icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
504251
KASARLA RAMESHKASARLA RAMESHFollow22 Aug 2024, 10:26 am

తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన పలువురు గ్రామస్తులు

Bellampalle, Kannal Rural, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెద్దబూద గ్రామ శివారులో తాము నిర్మించుకున్న కట్టడాలను రెవెన్యూ అధికారులు నిన్న కూల్చివేయగా గురువారం గ్రామానికి చెందిన పలువురు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. గతంలో శివాలయం వద్ద నిర్మించుకుంటే వాటిని తొలగించి వేరే చోట తమకు స్థలం ఇప్పిస్తామని అధికారులు మాట ఇచ్చి మరిచారని, ఇప్పుడు తమ నిర్మాణాలు కూల్చి వేయడంతో తమకు నిలువ నీడ లేకుండా పోయిందని వాపోయారు. ఇంటి నిర్మాణాల కోసం తమకు స్థలం కేటాయించాలని కోరుతూ తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

AP Local Body Elections: పంచాయితీ ఎన్నిక సీట్ల విషయంలో జనసేన తగ్గేదేలే.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు!

Vijayawada, Andhra Pradesh:

AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని రోజుల్లో పంచాయితీ (స్థానిక సంస్థల) ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల నేత, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల ఫార్మూలా పనిచేయదని సీట్ల సర్దుబాటులో తగ్గి ఉండాల్సిన అవసరం లేదనే విషయాన్ని గుర్తుచేశారు. అలాగే రాబోయే పంచాయితీ ఎన్నికల్లో జనసేన క్యాడర్‌కు ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు.

మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడిన ముఖ్యాంశాలు..
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు, కూటమికి ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడ్డారని మనోహర్ గుర్తుచేశారు. ఆ నాడు ఆయన తీసుకున్న నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తును మార్చివేసిందని మంత్రి మనోహర్ అన్నారు.

6 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా భావించి జనసేన పార్టీ కొన్ని స్థానాల్లో వెనక్కి తగ్గిందని ఆయన పేర్కొన్నారు. అయితే, అదే సూత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తిస్తుందని అనుకుంటే పొరపాటని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

జనసేన కొత్త ఫార్ములా..? 
సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించిన సీట్ల సర్దుబాటు ఫార్ములాను స్థానిక సంస్థల ఎన్నికల్లో గుడ్డిగా అమలు చేయడం కుదరదని మంత్రి తేల్చిచెప్పారు. ఈ ఎన్నికల వ్యూహం, సమీకరణాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

గత కొన్నేళ్లుగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన, కష్టకాలంలో జెండా మోసిన జనసేన నాయకులకు, కార్యకర్తలకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు పూర్తి స్థాయిలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ, స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వచ్చేసరికి జనసేన తన బలాన్ని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉందనే సంకేతాలను నాదెండ్ల మనోహర్ ఈ వ్యాఖ్యల ద్వారా పంపించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అటు కూటమిలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Also Read: రైలు కింద కుటుంబం మొత్తం ఆత్మహత్య..బావ హత్య కేసులో నిందితుడు దారుణం..అసలు నిజం ఇదే?

Also REad: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం రాజకీయ నేపథ్యం ఇదే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

రాహు కేతువుల మాయాజాలం.. జూలై 19 నుంచి ఈ 3 రాశుల వారికి సువర్ణ కాలం.. లక్ష్మీ దేవి కటాక్షం!

Hyderabad, Telangana:

Rahu Ketu Miracle Telugu: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని మనందరికీ తెలుసు.. గ్రహాల మార్పుల వల్ల కొన్నిసార్లు అద్భుతమైన యోగాలతో పాటు మరికొన్నిసార్లు శక్తివంతమైన ప్రభావాలు ఏర్పడుతూ ఉంటాయి.. ప్రస్తుతం జూలై మూడవ.. నాల్గవ వారాల్లో గ్రహాల స్థితిగతులు అత్యంత కీలకమైన దశకు చేరుకోబోతున్నాయి. జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. ప్రస్తుతం ప్రధాన గ్రహాలన్నీ రాహువు, కేతువుల మధ్య చిక్కుకుపోయి ఉన్నాయి. దీనివల్ల సూర్యుడు, కుజుడు, బుధుడు, శని వంటి గ్రహాల శుభ ప్రభావం తగ్గిపోయి.. అన్ని రాశులవారిపై ఊహించని ప్రభావాన్ని చూపుతాయి.. ఫలితంగా కొన్ని రాశుల వారు తీవ్రమైన అడ్డంకులతో పాటు అనేక సమస్యలు వస్తాయి.. అయితే, జూలై 19న ఈ మాయాజాలం కారణంగా ఈ కింది రాశులవారి జీవితాల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఆ తర్వాత మూడు రాశుల వారికి సువర్ణ కాలం ప్రారంభం కాబోతోంది.

ఆ మూడు అదృష్ట రాశులు ఇవే..
కర్కాటక రాశి (Cancer)
ఈ రాశి వారికి జూలై 19 తర్వాత కాలం అత్యంత అద్భుతంగా ఉండబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరు ఊహించని విజయాల శిఖరాలకు చేరుకుంటారు. గత కొంతకాలంగా వేధిస్తున్న మానసిక ఆందోళనలు తొలగిపోయి.. ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వ్యాపారాలతో పాటు ఉద్యోగాలు సజావుగా సాగే ఛాన్స్‌ ఉంది.. ముఖ్యంగా చాలా కాలంగా వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులు, ధన కొరత పూర్తిగా తీరిపోతుంది. నిలిచిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి.

మిథున రాశి (Gemini)
రాహు-కేతువుల మాయాజాలం వీడగానే మిథున రాశి వారికి మంచి రోజులు మొదలు కాబోతున్నాయి.. ముఖ్యంగా ఉద్యోగస్తులు తమ కార్యక్షేత్రంలో సరైన నిర్ణయాలు తీసుకుని ప్రశంసలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీనివల్ల కెరీర్‌లో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. జీతాల పెంపు (Salary Hike) లేదా ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో సుఖసంతోషాలు లభించబోతున్నాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా కాలం గడుపుతారు.

