తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన పలువురు గ్రామస్తులు
Bellampalle, Kannal Rural, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెద్దబూద గ్రామ శివారులో తాము నిర్మించుకున్న కట్టడాలను రెవెన్యూ అధికారులు నిన్న కూల్చివేయగా గురువారం గ్రామానికి చెందిన పలువురు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. గతంలో శివాలయం వద్ద నిర్మించుకుంటే వాటిని తొలగించి వేరే చోట తమకు స్థలం ఇప్పిస్తామని అధికారులు మాట ఇచ్చి మరిచారని, ఇప్పుడు తమ నిర్మాణాలు కూల్చి వేయడంతో తమకు నిలువ నీడ లేకుండా పోయిందని వాపోయారు. ఇంటి నిర్మాణాల కోసం తమకు స్థలం కేటాయించాలని కోరుతూ తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Dappu Srinu Remuneration: 'ఇరుముడి'లో 'మల్లెపూల పల్లకి' సెన్సేషన్.. సింగర్ డప్పు శ్రీనుకు భారీ రెమ్యునరేషన్..ఎన్ని లక్షలంటే?
Hyderabad, Telangana:Mallepoola Pallaki Dappu Srinu Remuneration: భక్తి, ఫ్యామిలీ సెంటిమెంట్ నేపథ్యంలో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా విడుదలైన 'ఇరుముడి' చిత్రం వందల కోట్ల రూపాయల కలెక్షన్లు సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. మాస్ మహారాజ్ రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. 105 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో సైలెంట్ హిట్లు ఉన్నప్పటికీ, ఎలాంటి హంగులు లేని ఒక భక్తి ప్రధాన చిత్రం ఈ స్థాయిలో ట్రెండ్ క్రియేట్ చేయడం విశేషం.
సినిమాను మించిన 'మల్లెపూల పల్లకి' పాట క్రేజ్
సినిమాల్లో పాటలు అసందర్భం అనే వాదనలకు చెక్ పెడుతూ, సందర్భోచితంగా వచ్చే పాట సినిమా విజయానికి ఎంతలా దోహదపడుతుందో 'ఇరుముడి'లోని "మల్లెపూల పల్లకి" పాట నిరూపించింది. చిత్రానికి వచ్చిన పేరు కంటే కూడా ఈ పాటకు వచ్చిన ఆదరణ రెట్టింపు స్థాయిలో ఉంది. ప్రస్తుతం థియేటర్లలో, పూజల్లో, సక్సెస్ మీట్లలో సైతం ఈ పాటే మార్మోగుతోంది.
థియేటర్లలో పాట వస్తున్నప్పుడు రవితేజ ఫ్యాన్స్, సాధారణ ప్రేక్షకులు, అయ్యప్ప భక్తులు హారతులు ఇస్తూ స్టెప్పులు వేస్తున్నారు. ఆడియో పరంగా ఇప్పటికే 24 మిలియన్ల వ్యూస్ సాధించగా, అయ్యప్ప మాల సీజన్ సమయానికి కోట్ల వ్యూస్ దాటే అవకాశముంది.
డప్పు శ్రీను ప్రతిభకు దర్శకుడి గౌరవం
ఈ పాటను జానపద గాయకుడు డప్పు శ్రీనివాస్ (డప్పు శ్రీను) సొంతంగా రాసుకొని, కంపోజ్ చేసుకున్నారు. సినిమాలో ఉపయోగించుకునేందుకు దర్శకుడు శివ నిర్వాణ, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ ఆయన్ను కలిసి అడగ్గానే వెంటనే ఇచ్చేశారు. సినిమా సక్సెస్కు ప్రధాన కారణం డప్పు శ్రీను అని, ఆయనకు తగిన గౌరవం ఇవ్వడానికే ఈ పాటను సినిమాలో ఉంచామని దర్శకుడు శివ నిర్వాణ వేదికపైనే వెల్లడించారు.
ఒక్క పాటకు అక్షరాల రూ.9 లక్షల పారితోషికం..
సినిమాలో పాడిన ఏకైక పాట కోసం చిత్ర నిర్మాతలు డప్పు శ్రీనుకు రూ.9 లక్షల భారీ పారితోషికం అందించారు. ఒక డెబ్యూ సింగర్కి ఈ స్థాయిలో గుర్తింపుతో పాటు భారీ రెమ్యునరేషన్ లభించడం చాలా అరుదు. సోషల్ మీడియాలో సినిమా సక్సెస్ క్రెడిట్పై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, వంద కోట్ల సినిమాలో అవకాశం దక్కడంతో పాటు రూ.9 లక్షల పారితోషికం, విశేష ఆదరణ లభించి ఆయనకు సరైన న్యాయమే జరిగిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read: 'దశావతారం' థీమ్తో బిగ్బాస్ తెలుగు సీజన్ 10..సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంఛ్..
Also Read: మంత్రి నారా లోకేష్ వద్దకు 'ఇరుముడి' పంచాయితీ! వివాదాల నడుమ ఉపాధ్యాయ సంఘాల ఫిర్యాదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Konda Surekha: కొండా సురేఖ ఫొటో, పేరు మాయం.. మంత్రిగా అనధికారికంగా తొలగించారా?
Kesamudram, Telangana:Warangal Politics: తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ వ్యవహారం తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆమెను త్వరలో మంత్రివర్గం నుంచి తొలగిస్తారనే ప్రచారం జరుగుతున్న సమయంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆమె పేరు, ఫొటో కనిపించడం లేదు. మంత్రివర్గం నుంచి అనధికారికంగా తొలగించారా? అనే చర్చ జరుగుతోంది. ఇటీవల తొర్రూరు మండలంలోని గూడూరులో మంత్రి కొండా సురేఖ పేరు కనిపించలేదు. మరోసారి అధికారిక కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ చిత్రపటం, పేరు మాయమైంది.
మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఫ్లెక్సీ రగడ రాజుకుంది. అధికారిక కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ ఫ్లెక్సీ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. శంకుస్థాపన ఫలకాలపై కూడా మంత్రి కొండా సురేఖ పేరు లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. కార్యక్రమంలో ఏర్పాటుచేసిన సీట్లపై మంత్రి పేరు కనిపించకపోవడం విశేషం. కొద్దిరోజులుగా కొండా సురేఖ వ్యవహారంపై చర్చ కొనసాగుతుండగా.. తాజాగా ఫ్లెక్సీ వివాదం మరువకముందే మరో ఘటన ఇలా జరిగింది.
మహబూబాబాద్ జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. కేసముద్రం మండల కేంద్రంలో 1 కోటి 90 లక్షల రూపాయలతో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్కు ప్రారంభోత్సవం చేశారు. 4 కోట్ల 60 లక్షల రూపాయలతో మున్సిపల్ కార్యాలయం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇనుగుర్తి , దంతాలపల్లి, సీరోలు మండల కేంద్రాల్లో రూ.2.25 కోట్లతో తహసీల్ కార్యాలయాల భవనాల నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేశారు.
