తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన పలువురు గ్రామస్తులు
Bellampalle, Kannal Rural, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెద్దబూద గ్రామ శివారులో తాము నిర్మించుకున్న కట్టడాలను రెవెన్యూ అధికారులు నిన్న కూల్చివేయగా గురువారం గ్రామానికి చెందిన పలువురు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. గతంలో శివాలయం వద్ద నిర్మించుకుంటే వాటిని తొలగించి వేరే చోట తమకు స్థలం ఇప్పిస్తామని అధికారులు మాట ఇచ్చి మరిచారని, ఇప్పుడు తమ నిర్మాణాలు కూల్చి వేయడంతో తమకు నిలువ నీడ లేకుండా పోయిందని వాపోయారు. ఇంటి నిర్మాణాల కోసం తమకు స్థలం కేటాయించాలని కోరుతూ తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
AP Rain Alert: బంగాళాఖాతంలో మరోసారి అలజడి..రేపు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
Vijayawada, Andhra Pradesh:AP Rain Alert News: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే చెదురుమదురు వర్షాలు కురుస్తుండగా, రాబోయే రోజుల్లో దీని ప్రభావం మరింత విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తమై, పలు జిల్లాలకు వర్ష సూచన జారీ చేసింది.
జిల్లాల వారీగా వర్ష సూచన
రేపు అనగా ఆగస్ట్ 6వ తేదీ గురువారం శ్రీకాకుళం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అలాగే మిగిలిన కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడే సూచన ఉందని అధికారులు వెల్లడించారు.
ప్రజలకు కీలక హెచ్చరికలు
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలు, రైతులు, ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా వర్షం సమయంలో చెట్లు, విద్యుత్ పోల్స్, హోర్డింగ్స్ కింద ఎవరూ నిలబడవద్దని స్పష్టం చేసింది. పొలాల్లో పనిచేసే రైతులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
రైతులకు తాజా పరిస్థితి
రాష్ట్రంలో గత కొంతకాలంగా ఎల్ నినో ప్రభావం వల్ల సకాలంలో వర్షాలు పడక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ద్రోణులు, అల్పపీడనాలు పంటలకు కొంతవరకు ఊరటనిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో విస్తారమైన వర్షాలు కురిస్తేనే వ్యవసాయ రంగానికి మేలు జరిగి రైతులు సంక్షోభం నుంచి గట్టెక్కే అవకాశం ఉంది.
Also Read: ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా మెగాస్టార్ చిరంజీవి? త్వరలోనే అధికారిక ప్రకటన!
Also Read: ఉపరాష్ట్రపతితో టీడీపీ ఎంపీల బృందం భేటి.. 'అమరావతి' ప్రత్యేక పుస్తకం ఆవిష్కరణ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chiranjeevi Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా మెగాస్టార్ చిరంజీవి? త్వరలోనే అధికారిక ప్రకటన!
Vijayawada, Andhra Pradesh:AP Brand Ambassador Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా నియమించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ కీలక బాధ్యతపై ఇప్పటికే ఇరువర్గాల మధ్య ప్రాథమిక సంప్రదింపులు, సానుకూల చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
ముఖ్య విశేషాలు, ప్రధాన లక్ష్యం..
రాష్ట్రంలోకి పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడం, పర్యాటకరంగాన్ని మరింత అభివృద్ధి చేయడం, జాతీయ స్థాయిలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ను గణనీయంగా పెంచడమే ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం.
గుజరాత్ పర్యాటక రంగానికి బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించి ఆ రాష్ట్రానికి ఎంతటి జాతీయ గుర్తింపు తెచ్చారో, అదే రీతిలో ఏపీ బ్రాండ్ను ముందుకు తీసుకెళ్లడానికి చిరంజీవిని రంగంలోకి దించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే ఈ బృహత్తర బాధ్యతపై ఇప్పటికే ఇరువర్గాల మధ్య కీలక చర్చలు పూర్తయినట్లు సమాచారం.
ఈ భాగస్వామ్యానికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు, దీనిపై త్వరలోనే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మెగాస్టార్ రాకతో ఏపీ పర్యాటక, పెట్టుబడుల రంగాలకు మరింత ఊపు వస్తుందని అంచనా వేస్తున్నారు.
Also Read: విద్యార్థులకు పండగ లాంటి వార్త..ఈ వారంలో వరుసగా 3 రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
Also Read: ఏపీ, తెలంగాణ ఎల్నినో బారి నుంచి బయటపడినట్టేనా? రైతులు తప్పకుండా తెలుసుకోవాలి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Airtel 299 Cancelled: వినియోగదారులకు ఎయిర్టెల్ బిగ్షాక్..అతిచౌకైన రూ.299 రీఛార్జ్ ప్లాన్ క్యాన్సిల్!
Hyderabad, Telangana:Airtel 299 Recharge Cancelled: ప్రముఖ ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ (Airtel) తన కస్టమర్లకు మరో షాక్ ఇచ్చింది. అత్యంత ఆదరణ పొందిన రూ.299 ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ను పూర్తిగా తొలగించింది. ప్రస్తుతం ఈ ప్లాన్ ఎయిర్టెల్ అధికారిక వెబ్సైట్ లేదా ఎయిర్టెల్ థాంక్స్ యాప్లో కనిపించడం లేదు. గతంలో రీఛార్జ్ ధరలను సవరించిన ఏడాది తిరగకముందే ఈ మార్పు చేయడం గమనార్హం.
తొలగించిన ప్లాన్లు, ప్రయోజనాలు..
రూ.299 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ కింద రోజుకు 1GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు, ఫ్రీ కాలర్ ట్యూన్స్తో పాటు పెర్ప్లెక్సిటీ ప్రో ఏఐ సబ్స్క్రిప్షన్ లభించేవి. ఇకపై ఈ ప్లాన్ అందుబాటులో ఉండదు.
రూ.299 ప్లాన్ రద్దు కావడంతో, యూజర్లు రీఛార్జ్ చేసుకోవడానికి కనీస ధర రూ.349కి పెరిగింది. రూ.349 ప్లాన్లో 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్, 100 SMSలు, 6 నెలల యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్, ఫ్రీ హెలోట్యూన్స్ లభిస్తాయి.
రూ.579, రూ.619 ప్లాన్లు కూడా గల్లంతు
ఎంట్రీ లెవల్ ప్లాన్తో పాటు మధ్యస్థ వ్యాలిడిటీ కలిగిన రూ.579, రూ.619 ప్రీపెయిడ్ ప్లాన్లను కూడా ఎయిర్టెల్ నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు ప్యాక్లు కూడా ప్రస్తుతం వెబ్సైట్లో అందుబాటులో లేవు. అందులో మొదటిది రూ.579 రీఛార్జ్ ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీ డేటాను అందించేది.
