icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
504251
KASARLA RAMESHKASARLA RAMESHFollow22 Aug 2024, 10:26 am

తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన పలువురు గ్రామస్తులు

Bellampalle, Kannal Rural, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెద్దబూద గ్రామ శివారులో తాము నిర్మించుకున్న కట్టడాలను రెవెన్యూ అధికారులు నిన్న కూల్చివేయగా గురువారం గ్రామానికి చెందిన పలువురు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. గతంలో శివాలయం వద్ద నిర్మించుకుంటే వాటిని తొలగించి వేరే చోట తమకు స్థలం ఇప్పిస్తామని అధికారులు మాట ఇచ్చి మరిచారని, ఇప్పుడు తమ నిర్మాణాలు కూల్చి వేయడంతో తమకు నిలువ నీడ లేకుండా పోయిందని వాపోయారు. ఇంటి నిర్మాణాల కోసం తమకు స్థలం కేటాయించాలని కోరుతూ తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Nagarjuna Yadav Arrest: వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్..సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు..రంగంలోకి TG పోలీస్!

Nallapadu Rural, Andhra Pradesh:YCP Nagarjuna Yadav Arrest: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్టు అయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నల్లపాడు సమీపంలోని ఆయన నివాసంలో తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే ఓ టీవీ ఛానల్‌లో వైసీపీ అధికార ప్రతినిధి అయిన నాగార్జున యాదవ్.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణ సీఎం ఓ డెలివరీ బాయ్ అని.. ఎమ్మెల్యేకు కూడా పనికిరాని వాడ్ని డెలివరీ బాయ్‌తో పోలిస్తే జొమాటో డెలివరీ బాయ్‌కు అవమానం అని సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
0
0
Report

Nagarjuna Yadav Arrest: సీఎం రేవంత్‌పై లైవ్ డిబెట్‌లో అనుచిత వ్యాఖ్యలు..వైసీపీ నేతను అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు!

Nallapadu Rural, Andhra Pradesh:

YCP Nagarjuna Yadav Arrest: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్టు అయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నల్లపాడు సమీపంలోని ఆయన నివాసంలో తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే ఓ టీవీ ఛానల్‌లో వైసీపీ అధికార ప్రతినిధి అయిన నాగార్జున యాదవ్.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణ సీఎం ఓ డెలివరీ బాయ్ అని.. ఎమ్మెల్యేకు కూడా పనికిరాని వాడ్ని డెలివరీ బాయ్‌తో పోలిస్తే జొమాటో డెలివరీ బాయ్‌కు అవమానం అని సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

నోటీసులు లేకుండానే అరెస్ట్?
వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్ తీవ్ర ఉత్కంఠ రేపింది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు ఆయనను నివాసం నుండి తీసుకువెళ్లారని అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తాము తెలంగాణ పోలీసులమంటూ కుటుంబ సభ్యులకు తెలిపిన సిబ్బంది.. ఈ అరెస్టుకు సంబంధించిన సమాచారాన్ని స్థానిక నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు అందిస్తామని చెప్పారు. అయితే ముందస్తు సమాచారం లేకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వివాదానికి కారణమైన 'లైవ్ డిబేట్'..
ఇటీవల ఒక ప్రముఖ టీవీ ఛానెల్ నిర్వహించిన లైవ్ డిబేట్‌లో వైసీపీ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి బాధ్యతలను వహిస్తున్న నాగార్జున యాదవ్.. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యక్తిగత దూషణలే ఈ అరెస్టుకు దారితీశాయి. డిబేట్‌లో నాగార్జున యాదవ్ మాట్లాడుతూ.. "సీఎం పదవిలో ఉన్న రేవంత్ రెడ్డిని అత్యంత చులకనగా చేస్తూ.. ఒక 'జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్'తో పోల్చాడు. రేవంత్ రెడ్డికి ఒక ప్రభుత్వ జీవో(GO) చదవడం కూడా రాదని, కనీసం ఎమ్మెల్యేగా గెలవడానికి కూడా ఆయన పనికిరాడంటూ ఏకవచనంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

న్యూస్ ప్రజెంటర్ వారించినప్పటికీ వెనక్కి తగ్గని నాగార్జున యాదవ్.. తాను రేవంత్‌ను డెలివరీ బాయ్స్‌తో పోల్చడం ద్వారా ఆ డెలివరీ బాయ్స్‌ను అవమానించినట్లయిందంటూ వ్యంగ్యంగా వారికి క్షమాపణలు కూడా చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. దాంతో తెలంగాణలో ఆయనపై కేసులు నమోదయ్యాయి.

నెట్టింట భిన్నమైన చర్చ..
వైసీపీ నేత అరెస్టుపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని లైవ్ డిబేట్లలో ఇంత దారుణంగా కించపరచడం తగదని కొందరు అంటుంటే.. గతంలో వైఎస్ జగన్‌పై జరిగిన విమర్శలను, గతంలో కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి చేసిన పాత వ్యాఖ్యలను మరికొందరు గుర్తుచేస్తున్నారు. ఏదేమైనా, ఇటీవల కాలంలో నేతల మధ్య రాజకీయ విమర్శలు దాటి వ్యక్తిగత దూషణలు హద్దులు మీరుతున్నాయని, వాక్ స్వాతంత్య్రం పేరుతో సీఎం స్థానంలో ఉన్నవారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికే ముప్పని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: "అమరావతి పేరిట రైతులపై ప్రభుత్వ రాక్షసకాండ" కూటమి ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆగ్రహం!

ALso Read; రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ? ఫ్యాన్స్‌తో భారీ ప్లానింగ్..ముహూర్తం కూడా ఫిక

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

పెళ్లికి లేదా టూర్‌కు ప్రత్యేక రైలు కోచ్‌ కావాలా?బుక్ చేయడం ఎలా? ఖర్చు ఎంతవుతుంది?

Hyderabad, Telangana:

Indian Railways: భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు వేల సంఖ్యలో అందుబాటులో ఉన్న రైళ్ల ద్వారా ప్రయాణిస్తుంటారు. సుదీర్ఘ ప్రయాణాలకు రైలు అత్యంత వేగవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయం కావడంతో చాలామంది దీనికే ప్రాధాన్యత ఇస్తారు. అయితే, భారతీయ రైల్వేలో ప్రయాణికులకు ప్రత్యేక కోచ్ లేదా పూర్తి రైలును బుక్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. దీనిని ఫుల్ టారిఫ్ రేట్ (FTR) పద్ధతిలో అద్దెకు తీసుకోవచ్చు. ఈ బుకింగ్ కోసం ప్రయాణానికి 30 రోజుల నుండి ఆరు నెలల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. ఒక కోచ్ కోసం రూ. 50 వేలు లేదా పూర్తి రైలు కోసం రూ. 9 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సదుపాయాన్ని ఆన్‌లైన్‌లో లేదా నేరుగా స్టేషన్‌కు వెళ్లి పొందవచ్చు.

