అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపించిన రెవెన్యూ అధికారులు
Bellampalle, Kannal Rural, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ శివారు సర్వే నంబర్ 112లో బీఆర్ఎస్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను మంగళవారం మధ్యాహ్నం 1:30 సమయంలో బెల్లంపల్లి తహసిల్దార్ జ్యోత్స్న ఆదేశాలతో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఆదిలక్ష్మి ,మురళీధర్ లు బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో కూల్చివేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Gold Price Crash: గోల్డ్, సిల్వర్ మార్కెట్ క్రాష్.. బంగారం ధర ఇంకా దిగొస్తుందా? గోల్డ్ కొనుగోలుకు ఇదే సరైన సమయమా?
Hyderabad, Telangana:Gold Price Crash News: గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్లతో ఒక్కసారిగా పతనమయ్యాయి. గడిచిన ఏడు నెలల కాలంలోనే అత్యల్ప స్థాయికి ఇరు లోహాల ధరలు పడిపోవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా జనవరి 30 నుండి మార్కెట్లో ప్రారంభమైన ఈ కరెక్షన్ ట్రెండ్ ప్రస్తుతం కొనసాగుతోంది.
ధరలు భారీగా తగ్గడానికి 3 ప్రధాన కారణాలు
అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న ఈ మూడు ముఖ్య పరిణామాలు బంగారం, వెండి ధరలను క్రిందికి లాగుతున్నాయి.
యూఎస్ ఫెడ్ కఠిన వైఖరి: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను వేగంగా తగ్గిస్తుందని మార్కెట్ ఆశించింది. అయితే, ద్రవ్యోల్బణ భయాల కారణంగా వడ్డీ రేట్లను ఎక్కువ కాలం పాటు అధిక స్థాయిలోనే కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు బాండ్లు వంటి రాబడి ఇచ్చే ఆస్తులకే ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇస్తారు. దీంతో వడ్డీ లేని బంగారంపై డిమాండ్ తగ్గుతుంది.
బలమైన డాలర్ ఇండెక్స్: గ్లోబల్ మార్కెట్లో అమెరికన్ డాలర్ పుంజుకోవడంతో, ఇతర కరెన్సీలు ఉపయోగించే దేశాలకు బంగారం కొనుగోలు భారం పెరిగింది. ఫలితంగా అంతర్జాతీయంగా కొనుగోళ్లు తగ్గాయి.
రిస్క్-ఆన్ సెంటిమెంట్: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంతమేర శాంతించడంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన బంగారం నుండి తమ పెట్టుబడులను లాభాలనిచ్చే షేర్ మార్కెట్ల వైపు మళ్లిస్తున్నారు.
వెండి మార్కెట్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి!
బంగారంతో పోలిస్తే వెండి ధరల్లోనే అత్యధిక క్షీణత నమోదవుతోంది. వెండి కేవలం విలువైన లోహమే కాకుండా పరిశ్రమలలో కూడా ఎక్కువగా వాడుతుండటమే దీనికి కారణం. జనవరిలో నమోదైన గరిష్ట స్థాయి (ఔన్స్కు 121 డాలర్లు)తో పోలిస్తే ప్రస్తుతం వెండి ధర సగానికి పైగా పడిపోయింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ సిల్వర్ ఔన్స్కు 56-57 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది నవంబర్ 2025 తర్వాత అత్యల్ప రికార్డు కావడం గమనార్హం.
ప్రస్తుత ట్రెండ్ ప్రకారం మార్కెట్ మరికొంత కాలం ఒత్తిడిలోనే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ట్రేడర్లు లేదా కొనుగోలుదారులు భావోద్వేగాలకు లోనుకాకుండా, పైన పేర్కొన్న సపోర్ట్, రెసిస్టెన్స్ స్థాయిలను గమనిస్తూ వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.
(గమనిక: ఈ కథనం కేవలం మార్కెట్ సమాచారం, నిపుణుల విశ్లేషణ ఆధారంగా అందించబడింది. దీనిని పెట్టుబడి సలహాగా (Investment Advice) పరిగణించరాదు. మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది కాబట్టి, పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించడం శ్రేయస్కరం. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: ఏనుగు పేడతో ఖరీదైన కాఫీ..ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ కాఫీ ఇది..కప్పు రూ.4,720 మాత్రమే!
Also REad: Jonnagiri Gold Mines: ఏపీలో భారీ బంగారు గని.. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Rains: ద్రోణి ప్రభావం..తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు..
