icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
504251
KASARLA RAMESHKASARLA RAMESHFollow22 Aug 2024, 10:26 am

తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన పలువురు గ్రామస్తులు

Bellampalle, Kannal Rural, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెద్దబూద గ్రామ శివారులో తాము నిర్మించుకున్న కట్టడాలను రెవెన్యూ అధికారులు నిన్న కూల్చివేయగా గురువారం గ్రామానికి చెందిన పలువురు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. గతంలో శివాలయం వద్ద నిర్మించుకుంటే వాటిని తొలగించి వేరే చోట తమకు స్థలం ఇప్పిస్తామని అధికారులు మాట ఇచ్చి మరిచారని, ఇప్పుడు తమ నిర్మాణాలు కూల్చి వేయడంతో తమకు నిలువ నీడ లేకుండా పోయిందని వాపోయారు. ఇంటి నిర్మాణాల కోసం తమకు స్థలం కేటాయించాలని కోరుతూ తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

EWS కటాఫ్‌ మార్కులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్టూడెంట్స్ JAC పోరుబాట!

Hyderabad, Telangana:

EWS Reservation Demands: ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలని EWS స్టూడెంట్స్ JAC డిమాండ్ చేసింది. శుక్రవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం చారిత్రక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడారు.. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ.. భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు.

ప్రధాన డిమాండ్లు ఇవే..
పోలీసు ఉద్యోగాల నియామకాలలో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రిలిమినరీ కటాఫ్ మార్కులను 60 నుంచి 50కి తగ్గించాలని అన్నారు.. సిటిఈటి (CTET), టిఈటి (TET) పరీక్షల్లో ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు అర్హత మార్కులను 90 నుంచి 75కు తగ్గించాలని కోరారు.. జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా ఈడబ్ల్యూఎస్ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని తెలిపారు.

ఇతర రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వర్తింపజేస్తున్నట్లే ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు కూడా అన్ని రకాల సంక్షేమ పథకాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు పూర్తిగా అందజేయాలి. దేశవ్యాప్తంగా సాగుతున్న రిజర్వేషన్ హటావో ఆందోళన్‌కు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ జేఏసీ సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆయా రంగాల్లో సరైన అవకాశాలు రావాలంటే వ్యవస్థలో సమగ్ర మార్పులు అవసరమని వారు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ జేఏసీ వ్యవస్థాపకుడు నల్లమద్ది శివారెడ్డి మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని వాపోయారన్నారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఎదురవుతున్న సాంకేతిక, నిబంధనల చిక్కులను తొలగించి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఊరట నివ్వాలని కోరారు. ప్రభుత్వం మా డిమాండ్లపై వెంటనే స్పందించకపోతే, వచ్చే రోజుల్లో ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే సహించేది లేదని తేల్చిచెప్పారు.

Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Tirumala Brahmotsavam: టీటీడీ కీలక సమీక్ష.. కనీవినీ ఎరుగని రీతిలో తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు

Tirupati Urban, Andhra Pradesh:

Tirumala Salakatla Brahmotsavams 2026: తిరుమలలో అంగరంగ వైభవంగా జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేయనుంది. ఉత్సవాల నిర్వహణపై టీటీడీ శుక్రవారం సమీక్ష చేసింది. సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలను భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులను టీటీడీ ఆదేశించింది.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ యంత్రాంగం ముమ్మరంగా సన్నాహాలు ప్రారంభించింది. సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలను భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అత్యంత వైభవంగా నిర్వహించాలని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమల పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జేఈవో డాక్టర్ శరత్, సీవీఎస్‌ఓ మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి అన్ని శాఖల ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచడం, పార్కింగ్ నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయడం, చిన్నారుల భద్రత కోసం చైల్డ్ ట్యాగ్‌ల పంపిణీ, విద్యుత్ వ్యవస్థలపై నిరంతర పర్యవేక్షణ, అగ్నిప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని టీటీడీ అధికారులు అధికార యంత్రాంగానికి ఆదేశించింది. గరుడసేవ, చక్రస్నానం రోజుల్లో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అదనపు ఈవో ఆదేశించారు. ఈసారి బ్రహ్మోత్సవాల్లో దేశంలోని 25 రాష్ట్రాలకు చెందిన కళాబృందాలతోపాటు సింగపూర్, జర్మనీ దేశాల కళాబృందాలు కూడా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుపతి జేఈవో డాక్టర్ శరత్ తెలిపారు.

శ్రీవారి సేవలో ప్రముఖులు..
తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సినీ నటులు ఆది, అశ్విన్ బాబు, సంగీత దర్శకుడు తమన్,  సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి, నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిశోర్‌ శ్రీవారి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు పొందడం తమకు ఆనందంగా ఉందని.. దేశ ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని సినీ నటులు ప్రార్థించినట్లు తెలిపారు.

0
0
Report

రూ. 470 కోట్ల అప్పు ఎలా తీరింది?.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై BRS ప్రజెంటేషన్!

Hyderabad, Telangana:

Mla Prem Sagar Rao News: మంచిర్యాల జిల్లాలో స్థానిక కన్వెన్షన్ హాల్ వేదికగా BRS నాయకులు విసిరిన డాక్యుమెంటరీ ఆస్ట్రాన్ దెబ్బకు అధికార కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆర్థిక ముసుగులు తొలగిస్తూ.. ఆయన అక్రమ సంపాదనల చిట్టాను ఆధారాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా BRS నేత నడిపల్లి విజిత్ రావు విశ్లేషించిన తీరు ప్రజలను, రాజకీయ శ్రేణులను ఆశ్చర్యపరిచేలా చేస్తోంది..

ఈ మైండ్ బ్లాకింగ్ కార్యక్రమానికి BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై.. సభను ఉద్దేశించి ప్రసంగించారు. శాసనసభ్యుడిగా గెలిచిన కేవలం రెండేళ్ల స్వల్ప వ్యవధిలోనే ప్రేమ్ సాగర్ రావు దాదాపు 470 కోట్ల రూపాయల భారీ బ్యాంకు రుణాలను ఏ విధంగా చెల్లించారో చెప్పాలని RSP నిలదీశారు.