కేసముద్రం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన బహిరంగ సభలో కొండా సురేఖ కనిపించలేదు. బహిరంగ సభలో నారాయణపురం గ్రామానికి చెందిన 780 మంది రైతులకు భూ ఆధార్ పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. కేసముద్రం మండల కేంద్రంలో జరిగే అధికారిక కార్యక్రమంలో కొండా సురేఖ ఫ్లెక్సీ లేకపోవడం, శంకుస్థాపన ఫలకాలు, సీట్లపై కూడా మంత్రి కొండా సురేఖ పేరు లేకపోవడం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాకుండా తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమె చిత్రపటం, ఫొటో వినియోగించకూడదని అధికార యంత్రాంగానికి అనధికారిక ఆదేశాలు వెళ్లడంతో ఇలా వ్యవహారిస్తున్నారని సమాచారం.
Bigg Boss 10 Telugu: 'దశావతారం' థీమ్తో బిగ్బాస్ తెలుగు సీజన్ 10..సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంఛ్..కంటెస్టెంట్ల వివరాలివే!
Hyderabad, Telangana:Bigg Boss 10 Telugu Contestants: తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న టాప్ రియాలిటీ షో 'బిగ్బాస్ తెలుగు' పదవ సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. గత తొమ్మిది సీజన్లుగా బుల్లితెర వీక్షకులను ఎంతగానో అలరించిన ఈ షో, ఇప్పుడు 10వ సీజన్తో సరికొత్త అనుభూతిని పంచేందుకు ముస్తాబవుతోంది.
ఈ షో ప్రయాణాన్ని గమనిస్తే.. మొదటి సీజన్కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెండో సీజన్కు నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఆ తర్వాత మూడో సీజన్ నుండి కింగ్ అక్కినేని నాగార్జున తనదైన శైలిలో షోను విజయవంతంగా నడిపిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక 10వ సీజన్కు కూడా నాగార్జునే హోస్ట్గా వ్యవహరిస్తున్నారు.
'దశావతారం' థీమ్.. వినూత్న వ్యూహం
ఈసారి పదవ సీజన్ కావడంతో నిర్వాహకులు దీనిని 'దశావతారం' కాన్సెప్ట్తో ప్రత్యేకంగా రూపొందించారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వివరాల ప్రకారం.. షో ప్రారంభంలో కేవలం 10 మంది కంటెస్టెంట్లు మాత్రమే ఇంట్లోకి అడుగుపెడతారు.
ఆ తర్వాత షో ముందుకు సాగే కొద్దీ వినోదాన్ని రెట్టింపు చేసేందుకు మిడ్-వీక్ ఎంట్రీలు, వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా ఇతర సెలబ్రిటీలను ఇంట్లోకి పంపించేలా నిర్వాహకులు పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ సీజన్లో ప్రధానంగా సీరియల్ నటీనటులు ఎక్కువగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
హౌస్లోకి 'కామన్ మ్యాన్' ఎంట్రీ..
ఈ సీజన్లో మరో ప్రధాన ఆకర్షణగా 'కామన్ మ్యాన్' కేటగిరీని చేర్చారు. సాధారణ ప్రజల నుంచి కంటెస్టెంట్లను ఎంపిక చేసేందుకు ప్రత్యేకంగా నిర్వహించిన టాలెంట్ హంట్ రౌండ్స్ ఇప్పటికే ఫైనల్కు చేరుకున్నాయి. ఈ ఆడిషన్స్ ద్వారా ఎంపికైన ఇద్దరు లేదా ముగ్గురు సాధారణ వ్యక్తులు బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
ప్రచారంలో ఉన్న కంటెస్టెంట్ల జాబితా
ఈ 10వ సీజన్లో పాల్గొనబోయే సెలబ్రిటీల గురించి మీడియా వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ప్రచారంలో ఉన్న ప్రముఖుల పేర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1) జబర్దస్త్ ఫేమ్ రాంప్రసాద్
2) నరేష్
3) కమెడియన్ కృష్ణుడు
4) నటుడు అదిత్ అరుణ్
5) 'టెంపర్' వంశీ
6) ప్రముఖ నటి/యాంకర్ వర్షిణి సౌందరరాజన్
7) ముకేష్ గౌడ
8) దేబ్జానీ మోదక్
9) చైత్రా రాయ్
10) యూట్యూబర్ సుధీర్ రెడ్డి
సెప్టెంబర్ 6న గ్రాండ్ ఓపెనింగ్
బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ రియాలిటీ షో సెప్టెంబర్ 6వ తేదీ సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ ఓపెనింగ్ వేడుకతో ప్రారంభం కానుంది. నాగార్జున గ్రాండ్ ఎంట్రీ, కంటెస్టెంట్ల పరిచయ కార్యక్రమాలతో బిగ్బాస్ హౌస్ సందడిగా మారనుంది. వినూత్నంగా డిజైన్ చేసిన ఈ 'దశావతారం'
థీమ్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.
Also Read: బిగ్బాస్ ఆఫర్ను రెండుసార్లు తిరస్కరించిన క్రేజీ సీరియల్ హీరో..ఈసారి వస్తాడంట!
Also Read: ప్రియుడితో పెళ్లి పీటలెక్కనున్న బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్..ఎంగేజ్మెంట్ ఫొటోలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Veligonda Project: ఎట్టకేలకు వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం.. 30 ఏళ్ల నాటి కల సాకారం.. సీఎం చంద్రబాబు భావోద్వేగం!
Yeguva Cherlo Palli, Andhra Pradesh:Veligonda Project Inauguration: వెనుకబడిన ప్రాంతాల దాహార్తిని, సాగునీటి కొరతను తీర్చేందుకు ఉద్దేశించిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టు ప్రారంభంతో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల సుమారు 30 ఏళ్ల నిరీక్షణకు కూటమి ప్రభుత్వం తెరదించింది. శ్రీశైలం మల్లన్న పాదాల చెంత నుంచి నల్లమల కొండలను చీల్చుకుంటూ రెండు జంట సొరంగాల ద్వారా వచ్చిన కృష్ణా జలాలు గంటవానిపల్లె ఆక్విడెక్టును దాటుకుని నల్లమల సాగర్ కాలువల్లోకి పరుగులు తీశాయి. ఈ తొలిదశ పూర్తితో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందనుంది.
కృష్ణమ్మకు సాష్టాంగ ప్రణామం..
దోర్నాల మండలం గంటవానిపల్లె సమీపంలోని ఫీడర్ కెనాల్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి స్థానిక గిరిజన మహిళలు తమ సాంప్రదాయ పద్ధతుల్లో ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం స్వయంగా నీటిలోకి దిగి కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, చీర సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కాలువల్లోకి పరవళ్లు తొక్కిన నీటిపై మహిళలు పుష్పాలు చల్లి స్వాగతించారు. ఈ సందర్భంగా సీఎం తీవ్ర భావోద్వేగానికి గురై, కెనాల్ ఒడ్డున కృష్ణమ్మకు సాష్టాంగ ప్రణామం చేసి కృతజ్ఞతలు తెలిపారు. అక్కడి పవిత్ర జలాలను మంత్రులు, అధికారులపై సీఎం చల్లగా, వేద పండితులు ఆయనకు శ్రీశైలం మల్లికార్జున స్వామి చిత్రపటాన్ని బహూకరించారు.
పండుగ వాతావరణం..