సాధారణంగా గ్రూప్ బుకింగ్ అంటే విమానాల్లో మాత్రమే సాధ్యం అనుకుంటారు.. కానీ రైళ్లలో కూడా ఈ సదుపాయం ఉంది. మీరు ఏదైనా టూర్ లేదా పెళ్లి వేడుకల కోసం వెళ్తున్నట్లయితే, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి హాయిగా ఎంజాయ్ చేస్తూ ఒక ట్రైన్ కోచ్ లేదా పూర్తి రైలును బుక్ చేసుకోవచ్చు. సౌత్ సెంట్రల్ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్యామిలీ వెకేషన్లు, పెళ్లిళ్లు లేదా ఆధ్యాత్మిక యాత్రల కోసం గ్రూప్‌గా వెళ్లేవారు పూర్తి రైలును లేదా ఒక కోచ్‌ను బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది.

అయితే, FTR అమౌంట్ డిపాజిట్ చేస్తే కోచ్ లభించడం ఖాయం అని చెప్పలేము.. కోచ్ అందుబాటులో ఉంటేనే మంజూరు చేస్తారు. రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో లేదా హై-డిమాండ్ ప్రాంతాల్లో ఇది కొంచెం కష్టతరం కావచ్చు. ఇప్పటికే వెస్ట్రన్ రైల్వే వంటి ప్రాంతాల్లో (ముంబై సెంట్రల్, అహ్మదాబాద్ వంటి చోట్ల) ఈ FTR బుకింగ్ సదుపాయం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.

ఈ FTR బుకింగ్‌లో మీకు కోచ్ కావాలా? లేక పూర్తి రైలు కావాలా? అనేది అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఎంచుకోవచ్చు. అక్కడ మీ ప్రయాణ వివరాలైన ప్రారంభ స్టేషన్, గమ్యస్థానం, తేదీ, కోచ్ టైప్ ,రూట్ వంటి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలి. వివరాలు సమర్పించిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నంబర్, రిజిస్ట్రేషన్ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అమౌంట్ చెల్లించడానికి 6 రోజుల సమయం ఉంటుంది. ఒకవేళ ఆ లోపు చెల్లించకపోతే రిఫరెన్స్ నంబర్ రద్దవుతుంది.

మీరు ట్రైన్ కోచ్ బుక్ చేయాలనుకుంటే, మీ చీఫ్ బుకింగ్ సూపర్వైజర్ లేదా స్టేషన్ మాస్టర్ వద్దకు వెళ్లి ప్రయాణ వివరాలతో కూడిన దరఖాస్తును సమర్పించాలి. అక్కడ మీకు ఒక రిఫరెన్స్ నంబర్, స్లిప్ అందిస్తారు. డబ్బులు చెల్లించిన తర్వాత మీకు FTR స్లిప్ లభిస్తుంది. మరొక్కసారి గుర్తుంచుకోండి.. కోచ్ లేదా రైలును బుక్ చేయాలంటే కనీసం 30 రోజుల ముందు నుండి ఆరు నెలల ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. పెళ్లిళ్లు, ట్రిప్స్ లేదా ఆధ్యాత్మిక యాత్రల కోసం ఈ సౌకర్యం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. FTR స్పెషల్ ట్రైన్ ద్వారా మీరు 24 కోచ్ల వరకు బుక్ చేసుకోవచ్చు, అయితే ఇందులో కనీసం రెండు SLR కోచ్‌లు ఉండటం తప్పనిసరి.

Read more:​ రైలులో ‘హనీమూన్ కోచ్’ వివాదం.. టీటీఈ సస్పెండ్, ఉన్నత స్థాయి విచారణకు ఆదేశిస్తూ రైల్వే సంచలన నిర్ణయం!

Read more:​ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రైల్వేలో 4,098 టెక్నికల్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

కోచ్ బుకింగ్ వివరాల ప్రకారం.. ఏడు రోజుల టూర్ కోసం ఒక కోచ్‌కు రూ. 50,000 చెల్లించాలి. ఒకవేళ ఏడు రోజులు మించితే, ప్రతి అదనపు రోజుకు ఒక కోచ్‌కు రూ. 10,000 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి రైలును బుక్ చేసుకుంటే, రెండు SLR కోచ్లతో కలిపి మొత్తం 18 కోచ్‌లకు ఏడు రోజుల కోసం రూ. 9 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. ఒకవేళ మీరు బుకింగ్‌ను క్యాన్సిల్ చేయాలనుకుంటే, రైల్వే వారు మాన్యువల్ సిస్టమ్ ద్వారా రిఫండ్ ప్రక్రియను చేపడతారు. చీఫ్ కమర్షియల్ మేనేజర్ మీ డబ్బును తిరిగి చెల్లిస్తారు. అయితే, FTR నిబంధనల ప్రకారం కొన్ని ఛార్జీలు మినహాయించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని మీకు అందిస్తారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Indian Vessel Ship Attacked: మరోసారి హద్దుదాటిన ఇరాన్..హోర్ముజ్ జలసంధిలో భారత నౌకపై దాడి..ఒకరు గల్లంతు, 10 మంది సురక్షితం!

Indian Vessel Ship Attacked By Iran: అమెరికా - ఇరాన్ ఉద్రిక్తల మధ్య హోర్మూజ్ జలసంధిలో మరోసారి సందిగ్ధత ఏర్పడింది. ఈ క్రమంలో జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించగా.. అలాంటి ఆంక్షలేవి లేవని అమెరికా చెబుతోంది. ఈ గందరగోళం మధ్య ఒమన్ తీరంలోని భారత వాణిజ్య నౌకపై మరోసారి ఇరాన్ సైన్యం దాడికి తెగబడింది. ఈ సంఘటన ఒమన్‌కు తూర్పున సుమారు 17 కిలోమీటర్ల దూరంలో జరిగినట్లు అధికారులు నిర్ధారిస్తున్నారు. ఈ ప్రమాదంలో 10 మంది సిబ్బందిని కాపాడగా.. ఒకరు మరణించినట్లు అధికారులు తెలిపారు. 

జాతీయ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. దెబ్బతిన్న నౌక సిబ్బంది నౌకను విడిచిపెట్టారని, వారిని లైఫ్‌బోట్ ద్వారా రక్షించారని యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) ఏజెన్సీ ధృవీకరించింది. నౌక తీవ్రంగా దెబ్బతినడంతో అది తన ప్రయాణాన్ని కొనసాగించలేని స్థితిలో ఉందని, ఒక పౌర సిబ్బంది ఆచూకీ తెలియరాలేదని యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది.