Hyderabad, Telangana:Telangana Rain Alert: నైరుతి రుతుపవనాలు మూగబోయిన వేళ.. వాతావరణ శాఖ మరో ఆసక్తికరమైన వార్త తెలిపింది. రాబోయే 72 గంటల పాటు ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.Krishi Thapanda Apartment: హీరోయిన్ ఇంట్లో బిజినెస్ మ్యాన్ మృతదేహం..షాక్లో సినీ ఇండస్ట్రీ..రంగంలో దిగిన పోలీసులు!
Bengaluru, Karnataka:Krishi Thapanda Apartment News: బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ (రాజరాజేశ్వరి నగర్)లో గల ప్రముఖ కన్నడ నటి కృషి థపండా విలాసవంతమైన 'ఎలిగెంట్స్ అపార్ట్మెంట్' ఫ్లాట్లో 33 ఏళ్ల వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ విషయం కన్నడ చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
ఏం జరిగిందంటే?
మృతుడిని వైశాక్ (33)గా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వైశాక్ బుధవారం రాత్రి నటి అపార్ట్మెంట్కు వచ్చాడు. అయితే, గురువారం ఆయన ఫ్లాట్లో శవమై కనిపించాడు. ఆ సమయంలో ఫ్లాట్లో ఎవరూ లేకపోవడంతో, అతను సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో నటి కృషి థపండా ఇంట్లో లేరని అధికారులు స్పష్టం చేశారు.
సమాచారం అందుకున్న ఆర్ఆర్ నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నివేదిక నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.
మృతుడి వివాదాస్పద నేపథ్యం
పోలీసుల ప్రాథమిక విచారణలో వైశాక్కు సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైశాక్కు తన భార్యతో తీవ్రమైన విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. భార్యతో గొడవల కారణంగానే అతను నటి కృషి థపండా నివాసంలో ఆశ్రయం పొందుతున్నాడని లేదా తరచుగా అక్కడికి వచ్చి వెళ్తుండేవాడని సమాచారం.
వైశాక్కు గతంలో నేర చరిత్ర కూడా ఉందని సమాచాం అందుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త అరవింద్ రెడ్డికి ప్రాణహాని తలపెడతామంటూ బెదిరింపులకు పాల్పడిన కేసులో వైశాక్ గతంలో అరెస్టయ్యాడు. ఈ మేరకు బెంగళూరులోని హెచ్ఏఎల్ (HAL) పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు కూడా నమోదైంది.
రంగంలోకి దిగిన పోలీసులు
ఈ మరణం వెనుక ఉన్న అసలు కారణాలను వెలికితీసేందుకు ఆర్ఆర్ నగర్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రస్తుతానికి ఈ ఘటనపై'అసాధారణ మరణం'గా కేసు నమోదు చేసుకున్నారు.
దర్యాప్తులో భాగంగా నటి కృషి థపండాతో పాటు, మృతుడి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారించనున్నారు. అయితే, కేసు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని, అప్పటివరకు ఎలాంటి ఊహాగానాలను నమ్మవద్దని పోలీస్ అధికారులు ప్రజలను కోరారు.
Also Read: సినిమాలకు శాశ్వతంగా గుడ్బై చెప్పనున్న కాజల్ అగర్వాల్! అసలు గుట్టువిప్పిన హీరోయిన్!
Also Read: "నా బాడీ నా ఇష్టం అంటే.. నా కళ్లు నా ఇష్టం అంటారు".. సునీత సంచలన వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
రూ.కోటి 25 లక్షల ప్రమాద బీమా.. ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్
Hyderabad, Telangana:Telangana Govt Employees: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ ప్రకటన చేసింది. ఉద్యోగ కుటుంబాలకు రూ.కోటి 25 లక్షల ఉచిత ప్రమాద బీమాను ప్రారంభించింది. ఉద్యోగ కుటుంబాల్లో భద్రత, భరోసా కల్పించేందుకు ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ఎక్కడా లేని విధంగా సరికొత్త ఉచిత బీమా పథకాన్ని తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఈ పథకంతో ప్రభుత్వంపై, ఉద్యోగులపై ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడదని.. బ్యాంకులతో మాట్లాడి ఈ భారీ బీమా రక్షణను కల్పిస్తున్నట్లు వివరించారు.
ఉచిత బీమా
హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఉచిత బీమా పథకాన్ని ప్రారంభించిన అనంతరం భట్టి విక్రమార్క కీలక ప్రసంగం చేశారు. ఈ అద్భుతమైన బీమా పథకం ద్వారా సాధారణ ప్రమాదాల్లో మరణిస్తే రూ.కోటి 25 లక్షలు, విమాన ప్రమాదం జరిగితే రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు బీమా పరిహారం అందుతుందని తెలిపారు. 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల ఉద్యోగులకు రూ.10 లక్షల జీవిత బీమా రక్షణ ఉంటుందని చెప్పారు. ప్రమాదవశాత్తూ శాశ్వత సంపూర్ణ వైకల్యం లేదా పాక్షిక వైకల్యం సంభవించినా ఈ పథకం ద్వారా ఉద్యోగులకు ఆర్థిక అండ లభిస్తుందని.. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగులందరికీ కూడా ఉచిత బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు.