మంచిర్యాల నియోజకవర్గంలో జరుగుతున్న దోపిడీ విధానాలపై విరుచుకుపడిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్.. ఈ భారీ మనీ లాండరింగ్‌పై వెంటనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులతో లోతైన దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. లిక్కర్ మాఫియా, విచ్చలవిడి ఇసుక దందా, పేదల భూమి కబ్జాలు, గ్యాంగ్ వార్లతో పాటు చివరికి ఐటీ హబ్ పేరుతో సాగిన నయా దోపిడీలన్నీ ఈ భారీ మనీ లాండరింగ్‌కు మూలాలని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ముఖ్యంగా, ఎమ్మెల్యే PSR ఒప్పందం కుదుర్చుకున్న ఉర్మిక కంపెనీ.. దక్కన్ కంపెనీల వెనుక ఉన్న ఆర్థిక క్రయవిక్రయాల వ్యవహారాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు తక్షణమే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి గ్యారెంటీ లేకుండా రూ.470 కోట్ల రుణాలను మంజూరు చేసిన బ్యాంకుల తీరుపై కూడా ఈడీ, సీబీఐ విచారణ జరిపి అసలు సూత్రధారులను బయటకు తీయాలన్నారు.

Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!

ఈ సందర్భంగా RS ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో చట్టం తన రూపురేఖలను కోల్పోయి ఆటవిక రాజ్యం నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మాఫియా డాన్లు షాడో ఎమ్మెల్యేలుగా మారి నియోజకవర్గాలను శాసిస్తున్నారని విమర్శించారు. మంచిర్యాల ప్రస్తుతం KGF సినిమా తరహా మాఫియా సామ్రాజ్యాన్ని తలపిస్తోందని.. నియోజకవర్గ వనరులను దోచుకుంటున్న MLA పిఎస్ఆర్ పేరును దేశంలోనే ప్రముఖ  ఆర్థిక నేరస్థుల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.

Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

రూ.11 లక్షల IT ఉద్యోగానికి గుడ్ బై.. నీళ్ల వ్యాపారంతో ఏడాదికి రూ.28.5 లక్షల సంపాదన!

Hyderabad, Telangana:

Leaving 11 Lpa Corporate Job To Earning 28.5 Lakhs: నేటి యువతలో చాలామంది లక్షల జీతాలొచ్చే కార్పొరేట్ ఉద్యోగాల కోసం నగరాలకు వెళ్లిపోతున్నారు. కానీ, కొందరు మాత్రం ఆ AC గదుల ఉద్యోగాలను.. 9 టు 5 రోటీన్ జీవితాన్ని వదిలి సొంతంగా ఏదైనా సాధించాలని అనుకుంటారు. సరిగ్గా ఇలాంటి ఆలోచనే ఓ యువకుడి జీవితాన్ని మలుపు తిప్పింది.. బెంగళూరులో రూ. 11 LPA ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని.. తన సొంత ఊరిలోనే వాటర్ ప్యూరిఫికేషన్ వ్యాపారం ప్రారంభించి.. ప్రతి నెలా లక్షల్లో ఆర్జిస్తున్న ఒక యువకుడి స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది..

ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో అంకిత్ పాండే అనే యూజర్ తన స్నేహితుడి సక్సెస్ స్టోరీని నెటిజన్లతో పంచుకున్నారు. ఆ యువకుడు బెంగళూరులో మంచి జీతమొచ్చే.. ఉద్యోగం చేస్తున్నప్పటికీ.. ప్రమోషన్ల వెంట పడకుండా.. తన సొంత ఊరికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ప్రజల నిత్యవసర అవసరమైన సురక్షితమైన తాగునీరు అందించే అద్భుతమైన వ్యాపారాన్ని ఎంచుకున్నాడు. తన సొంత స్థలంలోనే ఒక వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశాడు.

ప్రస్తుతం ఆ యువకుడు తన ప్లాంట్ నుంచి సుమారు 300 ఇళ్లతో పాటు స్థానిక దుకాణాలకు ఫ్యూరిఫైర్‌ చేసిన డ్రింకింగ్‌ వాటర్‌ సరఫరా చేస్తున్నాడు. రోజుకు సగటున 300 నీళ్ల క్యాన్లను అమ్ముతున్నాడు. ఒక్కో క్యాన్ ధర రూ.30 చొప్పున ఉండగా.. రోజు తన రూ. 9,000 వరకు సంపాదించుతున్నాడు. ఈ లెక్కన నెలకు దాదాపు రూ.2.70 లక్షల వరకు అవుతుంది.

ఇక ఖర్చుల విషయానికొస్తే.. నీటిని ఫ్యూరిఫై చేసేందుకు, కరెంట్‌ బిల్లుల కోసం నెలకు రూ.15,000 అవుతుందని.. ట్రాన్స్‌పోర్టేషన్ కోసం రూ.20,000 ఖర్చవుతాయి. సొంత స్థలంలోనే ప్లాంట్ ఉండటం వల్ల అద్దె ఖర్చులు అసలు లేవు.. ఖర్చులు అన్ని పోనూ.. ప్రతి నెలా రూ.2.35 లక్షల వరకు మిగులుతుంది. అంటే ఏడాదికి సుమారు రూ.28.5 లక్షల వరకు సంపాదించుతున్నాడు.

He installed a water purification plant on his own property and connected… pic.twitter.com/uY3mfTd0d3

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వేలాది మంది స్పందించారు. నగరాల్లో ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు చేయడం కంటే.. డిమాండ్ ఉండే చిన్న వ్యాపారాలు ప్రారంభించడమే.. మంచిదని పలువురు అభిప్రాయపడ్డారు. సొంత ఊరిలో.. కుటుంబంతో ఉంటూనే.. ఇంతటి లాభాలు పొందడం గొప్ప విషయమని ప్రశంసించారు. అయితే, వ్యాపార విజయం అనేది మీ ప్రాంతంతో పాటు పెట్టుబడి, స్థానిక డిమాండ్ పై ఆధారపడి ఉంటుందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. 

Read more: Haryana: ఇవేనా బంధాలు..?.. వీడియోకాల్‌లో తండ్రి అంత్యక్రియలు.. తొందరగా ముగించాలంటూ కూతురి పైశాచీకం.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

 

0
0
Report

Sunrisers Hyderabad Captain: కావ్యా మారన్ సూపర్ ప్లాన్..రాబోయే ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ ఇతనే!