మీన రాశి (Pisces)
మీన రాశి వారు కూడా తమ జీవితంలో గోల్డెన్ టైమ్‌ను ఆస్వాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్యాలయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా పనులు సాగిపోతాయని అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ పనితీరుతో మీరు బాస్‌కు అత్యంత ప్రీతిపాత్రులుగా మారే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఏ పనినైనా ఎంతో ఓపికతో.. పట్టుదలతో పూర్తి చేస్తారు. దీనివల్ల అనుకున్న విజయాలు చాలా సులభంగా మీ సొంతమవుతాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report
Advertisement

కేవలం రూ.7,000 లకే 8 దివ్యక్షేత్రాల దర్శనం.. TGSRTC కోరుట్ల డిపో స్పెషల్ ప్యాకేజీ వివరాలు..

Jagtial, Telangana:

TGSRTC Korutla Depot News: జగిత్యాల ఆధ్యాత్మిక యాత్రీకులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కోరుట్ల డిపో ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. పవిత్ర శ్రావణ మాస వేళ.. భక్తుల కోరిక మేరకు తమిళనాడులోని ప్రముఖ శైవక్షేత్రం అరుణాచల గిరి ప్రదక్షిణతో పాటు.. దక్షిణ భారతదేశంలోని పలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు వీలుగా ఒక అద్భుతమైన ప్రత్యేక టూర్ బస్సు సర్వీసును ప్రకటించింది.. ఈ మేరకు జులై 27వ తేదీన కోరుట్ల డిపో నుంచి ఈ ప్రత్యేక బస్సు బయలుదేరనుందని డిపో మేనేజర్ (DM) ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించారు.

ఒకే యాత్ర.. ఎనిమిది దివ్యక్షేత్రాల దర్శనం..
భక్తుల ఆధ్యాత్మిక కాంక్షను నెరవేర్చే విధంగా ఈ టూర్ ప్యాకేజీని అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేశారని డిఎమ్‌ తెలిపారు.. ఈ సింగిల్ ట్రిప్‌లో భక్తులు దేశంలోనే అద్భుతమైన 8 ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ యాత్రలో సందర్శించే క్షేత్రాల వివరాల్లోకి వెళితే..

మహానందిలో ప్రకృతి ఒడిలో వెలిసిన స్వయంభూ శివలింగ దర్శనంతో పాటు కాణిపాకంలో స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనం, శ్రీపురంలో కనువిందు చేసే లక్ష్మీ నారాయణి బంగారు దేవాలయం, కంచిలో కామాక్షి అమ్మవారు, ఏకాంబరేశ్వరుడి దర్శనం, తిరుత్తణిలో కార్తికేయుడి ఐదవ పడైవీడు క్షేత్రం, అరుణాచలంలో పవిత్ర కార్తీక దీప క్షేత్రంలో అత్యంత అద్భతమైన గిరి ప్రదక్షిణ, స్వామివారి దర్శనం, తిరుపతిలో కలియుగ వైకుంఠ నాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం, శ్రీకాళహస్తిలో రాహు-కేతు నివారణ క్షేత్రమైన వాయులింగేశ్వర స్వామి దర్శనాలు ఉంటాయని అధికారిక ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా అరుణాచల కొండ చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేసేందుకు ఈ యాత్రలో ప్రత్యేక సమయాన్ని కేటాయించిన్నట్లు తెలుస్తోంది.

భోజన వసతి ఉచితం..
భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ఈ ప్యాకేజీ ధరలను నిర్ణయించింది. ముఖ్యంగా పెద్దలకు (Adults) రూ. 7,000 కాగా.. పిల్లలకు (Children) రూ. 5,500 మాత్రమేనని అధికారికంగా తెలిపింది. ఈ టికెట్ ధరలోనే ప్రయాణ ఖర్చులతో పాటు భక్తులకు ప్రతిరోజూ మధ్యాహ్నం రుచికరమైన భోజనం (Lunch)తో పాటు రాత్రి వేళ మంచి అల్పాహారం ఆర్టీసీ సంస్థ తరఫునే ఉచితంగా ఉంటుందని తెలిపింది. దీనివల్ల భక్తులు ఆహారం కోసం దారిపొడవునా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
సుదూర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలకు రైళ్లు, ప్రైవేట్ వాహనాల్లో వెళ్లాలంటే రిజర్వేషన్లు, వసతి, రూట్ తెలియక భక్తులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారని.. వాటన్నింటికీ చెక్ పెడుతూ ఆర్టీసీ ఈ సురక్షితమైన ఆధ్యాత్మిక యాత్రను అందిస్తోందని డిపో మేనేజర్ తెలిపారు. అనుభవజ్ఞులైన డ్రైవర్లతో పాటు సుఖవంతమైన ప్రయాణం ఈ టూర్ ప్రత్యేకత అని పేర్కొన్నారు. సీట్లు పరిమితంగానే ఉంటాయని.. ఆసక్తి గల భక్తులు వెంటనే కోరుట్ల ఆర్టీసీ డిపో సంప్రదించి.. అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ సీట్లను ముందస్తుగా రిజర్వ్ చేసుకోవాలని ఆయన కోరారు..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

సూర్యుడి కర్కాటక రాశి సంచారం.. రాబోయే 30 రోజులు ఈ 3 రాశుల వారికి కష్టకాలం..

Hyderabad, Telangana:

Sun Transit In Cancer 2026 Effect On Zodiac: జ్యోతిష్యశాస్త్రంలో సూర్యభగవానుడిని గ్రహాల రాజుగా చెప్పకుంటారు. సూర్యుడు తన రాశిని లేదా నక్షత్రాన్ని మార్చినప్పుడల్లా కేవలం వాతావరణంలోనే కాకుండా.. మానవుల వృత్తి, ఆర్థిక స్థితి, ఆరోగ్యంతో పాటు సామాజిక గౌరవంపై నేరుగా ప్రభావం పడుతుందని జ్యోతిష్యుతు తెలుపుతున్నారు. ఈ ఇదిలా ఉంటే 2026 జూలై 16న సూర్య గ్రహం చంద్రుడి ఆధిపత్యం కలిగిన కర్కాటక రాశిలోకి సంచారం చేస్తాడు.. సూర్యుడి సంచారం రాబోయే ఒక నెల రోజుల పాటు మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

అయితే, జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ సూర్యడి సంచారం వల్ల మూడు నిర్దిష్ట రాశుల వారు ఉద్యోగం, డబ్బుతో పాటు ఆరోగ్యం విషయాలలో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సి ఉంఉటంది. రాబోయే 30 రోజులు వీరికి కొంత ప్రతికూలంగా మారే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి సూర్యుడి నెగిటివ్‌ ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

కుంభ రాశి (Aquarius) 
సూర్యుడి ప్రభావంతో కుంభరాశివారికి ఈ సమయంలో ప్రతికూల ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరు ఎంత కష్టపడినప్పటికీ.. ఆశించిన ఫలితాలు కలగపోవచ్చు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో అనేక రకాల ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో అదనపు జాగ్రత్తలు అవసరం. తొందరపాటుతో తీసుకునే ఏ నిర్ణయమైనా భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయవచ్చని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు కుటుంబ వాతావరణంలో కూడా శాంతిపరమైన సమస్యలు ఎదురవుతాయి. 

