మహిళలకు ఉచిత ఆటో శిక్షణ తరగతులు
Hyderabad, Telangana:తెలంగాణ మహిళ సహకారక అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, కూకట్ పల్లి లోని దుర్గాబాయి మహిళ శిశు వికాస కేంద్రంలో ఉచిత ఎలక్ట్రిక్ ఆటో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. మహిళలు ఈ శిక్షణ ద్వారా స్వయం ఉపాధి పొందగలరని, కుటుంబానికి అండగా నిలబడగలరని చెప్పారు. మహిళలు కొన్ని రంగాల్లో మాత్రమే పరిమితం కాకుండా, ప్రతి రంగంలోనూ ప్రతిభ చూపించాలి అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ శిశు సంక్షేమ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ నిర్మల క్రాంతి వెస్లీ పాల్గొన్నారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
తెలంగాణ, మహారాష్ట్ర బోర్డర్లో కుండపోత వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన పెన్ గంగా, ప్రాణహిత!
Hyderabad, Telangana:Telangana-Maharashtra Border Floods News: గత కొన్ని రోజులుగా కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురుస్తున్న కుండపోత వర్షాలకు ఇరు రాష్ట్రాల సరిహద్దులు జలమయమయ్యాయి. సరిహద్దు గుండా ప్రవహించే ప్రాణహిత, పెన్ గంగా నదులు ఉధృతంగా ప్రవహిస్తూ.. మహోగ్రరూపం దాల్చాయి. భారీగా వస్తున్న వరద నీటితో నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో తీర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ప్రాంతాల్లో జీవించేవారు బిక్కుబిక్కుమంటూ రోజులు గడపాల్సి వస్తుంది.
కాళేశ్వరం వద్ద ఉరకలేస్తున్న గోదావరి..
ప్రాణహిత నది గంలో ఎన్నడూ లేని విధంగా ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో.. ఆ వరద ఉధృతి అంతా దిగువన ఉన్న గోదావరి నదిలోకి చేరుతోంది. ఫలితంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం వద్ద గోదావరి నది ఊరకలు వేస్తూ పోటెత్తున్నట్లు తెలుస్తోంది.. త్రివేణి సంగమ క్షేత్రం వద్ద నీటి మట్టం వేగంగా పెరుగుతుండటంతో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
పుష్కర ఘాట్లను ముంచెత్తిన వరద..
సిర్పూర్ నియోజకవర్గంలో వర్షాల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉందని అధికారులు తెలుపుతున్నారు. కౌటాల మండలంలోని ప్రాణహిత నది పుష్కర ఘాట్లను తాకుతూ వరద నీరు చేరింది. ఘాట్లన్నీ దాదాపు మునిగిపోయే స్థితికి చేరుకున్నాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు, తాటిపెల్లి వద్ద పెన్ గంగా నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తుండటంతో ఇరువైపులా ఉన్న రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
అధికారుల తీవ్ర హెచ్చరిక..
మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తోందని.. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేట కోసం నదుల్లోకి వెళ్లకూడదని.. ఎవరూ నదులను దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.
కొట్టుకుపోయిన ప్రధాన రహదారి..
భారీ వర్షాల ధాటికి సిర్పూర్ మండలంలో తీవ్ర నష్టం వాటిల్లింది. చీలపల్లి వద్ద వరద నీటి ఉధృతికి ప్రధాన రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. రోడ్డు కొట్టుకుపోవడంతో ఆ మార్గంలో ప్రయాణించే పలు గ్రామాలకు నగరాలకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. రాకపోకలు నిలిచిపోవడంతో అత్యవసర వైద్య సేవలు, నిత్యావసరాల కోసం స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి..
పరిస్థితి రోజు రోజుకి తీవ్రమవుతుండటంతో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని.. స్థానిక అధికారుల సూచనలను పాటించాలని కలెక్టరేట్ వర్గాలు వెల్లడించాయి.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
నారా లోకేశ్ దక్షిణ కొరియా పర్యటన.. ఆరు రోజుల ఫారెన్ టూర్
Nuzendla, Andhra Pradesh:Nara Lokesh South Korea Tour: ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి విదేశీ పర్యటన చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల కోసం ఆయన విదేశాల్లో పర్యటించనున్నారని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు కొరియా పర్యటనకు లోకేశ్ సిద్ధమయ్యారు. అధికారిక సమావేశాలతో పాటు పెట్టుబడి చర్చలు చేసేందుకు కొరియాలో నారా లోకేశ్ బృందం పర్యటించనుంది. ఈ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
భారత్ - దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసేందుకు ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ కొరియాలో పర్యటించనున్నారు. ఈనెల 5 నుంచి 11వ తేదీ వరకు ఆరు రోజుల పాటు మంత్రి లోకేష్ దక్షిణ కొరియాను సందర్శించనున్నారు. ఈ పర్యటనలో మంత్రి లోకేష్ కొరియాలో వివిధ మంత్రిత్వశాఖల ప్రతినిధులతో అధికారిక సమావేశాల్లో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ అధికారిక సమావేశాలను నిర్వహిస్తున్నామని దక్షిణ కొరియా కాన్సులేట్ జనరల్ (చెన్నయ్) చాంగ్ న్యూన్ కిమ్ తెలిపారు. ఇరుదేశాల నడుమ మరింత సహకారం, సంబంధాల బలోపేతం ఈ పర్యటన కీలక అడుగు కాగలదని భావిస్తున్నట్లు కిమ్ తెలిపారు.
షెడ్యూల్ ఇదే..
==> ఈనెల 5వతేదీన దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఇండియా డయాస్పోరా ఆత్మీయ సమావేశానికి హాజరై అక్కడి భారతీయులు, తెలుగువారిని ఉద్దేశించి నారా లోకేశ్ ప్రసంగించనున్నారు. 6వ తేదీన దక్షిణ కొరియా టెక్ స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంతోపాటు వివిధ సంస్థలతో పెట్టుబడి చర్చల్లో ఏపీ బృందం పాల్గొననుంది. అనంతరం హ్యోసంగ్ భారీపరిశ్రమ సంఘం అధ్యక్షుడు టకేషి యొకోటా, సియోల్ సెమికండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ టేహ్యుంగ్ లీతో ఏపీ ప్రభుత్ బృందం సమావేశం కానుంది.
==> 7వతేదీన ఎల్జీ కెమ్ గ్లోబల్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్, ఎల్జీ ఓవర్ సీస్ కంపెనీస్ హెడ్ యున్ జు కోహ్ ఎల్జీ టవర్స్లో ఏర్పాటుచేసిన విందు సమావేశంలో నారా లోకేశ్ పాల్గొననున్నారు. ఎల్జీ అనుబంధ సంస్థలకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు ఈ సమావేశానికి హాజరుకానున్నాయి.
