కూరగాయల మార్కెట్ భవనానికి మాజీ ఎమ్మెల్యే మల్లేష్ పేరు పెట్టాలి
Bellampalle, Telangana:మంచిర్యాల జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో నూతనంగా నిర్మించిన కూరగాయల సముదాయానికి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ నామకరణం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కి నాయకులు మెమోరాండం అందజేశారు. బెల్లంపల్లి అభివృద్ధి కొరకు తన జీవితాంతం కృషిచేసిన గుండ మల్లేష్ పేరు పెట్టడమే సరైన నిర్ణయం అన్నారు. అప్పుడే పట్టణ ప్రజలు హర్షిస్తారని పేర్కొన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
బాధితుల వ్యక్తిగత ప్రైవసీ రక్షణకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
Hyderabad, Telangana:Victims Identity Privacy: లైంగిక దాడికి తీవ్ర మనో వేదనలో ఉన్న బాధితులకు వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ఉన్న వీడియోలు, ఫొటోలు, డిజిటల్ కంటెంట్పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. లైంగిక దాడికి గురైన బాధితుల వ్యక్తిగత గోప్యత.. వారి ఆత్మగౌరవాన్ని కాపాడేలా తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బాధితురాలిని ముఖం బహిర్గతం చేస్తూ ఉన్న కంటెంట్ను తొలగించాలని పలు సంస్థలకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. బాధితుల డిజిటల్ ప్రైవసీకి విఘాతం కలిగిస్తున్న 200 కంటే ఎక్కువ వీడియోలు, ఫొటోలు, సోషల్ మీడియా పోస్టులను వెంటనే డిలీట్ చేయాలని యూట్యూబ్, గూగుల్, మెటా, ఎక్స్ సంస్థలకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. బాధితుల రాజ్యాంగ హక్కులను పునరుద్ధరిస్తూ జస్టిస్ బి. విజయ్సేన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.
లైంగిక దాడికి గురయిన బాధితురాలి తరఫున హైకోర్టు అడ్వకేట్ నాగుర్బాబు రిట్ పిటిషన్ను దాఖలు చేయగా హైకోర్టు విచారణ చేపట్టింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల గ్రీవెన్స్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా బాధితుల గోప్యతకు భంగం కలిగించే కంటెంట్ను తొలగించడంలో విఫలమయ్యారని న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. తమ ఫొటోలు, వీడియోలు డిజిటల్ మాధ్యమాల్లో ప్రసారమవుతుండడంతో బాధితురాలి ఆత్మగౌరవానికి, సమాజంలో జీవించేందుకు తీవ్ర భంగం వాటిల్లుతోందని వివరించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 ప్రకారం జీవించే హక్కు, ప్రైవసీ హక్కులకు ఇది భంగమని అడ్వకేట్ నాగుర్బాబు వాదనలు వినిపించారు. ఐటీ చట్టం-2000, ఐటీ ఇంటర్మీడియరీ రూల్స్-2021తో పాటు లైంగిక దాడి బాధితుల గుర్తింపును ఏ సమయంలోనూ బయటపెట్టరాదని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను ప్రస్తావించారు. ఈ కంటెంట్ తరచూ ప్రసారం చేస్తుండడంతో బాధితురాలు మానసిక వేదనకు గురవుతున్నారని న్యాయస్థానానికి అడ్వకేట్ నాగుర్బాబు వాదించారు.
పిటిషనర్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. ఈ సందర్భంగా డిజిటల్ మీడియా సంస్థలపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖతోపాటు యూట్యూబ్, గూగుల్, మెటా, ఎక్స్ ప్లాట్ఫామ్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అత్యవసర మధ్యంతర ఉపశమనం కింద రిట్ పిటిషన్ అనుబంధం-ఏలో పేర్కొన్న 200కి పైగా వివాదాస్పద యూట్యూబ్ వీడియోలు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ పోస్టులను వెంటనే తొలగించాలని ఆదేశించింది. లేదంటే బ్లాక్ చేయాలని చెప్పింది. దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 20వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.
AP Devotee Tragedy: అరుణాచలం క్షేత్రంలో తీవ్ర విషాదం..మోక్ష మార్గం గుహలో ఇరుక్కొని ఆంధ్రప్రదేశ్ భక్తుడు మృతి!
Tiruvannamalai, Tamil Nadu:Arunachalam Devotee Death: తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరువణ్ణామలైలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మోక్ష మార్గంగా భావించే ఓ ఇరుకైన గుహలో ఇరుక్కుపోయి ఆంధ్రప్రదేశ్కు చెందిన భక్తుడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు.
అసలు ఏం జరిగింది?
ఆంధ్రప్రదేశ్కు చెందిన మణికుమార్ (36) తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి తిరువణ్ణామలైలోని శ్రీ ఉన్నాములయ్యమ్మన్ సమేత అరుణాచలేశ్వర స్వామి ఆలయ దర్శనానికి వెళ్లారు. దర్శనానంతరం రాత్రి 11 గంటల ప్రాంతంలో గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న 'ఇడుక్కు పిల్లయ్యార్' ఆలయానికి చేరుకున్నారు. తెలుగు భక్తులు దీనిని సాధారణంగా 'మోక్ష మార్గం' అని పిలుస్తారు.
ఈ గుహ ఆకారంలో ఉండే ఆలయంలో భక్తులు వెనుక ద్వారం నుంచి పడుకుని లోపలికి ప్రవేశించి, అత్యంత ఇరుకైన మార్గంలో పాకుతూ ముందు ద్వారం గుండా బయటకు రావాలి. మణికుమార్ శరీరాకృతి కాస్త లావుగా ఉండటంతో ఆయన గుహ మధ్యలోనే ఇరుక్కుపోయారు. కుటుంబ సభ్యులు, తోటి భక్తులు ఆయనను బయటకు లాగేందుకు తీవ్రంగా ప్రయత్నించినా సాధ్యపడలేదు.
గాలి ఆడక ఆయన అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఎంతో శ్రమించి బయటకు తీసినప్పటికీ, అప్పటికే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే 108 అంబులెన్స్లో తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ అకస్మిక పరిణామంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న తిరువణ్ణామలై తాలూకా పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
'ఇడుక్కు పిల్లయ్యార్' ప్రత్యేకత ఏమిటి?
