానంగా జల వనరులకు సంబంధించి అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి వివరించి వాటికి సంబంధించి అనుమతులు, నిధులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు.
Also Read: Dowry Death: 45 రోజులకే నవ వధువు ఆత్మహత్య.. బైక్ అంటే బైక్, పొలం అంటే పొలం ఇచ్చినా భర్త వేధింపులు
ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు, ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వేర్వేరుగా భేటీ అయ్యారు. విభజన అంశాలతో పాటు వివిధ పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల్ని మంజూరు చేయాలని కేంద్ర హోం మంత్రికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర బడ్జెట్లో చేసిన కేటాయింపులతో పాటు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందించాలని కోరారు.
Also Read: Hyderabad Public: ఇంట్లో పనివారుగా నేపాలీలు వద్దు.. ప్రజలకు పోలీస్ కమిషనర్ సూచన
అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో సీఎం, మంత్రి సమావేశమై కీలక అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన అంశాలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. 2027 గోదావరి పుష్కరాల లోపు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పూర్తి చేసేందుకు పూర్తి సహకారం అందించాలని విన్నవించారు. తొలిదశలో 41.15 మీటర్ల మేర నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు.
'2026 ఏప్రిల్ 2 నాటికి కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తి అయ్యింది. గ్యాప్ 1, గ్యాప్ 2లలో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్లో ఉందనే కారణంతో 2011లో ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్ ఉత్తర్వులను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలి' అని కేంద్ర జల శక్తి మంత్రిని సీఎం చంద్రబాబు కోరారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా చేపట్టేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సాగునీటి అవసరాల దృష్ట్యా మొదట నిర్ణయించిన దాని కంటే కుడి, ఎడమ కాలువల సామర్ధ్యాన్ని 17,500 క్యూసెక్కులకు పెంచినట్టు.. ప్రస్తుతం కుడి కాలువ 95 శాతం మేర ఎడమ కాలువ పనులు 78 శాతం మేర పూర్తి అయినట్టు కేంద్ర మంత్రికి ఇచ్చిన లేఖలో వివరించారు. ప్రాజెక్టు తదుపరి పనులకు సంబంధించి అవసరమైన నిధులను కూడా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.
హర్ ఖేత్ కో పానీ పథకం నిధులు
కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్తో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద రాష్ట్రంలోని వివిధ పథకాల పునరుద్ధరణ, ఆధునీకరణకు నిధుల అంశాన్ని కూడా సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. హర్ ఖేత్ కో పానీ కార్యక్రమంలో భాగంగా చెరువులు, కుంటల మరమ్మతులు, పునరుద్ధరణ ,ఆధునీకరణ, కాలువల పూడికతీత, గట్ల బలోపేతం లాంటి పనులు చేపట్టాల్సి ఉందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 297 నీటి వనరుల పునరుద్ధరణ కోసం రూ.285 కోట్ల నిధులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు కోరారు.
సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేంతవరకు ఆలమట్టి ఎత్తు పెంచే అంశంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయవద్దని.. ఆనకట్ట ఎత్తును 519.60 మీటర్ల నుండి 524.256 మీటర్లకు పెంచితే ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని కేంద్ర మంత్రి వద్ద సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంపునకు ఎలాంటి సాంకేతిక, పాలనా పరమైన అనుమతులు మంజూరు చేయరాదని కోరారు. గోదావరి నుంచి సముద్రంలోకి వృథాగా పోయే 200 టీఎంసీల వరద జలాలను మళ్లించేలా.. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల దాహార్తిని తీర్చే పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Harish Rao: గుప్త నిధుల వేటలో 800 ఏళ్ల శివాలయం రేవంత్ రెడ్డి కూల్చివేత: హరీశ్ రావు
Narsampet, Telangana:Ashok Nagar Ancient Shiva Temple Vandalise: 'బడులు ఆగమే కాదు రేవంత్ రెడ్డి పాలనలో ఏకంగా గుడుల విధ్వంసం కూడా జరుగుతోంది. ఆనాడు కేసీఆర్ మన ఊరు-మన బడి పెడితే రేవంత్ రెడ్డి దాన్ని అర్ధాంతరంగా నిలిపేశారు. రేవంత్ రెడ్డి పుణ్యమా అని ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి వంద శాతం రుణమాఫీ చేయకుండా మాట తప్పిన తొలి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయనకు దేవుడంటే భయం లేదు, భక్తీ లేదు' అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
Also Read: DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్పాట్.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ధ్వంసం చేసిన 800 ఏళ్ల చరిత్ర కలిగిన కాకతీయుల మట్టికోట శివాలయాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సందర్శించారు. కూల్చివేతకు గురైన ఆలయ ప్రాంగణంలో స్థానికులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మాజీ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: Hyderabad Public: ఇంట్లో పనివారుగా నేపాలీలు వద్దు.. ప్రజలకు పోలీస్ కమిషనర్ సూచన
'తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి లాంటి మహా పుణ్యక్షేత్రాలను నిర్మిస్తే.. రేవంత్ రెడ్డి మాత్రం హైడ్రా పేరుతో పేదల ఇండ్లు, మసీదులు, చర్చీలు, ఇప్పుడు ఏకంగా గుడులు కూలగొడుతున్నాడు. విశాఖ పీఠం కూలుస్తా అని మొన్న అధికారులను పంపాడు' అని మాజీ మంత్రి హరీశ్ రావు వివరించారు. గతంలో సచివాలయానికి వెళ్తే లంకె బిందెలు దొరుకుతాయనుకున్నా అని రేవంత్ రెడ్డి అన్న మాటను గుర్తుచేశారు. 'ఆయన అనుచరులతో కలిసి నిజాం భవనాల చుట్టూ గుప్త నిధుల కోసం బాగానే వెతికాడు. అక్కడ దొరకకపోయే సరికి ఇప్పుడు కాకతీయుల గుడుల మీద పడ్డాడు. అశోక్ నగర్లో కాకతీయ గణపతి దేవుడు నిర్మించిన 800 ఏళ్ల నాటి అద్భుతమైన శివాలయాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చేశారు. ఆలయ రక్షణ కోసం ఉన్న అతిపెద్ద మట్టి ఆనకట్టను తొలుచుకుంటూ వెళ్లి మరీ గర్భగుడిని ధ్వంసం చేశారు' అని మాజీ మంత్రి హరీశ్ రావు వివరించారు.