ఈ దాడికి ఇరాన్ దళాలే కారణమని యునైటెడ్ స్టేట్స్ ఆరోపించింది. ఈ సంఘటన క్షిపణి, డ్రోన్ కేంద్రాలు, నౌకాదళ ఆస్తులు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లతో సహా సుమారు 140 ఇరాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, అమెరికా ప్రతీకార వైమానిక దాడుల పరంపరకు దారితీసింది. ఈ ఉద్రిక్తత ఆ ప్రాంతాన్ని మరింత అస్థిరపరిచి, వాణిజ్య నౌకా మార్గాల భద్రతపై ఆందోళనలను పెంచింది.

విదేశీ జోక్యం ఆగిపోయే వరకు ఏ నౌకనూ ఈ జలమార్గం గుండా ప్రయాణించడానికి అనుమతించబోమని పేర్కొంటూ, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అనధికార మార్గాల ద్వారా జలసంధిని దాటడానికి ప్రయత్నిస్తున్న ఒక నౌకపై IRGC హెచ్చరిక కాల్పులు జరిపిందని, ఆ తర్వాతే మూసివేత ప్రకటన వెలువడిందని ఓ జాతీయ వార్తాసంస్థ ప్రముఖంగా పేర్కొంది. అమెరికా నుండి ఎలాంటి ప్రతీకార చర్యలకైనా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని IRGC హెచ్చరించింది.

పౌర నావికులను మరియు వాణిజ్య నౌకలను బెదిరించే ఇరాన్ సామర్థ్యాన్ని అమెరికా బలహీనపరుస్తూనే ఉంటుందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ ఇరాన్‌ను హెచ్చరించారు. హోర్ముజ్ జలసంధి గుండా సురక్షిత ప్రయాణానికి హామీ ఇవ్వాలని, పౌర నౌకలపై దాడులకు దూరంగా ఉండాలని అమెరికా ఇరాన్‌ను డిమాండ్ చేసింది. మరిన్ని వివరాల ప్రకారం, ట్రంప్ ప్రభుత్వం తన వాక్చాతుర్యాన్ని తీవ్రతరం చేసిందని, ఎలాంటి బెదిరింపులకైనా బలప్రయోగంతో ప్రతిస్పందిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారని తెలిసింది.

సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నాలలో భాగంగా మస్కట్‌లో ఇరాన్, ఒమన్ అధికారుల మధ్య సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలలో హోర్ముజ్ జలసంధిలో వేర్వేరు మార్గాల ద్వారా నౌకా రవాణాను నిర్వహించే ప్రతిపాదనలపై చర్చించారు. దక్షిణ మార్గం ఒమన్ జలాల్లో స్వేచ్ఛా నౌకాయానానికి అనుమతిస్తుందని, అయితే ఉత్తర మార్గానికి ఇరాన్ ముందస్తు అనుమతి అవసరమని విశ్లేషణలో తేలింది.

హోర్ముజ్ జలసంధిలో నౌకా రవాణా కార్యకలాపాలు గణనీయంగా మందగించాయి. నౌకలు ఇరాన్ నియంత్రిత మార్గాలను అనుసరించడం లేదా పట్టుబడకుండా ఉండేందుకు ట్రాన్స్‌పాండర్‌లను ఆపివేయడంతో, ట్యాంకర్ల రాకపోకలు రోజుకు సగటున 33 నౌకల నుండి 13కి పడిపోయాయి. వివరాలు వెల్లడవుతున్న కొద్దీ, ప్రపంచ చమురు, ద్రవీకృత సహజ వాయువు రవాణాకు ఈ జలసంధి ఒక కీలక మార్గంగా ఉంది. ఇది ప్రపంచ సరఫరాలో సుమారు 20% వాటాను కలిగి ఉంది.

Also Read: Vietnam Boat Accident: వియత్నాంలో ఘోర ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి..ఇద్దరు తెలుగోళ్లు!

Also Read: "నా తండ్రి మరణానికి ప్రతికారం తీర్చుకుంటా"..ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ శపథం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Vijayawada Fire Accident: విజయవాడ భారీ అగ్నిప్రమాదం..ఏడు బస్సులు పూర్తిగా దగ్ధం..రూ.కోట్ల ఆస్తి బూడిద!

Kanuru, Andhra Pradesh:

Vijayawada Bus Fire Accident: విజయవాడలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన ఆటోనగర్‌లో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక మెకానిక్ షెడ్డులో రిపేర్ కోసం నిలిపి ఉంచిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షణాల వ్యవధిలోనే మంటలు పక్కపక్కనే ఉన్న ఇతర వాహనాలకు వ్యాపించడంతో, మొత్తం ఏడు లగ్జరీ బస్సులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

ప్రమాదం ఎలా జరిగిదంటే?
సాధారణంగా వీకెండ్ కావడంతో ఆదివారం రాత్రి హైదరాబాద్, ఇతర సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను చిన్న చిన్న మరమ్మతుల కోసం ఆటోనగర్‌లోని షెడ్డుకు తీసుకువచ్చారు. ఒక బస్సుకు మెకానిక్ పని చేస్తుండగా అకస్మాత్తుగా అందులోంచి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఆ మంటలు ఉధృతంగా మారి, పక్కనే పార్క్ చేసి ఉన్న మిగతా ఆరు బస్సులను కూడా దహించివేశాయి.

ఎగసిపడిన దట్టమైన పొగలు..
ప్రమాద స్థలం నుండి దట్టమైన నల్లటి పొగలు, పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా కాసేపు ఉత్కంఠ నెలకొంది. చుట్టుపక్కల వందలాది ఇతర వాహనాలు కూడా నిలిపి ఉంచడంతో, మంటలు వాటికి కూడా వ్యాపిస్తాయేమోనని స్థానికులు, గ్యారేజ్ కార్మికులు భయాందోళనతో పరుగులు తీశారు.

రంగంలోకి మూడు ఫైర్ ఇంజన్లు
స్థానికులు తక్షణమే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే మూడు ఫైర్ ఇంజన్లు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఫైర్‌ఫైటర్లు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, అగ్నిమాపక సిబ్బంది వచ్చే సమయానికే ఏడు బస్సులు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి.

తప్పిన ప్రాణనష్టం..
ఈ ఘోర ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినప్పటికీ, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదు. మరమ్మతులు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నాయా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Also REad: రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ? ఫ్యాన్స్‌తో భారీ ప్లానింగ్..ముహూర్తం కూడా ఫిక

Also Read; 'అయ్యగారే నంబర్ వన్' అఖిల్ ఫ్యాన్స్ ఊహించని సర్‌ప్రైజ్..ఏ హీరో ఇలా చేయడేమో!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Vemulawada: CM రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చల్మెడ ఫైర్‌..