==> 8వ తేదీన కొరియన్ మెరైన్ అక్విప్ మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం
==> 9వతేదీన కొరియన్ పొలిటికల్ ఎఫైర్స్ డిప్యూటీ మినిస్టర్ మిస్. యుయి-హే సిసిలియా చుంగ్ తో భేటీ అనంతరం కొరియన్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇన్వెస్టిమెంట్స్ డిప్యూటీ మినిస్టర్ కాంచన్ కాంగ్తో సమావేశం
==> 10వతేదీన వివిధ సంస్థల ప్రతినిధులతో పెట్టుబడి చర్చలతోపాటు కొరియా ఆటో ఇండస్ట్రీ కోఆపరేషన్ ఏజన్సీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరుకానున్న ఏపీ ప్రభుత్వ బృందం. అదేరోజు రాత్రి సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్–2026 విజయవంతం చేయాలని కోరుతూ కొరియా కంపెనీల ప్రతినిధులతో రోడ్ షోలో నారా లోకేశ్ పాల్గొననున్నారు.
AP Land Registration: రైతన్నలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త..రూ.100లకే వారసత్వ భూములు రిజిస్ట్రేషన్!
Vijayawada, Andhra Pradesh:AP Land Hereditary Registration: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ యజమానులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల రైతులకు ఒక అద్భుతమైన ఊరటను ఇచ్చింది. కుటుంబంలో పెద్దలు మరణించిన తర్వాత, వారి వారసత్వ వ్యవసాయ భూములను తమ పేర్ల మీదకు మార్చుకునేందుకు గతంలో ఉన్న అతి సుదీర్ఘమైన ప్రక్రియకు ఏపీ సర్కార్ స్వస్తి పలికింది. ఇకపై కేవలం రూ.100 స్టాంపు డ్యూటీతో వారసత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసుకునే సరికొత్త వెసులుబాటును ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
ఈ కొత్త విధానం ప్రకారం ఆస్తి విలువ సుమారు నామినల్ చార్జీలను నిర్ణయించారు. స్టేషన్ చేయించుకోబోయే వారసత్వ భూమి విలువ గనక రూ.10 లక్షల లోపు ఉంటే కేవలం వంద రూపాయలు స్టాంప్ డ్యూటీ చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ ఆ భూమి విలువ సుమారు రూ.10 లక్షలకు పైగా ఉంటే కేవలం రూ.1000 చెల్లించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. దీనివల్ల సాధారణ, మధ్యతరగతి కుటుంబాలపై రిజిస్ట్రేషన్ ఫీజులు భారం భారీగా తగ్గనుంది.
ఈ నూతన సంస్కరణలో కేవలం తక్కువ ఖర్చు మాత్రమే కాదు, అంతకు మించిన సాంకేతిక సౌలభ్యాన్ని కూడా ప్రభుత్వం జోడించింది. గతంలో రిజిస్ట్రేషన్ పుట్టిన తర్వాత కూడా రెవిన్యూ రికార్డుల్లో పేరు మార్చడానికి (మ్యుటేషన్ కోసం) రైతులు తహసీల్దారు లేదా విలేజి రెవెన్యూ కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వచ్చేది. లంచాలు, కాలయాపనతో విసిగిపోయేవారు. ఈ ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వం ఈ ప్రక్రియకు ఆటోమొటేషన్ విధానాన్ని అనుసంధానం చేసింది.
దీని ప్రకారం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వారసుల మధ్య ఆస్తుల విభజన లేదా బదిలీ డాక్యుమెంటరీ అవ్వగా.. ఆ సమాచారం ఆటోమేటిక్గా రెవిన్యూ శాఖ సాఫ్ట్వేర్ కు బదిలీ అవుతుంది. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండానే, వెనువెంటనే రెవిన్యూ రికార్డుల్లో అంటే అడంగల్/1b ఫారాల్లో కొత్త వారసుల పేర్లు అప్డేట్ అయిపోతాయి.
మొత్తంగా తాతలు, తండ్రులు లేదా తల్లులు మరణాంతరం భూహక్కుల మార్పిడి కోసం కార్యాలయాలు చుట్టూ తిరిగి తిప్పలు తప్పిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఇది అటు డబ్బును ఇటు అమూల్యమైన కాలాన్ని ఆధారి చేయడమే కాకుండా, రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకతను పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు.
Also Read: AP Gold Mines: ఏపీలో మరో బంగారు గని? లక్షన్నర హెక్టార్లలో బంగారు ఖనిజ నిక్షేపాలు!
Also Read: "నీ తొడల సైజ్ ఎంత?".. స్టార్ డైరెక్టర్ అడిగిన ప్రశ్నకు బిత్తరపోయిన మౌనీషా చౌదరి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ మరో పోరాటం.. రేపు కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన
Metpalle, Telangana:Kaleshwaram Project: ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగింది. ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మరో పోరాటానికి గులాబీ పార్టీ సిద్ధమైంది. కేసీఆర్ మీద కక్షతోనే కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు ఎత్తిపోయకపోవడంతో రేపు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన కన్నెపల్లి పంప్హౌస్ను సందర్శించనుండడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.
కాళేశ్వరం ప్రాజెక్టు, కన్నెపల్లి పంప్ హౌజ్ మోటార్లు వెంటనే ఆన్ చేయాల్సిందేనని ఈ పర్యటనతో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పనుంది. వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న వేళ వృథాగా పోతున్న గోదావరి జలాలను ఎత్తిపోయాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దునిద్ర వీడడంపై గులాబీ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసి రైతులకు ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. గోదావరి జలాలు వృథాగా సముద్రం పాలవుతున్నా కాంగ్రెస్ సర్కార్ నీళ్లు ఎత్తిపోయకపోవడాన్ని రేపు బీఆర్ఎస్ పార్టీ ఎండగట్టనుంది.
కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై రేపు జూలై 5వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని పార్టీ బృందం సందర్శించనుంది. మంథని నియోజకవర్గంలోని కన్నెపల్లి వద్ద వృథాగా పోతున్న జలాలను బీఆర్ఎస్ బృందం పరిశీలించనుంది. ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం వలన గోదావరి బేసిన్లో కేవలం 23 శాతం మాత్రమే రిజర్వాయర్లు నిండి ఉండడంతో రైతులకు తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడనుంది.