అలాగే రూ.619 రీఛార్జ్ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీ డేటా ప్రయోజనాలతో అందుబాటులో లేవు. తొలుత కొన్ని సెలెక్టెడ్ సర్కిళ్లలో మాత్రమే ఈ ప్యాక్స్ను తొలగించిన ఎయిర్టెల్, క్రమంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ వీటిని నిలిపివేసినట్లు సమాచారం.
Also Read: మార్కెట్లోకి కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు..చలామణీ ఎప్పటినుంచి అంటే?
Also REad: అన్నీ వస్తువులు దొరికే డీమార్ట్లో చీరలు ఎందుకు అమ్మరు? ఇదే బిజినెస్ టాప్ సీక్రెట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
YS Jagan: వెన్నుపోటు పార్టీతో ఏపీ ప్రజలకు బాధ తప్ప ఏమైనా మంచి జరుగుతోందా? వైఎస్ జగన్
Rajamahendravaram, Andhra Pradesh:YS Jagan Devarapalli Tour: 'అన్యాయంపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు. అరెస్టులు. వెన్నుపోటు పార్టీతో రాష్ట్రానికి, ప్రజలకు బాధ. అంతేతప్ప ఏ మాత్రమైనా మంచి జరుగుతోందా?' అని మాజీ వైఎస్ జగన్ ప్రశ్నించారు. రాష్టంలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదని.. రైతులు రోడ్డెక్కుతున్నా పట్టించుకోని ప్రభుత్వం అని మండిపడ్డారు. పొగాకు రైతులకు అండగా నిలుస్తామని.. వారికి న్యాయం జరిగేలా పోరాడుతామని భరోసానిచ్చారు.
తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొగాకు కొనుగోలు కేంద్రం సందర్శించారు. పొగాకు కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించి అక్కడి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. స్థానిక పొగాకు కొనుగోలు కేంద్రం సందర్శించిన ఆయన, కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించారు. అనంతరం రైతులతో ముఖాముఖిలో పాల్గొన్న ఆయన, పొగాకు పంట సాగు, గిట్టుబాటు ధర, కొనుగోళ్లు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర వివరాలు ఆరా తీశారు. అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 'చంద్రబాబు పాలనలో ఒక్క గంజాయికే ధర. దాన్ని సాగు చేస్తోంది వెన్నుపోటు పార్టీ వారే' అని వెల్లడించారు. చంద్రబాబు పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక.. అన్ని రంగాలు విధ్వంసమయ్యాయని విమర్శించారు.
తమ సమస్యలను వినే నాయకుడు, కష్టకాలంలో అండగా నిలిచే మనిషి వస్తున్నాడనే నమ్మకమే వారిని కదిలించింది. పొగాకు రైతుల బాధ తెలుసుకునేందుకు వచ్చిన వైయస్ జగన్ గారికి ప్రజలు తమ అభిమానాన్ని అపూర్వంగా చాటుకున్నారు. నాయకత్వంపై నమ్మకం ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా ఎలా తరలివస్తారో ఈ దృశ్యాలే… pic.twitter.com/n0lT9n6p1r
— YSR Congress Party (@YSRCParty) August 5, 2026
'రైతులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ఆ కుటుంబానికి ఇవ్వాల్సిన రూ.7 లక్షలు ఇవ్వడం లేదు. అధికారంలోకి రాగానే వారికి రెట్టింపు సాయం చేస్తాం. మళ్లీ మార్క్ఫెడ్నూ బలోపేతం చేస్తాం' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. 'చంద్రబాబు పరిపాలనలో ఏం జరుగుతోంది అంటే విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు అన్నింటిలోనూ విధ్వంసమే కనిపిస్తోంది. ఎవరైనా అన్యాయి ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు. ఇవి మాత్రమే చంద్రబాబు పరిపాలనలో కనిపిస్తాయి' అని తెలిపారు. చంద్రబాబు పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ అని.. ఈ వెన్నుపోటు పార్టీతో రాష్ట్రానికి, ప్రజలకు బాధ తప్ప ఇంకేమైనా ఉందా' అని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు.
'26 నెలలు కనీసం ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధరలు వచ్చాయా? వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి, పెసర్లు, సజ్జలు, మిర్చి, పొగాకు, టమోటా, చీనీ పంటకు కానీ.. చివరకు మామిడి రైతులకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి' అని వైఎస్ జగన్ వివరించారు. రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన పరిస్థితికి బాధ్యత ఎవరిది? రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులు నమ్మి పంట వేస్తే, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని చంద్రబాబును ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వంలో ఒకే ఒక పంటకి మాత్రమే గిట్టుబాటు ధర లభిస్తోంది
అది ఏ పంట అంటే..? వెన్నుపోటు పార్టీకి చెందిన వారు పండిస్తున్న గంజాయి పంట
ఆ గంజాయిని పండిస్తున్న రైతులు టీడీపీకి చెందిన వారే
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు#YSJaganInDevarapalli#SadistChandraBabu… pic.twitter.com/lqpeBaw5Go
— YSR Congress Party (@YSRCParty) August 5, 2026
రైతులకు చంద్రబాబు దగా
'పీఎం కిసాన్కు అదనంగా ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.20 వేల చొప్పున ‘అన్నదాత సుఖీభవ' పేరుతో ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మూడేళ్లకు కలిపి ప్రతి రైతుకు రూ.60 వేలు అందాలి. కానీ ఇప్పటివరకు ఇచ్చింది రూ.19 వేలు మాత్రమే. అంటే ఒక్కో రైతుకు రూ.41 వేలు ఇవ్వకుండా ఎగవేశారు. సుమారు 7 లక్షల మంది రైతులను ఈ పథకం నుంచి తొలగించారు. మొంథా తుపాన్ వచ్చి దాదాపు 10 నెలలు గడుస్తున్నా బాధిత రైతులకు ఇప్పటికీ ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ కూడా అందలేదు. సున్నా వడ్డీ పథకం రద్దు చేశారు' అని చంద్రబాబు రైతులకు చేసిన మోసాలు అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ వివరించారు.
'చంద్రబాబు హయాంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధరలు వచ్చింది కేవలం ఒకే ఒక్క పంటకు. ఆ రైతులు కూడా చంద్రబాబు వెన్నుపోటు పార్టీకి సంబంధించిన మనుషులే. అది ఏ పంటో తెలుసా? అది గంజాయి. చంద్రబాబు బియ్యం తింటే క్యాన్సర్ వస్తుందంట. కాబట్టి వరికి గిట్టుబాటు ధరలు రాకుండా ఢమాల్ చేసే కార్యక్రమం చేశాడు. మిర్చి తింటే ఎసిడిటీ వస్తుందట! దీంతో మిర్చి పంటకు గిట్టుబాటు ధరలు రాకుండా ఢమాల్ చేశాడు. మామిడి తింటే షుగర్ వస్తుందని ఆ పంటను ఢమాల్ చేశాడు' అని వైఎస్ జగన్ వెల్లడించారు.