ఒక పెద్ద దిక్కుగా
తమ కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ఏదైనా ఆపద వస్తే ఆ కుటుంబం రాత్రికి రాత్రే రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఉద్యోగులు కేవలం జీతగాళ్లు కాదని.. వారి కుటుంబాలకు ఈ ప్రభుత్వం ఒక పెద్ద దిక్కుగా ఉంటుందని నమ్మకం కలిగించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ప్రస్తుత కాలంలో ఇళ్లు, వాహనాలు, పిల్లల చదువుల కోసం ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఈఎంఐలు కడుతున్నారని.. సకాలంలో జీతాలు రాకపోతే వారి అకౌంట్లు బ్యాడ్ అకౌంట్స్గా మారి సిబిల్ స్కోర్ దెబ్బతినేదని వివరించారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల హక్కులను కాపాడాలనే ఉద్దేశంతో ఒకటో తేదీ నాడే జీతాలు ఇచ్చేలా కఠినమైన ప్రణాళికను అమలు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
శాశ్వత పరిష్కారం
ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో కోరుతున్న హెల్త్ కార్డ్ల సమస్యకు తాము శాశ్వత పరిష్కారం చూపిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఒక ప్రత్యేక ట్రస్ట్ ద్వారా ఉద్యోగులందరికీ పూర్తి స్థాయిలో నగదు రహిత వైద్య సేవలు అందించేలా నిర్ణయం తీసుకోవడంతో ఆరోగ్య భద్రత మరింత మెరుగవుతుందని పేర్కొన్నారు. కోటి 15 లక్షల కుటుంబాల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల ఉచిత వైద్యం, ఫీజు రీయింబర్స్మెంట్, రేషన్ కార్డులపై సన్నబియ్యం, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ ద్వారా రూ.1,11,116 ఆర్థిక సాయం వంటి ఎన్నో పథకాలను అందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. సంక్షేమ ఫలాలను లబ్ధిదారులకు చేర్చడంలో డెలివరీ మెకానిజంగా ఉద్యోగులే కీలక పాత్ర పోషిస్తున్నారని.. వారి కుటుంబ సంక్షేమాన్ని ప్రభుత్వం తన బాధ్యతగా తీసుకుందని భట్టి విక్రమార్క తెలిపారు.
పీఆర్సీపై బిగ్ అప్డేట్.. ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి తీపి కబురు
Baddipadaga, Telangana:Telangana Pay Revision Commission: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. ఉద్యోగ వర్గాలు కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న వేతన సవరణ సంఘం (పీఆర్సీ)పై బిగ్ అప్డేట్ వచ్చింది. ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీపై తెలంగాణ సీఎం కీలక ప్రకటన చేశారు. సాధ్యమైనంత త్వరగా పీఆర్సీని ఇస్తామని ప్రకటన చేశారు. ఎప్పుడో ఇవ్వాల్సిన పీఆర్సీ వాయిదా పడుతుండగా.. ఈ క్రమంలో తాజాగా అప్డేట్ రావడంతో ఉద్యోగ వర్గాలు ఆశాభావంలో ఉన్నారు.
ఆరోగ్య బీమా
ఉద్యోగులకు ఆరోగ్య బీమా పథకం ప్రారంభం సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'తెలంగాణ అంటే నమ్మకం.. ఉద్యోగులుగా ఈ ప్రభుత్వంలో బాధ్యత తీసుకోవడం అంటే భద్రత. ప్రమాదవశాత్తు మరణించిన 45 మంది సింగరేణి కార్మికుల కుటుంబాలకు రూ.కోటి బీమా సొమ్ము అందించాం. వారి మాదిరే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బీమాను అమలు చేస్తున్నాం' అని తెలంగాణ సీఎం తెలిపారు.