Vemulawada, Telangana:

Chalmeda Laxmi Narasimha Rao: అవగాహన లోపంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగాన్ని ఘోరంగా మోసం చేస్తోందని.. రైతులకు సాగునీరు అందించడంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని BRS పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో నిర్వహించిన BRS పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

KTR, హరీష్ రావులపై సీఎం వ్యాఖ్యలపై ఆగ్రహం..
తెలంగాణలో సాగునీటి నిర్వహణను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని చల్మెడ విమర్శించారు.. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై CM రేవంత్ రెడ్డి తన హోదాను మరచి అనవసరమైన.. అనుచితమైన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. రైతుల పక్షాన నిలబడి నీళ్లు అడుగుతున్న BRS నేతలపై కక్ష పెంచుకొని.. పంతాల కోసం రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బందులపాలు చేయడం దుర్మార్గమన్నారు..

రైతులకు సాగునీరు ఎప్పుడు అందిస్తారని నిన్నటి ప్రెస్ మీట్‌లో ఓ విలేఖరి ప్రశ్నిస్తే.. కేటీఆర్, హరీష్ రావుల రక్తంతో పంటలను తడుపుతానని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి సమాధానం ఇవ్వడం అత్యంత శోచనీయమని చల్మెడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. రైతుల పొలాలకు కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు విడుదల చేసి ఆదుకోవాలని తాము డిమాండ్ చేస్తుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం తనకు ఇష్టమచ్చిన్నట్లు మాట్లాడుతున్నారని చల్మెడ ఆగ్రహం వ్యక్తం చేశారు.. రైతులకు నీళ్లివ్వమంటే మమ్మల్ని కోసి.. మా రక్తాన్ని పంటలపై చల్లుతానని అనడం ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషేనా? అని ఆయన ప్రశ్నించారు. ఈ తరహా వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతున్నాయని విమర్శించారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

కక్ష సాధింపులు మానుకోవాలని డిమాండ్..
ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని చల్మెడ లక్ష్మీ నరసింహారావు డిమాండ్ చేశారు.. రాజకీయాలను పక్కన పెట్టి.. ఎండిపోతున్న పంట పొలాలను రక్షించడానికి తక్షణమే సాగునీరు విడుదల చేయాలని స్పష్టం చేశారు.. రైతుల పొట్ట కొడితే వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.. ఈ సమావేశంలో స్థానిక BRS నాయకులతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Janaki Rejected Padma Award: పద్మభూషణ్ అవార్డును తిరస్కరించిన గాయని జానకమ్మ..కేంద్రప్రభుత్వ పురస్కారం వద్దని ఎందుకు చెప్పారంటే?

Hyderabad, Telangana:

Singer Janaki Rejected Padma Award: దాదాపు ఏడు దశాబ్దాల పాటు తన గానామృతంతో కోట్లాది మంది శ్రోతలను ఓలలాడించిన దక్షిణాది గానకోకిల ఎస్.జానకి. ఆమె కేవలం అద్భుతమైన గాయని మాత్రమే కాదు, ఆత్మగౌరవం ఉన్న గొప్ప కళాకారిణి. తాజాగా గుండెపోటుతో ఆమె మన లోకాన్ని వీడారు. ఆమె లేని లోటు సంగీత ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టివేసింది. 

అయితే 2013లో భారత ప్రభుత్వం ఆమెకు 'పద్మభూషణ్' పురస్కారాన్ని ప్రకటించినప్పుడు, ఆమె దానిని సున్నితంగా తిరస్కరించి దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించారు. ఆమె పురస్కారాన్ని ఎందుకు తిరస్కరించాల్సి వచ్చింది? ఆ రోజు ఆమె కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచిన ప్రశ్నలు ఏమిటి? ఒకసారి గుర్తుచేసుకుందాం...

అవార్డు ఆలస్యమైంది..గౌరవం సరిపోలేదు!
2013 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎస్.జానకిని 'పద్మభూషణ్' పురస్కారానికి ఎంపిక చేసింది. అయితే, ఈ ప్రకటన వచ్చిన వెంటనే ఆమె ఆ అవార్డును స్వీకరించడానికి నిరాకరించారు. ఆ సమయంలో కొన్ని జాతీయ మీడియాతో మాట్లాడిన గాయని జానకి.. తన మనసులోని అసంతృప్తిని, ఆవేదనను నిర్మొహమాటంగా పంచుకున్నారు.

"17 భాషల్లో దాదాపు 40,000 పాటలు పాడాను. 4 జాతీయ అవార్డులతో పాటు ఎన్నో రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్నాను. ఈ సంగీత ప్రపంచంలో 55 ఏళ్లు గడిపిన తర్వాత.. ఇప్పుడు నాకు ఈ గుర్తింపు ఇవ్వడం చాలా తక్కువగా అనిపించింది. నేను దీనికంటే మెరుగైన గౌరవానికి అర్హురాలిని కాదా?" అని ఆమె ప్రశ్నించారు.

నాకు కావాల్సింది 'భారత రత్న'
ప్రభుత్వంపై తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని స్పష్టం చేస్తూనే, తన సుదీర్ఘ సేవా రంగానికి పద్మ అవార్డులు చాలా చిన్నవని జానకి అభిప్రాయపడ్డారు. "ప్రభుత్వం నా కృషిని నిజంగా గుర్తించాలనుకుంటే, నాకు దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమైన 'భారత రత్న' ఇచ్చి ఉండాల్సింది. ఇలాంటి పద్మ పురస్కారాలపై నాకు ఆసక్తి లేదు" అని ఆమె తేల్చి చెప్పారు. కళాకారుల ప్రతిభను గుర్తించడంలో, ముఖ్యంగా దక్షిణాది కళాకారుల పట్ల కేంద్ర ప్రభుత్వం మరికొంత శ్రద్ధ చూపాలని ఆమె ఆకాంక్షించారు.

బ్రతికున్నప్పుడే గుర్తించండి!
అప్పటికి 75 ఏళ్ల వయసులో ఉన్న జానమ్మ, కళాకారుల పట్ల ప్రభుత్వాలు వ్యవహరించే తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "ప్రముఖ గాయని పి.లీల గారికి మరణానంతరం పద్మ పురస్కారం ఇచ్చారు. చనిపోయాక ఇచ్చే అవార్డుల వల్ల ఉపయోగం ఏంటి? కళాకారులు జీవించి ఉన్నప్పుడే వారిని గౌరవించడం మంచిది" అని హితవు పలికారు.

తన అద్భుతమైన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అందుకున్న ఎస్.జానకి, ఈ వ్యాఖ్యలు చేసిన పదమూడేళ్ల తర్వాత కన్నుమూశారు. కళాకారుల గుర్తింపుపై ఆమె ఆనాడు లేవనెత్తిన ఆత్మగౌరవ ప్రశ్న, ఇప్పటికీ భారతీయ చిత్ర పరిశ్రమలో, ప్రభుత్వ అవార్డుల ఎంపిక తీరుపై ఒక సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది.