ఇంజనీర్ల ఆందోళన
'ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర గోదావరిలో 15 వేల క్యూసెక్కులు దాటి ప్రవాహం నమోదవుతోంది. రానున్న రోజుల్లో ప్రవాహాలు 60 వేల క్యూసెక్కులకు పైగా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మేడిగడ్డ బరాజ్పై ఆధారపడకుండా కన్నెపల్లి (లక్ష్మీ) పంప్హౌజ్ దగ్గర నీటిని మళ్లించి.. పంపింగ్ చేపట్టే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కన్నెపల్లి పంప్హౌజ్ మోటార్లు ఆన్ చేస్తే గోదావరిలో ప్రస్తుతం లభిస్తున్న ప్రవాహాన్ని వాడుకొని వ్యవసాయానికి, తాగునీటి అవసరాలకు నీరు అందించే మార్గం ఉందని ఇంజనీర్లు చెబుతున్నారు' అని బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. ఇదే విషయాన్ని చెప్పేందుకు.. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే రేపు కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కన్నెపల్లి పంప్హౌజ్ను సందర్శించనుంది. ఈ పర్యటనకు పెద్ద ఎత్తున ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తరలివెళ్లే అవకాశం ఉంది. కన్నెపల్లి పంపుహౌస్ సందర్శనకు బీఆర్ఎస్ పార్టీ వెళ్తుండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తమైందని తెలుస్తోంది.
Mumbai Floods 2026: సముద్రాన్ని తలపిస్తున్న ముంబై..భారీ వరదలతో ఆర్థిక నగరం అల్లకల్లోలం!
Hyderabad, Telangana:Mumbai Floods 2026: దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. గడిచిన 24 గంటల్లో కురిసిన 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో నగరం నీటిలో మునిగింది. నగరానికి ఆనుకునివున్న అరేబియా సముద్రం ముంబైలోకి వచ్చిందా అనే రీతిలో పలుప్రాంతాలు నీట మునిగాయి.IND Vs ENG Match: భారత్ Vs ఇంగ్లాండ్ రెండో టీ20కి వరుణ గండం..ఇది కూడా రద్దైనట్టే!
Stretford, England:IND Vs ENG T20I Match: ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమ్ఇండియా ఐదు టీ20 మ్యాచ్లను ఆడనుండగా.. అందులో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో విజయం సాధించాలని ఇరుజట్లు సన్నద్ధమవుతున్నాయి. అయితే ఇదే మ్యాచ్లో భారత యువ కెరటం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసే అవకాశం ఉంది.మందుబాబులకు పండగే.. ఇక్కడ Chivas Regal, Teachers బ్రాండ్స్ ఎంత చీపో తెలుసా!
Hyderabad, Telangana:Chivas Regal 18 Price In Goa: గోవా అంటే కేవలం బీచ్లు, సముద్రపు అందాలు మాత్రమే కాదు.. అక్కడ లభించే వివిధ రకాల బ్రాండ్ల లిక్కర్ కూడా పర్యాటకులను ఎంతగానో ఆకర్శిస్తుంది. అయితే, గోవాలో లభించే అత్యంత ఖరీదైన, లగ్జరీ స్కాచ్ విస్కీల ధరలను ఎప్పుడైనా తెలుసుకున్నారు? ఇటీవల గోవాలోని ప్రముఖ వైన్స్ షాపుల్లో ఉన్న టాప్ స్కాచ్ బ్రాండ్ల ధరలకు సంబంధించిన వివరాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.. మందుబాబుల ఫేవరెట్ బ్రాండ్ల ధరలు చాలా చీప్గా ఉండడం వల్ల ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఏ బ్రాండ్లకు సంబంధించిన లిక్కర్ ఏయే ధరల్లో అందుబాటులో ఉందో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రూ.8,500కే షివాస్ రీగల్..
చాలా మంది షివాస్ రీగల్ మందు అంటే ఇష్టపడుతూ ఉంటారు. అత్యంత ఖరీదైన బ్రాండ్గా షివాస్ రీగల్ 18 ఇయర్స్ ఓల్డ్గా భావించవచ్చు. దీని ధర రూ.8,500తో ప్రారంభమవుతుంది.. స్కాచ్ ప్రియులు ఎంతో ఇష్టపడే ఈ 18 సంవత్సరాల నాటి విస్కీ బాటీల్ రాయల్ లుక్తో పాటు దానికి తగ్గట్లుగానే ధరను కలిగి ఉంది. అలాగే షివాస్ 12 ఇయర్స్ ఏజ్డ్ బాటిల్ ఇక్కడ కేవలం రూ.3,400కే అందుబాటులో ఉంది. మరో ప్రముఖ లగ్జరీ బ్రాండ్ అయిన మేకర్స్ మార్క్ (Maker's Mark) బాటిల్ ధర రూ.6,000 నుంచి ప్రారంభమవుతుంది.
టీచర్స్ బ్రాండ్లలో రకాలు..
మద్యం ప్రియులకు ఎంతగానో ఇష్టపడే టీచర్స్ బ్రాండ్లలో ఎన్నో రకాల ధరలతో ఇక్కడ లభిస్తున్నాయి. టీచర్స్ 12 ఇయర్స్ ఏజ్డ్ (గోల్డెన్ థిస్టిల్) ఇక్కడ కేవలం రూ. 2,700 నుంచి ప్రారంభమవుతుంది. అంతేకాకుండా టీచర్స్ 50 కేవలం రూ.2,000తో అందుబాటులో ఉండడం విశేషం. టీచర్స్ హైలాండర్ క్రీమ్ రూ.1,420 ధరతో లభిస్తోంది.
స్కాచ్ బ్రాండ్లు ఇవే..
భారీ ధరలు మాత్రమే కాకుండా.. కొంతవరకు బడ్జెట్ ధరల్లో ఉండే అంతర్జాతీయ బ్రాండ్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఎంతో పాపులర్ అయిన జేమ్సన్ (Jameson) ఐరిష్ విస్కీ ధర రూ.2,500 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే జిమ్ బీమ్ (Jim Beam) బోర్బన్ విస్కీ బాటిల్ రూ. 1,890కే అందుబాటులో ఉండడం విశేషం. స్కాచ్లో కాస్త తక్కువ ధరలో లభించే బ్లాక్ అండ్ వైట్ ధర ఇక్కడ రూ.1,500కే లభిస్తోంది. విస్కీ లవర్స్ ఎక్కువగా కొనుగోలు చేసే విలియం లాసన్స్తో పాటు వ్యాట్ 69 (Vat 69) బ్రాండ్లు కేవలం రూ.1,050 లకే లభించడం విశేషం. ఇక్కడ లాబ్రాడాగ్ 3 ఇయర్స్ ఏజ్డ్ (డబుల్ బ్యారెల్ స్కాచ్) ధర కేవలం రూ. 1,350 నుంచి మాత్రమే లభిస్తోంది. దీంతో పాటు బ్లాక్ డాగ్ ప్రైవేట్ రిజర్వ్ స్టాక్ను బట్టి ప్రత్యేక ధరల్లో లభిస్తోంది.
Also Read: Goaలో ఇంత చీప్గా బీరా, కరోనా, కింగ్ఫిషర్ దొరుకుతున్నాయా? 2026 లేటెస్ట్ రేట్లు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
'సర్' బండి సంజయ్ అప్రమత్తం.. హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆందోళన
Vemulawada, Telangana:Telangana SIR: తెలంగాణలో జరుగుతున్న సర్ ప్రక్రియపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అప్రమత్తం అయ్యారు. 'సర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోంది. హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోంది' అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే జరిగితే తెలంగాణలో హిందువులే మైనారిటీలయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అధికారులకు ప్రభుత్వం సహకరించడం లేదని. మజ్లిస్తో కుమ్కక్కై కాంగ్రెస్ హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపణలు చేశారు.
వేములవాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'రాష్ట్ర ప్రభుత్వం సర్ను ఉపయోగించుకుని హిందువల ఓట్లను తొలగించేందుకు పెద్ద ఎత్తున కుట్ర చేస్తోంది. అధికారులు క్షేత్రస్థాయిలో హిందువుల ఇళ్లకు పూర్తిస్థాయిలో వెళ్లడం లేదు. తెలంగాణలోని హిందువులంతా జాగృతం కావాలని.. లేనపోతే హిందువులంతా మైనారిటీలయ్యే ప్రమాదం ఉంది' అని బండి సంజయ్ హెచ్చరించారు.
ఎన్నికలప్పుడే రాజకీయాలు.. ఎన్నికల తరువాత తన ధ్యాస, శ్వాస అంతా అభివృద్దే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. రాజకీయాలకతీతంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ అనే వివక్ష లేకుండా ఓటేసిన ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తానని చెప్పారు. 'రేవంత్ రెడ్డి ఇంత అప్పు చేసి ఏం చేశాడంటే.. చేసిందేమీ లేదు. ఇయాళ జీతాలు, పెన్షన్లు, ఫీజు రీయంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించాలంటే కూడా పైసల్లేని దుస్థితి ఏర్పడింది' అని వివరించారు. అప్పులు, అవినీతి, అక్రమాలు మాత్రమేనని కాంగ్రెస్ పాలనపై విమర్శించారు.
'కాంగ్రెస్ పాలనలో దోచుకున్నదంతా ఢిల్లీకి పెద్దలకు మూటలు పంపుతున్నారు. రాష్ట్రంలో అంతో ఇంతో అభివృద్ధి జరుగుతుందంటే కేంద్రం ఇస్తున్న నిధులతోనే' అని బండి సంజయ్ తెలిపారు. తెలంగాణను రేవంత్ రెడ్డి శ్రీలంక, పాకిస్తాన్లా మార్చే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ అప్పుల ఊబి నుంచి బయటకు రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందేనని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో అప్పుల బాధ తీరదు.. అవినీతి ఆగదు. అభివృద్ది జరగదని తెలిపారు. వీబీజీ రామ్ జీ పథకంతో పనిదినాలు పెంచి ఆస్తులు సృష్టించడం తప్పా.. దీనిపై కోర్టుకు వెళ్లడం ఏమిటని బండి సంజయ్ ప్రశ్నించారు. మోదీకి మంచి పేరొస్తే ఓర్వలేరా? అని నిలదీశారు.
IND Vs ENG 2nd T20: నేడే భారత్ Vs ఇంగ్లాండ్ రెండో టీ20 మ్యాచ్..వైభవ్ సూర్యవంశీ గ్రాండ్ ఎంట్రీ పక్కా!
Stretford, England:IND Vs ENG 2nd T20I Preview: ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమ్ఇండియా ఐదు టీ20 మ్యాచ్లను ఆడనుండగా.. అందులో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో విజయం సాధించాలని ఇరుజట్లు సన్నద్ధమవుతున్నాయి. అయితే ఇదే మ్యాచ్లో భారత యువ కెరటం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
అయితే ఇంతకు ముందు ఐర్లాండ్ పర్యటనలో భాగంగా జరిగిన టీ20 సిరీస్లో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తాడన్న వార్తలు వచ్చాయి. అయితే అది కుదరలేదు. కేవలం వైభవ్ బెంచ్ మార్క్కు పరిమితమవ్వగా.. ఆ సిరీస్లో ఐర్లాండ్తో వైట్వాష్కు గురయ్యింది. ఆ తర్వాత ఇంగ్లాండ్తో తొలి టీ20 మ్యాచ్లో వైభవ్కు అవకాశం వస్తుందని ఎదురుచూసిన వారికి నిరాశే మిగిలింది.
ఈ వారం ప్రారంభంలో డర్హామ్లో ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్ తొలి మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీని సీనియర్ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ వినిపించినప్పటికీ, జట్టు యాజమాన్యం తమ సాధారణ ఓపెనింగ్ జోడీతోనే ముందుకు సాగింది. అయితే, సంజు శాంసన్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతుండటంతో, త్వరలోనే సూర్యవంశీ అతని స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది.
అభిషేక్ శర్మ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ పర్యటనలో ఇప్పటికే రెండు అర్ధశతకాలు (మొదటిది ఐర్లాండ్పై, రెండోది జూలై 1న ఇంగ్లాండ్పై) సాధించాడు. కాబట్టి జట్టులో అతని స్థానానికి ఎలాంటి ఢోకా లేదు. పరుగులు సాధించాల్సిన ఒత్తిడి పూర్తిగా సంజు శాంసన్పైనే ఉంది. వర్షం కారణంగా రద్దయిన తొలి మ్యాచ్లో, శాంసన్ ఏడు బంతుల్లో కేవలం ఒక పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు.
భారత్కు మరో ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. కొత్తగా ఎంపికైన వైస్ కెప్టెన్ తిలక్ వర్మ పేలవమైన ఫామ్. అతని స్ట్రైక్ రేట్ ఎంత ఆందోళనకరంగా ఉందో, స్లో బాల్స్ను ఎదుర్కోవడంలో అతని తీరు కూడా అంతే ప్రశ్నార్థకంగా ఉంది. ఈ ఏడాది ఆడిన గత 12 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ల్లో తిలక్ వర్మ కేవలం 12 సిక్సర్లు మాత్రమే కొట్టగలిగాడు. అంటే సగటున మ్యాచ్కు ఒకటి చొప్పున అన్నమాట. ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ స్పిన్ బౌలింగ్కు అనుకూలంగా ఉండటంతో, ముఖ్యంగా స్పిన్ విభాగంలో ఎలాంటి మార్పులు లేకుండా బౌలింగ్ విభాగం పటిష్టంగా కొనసాగే అవకాశం ఉంది.
ఇంగ్లాండ్ విషయానికొస్తే, మొదటి T20Iలో పూర్తిస్థాయిలో కనిపించని వారి బ్యాటింగ్ లైనప్ భారత్కు గట్టి సవాలు విసిరే అవకాశం ఉంది. సిరీస్ ప్రారంభ మ్యాచ్లో విశ్రాంతి తీసుకున్న జోఫ్రా ఆర్చర్ తిరిగి జట్టులోకి రాగా, జోష్ టంగ్ కూడా జట్టులో చేరారు. టంగ్ ఈ రోజు తన వైట్-బాల్ అరంగేట్రం చేయనున్నారు.