తమ ప్రాంతానికి కృష్ణా జలాలు రావడంతో మార్కాపురం రైతులు, ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. సీఎం సాష్టాంగ ప్రణామం చేయడంతో సభా ప్రాంగణంలో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. అనంతరం సీఎం వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని (పైలాన్) ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డీబీవీ స్వామి, కందుల దుర్గేష్, పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సాగు, తాగునీటి ప్రయోజనాలు
ఈ తొలిదశ విజయవంతంగా పూర్తి కావడంతో ప్రాంతీయ కరవు నివారణకు మార్గం సుగమమైంది. ప్రాజెక్టు ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 4 లక్షల మంది ప్రజలకు శాశ్వత తాగునీటి సదుపాయం లభించనుంది.
Also Read: వైసీపీకి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గుడ్బై?! వచ్చే ఎన్నికల్లో పోటీకి అభ్యంతరం!
Also Read: మంత్రి నారా లోకేష్ వద్దకు 'ఇరుముడి' పంచాయితీ! వివాదాల నడుమ ఉపాధ్యాయ సంఘాల ఫిర్యాదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chilakaluripet Accident: చిలకలూరిపేట ఘోర రోడ్డు ప్రమాదం..మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందజేత!
Chilakaluripet, Andhra Pradesh:Chilakaluripet Road Accident: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిలకలూరిపేట వద్ద ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ రోడ్డు ప్రమాద దుర్ఘటనలో వేలూరు గ్రామానికి చెందిన 8 మంది దళిత వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దురదృష్టకర సంఘటన గురించి తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే తక్షణ సహాయక చర్యలు చేపట్టింది.
సీఎం, డిప్యూటీ సీఎం, ఎంపీ తీవ్ర దిగ్భ్రాంతి
ఈ రోడ్డు ప్రమాద దుర్ఘటనపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో ఆప్తులను కోల్పోయిన బాధిత కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదం జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు, ఈ ఘటనపై అధికారుల నుంచి తక్షణ నివేదికను తెప్పించుకుని పూర్తి వివరాలు పరిశీలించారు.
రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం..
ప్రమాద ఘటనపై నివేదిక అందిన వెంటనే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో ఆలోచించి తక్షణ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వేలూరు గ్రామానికి చెందిన 8 మంది దళిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. సాయాన్ని కేవలం ప్రకటించడమే కాకుండా, బాధిత కుటుంబాలకు వెంటనే ఆ పరిహారం అందేలా నేడే చెక్కుల పంపిణీ పూర్తి చేయించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
బాధిత కుటుంబాలకు నేరుగా చెక్కుల పంపిణీ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు వేగంగా స్పందించి బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. నేడు అనగా స్థానక పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి, మృతుల కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల పరిహారం చెక్కులను అందజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు.
Also Read: ఎట్టకేలకు వెలిగొండ ప్రాజెక్ట్ను సీఎం చంద్రబాబు ప్రారంభం..30 ఏళ్ల నాటి కల సాకారం..
Also Read: బొత్స సత్యనారాయణ Vs విజయసాయిరెడ్డి..బొత్సకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కేఏ పాల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Botsa Satyanarayana KA Paul: బొత్స సత్యనారాయణ Vs విజయసాయిరెడ్డి..బొత్సకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కేఏ పాల్!
Visakhapatnam, Andhra Pradesh:Botsa Satyanarayana Vs Vijaya Saireddy: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ విజయసాయిరెడ్డి రాసిన లేఖ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ లేఖలో ఉత్తరాంధ్రకు చెందిన ఓ కీలక నేత ప్రస్తుతం పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారంటూ సాయిరెడ్డి పేర్కొనడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఆయన ఆ నేత పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ, ఆ వ్యాఖ్యలు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణను ఉద్దేశించినవేనన్న చర్చ జోరుగా మొదలైంది.
గతంలో బొత్స జనసేనలోకి వెళ్తారంటూ సోషల్ మీడియాలో ఆధారాలు లేని గాలివార్తలు ప్రచారమయ్యాయి. అయితే సరిగ్గా స్థానిక ఎన్నికల సమయంలోనే సాయిరెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించడంతో రాజకీయ వర్గాల్లో పాత ప్రచారం మళ్లీ తెరపైకి వచ్చింది.
సాయిరెడ్డి, బొత్సల మధ్య పాత కోల్డ్వార్..
గతంలో విజయసాయిరెడ్డి వైసీపీలో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా కీలక బాధ్యతలు నిర్వర్తించగా, బొత్స సత్యనారాయణ కూడా అదే ప్రాంతంలో పార్టీకి బలమైన నేతగా వ్యవహరించారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య అంతర్గతంగా తీవ్రమైన కోల్డ్వార్ నడిచిందన్న ప్రచారం విస్తృతంగా సాగింది. బొత్స ప్రాధాన్యతను తగ్గించేందుకు సాయిరెడ్డి తెరవెనుక పావులు కదిపారనే ఆరోపణలు కూడా వచ్చాయి.
అయినప్పటికీ, గతంలో సాయిరెడ్డి పార్టీని వీడిన సమయంలో బొత్స ఆయనపై ఎలాంటి బహిరంగ విమర్శలు చేయకుండా సైలెంట్గా ఉన్నారు. అలా సైలెంట్గా ఉన్న బొత్సను ఉద్దేశించి, ఇప్పుడు సాయిరెడ్డి ఎందుకు వ్యాఖ్యలు చేశారన్నది రాజకీయ విశ్లేషకుల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
బొత్స 'కేఏ పాల్-2' సెటైర్.. కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం
సాయిరెడ్డి పేర్కొన్న ఉత్తరాంధ్ర నేత ఎవరంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా బొత్స సత్యనారాయణ ఘాటుగానే స్పందించారు. విజయ సాయిరెడ్డి వ్యాఖ్యలను పూర్తిగా కొట్టిపారేస్తూ, ఆయనను 'కేఏ పాల్-2' అంటూ ఎద్దేవా చేశారు. అయితే, విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చే క్రమంలో తన పేరును ప్రస్తావించడంపై కేఏ పాల్ తీవ్రంగా మండిపడ్డారు. విజయసాయిరెడ్డిని తనతో పోల్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తనను కించపరిచేలా మాట్లాడవద్దని బొత్సను హెచ్చరించారు.
తన గురించి మాట్లాడే ముందు గతంలో తన సభలకు వచ్చి తన ఆశీస్సులు పొందిన విషయాన్ని బొత్స గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ప్రపంచ శాంతి కోసం పోరాడుతూ అమెరికాలో ఉన్న తనతో పోలిక ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా సాయిరెడ్డి లేఖతో మొదలైన రచ్చ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతోంది.
Also Read: మంత్రి నారా లోకేష్ వద్దకు 'ఇరుముడి' పంచాయితీ! వివాదాల నడుమ ఉపాధ్యాయ సంఘాల ఫిర్యాదు!
Also Read: వైసీపీకి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గుడ్బై?! వచ్చే ఎన్నికల్లో పోటీకి అభ్యంతరం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Veligonda Project: రేపు తీరనున్న మూడు దశాబ్దాల కల.. వెలిగొండ ప్రాజెక్టు జాతికి అంకితం
Jammana Palle, Andhra Pradesh:Veligonda Project: మూడు దశాబ్దాల కల సాకారం దిశగా వెలిగొండ ప్రాజెక్టు నిలవనుంది. వెలిగొండ సొరంగం నుంచి నీరు విడుదలవుతుండడంతో ప్రకాశం జిల్లా రైతులు సంబరపడుతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు సొరంగం నుంచి జలధారగా కృష్ణమ్మ జలాలు వస్తున్నాయి. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ వెలిగొండ నుంచి రేపు కృష్ణా జలాలు పరుగులు తీస్తున్నాయి. కృష్ణా జలాల రాకతో కరువు ప్రాంతం జలకళ సంతరించుకోనుంది.