Hyderabad, Telangana:

Sunrisers Hyderabad New Captain: ఐపీఎల్ 2026 సీజన్‌లో అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుత ప్రదర్శన కనబరిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), వచ్చే 2027 టోర్నీ కోసం ఇప్పనుంచే కీలక ప్రణాళికలు రచిస్తోంది. ఆరెంజ్ ఆర్మీని మళ్లీ ఛాంపియన్‌గా నిలపాలన్న కసితో ఉన్న ఫ్రాంచైజీ యాజమాన్యం, జట్టు పగ్గాలను యువ వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ చేతికి అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ప్యాట్ కమిన్స్ గైర్హాజరీకి అసలు కారణం?
సన్‌రైజర్స్‌ను అద్భుతంగా నడిపించిన ప్రస్తుత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంపై ఎలాంటి సందేహాలు లేవు. అయితే భవిష్యత్తు షెడ్యూల్ ఆయనకు సవాలుగా మారనుంది. 2027లో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్, ఆ వెనువెంటనే వన్డే వరల్డ్ కప్ టోర్నీలు ఉండటంతో.. ఆస్ట్రేలియా దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌లపై కమిన్స్ పూర్తిగా దృష్టి సారించనున్నారు.

ఈ బిజీ షెడ్యూల్ కారణంగా కమిన్స్ ఐపీఎల్ 2027 సీజన్‌కు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. గత సీజన్‌లోనూ ఆయన గైర్హాజరీలో తొలి విడత మ్యాచ్‌లకు ఇషాన్ కిషన్ సారథ్యం వహించిన విషయం గమనార్హం.

ఇషాన్ కిషన్ వైపే కావ్య మారన్ మొగ్గు
వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి ఎస్ఆర్‌హెచ్ పూర్తిస్థాయి (ఫుల్‌టైమ్) కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను ఖరారు చేయాలని కావ్య మారన్ అండ్ కో భావిస్తోంది. గతంలో ఇషాన్ నాయకత్వంలో ఎస్ఆర్‌హెచ్ 7 మ్యాచ్‌లు ఆడి 4 విజయాలు నమోదు చేసింది. కేవలం తన బ్యాటింగ్ పవర్‌తోనే కాకుండా, మైదానంలో ఒత్తిడిని జయించి జట్టును నడిపించిన తీరు యాజమాన్యాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. జట్టులో కొందరు సీనియర్ల పేర్లు రేసులో ఉన్నప్పటికీ, లాంగ్‌టర్మ్ విజన్‌తో మేనేజ్‌మెంట్ ఇషాన్ వైపే సుముఖంగా ఉంది.

డిసెంబర్‌లో అధికారిక ప్రకటన?
2024లో ఎస్ఆర్‌హెచ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్యాట్ కమిన్స్ హయాంలో జట్టు అద్భుతమైన విజయాలను సాధించింది. 2025లో ఆరో స్థానంలో నిలిచిన ఆరెంజ్ ఆర్మీ, 2026లో మూడో స్థానంతో మెరుగైన ప్రదర్శన కనబరిచింది.

అయితే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ఫ్రాంచైజీ భావిస్తోంది. ఈ కెప్టెన్ మార్పునకు సంబంధించిన అధికారిక ప్రకటనను డిసెంబర్‌లో వెలువరించే అవకాశం ఉంది.

Also Read; కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట..ఒకే రోజు 8 స్వర్ణ పతకాలు..భారత్‌ ఖాతాలో 39

Also REad: కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుతం..నీరజ్ చోప్రాకు రజతం..యశ్‌వీర్ సింగ్‌కు కాంస్య పతకం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

వామ్మె.. సముద్రంలా ఎగసిపడుతున్న బావిలో నీరు.. వీడియో..

Hyderabad, Telangana:

Gujarat Well Waves Video:  సముద్రంలో కెరటాలు ఎగసిపడటం సహజమే.. కానీ, ఊరి చివర ఉన్న చిన్న బావిలో సముద్రం తరహాలో ఉవ్వెత్తున అలలు వస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి అరుదైన, ఊహించని ఘటనే గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో వెలుగుచూసిందంటే నమ్ముతారా? అవును మీరు చదువుతుంది నిజమే.. గత నాలుగు రోజులుగా ఓ బావిలోని నీరు దానంతటదే కెరటాలలా ఎగసిపడుతుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. దీనిని చూసేందుకు చాలా మంది అక్కడికి చేరుకుంటున్నారు. వారు ఆ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మోర్బీ జిల్లా వీర్పర్డా గ్రామాని దగ్గరలోనే నేషనల్ హైవే పక్కన దాదాపు 18 అడుగుల లోతు ఉన్న ఒక పాత బావి ఉంది. గత కొన్ని రోజులుగా ఈ బావిలోని నీరు సాధారణంగా ఉండకుండా.. సముద్రపు కెరటాల మాదిరిగా అలలు అలలుగా ఊగిపోతోంది. రెండు రోజుల క్రితం మొదటిసారి ఈ వింతను గమనించిన గ్రామస్తులు.. మొదట్లో కాసేపటికి శాంతిస్తుందని భావించారు. కానీ, మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మళ్లీ నీటిలో మార్పులు వచ్చి.. కదులడంతో ఆశ్చర్యపోయారు.

బావిలో నీరు వింతగా అటు ఇటు ఊగుతూ ఉండగా.. చూసిన కొందరు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో విపరీతంగా వైరల్ అవ్వడం మొదలైంది.. దీంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఈ దృశ్యాన్ని చూడటానికి తరలి రావడం కూడా ప్రారంభించారు. మరికొందరు స్థానికులు దీనిని దేవుడి మహిమగా భావిస్తూ బావి వద్ద పూజలు కూడా చేస్తూ ఉన్నారు..

Read more: Haryana: ఇవేనా బంధాలు..?.. వీడియోకాల్‌లో తండ్రి అంత్యక్రియలు.. తొందరగా ముగించాలంటూ కూతురి పైశాచీకం.. వీడియో వైరల్..

మోర్బీ ప్రాంతం భూకంప తీవ్రత ఎక్కువగా ఉండే..  సీస్మిక్ జోన్ (Seismic Zone) పరిధిలోకి వస్తుందని అధికారులు తెలిపారు. దాంతో భూగర్భంలో ఏదైనా చలనం రావడం వల్ల లేదా భూకంప సంకేతాల వల్లే ఇలా నీరు అలలలా మారుతోందేమోనని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. అయితే, ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగంతో పాటు భూగర్భ శాస్త్రవేత్తలు వెంటనే రంగంలోకి దిగారు. 

Read more: Haryana: ఇవేనా బంధాలు..?.. వీడియోకాల్‌లో తండ్రి అంత్యక్రియలు.. తొందరగా ముగించాలంటూ కూతురి పైశాచీకం.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

 

0
0
Report
Advertisement

Vande Mataram Act: చట్టంగా మారిన 'వందేమాతరం'..విద్యార్థులు సరిగా ఆలపించకపోతే శిక్ష పడుతుందా?