గిరిప్రదక్షిణ మార్గంలో వెలసిన ఈ ఇడుక్కు పిల్లయ్యార్ ఆలయం ఒక చిన్న గుహలా ఉంటుంది. భక్తులు ఇరుకైన మార్గంలో పాకుతూ వెళ్లి బయటకు రావడం ఆచారంగా భావిస్తారు. బయటకు వచ్చిన తర్వాత నందిని, ఇడుక్కు పిల్లయ్యార్ను దర్శించుకోవడం అనవాయితీగా వస్తోంది. ఈ భక్తి ఆచారమే ఇపుడు ఒక ప్రాణాన్ని బలిగొనడంతో స్థానికంగా, భక్తుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
Also REad: ముఖేష్ అంబానీ మనవడు చదువుతున్న స్కూల్ ఏది? ఫీజు ఎంతంటే షాక్ అవ్వాల్సిందే!
Also REad: కేంద్ర మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆస్తుల వివరాలు..కోట్లలో సంపద, భారీగా అప్పులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
శ్రావణ మాసంలో జన్మించిన పిల్లలు ఎలా ఉంటారు?
Hyderabad, Telangana:Shravana Masam: పవిత్రమైన శ్రావణ మాసానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. శివారాధనకు అత్యంత అనుకూలమైన ఈ మాసంలో జన్మించే పిల్లలపై పరమశివుని ప్రత్యేక అనుగ్రహంతో పాటు ఆయన ప్రభావం స్పష్టంగా కనిపిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలుపుతున్నారు. స్కంద పురాణంలోని మహేశ్వర ఖండం, కేదార ఖండంతో పాటు శ్రావణ మాహాత్మ్యం అధ్యాయాలలో శ్రావణ మాసంలో జన్మించిన పిల్లల లక్షణాలు, వారి ప్రవర్తన, భవిష్యత్తు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
దృఢ సంకల్పంతో పాటు పట్టుదల..
శ్రావణ మాసంలో జన్మించిన పిల్లలు ఎంతో దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. వీరు ఏదైనా ఒక పనిని సాధించాలని మనస్సులో అనుకుంటే.. దానిని పూర్తి చేసే వరకు శ్రమిస్తూనే ఉంటారు. ఈ బలమైన పట్టుదలే కొన్నిసార్లు ఇతరులకు మొండితనంగా కనిపించినప్పటికీ.. వారి లక్ష్య సాధనకు ఇదే ప్రధాన కారణమవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
శాంత స్వభావం..
శివుని శక్తితో ఉండే ఈ పిల్లలు బయటకు ఎంతో ప్రశాంతంగా కనిపిస్తారు. అయితే, లోపల మాత్రం ఎంతో గంభీరమైన ఆలోచనాలను కలిగి ఉంటారని గ్రంథాలు చెబుతున్నాయి.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో వీరు ముందుంటారు. మాట తప్పని నిబద్ధత వీరి నైజం..
ఊహించని ఆత్మవిశ్వాసం..
ఈ మాసంలో పుట్టిన వారిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. తమ లక్ష్యాల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండి.. ఎలాంటి గందరగోళానికి గురికాకుండా అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏ రకమైన సవాళ్లు ఎదురైనా బెదిరిపోకుండా ఎదుర్కొనే ధైర్యం వీరి సొంతం..
బంధాలకు ప్రాధాన్యత..
భౌతిక సుఖసంతోషాలు, విలాసాల కంటే మానవ సంబంధాలకు, ఆత్మీయతకే వీరు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎంతో సున్నితమైన మనస్తత్వం కలిగి ఉండటం వల్ల కొన్నిసార్లు ఇతరులు వీరి ఆలోచనలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
IShowSpeed రికార్డును తుడిచిపెట్టేసిన PM Modi.. 24 గంటల్లో 303 మిలియన్ల వ్యూస్!
Hyderabad, Telangana:PM Modi Breaks IShowSpeed Records: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని మోదీ గురువారం అర్ధరాత్రి తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. యువత, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సున్నితమైన అంశం కావడం.. ప్రధాని స్వయంగా స్పందించడంతో ఈ వీడియో విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాను ఊపేసింది. ఊహించని రీతిలో, కేవలం 24 గంటల వ్యవధిలోనే ఈ వీడియో 303 మిలియన్ల (30.3 కోట్లు)కి పైగా వ్యూస్ సాధించి గ్లోబల్ రికార్డు సృష్టించింది.
ఫుట్బాల్ ప్రపంచకప్ రికార్డు క్రాష్..
ఇటీవల ముగిసిన ఫుట్బాల్ ప్రపంచకప్ (FIFA World Cup) సమయంలో ప్రపంచ ప్రసిద్ధ కంటెంట్ క్రియేటర్, ప్రముఖ యూట్యూబర్ IShowSpeed (స్పీడ్) పేరిట ఉన్న 300 మిలియన్ల వ్యూస్ రికార్డును ప్రధాని మోదీ వీడియో తుడిచిపెట్టేసింది. ప్రపంచంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడికి లేదా ఏ ఇతర కంటెంట్ క్రియేటర్కు కూడా ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో వ్యూస్ రాకపోవడం విశేషం..
ఒక్క రాత్రిలోనే 10 లక్షల మంది కొత్త ఫాలోవర్లు..
ఈ వీడియో వైరల్ అవ్వడమే కాకుండా ప్రధాని మోదీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్లు కూడా పెరిగారు. కేవలం ఒక్క రాత్రి వ్యవధిలోనే ప్రధాని ఇన్స్టాగ్రామ్ ఖాతాకు సుమారు 10 లక్షల (1 Million) మంది కొత్త ఫాలోవర్లు చేరారు. ప్రపంచంలోనే అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు కలిగిన రాజకీయ నేతగా ఉన్న మోదీ.. ఈ కొత్త మైలురాయితో డిజిటల్ ప్రపంచంలో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
సాధారణంగా స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన అంతర్జాతీయ స్టార్లకు మాత్రమే సోషల్ మీడియాలో ఈ స్థాయి వ్యూస్.. ఫాలోయింగ్ లభిస్తుంటాయి. అయితే, ఒక దేశ ప్రధాని పరిపాలనాపరమైన, విద్యార్థులకు కీలకమైన సమస్యపై పోస్ట్ చేసిన వీడియో గ్లోబల్ డిజిటల్ రికార్డులను తిరగరాయడం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
జెన్జీ ఉద్యమంతో దేశం గర్విస్తోంది.. విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ హ్యాట్సాఫ్
Hyderabad, Telangana:Salute To Students: నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థులు సాగిస్తున్న పోరాటానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం దిగివచ్చింది. విద్యార్థుల ఆందోళనకు తలొగ్గిన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుండగా.. వివిధ రంగాల ప్రముఖులు, ఆయా రాజకీయ పార్టీల నాయకులు స్పందిస్తున్నారు. ఈ పరిణామాన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది. విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ హ్యాట్సఫ్ చెప్పింది.