SpaceX Moon Crash: అంతరిక్షంలో ఘోర ప్రమాదం..చంద్రుడ్ని ఢీ కొట్టిన ఎలాన్ మస్క్ రాకెట్!
Hawthorne, California:SpaceX Moon Crash News: అంతరిక్ష రంగంలో ఒక అనూహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ఎక్స్ (SpaceX)కు చెందిన ఫాల్కన్-9 రాకెట్కు సంబంధించిన విడిచిపెట్టిన పైభాగం (సెకండ్ స్టేజ్) చంద్రుడిని ఢీకొట్టినట్లు సమాచారం. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:05 గంటల ప్రాంతంలో చంద్రుడిపై ఉన్న ఐన్స్టీన్ బిలం (Einstein Crater) సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, శాస్త్రవేత్తలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.
ప్రమాదానికి దారితీసిన పరిణామాలు..
దాదాపు 4,500 కిలోల బరువు ఉన్న ఈ రాకెట్ పైభాగం, చంద్రుడిపైకి 'బ్లూ ఘోస్ట్ మిషన్'ను ప్రయోగించిన నాటి నుంచి గడచిన 19 నెలలుగా అంతరిక్షంలో లక్ష్యం లేకుండా తిరుగుతూ వచ్చింది.
2025 జనవరి 15న ప్రయోగించిన ఈ ఫాల్కన్-9 రాకెట్ దశలవారీగా విడిపోయిన తర్వాత, దాని పైభాగం ఇంధనం కోల్పోయింది. అప్పటి నుంచి భూమికి, చంద్రుడికి మధ్య గల ఒక విశాలమైన, అస్థిరమైన వలయంలో ఇది పయనించింది.
భూమి, చంద్రుడు, సూర్యుని గురుత్వాకర్షణ శక్తుల రాపిడి, అలాగే సూర్యరశ్మి కలిగించిన ఒత్తిడి కారణంగా ఈ రాకెట్ భాగం గమ్యస్థానం క్రమంగా మారుతూ వచ్చి, చివరికి చంద్రుడిని ఢీకొనేలా చేసింది.
వేగం, ప్రభావం..
ఈ స్టేజ్లోని ఇంధనాన్ని పూర్తిగా తొలగించి 'పాసివేట్' చేశామని స్పేస్ఎక్స్ సంస్థ తెలిపింది. అయినప్పటికీ, అంతటి అధిక శక్తి మార్గాలలో ప్రయాణించే వ్యోమనౌకల శకలాలను నియంత్రిత పద్ధతిలో పూర్తిగా దారి మళ్లించడం సాధ్యం కాదని పేర్కొంది.
చంద్రునికి గాలి నిరోధం లేదా ఘర్షణను కలిగించే వాతావరణం లేనందున, ఈ రాకెట్ భాగం దాదాపు గంటకు 8,700 కిలోమీటర్ల వేగంతో చంద్రుడిని ఢీకొట్టి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది సుమారు మూడు టన్నుల టీఎన్టీ (TNT)కి సమానమైన శక్తిని విడుదల చేసి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న మన చంద్రయాన్-2 ఆర్బిటర్ ఈ ప్రమాద స్థలాన్ని గుర్తించే అవకాశం ఉంది.
Also REad: Dubai explosions: 20 నిమిషాల్లో ఏడు భారీ పేలుళ్లు.. దుబాయ్లో హైటెన్షన్..
Also REad: అమెరికా-ఇరాన్ యుద్ధానికి తాత్కాలిక విరామం.. ట్రంప్ సంచలన నిర్ణయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
రూ.450 కోట్ల అవినీతి.. ఖండించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
Mancherial, Telangana:Prem Sagar Rao: రూ.450 కోట్ల బకాయిలను అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే చెల్లించడంతో తీవ్ర అవినీతి ఆరోపణలు మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై వచ్చాయి. ఈ ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం కావడంతో ఎట్టకేలకు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పందించారు. ఈ సందర్భంగా అవినీతి ఆరోపణలను ఖండించారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ దిన పత్రికలో వచ్చిన కథనాలను ఖండిస్తున్నట్లు చెప్పారు.
'నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు. నాపై ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజా ప్రతినిధులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టను. త్వరలో కుట్రలు అన్ని బయటకు వస్తాయి' కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారు చర్చలకు రావాలని సవాల్ చేశారు. 'నేను రూ.450 కోట్లు వాడుకున్నట్లు చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదు. 2009-10లో బ్యాంక్ రూ.450 కోట్లు మంజూరు చేసింది. సాయినాథ్ ప్రయివేట్ లిమిటెడ్పై, భాగ్యనగర్ హోటల్స్ పేరుమీద బ్యాంక్ రుణం తీసుకున్నాం. రాష్ట్రవ్యాప్తంగా నేను 15 స్కూల్స్ కట్టించా' అని ప్రేమ్ సాగర్ రావు వివరించారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా తాను అధికార దుర్వినియోగం చేయలేదని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పారు. 'ఇసుక, భూమి తీసుకోవాలనుకుంటే అప్పుడే తీసుకునే వాణ్ణి. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న, పత్రికలపై లీగల్ యాక్షన్ తీసుకుంటా' అని ప్రకటించారు. తాను ఆధారాలు లేకుండా ఫిర్యాదు చేయనని.. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం చేశానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే నేను భూమి, ఇసుక, మట్టి మాఫియా చేయలేదని పేర్కొన్నారు.
'యూఎస్ ట్రేడింగ్ డౌన్ అయిన తర్వాత నేను రూ.160 కోట్లు నష్టపోయా. నిజానిర్ధారణ కమిటీ వేస్తే కమిటీ ముందు పూర్తి ఆధారాలు చూపిస్తా. రూ.450 కోట్లు అవినీతి చేస్తే బ్యాంక్ రూ.109 కోట్లకు ఎలా ఆక్షన్ వేస్తుంది?' అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రశ్నించారు. సాంక్షన్ ఆర్డర్స్ నేను క్రేయేట్ చేసినవి కాదని తెలిపారు. తమ ఆదిలాబాద్ జిల్లా నేతలు తనపై కుట్ర చేశారని ఆరోపించారు. మంత్రి పదవి చర్చ వచ్చిన ప్రతీ సారి ఇలాంటి వార్తలు వస్తున్నాయని.. తనపై వచ్చిన ఆరోపణలపై ఎక్కడ చర్చకు అయినా సిద్దమేనని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రకటించారు.