'రాత్రి 12 నుంచి 1 గంట మధ్య చీకట్లో గర్భగుడి కింద ఏకంగా 24 అడుగుల లోతు భారీ గుంత తవ్వారు. స్కూల్ కట్టే పనైతే పగలు చేయొచ్చు కదా? అర్ధరాత్రి ఎందుకు తవ్వారు? గుప్త నిధుల వేటలో రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే ఈ కుట్ర జరిగింది' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. 'ఇది గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకమే అని పురావస్తు శాఖ జిల్లా అధికారి బుజ్జి ఈ నెల 7వ తేదీన కలెక్టర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆర్కియాలజీ అధికారి కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కాలేదు, మిషనరీ సీజ్ చేయలేదు, ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. అంటే దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందన్నది స్పష్టం' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
'బీఆర్ఎస్ పార్టీ హయాంలో ధరణిలో ఇది దేవాలయ భూమిగా ఉంటే.. కాంగ్రెస్ రాగానే భూభారతిలో రాత్రికి రాత్రే ప్రభుత్వ భూమిగా ఎట్లా మారింది? స్కూల్ కట్టడానికి చుట్టూ కావలసినంత స్థలం ఉంది. అసలు ఈ నియోజకవర్గంలో వేరే చోట జీవో వచ్చిన స్కూల్ను ఇక్కడికి ఎందుకు మార్చారు. గుడి ఉన్నకాడ బడి కట్టొచ్చు, కానీ పోయిపోయి గుడినే కూలగొట్టడం ఎందుకు?' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. పురావస్తు శాఖ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, బాధ్యులను అరెస్ట్ చేసి మిషనరీని సీజ్ చేయాలని చేయాలని డిమాండ్ చేశారు.
'యుద్ధప్రాతిపదికన ఈ చారిత్రక శివాలయాన్ని పునరుద్ధరించాలి. 1958 చట్టం ప్రకారం వందేళ్లు దాటిన కట్టడాలు ఆర్కియాలజీ పరిధిలోకి వస్తాయి కాబట్టి, ఈ స్థలాన్ని తక్షణమే పురావస్తు శాఖకు అప్పగించాలి. అర్ధరాత్రి తవ్వకాల్లో బయటపడ్డ గుప్త నిధులు, లంక బిందెలు ఏ ప్రభుత్వ పెద్దల ఇళ్లకు పోయాయో సమగ్ర విచారణ జరగాలి' అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కోరారు. ఈ గుడి కూల్చివేతపై సీవీసీకి, విజిలెన్స్కు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.
'విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి స్కూళ్ల టెండర్లలో భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. ఒక్క టెండర్ కూడా మైనస్కు పోకుండా అన్నీ ఎక్సెస్కే ఎట్లా పోయాయి? ఈ స్కూళ్ల టెండర్లలో ఏకంగా రూ.494 కోట్ల ఎక్సెస్ అమౌంట్ ద్వారా ప్రజాధనం లూటీ అయ్యింది' అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. తమకు అనుకూలంగా ఉండేందుకు ఒక రిటైర్డ్ అధికారిని చీఫ్ ఇంజనీర్గా పెట్టుకుని ఈ రూ.500 కోట్ల దోపిడీకి తెరతీశారని తెలిపారు.
'కాంట్రాక్టర్లు నా మనుషులైతే టెండర్లు రద్దు చేయి. టెండర్లు దక్కించుకున్న వాళ్లు హరీశ్ రావు మనుషులే అని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. వాళ్లు నా మనుషులే అయితే వెంటనే ఆ టెండర్లను రద్దు చేయి. నేనే కదా రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నది. మొన్న హ్యామ్ రోడ్ల పేరుతో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల్లో 25 శాతం ఎక్సైస్తో జరిగిన రూ.5 వేల కోట్ల కుంభకోణాన్ని అసెంబ్లీలో బయటపెట్టి పోరాడింది నేనే. అవి నీ మనుషులా? నా మనుషులా? అన్నది కాదు. అది రాష్ట్ర ప్రజల చెమట చుక్కల ఆదాయం' అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు. ఈ పర్యటనలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, ధాస్యం వినయ్ భాస్కర్, ఆరూరి రమేశ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్పాట్.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు
Doni, Karnataka:Govt Employees DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ కానుక ప్రకటించింది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కరువు భత్యం (డియర్నెస్ అలవెన్స్) ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 1.50 శాతం డీఏ పెంచుతూ కర్ణాటక ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. తాజా పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏలో 15.75 శాతం పెరుగుదల రానుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ వర్గాల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన డీఏ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Bandi Bageerath POCSO: బండి భగీరథను దేశం దాటించొద్దు.. లుకౌట్ నోటీస్ ఇవ్వాలి: మాజీ ఐపీఎస్
కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ)ను 1.50 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 సవరించిన పే స్కేళ్లలో జీతం పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు.. 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా కరువు భత్యం (డీఏ) ధరలను పెంచాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ డీఏ పెంపును మూల వేతనంలో ప్రస్తుతం ఉన్న 14.25 శాతం నుంచి 15.75 శాతానికి సవరించారు. ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు కరువు భత్యాన్ని 2 శాతం పెంచాలని ఆదేశించగా.. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం తన ఉద్యోగులకు 1.50 శాతం డీఏ పెంచడం గమనార్హం. పెంచిన డీఏ 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read: Dowry Death: 45 రోజులకే నవ వధువు ఆత్మహత్య.. బైక్ అంటే బైక్, పొలం అంటే పొలం ఇచ్చినా భర్త వేధింపులు
ప్రాథమిక వేతనం అంటే ప్రభుత్వ ఉద్యోగి అతడు నిర్వర్తించే పదవికి వర్తించే వేతన స్కేలులో పొందుతున్న వేతనం. కర్ణాటక సివిల్ సర్వీసెస్ (సవరించిన వేతన) నియమావళి- 2024 ప్రకారం ఉద్యోగికి మంజూరు చేసిన వ్యక్తిగత వేతనం (ఏదైనా ఉంటే), వేతన స్కేలు గరిష్ట స్థాయికి మించి సిబ్బందికి మంజూరు చేసిన ఏవైనా అదనపు వేతన పెంపులకు అదనంగా కరువు భత్యం చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది.
