icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
504251
KASARLA RAMESHKASARLA RAMESHFollow22 Aug 2024, 10:26 am

తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన పలువురు గ్రామస్తులు

Bellampalle, Kannal Rural, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెద్దబూద గ్రామ శివారులో తాము నిర్మించుకున్న కట్టడాలను రెవెన్యూ అధికారులు నిన్న కూల్చివేయగా గురువారం గ్రామానికి చెందిన పలువురు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. గతంలో శివాలయం వద్ద నిర్మించుకుంటే వాటిని తొలగించి వేరే చోట తమకు స్థలం ఇప్పిస్తామని అధికారులు మాట ఇచ్చి మరిచారని, ఇప్పుడు తమ నిర్మాణాలు కూల్చి వేయడంతో తమకు నిలువ నీడ లేకుండా పోయిందని వాపోయారు. ఇంటి నిర్మాణాల కోసం తమకు స్థలం కేటాయించాలని కోరుతూ తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

200 ఏళ్ల తర్వాత పుట్టిన ఆడబిడ్డ కోసం ఊరంతా సంబరాలు!

Hyderabad, Telangana:

Maharashtra Baby Girl Birth Celebration: ఆడపిల్ల పుడితే కొందరు భారంగా భావించే ఈ రోజుల్లో.. ఓ కుటుంబం మాత్రం తమ ఇంటి మహాలక్ష్మి వచ్చిందంటూ ఊరంతా సంబరాలు చేసుకుంది.. ఒకటి రెండు కాదు.. ఏకంగా నాలుగు తరాలు.. సుమారు 200 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆ వంశంలో ఆడబిడ్డ జన్మించడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ కుటుంబ సభ్యులు ఆనందంతో ఊర్లో ఎన్నో రకాల ప్రత్యేకమైన దానధర్మ కార్యక్రమాలు చేపట్టారు. 

మహారాష్ట్రకు చెందిన దహిఫలే కుటుంబంలో దాదాపు రెండు శతాబ్దాలుగా మగ పిల్లలే పుడుతూ వస్తున్నారు.. తమ ఇంట్లో కూడా ఆడపిల్ల నవ్వులు వినిపించాలని.. ఓ చిన్నారి ముద్దు ముద్దు మాటలతో ఇల్లంతా సందడి చేయాలని ఆ కుటుంబం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ వస్తోంది. ఎట్టకేలకు నాలుగు తరాల తర్వాత వారి కల నెరవేరింది.. కుటుంబంలోని పండంటి ఆడబిడ్డ జన్మించడంతో కుటుంబ సభ్యులు ఆనందంతో సంబరాల్లో మునిగిపోయారు.. ఆ పాపకు గార్గి అని నామకరణం చేసి.. తమ ఇంటిని వెలిగించడానికి వచ్చిన సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపంగా భావించారు..

తమ ముద్దుల కూతురి రాకను చిరస్మరణీయంగా మార్చుకోవాలని ఆ కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఆస్పత్రి నుంచి తల్లి బిడ్డ డిశ్చార్జ్ అయిన సందర్భంగా వారు చేసిన ఏర్పాట్లు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు.. చిన్నారి, ఆమె తల్లిని సాధారణ వాహనంలో కాకుండా రంగుల పూలతో ప్రత్యేకంగా అలంకరించిన రథంపై కూర్చోబెట్టారు.. ఆస్పత్రి నుంచి ఇంటి వరకు దారి పొడవున డప్పు జప్పులతో పాటు భార్యాభజంత్రీలు మోగిస్తూ బాణ సంచాలు కాలు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు.

Also Read: నేపాల్ జలప్రళయం.. మామిడి చెట్టును పట్టుకుని రెండుసార్లు చావును జయించిన కార్మికుడు!

దారి పొడవునా గ్రామస్తులతో పాటు బంధువులు ఆ చిన్నారిపై పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఊరంతా పండగ వాతావరణం నెలకొనడంతో గ్రామస్తులు కూడా ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.. నేటి ఆధునిక కాలంలో కూడా ఆడపిల్లల పట్ల వివక్షత చూపే కొందరికి ఈ ఘటన ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. ఆడబిడ్డ పుట్టుకను ఒక మహా ఉత్సవంలా జరుపుకున్న దాహిఫలే కుటుంబ తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి రాకతో ఆ ఇంట ఆనందం ఊహించని స్థాయిలో వెల్లువిరిసింది. అంతేకాకుండా ఈ వేడుకకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి..

Also Read: నేపాల్ జలప్రళయం.. మామిడి చెట్టును పట్టుకుని రెండుసార్లు చావును జయించిన కార్మికుడు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

GATE 2027 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. కొత్తగా 'రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్' సబ్జెక్ట్ చేరిక.. దరఖాస్తు చేసుకోండిలా!