కేటీఆర్, హరీశ్ రావు స్పందన
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. 'అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తి ఎప్పుడూ గొప్పది. జెన్ జీ' అని పోస్టు చేసి విక్టరీ (✌️) ఎమోజీ పోస్టు చేశారు. బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. 'దేశంలోని యువతకు ఇది ఒక గొప్ప విజయం. సామాజిక దృక్పథంలో వస్తున్న మార్పు నిజంగానే కనిపిస్తోంది. అభినందనలు' అని పోస్టు చేశారు.
“Power of people is always greater than the people in power “
Gen Z ✌️
— KTR (@KTRBRS) July 25, 2026
Major victory for the country’s youth. The vibe shift is real.
Congratulations !!
— Harish Rao Thanneeru (@BRSHarish) July 25, 2026
తలసాని శ్రీనివాస్ యాదవ్
ఇక హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రెస్మీట్ నిర్వహించి దేశ రాజకీయ పరిణామాలపై స్పందించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్య విజయం.. విద్యార్థులు, యువత కాక్రోచ్ల విజయం అని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ తరపున విద్యార్థులకు హ్యాట్సాఫ్ చెప్పారు. విద్యార్థులను చూసి దేశం గర్విస్తోందని చెప్పారు. 'విద్యార్థుల ఉద్యమం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది' అని తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు.
'తరం మారుతోంది.. ఇక అందరి వైపు చూస్తుంది. లాఠీఛార్జ్ చేసినా.. దమనకాండకు పాల్పడినా.. దేశద్రోహులు అని చెప్పినా కేంద్రం దిగి రాక తప్పలేదు. విద్యార్థుల పోరాటంలో న్యాయం ఉందని కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంఘీభావం ప్రకటించారు' అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తుచేశారు. విద్యార్థుల పోరాటాన్ని చూసి ప్రభుత్వాలు గుణపాఠంలా తీసుకోవాలని చెప్పారు. మేనిఫెస్టోలు ప్రకటించే సమయంలో, హామీలు ఇచ్చేటపుడు పార్టీలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. 'విద్యార్థుల దెబ్బకు పార్లమెంట్ గేట్లు మూయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆలోచించండి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వారికి విద్యార్థులు ఇచ్చిన సమాధానం' అని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
దేశపతి శ్రీనివాస్ చురకలు
'ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ దేశ యువత సాధించిన అసాధారణ విజయం! ప్రజాస్వామ్య శక్తులకు ఇది నూతన ప్రేరణ. ప్రజలు పాలనలో జవాబుదారీతనాన్ని, కోరుకుంటున్నారు. ఇది కొత్త రాజకీయాలకు నాంది కావాలి. అవాక్కయిన అంధ భక్తులారా ఇక ఇన్స్టాగ్రామ్ యూనివర్సిటీ తెరుద్దామనే ఆలోచనలు ఆపి ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం నేర్చుకోండి' అని బీజేపీ నాయకులకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ సూచించారు.
రాజీనామా విద్యార్థుల ఉద్యమం ఫలితమే
'ప్రజాగ్రహానికి ఎవరైనా తల వంచాల్సిందే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఉద్యమం ఫలితమే' అని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం సంపూర్ణంగా విద్యార్థుల విజయం అని ప్రకటించారు. 'నీట్ ప్రశ్నా పత్రాల లీకేజి విషయంలో కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ వైఫల్యం స్పష్టంగా ఉంది. ఈ విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, యువకులు, విద్యావేత్తలు ఎంతగా కోరినా కేంద్రం పెడచెవిన పెట్టడంతోనే పరిస్థితి చేయి దాటింది' అని తెలిపారు.
pic.twitter.com/WOkqGbN526🔥యువత తిరగబడితే ఏ పీఠమైనా…
ఇది యువశక్తి విజయం... ప్రశ్నించే గొంతుకల విజయం!"
"అధికార మదం, అధిపత్య అహంకారం ఎంతటిదైనా... ప్రజాస్వామ్యంలో సమిష్టి విద్యార్థి చైతన్యం ముందు మోకాలిల్లాల్సిందే!
✊ విద్యార్థి ఉద్యమం ముందు అధిపత్య అహంకారం తలవంచక తప్పలేదు!💥ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా💥
— Prof Dasoju Sravan Kumar (@sravandasoju) July 25, 2026
Dharmendra Pradhan: నా ప్రియమైన బొద్దింకలకు అభినందనలు.. ప్రకాశ్ రాజ్ ట్వీట్ వైరల్
New Delhi, Delhi:Dharmendra Pradhan Resignation: రాజీలేకుండా.. ధృడసంకల్పంతో విద్యార్థులు అలుపెరగకుండా ఉద్యమం చేయడంతో భారత ప్రభుత్వం దిగివచ్చింది. విద్యార్థుల ఉద్యమానికి తలొగ్గిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఎట్టకేలకు రాజీనామా చేశాడు. ఆయన రాజీనామాతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామాపై పలు రంగాల ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్పందిస్తున్నారు. అయితే మొదటి నుంచి విద్యార్థులకు తోడుగా ఉన్న పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్, సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామాను స్వాగతించారు.
వాంగ్చుక్ స్పందన
నీట్ పేపర్ లీక్పై అవిశ్రాంత పోరాటం చేసిన పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్చుక్ ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామాపై ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ఇది ప్రజాస్వామ్య విజయం’ అంటూ పోస్టు చేశారు. ‘వీధుల నుంచే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ఇది శాంతి, సహనం, పట్టుదల సాధించిన విజయం. కాక్రోచ్ జనతా పార్టీ, దేశ యువతకు అభినందనలు తెలిపారు. భయాన్ని వీడి ఉద్యమంలో పాల్గొన్న ప్రజలకు కృతజ్ఞతలు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఇకపై ఉద్యమం జవాబుదారీతనం, విద్యాసంస్కరణల దిశగా ముందుకు సాగుతుంది' అని సోనమ్ వాంగ్చుక్ ప్రకటించారు.