రాష్ట్ర సంఘటిత నిధి నుంచి పింఛన్, కుటుంబ పింఛన్ పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ పింఛన్దారులు/ కుటుంబ పింఛన్దారులు, సహాయక విద్యా సంస్థల పింఛన్దారులు/ కుటుంబ పింఛన్దారులకు కూడా ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వారికి అందించే డియర్నెస్ రిలీఫ్ను ప్రభుత్వం పెంచింది. ప్రస్తుత ప్రాథమిక పింఛన్/ కుటుంబ పింఛన్లో 14.25 శాతం నుంచి 15.75 శాతానికి పెంచడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Also Read: Hyderabad Public: ఇంట్లో పనివారుగా నేపాలీలు వద్దు.. ప్రజలకు పోలీస్ కమిషనర్ సూచన
పెంచిన డీఏ, డీఆర్ ప్రభుత్వ, జిల్లా పంచాయతీల పూర్తికాల ఉద్యోగులకు, తాత్కాలిక పే స్కేళ్లలోని పూర్తికాల వర్క్చార్జ్ ఉద్యోగులకు, ప్రభుత్వం నుంచి సహాయం పొందుతున్న విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలలోని తాత్కాలిక పే స్కేళ్ల పూర్తికాల ఉద్యోగులకు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Palnadu Railway Facilities: కేంద్ర రైల్వే మంత్రితో ఎంపీ లావు భేటీ..పల్నాడు రైల్వే అభివృద్ధిపై కీలక ప్రతిపాదనలు
Narasaraopeta, Andhra Pradesh:MP Sri Krishnadevarayalu Meets Ashwini Vaishnaw: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో తెలుగుదేశం ఫ్లోర్ లీడర్ ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. ఆయన ప్రాతినిధ్యంలో నరసరావుపేట కేంద్రంగా నిలిచిన పల్నాడు జిల్లాలో రైల్వే మౌలిక సదుపాయాలను ఏర్పాటుకు విన్నవించుకునేందుకు రైల్వే మంత్రిని నేడు కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని దీర్ఘకాలిక సమస్యలు, నూతన రైల్వే లైన్ల అవశ్యకతను వివరిస్తూ మంత్రికి వినతిపత్రం సమర్పించారు.
ఈ భేటీలో చర్చించిన మూడు కీలక అంశాలు..
1. పిడుగురాళ్ల - రామాయపట్నం కొత్త రైల్వే లైన్
పల్నాడు ప్రాంతంలోని సిమెంట్, సున్నపురాయి పరిశ్రమలతో పాటు వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా పిడుగురాళ్ల నుంచి రామాయపట్నం పోర్టు వరకు కొత్త రైల్వే లైన్ నిర్మించాలని ఎంపీ భావిస్తున్నారు. ఈ అనుసంధానం వల్ల రవాణా ఖర్చులు తగ్గాయని, పారిశ్రామికంగా ప్రాంతం అభివృద్ధి చెందడమే కాకుండా స్థానిక యువతకు భారీగా ఉపాధి లభిస్తుందని వివరించారు.
2. విజయవాడ - బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్
పల్నాడు జిల్లా నుండి బెంగళూరుకు వెళ్లే ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తల సంఖ్య ఎక్కువగా ఉన్న దృష్ట్యా, విజయవాడ - బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, అధునాతన రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
రైల్వే సమస్యల పరిష్కారానికి చొరవ చూపండి
ప్రజలకు రైల్వే సదుపాయాలు మెరుగుపరచాలనే సంకల్పంతో ఈరోజు ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ అశ్విని వైష్ణవ్ గారిని కలిసి మూడు కీలక ప్రతిపాదనలు వారి ముందు ఉంచడమైనది. సంబంధించిన వినతి పత్రాన్ని మంత్రి గారికి సమర్పించడం… pic.twitter.com/A8GmryYvNH
— Lavu Sri Krishna Devarayalu (@SriKrishnaLavu) May 11, 2026
3. సూపర్ఫాస్ట్ రైళ్ల స్టాపేజ్
స్థానిక ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ప్రధాన రైళ్లకు స్టేజీలు కల్పించాలని ఆ విధంగా నిబంధనల్లో మార్పులు చేయాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు రైల్వే మంత్రిని ఈ సందర్భంగా కోరారు. సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ (20701), లింగంపల్లి - విజయవాడ ఎక్స్ప్రెస్ (12796).. ఈ రెండు రైళ్లను నడికుడి లేదా పిడుగురాళ్ల స్టేషన్లలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. పల్నాడు ప్రాంత రైల్వే అభివృద్ధికి అవసరమైన సాంకేతిక నివేదికలను పరిశీలించి, త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ భేటీతో పల్నాడు రైల్వే దృశ్యం మారనుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Also REad: Peddi Trailer Launch: మెగా ఫ్యాన్స్కు గుడ్న్యూస్..'పెద్ది' సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
CM Vijay Visits Stalin: తమిళనాడులో మరో సంచలనం..మాజీ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లిన సీఎం విజయ్!
Eragudi North, Tamil Nadu:CM Vijay Visits Stalin Residence: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన విజయ్.. నేడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ ప్రమాణం పూర్తవ్వగానే.. మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎండీఎంకే నేత వైగో ఇంటికి వెళ్లినట్లు సమాచారం.Peddi Trailer Launch: మెగా ఫ్యాన్స్కు గుడ్న్యూస్..'పెద్ది' సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది! ఎప్పుడంటే?
Hyderabad, Telangana:Peddi Trailer Release Date: మెగా ఫ్యాన్స్ ఎప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు దగ్గర పడుతోంది. ఎన్నో వాయిదాల తర్వాత 'పెద్ది' సినిమా గ్రాండ్ రిలీజ్కు ముస్తాబవుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ ముద్దుగుమ్మ హీరోయిన్గా నటించిన 'పెద్ది' చిత్ర ట్రైలర్ విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ సినిమా ట్రైలర్ను మే 18న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.
ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో భారీ ఆదరణ పొందాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో, చిత్ర బృందం ఉత్తర భారతదేశం, ఇతర కీలక మార్కెట్లలో విస్తృత ప్రమోషన్స్ కార్యక్రమాలను ప్లాన్ చేస్తోంది. ప్రాంతీయ, భాషా అడ్డంకులను అధిగమించి ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యి, దేశవ్యాప్తంగా బ్లాక్బస్టర్గా నిలిచే సత్తా 'పెద్ది'కి ఉందని చిత్ర బృందం బలంగా విశ్వసిస్తోంది.
బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఈ గ్రామీణ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4న థియేటర్లలోకి రానుంది. విడుదలకు కేవలం 23 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, ట్రైలర్ విడుదల కార్యక్రమంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి. ట్రైలర్ విడుదల తర్వాత హీరో రామ్ చరణ్ పూర్తిగా ప్రమోషన్స్ కోసం దేశవ్యాప్తంగా పర్యటన చేయనున్నారని తెలుస్తోంది. 