Hyderabad, Telangana:

GATE 2027 Registration: ఐఐటి గేట్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది, ఈ ప్రక్రియ సెప్టెంబర్ 27 నుండి 2026 వరకు కొనసాగుతుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (GATE) 2027 కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్లను సమర్పించవచ్చు. దరఖాస్తుల గడువు అక్టోబర్ 5 వరకు ఉంటుంది, అయితే లేట్ ఫీజు చెల్లించి కూడా అప్లికేషన్ చేసుకునే సౌలభ్యం ఉంది. అక్టోబర్ 21 వరకు అప్లికేషన్ కరెక్షన్ విండో కూడా అందుబాటులో ఉంటుంది.

గేట్ 2027 పరీక్షలను ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21 తేదీల్లో నిర్వహిస్తారు. సిటీ అలాట్‌మెంట్ నోటిఫికేషన్ జనవరి 4న విడుదలవుతుంది, అడ్మిట్ కార్డ్‌లు కూడా అంతకుముందే విడుదల చేస్తారు. 2027 పరీక్షల ఫలితాలను మార్చి 19, 2027లో ప్రకటించే అవకాశం ఉంది.

గేట్ 2027లో కొత్తగా రోబోటిక్స్, ఆటోమేషన్ పేపర్‌ను ప్రవేశపెట్టారు. దీనితో పాటు పరీక్షను 30 టెస్ట్ పేపర్ల ఆధారంగా నిర్వహించనున్నారు. ఐఐటి మద్రాస్ 2027 గేట్ సిలబస్‌లో మార్పులు చేసింది, ప్రధానంగా బయోటెక్నాలజీ పేపర్‌లో అప్‌డేట్స్ చేసింది. సెక్షన్ పేపర్ కోడ్‌లు టెక్ స్టైల్ ఇంజినీరింగ్, ఫైబర్ సైన్స్ ఇంజినీరింగ్, సైన్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్ ఆధారంగా ఉంటాయి. పరీక్షా అభ్యర్థులు రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది, అందులో ఒక కాంబినేషన్ కూడా ఎంచుకునే అవకాశం ఉంది.

గేట్ 2027 అర్హత..
హయ్యర్ డిగ్రీ చదువుతున్న వారు ఈ పరీక్షకు అర్హులు. గుర్తింపు పొందిన ప్రభుత్వ లేదా ప్రైవేట్ కాలేజీలలో ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్ లేదా హ్యుమానిటీస్‌లో మూడవ సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా గేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, భారతీయ పౌరులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే డిజిలాకర్ తప్పనిసరి. ఐఐటి మద్రాస్ అభ్యర్థులు తమ డిజిలాకర్ అకౌంట్‌ను వెరిఫై చేసుకోవాలని, 2027 గేట్ అప్లికేషన్ ప్రక్రియకు ముందే ఈ పని పూర్తి చేయాలని సూచించింది.

Also Read: హైదరాబాద్ - మంగళూరు స్పెషల్ ట్రైన్స్ సర్వీసులు పొడిగింపు..టైమింగ్స్, రూట్ వివరాలివే!

Also Read: కృష్ణాష్టమి హాలిడే.. రేపు తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్ హాలిడే.. 

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

ISRO Rocket: శ్రీహరికోటలో సర్వం సిద్ధం.. రేపు ఇస్రో కీలక రాకెట్‌ ప్రయోగం

Shar Project, Andhra Pradesh:

GSLV F17 EOS 05: భారత అంతరిక్ష పరిశోధనలో మరో కీలక రాకెట్‌ ప్రయోగం జరగనుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో రాకెట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగాల్లో రారాజుగా చెప్పుకునే ఇస్రో  జీఎస్‌ఎల్‌వీ రాకెట్  ప్రయోగాల్లో కూడా వరుస విజయాలు సాధిస్తోంది. అధిక బరువు కలిగిన శాటిలైట్లను నింగిలోకి  ఇస్రో జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలను చేపడుతుంది. ఇప్పటివరకు రాకెట్ ప్రయోగాల్లో వరుస విజయాలు సాధించిన ఇస్రో GSLV F 17 రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు చేసింది. ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట రాకెట్ కేంద్రం వేదికగా సర్వం సిద్ధం చేసింది.

సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో GSLV F-17/EOS-05 రాకెట్‌ను ఈ నెల 4వ తేదీ తెల్లవారుజామున 2:55 నిమిషాలకు ప్రయోగించడానికి ఇస్రో సిద్ధమైంది. ఈ రాకెట్ ప్రయోగానికి బుధవారం రాత్రి 11 గంటల 25 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభించింది. ఈ కౌంట్‌డౌన్ 27.30 గంటల పాటు కొనసాగుతోంది. ఈ కౌంట్‌డౌన్‌ విజయవంతంగా కొనసాగిన అనంతరం తెల్లవారుజామున 2.55 నిమిషాలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. 

శ్రీహరికోట రాకెట్ కేంద్రంలోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌- 17 రాకెట్ నింగిలోకి వెళ్లనుంది. ఈ రాకెట్ ప్రయోగం  జీఎస్ఎల్‌ ప్రయోగాల్లో 19వ ప్రయోగం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన క్రయోజనిక్‌తో ప్రయోగించే ఈ ప్రయోగం ద్వారా ఈఓఎస్‌ (EOS) 05 శాటిలైట్‌ను కక్ష్యలోకి ఇస్రో పంపనుంది. భూ ఉపరితల పరిస్థితులను అధునాతనంగా అధ్యయనం చేసేందుకు ఈ రాకెట్ ప్రయోగం ఉపయోగపడనుందని ఇస్రో శాస్త్రవేతలు తెలిపారు.