వృశ్చిక రాశి (Scorpio) 
శక్తివంతమైన సూర్యుడి ప్రభావంతో వృశ్చిక రాశివారికి కూడా ఈ సమయంలో ఎన్నో రకాల సవాళ్లు ఎదురవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మానసిక ఆందోళన వంటి సమస్యలు కూడా ఇబ్బందులు పెట్టే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో హెచ్చుతగ్గులు వస్తాయి. కాబట్టి భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఓపికతో ఉండడం ఎంతో మంచిది. తెలియని వ్యక్తులను లేదా కొత్త పరిచయాలను అంత త్వరగా నమ్మకపోవడం చాలా మంచిది. అదనపు ఖర్చులు కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ పరంగా చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

వృషభ రాశి (Taurus) 
సూర్యుడి రాశి సంచారంతో వృషభ రాశివారికి కూడా ఈ సమయంలో అనేక రకాల సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఆశించిన పనులలో సరైన ఫలితాలు రాకపోవడం వల్ల మానసిక ఒత్తిడితో పాటు ప్రతికూల ఆలోచనలు పెరిగే అవకాశాలు కూడా విపరీతంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు పని స్థలంలో ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. అలాగే కెరీర్‌ పరంగా కూడా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా విజయాలు రావడంలో కూడా అనేక రకాల సమస్యలు వచ్చే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఎక్కడైనా పెట్టుబడి పెట్టే ముందు అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

ఏపీలో పాలన గాలికెగిరిపోయింది.. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా స్కామ్‌లే: వైఎస్‌ జగన్‌

Tadepalli, Andhra Pradesh:

YSR Congress Party: ఆంధ్రప్రదేశ్‌లో పాలన గాలికి ఎగిరిపోయిందని.. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా కుంభకోణాలేనని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. 'డీఎస్సీ కుంభకోణం, టీచర్లకు టెట్, ప్రశ్నిస్తే వేధింపులు. అక్రమ కేసులు, అరెస్టులు, సంక్షోభంలో వ్యవసాయం. కష్టాల్లో ఆక్వా రైతులు, సమస్యల్లో ప్రభుత్వ ఉద్యోగులు. విపరీతంగా అప్పులు. రాష్ట్రం అప్పులకుప్ప' అని కూటమి పాలన వైఫల్యాలు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. వీటన్నింటినీ పార్లమెంట్‌ సమావేశాల్లో గట్టిగా వినిపించాలని ఎంపీలకు సూచించారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం గురువారం నిర్వహించారు. ఈనెల 20వ తేదీ నుంచి జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో ఎంపీలతో కలిసి పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యం అని.. వాటి కోసం గళం విప్పాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఇదివరకే మద్దతు ఇచ్చామని.. దాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తున్నట్లు తెలిపారు.

'ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పాలన గాలికి ఎగిరి పోయింది. ఎక్కడ చూసినా స్కాములే. డీఎస్సీ 2025 పోస్టుల భర్తీలో పెద్ద కుంభకోణం చోటుచేసుకుంది. పోటీ పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇవ్వడం ఏమిటి? ఇంకా డీఎస్సీ పరీక్ష పేపర్ల లీక్‌పైనా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాల భర్తీలో అనేక అవకతవకలు జరిగాయి' అని చంద్రబాబు పాలనలో తప్పిదాలను సమావేశంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు.

ఏపీలో అంతులేని అవినీతి పర్వం సాగుతోందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ విమర్శించారు. రాష్ట్రంలో ఇష్టాను సారంగా భూముల పందేరం జరుగుతోందని.. దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లోకేష్‌ తోడల్లుడికి అప్పనంగా అప్పగించారని ఆరోపించారు. అమరావతి నిర్మాణంలో కూడా విపరీతమైన దోపిడీ జరుగుతోందని.. చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా ఇలాంటి రేట్లు లేవని.. రోడ్ల నిర్మాణాల్లోనూ దోపిడీయే అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆరోపణలు చేశారు.

'ప్రభుత్వ తప్పులను వెలికి తీస్తున్న.. ప్రశ్నిస్తున్న వారిపై వేధింపులకు దిగుతున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. సోషల్‌ మీడియా పేరిట చంద్రబాబు తీవ్ర అరాచకాలకు పాల్పడుతున్నారు. ఎవరి మీదనైనా సరే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు' అని కూటమి పాలనపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'టెట్‌ రూపంలో టీచర్ల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. టెట్‌ రాకముందు నుంచి టీచర్లుగా పని చేస్తున్న వారికి ఇప్పుడు టెట్‌ తప్పనిసరి చేయడం సరికాదు' అని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల్లా పంచి పెడుతున్నారని.. ప్రైవేటు పేరుతో ఎక్కడిక్కడ దోచిపెడుతున్నారని చంద్రబాబు పాలనపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. పోర్టులు, హార్బర్లు సహా పలు సంస్థల ప్రైవేటీకరణ దారుణం అని మండిపడ్డారు. 'దాదాపుగా పూర్తైన రామాయపట్నం పోర్టును ప్రైవేటుకు ఇవ్వడం అతి దారుణం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మొదలై దాదాపుగా నిర్మాణం పూర్తైన పోర్టును ప్రైవేటుకు ఇవ్వడం ఏమిటి? రూ.5 వేల కోట్ల విలువైన పోర్టును రూ.1,500 కోట్లకు ఇవ్వడం కుంభకోణం కాదా?' అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

'ఇష్టానుసారంగా భూముల కేటాయింపులు చేస్తున్నారు. ఇసుక, మద్యం, గనులు దేన్నీ వదలకుండా దోపిడీ చేస్తున్నారు. ప్రతిచోటా మాఫియా నడుస్తోంది' చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. అడ్డగోలుగా చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేస్తోందని.. అప్పుల్లో ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని మండిపడ్డారు. ఈ రెండేళ్లలో ఏకంగా రూ.3.6 లక్షల కోట్ల మేర అప్పు చేశారని.. పరిమితి లేకుండా విపరీతంగా అప్పు చేస్తున్నారని వివరించారు.ఔ

ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని ఉల్లంఘించి మరీ అప్పులు చేస్తున్నా.. ఇన్ని అప్పులు చేసినా ప్రజలకు చేసింది శూన్యం అని చంద్రబాబు పాలనను మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తీసి పడేశారు. సిండికేట్‌ కారణంగా ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని.. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతులు చాలా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటినీ పార్లమెంటు ఉభయ సభల్లో లేవనెత్తాలని.. చంద్రబాబు ప్రభుత్వ అవినీతి వ్యవహారాలను ఎండగట్టాలని పార్టీ ఎంపీలకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు.

సమావేశంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు మేడా రఘునాథ్‌రెడ్డి, గొల్ల బాబూరావు, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, గురుమూర్తి, వైఎస్ అవినాష్‌రెడ్డి, గుమ్మా తనూజారాణి పాల్గొనగా.. ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ ఎంపీలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హాజరయ్యారు.

0
0
Report
Advertisement

తల్లికి వందనం నిధులు జూలై 22న విడుదల.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 13,000 జమ!

Hyderabad, Telangana:

Thalliki Vandanam Release on July 22: తల్లికి వందనం పథకం కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, పేరెంట్స్‌కు ప్రభుత్వం ఒక మంచి వార్త అందించింది. జులై 22వ తేదీన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.13,000 చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. అలాగే మరో రూ.2,000 పాఠశాల నిర్వహణ నిధి కోసం స్కూల్ ఖాతాలో జమ చేస్తారు. దీనివల్ల మొత్తం 67,47,190 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. తల్లికి వందనం పథకం ద్వారా మొత్తం 42,70,802 మంది తల్లుల ఖాతాల్లో రూ. 1,0120.78 కోట్లు జమ చేయనున్నట్లు ప్రభుత్వం వివరించింది.

0
0
Report

కాంగ్రెస్ పాలన అంతా స్కాముల మయంగా మారింది: హరీశ్‌ రావు

Hyderabad, Telangana:

Congress Scams: కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. 'బొగ్గు సరఫరాలో వైఫల్యం. నీటి నిల్వల నిర్వహణలో వైఫల్యం. విద్యుత్ కేంద్రాల నిర్వహణలో వైఫల్యం' అని విమర్శించారు. 'బొగ్గులో స్కాం. పవర్‌లో స్కాం. సాండ్‌లో స్కాం. ల్యాండ్‌లో స్కాం. కాంగ్రెస్ పాలన అంతా స్కాములమయంగా మారింది' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు. రాష్ట్రం మీద అసలు సోయి ఉందా అని రేవంత్‌ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు.

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మీడియా సమావేశం నిర్వహించి తెలంగాణ విద్యుత్‌ వ్యవస్థపై కీలక విషయాలు వెల్లడించారు. 'రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో రాష్ట్రం అంధకారమయ్యే పరిస్థితి వచ్చింది. అప్రకటిత కరెంట్ కోతలతో రైతులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు' అని వివరించారు.

'కేసీఆర్‌ ప్రభుత్వంలో విద్యుత్‌ పోతే వార్త.. ఇప్పుడు కరెంట్ ఉంటే వార్త అనే పరిస్థితి నెలకొంది. ఈరోజు రాష్ట్రంలోని 11 జిల్లాల్లో సబ్‌స్టేషన్ల ముందు రైతులు ధర్నాలు చేశారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు అందుబాటులో లేకపోవడం వల్లే కరెంట్ కోతలు వస్తున్నాయి. సింగరేణి విషయంలో పీపీటీలు పెట్టి థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు లేవని ముందే చెప్పాం. 40 లక్షల టన్నుల బొగ్గు ఉందని ప్రభుత్వం చెప్పింది.. వాస్తవానికి లేదని మేం హెచ్చరించాం' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీ నిద్ర లేపినా కూడా రేవంత్‌ రెడ్డి నిద్రలేవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'కాంగ్రెస్ తీరుతోనే విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం, కాకతీయ, భద్రాద్రి, యాదాద్రి పవర్ స్టేషన్లలో 6 నుంచి 7 రోజులకు మించి బొగ్గు నిల్వలు లేవు. యాదాద్రి ప్లాంట్‌లో యూనిట్-1, యూనిట్-4లో బొగ్గు లేక ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి ప్లాంట్‌లో నిర్వహణ వైఫల్యంతో ఉత్పత్తి ఆగిపోయింది' అని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు వివరించారు. అసలు విద్యుత్ కోతలు ఎందుకు వస్తున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని రేవంత్‌ రెడ్డిని కోరారు.

'రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గి సరఫరా తగ్గింది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు పెడుతున్నారు. నీటిని లిఫ్ట్ చేయలేదు.. రిజర్వాయర్లలో నీళ్లు నింపలేదు.. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని కూడా అసాధ్యం చేశారు' అని రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు ఆలోచనతో అయినా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సజావుగా జరిగేలా చూడలేదని చెప్పారు. సాగునీటి సరఫరాలో ఫెయిల్ అయ్యారు.. విద్యుత్ సరఫరాలో కూడా ఫెయిల్ అయ్యారని రేవంత్‌ రెడ్డి వైఫల్యాలను వివరించారు.

'తెలంగాణకు మొత్తంగా 23 వేల మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఉంది. అయినా ప్రస్తుతం కేవలం 3,190 మెగావాట్లే ఉత్పత్తి అవుతోంది. దీనికి కారణమేంటో ప్రభుత్వం చెప్పాలి' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు కోరారు. 'అడ్డగోలు ధరలకు 80 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పవర్ ఎక్స్ఛేంజ్‌లో కొనుగోలు చేస్తున్నారు. ఆ భారం వినియోగదారులు, పారిశ్రామికవేత్తలు ఎందుకు భరించాలని ప్రశ్నిస్తున్నాం' అని నిలదీశారు. సింగరేణి వెబ్‌సైట్ మూసివేసి ఉత్పత్తి, సరఫరా, బొగ్గు నాణ్యత వివరాలు బయటకు రాకుండా చేశారని విమర్శించారు.