YS Sharmila: ‘విధ్వంసం నుంచి మరింత అగాధంవైపు చంద్రబాబు పాలన‘: వైఎస్ షర్మిల
Vijayawada, Andhra Pradesh:YS Sharmila vs Chandrababu: అబద్ధాన్ని అందంగా చెప్పడంలో సీఎం చంద్రబాబు చంద్రబాబు ఘనాపాటి. రెండేళ్ల పాలనపై కూటమి ప్రోగ్రెస్ రిపోర్టు ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్. ప్రగతి నివేదిక కాదది.. పూర్తిగా గతి తప్పిన నివేదిక‘ అని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. నాలుగు సూత్రాల పాలన అపహాస్యం.. అభివృద్ధి బూటకం.. సంపద సృష్టి మోసం.. అని ప్రకటించారు. ‘సమతుల్యత పచ్చి అబద్ధం. సంక్షేమం టోకరా. విధ్వంసం నుంచి మరింత అగాధంవైపు.. అధిక అప్పుల నుంచి ఇంకాస్త అంధకారం వైపు. ఇదే కూటమి ప్రభుత్వ రెండేళ్ల ప్రగతి నివేదిక‘ అని వైఎస్ షర్మిల అభివర్ణించారు.
‘రెండేళ్ల కూటమి పాలన 24 మోసాల మయం. సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్. ఎన్నికల హామీలకు పంగనామాలు. మ్యానిఫెస్టోకి మంగళం’ అని చంద్రబాబు వైఫల్యాలను వైఎస్ షర్మిల ఏకరువు పెట్టారు. ‘అమలు చేశామని చెప్పే పథకాలు అరకొర. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పక్కన బెట్టి, చెల్లని రూపాయితో చిల్లు రాజకీయం తప్పా రెండేళ్లుగా చంద్రబాబు ఉద్ధరించింది శూన్యం. అందుకే బాబు షూరిటీ - భవిష్యత్ కి లేదిక గ్యారెంటీ‘ అని షర్మిల విమర్శించారు.
‘భరోసా పేరుతో సగానికి సగం పెన్షన్లలో కోతలు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ అని మాట తప్పారు. 3 వేల నిరుద్యోగ భృతి, లేదా 20 లక్షల ఉద్యోగాలు అంటూ 50 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకి 15 వందలు ఇస్తామని 2 కోట్ల మంది మహిళలను నమ్మించి నయవంచన చేశారు‘ అని వైఎస్ షర్మిల ఆరోపణలు చేశారు. ‘దీపం పథకం రాష్ట్రంలోని సగం కుటుంబాలకే పరిమితం చేస్తే, గొప్పలు చెప్పుకుంటున్న సుఖీభవ పథకం కింద 40 లక్షల మంది రైతులకు టోకరా పెట్టారు. ఇచ్చేదాంట్లో కేంద్రంతో సంబంధం లేకుండా అని మాట మార్చారు. 20 వేలు ఇస్తామని పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో అన్యాయంగా లింక్ పెట్టారు‘ అని వైఎస్ షర్మిల ఆరోపించారు.
‘ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అన్ని రూ.15 వేలు అని హామీ ఇచ్చి.. 20 లక్షల మంది బిడ్డలకు దారుణ మోసం చేస్తున్నారు. ఇస్తున్న వారికి రూ.2 వేలు చొప్పున తగ్గించి ఎన్నికల్లో హామీని గాలిలో కలిపారు. ఆరోగ్యశ్రీ కి రూ.4 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్ పథకానికి రూ.10 వేల కోట్లు బకాయిలు పెట్టి, రూ.6 వేల కోట్లు ఖర్చు చేశామని గొప్పలు చెప్పుకోవడం కూటమి సర్కారుకే చెల్లింది‘ అని చంద్రబాబు మోసాలను వైఎస్ షర్మిల వివరించారు.
రూ.32 వేల కోట్ల మేర సబ్సిడీలు విద్యుత్ కింద ప్రజలకు ఇస్తే మరి 15 వేల కోట్ల మేర ట్రూ అప్ భారాన్ని ఎందుకు మోపినట్లు? కూటమి ప్రభుత్వాన్ని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రూ.12 వందల కోట్లు ధరల స్థిరీకరణ నిధి పెడితే, రాష్ట్ర రైతాంగం పండించిన పంటలను రూపాయికి అమ్ముకోలేక చెత్తకుప్పలో ఎందుకు పారబోసినట్లు? నిలదీశారు. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి పరుగులు పెడితే, అభివృద్ధిలో అట్టడుగున అప్పుల్లో ప్రథమ స్థానంలో ఎందుకున్నట్లు? అని కూటమి ప్రభుత్వాన్ని షర్మిల కడిగి పారేశారు. ‘తలసరి ఆదాయం పెంచడం పక్కన పెడితే గత 12 ఏళ్లుగా తెలుగు దేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు కలిసి ఒక్కో తలపై పెట్టిన అప్పు సరాసరి రూ.2 లక్షలు‘ అని షర్మిల వెల్లడించారు. ‘2024-26 మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు గసాధించిన ప్రగతి మళ్లీ అరచేతిలో వైకుంఠమే. పెట్టుబడుల పేరుతో జిమ్మిక్కులే. అమరావతి ముసుగులో మాయాజాలమే. అభివృద్ధి అజెండాతో మరో 3 లక్షల కోట్ల అప్పులే. ఎన్నికల హామీల పేరుతో మాటల గారడీలే. ఇదే కూటమి ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధి శ్వేతపత్రం‘ అని చంద్రబాబు రెండేళ్ల రిపోర్ట్ పై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేశారు.
Plastic Notes In India: మార్కెట్లోకి కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు..చలామణీ ఎప్పటినుంచి అంటే?
Mumbai, Maharashtra:Plastic Notes In India News: ప్రస్తుతం మన దేశంలో చలామణిలో ఉన్న కాగితపు కరెన్సీ నోట్లకు ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లను తీసుకువచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సన్నాహాలు చేస్తోంది. ఈ నూతన విధానంపై ప్రజల్లో ఉన్న ఉత్కంఠకు తెరదించుతూ ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టమైన ప్రకటన చేశారు.
ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి?
ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ.. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపారు. ఆయన ప్రకటనను బట్టి 2027 ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఈ ప్లాస్టిక్ నోట్లు మార్కెట్లోకి వచ్చే సూత్రప్రాయమైన ప్రణాళిక ఉంది. అయితే, ఇది ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉందని, ఈ ప్రయోగ ఫలితాల ఆధారంగానే వీటిని పెద్ద ఎత్తున అమలు చేయడంపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ప్లాస్టిక్ నోట్ల ప్రత్యేకతలు
కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా రూ.10, రూ.20 డినామినేషన్లలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 2 బిలియన్ల (200 కోట్లు) పాలిమర్ నోట్లను ముద్రించడానికి ఆర్బీఐకి అనుమతి మంజూరు చేసింది. ప్రస్తుతానికి కాగితపు నోట్లను పూర్తిగా రద్దు చేసే ప్రణాళికలు ఏవీ లేవు. పాలిమర్, కాగితపు నోట్లు రెండూ ఏకకాలంలో సమాంతరంగా చలామణిలో ఉంటాయి.
సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్ల కాలపరిమితి రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ. తరచుగా చేతులు మారుతూ త్వరగా అరిగిపోయే చిన్న నోట్ల (రూ.10, రూ.20) సమస్యకు ఇది చక్కటి పరిష్కారంగా మారుతుంది.
ప్లాస్టిక్ నోట్ల అవసరం ఎందుకు ఏర్పడింది?
దేశంలో ఆర్థిక వ్యవస్థ పరిమాణం పెరుగుతున్న కొద్దీ నగదు లావాదేవీల అవసరం కూడా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు గత 30 ఏళ్లుగా పాలిమర్ నోట్లను విజయవంతంగా వాడుతున్నాయి.
నోట్ల భద్రత, నిర్వహణ, ముద్రణ కోసం ప్రతి ఏటా సుమారు రూ.5,000 కోట్లు ఖర్చవుతున్నాయి. గణాంకాల ప్రకారం 2016-17 నుంచి జారీ చేసిన ప్రతి 100 కొత్త నోట్లలో 71 పాత నోట్లను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అలాగే గత దశాబ్దంలో దాదాపు రూ. 50 బిలియన్ల విలువైన పాత నోట్లను ఉపసంహరించుకున్నారు. నకిలీ నోట్ల బెడదను అరికట్టి భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేసేందుకు ఇవి దోహదపడతాయి.
భారత వాతావరణం, పర్యావరణం, బ్యాంకింగ్ వ్యవస్థకు ఇవి ఎంతవరకు అనుకూలంగా ఉంటాయో క్షేత్రస్థాయిలో పరీక్షించిన తర్వాతే రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నోట్లు చలామణిలోకి రానున్నాయి.
Also REad: రేపు మంగళవారం బ్యాంకులకు సెలవు..ఆగస్టు 4వ తేదీన అక్కడ ఈ బ్యాంకులు బంద్! ఎందుకంటే?
Also REad: అన్నీ వస్తువులు దొరికే డీమార్ట్లో చీరలు ఎందుకు అమ్మరు? ఇదే బిజినెస్ టాప్ సీక్రెట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Iqoo నుంచి మరో మైండ్ బ్లోయింగ్ స్మార్ట్ఫోన్.. iQOO Z11 ఫుల్ డీటైల్స్ లీక్!
Hyderabad, Telangana:Iqoo Z11 Launching In India: టెక్ ప్రియులకు నిద్రలేకుండా చేసే అదిరిపోయే వార్త రానే వచ్చేసింది.. భారతదేశ స్మార్ట్ఫోన్ మార్కెట్లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి.. యంగ్ జనరేషన్ను ఆకట్టుకోవడానికి వివో (Vivo) సబ్బ్రాండ్ ఐకూ (iQOO) దిమ్మతిరిగే డిజైన్తో కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. తన ఫ్లాగ్షిప్ వేరియంట్లో అందుబాటులోకి రాబోతున్న iQOO Z11 స్మార్ట్ఫోన్ డిజైన్ను అధికారికంగా టీజ్ చేస్తూ టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఐకూ ఇండియా CEO నిపుణ్ మార్యా తమ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా విడుదల చేసిన టీజర్ ఇప్పుడు టెక్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. గతంలో మార్చి నెలలో చైనాలో విడుదలైన మోడల్తో పోలిస్తే.. భారత వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని.. దీని డిజైన్లో ఊహించని మార్పులు చేశారు.
ఈ ఫోన్ వెనుక భాగంలో క్లాసీగా కనిపించే హారిజంటల్ పిల్-షేప్డ్ కెమెరా మోడ్యూల్తో పాటు దానిలో రెండు పెద్ద ప్రధాన కెమెరా రింగ్స్, అలాగే అద్భుతమైన సర్క్యులర్ LED రింగ్ లైట్ అందించారు. 3D కర్వ్డ్ రియర్ ప్యానెల్తో చేతిలో పట్టుకుంటే ఒక అద్భుతమైన ప్రీమియం అనుభూతిని ఇచ్చేలా దీనిని తీర్చిదిద్దిన్నట్లు తెలస్తోంది.. ముఖ్యంగా కళ్లకు కట్టిపడేసే బ్లూ (Blue), గ్రీన్ (Green) అనే రెండు క్యూట్ అండ్ స్టైలిష్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభించబోతోంది.
స్పీడ్తో పాటు పెర్ఫార్మెన్స్ విషయంలో రాజీపడేదే లేదంటోంది ఐకూ.. భారతదేశంలో ఆక్టాకోర్ మీడియాటెక్ డిమెన్సిటీ 7500 టర్బో (MediaTek Dimensity 7500 Turbo) ప్రాసెసర్తో అందుబాటులోకి రాబోతోంది. హెవీ గేమింగ్ ఆడేవారికి, మల్టీ టాస్కింగ్ ప్రియులకు ఈ ప్రాసెసర్ ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తుందని కంపెనీ తెలిపింది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
భారత మార్కెట్లో 3D కర్వ్డ్ డిస్ప్లేతో అందుబాటులోకి రాబోతున్న ఈ ఫోన్ టెక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకోనుంది. ఇక చైనా వేరియంట్ ఫీచర్లను గమనిస్తే.. ఇందులో 6.83-అంగుళాల AMOLED స్క్రీన్తో పాటు 165Hz రిఫ్రెష్ రేట్, 50MP OIS ప్రధాన కెమెరా, 16GB ర్యామ్తో పాటు 512GB స్టోరేజ్ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది.. ఇది భారత మార్కెట్లోకి ఈ నెలలోనే అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ iQOO Z11 స్మార్ట్ఫోన్, మిడ్-రేంజ్ విభాగంలో ఇతర దిగ్గజ బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
భారత్లోకి Moto G Max ఎంట్రీ.. రూ.30 వేల బడ్జెట్లో అదిరిపోయే ఫీచర్లు.. పూర్తి వివరాలు ఇవే!
Hyderabad, Telangana:Motorola Moto G Max Price: ప్రముఖ ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా (Motorola) భారతీయ వినియోగదారుల కోసం మరో పవర్ఫుల్ స్మార్ట్ఫోన్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. మోటో G మాక్స్ (Moto G Max) పేరుతో రాబోతున్న ఈ కొత్త ఫోన్ అతిత్వరలోనే భారత్లో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ టిప్స్టర్ అభిషేక్ యాదవ్ ఎక్స్ వేదికగా వెల్లడించిన వివరాల ప్రకారం... ఈ ఫోన్ ఆగస్టు 15న భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన ఫీచర్స్తో పాటు స్పెషిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
భారత్లో Moto G Max స్మార్ట్ఫోన్ ధర సుమారు రూ.30,000 నుంచి ప్రారంభమవుతున్నట్లు తెలుస్తోంది.. అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఫోన్ను 8 GB ర్యామ్తో పాటు 256 GB స్టోరేజ్ అనే ఒకే ఒక్క వేరియంట్లో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. ఇది అజుల్ క్లారో (Azul Claro), గ్రాఫైట్ (Grafite) అనే రెండు అద్భుతమైన కలర్ ఆప్షన్లలో విడుదల కాబోతున్నాయి..