ప్రయోగం ప్రధాన లక్ష్యం
ఈఓఎస్‌-05 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఇది కేవలం మరో ఉపగ్రహ ప్రయోగం కాదు. భూకక్ష్య నుంచి భూమిని మరింత అధునాతనంగా పరిశీలించే భారత అంతరిక్ష సామర్థ్యానికి మరో కీలక ముందడుగుగా ఇస్రో భావిస్తోంది. జియోసింక్రోనస్ ఆర్బిట్ నుంచి ఇమేజింగ్ చేయనున్న భారత తొలి ఇమేజింగ్ శాటిలైట్‌గా EOS-05 ప్రత్యేకతను సంతరించుకుంది. భూమి పరిశీలన, భౌగోళిక మార్పుల అధ్యయనం, సహజ వనరుల పర్యవేక్షణ వంటి అనువర్తనాల్లో ఉపగ్రహ ఆధారిత పరిశీలనా సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యం. శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లే GSLV-F17, భారత అంతరిక్ష ప్రస్థానంలో  మరో మైలురాయిగా నిలవబోతోంది. ఈ రాకేట్ ప్రయోగం  దృష్ట్యా శ్రీహరికోట రాకెట్ కేంద్రం (షార్)లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

0
0
Report
Advertisement

Onion Price Hike: మండిపోతున్న ఉల్లి ధరలు..రెట్టింపైన రేట్లతో సామాన్యుడి కన్నీళ్లు!

Hyderabad, Telangana:

Onion Rate Hike: కూరగాయలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని సామాన్య, మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా రోజువారీ కూలీలు తమ జీవితాలను కొనసాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంటిట్లో అత్యంత కీలకమైన వస్తువు ఉల్లిపాయ. ప్రతిరోజు వంటల్లో దీని వాడకం తప్పనిసరి. ఇది లేనిదే ఏ కూర కూడా వండటానికి కుదరదు. 

అలాంటి ఉల్లిపాయల ధరలు గత కొద్ది రోజులుగా గణనీయంగా పెరిగి సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు కిలో రూ.20కే లభించిన ఉల్లిపాయలు ఇప్పుడు ఏకంగా రెట్టింపయ్యాయి. అకాల వర్షాలు మరియు నిల్వ నష్టాల కారణంగా మార్కెట్లకు నాణ్యమైన ఉల్లి సరఫరా తగ్గడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల మార్కెట్లలో ధరలు..
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కిలో ఉల్లి ధర రూ. 40 నుండి రూ. 50 వరకు పలుకుతోంది. సెప్టెంబర్ 2వ తేదీ నాటి రైతు బజార్లలోని ధరల వివరాలను గమనిస్తే..

హైదరాబాద్ (మెహిదీపట్నం రైతు బజార్): ఇక్కడ కిలో ఉల్లిపాయల ధర రూ. 40గా ఉంది. ఇతర కూరగాయలతో పోల్చితే టమాట రూ. 19, వంకాయ రూ. 35, బెండకాయ రూ. 35, పచ్చిమిర్చి రూ. 37, బీన్స్ రూ. 65, క్యారెట్ రూ. 37, దొండకాయ రూ. 23, ఆలుగడ్డ రూ. 16 వద్ద కొనసాగుతున్నాయి.

విజయవాడ రైతు బజార్: విజయవాడలోని రైతు బజార్లలో చూస్తే కిలో ఉల్లిపాయల ధర రూ. 48 నుండి రూ. 50 వరకు పలుకుతోంది. ఇక్కడ ఇతర కూరగాయల ధరలు చూస్తే టమాట రూ. 30, వంకాయ రూ. 24, క్యారెట్ రూ. 45, కీరదోస రూ. 50, బీన్స్ అత్యధికంగా రూ. 94కు లభిస్తున్నాయి.

దేశవ్యాప్త సగటు, కారణాలు
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఉల్లి ధరలు మండిపోతున్నాయి. ప్రస్తుతం భారత్‌లో సగటు కిలో ఉల్లి ధర రూ. 49.59కి చేరుకుంది. గత ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన దేశంలో సగటు ఉల్లి ధర రూ. 28.48 ఉండగా, ఇప్పుడు అది 74 శాతానికి పైగా పెరిగింది.

అయితే, ఈ ధరల పెరుగుదలకు దేశంలో ఉల్లి ఉత్పత్తి తగ్గడం కారణం కాదు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 307.37 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి అయింది. రబీ కోత సమయంలో కురిసిన అకాల వర్షాలు పంటను తీవ్రంగా దెబ్బతీయడం, తదుపరి నిల్వ నష్టాల వల్ల మండీలకు చేరే నాణ్యమైన ఉల్లిపాయల పరిమాణం తగ్గడమే ఈ భారీ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read: విద్యార్థులకు శుభవార్త.. 'తల్లికి వందనం' నిధులు మరోసారి విడుదల..లిస్టు‌ వచ్చేసింది!