'నాణ్యమైన సింగరేణి బొగ్గును తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కు పంపుతున్నారు. తెలంగాణకు మాత్రం లో-క్వాలిటీ బొగ్గు పంపిస్తున్నారు. 70 రేకులు పంపితే 30 రేకులు రిజెక్ట్ అవుతున్నాయి. అందుకే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి జరగడం లేదు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు వివరించారు. రాష్ట్ర అవసరాలు, రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి ఇతర రాష్ట్రాలకు బొగ్గు ఎందుకు పంపిస్తున్నారో ప్రభుత్వం చెప్పాలని రేవంత్‌ రెడ్డిని కోరారు. 'బొగ్గు ఉండి కూడా అడ్డగోలు ధరలకు పవర్ ఎక్స్ఛేంజ్‌లో విద్యుత్ ఎందుకు కొనుగోలు చేస్తున్నారో సమాధానం చెప్పాలి' అని నిలదీశారు. ఎందుకు కేవలం 44 శాతం మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

'బీఆర్‌ఎస్ పార్టీ హయాంలో 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చి తెలంగాణ వ్యవసాయాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టాం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మళ్లీ చీకట్లలోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో గుండెలపై చేయి వేసుకొని కంటి నిండా నిద్రపోయిన రైతులకు ఇప్పుడు కునుకు కరువైందని వివరించారు. లోవోల్టేజ్, మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోవడం వంటి సమస్యలతో రైతులు సతమతమవుతున్నారని వివరించారు.

0
0
Report

తిరుమలలో మాజీ ఉప ముఖ్యమంత్రికి అవమానం.. టీటీడీపై నారాయణ స్వామి తీవ్ర ఆరోపణలు

Tirupati Urban, Andhra Pradesh:

Tirumala Temple: తిరుమల శ్రీవారి దర్శన వ్యవస్థపై వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు, మాజీ ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు తిరుమల ఆలయంలో అవమానం జరిగిందని తెలిపారు. తనకు ప్రోటోకాల్‌ దర్శనం ఇవ్వాల్సి ఉండగా.. సాధారణ దర్శనానికి పంపించారని వివరించారు. ఇది తనను అవమానించినట్లేనని చెప్పారు ఇలా వ్యవహారించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

తిరుమల శ్రీవారిని గురువారం నారాయణ స్వామి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ నారాయణ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. 'దేవుడి దగ్గర అందరూ సమానమే. కానీ భక్తులతో మానవత్వం లేకుండా వ్యవహరించడం బాధాకరం' అని తెలిపారు. తనకు ప్రొటోకాల్‌ ఉన్నప్పటికీ సాధారణ దర్శనం ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. ఇది అవమానంగా భావిస్తున్నట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు. 

ఈ సందర్భంగా టీటీడీ తీరుపై నారాయణ స్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. తిరుమలలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని తెలిపారు. 'తిరుమలలో పూర్తిగా వీఐపీ దర్శనాలను తొలగించి సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడు ఎవరినీ అవమానించే పరిస్థితులు ఉండవు' అని చెప్పారు. 

ప్రముఖుల దర్శనం
తిరుమల శ్రీవారి ఆలయానికి పలువురు ప్రముఖులు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ, ఎంపీ కృష్ణ ప్రసాద్ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

0
0
Report
Advertisement

కరీంనగర్ సివిల్ సప్లైస్‌లో భారీ స్కామ్.. రూ.182 కోట్ల కుంభకోణం..

Karimnagar, Telangana:

Karimnagar Civil Supplies Scam: కరీంనగర్ జిల్లా సివిల్ సప్లైస్ శాఖలో ఊహించని రీతిలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. పేదల ఆకలి తీర్చాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కేటాయింపుల్లో వందల కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు తేలడంతో ఒక్కసారిగా అధికారులు షాక్‌ అయిపోతున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారమే.. ఈ కుంభకోణం విలువ దాదాపు రూ.182 కోట్లుగా తేలడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించి.. బాధ్యులపై ఉక్కుపాదం మోపుతోంది.

రైస్ మిల్లర్ల మాయాజాలం.. 
ప్రభుత్వం మిల్లింగ్ కోసం కేటాయించిన ధాన్యాన్ని సకాలంలో బియ్యంగా మార్చి సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌కు అప్పగించడంలో కొందరు రైస్ మిల్లర్లు తీవ్ర అక్రమాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి.. కోట్లాది రూపాయల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు విచారణలో తేలింది. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టిన అధికారులకు మిల్లుల్లో ఉండాల్సిన నిల్వలు కనిపించకపోవడంతో అధికారులు షాక్‌కు గురయ్యారు.

రంగంలోకి సర్కార్..
ఈ భారీ స్కామ్ బయటపడటంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందించింది.. అక్రమార్కులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తూ కఠిన చర్యలు ప్రారంభించింది. నిబంధనలు ఉల్లంఘించి.. ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించిన 18 మంది రైస్ మిల్లర్లపై ఇప్పటికే అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ కుంభకోణంలో కీలక సూత్రధారిగా ఉన్న ఒక ప్రధాన నిందితుడిపై ప్రభుత్వం అత్యంత కఠినమైన పీడీ యాక్ట్ (PD Act)ను ప్రయోగించింది. సకాలంలో బియ్యం అప్పగించకుండా మొండికేస్తున్న 38 రైస్ మిల్లులను అధికారులు డిఫాల్ట్ జాబితాలో చేర్చారు.

కొనసాగుతున్న విచారణ.. 
ప్రస్తుతం జరుగుతున్న చర్యలు కేవలం ఆరంభం మాత్రమేనని అధికారులు చెబుతూ వస్తున్నారు. ఈ భారీ కుంభకోణంలో నెట్‌వర్క్ చాలా పెద్దదని భావిస్తున్నారు. ప్రస్తుతం మరో 20 రైస్ మిల్లుల వ్యవహారంపై పౌరసరఫరాల శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. వీటిలో కూడా భారీగా నిల్వలు మాయమైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే వీటికి సంబంధించిన పూర్తి నివేదిక రానుందని.. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.