ఫీచర్లు వివరాలు..
గ్లోబల్ మార్కెట్తో పోలిస్తే.. భారతీయ వేరియంట్లో మోటోరోలా కొన్ని కీలక మార్పులు చేయనున్నట్లు తెలిసింది. అంతర్జాతీయంగా మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్సెట్తో విడుదలైనప్పటికీ.. భారత్లో వచ్చే మోటో G మాక్స్ ఫోన్లో పవర్ఫుల్ స్నాప్డ్రాగన్ 6s జెన్ 4 (Snapdragon 6s Gen 4) ప్రాసెసర్తో అందుబాటులోకి రాబోతోంది.
ఈ ఫోన్లో 6.8-ఇంచుల 1.5K రిజల్యూషన్ కలిగిన బిగ్ డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది.. ఇది గేమింగ్తో పాటు వీడియో చూడడానికి చాలా అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్ను కూడా కలిగి ఉంటుంది.. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ LYT-600 ప్రధాన కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంటుంది.. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఏర్పాటు చేసిన్నట్లు తెలుస్తోంది.
ఈ ఫోన్లో మోస్ట్ పవర్ఫుల్ 5,200 mAh సామర్థ్యం కలిగిన శక్తివంతమైన బ్యాటరీని అందుబాటులోకి తీసుకు రాబోతోంది.. ఇది 32W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. మోటో G మాక్స్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో UI (Hello UI) ఆపరేటింగ్ సిస్టమ్పై రన్ అవుతుంది. వినియోగదారులకు 2 సంవత్సరాల OS అప్డేట్లతో పాటు 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లను కంపెనీ హామీగా ఇస్తున్నట్లు తెలిపింది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
మోటోరోలా ఇటీవలే భారత మార్కెట్లో మోటో G37తో పాటు మోటో G37 పవర్ ఫోన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు రూ.30,000 బడ్జెట్లో రాబోతున్న మోటో G మాక్స్ స్మార్ట్ఫోన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jantar Mantar ISI: జంతర్ మంతర్లో ఉగ్రవాదుల కుట్రభగ్నం..ఐఎస్ఐ ఉగ్ర ముఠాల గుట్టురట్టు..9 మంది అరెస్ట్!
New Delhi, Delhi:Jantar Mantar ISI Terror Plot: సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్లో ఉగ్రవాద మూలాలను పెకలించివేసే క్రమంలో రాష్ట్ర పోలీసులు భారీ విజయం సాధించారు. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) మద్దతుతో కార్యకలాపాలు సాగిస్తున్న రెండు ప్రమాదకర సరిహద్దు ఉగ్రవాద ముఠాలను పంజాబ్ పోలీసులు విజయవంతంగా భగ్నం చేశారు. ఈ ఆపరేషన్లో నలుగురు మైనర్లతో సహా మొత్తం తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేయగా, వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఆపరేషన్ విశేషాలు, స్వాధీనం చేసుకున్నవి..
అమృత్సర్ కమిషనరేట్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో నిందితుల నుంచి 3 అక్రమ పిస్టళ్లు, 4 పెట్రోల్ బాటిల్ బాంబులు, 9 సజీవ తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) గౌరవ్ యాదవ్ తెలిపారు.
ఉగ్రవాదుల ముఠాలో వంశ్ కుమార్, అన్మోల్ సింగ్, హర్మన్ సింగ్ అలియాస్ హమ్ము, సుఖ్దేవ్ సింగ్, సుఖ్మన్ సింగ్తో పాటు మరో నలుగురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జంతర్ మంతర్ దాడికి కుట్ర, పాకిస్థాన్ లింక్..
ప్రాథమిక విచారణలో నిందితులు సంచలన విషయాలు వెల్లడించారు. విదేశాల్లో ఉన్న ఐఎస్ఐ హ్యాండ్లర్లు స్థానిక యువతకు డబ్బు ఆశ చూపి ఉగ్ర కార్యకలాపాల వైపు మళ్లిస్తున్నట్లు తేలింది. ఇటీవలి విద్యార్థి నిరసనల సమయంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విధ్వంసం సృష్టించే బాధ్యతను ప్రధాన నిందితుడు సుఖ్మన్కు పాకిస్థాన్ హ్యాండ్లర్లు అప్పగించారు.
సుఖ్మన్ తన సహచరులతో కలిసి ఢిల్లీకి వెళ్లినప్పటికీ, అక్కడ ఉన్న భారీ భద్రత కారణంగా వారి కుట్ర విఫలమై తిరిగి పంజాబ్కు చేరుకున్నారు. ఈ ఉగ్ర నెట్వర్క్ వెనుక పాకిస్థానీ గ్యాంగ్స్టర్ కమాండ్, ఉగ్రవాది షాజాద్ భట్టి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. నిందితులు వాట్సాప్ చాట్ల ద్వారా విదేశీ హ్యాండ్లర్లతో టచ్లో ఉన్నారు.
రైల్వే ట్రాక్లపై రెక్కీ, సీసీటీవీల గుట్టు రట్టు..
ఉగ్రవాదుల గ్యాంగ్ రెండవ ముఠాకు సంబంధించిన విచారణలో రైల్వే ట్రాక్ల భద్రతకు సంబంధించిన కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. గత నెలలో రైల్వే ట్రాక్ల సమీపంలో అనుమానాస్పద రీతిలో అమర్చిన సీసీటీవీ కెమెరాలపై పోలీసులు దర్యాప్తు జరపగా, ఆ కెమెరాల లైవ్ ఫుటేజీని విదేశీ హ్యాండ్లర్లకు చేరవేస్తున్నట్లు తేలింది. అంతేకాకుండా, పంజాబ్లోని పోలీస్ స్టేషన్లు, కీలక భవనాలు, పోలీస్ సిబ్బంది కదలికలపై రెక్కీ నిర్వహించే బాధ్యతను కూడా ఈ ముఠాకు అప్పగించినట్లు విచారణలో స్పష్టమైంది. అమృత్సర్ సెంట్రల్ జైలు కేంద్రంగా సాగిన ఆర్థిక లావాదేవీల కోణంలోనూ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
Also Read: అన్నీ వస్తువులు దొరికే డీమార్ట్లో చీరలు ఎందుకు అమ్మరు? ఇదే బిజినెస్ టాప్ సీక్రెట్!