భారత్ vs ఇంగ్లాండ్ రెండో T20I ఎప్పుడు,ఎక్కడ?
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే 5 మ్యాచ్ల T20I సిరీస్లో రెండో మ్యాచ్, మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ మైదానంలో శనివారం, జూలై 4న సాయంత్రం 7:00 గంటల (IST) నుండి జరుగుతుంది. ఈ 5 మ్యాచ్ల సిరీస్ మొత్తాన్ని సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ టీవీ ఛానెళ్లలోనూ, అలాగే సోనీ లివ్ (Sony LIV) యాప్ లేదా వెబ్సైట్లోనూ ప్రసారం చేస్తున్నారు.
Also Read: క్రికెట్ ప్రపంచంలో మరో కొత్త క్రష్..ఆస్ట్రేలియా మహిళల టీమ్లో భారత సంతతి యువతి!
Also Read: అమెరికన్ పాప్ సింగర్ పోటిగా విరాట్ కోహ్లీ..అందులో కిమ్ కర్దాషియన్నే మించిపోయాడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Peddi OTT Release: ఓటీటీ రిలీజ్కు సిద్ధమైన రామ్చరణ్ 'పెద్ది'..ఆ ఫ్యాన్స్ మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే!
Hyderabad, Telangana:Peddi OTT Release Date: బాక్సాఫీస్ వద్ద మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫారమ్ వేదికగా విడుదలకు సిద్ధమైంది.
10 రోజుల్లో రూ.378 కోట్లు..!
టాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్తో 'పెద్ది' సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుటి వరకు రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టినట్లు తెలుస్తోంది.
ఆ ఓటీటీలో విడుదలకు సిద్ధం..
కేవలం 35 రోజుల థియేటర్ రన్ తర్వాత ఓటీటీలో విడుదల కానుండడం విశేషం. ఈ సినిమాను ఓటీటీలో విడుదల తేదీని ప్రముఖ నెట్ఫ్లిక్స్ సంస్థ ప్రకటించింది. జూలై 9న తమ ప్లాట్ఫారమ్లో సినిమాను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. అయితే ఈ సినిమాను త్వరలోనే హిందీ వెర్షన్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు.
సినిమా ప్రత్యేకతలు..నటీనటుల ప్రతిభ
డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో ఫ్యాన్స్ను ఆకట్టుకుంది. సినిమాలో క్రికెటర్ గా, రెజ్లర్ గా, రన్నర్గా రామ్ చరణ్ చూపించిన వేరియేషన్స్, అద్భుత నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభిస్తున్నాయి.
అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, అప్పల సూరి పాత్రలో జగపతి బాబు నటనకు థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు త్రిపాఠి, రావు రమేష్, బొమన్ ఇరానీ, రవి కిషన్, సత్య తదితరులు కీలక పాత్రల్లో మెప్పించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా సక్సెస్లో ప్రధాన పాత్ర పోషించాయి.
వృద్ధి సినిమాస్ సమర్పణలో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ 'మైత్రీ మూవీ మేకర్స్', 'సుకుమార్ రైటింగ్స్' సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్తో నిర్మించాయి. రామ్ చరణ్ కెరీర్లోనే ఇదొక ల్యాండ్మార్క్ మూవీగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: టాలీవుడ్ చరిత్రలో సమంత అతిపెద్ద రికార్డు..అనుష్కని వెనక్కి నెట్టిన లేడీ సూపర్స్టార్
Also Read: మూడో పెళ్లికి రెడీ అయిన బాలీవుడ్ స్టార్ హీరో..60 ఏళ్ల వయసులో ప్రియురాలితో పరిణయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telegram Anti Piracy: టెలిగ్రామ్కు మరోసారి కేంద్ర ప్రభుత్వం నోటీసులు..15 రోజుల్లో పైరసీ కంటెంట్ను ఆపాల్సిందే!
Hyderabad, Telangana:Telegram Anti Piracy Notice: టెలిగ్రామ్ యాప్ ద్వారా పైరసీ సినిమాలు, ఓటీటీ (OTT) కంటెంట్ పెద్ద ఎత్తున విస్తరించడంపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు టెలిగ్రామ్ యాజమాన్యానికి హెచ్చరికగా నోటీసులు జారీ చేస్తూ.. తమ యాప్ లేదా ప్లాట్ఫారమ్ స్థాయిలోనే పైరసీ నిరోధక చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఇందుకు కేవలం 15 రోజుల గడువు మాత్రమే ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
గతంలో ప్రభుత్వం విడివిడిగా పైరసీ ఛానెళ్ల తొలగించగా.. ఇప్పుడు ఆ ప్రక్రియను సదరు పైరసీ షేర్ చేస్తున్న ప్లాట్ఫారమ్కే పూర్తి జవాబుదారీ తనాన్ని అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్రం డిమాండ్లు, ఆదేశాలు..
1) కేవలం ప్రభుత్వం ఫిర్యాదు చేసే వరకు వేచి చూడకుండా, పైరసీ కంటెంట్ను స్వయంగా గుర్తించడం, రిపోర్ట్ చేయడం, బ్లాక్ చేయడం సహా అలాంటి పైరసీ కంటెంట్ను పూర్తిగా తొలగించడం కోసం టెలిగ్రామ్ తన అంతర్గత సాంకేతిక వ్యవస్థలను బలోపేతం చేయాలి.
2) పదేపదే పైరసీకి పాల్పడుతున్న ఛానెళ్లు, గ్రూపులు, బాట్లు, ఖాతాలతో పాటు వాటి నిర్వాహకులు, సంబంధిత సంస్థలపై శాశ్వత చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
3) చలనచిత్ర నిర్మాతలు, ఓటీటీ ప్లాట్ఫారమ్లు, చట్ట అమలు సంస్థలు నేరుగా ఫిర్యాదులు చేయడానికి వీలుగా టెలిగ్రామ్ కలిగి ఉన్న ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ వివరాలను సమర్పించాలని మంత్రిత్వ శాఖ కోరింది.
4) ప్లాట్ఫారమ్ నుండి పైరసీ కంటెంట్ను నిరోధించడానికి ఇప్పటివరకు తీసుకున్న, తీసుకోబోయే చర్యలపై 'యాక్షన్ టేకెన్ రిపోర్ట్' సమర్పించడానికి టెలిగ్రామ్కు 15 రోజుల గడువు ఇచ్చారు.
కేంద్రం హెచ్చరిక.. చట్టపరమైన నిబంధనలు..
"ప్రభుత్వం ఒక్కొక్క పైరసీ ఛానెల్ను గుర్తించే వరకు టెలిగ్రామ్ కేవలం వేచి చూడకూడదు" అని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఐటీ చట్టం, 2000.. ఐటీ నిబంధనలు, 2021 ప్రకారం ఒక మధ్యవర్తిగా తగిన శ్రద్ధ వహించాల్సిన బాధ్యత టెలిగ్రామ్పై ఉంది. కేవలం ఏదో ఒక ఛానెల్ను డిలీట్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని కేంద్రం తేల్చిచెప్పింది. (గతంలో ప్రభుత్వం ఇలాంటి 3,000కు పైగా టెలిగ్రామ్ ఛానెళ్లపై చర్యలు తీసుకుంది).