కరవు నేల చరిత్రలో సువర్ణ అధ్యాయంగా వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం నిలవనుంది. వెలిగొండ ప్రాజెక్టు కోసం దశాబ్దాలుగా లక్షలాది మంది రైతుల ఎదురుచూపులు ఫలించనున్నాయి. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి వెలిగొండ ప్రాజెక్టుకు వస్తున్న కృష్ణా జలాలు ప్రకాశం జిల్లాలో పరవళ్లు తొక్కనున్నాయి. ఫీడర్ కెనాల్ గేట్లు ఎత్తి రేపు నల్లమల సాగర్కు 10.7 టీఎంసీల నీరును సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. ఆనాడు శంకుస్థాపన చేసిన చంద్రబాబు ఈరోజు ప్రారంభం చేయనుండడం విశేషం.
రెండేళ్లలో భారీగా ఖర్చు
ప్రకాశం, మార్కాపురం జిల్లా ప్రజల నీటి కష్టాలు వెలిగొండ ప్రాజెక్టు తీర్చనుంది. కరవు నేలకు కృష్ణమ్మను తెస్తున్న ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవంపై అందరి కళ్లు పడ్డాయి. వెలిగొండ పండుగతో ప్రతి గ్రామం కళకళలాడుతోంది. కలగా మిగిలిపోతుందనుకున్న వెలిగొండను కళ్ల ముందుకు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లలో వెలిగొండపై రూ.2,400 కోట్లకు పైగా కూటమి ప్రభుత్వం ఖర్చు చేసింది.
తీరనున్న సమస్యలు
వెలిగొండ ప్రాజెక్టుతో ప్రకాశం, మార్కాపురం జిల్లాల రైతాంగానికి కొత్త భరోసా. కృష్ణమ్మ రాకతో కరవు నేలలో కొత్త ఆశలు
ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. తీవ్రమైన ప్లోరైడ్ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి మంచి రోజులు
ఈ ప్రాజెక్టు పూర్తితో సాగు, తాగునీటికి ఇబ్బందులు తొలగనున్నాయి.
ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీటి సరఫరా జరగనుంది.
భారీగా పరిహారం
నిర్వాసితుల కుటుంబాలకు వేగంగా పరిహారం ప్రభుత్వం అందించింది. మూడు విడతల్లోనే 6,206 కుటుంబాలకు రూ.768 కోట్లు ప్రభుత్వం అందించగా.. అదనంగా మరో రూ.169 కోట్లు ప్రకటించింది. 2019 తర్వాత 18 ఏళ్ల నిండిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రభుత్వం ఇచ్చింది.
నిర్వాసితులకు గౌరవం
నిర్వాసిత మహిళలను గౌరవించేలా చీర, పసుపు, కుంకుమ, గాజులు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం. నిర్వాసితులకు చెందిన 4,933 పశువులకు 30 రోజుల పాటు దాణా అందించనున్నారు. అంతేకాకుండా 10 వేల మందికి 25 కిలోల బియ్యం, కిలో పప్పు, కిలో చక్కెర, లీటర్ నూనె, 2 కిలోల ఉల్లిపాయలు, 2 కిలోల బంగాళాదుంపలతో నిత్యావసరాల కిట్ ఇవ్వనున్నారు.
Eatala Rajender: భారతదేశం విచ్చిన్నం కావాలని కాక్రోచ్ జనతా పార్టీకి ఫండింగ్: ఈటల రాజేందర్
Secunderabad, Telangana:Hyderabad: బంగ్లాదేశ్, శ్రీలంక లాగా భారతదేశం విచ్చిన్నం కావాలని అనేక దేశాలు కాక్రోచ్ జనతా పార్టీకి ఫండింగ్ చేస్తున్నారని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆరోపణలు చేశారు. నరేంద్ర మోదీ బలహీన పడితే ప్రజాస్వామ్యం, దేశ భద్రత బలహీనపడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం డబ్బులిస్తోందని అని చెప్పలేని సంకుచిత స్వభావి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. కురచ మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని తెలిపారు.
మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా బీజేపీ కార్యాలయం ప్రారంభోత్సవం ఆదివారం జరగ్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'బీజేపీ కుటుంబ పార్టీ కాదు. సిద్ధాంతంతో ఏర్పడిన పార్టీ. దేశహితం కోసమే నిర్ణయాలు తీసుకుంటుంది తప్ప పార్టీ కోసం కాదు. బీజేపీ పవర్ ఓరియెంటెడ్ పార్టీ కాదు. పీపుల్ ఓరియెంటెడ్ పార్టీ' అని వివరించారు. 'సంకీర్ణ ప్రభుత్వంలో దేశ హితం కోసం అప్పటి ప్రధాని వాజ్పేయి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్డీయే ప్రభుత్వం 370 ఆర్టికల్ను రద్దు చేసింది. తెలంగాణ ఉద్యమంలో ఏబీవీపీ, బీజేపీ జేఏసీలో భాగస్వాములు.
'కార్యకర్తలు పార్టీకి పునాదిరాళ్లు. పదవి రాకపోయినా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తారు. నాయకులు వస్తారు పోతారు కానీ కార్యకర్తలు శాశ్వతం. నాయకులు కార్యకర్తలను, ప్రజలను ప్రేమించాలి, లేదంటే మళ్లీ గెలవలేడు. రెండోసారి గెలిస్తే ప్రజల విశ్వాసం పొందినట్టు. కార్యకర్తల గుండెల్లో చోటు సంపాదించుకున్నట్టు లెక్క' అని ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడించారు. 'నరేంద్ర మోదీ ఆను పాలకుడిని కాదు సేవకుడిని అంటారు. నేను ఇచ్చిన అని ఎన్నడూ అనరు. కానీ ఇక్కడ ఉన్న కురుస నాయకులు మాత్రం అన్నీ నేనే ఇచ్చిన అని ప్రచారం చేసుకుంటారు' అని రేవంత్ రెడ్డిపై పరోక్షంగా ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. 'రేషన్ కార్డుల మీద ఫొటోలు వేసుకుంటున్నారు. నువ్వు ప్రజల డబ్బులకు కాపలదారుడవి అని మాత్రం మర్చిపోకు. కేంద్రం కూడా డబ్బులు ఇస్తుంది అని చెప్పని సంకుచిత స్వభావులు' అని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
'క్యూర్ పేరుతో రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రజలను క్రష్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర నుంచి 30 శాతం కమీషన్లు వసూలు చేసి డిల్లీకి పంపిస్తున్నారు' అని రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. '43 శాతం క్రైమ్ రేట్ డ్రగ్స్ వల్ల పెరిగింది. డ్రగ్స్ ఎందుకు అరికట్టలేక పోతున్నావని రేవంత్ రెడ్డి యువతకు సమాధానం చెప్పాలి' అని డిమాండ్ చేశారు. 'ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వరు. ఉద్యోగాలు లేవు. యువత విద్యార్థులు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు' అని తెలిపారు. రేవంత్ రెడ్డి పాలనలో అనుములు సోదరులు సంతోషంగా ఉన్నారని ఆరోపించారు.