Also Read: దేశవ్యాప్తంగా భారీ వర్షసూచన..రేపు స్కూళ్లకు సెలవు ఉందా? విద్యార్థులకు అలర్ట్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

YSR: రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి కావాలనేది వైఎస్సార్‌ కోరిక: రేవంత్‌ రెడ్డి

New Delhi, Delhi:

YSR Awards 2026: ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ఒక కోరిక తీరకుండానే మరణించాడని తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ఆయన జీవిత లక్ష్యమని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. కానీ ఆ కోరిక తీరలేదని చెప్పారు. రాహుల్ గాంధీని దేశానికి ప్రధాని చేయడమే వైఎస్సార్‌కు నిజమైన నివాళి అని ప్రకటించారు. దీనికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌ ఆశయాల సాధనకు తాము పనిచేస్తామని తెలిపారు.

ఢిల్లీలో జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026 కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. 'రైతులకు ఉచిత విద్యుత్ పై తొలి సంతకం చేసిన గొప్ప వ్యక్తి వైఎస్సార్‌. ఆనాడు రూ.1,300 కోట్లు విద్యుత్ బకాయిలు రద్దు చేసి.. రైతులపై కేసులు ఎత్తివేసి రైతుల గుండెల్లో వైఎస్సార్‌ రారాజుగా నిలిచారు' అని రేవంత్‌ రెడ్డి కొనియాడారు. తెలంగాణలో సాగునీరు అందిచేందుకు ప్రాణహిత చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రారంభించిన ఘనత వైఎస్సార్‌ది' అని వివరించారు.  ఆనాడు వైఎస్సార్‌ ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల, ఎస్ఎల్‌బీసీ ఆగిపోయాయని.. ఆయన ఆశయాలను నూటికి నూరు శాతం కొనసాగిస్తామని ప్రకటించారు. 

'వైఎస్సార్‌ చివరి కోరిక ఇంకా నెరవేరలేదు. ఆయన రెండోసారి ప్రమాణస్వీకారం చేశాక ఒకే ఒక్క మాట చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే ఆయన జీవిత లక్ష్యం అని ఒకే ఒక్క మాట చెప్పారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన మరణించారు. రాహుల్ గాంధీని దేశానికి ప్రధాని చేయడమే వైఎస్సార్‌కు నిజమైన నివాళి. ఆయన చివరి కోరిక నెరవేర్చాలంటే రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి' అని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు.

'వైఎస్ ఆశయాలను మనమంతా ముందుకు తీసుకెళ్లాలి. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ విద్య, సాగునీటి రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. నెహ్రూ ముందుచూపుతో దేశం ఆకలి కేకల నుంచి ఆహార ఎగుమతుల వరకు చేరుకుంది. దేశంలో మొట్టమొదటిసారిగా రైతు పండించే పంటకు మద్దతు ధరను అందించే చర్యలు చేపట్టిన ఘనత ఇందిరాగాంధీ. దేశంలో ప్రతీ ఒక్కరికీ ఆహారభద్రత కల్పించాలని సోనియా గాంధీ ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చారు' అని రేవంత్‌ రెడ్డి వివరించారు.

'వ్యవసాయ చట్టం తీసుకొచ్చి అసైన్డ్ భూములను పేదలకు పంచిన చరిత్ర ఇందిరాగాంధీది. పీడీఎస్ విధానం తీసుకొచ్చి రేషన్ షాప్ ద్వారా నిత్యావసర సరుకులు అందిస్తున్నాం. తెలంగాణలో 3 కోట్ల 48 లక్షల మందికి సన్న బియ్యం అందిస్తున్నాం' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ప్రాణహిత చేవెళ్ల, ఎస్ఎల్‌బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల పూర్తి చేసి తెలంగాణ సమాజానికి అంకితమిస్తామని రేవంత్‌ రెడ్డి ప్రకటన చేశారు. 'దేశ ప్రజలు కష్టాల్లో ఉన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు నాయకుడు అండగా నిలబడాలి. అండగా నిలబడాల్సిన చారిత్రక సందర్భం ఈరోజు ఈ దేశానికి అవసరం. దేశానికి బలమైన నాయకుడు రాహుల్ గాంధీ' అని తెలిపారు. తామంతా కలిసి కష్టపడి రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుందామని కాంగ్రెస్‌ శ్రేణులకు రేవంత్‌ రెడ్డి సూచించారు.