భారతదేశంలో కాపీరైట్ ఉల్లంఘన అనేది కేవలం సివిల్ వివాదం మాత్రమే కాదు. కాపీరైట్ చట్టం, 1957.. సినిమాటోగ్రాఫ్ చట్టం, 1952 ప్రకారం ఇది తీవ్రమైన క్రిమినల్ నేరం. పైరసీ కంటెంట్ నిరంతరం అందుబాటులో ఉన్నా, నిబంధనలను పాటించకుండా తప్పించుకోవాలని చూసినా లేదా అసంపూర్ణంగా స్పందించినా.. చట్టపరమైన నిబంధనల ప్రకారం టెలిగ్రామ్పై తదుపరి కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది.
ఈ చర్య ఎందుకు ముఖ్యం?
భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న సృష్టికర్తల ఆర్థిక వ్యవస్థ, చలనచిత్ర పరిశ్రమ, ప్రసారకర్తలు, ఓటీటీ ప్లాట్ఫారమ్లు, నిర్మాతలు, పంపిణీదారుల హక్కులను, వారి శ్రమను, భారీ పెట్టుబడులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కఠినమైన చర్యకు పూనుకుంది.
Also Read: ఇథనాల్ పెట్రోల్తో మీ కారు, బైక్కి ప్రమాదమా? ఇంజిన్ తుప్పు పడుతుందా?
Also REad: క్రికెట్ ప్రపంచంలో మరో కొత్త క్రష్..ఆస్ట్రేలియా మహిళల టీమ్లో భారత సంతతి యువతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Flipkart GOAT సేల్ ధమాకా.. రూ.21 వేల లోపే Samsung 5G స్మార్ట్ఫోన్.. భారీ ఆఫర్లు!
Hyderabad, Telangana:Samsung Galaxy A14 5G Price: మీరు ఎప్పటి నుంచో అద్భుతమైన ఫీచర్లతో, తక్కువ బడ్జెట్లో ఒక ప్రీమియం 5G స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక అద్భుతమైన అవకాశం రానే వచ్చింది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart) సరికొత్త ఆఫర్లతో వినియోగదారుల ఎంతగానో ఆకట్టుకుంటోంది. జూలై 4వ తేదీన ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన Flipkart GOAT సేల్లో భాగంగా ప్రముఖ బ్రాండ్ సాంసంగ్కు చెందిన Samsung Galaxy A14 5G స్మార్ట్ఫోన్పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్ లుక్స్, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కారణంగా ప్రస్తుతం మార్కెట్లో దీనికి భారీ డిమాండ్ ఉంది.
ధర, ఫ్లాట్ డిస్కౌంట్ వివరాలు..
సాంసంగ్ గెలాక్సీ A14 5G స్మార్ట్ఫోన్ లోని టాప్-ఎండ్ వేరియంట్ 8 GB RAM + 128 GB స్టోరేజ్ (Black కలర్) మోడల్ అసలు ధర (MRP) మార్కెట్లో రూ. 22,999తో అందుబాటులో ఉండగా.. ఈ ప్రత్యేకమైన Flipkart GOAT సేల్లో భాగంగా కస్టమర్లకు ఏకంగా రూ.2,009 ఫ్లాట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.. ఈ తగ్గింపు తర్వాత ఈ ప్రీమియం స్మార్ట్ఫోన్ కేవలం రూ.20,990 లోపే వినియోగదారులకు సొంతం చేసుకునే సువర్ణావకాశం లభిస్తోంది.
అదనపు బ్యాంక్ ఆఫర్లు..
ఫ్లాట్ డిస్కౌంట్తోనే ఆఫర్లే కాకుండా అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉండడం విశేషం.. ఇందులో భాగంగా కొనుగోలు చేసే కస్టమర్లకు మరింత లాభం కలుగుతుంది. ఇందులో భాగంగా ఫ్లిప్కార్ట్తో అనుసంధానమైన యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) లేదా ఎస్బీఐ (SBI) బ్యాంక్ క్రెడిట్ కార్డ్లను ఉపయోగించి పేమెంట్ చేస్తే, కస్టమర్లకు దాదాపు రూ.1,500 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఇవే కాకుండా పాత ఫోన్ను ఎక్స్ఛేంజ్ చేసుకోవాలనుకునే వారి కోసం బెస్ట్ ఎక్స్ఛేంజ్ వాల్యూతో పాటు నో-కాస్ట్ EMI (No-Cost EMI) వంటి ఆకర్షణీయమైన అదనపు ఆఫర్లు కూడా ఈ సేల్లో అందుబాటులో ఉన్నాయి.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ప్రీమియం ఫీచర్ల..
సాంసంగ్ గెలాక్సీ A14 5G స్మార్ట్ఫోన్ అద్భుతమైన ఫీచర్స్తో అందుబాటులో ఉంది. ఇది అద్భుతమైన స్క్రీన్, స్మూత్ రీఫ్రెష్ రేట్తో విజువల్స్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.. 8 GB భారీ ర్యామ్ ఉండటం వల్ల మల్టీటాస్కింగ్, గేమింగ్ ఎంతో స్మూత్గా నడుస్తుంది. ఇది అదిరిపోయే క్వాలిటీతో ఫొటోలు తీసేందుకు వీలుగా ఇందులో అద్భుతమైన కెమెరా సెటప్ను కూడా అందిస్తోంది. అలాగే రోజంతా బ్యాటరీ లైఫ్ను అందించేందుకు పవర్ఫుల్ బ్యాటరీ బ్యాకప్ కూడా లభిస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ethanol Blending Issues: ఇథనాల్ పెట్రోల్తో మీ కారు, బైక్కి ప్రమాదమా? ఇంజిన్ తుప్పు పడుతుందా? ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాదా?
Hyderabad, Telangana:Ethanol Blending Issues News: దేశవ్యాప్తంగా ఇథనాల్ కలిపిన ఇంథనాన్ని (E20) వాడకంపై వాహనదారుల్లో ఎన్నో సందేశాలు నెలకొన్నాయి. అలాగే సోషల్ మీడియాలో అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే "E20 పెట్రోల్ వాడితే ఇంజిన్లు పాడైపోతాయా? ఇన్సూరెన్స్ రాదా? పర్యావరణానికి కీడా?" అంటూ వస్తున్న అసత్య ప్రచారాలకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఒక సుదీర్ఘమైన, 10-అంశాల వివరణాత్మక ప్రకటనతో వినియోగదారుల అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసింది.