New Delhi, Delhi:

Vande Mataram Act News: జాతీయ గేయం 'వందేమాతరం'కి చట్టబద్ధత కల్పిస్తూ తీసుకొచ్చిన 'ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ (అమెండ్‌మెంట్) బిల్లు, 2026'కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు అధికారికంగా చట్ట రూపం దాల్చింది. ఇప్పటివరకు జాతీయ జెండా, రాజ్యాంగం, జాతీయ గీతం 'జనగణమన'కు మాత్రమే ఉన్న చట్టపరమైన రక్షణ.. ఇకపై 'వందేమాతరం'కి కూడా లభించింది. పార్లమెంట్‌లో రాజ్యసభ (జులై 29), లోక్‌సభ (జులై 30) ఈ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే.

చట్టం ప్రకారం శిక్ష ఎవరికి వర్తిస్తుంది?
ఎవరైనా కావాలనే వందేమాతరం గానాన్ని అడ్డుకున్నా, లేదా అది ఆలపించే సమావేశాలకు భంగం కలిగించినా ఈ చట్టం కింద నేరంగా పరిగణిస్తారు. నిబంధనలను ఉల్లంఘిస్తే గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించబడతాయి. మళ్లీ అదే తప్పు పునరావృతం చేస్తే కనీసం ఒక సంవత్సరం జైలు శిక్ష తప్పదని 'ది హిందూ' నివేదిక పేర్కొంది.

విద్యార్థులు సరిగా పాడకపోతే శిక్ష ఉంటుందా?
ఈ చట్టం ఏ పౌరుడినీ వందేమాతరం బలవంతంగా ఆలపించాలని కోరదు. గేయం పాడటం పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛపై ఆధారపడి ఉంటుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన 'బిజో ఎమ్మాన్యుయేల్' తీర్పు ప్రకారం.. జాతీయ గీతాలు లేదా గేయాలాలాపన సమయంలో నిశ్శబ్దంగా నిలబడటం లేదా పాల్గొనకపోవడం ఎలాంటి నేరం కాదు.

బడులలో రోజూ పాడే అలవాటు ఉండటం వల్ల విద్యార్థులు సాధారణంగా తప్పులు చేయరు. ఒకవేళ పొరపాటున ఏమైనా తప్పు దొర్లితే అది ఉద్దేశపూర్వకం కానందున ఎలాంటి శిక్ష ఉండదు. ఉపాధ్యాయులు దాన్ని సరిదిద్దుతారు. అయితే, కావాలనే గేయానికి అవమానం కలిగించే రీతిలో ఉద్దేశపూర్వకంగా తప్పుగా పాడినట్లు రుజువైతేనే చట్టపరమైన చర్యలు ఉంటాయి.

ఆరు చరణాల నిబంధన ఏమిటి?
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం అధికారిక కార్యక్రమాలు, పాఠశాలల్లో వందేమాతరం ఆరు చరణాలూ పూర్తిస్థాయిలో పాడాలని సూచించారు. అయితే, ఆరు చరణాలు పూర్తిస్థాయిలో పాడకపోయినా లేదా పాడేటప్పుడు చిన్నపాటి లోపాలు దొర్లినా ఈ కొత్త చట్టం కింద ఎలాంటి శిక్షా ఉండదు. చట్టపరమైన శిక్షలు కేవలం ఉద్దేశపూర్వకంగా అవమానించే వారికి, ఆటంకం కలిగించే వారికి మాత్రమే వర్తిస్తాయి.

చట్టం వెనుక నేపథ్యం
బంకించంద్ర ఛటర్జీ రచించిన అమర గీతం 'వందేమాతరం' భారత స్వాతంత్ర్య పోరాటంలో జాతిని ఏకం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించింది. ఈ గేయం 150వ వార్షికోత్సవం సందర్భంగా దేశంలో జాతీయ చైతన్యాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని మరింత ఇనుమడింపజేసే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చారిత్రక చట్టాన్ని తీసుకొచ్చింది.

Also REad: జంతర్‌ మంతర్‌లో ఉగ్రవాదుల కుట్రభగ్నం..ఐఎస్ఐ ఉగ్ర ముఠాల గుట్టురట్టు..9 మంది అరెస్ట్!

Also Read: మార్కెట్లోకి కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు..చలామణీ ఎప్పటినుంచి అంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

భారీ వర్షంలో ట్రాఫిక్ పోలీస్‌కు ఊహించని సర్ ప్రైజ్.. వీడియో చూడండి..

Hyderabad, Telangana:

 Traffic Officer Rain Duty Viral Video Watch: ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. అనేక ప్రాంతాలు జలమయమై, ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజల రక్షణ.. ట్రాఫిక్ కోసం పోలీస్ సిబ్బంది నిరంతరం రోడ్లపైనే శ్రమిస్తున్నారు. తాజాగా గువాహటి రోడ్డుపై చోటుచేసుకున్న ఒక చిన్న సంఘటన నెటిజన్ల హృదయాలను కరిగిస్తోంది. అసలు ఈ ఘటనేంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గువాహటిలో కురుస్తున్న భారీ వర్షంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ తడుస్తూనే.. వాహనాలను కంట్రోల్‌ చేయడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు.. ఆ మార్గంలో వెళ్తున్న ప్రముఖ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ లక్ష్మణ్ గోస్వామి ఆ దృశ్యాన్ని గమనించారు. తీవ్రంగా తడుస్తున్న పోలీస్ అధికారి కష్టాన్ని చూసి చలించిపోయిన లక్ష్మణ్.. వెంటనే ఆయన వద్దకు వెళ్లారు.. అక్కడికి వెళ్లి ఏం చేశారో తెలుసా?

తన వెంట తెచ్చిన కొత్త రెయిన్‌కోట్‌తో పాటు వాటర్‌ప్రూఫ్ ప్యాంట్‌ను ఆ కానిస్టేబుల్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ రెయిన్‌కోట్‌పై ప్రత్యేకంగా POLICE అని రాసి ఉండడం కూడా మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. అంతేకాకుండా అతను ఆ పోలీస్‌తో కొద్ది సేపు మాట్లాడి.. తన కష్టాలను తెలుసుకున్నారు..