రికవరీపై నజర్..
ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన ఈ రూ.182 కోట్ల రికవరీపై సివిల్ సప్లైస్, రెవెన్యూ అధికారులు ముమ్మరంగా దృష్టి సారించారు. డిఫాల్ట్ అయిన మిల్లుల నుంచి రికవరీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైతే ఆస్తుల జప్తునకు కూడా వెనుకాడబోమని సమాచారం.. జిల్లా వ్యాప్తంగా అన్ని మిల్లుల్లోనూ అదనపు బృందాలతో తనిఖీలు మరింత ముమ్మరం చేశారు. ఈ కుంభకోణం వెనుక అధికారుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలోనూ అంతర్గత విచారణ సాగుతోంది. ఈ స్కామ్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

బడ్జెట్ ధరలో ఫ్లాగ్‌షిప్ కిల్లర్.. దిమ్మతిరిగే ప్రాసెసర్‌తో Motorola Edge 70 Max వచ్చేసింది!

Hyderabad, Telangana:

Motorola Edge 70 Max Launched: ప్రముఖ మోటోరోలా భారత మార్కెట్లోకి సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్ (Motorola Edge 70 Max)ను అధికారికంగా లాంచ్‌ చేసింది.. ఇది ఎంతో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో పాటు భారీ బ్యాటరీ, అదిరిపోయే కెమెరా ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ ప్రీమియం మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. జూలై 20 నుంచి ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మోటోరోలా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌కి సంబంధించిన విక్రయాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

ధర, ఆఫర్ల వివరాలు..
భారత్‌లో మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్ బేస్ వేరియంట్ (8GBర్యామ్‌, 256GB స్టోరేజ్) ధర రూ.54,999తో అందుబాటులో ఉండగా.. హై-ఎండ్ వేరియంట్ (12GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్) ధర రూ.59,999గా నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది.. అయితే, లాంచ్ ఆఫర్ కింద బ్యాంక్ డిస్కౌంట్లు లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ రూపంలో రూ.5,000 తక్షణ తగ్గింపు కూడా అందుబాటులో ఉండడం విశేషం. దీనివల్ల ఈ మొబైల్‌ ఎఫెక్టివ్ ప్రారంభ ధర రూ.49,999 నుంచే ప్రారంభమవుతుంది.. 18 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా లభిస్తోంది. ఇది పాంటోన్ ఆక్వా గ్రే, పాంటోన్ డార్క్ షాడోతో పాటు పాంటోన్ ఐస్ మెల్ట్ అనే మూడు అద్భుతమైన కలర్‌ ఆప్షన్స్‌ అందుబాటులో ఉంది..

స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 పవర్‌ఫుల్ ప్రాసెసర్..
ఈ మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్ స్మార్ట్‌ఫోన్‌ క్వాల్‌కామ్ సంబంధించిన అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 (Snapdragon 8 Gen 5) చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల సిపియు (CPU) పనితీరు 36 శాతం పెరగడమే కాకుండా.. గేమింగ్ ప్రియుల కోసం వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందిస్తోంది.. దీనివల్ల భారీ గ్రాఫిక్స్ గేమ్‌లు ఆడినా ఫోన్ అస్సలు వేడెక్కదు.

7000 నిట్స్ బ్రైట్‌నెస్..
ఈ ఫోన్‌లో 6.8-ఇంచుల క్వాడ్ HD+ (2K) ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ (Extreme AMOLED) డిస్‌ప్లేను అందించారు. ఇది 144Hz రీఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్క్రీన్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది ఏకంగా 7,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి రక్షణగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ని ఉపయోగించారు.

50MP సూపర్ AI కెమెరా..
ఫోటోగ్రఫీ కోసం మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్‌లో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కూడా అందిస్తోంది.. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ సోనీ లైటియా 710 (Sony LYTIA 710) ప్రధాన కెమెరాను కూడా అందించారు.. అంతేకాకుండా అదనంగా 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్‌తో పాటు మాక్రో లెన్స్ కెమెరాలు కూడా లభిస్తున్నాయి. సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా అందించారు. ఇది 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. AI ఫోటో ఎన్‌హాన్స్‌మెంట్‌తో పాటు డైనమిక్ బోకె వంటి ఫీచర్లు ఫోటోలను ప్రొఫెషనల్‌గా మారుస్తాయని కంపెనీ తెలిపింది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

భారీ 7,100mAh బ్యాటరీ..
మోటోరోలా చరిత్రలోనే అత్యంత భారీగా 7,100mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందించడం విశేషం.. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. దాదాపు 58 గంటల పాటు పనిచేస్తుందని కంపెనీ హామి కూడా ఇస్తోంది.. దీనికి తోడు 90W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు ఈ విభాగంలోనే అత్యంత వేగవంతమైన 25W Qi2 మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది.. అలాగే ఇందులో మోటోరోలా తన సరికొత్త క్రాస్-డివైస్ AI ప్లాట్‌ఫారమ్ Qiraను పరిచయం చేసింది. దీని ద్వారా యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌ను లెనోవా పీసీలతో పాటు టాబ్లెట్లతో సులభంగా కనెక్ట్ చేసి మల్టీటాస్కింగ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

6500mAh బ్యాటరీతో Vivo T5 Lite 5G లాంచ్.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే!

Hyderabad, Telangana:

Vivo T5 Lite 5g Price In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Vivo వినియోగదారుల కోసం మరో అద్భుతమైన బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి  లాంచ్‌ చేసింది.. Vivo T5 Lite 44W 5G స్మార్ట్‌ఫోన్‌ పేరుతో విడుదలైంది. ఈ కొత్త మొబైల్, బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది.. ముఖ్యంగా సుదీర్ఘ బ్యాటరీ లైఫ్, ప్రీమియం పర్ఫార్మెన్స్ కోరుకునే యూజర్లను టార్గెట్ చేస్తూ.. రూ.20 వేల లోపు బడ్జెట్‌లోనే అందుబాటులోకి తీసుకు వచ్చింది..

6500mAh మెగా బ్యాటరీ..
ఈ Vivo T5 Lite 44W 5G స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని భారీ బ్యాటరీగా భావించవచ్చు.. ఇందులో ఏకంగా 6500mAh బ్యాటరీని అందుబాటులోకి తీసుకు వచ్చింది.. సాధారణ వినియోగదారులకు ఇది రెండు రోజుల కంటే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది.. దీనికి తోడు, ఫోన్‌ను సులభంగా వేగంగా ఛార్జ్ చేయడానికి 44W ఫ్లాష్‌చార్జ్ (FlashCharge) సపోర్ట్‌ను కూడా అందించిన్నట్లు తెలుస్తోంది..