అమెరికా, బ్రెజిల్ వంటి అంతర్జాతీయ దేశాల అనుభవాలను, పటిష్టమైన శాస్త్రీయ పరిశోధనలను అధ్యయనం చేసిన తర్వాతే ఈ విధానాన్ని భారత్లో ప్రవేశపెట్టామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇథనాల్ తయారీతో నీటి కొరత వస్తుందా?
ఒక లీటరు ఇథనాల్ ఉత్పత్తికి 10 వేల లీటర్ల నీరు అవసరమవుతుంది, దీనివల్ల దేశంలో నీటి ఎద్దడి వస్తుందనే అపోహ చాలామందిలో ఉంది. అయితే ఆధునిక డిస్టిలరీలు అత్యంత అధునాతన సాంకేతికతను వాడుతున్నాయి. ప్రస్తుతం ఒక లీటర్ ఇథనాల్ తయారీకి కేవలం 3 నుండి 5 లీటర్ల శుద్ధి చేసిన నీరు మాత్రమే ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా, ఈ కర్మాగారాలు 'జీరో లిక్విడ్ డిశ్చార్జ్' (ZLD) వ్యవస్థను పాటిస్తూ నీటిని నిరంతరం రీసైకిల్ చేస్తున్నాయి. కాబట్టి భూగర్భ జలాలు హరించిపోతాయనే వాదన ముమ్మాటికీ తప్పని కేంద్రం తేల్చేసింది.
ఆహార భద్రతకు ముప్పు ఉందా?
దేశీయ ఆహార అవసరాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) కోటా పూర్తిగా తీరిన తర్వాత.. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) వద్ద మిగిలిపోయిన మిగులు బియ్యం, పాడైపోయిన ధాన్యాలు, చెరకు రసాన్ని మాత్రమే ఇథనాల్ తయారీకి వినియోగిస్తున్నారు. కాబట్టి దీనివల్ల ఆహార కొరత వచ్చే అవకాశమే లేదు.
కారు, బైక్ ఇంజిన్లు దెబ్బతింటాయా?
భారత వాహన తయారీ సంస్థల సంఘం (SIAM) భాగస్వామ్యంతో కఠినమైన 'మెటీరియల్ కంపాటబిలిటీ' పరీక్షలు జరిపిన తర్వాతే E20 ఇంధనాన్ని మార్కెట్లోకి తెచ్చారు. ఇథనాల్ వల్ల ఇంజిన్ భాగాలు తుప్పు పడతాయనే ఆందోళనల నేపథ్యంలో, చమురు సంస్థలు పెట్రోల్లో ప్రత్యేకమైన యాంటీ-కొరోసివ్ అడిటివ్స్ను కలుపుతున్నాయి.
ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న కొత్త వాహనాలన్నీ E20 ఇంధనానికి అనుకూలంగానే తయారవుతున్నాయి. పాత వాహనాల్లో దీనివల్ల ఎలాంటి తక్షణ ప్రమాదాలు జరగవని శాస్త్రీయంగా నిరూపితమైంది.
బీమా (Insurance) క్లెయిమ్ తిరస్కరిస్తారా?
కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించి, సరఫరా చేస్తున్న ఇంధనాన్ని వాడినప్పుడు బీమా కంపెనీలు క్లెయిమ్లను నిరాకరించే అధికారమే లేదు. ఇన్సూరెన్స్ రాదనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.
పర్యావరణానికి, ఆర్థిక వ్యవస్థకు కలిగే లాభాలు..
ఐఐటీ (IIT) వంటి ప్రతిష్టాత్మక సంస్థల పరిశోధనల ప్రకారం.. సాధారణ పెట్రోల్తో పోలిస్తే E20 ఇంధనం వల్ల హానికరమైన కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి. ముడి చమురు దిగుమతుల కోసం విదేశాలకు తరలిపోయే వేల కోట్ల రూపాయల విదేశీ మార్పిడి ద్రవ్యం ఆదా అవుతుంది. ఆదా అయిన సొమ్ము ఇథనాల్ సరఫరా చేసే దేశీయ చెరకు, ధాన్యపు రైతుల ఖాతాల్లోకి నేరుగా చేరుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోంది.
పర్యావరణ పరిరక్షణ, ఇంధన భద్రత, రైతు సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రతిష్టాత్మక జాతీయ ప్రాజెక్టుపై స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు వ్యాప్తి చేస్తున్న నిరాధారమైన పుకార్లను పౌరులు, వాహనదారులు నమ్మవద్దని కేంద్ర ప్రభుత్వం గట్టిగా విజ్ఞప్తి చేసింది.
(గమనిక: ఇక్కడ పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని కేంద్ర ప్రభుత్వ నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత విషయాలపై అధికారిక వెబ్సైట్ను సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: AP Gold Mines: ఏపీలో మరో బంగారు గని? లక్షన్నర హెక్టార్లలో బంగారు ఖనిజ నిక్షేపాలు!
Also Read: "నీ తొడల సైజ్ ఎంత?".. స్టార్ డైరెక్టర్ అడిగిన ప్రశ్నకు బిత్తరపోయిన మౌనీషా చౌదరి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
BLA Suicide Bombing: పాకిస్థాన్లో భారీ ఆత్మాహుతి దాడి..30 మందికి పైగా పారామిలిటరీ బలగాలు మృతి!
Karachi, Sindh:BLA Suicide Bombing News: పాకిస్థాన్ ఆర్మీ జవాన్లపై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. బలూచిస్తాన్లోని గ్వాదర్ జిల్లాలో పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ శిబిరంపై జరిగిన ఆత్మాహుతి దాడికి తామే బాధ్యులమని నిషేధిత బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది. ఈ దాడిలో 30 మందికి పైగా పారామిలిటరీ సిబ్బంది మరణించగా, పలువురు గాయపడ్డారని ఆరోపించింది.
అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం.. పేలుడు పదార్థాలతో నిండిన వాహనం జీవానీలోని పన్వాన్ కోస్ట్ గార్డ్ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుందని BLA పేర్కొంది. ఈ దాడిని ఒక సమన్వయ ఆపరేషన్లో భాగంగా జరిపిన ఆత్మాహుతి వాహన ఆధారిత పేలుడు పరికరాల దాడిగా అభివర్ణించింది.
"ఈ శక్తివంతమైన పేలుడు ఫలితంగా, కోస్ట్ గార్డ్స్ పటిష్టమైన వలసవాద శిబిరం పూర్తిగా శిథిలాల కుప్పగా మారిపోయింది" అని BLA ప్రతినిధి జీయంద్ బలూచ్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపినట్లు 'ది బలూచిస్తాన్ పోస్ట్' నివేదించింది.
"దాడి జరిగిన వెంటనే, మా సంస్థ హై కమాండ్ దళమైన ఫతే స్క్వాడ్, వేగంగా, వ్యవస్థీకృత పద్ధతిలో ముందుకు సాగి, ధ్వంసమైన శిబిరంపై అన్ని వైపుల నుండి దాడి ప్రారంభించింది" అని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించిన ఆ బృందం, ఈ పేలుడు శిబిరాన్ని "పూర్తిగా ధ్వంసం చేసిందని" భద్రతా సిబ్బందిలో భారీ ప్రాణనష్టం కలిగించిందని ఆరోపించింది.