Also REad: రేపు మంగళవారం బ్యాంకులకు సెలవు..ఆగస్టు 4వ తేదీన అక్కడ ఈ బ్యాంకులు బంద్! ఎందుకంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
రికార్డ్ బ్రేకింగ్ ఫీచర్లతో Redmi K100 Pro సిరీస్ లాంచ్.. మార్కెట్లో కాకరేపుతున్న ఫీచర్లు!
Hyderabad, Telangana:Redmi K100 Pro Series Telugu News: ప్రసిద్ధ మొబైల్ తయారీ సంస్థ Redmi తన ఫ్లాగ్షిప్ సిరీస్ Redmi K100 Proను మార్కెట్లో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది. మైక్రోబ్లాగింగ్ వేదిక వైబో (Weibo)లో Redmi షేర్ చేసిన సమాచారం ప్రకారం.. ఈ సిరీస్ను ఆగస్టు 11న చైనాలో అధికారికంగా లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ సిరీస్లో Redmi K100 Proతో పాటు Redmi K100 Pro Max అనే రెండు ప్రీమియం మోడల్స్తో అందుబాటులోకి రాబోతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Redmi K100 Pro స్మార్ట్ఫోన్ను కంపెనీ ఆక్టా-కోర్ కస్టమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 వి-సిరీస్ (Custom Snapdragon 8 Elite Gen 5 V Series) చిప్సెట్తో పనిచేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. గేమింగ్ అనుభవాన్ని పెంచేందుకు ఇందులో ప్రత్యేకమైన AI గేమింగ్ గ్రాఫిక్స్ చిప్, Raging Engine సాంకేతికతను కూడా కంపెనీ అందించింది. కంపెనీ ఇంటర్నల్ పరీక్షల్లో (Internal Testing) ఈ ఫోన్ AnTuTu బెంచ్మార్కింగ్ ప్లాట్ఫారమ్పై ఏకంగా 40,95,000 కంటే ఎక్కువ స్కోర్ను సాధించడం విశేషం..
ఫోన్ అధికంగా వేడెక్కకుండా ఉండేందుకు థర్మల్ మేనేజ్మెంట్ కోసం 3D సర్క్యులేటింగ్ కోల్డ్ పంప్ కూలింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. ఇది భారీ గేమింగ్తో పాటు మల్టీటాస్కింగ్ సమయంలో ఫోన్ను వేగంగా కూల్ అవుతుంది.. అలాగే Redmi K100 Pro మోడల్లో 6.59 అంగుళాల ఫ్లాట్ డిస్ప్లే ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. ఇది 185Hz వరకు రిఫ్రెష్ రేట్ను సపోర్ట్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది.
వెనుక వైపు రెక్టాంగ్యులర్ మోడ్యూల్లో LED ఫ్లాష్తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ను కూడా కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. దీని విశేషమేమిటంటే.. ఈ కెమెరా ఐలాండ్పై ప్రముఖ ఆడియో బ్రాండ్ Sound by Bose బ్రాండింగ్ కూడా రాబోతోంది.. ఫోన్ కుడి వైపున పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికే చైనాలో ఈ ఫోన్కు సంబంధించిన విక్రయాల ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
రెడ్మి K100 ప్రో మాక్స్కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వివరాల్లోకి.. ఈ టాప్ వేరియంట్ Redmi K100 Pro Max కేబర్నెట్ రెడ్ (Cabernet Red) కలర్ ఆప్షన్లో మెటల్ ఫ్రేమ్తో అందుబాటులోకి రాబోతోంది. ఇది 6.9 అంగుళాల పెద్ద OLED డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. ఇది మోస్ట్ పవర్ఫుల్ 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఇది ఏకంగా 9,000 mAh భారీ బ్యాటరీ ఉండే అవకాశం ఉందని సమాచారం. చైనా లాంచ్ తర్వాత ఈ సిరీస్ అంతర్జాతీయ మార్కెట్లలో Poco F9 Proతో పాటు Poco F9 Ultra పేర్లతో రీబ్రాండ్ అయి రీలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
వైష్ణోదేవి సన్నిధిలో అద్భుతం.. ఐదేళ్ల క్రితం తప్పిపోయిన కొడుకును కలుసుకున్న తల్లి.. వీడియో!
Hyderabad, Telangana:Missing Son Found Viral Video: కన్నపేగు మమకారం కలిస్తే.. ఎలాంటి అద్భుతాలైనా జరుగుతాయని నిరూపించేలా ప్రముఖ పుణ్యక్షేత్రం వైష్ణోదేవి సన్నిధిలో ఒక భావోద్వేగ సంఘటన చోటుచేసుకుంది. గత ఐదేళ్లుగా నిరంతరం వెతుకుతూ.. ఆశలు వదులుకోక ఓపికతో వేచి చూస్తున్న ఒక తల్లి, చెల్లెలిను వైష్ణోదేవి అమ్మవారు మళ్లీ వారి ఒడికి చేర్చింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వివరాల్లోకి వెళ్తే.. సదరు తల్లితో పాటు కుమార్తె భక్తిశ్రద్ధలతో అమ్మవారి దర్శనం కోసం వైష్ణోదేవి ఆలయానికి వచ్చారు.. కిటకిటలాడే భక్తుల రద్దీలో నడుస్తుండగా.. ఉన్నట్టుండి అమ్మ దృష్టి ఒక యువకుడిపై పడింది. వేలాది మంది జనం మధ్యలో నడుస్తున్న ఆ యువకుడి రూపం.. నడక శైలి ఆమెకు అనుమానం కలిగించేలా ఉండడంతో పక్కనే ఉన్న కుమార్తె కూడా ఆ యువకుడిని చూసి.. ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కళ్లెదురుగా నిలబడి ఉన్నది ఐదేళ్ల క్రితం దూరమైన తమ సొంత రక్తమేనని వారికి క్షణాల్లో అర్థమైంది..
అది కలనా లేక నిజమా అని ఆలోచించే.. వ్యవధి కూడా ఇవ్వకుండా.. ఆ తల్లి, సోదరి ఆ యువకుడి వైపు పరిగెత్తారు.. దగ్గరకు వెళ్లి చూడగా.. తమ గుండెల్లో దాచుకున్న కొడుకేనని స్పష్టమైంది.. ఐదేళ్ల తర్వాత.. గుండెల్లో దాచుకున్న ఆవేదన అంతా ఒక్కసారిగా కన్నీటి రూపంలో బయటకు వచ్చింది.. ఆ యువకుడిని గట్టిగా పట్టుకుని ఆ తల్లి ఏడుస్తున్న తీరు అక్కడ ఉన్న ఇతర భక్తులను చలించేలా చేసింది. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఈ దృశ్యాన్ని చూసి తమ కళ్లను తామే నమ్మలేకపోయారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
ఐదేళ్ల క్రితం అనుకోకుండా కుటుంబానికి దూరమైన.. ఈ యువకుడి కోసం ఆ కుటుంబం పడని తాపత్రయం లేదు.. ఎన్నో పోలీసు స్టేషన్లు, అనేక నగరాలు తిరిగినా ఫలితం దక్కలేదు.. అయినా సరే.. ఏదో ఒక రోజు నా కొడుకు తిరిగి వస్తాడు అనే ఆశతో ఆ తల్లి ప్రతిరోజూ ప్రార్థిస్తూనే ఉంది.. చివరకు ఆ తల్లి సహనానికి, నమ్మకానికి వైష్ణోదేవి అమ్మవారి ఆలయం వేదికగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్స్ కళ్లలో నీళ్లు తెచ్చుకుంటున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
వామ్మె.. పామునే మింగేసిన కప్ప.. వీడియో వైరల్!