శాస్త్రవేత్తల ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్.. జీతం, అర్హత, ఫీజు వివరాలు ఇవే!
Hyderabad, Telangana:ISRO Recruitment 2026: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO), సైంటిస్ట్, ఇంజినీర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ విభాగాలలో మొత్తం 175 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలు సెంట్రల్ ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ (CPRL) పరిధిలో చేపట్టనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు కనీసం రూ. 56,000 జీతం లభిస్తుంది.
ఇస్రో రిక్రూట్మెంట్ 2026 అర్హతలు..
ఈ రిక్రూట్మెంట్కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టులకు కావాల్సిన సరైన విద్యార్హత కలిగి ఉండాలి. అభ్యర్థులు బీఈ లేదా బీటెక్ లేదా దానికి సమానమైన డిగ్రీని కలిగి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో కనీసం 65 శాతం మార్కులు పొంది ఉండాలి. మెకానికల్ విభాగంలో బీఈ/బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్లో కనీసం 65 శాతం మార్కులు లేదా 6.84 CGPA ఉండాలి. కంప్యూటర్ సైన్స్ విభాగంలో కూడా బీఈ/బీటెక్ కంప్యూటర్ సైన్స్లో కనీసం 65 శాతం మార్కులు తప్పనిసరి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు.
అభ్యర్థుల వయస్సు 2026 సెప్టెంబర్ 16 నాటికి 28 ఏళ్ల లోపు ఉండాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎక్స్-సర్వీస్మెన్, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. కేవలం భారతీయ పౌరులు మాత్రమే ఈ నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మొత్తం ఖాళీలను పరిశీలిస్తే, ఎలక్ట్రానిక్స్ విభాగంలో 99, మెకానికల్ విభాగంలో 52, కంప్యూటర్ సైన్స్లో 21 ఖాళీలు ఉన్నాయి. అయితే, ఈ సంఖ్య భవిష్యత్తులో మారే అవకాశం ఉంది.
ఇస్రో దరఖాస్తు రుసుము..
దరఖాస్తు చేసే అభ్యర్థులు రూ. 250 దరఖాస్తు రుసుముగా, రూ. 750 ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజును 'భారత్ కోష్' (Bharat Kosh) పేమెంట్ గేట్వే ద్వారా ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ లేదా డొమెస్టిక్ డెబిట్ కార్డ్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు; చెక్కు, డీడీల ద్వారా చెల్లించడం కుదరదు. దీనికి సంబంధించిన అదనపు ఛార్జీలను అభ్యర్థులే భరించాలి. దరఖాస్తుకు చివరి తేదీ 2026 సెప్టెంబర్ 16. మీరు తప్పనిసరిగా రాత పరీక్ష రాయాల్సి ఉంటుంది.
Also Read: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు బిగ్ అలర్ట్..సెప్టెంబర్ 1 నుంచి మారిన 7 కొత్త రూల్స్ ఇవే!
Also Read: డెబిట్ కార్డు పోయిందా? ఇంట్లో నుంచే మొబైల్లో ఇలా బ్లాక్ చేయండి! చాలా ఈజీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
అందం, డబ్బు కాదు.. జీవిత భాగస్వామిలో ఈ లక్షణాలే ముఖ్యమంటున్న చాణక్యుడు!
Hyderabad, Telangana:Chanakya Niti Latest News: మానవ జీవితంలో అత్యంత కీలకమైన మధురమైన ఘట్టం వివాహంగా చెప్పుకోవచ్చు.. సరైన జీవిత భాగస్వామి దొరికితే ఆ బంధం ఎంతో మధురంగా మారుతుంది. అదే భాగస్వామి ఎంపికలో ఏ చిన్న పొరపాటు పడిన జీవితాంతం నరకం అనుభవించాల్సిన అవసరం వస్తుంది. అందుకే పెళ్లి చేసుకునే ముందు కేవలం అందంతో పాటు హోదా, డబ్బు మాత్రమే కాకుండా ఎదుటి వారి స్వభావం.. ఆలోచన విధానం.. ఇతరులతో వ్యవహరించే తీరును క్లియర్గా గమనించి పెళ్లి చేసుకోవడం చాలా మంచిదని చాణక్య నీతి శాస్త్రం చెబుతోంది..
భారతదేశపు గొప్పతత్వవేత్తతో పాటు రాజనీతి జ్ఞానుడిగా పేరున ఆచార్య చానక్యుడు తన చాణక్యనీతి శాస్త్రంలో జీవిత భాగస్వామి ఎంపిక గురించి అద్భుతమైన సూచనలు చేశారు. ముఖ్యంగా ఐదు రకాల లక్షణాలున్న వ్యక్తులకు పెళ్లికి ముందే దూరంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.. ఆ లక్షణాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
పైకి అందంగా ఉండడం..
చాలామంది పెళ్లి అనగానే ముందుగా అందానికి ఎక్కువగా ప్రాధాన్యతిస్తూ ఉంటారు.. కానీ కేవలం అందం చూసి పెళ్లి చేసుకోవడం ఒక పెద్ద పొరపాటని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది. ఒక వ్యక్తి చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. వారి స్వభావంతో పాటు ఆలోచనలు, సంస్కారం సరిగ్గా లేకపోతే ఆ వైవాహిక బంధం ఎంత కాలం నిలబడదు.. పై అందం కంటే ఎదుటి వ్యక్తి మనస్తత్వంతో పాటు ఆలోచన తీరుకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఆ బంధం ఎంతో మరింత అద్భుతంగా ఉంటుంది..
కఠినంగా మాట్లాడేవారు..
చిన్న చిన్న విషయాలకి తీవ్రంగా కోపగించుకునే వారితో పాటు కఠినమైన, కించపరిచే పదాలతో ఇతరులను దూషించే వారితో వివాహ బంధం ఏమాత్రం మంచిది కాదని చాణక్యుడు చెబుతున్నాడు. ఏ బంధం లోనైనా ప్రశాంతత ఉండాలంటే సమానంతో పాటు సరైన కమ్యూనికేషన్ చాలా అవసరమని ఆయన అన్నారు. ఎప్పుడూ కోపంతో రగిలిపోయేవారు.. తమ మాటే నెగ్గాలని వారితో జీవితం గడిపితే ప్రతిరోజు గొడవలతో పాటు మనస్పార్ధాలు తప్పవని చాణక్యనీతి శాస్త్రం క్లియర్గా చెబుతోంది..
అత్యాశ..
డబ్బుతో పాటు ఆస్తుల మీద విపరీతమైన వ్యామోహం ఉన్నవారికి వీలైనంత దూరంగా ఉండాలని చాణక్యనీతి శాస్త్రం తెలుపుతోంది. అనుబంధాల కంటే కేవలం డబ్బుకే ఎక్కువగా వెలుగునిచ్చే వారు భవిష్యత్తులో ఏదైనా చిన్న ఆర్థిక కష్టం రాగానే మిమ్మల్ని ఒంటరి చేసే ప్రమాదం ఉంది. వివాహ బంధం అనేది నిస్వార్ధమైన ప్రేమ, నమ్మకం పై ఆధారపడి ఉండాలి కానీ.. ఆర్థిక ప్రయోజనాల మీద కాదని చాణక్యనీతి వివరిస్తోంది..
ఇతరులను గౌరవించని వారు..