'పెద్ది' సినిమా కోసం నార్త్ ఇండియన్ ఫ్యాన్స్ను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని బిగ్ ఈవెంట్స్ను కూడా నార్త్ ఇండియాలోనే ప్లాన్ చేసే అవకాశం కనిపిస్తోంది. 'పెద్ది' చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా..ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు, వృద్ధి సినిమాస్ బ్యానర్పై మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో నిర్మించారు. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా క్రికెట్, కుస్తీ ఆటపై ప్రధానంగా కథ అలుముకోని ఉంటుందని తెలుస్తోంది. మరికొందరు కోడి రామమూర్తి బయోపిక్ అని అంటున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.
ఇప్పటికే 'పెద్ది' సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. యూట్యూబ్లో 'చికిరీ' పాట 100 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకోగా.. అదే బాటలో రెండో సాంగ్ 'రయ్ రయ్ రారా' దూసుకుపోతుంది. అదే విధంగా ఈ సినిమాలో మరో ఐటెమ్ సాంగ్ ఉందని సమాచారం. ఇందులో తమిళ నటి శ్రుతి హాసన్ ఆడిపాడినట్లు తెలుస్తోంది.
Also Read: మహేష్ బాబు మేనకోడలిని చూశారా? హీరోయిన్లనే మించిన అందం..క్యూట్లో క్వీన్!
Also Read: Malavika Mohanan Photos: పొట్టిపొట్టి బట్టల్లో సెగ పుట్టిస్తున్న బ్యూటీ..అందంలో గత్తరలేపేస్తుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bandi Bageerath POCSO: బండి భగీరథను దేశం దాటించొద్దు.. లుకౌట్ నోటీస్ ఇవ్వాలి: మాజీ ఐపీఎస్
Kagaznagar, Telangana:Bandi Sai Bageerath POCSO Case: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకుపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని, అవసరమైతే అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలకు నోటీసులు పంపాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సాయి భగీరథ్ ఎక్కడ కనిపించినా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవాలని కోరారు. సాయి భగీరథ్ ఆచూకీ తెలిపిన వారికి బహుమతి ఇస్తామని తెలుపుతూ సైబరాబాద్ పోలీసులు రివార్డు ప్రకటించాలని కోరారు. బండి భగీరథ్పై కేసు నమోదై మూడు రోజులు గడుస్తున్నా ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు.
Also Read: Dowry Death: 45 రోజులకే నవ వధువు ఆత్మహత్య.. బైక్ అంటే బైక్, పొలం అంటే పొలం ఇచ్చినా భర్త వేధింపులు
బండి భగీరథ్ పోక్సో కేసుపై కాగజ్నగర్లోని తమ నివాసంలో సోమవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. 'బాధిత కుటుంబాన్ని బెదిరించి, కేసు వాపస్ తీసుకోవాలని భయపెట్టడానికి పోలీసులే కావాలని అరెస్ట్ చేయడం లేదు. నిందితుడికే పోలీసులు సహకరిస్తున్నారు' అని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. 'బాధిత అమ్మాయి తల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వెళ్తే పేట్ బషీరాబాద్ పోలీసులు 5 గంటల పాటు ఎందుకు పట్టించుకోలేదు? బండి సాయి భగీరథ్ అమ్మాయిపై ఫిర్యాదు చేసిన 2 నిమిషాల్లోనే ఎలా ఎఫ్ఐఆర్ చేశారో పోలీసులు సమాధానం చెప్పాలి' అని డిమాండ్ చేశారు.
Also Read: Hyderabad Public: ఇంట్లో పనివారుగా నేపాలీలు వద్దు.. ప్రజలకు పోలీస్ కమిషనర్ సూచన
నిర్లక్ష్యం వహించిన ఇన్స్పెపెక్టర్, ఏసీపీలను బాధ్యులైన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని రాష్ట్ర డీజీపీని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. పోలీసులు సాయి భగీరథ్పై ఉద్దేశ్యపూర్వకంగా సెక్షన్ 11, 12 ప్రకారం చిన్న చిన్న కేసులు నమోదు చేశారు. వాస్తవానికి సెక్షన్ 7, 8 ప్రకారం నిందితుడు బండి భగీరథ్పై కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష పడేలా కేసులు పెట్టాలి. నిందితుడిపై సెక్షన్ 6 ప్రకారం కూడా కేసు పెట్టాలి' అని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. సైబరాబాద్ పరిధిలో ఉన్న ఎస్ఓటీ, టాస్క్ఫోర్స్ పోలీసులు ఏం చేస్తున్నారు? నిందితుడిని ఎందుకు పట్టుకోవడంలేదని ప్రశ్నించారు.
హైదరాబాద్లో మాజీ డీజీపీ భార్యను హత్య చేసినా అడిగే నాథుడే లేడని.. తెలంగాణలో శాంతి భద్రతలు ప్రమాదంలో ఉన్నాయని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి హోం శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా విఫలమయ్యారని మండిపడ్డారు. 'లక్ష మంది పోలీసులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వంటివి ఉన్నాయి. ఘటన జరిగినప్పటి నుండి ఇప్పటివరకు ఎందుకు ఆధారాలు సేకరించలేదు. అత్యాచారానికి పాల్పడిన ప్రాంతాలను ఎందుకు సందర్శించలేదు' అని ప్రశ్నించారు.
'బండి సంజయ్ కొడుకును కాపాడడం కోసం రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్లో భాగంగా ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్ కేసులు బయటకు తీయాలని చూస్తున్నారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఈడీ కేసులు, సీబీఐ కేసులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి భయపడి ఒక మైనర్ అమ్మాయికి అన్యాయం చేయాలని చూస్తున్నారు' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుఆర్ ఆరోపించారు. 'కాంగ్రెస్ నాయకులు మైనర్ అమ్మాయికి ఎందుకు న్యాయం చేయడం లేదు. కాంగ్రెస్ మంత్రులు, మహిళా నాయకురాలు ఎందుకు పోక్సో కేసు గురించి మాట్లాడడం లేదు' అని ప్రశ్నించారు.