పాకిస్తానీ పారామిలిటరీ దళాలకు చెందిన 30 మందికి పైగా సభ్యులు మరణించారని, డజన్ల కొద్దీ ఇతరులు తీవ్రంగా గాయపడ్డారని బీఎల్ఏ ఇంకా పేర్కొంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా అది తెలిపింది. "గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటం, శిథిలాల కింద చిక్కుకున్న సిబ్బందిని దృష్టిలో ఉంచుకుంటే, శత్రువుల ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది" అని బీఎల్ఏ ప్రతినిధి పేర్కొన్నారు.
ఆ ప్రకటన ప్రకారం.. కోస్ట్ గార్డ్ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగిన తర్వాత, సాయుధ బీఎల్ఏ యూనిట్లు తదుపరి ఆపరేషన్లను ప్రారంభించాయి. ఆత్మాహుతి దాడికి సంబంధించిన వీడియోను బీఎల్ఏ విడుదల చేసింది.
ఈ ఆత్మాహుతి దాడికి సంబంధించిన 43-సెకన్ల వీడియోను కూడా బీఎల్ఏ మీడియా విభాగం 'హకల్' విడుదల చేసింది. పేలుడుకు కొన్ని క్షణాల ముందు పేలుడు పదార్థాలతో నిండిన ట్రక్కు శిబిరంలోకి ప్రవేశించడం, ఆ తర్వాత భారీ అగ్నిగోళం కనిపించడం ఈ వీడియోలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
బీఎల్ఏ చేసిన ప్రాణనష్టం వాదనలను పాకిస్తానీ అధికారులు వెంటనే ధృవీకరించలేదు. ఈ ఘటనపై అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేది ఒక నిషేధిత వేర్పాటువాద సంస్థ. ఇది బలూచిస్తాన్లో పాకిస్తానీ భద్రతా దళాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన పలు దాడులకు బాధ్యత వహించింది.
Also Read: చాక్లెట్ దొంగతనం చేశాడని ఉద్యోగి తొలగింపు..చివరికి పోయి ఉద్యోగి కాళ్లు పట్టుకున్నారు
Also Read: టిక్టాక్లో లవర్స్ కిస్సింగ్ వీడియో..పబ్లిక్లో దారుణంగా కొరడా దెబ్బలతో శిక్ష!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
భద్ర రాజయోగం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, వ్యాపారంలో భారీ లాభాలు..
Hyderabad, Telangana:Bhadra Rajayoga 2026 Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ నెలలో ఒక ముఖ్యమైన గ్రహాల మార్పు జరగబోతోంది. ఈ మార్పు కారణంగా అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన భద్ర రాజయోగం ఏర్పడబోతోంది.. జూలై 7వ తేదీ నుంచి బుధ గ్రహం ప్రత్యేకమైన ప్రభావం ఏర్పడడం కారణంగా ఈ రాజయోగం మొదలవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహాన్ని బుద్ధి, వాక్చాతుర్యం, విద్య, వ్యాపారం, కమ్యూనికేషన్తో పాటు ఆలోచనలకు కారకుడిగా పరిగణిస్తారు. బుధుడు జూన్ చివరలోనే మిథునరాశిలోకి ప్రవేశించగా.. జూలై 7 నుంచి దీని ప్రభావం మరింత బలంగా మారబోతోంది.. బుధుడు తన సొంత రాశిలో లేదా ఉచ్ఛ రాశిలో మంచి స్థానంలో ఉన్నప్పుడు ఈ భద్ర రాజయోగం ఏర్పడుతుంది. ఈ శుభ యోగం కారణంగా కొన్ని రాశుల వారి కెరీర్, వ్యాపారం, ఆర్థిక స్థితి, నిర్ణయం తీసుకునే సామర్థ్యంపై సానుకూల ప్రభావం పడనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ క్రింది 3 రాశుల వారు ఈ యోగం వల్ల విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
ఆ అదృష్టాన్ని పొందే రాశుల వారు వీరే..
కర్కాటక రాశి (Cancer)
భద్ర రాజయోగం ప్రభావంతో కర్కాటక రాశి వారికి ఉద్యోగ, ఉపాధి రంగాలలో అద్భుతమైన సానుకూల మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. వీరి కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు నిర్ణయాత్మక శక్తి గణనీయంగా పెరుగుతుంది. దీనివల్ల కార్యాలయంలో పైఅధికారుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు, కెరీర్లో కొత్త లాభదాయకమైన అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా మారుతుంది..
ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ సమయం వ్యాపార పరంగా ఎంతో లాభదాయకంగా ఉండబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు (Partnership Businesses) చేసే వారికి భారీ విజయాలు కలిగే అవకాశాలు కూడా కనిసిస్తున్నాయి. మార్కెట్లో ధనుస్సు రాశివారికి సంబంధించిన పరపతి విపరీతంగా పెరుగుతుంది. లాభదాయకమైన ఒప్పందాలు లేదా పెద్ద ప్రాజెక్టులు మీ ముందుకు వచ్చే ఛాన్స్లు కూడా కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపార విస్తరణకు ఇది అత్యంత అనుకూలంగా మారుతుంది.
మీన రాశి (Pisces)
మీన రాశి వారికి ఈ భద్ర రాజయోగం వల్ల కుటుంబ, ఆస్తి పరమైన విషయాలలో శుభ ఫలితాలు కలుగుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన ఆస్తి వివాదాలు త్వరలోనే పరిష్కారం కాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొత్త వాహనాలు లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఉద్యోగస్తులకు ఆశించిన పదోన్నతి లేదా కార్యాలయంలో కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి..
ఈ రంగాల వారికి గోల్డెన్ పీరియడ్!
జ్యోతిష్య నిపుణుల అందించిన సమాచారం ప్రకారం.. ఈ రాజయోగం వల్ల సమాజంలో వ్యక్తుల ఆలోచనా విధానంతో పాటు జ్ఞానం విపరీతంగా పెరుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మీడియా, జర్నలిజం, రచనా రంగం, మార్కెటింగ్, సేల్స్, బిజినెస్తో పాటు క్రియేటివ్ రంగాలలో ఉన్నవారికి ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో అద్భుతమైన విజయాలను అందిస్తాయి.
(నోట్: ఈ సమాచారం సాధారణ జ్యోతిష్య నమ్మకాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా తీసుకు రాసింది మాత్రమే. వ్యక్తిగత జాతక చక్రాలతో పాటు గ్రహాల స్థితులను బట్టి రాశులవారి జీవితాల్లో ఫలితాలు, మార్పులు ఉంటాయి.)
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