IT'S A VICTORY OF DEMOCRACY
direct democracy... straight from the streets.
It's a victory of peace, patience & persévérance.
Congratulations CJP, Gen Z of the nation and thank you all citizens for shedding fear and the fear of fear and rising up from every corner of the nation.… pic.twitter.com/rSLOfvba2R— Sonam Wangchuk (@Wangchuk66) July 25, 2026
నీట్ పేపర్ లీక్పై సోనమ్ వాంగ్చుక్ ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లారు. జూన్ 28వ తేదీన కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు మద్దతుగా సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. 26 రోజులపాటు నిరాహారదీక్ష చేసిన ఆయన కేంద్ర ప్రభుత్వం హామీలతో గురువారం విరమించారు. ఆందోళనలో పాల్గొన్నవిద్యార్థులపై కేసులు, నీట్ వివాదం నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అంశాలపై కేంద్రం ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ప్రకాశ్ రాజ్ స్పందన
సోనమ్ వాంగ్చుక్ నేతృత్వంలో సాగిన ఉద్యమంపై ప్రశంసలు కురిపిస్తూనే బొద్దింకలు అదే విద్యార్థుల పోరాటంపై అభినందనలు తెలిపారు. అధికారాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందనే విషయాన్ని ఈ పోరాటం నిరూపించిందని 'ఎక్స్' వేదికగా ప్రకాశ్ రాజ్ పోస్టు చేశారు. ప్రకాశ్ రాజ్ చేసిన పోస్టుకు నెటిజన్లు వేగంగా స్పందిస్తున్నారు. విద్యార్థుల పోరాటానికి అండగా నిలిచిన ప్రకాశ్ రాజ్ను కూడా అభినందిస్తున్నారు.
Congratulations ❤️❤️❤️ my Dear Cockroaches.. Dear Sonam wangchuk sir and every single one who stood by the youth . You Have proved that you can bring a regime down to its knees . 💪💪💪 #justasking pic.twitter.com/efMYgbzxlf
— Prakash Raj (@prakashraaj) July 25, 2026
ట్వీట్ ఇదే!
'నా ప్రియమైన బొద్దింకల (కాక్రోచ్)కు అభినందనలు. ప్రియమైన సోనమ్ వాంగ్చుక్ సర్, యువత పక్షాన నిలబడిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. ఒక నిరంకుశ పాలనను మీరు మోకాళ్లపైకి తెప్పించగలరని నిరూపించారు'- ప్రకాశ్ రాజ్
జగిత్యాలలో విషజ్వరాల కలకలం.. రెండ్రోజుల్లో ఇద్దరు చిన్నారులు మృతి!
Hyderabad, Telangana:Jagtial Viral Fever: జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో విషజ్వరాలు పంజా విసిరాయి. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఆరేళ్ల చిన్నారులు జ్వరం బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.. ఒకే తరగతికి చెందిన ఆడుకునే స్నేహితులు వరుసగా మృతి చెందడంతో ఇరు కుంటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.
కన్నీరు మున్నీరవుతున్న కుటుంబాలు..
గ్రామానికి చెందిన హరిస్మిత (6), వరుణ్ తేజ (6) అనే చిన్నారులు పక్కపక్క ఇళ్లలోనే నివాసముంటూ.. స్థానిక పాఠశాలలో యూకేజీ (UKG) చదువుతున్నారు. ఎంతో ఆప్యాయంగా కలిసి ఆడుకునే ఈ చిన్నారులను విధి జ్వరం రూపంలో బలితీసుకుంది. కొద్దిరోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వరుణ్ తేజ రెండు రోజుల క్రితం పరిస్థితి విషమించి ప్రాణాలు వదిలాడు. ఆ విషాదం నుంచి కోలుకోకముందే.. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హరిస్మిత కూడా నిన్న ఉదయం తుదిశ్వాస విడిచింది.
గల్ఫ్ నుంచి వచ్చినా దక్కని కుమార్తె..
కూతురు హరిస్మిత ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలుసుకున్న తండ్రి కిరణ్, గల్ఫ్ నుంచి హుటాహుటిన స్వగ్రామానికి చేరుకున్నారు. కానీ.. వచ్చేసరికి కూతురు మరణించడంతో ఆయన గుండెలవిసేలా రోదించిన తీరు గ్రామాన్ని తీవ్రంగా కలచివేసింది. చిన్నారులిద్దరూ తీవ్రమైన విషజ్వరం (Viral/Toxic Fever) కారణంగానే మరణించినట్లు వైద్యులు ప్రాథమికంగా వెల్లడించారు.
రంగంలోకి వైద్య ఆరోగ్య శాఖ..
ఇద్దరు చిన్నారుల మృతితో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తక్షణమే స్పందించారు. పొరండ్ల గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాలను (Medical Camps) ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రజల ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రాథమిక సర్వే ప్రకారం.. గ్రామంలో సుమారు 20 మంది వివిధ రకాల జ్వరాలతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించి.. వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు.
గ్రామప్రజలు ఎవరూ అధైర్యపడకూడదని.. పరిసరాల పరిశుభ్రత పాటించడంతో పాటు తప్పనిసరిగా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని వైద్య అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా తీవ్రమైన జ్వరం, నీరసంతో పాటు వాంతులు, విరేచనాలు, తీవ్రమైన కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్ఎంపీలు లేదా నాటు వైద్యులను ఆశ్రయించి కాలాన్ని వృథా చేయవద్దని.. తక్షణమే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని అధికారులు ప్రజలను సూచిస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
సినిమా ఫక్కీలో స్కెచ్.. సిద్ధిపేట ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్!
Hyderabad, Telangana:Siddipet Latest News: సిద్ధిపేట జిల్లా కేంద్రంలో శనివారం తీవ్ర కలకలం రేగింది. వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చిన ఓ ఖైదీ.. పోలీసుల కళ్లుగప్పి సినిమా ఫక్కీలో పరారైన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బైక్ దొంగతనాల కేసులో రిమాండ్లో ఉన్న నిందితుడు సాయికుమార్ తప్పించుకోవడంతో పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఘటన వివరాల్లోకి వెళ్తే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బైక్ దొంగతనాల కేసులో నిందితుడైన సాయికుమార్తో పాటు మొత్తం ఏడుగురు ఖైదీలను క్రమశిక్షణా ప్రక్రియలో భాగంగా.. అలాగే జైలు నిబంధనల ప్రకారం.. మెడికల్ చెకప్ నిర్వహించేందుకు సిద్ధిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు.