'బీజేపీ అగ్రనాయకత్వం బేటీ బచావో అని చెబుతుంటే.. బండి సంజయ్ బేటా బచావో అమలు చేస్తోంది. మైనర్ అమ్మాయిని వేధించిన మంత్రిని ప్రధాని మోదీ తన పక్కన కూర్చోబెట్టుకున్నందుకు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మహిళలకు మోడీ ఇచ్చే గౌరవం ఇదేనా?' అని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. 'బండి సంజయ్ తన కుమారుడు ఎలాంటి తప్పు చేయకపోతే పోలీసులకు అప్పగించి విచారణకు సహకరించాలి' అని కోరారు. మూడు రోజులుగా పోలీసుల మౌనం అనేక అనుమానాలు కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్లు
==> బాలల హక్కుల కమిషన్, మానవ హక్కుల సంస్థలు స్పందించి రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీ, డీజీపీకు లేఖలు రాసి నిందితుడిని అరెస్ట్ చేయించాలి
==> బాధిత కుటుంబాన్ని బెదిరించిన బండి సంజయ్ను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి.
==> బాధితులను బెదిరించిన వీ6 మాజీ రిపోర్టర్, బీజేపీ అధికార ప్రతినిధి సంగప్పతోపాటు బండి సంజయ్ను ఏ2, సంగప్ప ఏ3గా ఎఫ్ఐఆర్లో చేర్చాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Srisailam Booking Scam: శ్రీశైల మల్లన్న భక్తులకు అలర్ట్..రూమ్ బుకింగ్ పేరుతో యాత్రికులకు టోకరా..తస్మాత్ జాగ్రత్త!
Srisailam, Andhra Pradesh:Srisailam Room Booking Scam: నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని భావించే భక్తులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపారు. ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే భక్తుల భక్తిని ఆసరాగా చేసుకుని, "నకిలీ వెబ్సైట్ల" ద్వారా నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ వెబ్సైట్లు ఇప్పుడు జిల్లాలో కలకలం సృష్టిస్తున్నాయి.
ఇటీవల కాలంలో మంత్రాలయం, అహోబిలం క్షేత్రాలలో వరుసగా సైబర్ మోసాలు వెలుగు చూశాయి. తాజాగా, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం మల్లన్న భక్తులు కూడా ఈ కేటుగాళ్ల వలలో చిక్కుకున్నారు. సేవలు, ప్రత్యేక దర్శనాలు, ఏసీ గదుల బుకింగ్ పేరుతో నకిలీ వెబ్సైట్లు సృష్టించి, భక్తుల నుంచి భారీగా నగదు వసూలు చేస్తున్నారు. తీరా ఆలయానికి చేరుకున్నాక గానీ, తాము బుక్ చేసుకున్న టిక్కెట్లు చెల్లవని భక్తులు తెలుసుకోలేకపోతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడమే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు.
అధికారుల హెచ్చరిక..
ఈ ఘటనలపై స్పందించిన దేవస్థాన అధికారులు, ఆలయ ఈవో, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గదులు లేదా దర్శన టిక్కెట్ల కోసం కేవలం ప్రభుత్వ, దేవస్థానం అధికారిక వెబ్సైట్లను మాత్రమే సంప్రదించాలని స్పష్టం చేశారు. గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని, సెర్చ్ ఇంజన్లలో కనిపించే ప్రతి వెబ్సైట్ను గుడ్డిగా నమ్మవద్దని హెచ్చరించారు.
సైబర్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే.. ఆలయ అధికారిక వెబ్సైట్ అడ్రస్ను క్షుణ్ణంగా పరిశీలించండి (ముఖ్యంగా .gov.in లేదా అధికారిక డొమైన్లను గమనించాలి). టిక్కెట్ బుక్ చేసే ముందు దేవస్థాన హెల్ప్లైన్ నంబర్లకు ఫోన్ చేసి నిర్ధారించుకోండి. అనుమానాస్పద వెబ్సైట్లలో మీ వ్యక్తిగత లేదా బ్యాంకు వివరాలను నమోదు చేయకండి.
ముఖ్యంగా మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ నకిలీ వెబ్సైట్ల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. నకిలీ వెబ్సైట్తో మోసపోయామని ఆలయ అధికారుల వద్ద భక్తులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తి పేరుతో జరుగుతున్న ఈ సైబర్ దోపిడీని అరికట్టేందుకు పోలీసులు కూడా నిఘా పెంచారు. యాత్రికులు అప్రమత్తంగా ఉండి, అధికారిక మార్గాల ద్వారానే సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నారు. అయితే ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఉండాలంటే భక్తులకు సరైన అవగాహన పెంచడం సహా నకిలీ వెబ్సైట్లను నిర్మూలించడంలో ప్రభుత్వం చాకచక్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: ప్రజలకు ముఖ్య గమనిక..ఈ వారంలో రెండు రోజులు బ్యాంకులకు సెలవు..ఎప్పుడంటే?
Also Read: ప్రభుత్వ ఉద్యోగుల ఎగిరి గంతేసే వార్త..డీఏతో పాటు HRA పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Garlic In Ghee Benefits: వెల్లుల్లిని నెయ్యిలో వేయించి తింటే..? ఎన్నో రకాల వ్యాధులకు అమృతంలా పనిచేస్తుంది!
Hyderabad, Telangana:Fry Garlic In Ghee: నెయ్యి, వెల్లుల్లి.. ఈ రెండు భారతీయ వంటగదిలో విడదీయలేని భాగాలు. కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా, ఆయుర్వేదంలో వీటి కలయికను ఒక శక్తివంతమైన ఔషధంగా పరిగణిస్తారు. నెయ్యిలో వేయించిన వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనానికి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని నెయ్యిలో వేయించినప్పుడు ఆ పోషకాలను శరీరం త్వరగా గ్రహిస్తుంది. వెల్లుల్లి, నెయ్యి కలయిక సహజ రోగనిరోధక శక్తిని (రోగనిరోధక శక్తి) పెంచుతుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్ల బారి నుండి ఇది మనల్ని కాపాడుతుంది.
అలాగే నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్ జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది అద్భుతమైన ఇంటి చిట్కాగా మారుతుంది. వెల్లుల్లి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి, రక్తపోటును (బ్లడ్ ప్రెజర్) నియంత్రణలో ఉంచుతుంది. నెయ్యిలోని మంచి కొవ్వులు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. అదే విధంగా శరీరంలోని అంతర్గత వాపులను తగ్గించి, ఊపిరితిత్తుల నివారణలో ఈ మిశ్రమం కీలక పాత్ర పోషిస్తుంది.
ఎలా తీసుకోవాలి?
వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి, కొద్దిగా నెయ్యిలో దొరగా వేయించాలి. వీటిని ఉదయాన్నే పరగడుపున లేదా రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే సాధారణంగా తీసుకుంటేనే అమృతం. నెయ్యి, వెల్లుల్లి మిశ్రమాన్ని అతిగా తీసుకుంటే అజీర్ణం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
(గమనిక: ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా మందులు వాడుతున్న వారు, ఈ చిట్కాను పాటించే ముందు సంబంధిత వైద్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: ఒకే ఇంట్లో ఇద్దరికి రైతు భరోసా ఇస్తారా? ఏడాది రూ.12,000 పొందాలంటే ఏం చేయాలి?
Also Read: రిషబ్ పంత్కు బీసీసీఐ షాక్..వన్డే ప్రపంచకప్ టీమ్ నుంచి పంత్ ఔట్! అతని స్థానంలో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Crime News: విశాఖలో ఘోరం..లేడీస్ హాస్టల్ నిర్వాహకుడి రాసలీలలు..పెళ్లైన 45 రోజులకే నవవధువు బలి!
Visakhapatnam, Andhra Pradesh:Visakhapatnam Crime News: కాళ్ళకు పారాణి ఆరకముందే, నూరేళ్ల జీవితాన్ని పంచుకోవాల్సిన భర్త కాలయముడయ్యాడు. పెళ్లైన కేవలం 45 రోజులకే ఓ నవవధువు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం విశాఖపట్నంలోని రేసపువానిపాలెంలో తీవ్ర కలకలం రేపింది. భర్త పరాయి స్త్రీలతో పెట్టుకున్న సంబంధాలే ఈ మరణానికి కారణమని తెలుస్తోంది.
అసలేం జరిగింది?
శ్రీకాకుళం జిల్లాకు చెందిన సోమేశ్వరరావు, తేజశ్రీకి నెల రోజుల క్రితం వివాహం జరిగింది. సోమేశ్వరరావు విశాఖపట్నంలో ఒక లేడీస్ హాస్టల్ నడుపుతున్నాడు. పెళ్లైన కొద్దిరోజులకే భర్త అసలు స్వరూపం తేజశ్రీకి అర్థమైంది. హాస్టల్లో ఉండే కొందరు అమ్మాయిలతో సోమేశ్వరరావుకు అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆమె గుర్తించింది.
భర్తను తేజశ్రీ నిలదీయడంతో, సోమేశ్వరరావు ఆమెపై వేధింపులకు దిగాడు. మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. ఈ పరిశీలన తేజశ్రీ తన తల్లిదండ్రులకు చెప్పుకుని ఏడ్చింది. అయితే, "కొత్త కాపురంలో సర్దుకుపోవాలి" అని వారు సర్దిచెప్పారు. కానీ, రోజురోజుకూ భర్త టార్చర్ మితిమీరిపోవడంతో, సున్నిత మనస్కురాలైన తేజశ్రీ తీవ్ర నిర్ణయం తీసుకుంది.
రేసపువానిపాలెం నివాసంలో తేజశ్రీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, ఇది ఆత్మహత్య కాదని.. భర్త సోమేశ్వరరావే ఆమెను చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. త్రీ టౌన్ పోలీసులు ఘటనను పరిశీలించి కేసు నమోదు చేశారు. ప్రాథమిక ఆధారాల మేరకు భర్త సోమేశ్వరరావును అదుపులోకి తీసుకుని రిమాండ్కు చేరుకున్నారు.
Also Read: త్వరలోనే హీరో విజయ్-త్రిషల పెళ్లి?! వీళ్లిద్దరి మధ్య వయసు గ్యాప్ ఎంత ఉందంటే?
ALso Read: బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు..ఈ పనులు వెంటనే పూర్తి చేసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Dowry Death: 45 రోజులకే నవ వధువు ఆత్మహత్య.. బైక్ అంటే బైక్, పొలం అంటే పొలం ఇచ్చినా భర్త వేధింపులు
Visakhapatnam, Andhra Pradesh:Husband Harassed For Additional Dowry: విశాఖపట్టణంలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఎంతో ఘనంగా తల్లిదండ్రులు పెళ్లి చేయగా.. అత్తారింటికి కొత్త ఆశలతో ఆ యువతి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అత్తారింటికి వచ్చిన తర్వాత ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ఇతర అమ్మాయిలతో సంబంధాలు నడిపిస్తున్న భర్త నిజస్వరూపం తెలుసుకున్న భార్య నివ్వెరపోయింది. ఇదేమిటని నిలదీయగా.. భర్త ఎదురుదాడి చేసి వరకట్నం వేధింపులు ప్రారంభించాడు. ఇక కోరికల చిట్టా విప్పాడు. అడిగిన ఖరీదైన బైక్.. పొలం ఇచ్చినా కూడా అతడి వేధింపులు ఆగలేదు. దీంతో ఆమె మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకున్నారు.
Also Read: Banks Strike: బ్యాంకు ఉద్యోగుల సంచలన నిర్ణయం.. 2 వీకాఫ్ల కోసం రెండు రోజుల సమ్మె!
విశాఖపట్టణం గార మండలం శిమ్మపేటకు చెందిన శిమ్మ లక్ష్మీ నారాయణ, శారద దంపతులు వ్యవసాయ కూలీలు. డిగ్రీ చదివిన కుమార్తె తేజశ్రీ (22)ని శ్రీకాకుళం మండలం రాగోలు సమీప గూడెం గ్రామానికి చెందిన రుప్ప మల్లేషు కుమారుడు రొప్ప సోమేశ్వరరావుకు ఇచ్చి ఈ ఏడాది మార్చి 6వ తేదీన వివాహం చేశారు. కట్నం కింద రూ.20 లక్షల నగదు, 20 తులాల బంగారం ఇచ్చుకున్నారు. విశాఖపట్నం ఎల్అండ్టీ కంపెనీలో ఇంజినీర్గా సోమేష్ నావల్ డాక్యార్డ్లో ప్రాజెక్టు డిజైనర్గా పనిచేస్తున్నాడు.