కంటెంట్ క్రియేటర్ చూపించిన ఆప్యాయతకు ఆ ట్రాఫిక్ పోలీస్ ఎంతో సంతోషంగా ఉండడం మీరు చూడొచ్చు.. చిరునవ్వుతో ఆ గిఫ్ట్‌ను స్వీకరించి.. వెంటనే ఆ రెయిన్‌కోట్ ధరించడం మీరు చూడొచ్చు.. ఆలస్యం చేయకుండా మళ్లీ రోడ్డు మధ్యలోకి వెళ్లి ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేయడం మీరు చూడొచ్చు.. ఈ దృశ్యాలన్నింటినీ కెమెరాలో చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది.

 
 
 
 
 

Read more: Haryana: ఇవేనా బంధాలు..?.. వీడియోకాల్‌లో తండ్రి అంత్యక్రియలు.. తొందరగా ముగించాలంటూ కూతురి పైశాచీకం.. వీడియో వైరల్..

ఈ వీడియో చూసిన నెటిజన్లు లక్ష్మణ్ గోస్వామి చేసిన పనిని ప్రశంసిస్తున్నారు. ఏ వాతావరణంలోనైనా మన రక్షణ కోసం గంటల తరబడి రోడ్లపై నిలబడే ట్రాఫిక్ పోలీసుల కష్టాన్ని మనం గుర్తించాలని.. లక్ష్మణ్ చూపిన ఈ చిన్న సహాయం మరెంతో మందికి ప్రేరణగా నిలుస్తుందని కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు దీనికి సంబంధంచిన వీడియో ఊహించని స్థాయిలో వైరల్‌గా మారింది.

Read more: Haryana: ఇవేనా బంధాలు..?.. వీడియోకాల్‌లో తండ్రి అంత్యక్రియలు.. తొందరగా ముగించాలంటూ కూతురి పైశాచీకం.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

0
0
Report
Advertisement

Solar Eclipse: ఆగస్టు 12న సూర్యగ్రహణం..భారత్‌తో కనిపిస్తుందా? సూతక సమయం అప్పుడే!

Hyderabad, Telangana:Last Solar Eclipse Of 2026: ఖగోళ ప్రియులు, జ్యోతిష్య శాస్త్రజ్ఞులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2026 ఏడాది చివరి సూర్యగ్రహణం దగ్గర పడుతోంది. ఇప్పటికే ఈ ఏడాది (2026)లో మొత్తం రెండు సూర్య గ్రహణాలు సంభవించనుండగా.. ఇప్పటికే ఒక సూర్య గ్రహణం ఫిబ్రవరి 17న పూర్తయ్యింది. ఇప్పుడు ఆగస్టులో మరో సూర్య గ్రహణం సంభవించనుంది. 2026లో ఏర్పడనున్న చివరి లేదా రెండో సూర్యగ్రహణం ఆగస్టు 12న అనగా శ్రావణ మాస అమావాస్య నాడు సంభవించనుంది. జ్యోతిష్య గణనల ప్రకారం.. ఈ ఆఖరి సూర్య గ్రహణం ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక రాశిలో సంభవిస్తుంది. భారతకాలమానం ప్రకారం ఈ గ్రహణం ఆగస్టు 12 రాత్రి 9.04 గంటల నుంచి ఆగస్టు 13 తెల్లవారుజామున 4.25 గంటల వరకు అనగా మొత్తంగా 7 గంటల 21 నిమిషాల పాటు ఈ గ్రహణం కొనసాగనుంది.
0
0
Report

Harish Rao: మిషన్ భగీరథకు పదేళ్లు.. తెలంగాణ ప్రజల జీవితాలను మార్చిన ఒక అద్భుతం

Baddipadaga, Telangana:

Mission Bhagiratha Decade: నీటి కోసం అల్లాడిన తెలంగాణ ఇప్పుడు ప్రతి ఇంటికి నీటి కులాయితో ఆరోగ్య తెలంగాణగా మారింది. దీనికి కారణం మిషన్‌ భగీరథ. ఈ పథకం ప్రారంభమై పదేళ్లు పూర్తవడంతో మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక అయిన మిషన్‌ భగీరథ్‌ పదేళ్లు పూర్తికావడంతో హర్షం వ్యక్తం చేస్తూ.. ఆ పథకం అమలుతో తెలంగాణలో జరిగిన మార్పులు వివరించారు. తెలంగాణ ప్రజల జీవితాలను మార్చిన ఒక మహత్తరమైన ప్రణాళిక అని అభివర్ణించారు.

మిషన్‌ భగీరథ పథకం పదేళ్లు పూర్తి కావడంతో ఇంటింటికీ తాగునీటి విప్లవానికి దశాబ్ది అని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్ రావు ప్రకటించారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నల్లా నీరు అందించాలనే సంకల్పంతో ప్రారంభమైన మిషన్ భగీరథ.. దేశానికే ఆదర్శంగా నిలిచిన పథకం అని గుర్తుచేశారు. తెలంగాణ ఫ్లోరోసిస్ రక్కసి రూపుమాపిన సుజల వ్యవస్థ మిషన్‌ భగీరథ అని తెలిపారు. కేసీఆర్ దూరదృష్టితో రూపుదిద్దుకున్న మిషన్ భగీరథ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో నిర్వీర్యమవుతోందని మండిపడ్డారు.

'తెలంగాణలో ప్రతి ఇంటికీ సురక్షిత, స్వచ్ఛమైన  తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన మిషన్ భగీరథకు నేటితో పదేళ్లు పూర్తి కావడం సంతోషకరం. సరిగ్గా పదేళ్ల కిందట ఇదే రోజు ఒక గొప్ప ఆలోచనతో ప్రారంభమైన ఈ పథకం ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపింది. మిషన్ భగీరథ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న అతిపెద్ద తాగునీటి మౌలిక వసతుల ప్రాజెక్టుగా నిలిచింది. దేశానికి రోల్ మోడల్ గా నిలిచి హర్ ఘర్ జల్ పథకం అయింది. మిషన్ భగీరథ అనేది ఒక పథకం కాదు.. తెలంగాణ ప్రజల జీవితాలను మార్చిన ఒక మహత్తరమైన ప్రణాళిక' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు వెల్లడించారు.