ఒక వ్యక్తి మీతో ఎంత ప్రేమగా ఉన్నారనే దానికంటే.. ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నారనేది చాలా ముఖ్యం.. ఇతరులను గౌరవించాలని వారు.. వారితో చులకనగా మాట్లాడేవారు.. పెళ్లి తర్వాత మీకు లేదా మీ కుటుంబానికి కూడా తగిన గౌరవం ఇవ్వకపోవచ్చు. కనీస మర్యాద ఇవ్వని వారితో జీవితం పంచుకోవడం సరైన నిర్ణయం కాదని చాణక్యనీతి శాస్త్రం క్లియర్గా చెబుతోంది..
ఇది కూడ చదవండి: ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదా? చాణక్య నీతిలోని ఈ 5 రహస్యాలు తెలుసుకోండి..
తప్పుడు మార్గంలో నడిచేవారు..
నిజాయితీ లేని వారు.. పదేపదే అబద్ధాలు చెప్పేవారు.. ఇతరులను మోసం చేసేవారు లేదా చెడు అలవాట్లకు బానిసైన వారు ఎప్పటికీ మంచి జీవిత భాగస్వామి కాలేరు.. ఏది నిజం..ఏది అబద్దం అని కనీస వ్యత్యాసం తెలియని వ్యక్తులతో జీవితాన్ని ముడి పెట్టుకోవడం అంటే చేజేతులారా కష్టాన్ని కొనితెచ్చుకోవడమేనని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది.. పెళ్లి అనేది ఒక రోజుతో ముగిసిపోయే వేడుక కాదు.. ఇది జీవితకాలం పాటు సాగే ఓ సుదీర్ఘ ప్రయాణం... కాబట్టి ఆకర్షణ వలలో పడి..తొందరపడి నిర్ణయం తీసుకోకుండా..పై విషయాలను దృష్టిలో ఉంచుకొని సరైన భాగస్వామిని ఎంచుకోవాలని ఆచార్య చానక్యుడు సూచిస్తున్నాడు.
ఇది కూడ చదవండి: ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదా? చాణక్య నీతిలోని ఈ 5 రహస్యాలు తెలుసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదా? చాణక్య నీతిలోని ఈ 5 రహస్యాలు తెలుసుకోండి..
Hyderabad, Telangana:Chanakya Niti Money Saving Tips: నెలాఖరు వచ్చేసరికి జేబులో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదా? వచ్చిన జీతం వచ్చినట్లే కళ్ళముందే ఖర్చయిపోతుందా? మీరు ఎంత కష్టపడినప్పటికీ మీ జేబులో డబ్బులు నిలవడం లేదా? అయితే మీరు ఎక్కడో తప్పు చేస్తున్నట్లు అని అర్థం.. వేల సంవత్సరాల క్రితమే గొప్ప ఆర్థిక వేత్త తో పాటు రాజనీతి వేత్తగా పేరు ఉన్న ఆచార్య చానక్యుడు మనిషి ఆర్థికంగా ఎలా ఎదగాలి.. డబ్బులను ఎలా ఆదా చేయాలి అనే విషయాలపై చాణక్య నీతిలో అద్భుతమైన సూత్రాలను వివరించాడు. ఈ ఐదు చాణక్య నీతి నియమాలను మీ జీవితంలో అమలు చేస్తే.. దారిద్ర్యం దూరమై మీ మీరు కోరుకున్న సిరిసంపదలు మీ సొంతమవుతాయి.. అవేంటో తెలుసుకోండి..
ఆదాయం ఖర్చుల మధ్య తప్పకుండా సమతుల్యత..
చాణక్యుడు నీతి శాస్త్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. మనిషి ఎంత సంపాదిస్తున్నాడు అన్నది ముఖ్యం కాదు.. ఎంత ఆదా చేస్తున్నాడనేదే చాలా చాలా ముఖ్యం.. మీ ఆదాయానికి మించి ఎప్పుడు ఖర్చు చేయకండి.. మీ బడ్జెట్ను పక్కా ప్లాన్ చేసుకోండి.. ఖర్చుల విషయంలో హద్దులు దాటితే భవిష్యత్తులో అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం.. ఆదాయంతో పాటు ఖర్చుల మధ్య సమతుల్యత పాటించే వారి వద్ద లక్ష్మీదేవి నిలుస్తుందని చాణక్యనీతి శాస్త్రంలో పేర్కొన్నాడు..
క్రమం తప్పకుండా పొదుపు చేయడం..
చాలామంది జీతం పెరిగాక పొదుపు చేద్దాంలే అని వాయిదాలు వేస్తూ ఉంటారు.. కానీ ఇది చాలా పెద్ద తప్పుని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది. మీ ఆదాయం తక్కువైనప్పటికీ సరే.. ప్రతి నెల కొంత మొత్తాన్ని తప్పకుండా పొదుపు చేయడం అలవాటు చేసుకుంటేనే మంచిది. ఈ చిన్న పొదుపు.. భవిష్యత్తులో ఆపద సమయంలో అత్యవసర పరిస్థితుల్లో మీ అతిపెద్ద రక్షణ కవచంగా మారుతుంది. కష్టకాలాల్లో మనల్ని కాపాడే ఏకైక మిత్రుడు మనం దాచుకున్న 70 అని చాణక్యనీతి స్పష్టంగా చెబుతోంది.
ఆడంబరాలకు.. ఆర్భాటాలకు దూరం..
నేటి సమాజంలో చాలామంది ఇతరులను మెప్పించడానికి.. తమ హోదాను అందరికీ తెలిసేలా చేయడానికి అవసరమైన వస్తువులపై.. బ్రాండ్లపై డబ్బులు వెదజల్లుతూ ఉంటారు.. ఈ షో ఆఫ్ కల్చర్ మిమ్మల్ని పేదరికంలో నెట్టేస్తుంది.. వృధా ఖర్చులు చేసే వ్యక్తులు ఎప్పుడూ ధనవంతులు కాలేరు.. మీ అవసరాలకు మాత్రమే ఖర్చులు చేయడం మంచిది.. ఆడంబారాలకు దూరంగా ఉండటమే ఎంతో మేలు..
అత్యాశకు పోకపోవడం..
రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలనే అత్యాశ మనిషి పతనానికి ఊహించని పతనానికి దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయి. షార్ట్ కట్స్ ద్వారా తప్పుడు మార్గంలో సంపాదించిన డబ్బు నీటి మూట లాంటిది.. అది ఎప్పటికీ నిలబడదు.. నిజాయితీగా కష్టపడి సంపాదించిన డబ్బే శాశ్వతమైన ఆనందాన్ని.. స్థిరత్వతని అందిస్తుందని చానాక్యనీతి శాస్త్రం చెబుతోంది..
ఇది కూడ చదవండి: బస్సు నడుపుతుండగా గుండెపోటు.. అయినా 60 మంది ప్రాణాలు కాపాడిన RTC డ్రైవర్..
ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తత..
డబ్బులను ఎక్కడైనా పెట్టబడిగా పెట్టేటప్పుడు లేదా ఇతరులకు అప్పుగా ఇచ్చేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు.. అనవసరంగా అవగాహన లేకుండా చేసే పెట్టుబడులు తీవ్ర నష్టాలను మిగులుతాయి. ఆర్థిక క్రమశిక్షణ పాటించడంతో పాటు సరైన ప్రణాళికలతో అడుగులు వేయడం వల్ల సంపాదనను వృద్ధి చేసుకోగలుగుతారని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో తెలిపారు..