Also Read: Hyderabad Public: ఇంట్లో పనివారుగా నేపాలీలు వద్దు.. ప్రజలకు పోలీస్ కమిషనర్ సూచన
పెళ్లయిన అనంతరం సోమేశ్, తేజశ్రీ విశాఖపట్టణంలోని రామా టాకీస్ సమీపంలో అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. కొంతకాలంగా విశాఖపట్టణంలో సోమేశ్వర రావు లేడీస్ హాస్టల్ నడుపుతుండగా.. అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఇది తెలుసుకున్న అనంతరం ఇటీవల ఓ యువతిని సోమేష్ ఇంటికి తీసుకురావడంతో భార్య తేజశ్రీ నిలదీసింది. అది సహించని సోమేష్ రూ.3 లక్షల విలువైన బైక్ కావాలని వేధించడంతో ఆ యువతి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అత్తామామలు నాలుగైదు రోజుల్లోనే అతడికి బండి కొనిచ్చేశారు. వారం రోజుల తర్వాత పది సెంట్లు భూమి రాయాలని, తులం నల్లపూసలు చేయించాలని మళ్లీ వేధించడంతో పాటు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. పెళ్లి ఆల్బమ్లో సగం మొత్తం రూ.1.50 లక్షలు అడగడంతో రూ.50 వేలు కూడా ఇచ్చారు.
గొడవ.. బలవన్మరణం
ఈనెల 7వ తేదీన ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య సోమేష్, తేజశ్రీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరూ తమకు ఫోన్ చేశారని, గొడవ మామూలేనని తేజశ్రీ తమతో చెప్పిందని, ఆ తర్వాత పలు దఫాలు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. ఉదయం 9.30 గంటలకు ఉరివేసుకుని మీ పాప చనిపోయిందని తన ఫ్రెండ్తో సోమేష్ ఫోన్ చేయించడంతో ఒక్కసారి హతాశులయ్యామని మృతురాలి తల్లిదండ్రులు వివరించారు. హుటాహుటినా విశాఖపట్టణం బయల్దేరి వెళ్లి చూడగా కుమార్తె బెడ్ మీద విగతజీవిగా ఉంది. అయితే మెడ, కాళ్లపై వాతలు ఉన్నాయని, సోమేష్ స్నేహితులు ముగ్గురు అక్కడే ఉండడంతో ఆమెను చంపేసి ఉంటారని మృతురాలి తల్లిదండ్రులు అనుమానించారు. ఇదే విషయమై విశాఖపట్నం త్రీటౌన్లో కేసు పెట్టామని, సోమేష్ను అదే రోజు పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. తమ కుమార్తెకు తీరని అన్యాయం జరిగిందని.. అదనపు వరకట్నం కోసం వేధించడమే కాక హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని తల్లిదండ్రులు వాపోయారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
PBKS Vs DC Preview: పంజాబ్ కింగ్స్ పతనం ఆగిపోతుందా? ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీ నుంచి వైదొలగుతుందా?
Jhikli Barol, Himachal Pradesh:PBKS Vs DC Preview 2026: ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ దశకు చేరుకుంటున్న వేళ ధర్మశాల వేదికగా జరగనున్న పంజాబ్ కింగ్స్ (PBKS), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) పోరు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ప్లేఆఫ్ రేసులో నిలవాలని పంజాబ్, మరోవైపు పరువు కాపాడుకోవాలని ఢిల్లీ తహతహలాడుతున్నాయి.
శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో వరుస విజయాలతో దూసుకెళ్లగా.. గత మూడు మ్యాచ్లలో మాత్రం చతికిలపడింది. ఆరంభ 7 మ్యాచ్లలో 6 గెలిచిన పంజాబ్, ఇప్పుడు వరుస ఓటములతో ఆత్మరక్షణలో పడింది. ధర్మశాలలోని పిచ్ పంజాబ్ కింగ్స్ జట్టుకు విజయాన్ని ఇస్తుందా లేదా? అనేది తెలియాల్సి ఉంది.
మరోవైపు, అక్షర్ పటేల్ సారథ్యం ఢిల్లీలోని క్యాపిటల్స్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 11 మ్యాచ్లలో కేవలం 4 విజయాలతో ఇప్పటికే టాప్-4 రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది. ఇప్పుడు ఆ జట్టు లక్ష్యం కేవలం పంజాబ్ విజయావకాశాలను దెబ్బతీసి, పరువు నిలబెట్టుకోవడం కోసమే మ్యాచ్ ఆడే అవకాశం కనిపిస్తుంది.
ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య సమరం ఎప్పుడూ నువ్వా-నేనా అన్నట్లుగానే సాగుతోంది. పంజాబ్ కింగ్స్ (కింగ్స్ లెవెన్ పంజాబ్), ఢిల్లీ క్యాపిటల్స్ (ఢిల్లీ డేర్ డెవిల్స్) మధ్య మొత్తంగా 36 మ్యాచ్లు జరిగాయి. వాటిలో పంజాబ్ 18 మ్యాచ్ల్లో గెలుపొందగా.. ఢిల్లీ 17 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఈ సీజన్ మొదటి మ్యాచ్లో ఢిల్లీ నిర్దేశించిన 264 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ ఛేదించడం విశేషం.
పంజాబ్ కింగ్స్ గత మ్యాచ్లలో క్యాచ్లు వదిలేసి భారీ మూల్యాన్ని చెల్లించింది. సహాయ కోచ్ జేమ్స్ హూప్స్ అన్నట్లుగా, క్యాచ్లు పట్టి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవి. సముద్ర మట్టానికి 1,457 మీటర్ల ఎత్తులో ఉంటే ఈ మైదానంలో గాలి పల్చగా ఉంటుంది. ఫలితంగా బంతి వేగంగా సీమ్ అవుతుందని పిచ్ క్యూరేటర్లు అంచనా వేస్తున్నారు. ఇది బ్యాటర్లకు అనుకూలించినా, అర్ష్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్ వంటి బౌలర్లు స్వింగ్తో మాయ చేయగలరు. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నుంచి ఒక భారీ ఇన్నింగ్స్ రావాల్సి ఉంది. అలాగే ఢిల్లీకి కేఎల్ రాహుల్ ఫామ్ ఆ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. ధర్మశాల పిచ్ సాధారణంగా పేస్, బౌన్స్కు సహకరిస్తుంది. బ్యాటర్లకు కూడా ఇది స్వర్గధామంగా మారనుంది.
పంజాబ్ కింగ్స్ (PBKS) తుదిజట్టు అంచనా
శ్రేయస్ అయ్యర్ (సి), ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, సూర్యాంశ్ షెగ్డే, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, మార్కో జాన్సెన్. (ఇంపాక్ట్ ప్లేయర్: హర్ప్రీత్ బ్రార్)
ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తుదిజట్టు అంచనా..
కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అభిషేక్ పోరెల్, నితీష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అశుతోష్ శర్మ, అఖీబ్ నబీ, లుంగి ఎంగిడి, మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్. (ఇంపాక్ట్ ప్లేయర్: సమీర్ రిజ్వీ)
Also Read: మహేష్ బాబు మేనకోడలిని చూశారా? హీరోయిన్లనే మించిన అందం..క్యూట్లో క్వీన్!