ఆసుపత్రి ప్రాంగణంలో రోగుల రద్దీ ఎక్కువగా ఉండటాన్ని ఆసరాగా చేసుకున్న సాయికుమార్.. పోలీసులు అజాగ్రత్తగా ఉన్న సమయంలో వారి దృష్టిని మళ్లించి ఒక్కసారిగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఖైదీ మాయమైనట్లు గమనించిన సిబ్బంది వెంటనే తేరుకుని ఆసుపత్రి పరిసరాల్లో వెతికినప్పటికీ.. అప్పటికే అతడు పరారయ్యాడు.
పరారైన సాయికుమార్ పలు బైక్ దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. గతంలో వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తూ.. పోలీసులకు చిక్కాడు. న్యాయస్థానం అతనికి రిమాండ్ విధించడంతో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలోనే వైద్య పరీక్షలకు తీసుకురాగా ఈ ఊహించని ఘటన చోటుచేసుకుంది.
ఖైదీ పరార్ వార్త తెలిసిన వెంటనే జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఘటనపై తక్షణమే స్పందించి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల మండలాల్లోకి వెళ్లే ప్రధాన రహదారుల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేసిన్నట్లు తెలుస్తోంది.. ఆసుపత్రి పరిసరాల్లోని సీసీటీవీ (CCTV) కెమెరాల ఫుటేజీని సేకరించి.. అతడు ఏ వైపు పరారయ్యాడనే అంశంపై విశ్లేషిస్తున్నారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లతో పాటు రద్దీగా ఉండే ప్రదేశాల్లో పోలీసులు గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Mukesh Ambani Grandson: ముఖేష్ అంబానీ మనవడు చదువుతున్న స్కూల్ ఏది? ఫీజు ఎంతంటే షాక్ అవ్వాల్సిందే!
Mumbai, Maharashtra:Mukesh Ambani Grandson School Fee: ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా పేరుగాంచిన ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయం నిత్యం నెట్టింట వైరల్ అవుతుంటుంది. ముఖేష్, నీతా అంబానీ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్న విషయం తెలిసిందే. అయితే, ముఖేష్ అంబానీ పెద్ద మనవడు పృథ్వీ అంబానీ (ఆకాశ్ అంబానీ కుమారుడు) చదువుకుంటున్న స్కూల్, దాని ఫీజులకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
అంబానీ మనవడు చదువుతున్న స్కూల్ పేరు ఏంటంటే?
పృథ్వీ అంబానీ సాధారణ పాఠశాలల్లో కాకుండా, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. ఆయన చదువుతున్న స్కూల్ పేరు 'నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్' (NMAJS). ఈ పాఠశాలకు ప్రపంచంలోనే అత్యంత గౌరవప్రదమైన కరికులమ్ సంస్థ అయిన 'ఇంటర్నేషనల్ బాకలారియేట్ వరల్డ్ స్కూల్' (IB) గుర్తింపు ఉంది. ఇక్కడ పిల్లల ప్రాథమిక విద్య 'ప్రైమరీ ఇయర్స్ ప్రోగ్రామ్'తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 'మిడిల్ ఇయర్స్ ప్రోగ్రామ్' కూడా ఇక్కడే బోధిస్తారు.
ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC), జియో వరల్డ్ సెంటర్ ప్రాంగణంలో ఈ స్కూల్కు అత్యాధునికమైన రెండు భారీ క్యాంపస్లు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో బాలీవుడ్ ప్రముఖులు, నూతన తరం సెలబ్రిటీల పిల్లలు కూడా చదువుతుండటం విశేషం.
భారీగా స్కూల్ ఫీజులు!
ఈ స్కూల్లో ఫీజుల గురించి వింటే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. తరగతిని బట్టి జూనియర్ స్కూల్ ఫీజు సుమారు రూ.14 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుందని అంచనా. అంటే పృథ్వీ అంబానీ ప్రాథమిక విద్య కోసమే లక్షల్లో ఫీజు చెల్లిస్తున్నారు.
ఈ 'నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్' భారతదేశంలోనే నంబర్ వన్ ఇంటర్నేషనల్ స్కూల్గా పేరుగాంచిన ప్రఖ్యాత 'ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్' (DAIS)లో ఒక భాగం కావడం గమనార్హం. కేవలం ప్రాథమిక విద్యకే ఇంత భారీ స్థాయిలో ఫీజులు ఉంటే, ఉన్నత తరగతులకు ఫీజులు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు.
Also REad: కేంద్ర మంత్రి పదవికి రవ్నీత్ సింగ్ రాజీనామా..రాష్ట్రపతి ఆమోదం..!
Also REad: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..అసలు ఎవరీ ధర్మేంద్ర, ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. మహారాష్ట్ర సీఎంకు అధిష్టానం పిలుపు.. ఏం జరుగుతుంది?
Hyderabad, Telangana:Devendra Fadnavis Delhi Visit: కేంద్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు బీజేపీ అధిష్టానం నుంచి అత్యవసర పిలుపు రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఆయన హుటాహుటిన ఢిల్లీ పర్యటనకు సిద్ధం కావడంతో జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
కేంద్ర పెద్దల పిలుపుమేరకు ఢిల్లీ చేరుకోనున్న ఫడ్నవీస్.. బీజేపీ అగ్రనేతలు, భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడితో భేటీ కానున్నట్లు సమాచారం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఖాళీ అయిన కేంద్ర మంత్రివర్గ స్థానాన్ని భర్తీ చేయడం సహా, కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులు (Cabinet Reshuffle) చేపట్టేందుకు అధిష్టానం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది..
ఈ అత్యవసర భేటీలో పలు కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. మొదటగా.. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.. ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో కొత్తవారికి బాధ్యతలు అప్పగించడంతో పాటు కేంద్రంలో మహారాష్ట్ర నేతల ప్రాతినిధ్యంపై చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక వ్యూహాలపై అధిష్టానంతో చర్చించనున్నారు. మహారాష్ట్రలోని ప్రాంతీయ సమీకరణాలతో పాటు దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ వాతావరణంపై సమాలోచనలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..
రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ..
దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీ పర్యటన వెనుక పెద్ద వ్యూహాత్మక అడుగు ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు, మరోవైపు పార్టీ సంస్థాగత నియామకాలపై నిర్ణయాలు తీసుకునేందుకే అధిష్టానం ఆయనను అత్యవసరంగా పిలిపించినట్లు తెలుస్తోంది. ఫడ్నవీస్ భేటీ ముగిసిన తర్వాతే కేంద్రంలో జరగబోయే ఆ నిర్ణయాలపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Dharmendra Pradhan Net Worth: కేంద్ర మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆస్తుల వివరాలు..కోట్లలో సంపద, భారీగా పేరుకుపోయిన అప్పులు!
Hyderabad, Telangana:Dharmendra Pradhan Net Worth: నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారం, ఇతర పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్షాల నిరసనలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తుతం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా నిలిచారు. ఆయన రాజీనామా డిమాండ్తో విద్యార్థి సంఘాలు, కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేస్తుండటంతో.. తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ క్రమంలో ధర్మేంద్ర ప్రధాన్ వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానంతో పాటు ఆస్తుల వివరాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. ఆయన ఆస్తులు, అప్పుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మొత్తం ఆస్తులు, అప్పులు
2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆస్తుల విలువ సుమారు రూ.6.92 కోట్లుగా ఉంది. ఆయనపై వివిధ బ్యాంకులు, ఇతరుల నుంచి కలిపి మొత్తం రూ.2.30 కోట్ల మేర రుణాలు ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడీబీఐ (IDBI) బ్యాంకుల నుంచి ఆయన దాదాపు రూ.31.38 లక్షల రుణం తీసుకున్నారు.
బ్యాంక్ రుణాలతో పాటు ఆయన తన భార్యకు రూ.10 లక్షలు, తండ్రికి రూ.5 లక్షలు ఇవ్వడంతో పాటు మరికొంత మంది బంధువులకు కూడా వ్యక్తిగత అప్పులు ఇచ్చినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.
వార్షిక ఆదాయం
ఆదాయం విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ కంటే ఆయన సతీమణి ముందుండటం విశేషం. ధర్మేంద్ర ప్రధాన్ వార్షిక ఆదాయం రూ.12.75 లక్షలు కాగా, ఆయన భార్య వార్షిక ఆదాయం రూ.49.92 లక్షలుగా ఉంది.
పెట్టుబడులు, పొదుపులు
ధర్మేంద్ర ప్రధాన్ దంపతులు తమ సంపాదనలో సింహభాగాన్ని భద్రమైన ఆర్థిక పథకాల్లో మళ్లించారు. బ్యాంక్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు (FDs), పీపీఎఫ్ (PPF) ఖాతాల్లో సుమారు రూ.2.47 కోట్లు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్లలో రూ.80.40 లక్షల పెట్టుబడులు ఉన్నాయి. అలాగే ఎల్ఐసీ (LIC) తదితర బీమా పాలసీల విలువ రూ.67.72 లక్షలుగా ఉంది.
స్థిరాస్తులు (భూములు, ఇళ్లు)
ఒడిశాలో రూ.12 లక్షల విలువైన వ్యవసాయ భూమి, రూ. 20.50 లక్షల విలువైన వ్యవసాయేతర భూమి ఆయన పేరిట ఉన్నాయి. అదే విధంగా ఘజియాబాద్, భువనేశ్వర్లలో మంత్రి దంపతుల పేరిట సుమారు రూ.1.98 కోట్ల విలువైన ఇళ్లు ఉన్నాయి.
బంగారం, వెండి, వాహనాలు
ధర్మేంద్ర ప్రధాన్ వద్ద 200 గ్రాముల బంగారం, 2.5 కిలోగ్రాముల వెండి ఉండగా.. ఆయన భార్య వద్ద 500 గ్రాముల బంగారం, 10 కిలోగ్రాముల వెండి ఉన్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ వద్ద 2011 మోడల్ హోండా సిటీ కారు ఉండగా, ఆయన భార్య పేరిట పలు వాణిజ్య వాహనాలు నమోదై ఉన్నాయి.
Also Read: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..అసలు ఎవరీ ధర్మేంద్ర, ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి?
Also Read: కేంద్ర మంత్రి పదవికి రవ్నీత్ సింగ్ రాజీనామా..రాష్ట్రపతి ఆమోదం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ఆగస్టు 2 నుంచి కేతువు ఎఫెక్ట్.. ఈ 4 రాశుల వారికి తిరుగులేని రాజయోగం!
Hyderabad, Telangana:Ketu Transit Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో కేతువు గ్రహ సంచారానికి ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంటుంది.. గ్రహాల నక్షత్ర మార్పుల ప్రభావంతో ద్వాదశ రాశుల జీవితాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయి. రాబోయే ఆగస్టు 2న రాత్రి 12 గంటలకు కేతువు మఘ నక్షత్రం రెండవ పాదంలోకి సంచారం చేయబోతోంది.. ఈ నక్షత్ర పద సంచారం అక్టోబర్ 3 వరకు కొనసాగనుంది. ఈ సమయం నాలుగు ప్రత్యేక రాశుల వారికి అత్యంత శ్రేయస్సకరంగా మారడమే కాకుండా.. వారి ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారే అవకాశాలు ఉన్నాయి..
ఈ సమయంలో ఆయా రాశుల వారికి నూతన ఆదాయ మార్గాలు విపరీతంగా పెరుగుతాయి. కుటుంబంలో దీర్ఘకాలంగా వేధిస్తున్న విభేదాలు తొలగిపోయి శాంతి సౌఖ్యాలు వర్ధిల్లుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కేతువు శుభ దృష్టి వల్ల విపరీతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
ఈ రాశులవారికి బంపర్ జాక్ఫాట్..
కన్యా రాశి (Virgo)
కన్యా రాశి వారికి ఈ నక్షత్ర సంచారం అత్యంత అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. పట్టేదల్లా బంగారమే అన్నట్లుగా.. ప్రతి పనిలో విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నట్లు జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగంలో ఉన్నతాధికారుల మెప్పు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.. కీలక బాధ్యతలు స్వీకరిస్తారు. అంతేకాకుండా రాబడి నుంచి భారీ మొత్తంలో ధన లాభాలు కూడా కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది..
మేష రాశి (Aries)
కేతువు నక్షత్ర సంచారం కారణంగా మేష రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూల ఫలితాలను అందిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి పురోగతి కూడా కలుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఫలితంగా ఒక్కసారిగా రాబడి పెరిగి ఆర్థిక స్థిరత్వం కూడా విపరీతంగా పెరుతుంది.. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా.. సంతోషంగా మారుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు..