Also Read: గాయని ఎస్.జానకి చివరి వీడియో..జానకమ్మ పాదాల చెంత సింగర్ సునీత..ఇరువురి మధుర స్మృతులు

Also Read: Singer Janaki: భారతీయ సినీ పరిశ్రమలో విషాదం..లెజండరీ సింగర్ జానకమ్మ కన్నుమూత!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

సెంట్రల్ యూనివర్సిటీ శంకుస్థాపనలో హైడ్రామా.. సభలోకి దూసుకొచ్చిన పాములు.. Video

Hyderabad, Telangana:

Jagtial Central University Video: జగిత్యాల జిల్లాలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న కేంద్ర విశ్వవిద్యాలయం శంకుస్థాపన కార్యక్రమం ఒక్కసారిగా తీవ్ర కలకలానికి దారితీసింది. అత్యంత ఘనంగా.. అధికారిక లాంఛనాలతో ప్రారంభమైన ఈ సభ ప్రాంగణంలోకి అకస్మాత్తుగా పాములు ప్రవేశించడంతో అక్కడ పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. ప్రముఖులు, చాలా మంది ప్రజలు ఉన్న సమయంలో ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా అంతా గందరగోళం ఏర్పడింది.

విశ్వవిద్యాలయ శంకుస్థాపన మహోత్సవానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.. ఈ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ లతో పాటు జిల్లా ఉన్నతాధికారులు హాజరయ్యారు. నేతలు ప్రసంగిస్తున్న సమయంలో.. సభ ప్రాంగణంలో ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా పాములు హంగామా సృష్టించాయి. పచ్చటి పొదల్లోంచి బయటకు వచ్చిన సర్పాలు వేదిక సమీపంలోకి రావడంతో అక్కడ గందరగోళ సరిస్థితులు ఏర్పడ్డాయి..

 



 

భయంతో పరుగులు..
పాములు ప్రత్యక్షం కావడంతో సభా ప్రాంగణంలో ఒక్కసారిగా తీవ్ర గందరగోళ నెలకొంది. కుర్చీల్లో కూర్చున్న స్థానికులు భయంతో  అటుఇటు పరుగులు తీశారు. అప్పటివరకు ప్రశాంతంగా సాగుతున్న సభలో ఏం జరుగుతుందో తెలియక అక్కడే ఉన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే సంజయ్‌తో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా ఇతర అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పాములు ఎటువైపు నుంచి వస్తున్నాయో తెలియక అందరిలోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.

పరిస్థితి చేతులు దాటకుండా అక్కడే విధుల్లో ఉన్న పోలీసులతో పాటు భద్రతా సిబ్బంది తక్షణమే స్పందించారు. లాఠీలతో చాకచక్యంగా వ్యవహరిస్తూ.. అక్కడి దూసుకొచ్చిన పాములను ఎవరికీ హాని కలగకుండా అక్కడి నుంచి సురక్షితంగా బయటకు పంపించి వేశారు. పోలీసులు సకాలంలో స్పందించి ఆ పాములను అడవి వైపు తోలేయడంతో అక్కడున్నవారంత ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

0
0
Report
Advertisement

Rajinikanth Spit: రజనీకాంత్ ముఖంపై ఉమ్మేసిన స్టార్ హీరోయిన్..కల్ట్ క్లాసిక్ చిత్రంలో ఆ నటి ఎవరో తెలుసా?

Hyderabad, Telangana:

Rajinikanth Sridevi Spitting: గ్రామీణ జీవనాన్ని వెండితెరపై అత్యంత సహజంగా ఆవిష్కరించి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న దిగ్గజ దర్శకుడు భారతీరాజా. ఆయన మరణానంతరం ఆయన సృష్టించిన అద్భుత చిత్రాలకు సంబంధించిన ఎన్నో అరుదైన జ్ఞాపకాలు సామాజిక మాధ్యమాల్లో మళ్లీ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, భారతీయ సినిమా రంగంలో ముగ్గురు అగ్ర నటులైన రజనీకాంత్, కమల్ హాసన్, శ్రీదేవి తొలిసారిగా కలిసి నటించిన ఒక క్లాసిక్ సినిమాకు సంబంధించిన ఆసక్తికర సంఘటన ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

ప్రముఖ తమిళ గీత రచయిత వైరాముత్తు ఒక సందర్భంలో పంచుకున్న జ్ఞాపకాల ప్రకారం.. ఆ సినిమాలో రజనీకాంత్, శ్రీదేవిల మధ్య చిత్రీకరించిన ఒక సంచలన సన్నివేశం వెనుక పెద్ద కథే ఉంది.

ఆ సీన్ ఏమిటి? ఎందుకు అంత రచ్చ జరిగింది?
సినిమా కథ ప్రకారం.. ఒక కీలక సన్నివేశంలో రజనీకాంత్ పాత్ర కమల్ హాసన్ పాత్రపై దారుణంగా దాడి చేస్తుంది. అది చూసి తట్టుకోలేకపోయిన కథానాయిక శ్రీదేవి, తీవ్ర ఆగ్రహంతో రజనీకాంత్ ముఖంపై ఉమ్మివేయాలి. దర్శకుడు భారతీరాజాకు ప్రతి సన్నివేశం సహజంగా (రియలిస్టిక్‌గా) ఉండటం ఇష్టం. అందువల్ల ఆ సీన్‌ను కూడా అలాగే తీయాలనుకున్నారు. కానీ, తోటి నటుడి ముఖంపై నిజంగా ఉమ్మివేయడానికి శ్రీదేవి అస్సలు ఒప్పుకోలేదు. తీవ్రంగా సంకోచించింది.

శ్రీదేవి ఇబ్బంది పడుతుండటంతో చిత్రబృందం మొదట సబ్బు నురుగును ఉపయోగించి ఆ సన్నివేశాన్ని చిత్రీకరించాలని చూసింది. కానీ కెమెరాలో అది ఏమాత్రం సహజంగా అనిపించలేదు. దర్శకుడు భారతీరాజా సంతృప్తి చెందలేదు. సీన్ పండకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో, రజనీకాంత్ స్వయంగా శ్రీదేవికి ధైర్యం చెప్పారు.

"ఇది కథకు చాలా అవసరమైన సన్నివేశం. సినిమాలో ఆ ఎమోషన్ పండాలంటే నా ముఖం మీద నిజంగానే ఉమ్మండి, అస్సలు సంకోచించకండి" అని రజనీకాంత్ శ్రీదేవిని ప్రోత్సహించినట్లు వైరాముత్తు పేర్కొన్నారు.