0
0
Report
Advertisement

Traffic Diversion: హైదరాబాద్‌ ప్రజలకు బిగ్‌ అలర్ట్‌.. రేపు భారీగా ట్రాఫిక్‌ మళ్లింపు

Hyderabad, Telangana:

Hyderabad Traffic Diversion: రోజువారి మీదుగా రాకపోకలు సాగించే హైదరాబాద్‌ వాహనదారులకు బిగ్‌ అలర్ట్‌. రేపు ఓ ప్రాంతంలో భారీగా వాహనాల మళ్లింపు చేపట్టారు. నగరంలో మరో ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం జరగనుండగా.. ఈ క్రమంలో ఆ మార్గంలో వాహనాల మళ్లింపు చేయనున్నారు. నిత్యం బిజీగా ఉండే నల్గొండ ఎక్స్ రోడ్డులో వాహనాల మళ్లింపు చేపడుతున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు ప్రకటించారు. పలు మార్గాల్లో వాహనాల దారి మళ్లింపు రేపు ఉంటుందని.. వాహనదారులు గమనించాలని సూచించారు.

రేపు ఫ్లైఓవర్‌ ప్రారంభం
కేసీఆర్‌ ప్రభుత్వంలో శంకుస్థాపన జరిగిన నల్లగొండ క్రాస్‌ రోడ్డు నుంచి ఓవైసీ జంక్షన్ కారిడార్ ఫ్లైఓవర్‌ పూర్తయ్యింది. నూతనంగా నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం రేపు జరగనుంది. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా రేపు సెప్టెంబర్ 3 గురువారం నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు విధించినట్లు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గంటల వరకు వాహనాల మళ్లింపు కొనసాగుతుందని ప్రకటించారు.

మూసివేసే రహదారులు
సైదాబాద్ వై జంక్షన్ నుంచి నల్గొండ ఎక్స్ రోడ్ మధ్య రహదారి పూర్తిగా మూసివేత. ఈ మార్గంలో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉండడంతో వాహనదారులు నల్గొండ ఎక్స్ రోడ్ - సైదాబాద్ వై జంక్షన్ రోడ్డు వైపు వెళ్లరాదు.

దారి మళ్లింపు ఇలా
నల్గొండ ఎక్స్ రోడ్డు నుంచి సంతోశ్‌ నగర్, ఐఎస్ సదన్ వైపు వెళ్లే వాహనాలు
==> నల్గొండ ఎక్స్ రోడ్ వద్ద మళ్లింపు: మలక్‌పేట్ గంజ్ -- మూసారాంబాగ్ ఎక్స్ రోడ్ - గడ్డిఅన్నారం ఎక్స్ రోడ్ వద్ద కుడి మలుపు -> రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ -> శివగంగ థియేటర్ -> హనఫియా మసీదు వద్ద కుడి మలుపు -> సంకేశ్వర్ బజార్ -> సింగరేణి కాలనీ (ఎడమ మలుపు) -> ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ చంపాపేట్ (ఎడమ మలుపు) -> చంపాపేట్ మెయిన్ రోడ్డులో యు-టర్న్ -> చంపాపేట్ ఎక్స్ రోడ్ వద్ద ఎడమ మలుపు -> లక్ష్మారెడ్డి గార్డెన్ మీదుగా డిఎమ్‌ఆర్‌ఎల్ రోటరీ వైపు వెళ్లాలి

ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్ నుంచి నల్గొండ ఎక్స్ రోడ్ వైపు వెళ్లే వాహనాలు
==> సైదాబాద్ వై జంక్షన్ వద్ద కుడి మలుపు -> డీసీపీ-3 కార్యాలయం -> సైదాబాద్ లా అండ్ ఆర్డర్ పీఎస్ -> సరస్వతి నగర్ కమాన్ -> సంకేశ్వర్ బజార్ -> ఇండియన్ పెట్రోల్ బంక్ -> హనఫియా మసీదు వద్ద ఎడమ మలుపు -> గడ్డిఅన్నారం ఎక్స్ రోడ్ వద్ద ఎడమ మలుపు తీసుకుని నల్గొండ ఎక్స్ రోడ్ చేరుకోవాలి.

మీర్‌చౌక్ నుంచి డబీర్‌పురా బ్రిడ్జి మీదుగా సైదాబాద్ వై జంక్షన్ వైపు వెళ్లే వాహనాలు
==> ట్రిబ్యునల్ కోర్ట్ (ఏపీఏటీ) వద్ద మళ్లింపు -> డబీర్‌పురా కమాన్ -> షేక్ ఫయాజ్ కమాన్ (కుడి మలుపు) -> గంగా నాలా -> బడా బజార్ -> యాకుత్‌పురా ఆర్‌యూబీ (ఆర్‌యూబీ) -> 82 బస్ స్టాప్ -> మదన్నాపేట్ మండీ -> సంతోష్ నగర్ మెయిన్ రోడ్డు మీదుగా వెళ్లాలి.

డబీర్‌పురా కమాన్ నుంచి చంచల్‌గూడ ఎక్స్ రోడ్ మీదుగా మలక్‌పేట్ వైపు వెళ్లే వాహనాలు
==> ట్రిబ్యునల్ కోర్ట్ (ఏపీఏటీ) వద్ద మళ్లింపు -> దారుల్‌షిఫా గ్రౌండ్ -> సక్సెస్ స్కూల్ -> ఎస్‌జె రోటరీ చాదర్‌ఘాట్ మీదుగా మలక్‌పేట్ మెయిన్ రోడ్డుకు చేరుకోవాలి.