మిథున రాశి (Gemini)
మిథున రాశివారికి ఈ సమయం ఒక రకంగా గోల్డెన్ టైమ్గా భావించవచ్చు. వ్యాపారాన్ని విస్తరించడానికి నూతన పెట్టుబడులు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఉద్యోగంలో ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించి.. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.
ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి వారికి కేతు ప్రభావంతో కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి భారీ జీతంతో కూడిన మంచి ఆఫర్లు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి.. సమాజంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులందరి మధ్య అప్యాయత, సమన్వయం పెరుగుతాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Dharmendra Pradhan: ప్రజా ఉద్యమానికి ఎవరైనా తలొగ్గాల్సిందే.. మోదీపై 'బొద్దింకల' విజయం
New Delhi, Delhi:Dharmendra Pradhan Resignation: నీట్ పేపర్ లీక్ అంశం భారతదేశాన్ని ఒకతాటిపైకి తెచ్చింది. రాజ్యాంగం కల్పించిన ప్రశ్నించే హక్కు.. పోరాడే హక్కుతో విద్యార్థులు మొక్కవోని సంకల్పంతో పోరాడారు. నీట్ పేపర్ లీక్తో అమాయకులైన విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. లోపభూయిష్టమైన పరీక్ష విధానంతో లక్షలాది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. దానిపై విద్యార్థులు ఉద్యమించారు. న్యాయస్థానంలో బొద్దింకలుగా అవమానపడిన విద్యార్థులే ఇప్పుడు భారత ప్రభుత్వాన్ని కదిలించారు. ఢిల్లీ పీఠాలను కదిలించి గొప్ప విజయం సాధించారు. కొన్ని నెలలుగా సాగుతున్న పోరాటానికి.. కొన్ని వారాలుగా విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. విద్యార్థులు చేసిన ప్రధాన డిమాండ్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా. ఆయన రాజీనామా చేయడంతో విద్యార్థులు గెలిచారు. ఇది ఒక్క విద్యార్థుల విజయం కాదు ప్రజాస్వామ్య భారతదేశం గెలుపు. అన్యాయంపై బాధితులు సాధించిన విజయం ఇది.
కొన్ని వారాల విద్యార్థుల పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఎట్టకేలకు రాజీనామా చేశారు. రాజీనామా చేస్తూ లేఖ విడుదల చేశారు. ఆ లేఖను ప్రధానమంత్రికి పంపినట్లు ఎక్స్ వేదికగా ప్రకటించడంతో విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. నీట్ పేపర్ లీక్పై దేశ యువత కొన్ని నెలలుగా తీవ్ర పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సోనమ్ వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో విద్యార్థుల పోరాటం తీవ్ర రూపం దాల్చింది.
అలుపెరగని పోరాటం
అనంతరం కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ వద్ద కొన్ని వారాలుగా అలుపెరగని పోరాటం చేసింది. లాఠీచార్జ్ చేసినా.. బాష్పవాయువు ప్రయోగించినా.. కేసులు పెడతామని హెచ్చరించినా.. పాస్పోర్టులు రద్దు చేస్తామని ప్రకటించినా.. అత్యంత ప్రమాదకర వస్తువులు వాడి భద్రతా బలగాలు బెదిరింపులకు దిగినా విద్యార్థులు వెనకడుగు వేయలేదు. విద్యార్థుల పోరాటానికి యావత్ భారతదేశం కదిలివచ్చింది. ఢిల్లీలో ఆందోళనలు దేశంలోని ప్రతి గల్లీకి చేరాయి. ఒక్క అధికార పక్షం తప్ప అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాస్వామ్య సంఘాలు, విద్యార్థి, యువత, సామాజిక సంస్థలు అన్నీ కూడా ఈ పోరాటంలో భాగమయ్యాయి. భావి భారత పౌరులకు సంబంధించిన ఉద్యమంలో అందరూ చేరారు. దీంతో మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయడంతో విద్యార్థుల పోరాటం ఫలించింది. విద్యార్థుల పోరాటానికి నరేంద్ర మోదీ మెడలు వంచారు.
ఎంతటి నియంత అయినా
ప్రజాస్వామ్య దేశంలో ఎంతటి నియంత అయినా ప్రజా ఉద్యమానికి తలొగ్గాల్సిందే. పన్నెండేళ్లుగా భారతదేశాన్ని పరిపాలన చేస్తున్న నరేంద్ర మోదీ ఎట్టకేలకు ప్రజా ఉద్యమానికి దిగివచ్చాడు. విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మోడీ మెడలు వంచాడు. నీట్ పేపర్ లీక్ అంశంపై నూనుగు మీసాల పోరగాళ్లు చేస్తున్న ఉద్యమంతో ఢిల్లీ పీఠాలు కదిలాయి. దీంతో సుదీర్ఘ కాలం తర్వాత ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజా ఉద్యమం గెలిచింది.
అవమానం నుంచి విజయం దాకా
తరచూ తమ సమస్యలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులను దేశ సర్వోన్నత న్యాయస్థానం బొద్దింకలు అంటూ అవహేళన చేయగా.. నేడు అవే బొద్దింకలే నేడు భారత ప్రభుత్వం మెడలు వంచేలా చేశాయి. తిరుగులేని అధికారంతో.. విశ్వగురుగా పేరొందిన నరేంద్ర మోదీపైనే బొద్దింకలుగా పేర్కొన్న ఆ విద్యార్థులే విజయం సాధించారు. జయహో విద్యార్థుల్లారా అందుకో అభినందనలు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన రాజీనామా..'నేను బాధ్యత నుంచి తప్పించుకోలేదు' అంటూ ట్వీట్!
Hyderabad, Telangana:Dharmendra Pradhan Resigns: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. జరిగిన పరిణామాల వల్ల గత కొన్ని రోజులుగా విద్యార్థులు, సీజేపీ తీవ్రంగా స్పందించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. గత నాలుగు దశాబ్దాలుగా తాను విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్కరణల కోసం అంకితభావంతో పనిచేశానని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ సేవ చేసే అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, 2026 మే 3న జరిగిన నీట్ పరీక్ష లీకేజీ విషయం వెలుగులోకి రాగానే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడంతో పాటు పరీక్షను రద్దు చేసి, తిరిగి నిర్వహించింది. పరీక్షలను వచ్చే ఏడాది నుంచి పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తామని కూడా ప్రకటించామని ఆయన అన్నారు.