Also Read: ప్రభుత్వ ఉద్యోగుల ఎగిరి గంతేసే వార్త..డీఏతో పాటు HRA పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
YS Jagan Padayatra 2.0: ఆంధ్రప్రదేశ్లో మారుతున్న రాజకీయ సమీకరణాలు..జగన్ పాదయాత్ర ఖరారు..ప్రకటన అప్పుడే!
Tadepalli, Andhra Pradesh:YS Jagan Padayatra 2.0 News: విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పెంచేలా అడుగులు వేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ, అటు అధికార పక్షం.. ఇటు ప్రతిపక్షం వ్యూహప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి.
లండన్ టూర్ ముగించుకుని బెంగళూరు చేరుకున్న జగన్, మంగళవారం తాడేపల్లికి రానున్నారు. 2024 ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ సంస్థాగత బలోపేతంపై ఇప్పటివరకు పెద్దగా దృష్టి సారించని ఆయన, ఇకపై పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.
మే 13న ఉన్నత స్థాయి సమావేశంలో పార్టీ ముఖ్య నేతలతో జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానంపై చర్చించనున్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా జూలై 8, 9 తేదీల్లో రాష్ట్ర స్థాయి ప్లీనరీని నిర్వహించాలని కేడర్ నుంచి ఒత్తిడి వస్తోంది.
దీనిపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గతేడాది వాయిదా పడుతూ వస్తున్న జిల్లాల పర్యటనలు, కార్యకర్తల సమావేశాలను తక్షణమే ప్రారంభించే దిశగా జగన్ మొగ్గు చూపుతున్నారు. పెండింగ్లో ఉన్న నియోజకవర్గాల సమన్వయకర్తల జాబితాను ఖరారు చేసి, ఎన్నికల మూడ్లోకి పార్టీని తీసుకెళ్లడం జగన్ ప్రధాన లక్ష్యం.
ఒకవైపు జగన్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంటే, మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని కీలక మార్పులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలకు ప్రధాని వెళ్లడం కూటమి బలాన్ని చాటుతోంది.
అదే విధంగా ఈ నెలాఖరులో నెల్లూరు వేదికగా మహానాడు నిర్వహించేందుకు టీడీపీ సిద్ధమైంది. దీని ద్వారా రెండేళ్ల పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. వచ్చే ఏడాది నుంచి జగన్ మళ్లీ పాదయాత్ర చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దానికి ముందుగా పార్టీ కేడర్లో జోష్ నింపడం ఇప్పుడు అనివార్యంగా మారింది.
రెండేళ్ల కూటమి పాలన పూర్తవుతున్న తరుణంలో, విమర్శలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి పోరాటాలకు జగన్ సిద్ధమవుతున్నారు. ప్లీనరీ ద్వారా కొత్త ఉత్సాహాన్ని నింపి, వచ్చే ఏడాది పాదయాత్రకు పునాది వేయడమే జగన్ తదుపరి వ్యూహంగా కనిపిస్తోంది.
Also Read: అనసూయపై అసభ్యకర కామెంట్స్..మరో నిందితుడు అరెస్ట్..ఏం జరిగిందంటే?
Also Read: Rukmini Vasanth Photos: కాటేసే కళ్లతో కొంటెగా చూస్తోంది కన్నడ భామ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
PM Modi Public Call: బంగారంతో సహా ప్రజలకు ప్రధాని మోదీ 6 విజ్ఞప్తులు.. అవేమిటంటే?
Baddipadaga, Telangana:Gold Price: తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేశారు. వాటిలో బంగారంతోపాటు విదేశీ ప్రయాణం, ఎరువుల వినియోగం తదితర అంశాలపై ప్రధాని విజ్ఞప్తులు చేశారు. దేశం కోసం కొన్ని తగ్గించుకోవాలని సూచనలు చేశారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం కూడా దేశభక్తిలో భాగమని గుర్తుచేశారు. ప్రస్తుతం కరోనా వంటి సమయంలో ఎదుర్కొన్న పరిస్థితులు ఎదుర్కోవాలని హెచ్చరించారు.
Also Read: Narendra Modi: 'అబద్ధపు హామీలు ఇచ్చి మర్చిపోవడమే కాంగ్రెస్ మోడల్': ప్రధాని మోదీ
ప్రజలకు సూచనలు
==> మెట్రో సేవలను ఎక్కువగా వినియోగించాలి. కార్పూలింగ్ను ప్రోత్సహించాలి. సాధ్యమైనంత వరకు రైల్వే సరుకు రవాణాను వినియోగించాలి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలి.
==> కనీసం ఏడాది పాటు విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలి. విదేశీ వస్తువుల కొనుగోళ్లు తగ్గించాలి. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాల. వోకల్ ఫర్ లోకల్ను బలంగా అమలు చేయాలి. రోజువారీ జీవితంలో విదేశీ ఉత్పత్తుల స్థానంలో స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించాలి.
==> విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాలి
==> ఏడాదిపాటు బంగారం కొనడం తగ్గించుకోవాలి
==> వంట నూనెల వినియోగాన్ని తగ్గించుకోవాలి
==> రైతులు రసాయన ఎరువులను తగ్గించుకోవాలి. రసాయన ఎరువుల వినియోగాన్ని 25 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గించి సహజ వ్యవసాయం వైపు అడుగులు వేయాలి.
==> డీజిల్ పంపుల స్థానంలో సౌరశక్తి పంపులను ఉపయోగించాలి.
Also Read: Narendra Modi: తెలంగాణలో మార్పు అనివార్యం.. అబ్కీ బార్ బీజేపీ సర్కార్: ప్రధాని మోదీ
కరోనా కాలంలో అలవాటైన వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ సమావేశాలను మళ్లీ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ సూచించారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం కూడా దేశభక్తిలో భాగమని గుర్తుచేశారు. రసాయన ఎరువుల అధిక వినియోగంతో భూమి నాశనం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ సంక్షోభాల సమయంలో ప్రతి పౌరుడు దేశహితం కోసం కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇది ఒక్క ప్రభుత్వానికి.. ఒక్క పార్టీకి సంబంధించిన అంశం కాదని, దేశానికి సంబంధించిన బాధ్యత అని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ప్రతి పౌరుడు, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి సంస్థ దేశ ప్రయోజనాల కోసం ఏకమై పనిచేస్తే దేశం ప్రతి సంక్షోభాన్ని జయిస్తుందని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