షూటింగ్ స్పాట్ నుండి వెళ్ళిపోయిన శ్రీదేవి
రజనీకాంత్ అంతలా చెప్పినప్పటికీ, తోటి స్టార్ నటుడిని అలా అవమానించడం ఇష్టం లేక శ్రీదేవి ఆ సన్నివేశంలో నటించడానికి నిరాకరించి, షూటింగ్ స్పాట్ నుండి వెళ్ళిపోయారట. దర్శకుడు భారతీరాజా కూడా ఆమెపై ఒత్తిడి తీసుకురావడానికి ఇష్టపడలేదు.

కానీ, రజనీకాంత్ మాత్రం కథలోని తీవ్రతను, ఆ సన్నివేశానికి ఉన్న ప్రాధాన్యతను దర్శకుడికి వివరించి, శ్రీదేవిని ఒప్పించే ప్రయత్నం చేశారు. చివరకు రజనీకాంత్ ఇచ్చిన నమ్మకం, ప్రోత్సాహంతో శ్రీదేవి తిరిగి వచ్చి ఆ సీన్‌లో నటించడానికి అంగీకరించారు.

ఎన్నో సంకోచాలు, చర్చల మధ్య ఎట్టకేలకు ఆ సన్నివేశం చిత్రీకరణ పూర్తయింది. సినిమా విడుదలయ్యాక థియేటర్లలో ఈ సీన్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. భారతీరాజా మార్కు సహజత్వానికి, రజనీకాంత్ నటన పట్ల ఉన్న అంకితభావానికి, శ్రీదేవి పండించిన నటనకు ఈ సన్నివేశం ఒక నిలువెత్తు నిదర్శనంగా ఇప్పటికీ సినీ చరిత్రలో నిలిచిపోయింది.

Also Read: Singer Janaki: భారతీయ సినీ పరిశ్రమలో విషాదం..లెజండరీ సింగర్ జానకమ్మ కన్నుమూత!

Also Read: గాయని ఎస్.జానకి చివరి వీడియో..జానకమ్మ పాదాల చెంత సింగర్ సునీత..ఇరువురి మధుర స్మృతులుa

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Shabad Case: కిరాతకుడు రాజ్‌కుమార్ ఎలా దొరికాడంటే.. ప్రత్యక్ష సాక్షి సంచలన నిజాలు!

Hyderabad, Telangana:

Shabad Case Update: షాబాద్ మండలంలో జరిగిన ఆరుగురి దారుణ హత్యల ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. ఈ మారణహోమానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్‌ను పోలీసులు ఎలా అదుపులోకి తీసుకున్నారనే.. విషయంపై ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. కొత్తూరు మండలం కుమ్మరిగూడెం గ్రామానికి చెందిన బండారు సుధాకర్ అనే వ్యక్తి.. తాను నిందితుడు రాజ్‌కుమార్‌ను ప్రత్యక్షంగా చూశానని వెల్లడించారు.

నిందితుడిని చూసి షాకయ్యాను..
ప్రత్యక్ష సాక్షి బండారు సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్‌లో ఘోరానికి ఒడిగట్టిన తర్వాత నిందితుడు రాజ్‌కుమార్ తప్పించుకునే క్రమంలో కుమ్మరిగూడెం పరిసర ప్రాంతాల్లో తిరిగడని తెలుస్తోంది.. అయితే, తను రోడ్డుపై వెళ్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడని.. అతడే ఆరుగురిని చంపిన కిరాతకుడు రాజ్‌కుమార్ అని తెలిసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడని బండారు సుధాకర్ తెలిపారు.. ఇంత దారుణానికి ఒడిగట్టి కూడా ఎలాంటి భయం లేకుండా తిరుగుతున్న అతడిని చూసి ఏం చేయాలో తెలియలేదని సుధాకర్ పేర్కొన్నారు.

 



క్షణాల వ్యవధిలో చుట్టుముట్టిన పోలీసులు..
తాను నిందితుడిని గమనించిన కొద్దిసేపటికే.. ఊహించని విధంగా పోలీసులు అక్కడకు చేరుకున్నారని సుధాకర్ వివరించారు. చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించిన పోలీసులు.. నిందితుడు రాజ్‌కుమార్‌కు తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా చుట్టుముట్టారని చెప్పారు. నిందితుడి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు క్షణాల వ్యవధిలోనే రంగంలోకి దిగిన్నట్లు తెలుస్తోంది.

రాజ్‌కుమార్ కోలుకునే లోపే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని.. అక్కడి నుంచి వాహనంలో తరలించారని ప్రత్యక్ష సాక్షి తెలిపాడు.. కిరాతకుడు పట్టుబడటంతో కుమ్మరిగూడెం సహా పరిసర గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘోర హత్యల నేపథ్యంలో షాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నిందితుడు రాజ్‌కుమార్‌ను కఠినంగా శిక్షించాలని.. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని స్థానికులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో స్థానిక పోలీస్ అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ఉన్నతాధికారులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

0
0
Report

TTD: అక్టోబర్ నెల శ్రీవారి దర్శన టికెట్లు, వసతి గదుల కోటా విడుదల.. ఏ రోజు ఏ టికెట్లు అంటే?

Hyderabad, Telangana:

TTD October Quota 2026 Released: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆశపడతారు. ఈ నేపథ్యంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రత్యేక దర్శన కోటా టికెట్లను జారీ చేస్తారు. వీటిని ఆన్‌లైన్‌లో ముందుగానే బుక్ చేసుకోవాలి.. తద్వారా మూడు నెలల తర్వాత దర్శనం చేసుకోవచ్చు. ఇందులో ఆర్జిత సేవలు, సహస్రదీపాలంకరణ, రూ.300 ప్రత్యేక దర్శనం, దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక టోకెన్లు కూడా అందుబాటులో ఉంటాయి. అదే రోజు గదుల కోటా కూడా విడుదల చేస్తారు. కాబట్టి, ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటే దర్శన సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. అక్టోబర్ నెల దర్శన కోట వివరాలను TTD ఈరోజు విడుదల చేసింది.

తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీవారి అర్చిత సేవా టికెట్లు, అంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించిన కోటను జూలై 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంచనున్నారు. ఆన్‌లైన్‌లో భక్తులు ఈ సేవలను సులభంగా బుక్ చేసుకోవచ్చు. ఈ సేవా టికెట్ల కోసం ఎలక్ట్రానిక్ లాటరీ (Lucky Dip) ప్రక్రియ జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు కొనసాగుతుంది. భక్తులు తమ ఆధార్ కార్డు, పేరు, ఫోన్ నెంబర్ ,ఈమెయిల్ ఐడి ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. లాటరీలో ఎంపికైన వారు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నిర్ణీత సొమ్ము చెల్లిస్తే వారికి టికెట్లు మంజూరు చేయబడతాయి.