— Dharmendra Pradhan (@dpradhanbjp) July 25, 2026
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖలో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజాస్వామ్య శక్తిపై తనకు ఎల్లప్పుడూ అచంచలమైన విశ్వాసం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, దేశ యువత ఆశయాలు, కలలు, ఆకాంక్షల పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని, యువత కేవలం దేశ భవిష్యత్తు మాత్రమే కాదు, దేశ నిర్మాణానికి ప్రధాన శిల్పులని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. గత పది రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలను చూసి తన మనసు తీవ్రంగా కలత చెందిందని, ఇది వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని, భారతీయ యువశక్తే దేశానికి అసలైన బలం అని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వ్యతిరేక శక్తుల ప్రయోజనాలను వినియోగించుకోకుండా చూడాలని, దేశ ఐక్యత దెబ్బతినకూడదని ఆయన పేర్కొన్నారు. దేశంలోని ఏ ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదని, వారు తమ భవిష్యత్తును చదువుకే కేటాయించి దేశ నిర్మాణంలో దృష్టి పెట్టాలని కోరుతూ, ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రాజీనామా పత్రాన్ని గౌరవనీయ ప్రధానమంత్రి గారికి పంపించానని ధర్మేంద్ర ప్రధాన్ రాసుకొచ్చారు. అలాగే, తనపై నమ్మకం ఉంచి, నిరంతరం సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనతో కలిసి పనిచేసిన సహచర మంత్రులకు, మంత్రిత్వ శాఖ అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ, దేశసేవ తన జీవితంలో అత్యున్నత ప్రాధాన్యత అని, అందులో తాను ఎప్పటికీ అంకితభావంతో ఉంటానని పేర్కొన్నారు. శ్రీ జగన్నాథ స్వామి ఆశీస్సులతో భరతమాతకు, ఒడిశా ప్రజలకు, దేశ యువత ఆకాంక్షల సాధనకు భవిష్యత్తులో కూడా తన వంతు సేవలు అందిస్తూనే ఉంటానని ధర్మేంద్ర ప్రధాన్ తన లేఖలో ఎమోషనల్ అయ్యారు.
Also Read: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..అసలు ఎవరీ ధర్మేంద్ర, ఆయన బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Also Read: వివాదాలొచ్చినా చెక్కుచెదరని పదవి.. ధర్మేంద్ర ప్రధాన్పై మోదీకి అంత నమ్మకమెందుకు?
'ఇది విద్యార్థుల విజయం'..
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో, ఇది విద్యార్థుల విజయమని నెటిజన్లు పేర్కొంటున్నారు. వారు అనుకుంటే ఏదైనా సాధించవచ్చని పోస్టులు పెడుతూ, అనుకున్నది సాధించారని ప్రశంసిస్తున్నారు. విద్యార్థులు పట్టుబట్టి తలుచుకుంటే ఏ ప్రభుత్వమైనా దిగిరావాల్సిందేనని వారు మరోసారి నిరూపించారని అంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Dharmendra Pradhan: మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు కేంద్ర క్యాబినేట్ మద్దతు..అసలు ఎవరీ ధర్మేంద్ర ప్రధాన్, ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి?
Hyderabad, Telangana:Dharmendra Pradhan Biography: ప్రస్తుత విద్యాసంబంధ పరిణామాలు, నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురించి నెట్టింట, విద్యార్థి వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన నేపథ్యం, విద్యార్హతలు, రాజకీయ ప్రయాణం ఎలా సాగిందనే వివరాలు పరిశీలిద్దాం.
కుటుంబ నేపథ్యం, జననం
ధర్మేంద్ర ప్రధాన్ 1969 జూన్ 26న ఒడిశా రాష్ట్రంలోని తల్చేర్లో జన్మించారు. ఆయన తండ్రి డా.దేవేంద్ర ప్రధాన్ ప్రముఖ రాజకీయ నాయకుడు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో ఆయన కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించడం వల్ల ధర్మేంద్ర ప్రధాన్కు చిన్నతనం నుంచే ప్రజా జీవితంపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది.
విద్యార్హతలు
ధర్మేంద్ర ప్రధాన్ తన ప్రాథమిక విద్యను ఒడిశాలోనే పూర్తి చేశారు. ఆ తర్వాత తల్చేర్ కళాశాల నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. అనంతరం భువనేశ్వర్లోని ప్రఖ్యాత ఉత్కల్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించి, ఆంత్రోపాలజీ (మానవ శాస్త్రం)లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.
రాజకీయ ప్రయాణం
ఆయన విద్యార్థి దశలోనే రాజకీయ రంగప్రవేశం చేశారు. ఉత్కల్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న సమయంలో ఆరెస్సెస్ విద్యార్థి సంఘమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో క్రియాశీలకంగా పనిచేశారు. ఆ తర్వాత భారతీయ జనతా యువ మోర్చా (BJYM)లో చేరి వివిధ హోదాల్లో పనిచేశారు. ఒక దశలో BJYM జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు.
ఎన్నికల రాజకీయాలు, పదవులు
2000 సంవత్సరంలో తొలిసారిగా ఒడిశా శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాలంలో రాజ్యసభ సభ్యుడిగా కూడా సుదీర్ఘకాలం సేవలందించారు. ప్రస్తుతం ఆయన ఒడిశాలోని సంబల్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కేంద్ర మంత్రిగా సేవలు
నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ధర్మేంద్ర ప్రధాన్ పలు కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. గతంలో పెట్రోలియం & సహజ వాయువు శాఖ, ఉక్కు శాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రులుగా పనిచేశారు. ఆ తర్వాత 2021 జూలైలో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి అప్పటి నుంచి అదే పదవిలో కొనసాగుతున్నారు. ఒడిశా రాజకీయాల నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన బీజేపీ ప్రముఖులలో ఆయన ఒకరు.
Also Read; కేంద్ర మంత్రి పదవికి రవ్నీత్ సింగ్ రాజీనామా..రాష్ట్రపతి ఆమోదం..!
Also REad: "విద్యార్థులతో పాటు నిరసన చేయడానికి డబ్బులిస్తున్నారు" నటి ఆకాంక్ష సంచలన కామెంట్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