Hyderabad, Telangana:Giant Snake Video Viral: ప్రపంచంలో ఎప్పుడు ఏ జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు.. సాధారణంగా మనందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం ఏమిటంటే.. పాము కనిపిస్తే కప్ప భయంతో గజగజ వణుకుతుంది. పాము క్షణాల్లో కప్పను ఆహారంగా మార్చుకుంటుంది. చిన్నప్పటి నుంచి మనం విన్నది.. చూసింది కూడా ఇదే.. కానీ, ప్రకృతి నియమాలను తలకిందులు చేస్తూ.. ఒక ఊహించని వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. పాముకే ఇతర జీవులు ఎరగా మారుతుంటే.. ఇక్కడ మరొక జీవికి అదే ఎరగా మారింది. ఏకంగా ఒక కప్పే పామును సజీవంగా మింగేస్తున్న షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలుఇ ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అసలేం జరిగింది?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం.. ఒక పెద్ద కప్ప ఒక చిన్న పామును తన నోటితో గట్టిగా పట్టుకుంది. పాము తోక భాగం నుంచి మెల్లమెల్లగా లోపలికి మింగేయం మొదలు పెట్టింది. నోటి నుంచి తప్పించుకోవడానికి ఆ పాము తీవ్రంగా శ్రమించింది. తన పడగ విప్పి.. సర్వశక్తులు ఒడ్డి కప్ప పట్టు నుంచి బయటపడటానికి విఫలయత్నం చేసింది. అయితే, ఆ కప్ప మాత్రం తన పట్టును ఏమాత్రం వదలేకుండా ఉండడం మీరు గమనించవచ్చు. పాము ఎంత విలవిలలాడినా వదలకుండా కొద్దికొద్దిగా పామును ప్రాణాలతోనే గుటకలేస్తూ తినే ప్రయత్నం చేస్తోంది.. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ తమ కళ్ళను తామే నమ్మలేకపోతున్నారని కామెంట్స్ చేస్తూ వస్తున్నారు..
बल्कि मेंढक ही साँप को निगलने लगा है। pic.twitter.com/Bp1TYQlqLc
— नई सोच (@NayiSochHQ) August 1, 2026
ఈ అరుదైన దృశ్యాన్ని @NayiSochHQ అనే ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. వీడియోకు ఇది కలియుగం సామీ.. ఇక్కడ పాము కప్పను తినడం లేదు.. కప్పే పామును మింగేస్తోందని రాసుకొచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ రోజు పాముకు టైమ్ అస్సలు బాగున్నట్లు లేదు.. అని కొందరు వ్యాఖ్యానించగా.. మరికొందరు ప్రకృతిలోని సర్వైవల్ అఫ్ ది ఫిట్టెస్ట్ నియమానికి ఇది నిదర్శనమని అంటున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
సాధారణంగా బుల్ఫ్రాగ్ (Bullfrog) రకానికి చెందిన పెద్ద కప్పలు తమ నోటికి చిక్కిన చిన్నపిట్టలు, ఎలుకలు, పురుగులతో పాటు చిన్నపాములను కూడా తింటాయని వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట లక్షలాది మంది వీక్షణలతో ట్రెండింగ్లో కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ వీడియోను చాలా మంది సోషల్ మీడియాల్లో షేర్ చేస్తూ వస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ప్రేమకు వయసుతో పనేంటి? 81 ఏళ్ల బామ్మ.. 24 ఏళ్ల కుర్రాడు.. వీడియో వైరల్..
Hyderabad, Telangana:Elderly Woman Young Man Relationship Video Watch: ప్రేమకి సరిహద్దులు లేవు.. వయసుతో అసలే పనేలేదు.. అనే మాటను మనం చాలాసార్లు వినే ఉంటాం. కానీ ఈ జంటను చూస్తే మాత్రం ఆ మాట వందకు వంద శాతం నిజమేనని ఒప్పుకోక తప్పరు.. ఒకరి వయసు శతాబ్దానికి దగ్గరగా ఉంటే.. మరొకరు ఇప్పుడిప్పుడే 25 ఏళ్ల వయస్సులోకి అడుగుపెట్టారు. సమాజం ఏమనుకున్నా సరే.. తమ బంధమే తమకు ముఖ్యమని నిరూపించిన ఈ విచిత్ర ప్రేమజంట ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సోషల్ మీడియా వేదికగా మొదలైన ఒక సాధారణ చాటింగ్.. వీరిద్దరినీ అంత దగ్గర చేస్తుందని బహుశా వారు కూడా ఊహించి ఉండరు.. 81 ఏళ్ల వయసున్న మహిళ.. 24 ఏళ్ల యువకుడితో ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. మొదట్లో కేవలం స్నేహంగా ప్రారంభమైన వీరి చాటింగ్, రోజులు గడిచేకొద్దీ మంచి ప్రేమగా మారాయి. వయసులో ఏకంగా 57 ఏళ్ల వ్యత్యాసం ఉన్నప్పటికీ.. మనసులు కలవడమే ముఖ్యమని భావించిన ఈ జంట.. తమ అనుబంధాన్ని మరింత అద్భుతమైన స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.
వీరి లవ్ స్టోరీ గురించి తెలిసిన వెంటనే.. నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వచ్చాయి.. కొందరు ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని కామెంట్ చేయగా.. మరికొందరు డబ్బు కోసమే యువకుడు ఈ నిర్ణయం తీసుకున్నాడని విమర్శించారు.. అయితే, ఎలాంటి నెగిటివ్ వ్యాఖ్యలను పట్టించుకోకుండా ఈ జంట ఒకటయ్యారు.. తమ మధ్య ఉన్నది స్వచ్ఛమైన ప్రేమ మాత్రమేనని.. ఒకరికొకరు తోడుగా ఉండటమే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
వీరిద్దరూ కలిసి ఉన్న వీడియోలు, రీల్స్ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. వీరి కెమిస్ట్రీ చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. లక్షలాది మంది ఈ వీడియోలను వీక్షించడమే కాకుండా.. విపరీతంగా షేర్ చేస్తున్నారు. నిజమైన ప్రేమకు రూపం.. వయసుతో సంబంధం లేదని కొందరు నెటిజన్లు వీరికి మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