అదేవిధంగా, 2026 జూలై 21వ తేదీన తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లు ఉదయం 10 గంటలకు అందుబాటులోకి వస్తాయి. ఈ సమయంలో భక్తులు సులభంగా బుక్ చేసుకోవచ్చు. వర్చువల్ సేవా కోటా వివరాలను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

జూలై 23వ తేదీన ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, మధ్యాహ్నం 11 గంటలకు శ్రీవారి ట్రస్ట్ దర్శన టికెట్లు విడుదలవుతాయి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి వృద్ధులు, దివ్యాంగులు ,దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లను TTD ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెస్తుంది. ఈ సమయాన టికెట్లు బుక్ చేసుకుంటే వారు తక్కువ సమయంలోనే స్వామివారిని దర్శించుకోవచ్చు.

చాలామంది ఎదురుచూస్తున్న రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు జూలై 24వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదలవుతాయి. తిరుమలలో గదుల కోటా కూడా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి వస్తుంది. శ్రీవారి అర్చిత సేవలు, దర్శన టికెట్లను కేవలం అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని TTD కోరుతోంది. మధ్యవర్తుల మాటలు నమ్మి డబ్బులు చెల్లించవద్దని, ఎవరైనా అలాంటి వారు కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని హెచ్చరించింది.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల విషయానికి వస్తే.. ఈ ఏడాది అధికమాసం కారణంగా రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి తిరుమల పద్మావతి అతిథి గృహంలో ఇటీవల సమావేశం జరిగింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 8వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రోటోకాల్ మార్పులు చేశారు. ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు, అలాగే వృద్ధులు, దివ్యాంగులు మరియు చిన్న పిల్లల దర్శనాలు రద్దు చేయబడ్డాయి. మాడవీధుల్లో గ్యాలరీలు ఏర్పాటు చేయడం మరియు ప్రసాదాల పంపిణీ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

Also Read: తిరుమల నడక మార్గంలో చిరుత పులి కలకలం..

Also Read: తిరుమల భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ 30 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. కారణాలు ఇవే!

అలిపిరి టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీ..
భక్తుల సంఖ్య పెరగడం వల్ల అలిపిరి టోల్ గేట్ వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. భక్తుల రద్దీ కారణంగా ఈరోజు టోల్ గేట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్రంగా మారింది. ముఖ్యంగా శని, ఆదివారాల్లో శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడం వల్ల వాహనాలు బారులు తీరుతున్నాయి. ఘాట్ రోడ్డుపై వాహనాలను విడతల వారీగా అనుమతిస్తూ టీటీడీ సిబ్బంది ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. ఈ ట్రాఫిక్ వల్ల తిరుమలకు చేరుకోవడానికి సాధారణ సమయం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. కావున భక్తులు ఓపికతో వ్యవహరించి, ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని TTD సూచించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

Cobra Video: బీరువా కింద భారీ కోడెనాగు.. వామ్మో.. వీడియో చూడండి..

Hyderabad, Telangana:

 Cobra Video Watch Here: ప్రస్తుతం సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులోనూ ముఖ్యంగా వన్యప్రాణులు, ప్రమాదకరమైన పాములకు సంబంధించిన వీడియోలు, రీల్స్‌ కనిపిస్తే చాలు.. నెటిజన్లు వాటిని చూసేందుకు ఎగబడుతుంటారు. తాజాగా అలాంటి కోవకే చెందిన ఒక కోడెనాగు వీడియో విపరీతంగా హల్ చల్ చేస్తోంది. ఒక ఇంట్లోకి చొరబడిన ఈ భారీ నాగుపాము సృష్టించిన హల్‌చల్ చూస్తే.. ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే.. అయితే, ఈ వీడియోలో నాగుపాము ఎలా కనిపించింది. ఈ వీడియో వైరల్ అవ్వడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బీరువా కింద కాలనాగు..
సాధారణంగా పాములు జనావాసాల్లోకి వస్తే.. చీకటి ప్రదేశాలు లేదా ఇరుకైన సందుల్లో దాక్కుంటూ ఉంటాయి. ఈ ఘటనలో కూడా ఒక ఇంట్లోని బెడ్‌రూమ్‌లోకి చొరబడిన కోడెనాగు.. అక్కడున్న ఒక భారీ బీరువా  కింది భాగంలోకి దూరి దాక్కుంది. ఇంట్లోని వారు గమనించి చూసేసరికి అత్యంత ప్రమాదకరమైన నాగుపాముగా కనిపించింది.. దీంతో వారు స్నేక్‌ క్యాచర్స్‌కి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే స్నేక్ క్యాచర్స్ అక్కడికి చేరుకున్నారు.

అయితే, ఆ పామును సురక్షితంగా పట్టుకోవడానికి వారు ప్రయత్నిస్తుండగా.. ఆ కోడెనాగు ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి గురైన్నట్లు ఈ వీడియోలో మీరు గమనించవచ్చు. బీరువా కింద నుంచే తన భారీ పడగ విప్పి.. బుసలు కొట్టడం ప్రారంభించింది. ఆ విజువల్స్ చూస్తుంటేనే ఆ పాము ఎంతటి ప్రమాదకరమైనదో అర్థమవుతోంది. అలాగే స్నేక్ క్యాచర్ ఆ పామును బయటకు తీసేందుకు స్టిక్ సాయంతో ప్రయత్నించాడు. ఆ సమయంలో ఏమాత్రం తగ్గని ఆ కోడెనాగు.. మెరుపు వేగంతో ముందుకు దూసుకొచ్చి నేరుగా స్నేక్ క్యాచర్‌పైనే దాడి చేసేందుకు ప్రయత్నించింది. 

 
 
 
 
 

నిపుణుడైన ఆ స్నేక్ క్యాచర్ సమయస్ఫూర్తితో వెనక్కి తప్పుకోవడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే ఆ విషసర్పం కాటుకు గురి కావాల్సి వచ్చేది. పాము ఆగ్రహాన్ని చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయంతో అక్కడి నుంచి బయటికి వెళ్లిన్నట్లు కూడా సమాచారం. ఈ మొత్తం ఘటనను ఇంట్లోని వారు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనికి లక్షలాది వ్యూస్, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

0
0
Report

Airtel 200 Recharge: ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్..రూ.200 రీఛార్జ్‌తో అన్‌లిమిటెడ్ కాల్స్, ఇంటర్నెట్..ఉచిత ఓటీటీలు!

Hyderabad, Telangana:

Airtel 200 Recharge Benefits: భారతీయ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రూ.200 విలువైన కొత్త ప్రీపెయిడ్ యాడ్-ఆన్ ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. కేవలం 28 రోజుల చెల్లుబాటుతో 30 జీబీ డేటాను అలాగే ఎంటర్‌టైన్మెంట్ ప్రయోజనాలతో పాటు అన్‌లిమిటెడ్ 5జీ డేటాను అందిస్తుంది. అదనపు డేటా మరియు ప్రీమియం OTT కంటెంట్‌ను పొందాలనుకునే వినియోగదారుల కోసం ఈ ప్యాక్ రూపొందించబడింది.