పవర్‌ఫుల్ ప్రాసెసర్..
విజువల్స్ పరంగా.. ఈ ఫోన్ అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఈ Vivo T5 Lite 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.74-ఇంచుల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz హై రిఫ్రెష్ రేట్‌తో పాటు 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఐ ప్రొటక్షన్‌ కోసం ఈ డిస్‌ప్లేకు TUV Rheinland సర్టిఫికేషన్ కూడా అందుబాటులో ఉంది.. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే.. ఇందులో అత్యంత పవర్‌ఫుల్ MediaTek Dimensity 6300 చిప్‌సెట్‌ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది.. ఇది మల్టీటాస్కింగ్, గేమింగ్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Origin OS 6.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. దీనిలో AI క్రియేషన్, AI క్యాప్షన్‌తో పాటు ప్రైవేట్ స్పేస్ వంటి చాలా ప్రత్యేకమైన AI ఫీచర్లు ఉన్నాయి.

50MP AI కెమెరా..
ఫోటోల విషయానికి వస్తే.. Vivo కెమెరా పరంగా ఎక్కడ వెనకడుగు వేయలేదని భావించవచ్చు. ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరాతో పాటు 0.8MP సెకండరీ కెమెరాను కలిగి ఉంటుంది.. ఇందులో చాలా ప్రత్యేమైన నైట్ మోడ్‌తో పాటు పోర్ట్రెయిట్ మోడ్ వంటి అడ్వాన్స్‌డ్ AI కెమెరా ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 5MP కెమెరాను అందించారు.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ.. 
ఈ ఫోన్ కేవలం ఫీచర్ల పరంగానే కాకుండా బలంగా కూడా ఉంటుందని కంపెనీ తెలిపింది.. దీనికి SGSతో పాటు మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌ను కంపెనీ అందించింది.. అలాగే ప్రొటక్షన్‌ కోసం IP65 రేటింగ్ అందించారు. ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో పాటు బ్లూటూత్ 5.4, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది..

భారతదేశంలో Vivo T5 Lite 5G మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది మొదటి స్టోరేజ్‌ 4GB ర్యామ్‌, 128GB వేరియంట్ ధర రూ. 19,999తో లభిస్తోంది. అంతేకాకుండా 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999తో అందుబాటులో ఉంది. ఇందులో మూడవ వేరియంట్ 6GB ర్యామ్‌ + 256GB స్టోరేజ్‌తో ధర రూ.25,999తో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి రూ.1,500 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

గృహజ్యోతి లబ్ధిదారులకు షాక్.. 4 లక్షల మందికి ఫ్రీ కరెంట్ కట్!

Hyderabad, Telangana:

Telangana Gruha Jyothi Latest News: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే, NPDCL పరిధిలోని 18 జిల్లాల్లో గత జూన్ నెలలో ఎండల తీవ్రత లేదా ఇతర కారణాల వల్ల విద్యుత్ వినియోగం పెరిగిన్నట్లు తెలుస్తోంది.. 200 యూనిట్ల పరిమితి కంటే ఎక్కువ విద్యుత్‌ను వాడిన కారణంగా.. దాదాపు 4 లక్షల మంది వినియోగదారులు ఈ సారి గృహజ్యోతి పథకం లబ్ధిని కోల్పోయారు. వీరందరికీ జూన్ నెలలో సాధారణ బిల్లులు వచ్చాయని తెలుస్తోంది.

22.59 లక్షల మందికి జీరో బిల్లులు..
మరోవైపు.. నిబంధనల ప్రకారం, విద్యుత్ వినియోగించిన మెజారిటీ వినియోగదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చిన సంగతి తెలిసిందే.. NPDCL పరిధిలో మొత్తం 26,54,851 మంది అర్హులైన లబ్ధిదారులు ఉండగా.. అందులో 22,59,602 మందికి జూన్ నెలలో 200 యూనిట్ల లోపే విద్యుత్ వినియోగం నమోదైన్నట్లు తెలుస్తోంది. దీంతో వారందరికీ యథావిధిగా జీరో బిల్లులు వచ్చాయి. ఈ 22.59 లక్షల మంది వినియోగదారులకు సంబంధించి రూ.99.18 కోట్ల సబ్సిడీ భారాన్ని తెలంగాణ ప్రభుత్వం భరించి.. డిస్కామ్‌లకు చెల్లించిన్నట్లు తెలుస్తోంది.

మూడు నెలల్లో రూ.2,354 కోట్ల సబ్సిడీ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి ప్రజలకు లభించిన లబ్ధిపై అధికారులు గణాంకాలను విడుదల చేశారు. మార్చి నెల నుంచి జూన్ నెల వరకు గడిచిన కాలంలో NPDCL పరిధిలో మొత్తం 6,48,95,429 మందికి జీరో బిల్లులు అందాయి. ఈ మూడు, నాలుగు నెలల కాలంలో ప్రజలపై పైసా భారం పడకుండా ప్రభుత్వం ఏకంగా రూ.2354.77 కోట్ల భారీ సబ్సిడీని భరించింది.

ఇందులో భాగంగా వినియోగదారులు మొత్తం 5,384.04 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించింది. ఇదిలా ఉంటే.. గృహజ్యోతి పథకం నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఆర్థిక వెసులుబాటు కల్పిస్తున్నప్పటికీ.. 200 యూనిట్ల పరిమితిని దాటకుండా జాగ్రత్తపడాలని.. అప్పుడే జీరో బిల్లుల ప్రయోజనం నిరంతరాయంగా అందుతుందని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఈ జీరో బిల్లుల కోల్పోయిన వారు మళ్లీ పొందుతారో? పొందరో? తెలంగాణ ప్రభుత్వమే వెల్లడించాల్సి ఉంటుంది. 

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

దిమ్మతిరిగే బ్యాటరీ.. Realme కొత్త 5G ఫోన్.. ఒక్క చార్జ్‌తో 3 రోజులు పక్కా!