తాజా అప్డేట్ కోసం..
ప్రయాణికులు ఈ ప్రత్యామ్నాయ మార్గాలను గమనించి, సహకరించాలని కోరారు. తాజా ట్రాఫిక్ సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫేస్‌బుక్, ఎక్స్‌లో తమ అధికారిక ఖాతాలు చూడాలని ట్రాఫిక్‌ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. ప్రయాణ అత్యవసర సమయాల్లో సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 90102 03626ను సంప్రదించాలని సూచించారు.

0
0
Report

KPHB Land Record Price: భూముల ధరల్లో సరికొత్త రికార్డు.. ఒక్క గజం రూ.2.70 లక్షలు

Hyderabad, Telangana:

KPHB Land Auction: తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో కన్న అత్యధిక ధరలు పలుకుతుండగా ఇక హైదరాబాద్‌లో భూముల ధరలు దేశంలోనే సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. తాజాగా నిర్వహించిన భూముల వేలంలో ఒక్క గజం రూ.2.70 లక్షలు పలికింది. కేపీహెచ్‌బీకి సంబంధించిన భూముల వేలంలో భారీ ధరలు పలికాయి. ఆ భూముల ధరలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కేపీహెచ్‌బీ భూములకు మరోసారి వేలం నిర్వహించగా ఈసారి తీవ్ర పోటీ నెలకొనడంతో భారీ ధరలు పలికాయి. మరోసారి రికార్డు ధరలకు హౌసింగ్ బోర్డు భూములు అమ్ముడుపోయాయి. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.47.14 కోట్ల మేర ఆదాయం లభించిందని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతమ్‌ ప్రకటించారు. ఎటువంటి వివాదాలు లేని.. అన్ని వసతులతో అభివృద్ధి చెందిన కేపీహెచ్‌బీ ప్రాంతంలో నిర్వహించిన ఓపెన్‌ ప్లాట్లకు భారీ డిమాండ్‌ వచ్చింది.

హౌసింగ్‌ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన బహిరంగం వేలంలో ఓపెన్‌ ప్లాట్లకు రికార్డు ధరలు వచ్చాయి. కేపీహెచ్‌బీ 7 ఫేజ్‌లోని 16 ఎంఐజీ ప్లాట్లకు బుధవారం నిర్వహించిన బహిరంగ వేలంలో ఒక ప్లాట్‌కు ఒక చదరపు గజం భూమి 2.70 లక్షలకు ధర పలికింది. ఈ వేలానికి సంబంధించి హౌసింగ్‌ బోర్డు ఆగస్టు 10వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఈ ప్లాట్లకు చదరపు గజం కనీస ధరగా రూ.1.60 లక్షలు నిర్దారించింది.

ఈ వేలం పాటలో ఓపెన్‌ ప్లాట్లను దక్కించుకోడానికి మొత్తం 19 మంది కొనుగోలుదారులు (బిడ్డర్లు) పోటీపడ్డారు. వేలంలో చదరపు గజం సగటు ధర సుమారు రూ.1.79 లక్షలు పలికిందని హౌసింగ్‌ బోర్డు అధికారులు ప్రకటించారు. తాజా బహిరంగ వేలం ద్వారా హౌసింగ్ బోర్డ్‌కు సుమారు రూ.47.14 మేర కోట్ల ఆదాయం వచ్చిందని వైస్ ఛైర్మన్ వీపీ గౌతమ్‌ వెల్లడించారు. ఒక ప్లాట్‌ చదరపు గజం రూ.2.70 లక్షలకు అమ్ముడుపోగా.. మరో ప్లాట్ చదరపు గజం రూ.2.36 లక్షలకు వేలంలో ధర లభించిందని తెలిపారు. మరో రెండు ప్లాట్లు రూ.2.06 లక్షలకు వేలం పాటలో ధర పలికిందని వివరించారు. నగరానికి శివారున ఉన్న కేపీహెచ్‌బీ ప్రాంతంలో భూములు ధరలు భారీగా ఉన్నాయి. ఈ డిమాండ్‌తో ప్రభుత్వం రానున్న రోజుల్లో మరికొన్ని కేపీహెచ్‌బీ ఓపెన్‌ ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

0
0
Report
Advertisement

School Holiday Tomorrow: దేశవ్యాప్తంగా భారీ వర్షసూచన..రేపు స్కూళ్లకు సెలవు ఉందా? విద్యార్థులకు అలర్ట్!

Hyderabad, Telangana:

School Holiday Tomorrow News: భారతదేశంలోని ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాలలో రుతుపవనాలు తీవ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ (IMD) సెప్టెంబరు 3, 2026 వరకు పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు, మధ్య భాగాలలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల రేపు బడులు మూసివేస్తారా లేదా అనే ఆందోళన విద్యార్థులు, తల్లిదండ్రులలో వ్యక్తమవుతోంది.

సాధారణంగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర స్థాయి నుండి కాకుండా, ఆయా రాష్ట్రాల విద్యాశాఖ, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో స్థానిక వాతావరణ తీవ్రతను బట్టి సెలవులు నిర్ణయిస్తారు. ఈ క్రమంలో, దేశవ్యాప్తంగా ఒకేసారి సెలవు ప్రకటించే అవకాశం లేదు. ముఖ్యంగా పాఠశాలల మూసివేత నిర్ణయాలు ప్రయాణాల భద్రత, వరద పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి.

రాష్ట్రాల వారీగా తాజా పరిస్థితులు..
హిమాచల్ ప్రదేశ్:
ఈ రాష్ట్రంలో సెప్టెంబర్ 3 వరకు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు ఒకేసారి సెలవు ఇవ్వకపోయినప్పటికీ, వాతావరణ తీవ్రతను బట్టి ఆయా జిల్లాల కలెక్టర్లు లేదా అధికారులు స్థానికంగా మూసివేత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఉత్తరాఖండ్: ఈ రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. ముఖ్యంగా నైనిటాల్ జిల్లాలో సెప్టెంబర్ 3వ తేదీన పాఠశాలలకు సెలవును అధికారులు ధృవీకరించారు. మిగిలిన జిల్లాల్లో వాతావరణ బులెటిన్లు, స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు.

ఇతర రాష్ట్రాలు: తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాలలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ రాష్ట్రాల్లో పూర్తిస్థాయి సెలవులు ప్రకటించలేదు కానీ స్థానిక పరిస్థితుల ఆధారంగా బడులు మూసివేసే అవకాశం ఉంది.

తల్లిదండ్రులు, విద్యార్థుల జాగ్రత్తలు..
వాతావరణ పరిస్థితులు సెప్టెంబర్ 3-4 వరకు ఇలాగే ఉండి, ఆ తర్వాత రుతుపవనాలు క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు, విద్యార్థులు తమ స్థానిక జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ, పాఠశాలల యాజమాన్యం నుండి వచ్చే అధికారిక ప్రకటనలను నిరంతరం గమనిస్తూ ఉండాలని సూచించడమైనది. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండి భద్రతా నియమాలు పాటించడం మంచిది.

Also Read: ఏపీ, తెలంగాణ ప్రజలకు చల్లని కబురు..బంగాళాఖాతంలో అల్పపీడనం..భారీ వర్షాలకు హెచ్చరిక!

Also Read: "రూ.43,000 కోట్ల అప్పులు తీర్చాను..నా జీవితం తెరిచిన పుస్తకం": Dr.సుభాష్ చంద్ర!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

TTD Deputy EO: తిరుమలలో కలకలం.. టీటీడీ డిప్యూటీ ఈఓ నివాసంలో ఏసీబీ తనిఖీలు

Tirupati, Andhra Pradesh:

Mendu Lokanatham: ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన డిప్యూటీ ఈఓ నివాసంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేయడం కలకలం రేపింది. ఇన్నాళ్లు ప్రభుత్వ ఉద్యోగులపై ఏసీబీ దాడులు నిర్వహించగా.. టీటీడీ అధికారి నివాసంపై ఏసీబీ తనిఖీలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం టీటీడీలో తీవ్ర కలకలం రేపింది.

తిరుపతిలోని  డిప్యూటీ ఈఓ లోకనాథం ఇంటిలో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలోని ఏసీబీ బృందం సోదాలు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగి మెండు లోకనాథం నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు సోదాలు జరిగాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో నెల్లూరు ఏసీబీ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు పొంది ఈ తనిఖీలు చేపట్టారు. జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి ప్రస్తుతం డిప్యూటీ ఈఓగా పనిచేస్తున్న లోకనాథం ఆస్తులపై విచారణ సాగుతోంది.

తిరుపతితో పాటు ఆయన బంధువులు, తమ్ముడి ఇళ్లతో సహా మొత్తం 5 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు చేశాయని సమాచారం. ​విచారణలో భాగంగా లభించిన బంగారం, ఆస్తి పత్రాలు, ఇతర పత్రాలను ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ​ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే ప్రజలు వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్‌ కోరారు. ​ఏసీబీ అధికారులమని చెప్పి డబ్బులు వసూలు చేసే నకిలీ వ్యక్తుల మాటలు నమ్మవద్దని, అలా అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీకి కాల్ చేయాలని సూచించారు.

భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాగా టీటీడీ డిప్యూటీ ఈఓ నివాసంపై ఏసీబీ తనిఖీలు చేయడాన్ని టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ ఈవో లోకనాథం యాదవ్‌పై ఏసీబీ దాడులు కుట్రలో భాగమేనా? లోకనాథం యాదవ్‌ను టార్గెట్ చేయడం వెనుక ఆధిపత్య పోరే కారణమా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక 80 మంది అధికారులతో 6 నెలల విచారణ చేసినా ఏం తేలలేదు తెలిపారు. కొండను తవ్వి ఎలుకను పట్టారని విమర్శించారు.