ఇది కూడ చదవండి: బస్సు నడుపుతుండగా గుండెపోటు.. అయినా 60 మంది ప్రాణాలు కాపాడిన RTC డ్రైవర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
బ్లాక్ కాఫీ మంచిదేనా? బరువు, షుగర్, లివర్పై ప్రభావంపై నిపుణుల సూచనలు!
Hyderabad, Telangana:Black Coffee For Weight Loss: ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరు హాట్ హాట్ గా ఒక కప్పు కాఫీ లేదా టీ తాగడంతోనే రోజు ప్రారంభమవుతుంది. ఇది మన భారతదేశంలో ప్రతి ఇంట సాధారణంగా కనిపించే దృశ్యమే.. అయితే నేటి బిజీ జీవనశైలిలో.. మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది అధిక బరువుతో పాటు మధుమేహం వంటి సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా కొంతమంది పొట్ట చుట్టూ పేరుకుపోయిన మొండి కొవ్వును కరిగించుకోవడానికి నానాదంతాలు పడిపోతున్నారు.
ఇంటర్నెట్లో వెతికి చాలామంది ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. అయితే, ఎలాంటి ప్రయోగాలు చేయకుండానే రోజువారి అలవాట్లలో కొన్ని రకాల మార్పులు చేర్పులు చేసుకొని.. పంచదార పాలు కలిపిన కాఫీకి బదులుగా బ్లాక్ టీ తాగడం మంచిదని అపోలో ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. చక్కెర పాలు కలిపిన కాఫీ శరీరానికి అంత మంచిది కాదని వారు అంటున్నారు.. బ్లాక్ కాఫీ సాధాగా తాగడం వల్ల మధుమేహం కూడా సులభంగా కంట్రోల్ అయ్యి.. ఎన్నో రకాల బెనిఫిట్స్ పొందుతారని అపోలో వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బ్లాక్ టీ కొన్ని అనారోగ్య సమస్యలకు దివ్య ఔషధంగా కూడా పనిచేస్తుందని వారు చెబుతున్నారు..
మొండి కొవ్వును కరిగించేందుకు..
ఉదయాన్నే పరిగడుపున చెక్కరలేని బ్లాక్ కాఫీ తాగడం వల్ల మెటబాలిజం రేటు అమాంతం పెరిగిపోతుందని అపోలో వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది కొవ్వును వేగంగా కరిగించే పనిలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. బ్లాక్ కాఫీలో ఎలాంటి క్యాలరీలు కూడా ఉండవు కాబట్టి దీన్ని తాగగానే వెంటనే బరువు కూడా తగ్గిపోతారని వారంటున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు రోజుల్లో రెండు నుంచి మూడుసార్లు తీసుకోవాల్సి ఉంటుందని వారు సూచిస్తున్నారు..
డయాబెటిస్ కి చెక్..
చక్కెర లేని బ్లాక్ కాఫీ తాగడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని అపోలో ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్స్ చెబుతున్నారు. ఇది శరీరంలోని ఇన్సులిన్ సెన్సిటివిటీని గణనీయంగా పెంచుతుందని.. తద్వారా టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని పూర్తిగా తగ్గిస్తుందని వారు అంటున్నారు. ఇప్పటికే డయాబెటిస్ ఉంటే కంట్రోల్ కు వస్తుందని చెబుతున్నారు..
గుండె, లివర్కు బెస్ట్..
బ్లాక్ కాఫీ ని తగ్గిన మోతాదులో తాగడం వల్ల లివర్కు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని అపోలోకు సంబంధించిన ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫ్యాటీ లివర్ తో పాటు లివర్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని కూడా సులభంగా తగ్గిస్తుందని వారంటున్నారు. ఇందులో లభించే కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు లివర్ కణాలను సురక్షితంగా ఉంచి.. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించి గుండె పనితీరును కూడా మెరుగు పరుస్తాయని వారు చెబుతున్నారు.
ఇది కూడ చదవండి: బస్సు నడుపుతుండగా గుండెపోటు.. అయినా 60 మంది ప్రాణాలు కాపాడిన RTC డ్రైవర్..
గమనిక.. బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి చాలా మంచిదే అయినప్పటికీ.. దాన్ని తగిన మోతాదులోనే తీసుకోవాలని అపోలో వైద్యులు చెబుతున్నారు.. గర్భవతులతో పాటు గుండె సమస్యలు, అధిక రక్తపోటు ఉన్నవారు.. మరేదైనా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు డైట్ లో మార్పులు చేసే ముందు తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది..
ఇది కూడ చదవండి: బస్సు నడుపుతుండగా గుండెపోటు.. అయినా 60 మంది ప్రాణాలు కాపాడిన RTC డ్రైవర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mars Transit: కుజుడి నక్షత్ర మార్పుతో అదృష్టం పొందే 5 రాశులు.. సెప్టెంబర్ 2 నుంచి డబ్బే డబ్బు!
Hyderabad, Telangana:Mars Transit Effect 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ గ్రహాన్ని శక్తివంతమైన గ్రహంగా పరిగణిస్తూ ఉంటారు. దీనిని ధైర్యంతో పాటు బలం, సంపదకు కారకుడిగా భావిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ రెండవ తేదీన గురు గ్రహానికి సంబంధించిన పునర్వాసు నక్షత్రంలోకి కుజుడు ప్రవేశించబోతున్నాడు.. దీని ఫలితంగా ఈ సమయంలో అద్భుతమైన శుభ ప్రభావం ఏర్పడి.. కొన్ని రాశుల వారిపై పడబోతోంది. కుజుడి నక్షత్ర సంచారంతో ఐదు రాశుల వారికి మంచి జరుగుతుంది. ముఖ్యంగా వృత్తి పరంగా మేలు కలగడమే కాకుండా.. వ్యాపారాల్లో విశేషమైన ధన లాభాలు కలుగుతాయి. సంపాదనతో పాటు ఆస్తిపరంగా విశేషమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు..
ఈ రాశులవారికి బిగ్ జాక్ఫాట్..
మేషరాశి
కుజుడు పునర్వాసు నక్షత్ర సంచారం కారణంగా మేషరాశి వారికి ధన సంబంధిత సమస్యలన్నీ పరిష్కారం కాబోతున్నాయి. ఈ సమయంలో ఆకస్మిక ధన లాభాలు కలగడమే కాకుండా.. వృత్తిలో అద్భుతమైన పురోగతి లభిస్తుంది. అలాగే వ్యాపారాలు వృద్ధి చెంది కొత్త ప్రాజెక్టులు కూడా లభిస్తాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో అద్భుతమైన సమయాన్ని గడపగలుగుతారు. ముఖ్యంగా ఇబ్బందులతో పాటు అశాంతి తొలగిపోయి.. ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులందరికీ కుజుడి నక్షత్ర సంచార ప్రభావం వల్ల మంచి రోజులు రాబోతున్నాయి. సెప్టెంబర్ రెండవ తేదీ నుంచి వీరి జీవితంలో అనేక సమస్యల నుంచి పరిష్కారం లభించబోతోంది. గతంలో ఉన్న పాత చిక్కులన్నీ తొలగిపోయి ఈ సమయంలో తండ్రుల ఆస్తులు కూడా సొంతం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా భూములు కొనుగోలు చేసి.. భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తారు. అలాగే ఉద్యోగంలో అద్భుతమైన పదోన్నతులు లభించి.. వ్యాపారాలపరంగా మంచి వృద్ధి లభిస్తుంది..