డేటా యాడ్-ఆన్‌ సదుపాయం..
ఈ యాడ్-ఆన్‌లో 28 రోజుల పాటు చెల్లుబాటు అయ్యే 30 GB హై-స్పీడ్ డేటా ఉంటుంది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. ఎయిర్‌టెల్ అపరిమిత 5G డేటాను కూడా అందిస్తోంది. దీనిని కేవలం 5G నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే, ప్లాన్‌కు సంబంధించిన సాధారణ డేటా కోటాతో సంబంధం లేకుండా అదనంగా ఉపయోగించుకోవచ్చు. రిలయన్స్ జియో ఇటీవల తన రూ.200 'మెగా కంటెంట్ యాడ్-ఆన్'ను 'OTT పాస్'గా మార్చింది. ఇందులో 15 OTT యాప్‌లకు యాక్సెస్, అపరిమిత 5G డేటా, 30GB డేటా లభిస్తాయి.

జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్..
ఈ ప్యాక్ ప్రయోజనాల్లో భాగంగా, వినియోగదారులకు రూ.149 విలువైన 28 రోజుల జియో హాట్‌స్టార్ లభిస్తుంది. దీని ద్వారా మొబైల్ పరికరాలలో లైవ్ స్పోర్ట్స్, సినిమాలు, హాట్ స్టార్ స్పెషల్స్, ఇతర వినోద కంటెంట్‌ను వీక్షించవచ్చు.

ఈ ప్యాక్‌లో 28 రోజుల పాటు 'ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం' (Airtel Xstream Play Premium) సేవలు కూడా ఉన్నాయి. దీని ద్వారా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్లాట్‌ఫారమ్ ద్వారా సోనీ లీవ్, లయన్స్‌గేట్ ప్లే, ఆహా ప్రీమియమ్, చౌపల్, సన్ నెక్ట్స్ వంటి 18కి పేగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయవచ్చు. 

రూ.200 ప్లాన్ వివరాల ప్రకారం.. ఇందులో ఉన్న 30 GB డేటా కోటా పూర్తయిన తర్వాత, అదనపు డేటా వినియోగానికి ఎంబీకి 50 పైసల చొప్పున ఛార్జీలు వర్తిస్తాయి. ఒకే రీఛార్జ్‌తో తమ డేటా పరిమితిని పెంచుకోవాలని, OTT స్ట్రీమింగ్ ఎంపికలను విస్తరించుకోవాలని కోరుకునే ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఈ యాడ్-ఆన్ రూపొందించబడినట్లు కనిపిస్తోంది.

కంపెనీ దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ, ఈ రూ. 200 డేటా ప్యాక్ ఇప్పుడు ఎయిర్‌టెల్ వెబ్‌సైట్, 'ఎయిర్‌టెల్ థాంక్స్' (Airtel Thanks) యాప్‌తో సహా సంస్థ యొక్క డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులోకి వచ్చింది.

Also REad: అమర్‌నాథ్‌లో శివలింగం అదృశ్యం..అయినా తగ్గని భక్తుల తాకిడి..1.71 లక్షల మంది దర్శనం!

Also Read: స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..30 ఏళ్ల నాటి జ్ఞాపకంతో కంటతడి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

జలప్రళయం.. వరదల్లో కొట్టుకొచ్చిన 900 కింగ్ కోబ్రాలు.. వీడియో ఇదే..

Hyderabad, Telangana:

 900 Venomous King Cobras Video Watch: దక్షిణ చైనాను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి.. ప్రవహిస్తుండటంతో వందలాది గ్రామాలు జలమయమయ్యాయి. అయితే, ఈ జలప్రళయం కేవలం వరద నీటిని మాత్రమే కాదు.. ప్రజల ప్రాణాలను గుప్పిట్లో పెట్టే భయంకరమైన విపత్తును కూడా వెంటబెట్టుకొచ్చింది.. ప్రాంతీయంగా ఉన్న ఒక భారీ స్నేక్ ఫార్మ్ వరద ఉధృతికి పూర్తిగా దెబ్బతినడంతో.. అందులోని దాదాపు 900కు పైగా విషసర్పాలు ఒక్కసారిగా నీటితో పాటు బయిటికి వచ్చాయి.

వీధుల్లోకి కోబ్రాలు.. 
ఫార్మ్ నుంచి తప్పించుకున్న వందలాది పాములు వరద నీటితో పాటు సమీపంలోని గ్రామాలు, నివాస ప్రాంతాలతో పాటు వీధుల్లోకి చేరాయి. వీటిలో అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన కింగ్ కోబ్రాలు కూడా ఉండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు, ఎటు వైపు నుంచి ఏ పాము వచ్చి దాడి చేస్తుందో తెలియక జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. వీధులు, ఇళ్ల పైకప్పులు, చెట్ల కొమ్మలపై పాములు దర్శనమిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో జనం ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు.

అధికారుల హెచ్చరిక..
పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉందని.. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని.. వరద నీటిలో అస్సలు నడవకూడదని సూచిస్తున్నారు. ఈ భయానక వాతావరణంలో అప్పుడే విషాదాలు మొదలయ్యాయి. గ్రామంలోకి చొరబడిన ఒక విషసర్పం కాటుకు గురైన ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది.. వరద ఉధృతికి రోడ్లన్నీ పూర్తిగా కొట్టుకుపోవడం, రహదారులు మూసుకుపోవడంతో ఆమెను సకాలంలో ఆస్పత్రికి తరలించడం సాధ్యం కాలేదని అధికారులు వెల్లడించారు. వైద్య సాయం అందకముందే ఆమె మరణించింది. ఈ ఘోరంలో మరికొందరు కూడా పాము కాటుకు గురయ్యారని.. వారిని రక్షించి ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు సమాచారం అందుతోంది.

 
 
 
 
 

రంగంలోకి ప్రత్యేక బృందాలు.. 
ఈ విపత్తును ఎదుర్కొనేందుకు చైనా ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. తప్పించుకున్న 900 పాములను వెతికి పట్టుకునేందుకు వన్యప్రాణి నిపుణులు, ప్రత్యేక శిక్షణ పొందిన స్నేక్ క్యాచర్స్ బృందాలను రంగంలోకి దించారు. పాము కాటు బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో.. సమీపంలోని అన్ని ఆస్పత్రులకు తగినంత  యాంటీ వెనమ్ నిల్వలను అత్యవసరంగా సరఫరా చేశారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

0
0
Report
Advertisement
Advertisement
Back to top