0
0
Report

Pattaya Police Raids: 5,000 మంది అమెరికా సైనికుల రాకతో సెక్స్ వర్కర్లపై దాడులు..థాయ్‌లాండ్‌ పోలీసులకు కొత్త చిక్కు!

Muang Pattaya, Chang Wat Chon Buri:

Pattaya Workers Police Raids: అమెరికా నావికాదళానికి చెందిన ప్రతిష్టాత్మక విమాన వాహక నౌక 'యూఎస్ఎస్ అబ్రహం లింకన్', మరో రెండు యుద్ధనౌకలు బుధవారం ఉదయం థాయ్‌లాండ్‌లోని లేమ్ చాబాంగ్ ఓడరేవులోకి ప్రవేశించాయి. ఈ నౌకలో సుమారు 5,000 మంది అమెరికా నావికులు, మెరైన్లు, పైలట్లు ఉన్నారు. గత ఏడాది నవంబర్‌లో అమెరికా పశ్చిమ తీరంలోని శాన్ డియాగో నుండి బయలుదేరిన ఈ నౌక, మధ్యప్రాచ్యంలో ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా సైనిక చర్యలకు మద్దతు ఇస్తూ సుదీర్ఘకాలం పాటు సముద్రంలోనే గడిపింది. 

ఈ మోహరింపు సమయంలో నౌకలో తీవ్రమైన పని గంటలు, సౌకర్యాల కొరత వంటి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం సెప్టెంబర్ 2 నుండి 6 వరకు ఐదు రోజుల పాటు తీర విరామం కోసం వచ్చిన సైనికులకు ఈ పర్యటన ఎంతో అవసరమైన ఉపశమనాన్ని ఇస్తోంది. పట్టాయా నగరానికి అమెరికా సైనికుల రాక ఇక్కడి పర్యాటక రంగానికి పెద్ద ఆశాకిరణంగా మారింది.

వియత్నాం యుద్ధం (1955-1975) సమయంలో విశ్రాంతి కోసం వచ్చిన అమెరికా సైనికుల వల్లే పట్టాయా ఒక చిన్న మత్స్యకార గ్రామం నుండి పర్యాటక కేంద్రంగా ఎదిగింది. ప్రస్తుతం 2026 నాటికి ఇక్కడ వ్యాపార పరిస్థితులు గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత బలహీనంగా ఉన్నాయని పట్టాయా నైట్‌లైఫ్ బిజినెస్ అసోసియేషన్ అధ్యక్షురాలు లీసా హామిల్టన్ ఆందోళన వ్యక్తం చేశారు. 

ప్రతి అమెరికా సైనికుడు రోజుకు సుమారు 1,000 నుండి 3,000 థాయ్ బాట్ (30 నుండి 90 డాలర్లు) వరకు ఖర్చు చేయవచ్చని, ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తుందని పట్టాయా మేయర్ పొరమాసే న్గాంపిచెస్ భావిస్తున్నారు.

అయినప్పటికీ, పెద్ద సంఖ్యలో వినియోగదారులు రావడం వల్ల లైంగిక దోపిడీ, వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అసోసియేట్ ప్రొఫెసర్ పిపత్‌పాంగ్ ఫక్‌ఫారే హెచ్చరించారు. థాయ్‌లాండ్ చట్టాల ప్రకారం వ్యభిచారం చట్టవిరుద్ధం అయినప్పటికీ, పట్టాయాలో ఇది విస్తృతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు గస్తీ ముమ్మరం చేసి అక్రమ వ్యభిచార గృహాలపై దాడులు చేశారు. 

ఈ ఆపరేషన్‌లో భాగంగా ఆగస్టు 29న పట్టాయా బీచ్ వెంబడి వీధి వ్యభిచారం చేస్తున్న 25 మంది మహిళలతో (18 మంది థాయ్, 5గురు లావో, ఇద్దరు ఉగాండా మహిళలు) సహా మొత్తం 40 నుండి 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. లైంగిక కార్మికులు బహిరంగ ప్రదేశాలలో విటులను ఆకర్షిస్తుండటంతో చట్టాల అమలు కష్టంగా ఉందని పట్టాయా పోలీస్ చీఫ్ అనెక్ స్రాతోంగ్యూ తెలిపారు.

అమెరికా సైనికుల పర్యటన సజావుగా సాగేందుకు అధికారులు కఠినమైన నిబంధనలు విధించారు. సైనికులను గంజాయి, మందుల దుకాణాలు, కొన్ని జల క్రీడలలోకి అనుమతించరు. రాత్రి 2 గంటల తర్వాత వారు బీర్ బార్ల వద్ద ఉండకూడదు. అలాగే, బాల లైంగిక సేవలను పూర్తిగా నిరోధించాలని, పర్యాటకుల నుండి అధిక ధరలు వసూలు చేసి దోపిడీ చేయవద్దని స్థానిక వ్యాపారులను అధికారులు హెచ్చరించారు.

Also Read: "భారత్, చైనా, అమెరికా వల్లనే వరదలు వచ్చాయి": నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా!

Also REad: నేపాల్‌లో పెను విలయం..ఆకస్మిక వరదలకు 392 మంది మృతి..290 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top