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో దిమ్మతిరిగే ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇతరులకు ఇది అత్యంత అనుకూలంగా ఉంటుంది. పనుల్లో బాధ్యతలు పెరిగి జీతాలు కూడా ఊహించని రీతిలో పెరుగుతాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి వ్యాపారంలో విశేషమైన ప్రయోజనాలు చేకూతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా భారీ మొత్తంలో అనుకోని సంపదను కూడా సొంతం చేసుకోగలుగుతారు. కొత్త ప్రాజెక్టుల నుంచి ధనం కూడా విపరీతంగా లభిస్తుంది.
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కుజ గ్రహ సంచార ప్రభావంతో అనేక రకాల శుభవార్తలు వినగలుగుతారు. ముఖ్యంగా వీరికి ఉద్యోగంలో అద్భుతమైన పదోన్నతులు కూడా లభించబోతున్నాయి. వ్యాపారాల్లో భాగస్వాముల నుంచి మంచి సపోర్టు పొంది.. ఇతర దేశాల్లో పెట్టుబడును పెట్టగలుగుతారు. అలాగే ఎన్నో రకాల సమస్యల నుంచి అద్భుతమైన ఉపశమనం కూడా లభిస్తుంది. రుణాలు కూడా సులభంగా తీరిపోయి.. విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. డబ్బు సంబంధిత అంశాలన్నీ మెరుగుపడతాయి.
మీన రాశి
మీనరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా కుజుడి నక్షత్ర సంచార ప్రభావం మంచి రోజులను తీసుకువస్తుంది.. వీరికి కూడా సెప్టెంబర్ రెండవ తేదీ ఎంతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వీరి శత్రువులపై అద్భుతమైన విజయాలు సాధించడమే కాకుండా.. ఆదాయం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. కుటుంబంలో మంచి రోజులు రావడం ప్రారంభమవుతాయి. అంతేకాకుండా ఆదాయం పెరిగి ఇతర వాటిల్లో పెట్టుబడులు పెట్టి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నో సమస్యల నుంచి పరిష్కారం పొంది అనుకోని ప్రయోజనాలు సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గమనిక.. ఇక్కడ అందించిన సమాచారం కేవలం జ్యోతిష్య శాస్త్ర నిపుణుల నుంచి సేకరించి రాసింది మాత్రమే.. దీనికి జీ తెలుగు న్యూస్ కి ఎలాంటి సంబంధం లేదు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Pulasa Fish: రికార్డు స్థాయిలో పులస చేప ధర.. ఎంతకు కొన్నారంటే?
Yanam, Andhra Pradesh:Record Price To Pulasa Fish At Yanam Wath Full Videoచేతులు లేవని ఆగలేదు.. కాళ్లతో అన్నకు రాఖీ కట్టిన సోదరి! వైరల్ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..
Hyderabad, Telangana:Ties Rakhi With Feet Video: రాఖీ పౌర్ణమి అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది అన్నా చెల్లెల అంతులేని అద్భుతమైన ప్రేమ.. సోదరుడు ఎల్లప్పుడూ తనకు రక్షణగా నిలవాలంటూ.. ఒక సోదరి తన అన్న చేతికి కట్టే రక్షాబంధన్ వారిద్దరి మధ్య ఉన్న విడదీయరాని బంధానికి ప్రతీక.. అయితే, రాఖీ పండగకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరి కళ్ళు చెమగిల్లిపోతున్నాయి.. శారీరక లోపం వారి ప్రేమకు ఏమాత్రం అడ్డు కాదని నిరూపించిన ఈ అన్నాచెల్లెళ్ల అనురాగం.. సోషల్ మీడియా వినియోగదారుల హృదయాలను కదిలిస్తూ వస్తోంది.. అసలు ఆ వీడియో ఏంటి? దానికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా రాఖీ పండగ రోజున అక్కా చెల్లెల్లు.. తమ అన్నదమ్ముళ్ల మణికట్టుకు తమ చేతులతో రాఖీ కట్టి స్వీట్లను తినిపిస్తూ ఉంటారు. కానీ ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఒక సోదరి తన సోదరుడికి చేతులతో కాకుండా.. తన రెండు కాళ్లతో రాఖీ కట్టడం కనిపిస్తుంది.. ఆ అమ్మాయికి చేతులు లేకపోవడంతో.. తన కాళ్ళనే చేతులుగా మార్చుకొని.. రాఖీ కట్టడం ఈ వీడియోలో చూడొచ్చు. అంతటితో ఆగకుండా.. కాళ్లతోనే ఎంతో ప్రేమగా అన్నకు స్వీట్లు కూడా తినిపించేసింది.. ఆ సమయంలో ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆనందం.. సోదరుడి పట్ల ఆమెకున్న ప్రేమానురాగాలు చూస్తే ఎంతటి కఠినాత్ములకైన కన్నీళ్లు రాక తప్పవు.. సోదరుడు కూడా చెల్లెలి పరిస్థితిని అర్థం చేసుకొని.. ఆమె కురిపించిన ప్రేమను అంతే సంతోషంగా స్వీకరించడం ఈ వీడియోలో అందరి మనసును హత్తుకునే ఒక అద్భుతమైన ఘట్టంగా భావించవచ్చు..
ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో ఎక్స్ వేదికగా ఓ ఖాతాదారుడు షేర్ చేశారు. కాళ్లతో కట్టిన ఈ రాఖీ సోదరుడికి ప్రపంచంలోనే అత్యంత విలువైన రాఖీ.. ఆ సోదరి జీవితంలో ఎన్నో సవాళ్లు ఉన్న ఆమె ధైర్యం చూడండి.. కాళ్లతో రాఖీ కట్టి స్వీట్లు కూడా తినిపించింది.. ఆ బిడ్డను చూస్తుంటే నిజంగా హృదయం కదిలిపోతుంది అని ఆయన ఎమోషనల్ గా క్యాప్షన్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది..
बिटिया को देखकर आंखें सच में नम हो गईं। pic.twitter.com/KPjPIIptTT
— Haji Nizamuddin Abbasi (@HajiNizamuddin3) August 25, 2026
ఇది కూడ చదవండి: బస్సు నడుపుతుండగా గుండెపోటు.. అయినా 60 మంది ప్రాణాలు కాపాడిన RTC డ్రైవర్..
ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ప్రారంభమైంది.. వేలాదిమంది ఈ వీడియోని వీక్షించడమే కాకుండా.. లైకులతో పాటు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. నిజమైన ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఉండవని ఈ వీడియో నిరూపించిందని చాలామంది కామెంట్లు పెడుతూ వస్తున్నారు. బయటి పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా.. మనస్సులో స్వచ్ఛమైన ప్రేమ ఉంటే దారి దానంతట అదే దొరుకుతుంది అని ఓ సోషల్ మీడియా వినియోగదారుడు ప్రశంసించాడు.
ఇది కూడ చదవండి: బస్సు నడుపుతుండగా గుండెపోటు.. అయినా 60 మంది ప్రాణాలు కాపాడిన RTC డ్రైవర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