Hyderabad, Telangana:

Realme Narzo 100x 5g: ప్రముఖ చైనీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Realme భారత మార్కెట్లోకి మరో సరికొత్త పవర్‌ఫుల్ మొబైల్‌ను విడుదల చేసింది. నార్జో సిరీస్‌లో భాగంగా అత్యంత భారీ బ్యాటరీతో కూడిన Realme Narzo 100x 5G స్మార్ట్‌ఫోన్‌ అధికారికంగా లాంచ్‌ అయ్యింది. ఇది అద్భుతమైన ఫీచర్లతో పాటు దిమ్మతిరిగే బ్యాటరీని కలిగి ఉంటుంది. బడ్జెట్ ధరలో లభించే ఈ ఫోన్ ప్రత్యేకతలు, ధర వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అదిరిపోయే డిస్‌ప్లే.. 
ఈ స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల హెచ్‌డీ ప్లస్ (HD+) LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.. ఇది 1570×720 పిక్సెల్స్ రెజల్యూషన్‌తో పాటు అత్యంత వేగవంతమైన 144Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉందని కంపెనీ తెలిపింది.. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది.. ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే.. ఇందులో పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ (MediaTek Dimensity 6300 5G) చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మి యూఐ 7.0 (Realme UI 7.0) ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుందని కంపెనీ తెలిపింది..

పవర్‌ఫుల్ బ్యాటరీ..
ఈ  Realme Narzo 100x 5G ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని భారీ బ్యాటరీగా భావించవచ్చు. మార్కెట్లో మరే బడ్జెట్ ఫోన్‌లోనూ లేని విధంగా ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన 8,000mAh బ్యాటరీని అందించారు. దీనికి తోడు 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. ఒక్కసారి చార్జ్ చేస్తే రెండు నుంచి మూడు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుందని కంపునీ తెలిపింది..

అద్భుతమైన కెమెరా..
ఫొటోగ్రఫీ కోసం.. రియల్‌మి నార్జో 100ఎక్స్ 5జీ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.. దీని ద్వారా అద్భుతమైన ఫొటోలు, వీడియోలు తీసుకునే అవకాశాన్ని అందిస్తోంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందిస్తోంది.. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రొటక్షన్‌ కోసం IP65 రేటింగ్‌తో వస్తుంది. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ధరలు, వేరియంట్ల వివరాలు..
భారతదేశంలో ఈ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులోని మొదటి స్టోరేజ్ వేరియంట్ 4GB రామ్‌తో పాటు 128GB స్టోరేజ్ ధర రూ.20,999లోపే లభిస్తోంది. ఇక రెండవది 6GB రామ్‌తో పాటు 128GB స్టోరేజ్‌తో ధర రూ.22,999, మూడవ వేరియంట్ 6GB రామ్‌తో పాటు 256GB స్టోరేజ్‌తో ధర రూ.24,999తో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్ ఆరెంజ్ (Flash Orange), మిడ్‌నైట్ బ్లాక్ (Midnight Black) అనే రెండు రంగులలో అందుబాటులోకి వచ్చింది. జూలై 22 నుంచి రియల్‌మి అధికారిక వెబ్‌సైట్‌, ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ (Amazon)లో కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేస్తే..రూ.2,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్, రూ.500 కూపన్ డిస్కౌంట్ లభించనున్నాయి. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

9,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Redmi K100 సిరీస్.. ఫీచర్స్ లీక్!

Hyderabad, Telangana:

Redmi K100 Series: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు అదిరిపోయే వార్త.. ప్రముఖ చైనీస్ బ్రాండ్ Redmi మార్కెట్లోకి అద్బుతమైన ఫీచర్లతో కొత్త మొబైల్ సిరీస్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించేందుకు కంపెనీ రెడ్‌మి K100 (Redmi K100) సిరీస్‌ను లాంచ్‌ చేసేందుకు రెడీ అయ్యింది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన లీక్స్‌ కూడా ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సిరీస్‌లోని హై-ఎండ్ మోడల్‌లో ఏకంగా 9,000mAh భారీ బ్యాటరీతో పాటు 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందిస్తున్నట్లు తెలుస్తోంది.. ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ వేబో (Weibo)లో టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ఈ సిరీస్‌కు సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అద్భుతమైన డిస్‌ప్లే.. 
ఈ రెడ్‌మి K100 ప్రో లేదా K100 ప్రో మాక్స్ మోడల్‌లో డిస్‌ప్లే పరంగా భారీ మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది.. లీకైన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లాట్ డిస్‌ప్లేతో పాటు రౌండెడ్ కార్నర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. విజువల్స్ అత్యంత స్పష్టంగా.. స్మూత్‌గా ఉండటం కోసం దీనికి ఏకంగా 185 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను అందిస్తున్నట్లు సమాచారం. గేమ్స్ ఆడేటప్పుడు, వీడియోలు చూసేటప్పుడు వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు ఈ డిస్‌ప్లేలో అత్యాధునిక టెక్నాలజీని కూడా వినియోగించిన్నట్లు తెలుస్తోంది..

200MP కెమెరా వివరాలు..
ఫోటోగ్రఫీ ప్రియులను ఆకట్టుకునేలా ఈ ఫోన్ వెనుక భాగంలో భారీ కెమెరా సెటప్‌ను అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (Periscope Telephoto Camera) కూడా అందించబోతున్నట్లు తెలుస్తోంది. గత మోడల్ అయిన రెడ్‌మి K90 ప్రో మాక్స్‌లో కేవలం 50MP ప్రధాన కెమెరాతో పాటు 50MP కెమెరాలను అందించగా.. త్వరలో రాబోయే కొత్త మోడల్‌లో 200MP కెమెరాను అందుబాటులో ఉంచడం విశేషం.. 

సూపర్‌సోనిక్ ప్రాసెసర్..
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రాసెసర్‌ విషయానికి వస్తే.. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ కంపెనీకి చెందిన అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 (Snapdragon 8 Elite Gen 5)పై రన్‌ అవుతుంది.. గేమింగ్ సమయంలో అద్భుతమైన గ్రాఫిక్స్, అద్బుతమైన పర్ఫార్మెన్స్ అందించడానికి ప్రత్యేకంగా ఒక  డిస్‌ప్లే చిప్ (Dedicated Display Chip)ను కూడా ఇందులో అందుబాటులోకి తీసుకు వచ్చింది. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

9,000mAh మెగా బ్యాటరీ.. 
ఈ స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన బ్యాటరీని కలిగి ఉంటుంది.. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన 9,000mAh మెగా బ్యాటరీని కలిగి ఉంటుంది.. దీనివల్ల ఫోన్ ఛార్జింగ్ ఒక్కసారి పెడితే రోజుల తరబడి వినియోగించవచ్చు. ఇంత పెద్ద బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి ఎంతో శక్తివంతమైన 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది.. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన విడుదల వివరాలను కంపెనీ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement
Advertisement
Back to top