 

'రాష్ట్రంలో ఏ ఇంట్లోనూ తాగునీటి కోసం ఇబ్బంది ఉండకూడదు. ఏ తల్లి కూడా బిందె పట్టుకుని కిలోమీటర్ల దూరం నడవకూడదు, ఏ గ్రామం కూడా వేసవిలో నీటి ఎద్దడి ఎదుర్కోకూడదు అనే సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం ఈ బృహత్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది' అని నాటి సాగునీటి శాఖ మంత్రి హరీశ్‌ రావు గుర్తుచేశారు. 'తెలంగాణ ఏర్పాటుకు ముందు అనేక గ్రామాలు, తండాలు, మారుమూల ప్రాంతాల్లో తాగునీటి పరిస్థితి దయనీయంగా ఉండేది. తాగు నీటి కోసం బిందెలు మోసుకుంటూ కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవడం మహిళలకు నిత్యకృత్యంగా ఉండేది. చాలా గ్రామాల్లో చేతిపంపులు, బోర్లు, స్థానిక నీటి వనరులపైనే ప్రజలు ఆధారపడేవారు. భూగర్భ జలాలు అడుగంటిన ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండేది' అని నాటి దుర్భర పరిస్థితులు వివరించారు.

'ఫ్లోరైడ్ సమస్య ఉన్న ప్రాంతాల్లో విషపూరితమైన నీటినే తాగాల్సిన పరిస్థితులు ఉండేవి. దీంతో ఎముకలు వంకర్లు తిరిగి ఎదుగుదల ఆగిపోయేది. మారుమూల ప్రాంతాల్లో కలుషిత నీటి కారణంగా మలేరియా, డెంగీ, డయేరియాతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారు. ఈ దుస్థితిని మార్చాలంటే తాత్కాలిక చర్యలు సరిపోవని గుర్తించిన కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఒక సమగ్ర తాగునీటి గ్రిడ్‌ను నిర్మించాలనే ఆలోచన చేశారు. ఆ బృహత్తర యజ్ఞమే మిషన్ భగీరథ' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు వివరించారు.

గోదావరి, కృష్ణా నదుల నుంచి ఉపరితల ప్రవాహ జలాన్ని సేకరించి, శుద్ధి చేసి, భారీ పైప్‌లైన్ల ద్వారా గ్రామాలు, పట్టణాలు, మారుమూల ప్రాంతాలకు తరలించి.. ఇంటింటికీ సరఫరా చేసే సమగ్ర తాగునీటి వ్యవస్థను నిర్మించారని నాటి సాగునీటి శాఖ మంత్రి హరీశ్‌ రావు వెల్లడించారు. ఒక రాష్ట్రం మొత్తం తాగునీటి అవసరాలను ఒకే సమగ్ర వ్యవస్థతో పరిష్కరించాలనే ఆలోచన అప్పట్లో దేశంలోనే అరుదైనది. అందుకే మిషన్ భగీరథ తెలంగాణ అభివృద్ధి చరిత్రలో మాత్రమే కాదు దేశ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచింది' అని వెల్లడించారు. 

'మిషన్ భగీరథ ప్రభావంతో గ్రామీణ తెలంగాణలో మహిళలు తాగునీటి కోసం పడే కష్టాలు తగ్గాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రాణాలు నిలిచాయి. ముఖ్యంగా ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీటిని అందించడంలో మిషన్ భగీరథ కీలక పాత్ర పోషించింది. ఫ్లోరైడ్ రహిత తెలంగాణకు మిషన్ భగీరథ సాధించిన ఖ్యాతి' అని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్ రావు తెలిపారు. తాగునీటితో ప్రజల ఆరోగ్యాలను కాపాడిన అమృత జల ప్రణాళిక అని చెప్పారు.

'కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన మిషన్ భగీరథను నిర్వహించే సమర్థత లేకపోవడం సిగ్గుచేటు. పథకాలను రాజకీయ కక్షలకు బలి చేయొద్దు. కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది కాబట్టి మిషన్ భగీరథను నిర్లక్ష్యం చేయడం క్రిమినల్ నెగ్లిజెన్స్. ప్రభుత్వాలు మారుతాయి.. కానీ ప్రజల అవసరాలు మారవు' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రాజకీయ కక్షలు, వ్యక్తిగత విమర్శలను పక్కనపెట్టి ప్రజలకు ఉపయోగపడుతున్న పథకాలను సజావుగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. మిషన్ భగీరథ నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలి. దెబ్బతిన్న పైప్‌లైన్లు, మోటార్లు, పంపింగ్ వ్యవస్థలను వెంటనే మరమ్మతు చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు కోరారు. నీటి సరఫరాలో ఎక్కడ అంతరాయం ఏర్పడినా వెంటనే స్పందించేలా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

 

 

0
0
Report

Chiranjeevi Korean Kanakaraju: కొరియన్ కనకరాజు సినిమాపై మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్..ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న రివ్యూ!

Hyderabad, Telangana:

Chiranjeevi On Korean Kanakaraju: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'కొరియన్ కనకరాజు' థియేటర్లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. విలక్షణ కథలతో అలరించే వరుణ్ తేజ్, ఈసారి కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌కు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతుండగా.. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, వరుణ్ సతీమణి లావణ్య త్రిపాఠి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

చిరంజీవి ప్రశంసల వర్షం
సినిమా విజయంపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. "ఈ చిత్రానికి వస్తున్న అద్భుతమైన స్పందన చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఎక్కడ చూసినా 'నవ్వులే నవ్వులు' అనే మాటే వినిపిస్తోంది. వరుణ్ తేజ్ ఈ బ్లాక్ బస్టర్ విజయానికి నూటికి నూరు శాతం అర్హుడు. నీ కష్టానికి, నిబద్ధతకు తగిన ప్రతిఫలం దక్కింది" అంటూ చిరు కొనియాడారు. తాను త్వరలోనే సినిమా చూస్తానని, ఈ చిత్రం మరిన్ని రికార్డులు సృష్టించాలని ఆకాంక్షించారు.

లావణ్య త్రిపాఠి భావోద్వేగ పోస్ట్
వరుణ్ భార్య, నటి లావణ్య త్రిపాఠి తన భర్త సక్సెస్ పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా అభినందించారు. "నువ్వు ఏ ప్రాజెక్ట్ చేసినా ప్రాణం పెట్టి నటిస్తావు. నీ కెరీర్‌లో 'కొరియన్ కనకరాజు' ఒక మైలురాయిగా నిలుస్తుంది. సరికొత్త జానర్లను అన్వేషించాలనే నీ అంకితభావమే నిన్ను ఈ స్థాయికి చేర్చింది" అంటూ ప్రేమపూర్వకంగా విషెస్ తెలిపారు. వరుణ్‌ను మాస్ పాత్రలో చూడటం తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు.

బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సినిమా
ఇంతకుముందు యాక్షన్, సీరియస్ రోల్స్ చేసిన వరుణ్ తేజ్.. ఈసారి పూర్తిగా తన కామెడీ యాంగిల్‌ను బయటకు తీశారు. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'ఎక్స్‌ప్రెస్ రాజా' వంటి హిలేరియస్ హిట్లు ఇచ్చిన మేర్లపాక గాంధీ.. వరుణ్‌ను పక్కా మాస్ అండ్ కామెడీ రోల్‌లో ప్రెజెంట్ చేశారని ప్రేక్షకులు అంటున్నారు. వీకెండ్ అడ్వాంటేజ్, పాజిటివ్ పబ్లిక్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ సినిమాలో హీరోగా నటించగా.. అతని సరసన కొరియన్ అమ్మాయిగా రితికా నాయక్ హీరోయిన్ అలరించింది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించగా.. ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని సమకూర్చారు.

Also Read: మలైకా అరోరా డేటింగ్ లైఫ్..తనకంటే చిన్నవారితోనే ఆమె ఎందుకు రిలేషన్‌షిప్‌లో ఉంటోంది?

Also Read: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి? త్వరలోనే అధికారిక ప్రకటన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

TG High Court: కుబేరుడు కూడా కూలీకి పోవాల్సి వస్తుంది.. ఉచిత హమీ పథకాలపై హైకోర్టు సెన్సెషనల్ కామెంట్స్..

Hyderabad, Telangana:

HC Judge Justice nagesh bhimapaka reacts in Free govt Schemes: దేశంలో ఎక్కడ చూసిన అన్ని పార్టీలు ప్రజలకు ఉచితపథకాలు అంటు ఇష్టమున్నట్లు హమీలు ఇస్తున్నారు. ఏ మాత్రం కష్టం లేకుండా ప్రభుత్వాలు పథకాలు అందించినప్పుడు జనాలు అసలు పనిచేయడం మానేస్తారని మేధావులు అభిప్రాయ పడుతున్నారు.  ఈ క్రమంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నాన్ బెయిలబుల్ వారెంట్ కేసు విచారణ నేపథ్యంలో తెలంగాన హైకోర్టు జస్టిస్ నగేష్ బీమాపాక కీలక వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత పథకాలపై కూడా తీవ్రంగా స్పందించారు.ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పథకాలు కోటీశ్వరులు కూడా తీసుకుంటున్నారన్నారు. 

రైతుబంధు అనే పథకం ఎంతోమంది కోటీశ్వరులు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి భారం పడుతుందన్నారు. అసలు ఎవరికైనా సమాజంలో బాధ్యత ఉందా..?.. అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత పథకాల ద్వారా భవిష్యత్ తరాలకు ప్రభుత్వాలు ఏం చేయబోతోందని అసహానం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఈ దేశానికి మనం ఏమి ఇచ్చాం అనుకునేవాళ్లమని, కానీ ఇప్పుడు ఈ దేశం మనకేమిచ్చింది అనే పరిస్థితికి వచ్చామన్నారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని.. మనకేమిచ్చారు, నాకేమిచ్చారు అనే పరిస్థితులకు వచ్చాయన్నారు.

గాంధీ, నెహ్రూ, ప్రకాశం పంతులను చూసి కొంత మంది ఈ దేశానికి నేను ఏదైనా ఇవ్వాలనుకునే వాళ్ళన్నారు. కానీ
 ఇప్పుడు ఈ దేశం నాకేమిచ్చిందని అనుకుంటున్నామన్నారు. ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల అధికారులు బలి అవుతున్నారని ఫైర్ అయ్యారు. ఒక్క సందీప్ సుల్తాన్య పైనే మూడు నుంచి నాలుగు వేల కేసులు ఉన్నాయన్నారు.

ఈ కేసులను చూస్తే సందీప్ సుల్తానియా జీవితకాలం జైల్లో ఉండాలని పేర్కొన్నారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పోస్టులో ఉన్నందుకే అని కేసులన్నీ భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సందీప్ సుల్తానియా మీద కోర్టు ధిక్కరణ కింద వంద కేసులు పెండింగ్ ఉన్నాయన్నారు.  మీరు ముఖ్యమంత్రి అయితే ఈ కేసులపై మీరేం చేయగలరో చెప్పండని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు జస్టిస్ ప్రశ్నించింది.

మేము రాజకీయ ఉపన్యాసాలు చేయాలనుకోవడం లేదన్నారు.  ఒక సమాజంలో పౌరుడు గా ఆవేదనతో చెప్తున్న మాటలన్నారు.  పల్లెటూర్లు ప్రస్తుతం పనిచేయడానికి కూలీలు దొరకడం లేదని, రైతుల పరిస్థితి ఘోరంగా ఉందన్నారు.. ఒకప్పుడు మనుషులు పనిచేసేవాలంట అనే చెప్పుకునే పరిస్థితి ఏర్పడవచ్చన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు ఇస్తున్నాయి.. నేనెందుకు పని చేయాలని అభిప్రాయానికి వచ్చారన్నారు. రాజకీయపరమైన ఉపన్యాసము ప్రభుత్వాలను విమర్శించడం మేము ఈ మాటలు అనడం లేదని,  ప్రభుత్వాలు ఆలోచించాలని ఉద్దేశంతోనే ఈ మాటలు చెబుతున్నామన్నారు. ఇలాంటి సందర్భాల్లో అధికారులను కోర్ట్ కి పిలిపించడం మాకు బాధగానే ఉందన్నారు. సందీప్ సుల్తానీయ మంచి అధికారే, కానీ తప్పని పరిస్థితుల్లో ఆదేశాలు ఇస్తున్నామన్నారు.

ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలను కూడా కొందరు విద్యార్థులు  బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పేర్కొన్నారు.  కాలేజ్ కి వెళ్లకుండా బయట తిరిగుతున్నారన్నారు. చదువుకున్నోడికి కాలేజ్ ఫీజులు చెల్లించాలి. కాలేజ్ మానేసిన విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించడం  సరైందా ?.. అంటూ జడ్జీ ప్రశ్నించారు.

బాగా చదువుకొనే వారికి ఫీజులు కట్టండని, అర్హులైన వారికి పథకాలు ఇవ్వలన్నారు. కోటి 15 లక్షల కుటుంబాలకు ఉచిత పథకాలు ఇస్తే ఈ దేశాన్ని ఏమి నడుపుతారని,  ఇలాగే ఉచిత పథకాలు ఇస్తూ పోతే.. కుబేరుడు కూడా డబ్బులు అన్ని అయిపోయి పనికి ఆహారపథకం కింద కుబేరుడు కూలికి వస్తాడన్నారు.

Read more: ఈ నెల 16 వరకే Gas ఈ KYC.. లేకుంటే గ్యాస్ కనెక్షన్ కట్..

భవిష్యత్ అవసరాలు దృష్ట్యా, ఆవేదనతో ఈ మాటలు చెపుతున్నామన్నారు. ప్రస్తుతం  దేశంలో డేంజర్ బెల్స్ మొగుతున్నయని,   సమాజంలో చాలా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడబోతున్నాయన్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Mumbai Bomb Threat: స్వాతంత్ర్య దినోత్సవం వేళ ముంబైలో బాంబు బెదిరింపు..ఆగస్టు 15న వరుస పేలుళ్లకు భారీ ప్లాన్!

Mumbai, Maharashtra:

Mumbai Bomb Threat Today: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు ముంబై మహానగరం తీవ్ర అప్రమత్తతలో (హై అలర్ట్) ఉంది. ముంబై మేయర్ రీతు తావ్డే అధికారిక ఈమెయిల్ ఐడీకి వరుసగా మూడోసారి బాంబు బెదిరింపు సందేశం రావడంతో పోలీసులు, భద్రతా బలగాలు ఉలిక్కిపడ్డాయి. నగరంలోని పాఠశాలలు, మెట్రో నెట్‌వర్క్, స్టాక్ ఎక్స్ఛేంజ్‌తో పాటు ప్రముఖ ప్రదేశాలపై దాడులు చేస్తామని ఈ మెయిల్ ద్వారా హెచ్చరించారు.

బెదిరింపు ఈమెయిల్‌లోని ముఖ్యాంశాలు..
ముంబై మేయర్‌కు వచ్చిన బెదిరింపుల ప్రకారం.. ఘట్‌కోపర్, అంధేరి, మరోల్ నాకా, గుండవాలి, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) వంటి రద్దీ ప్రాంతాల్లో కార్ బాంబులు, ఐఈడీలతో దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను పాఠశాలలకు పంపొద్దని.. ముంబై మెట్రోలో ప్రయాణం వద్దని అందులో పేర్కొంది.

అయితే బెదిరింపు మెయిల్‌లో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు ఉండడం గమనార్హం. "ఖలిస్తాన్ జిందాబాద్" నినాదాలతో పాటు "సిక్కులకు స్వాతంత్ర్య దినోత్సవం లేదు" అనే వాదనలను ఆ ఈమెయిల్‌లో ప్రస్తావించారు.

అలాగే ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు ఇస్తున్నారనే కారణంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌లను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నట్లు తెలిపారు.

బెదిరింపుల మెయిల్ ప్రకారం.. ఆగస్టు 15న మధ్యాహ్నం 12:11 గంటలకు ముంబైని స్థంభింపజేయడంతో పాటు మధ్యాహ్నం 3:11 గంటలకు మేయర్ కార్యాలయంపై దాడి చేయడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే తమ ఉద్దేశమని అందులో పేర్కొన్నారు.

రంగంలోకి సైబర్ పోలీసులు
మేయర్ కార్యాలయానికి ఇలాంటి బెదిరింపులు రావడం ఇది మూడోసారి. వరుస హెచ్చరికలతో అప్రమత్తమైన ముంబై పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? దాని వెనుక ఎవరున్నారు? అనే కోణంలో సైబర్ పోలీసులు దర్యాప్తును తీవ్రతరం చేశారు. ఈమెయిల్ ఐపీ (IP) చిరునామా, మూలాన్ని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

Also REad; జంతర్‌ మంతర్‌లో ఉగ్రవాదుల కుట్రభగ్నం..ఐఎస్ఐ ఉగ్ర ముఠాల గుట్టురట్టు..9 మంది అరెస్ట్!

Also Read: మార్కెట్లోకి కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు..చలామణీ ఎప్పటినుంచి అంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం..బ్యాలెట్ బాక్సులా? ఈవీఎంలా?

Vijayawada, Andhra Pradesh:

AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలకు రాజకీయ వేడెక్కుతోంది. ప్రభుత్వం, ఎన్నికల సంఘం (SEC) ఏర్పాట్లను వేగవంతం చేయగా, రాజకీయ పార్టీలు సైతం సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన "పోలింగ్ పద్ధతి" (ఈవీఎంలా? బ్యాలెట్ బాక్సులా?) అనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది.

ముఖ్య పరిణామాలు..
సీఎం చంద్రబాబు మంత్రులకు క్షేత్రస్థాయిలో సిద్ధం కావాలని నిర్దేశించగా, కూటమి పార్టీలు ఏకపక్ష విజయం లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. మరోవైపు, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ కూడా ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కార్యాచరణను అమలు చేస్తోంది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) అనిల్ చంద్ర పునేఠా అధికారులతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో ఇప్పటివరకు జరిగిన ఏర్పాట్లు, పెండింగ్ పనులపై చర్చించారు.

రాష్ట్రంలోని మొత్తం 123 మున్సిపాలిటీలు/కార్పొరేషన్లలో 23 చోట్ల, అలాగే 13,359 పంచాయతీల్లో 354 చోట్ల కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటిని త్వరగా పరిష్కరించేందుకు లీగల్ టీమ్‌లతో ఎస్‌ఈసీ చర్యలు వేగవంతం చేసింది.

ఓటర్ల జాబితా, రిజర్వేషన్లు: పంచాయతీల్లో ఓటర్ల జాబితాలను ఇప్పటికే ప్రకటించగా, డెడికేటెడ్ కమిషన్ నివేదిక రాగానే రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించారు.

ఈవీఎంలా? బ్యాలెట్ పేపర్లా?
ఈ ఎన్నికల్లో సాంప్రదాయ పద్ధతిలో బ్యాలెట్ పేపర్లు/బాక్సులను వినియోగించాలా, లేక ఈవీఎం (EVM)ల వైపు వెళ్లాలా అనేదానిపై ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఎన్నికల నిర్వహణ వ్యయం, భద్రత, సమయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలింగ్ పద్ధతిపై ఎస్‌ఈసీ త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుంది.

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా వివిధ వాదనలు వినిపించడం, బ్యాలెట్ పేపర్లను మళ్లీ ప్రవేశపెట్టాలనే డిమాండ్లు పెరుగుతున్న తరుణంలో.. స్థానిక ఎన్నికల్లో ఎస్‌ఈసీ ఏ విధానానికి మొగ్గు చూపుతుందనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Also Read: AP Rain Alert: బంగాళాఖాతంలో మరోసారి అలజడి..రేపు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

Also Read: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి? త్వరలోనే అధికారిక ప్రకటన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top