నేను గుంపు మేస్త్రీనే
'ప్రమాద బీమా ఉద్యోగుల కుటుంబానికి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాను ఇస్తుంది. ఉద్యోగుల భద్రత యజమానిదే… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మీకు యజమాని. అందుకే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా అందిచేందుకు ఇవాళ బ్యాంకర్లతో ఒప్పందం కుదుర్చుకున్నాం' అని రేవంత్ రెడ్డి వివరించారు. 'కొందరు నన్ను గుంపుమేస్త్రీ అని అవహేళన చేస్తుంటారు. ఎవరు ఎలా మాట్లాడినా.. నేను గుంపు మేస్త్రీనే.. ఈ గుంపంతా నాదే. ఈ గుంపే నా బలం.. ఈ గుంపే నా ప్రతిష్ఠ. ఈ గుంపే పేదలకు ప్రభుత్వానికి మధ్య వారధులు' అని చెప్పుకొచ్చారు.
నెంబర్ వన్గా తీర్చిదిద్దుదాం
'నా హోదా, పదవి మారినా నేను మీకు ఎప్పటికీ రేవంతన్ననే. మన మధ్య ఉన్నది అన్నదమ్ముల అనుబంధమే. మనందరం కలిసి తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దుదాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మొదటి తారీఖున ఉద్యోగులకు జీతాలు అందిస్తున్నామని చెప్పారు. చెప్పిన మాట ప్రకారం విడతల వారీగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిధులు విడుదల చేస్తున్నట్లు వివరించారు. మీకు సమస్యలుంటే మా దృష్టికి తీసుకురండి.. చర్చించుకుని పరిష్కరించుకుందామని ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం పలికారు.
ఆదాయం పెంచండి
'రోజుకో గంట ఎక్కువ పనిచేయండి.. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచండి. పెంచిన ఆదాయాన్ని మీ అవసరాలను తీర్చడానికి ఉపయోగిస్తాం' అని ఉద్యోగులకు తెలంగాణ సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే అది ప్రభుత్వ ఉద్యోగుల చేతుల్లోనే ఉందని ప్రకటించారు. 30 నెలలుగా తాను ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా తాను పదే పదే ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిపారు.
ఎక్కువ పని చేయండి
'నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే రోజుకు ఒక గంట ఎక్కువ పని చేయండి. మార్పు తీసుకొద్దాం.. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దుదాం. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడి పెట్టుబడులను ఆకర్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్గా ఎదగాలంటే మీ అందరి సహకారం అవసరం' అని రేవంత్ రెడ్డి తెలిపారు.
తొమ్మిదేళ్ల ప్రేమ బంధాన్ని వివాహంగా మార్చుకున్న జబర్దస్త్ కమెడియన్ ఫైమా
Dichpally, Telangana:Faima Marriage: బుల్లితెరపై ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న జబర్దస్త్ ఫైమా వివాహం చేసుకుంది. పటాస్, జబర్దస్త్, బిగ్బాస్ షోలలో మెరిసిన ఫైమా ఎట్టకేలకు తన వ్యక్తిగత జీవితంలో కీలక ముందడుగు వేసింది. ఎలాంటి హడావుడి.. ఆడంబరం లేకుండా సాదాసీదాగా ఆమె ఓ ప్రముఖ ఆలయంలో మూడు మూళ్లు వేయించుకుంది. కొన్నేళ్లుగా ప్రేమిస్తున్న తన ప్రియుడితో కొత్త జీవితాన్ని ప్రారంభించింది.
కొన్నేళ్లుగా ప్రవీణ్ నాయక్ అనే యువకుడితో ఫైమా ప్రేమాయణం కొనసాగిస్తోంది. అతడితో సహజీవనం కూడా చేస్తున్నట్లు అప్పట్లో పుకార్లు వచ్చాయి. ఎన్ని రూమర్లు వచ్చినా వాటికి సమాధానం చెప్పకుండా ఇప్పుడు ఏకంగా వివాహం చేసుకుంది. మొదట రిజస్టర్ కార్యాలయంలో చాలా సింపుల్గా ఫైమా, ప్రవీణ్తో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఈ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తర్వాత హల్దీ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని ప్రముఖ ఖిల్లా రామాలయంలో గురువారం సాదాసీదాగా ఫైమా వివాహ వేడుక జరిగింది. తన ప్రియుడు ప్రవీణ్ నాయక్తో ఫైమా మూడు ముళ్లు వేయించుకుంది. తాళి కట్టించుకునే సమయంలో ఫైమా కన్నీటి పర్యంతమైంది. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆమె చివరికి విజయవంతంగా ప్రేమించిన యువకుడు ప్రవీణ్తో వివాహం చేసుకోవడంతో ఫైమా గుర్తుచేసుకున్నట్టు తెలుస్తోంది. తొమ్మిదేళ్ల పాటు వీరి ప్రేమాయణం కొనసాగిందని సమాచారం. జీవితంలో ప్రేమ, ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నట్లు గతంలో ఫైమా వాపోయింది.
బుల్లితెరపై ఓ టీవీ చానల్లో కామెడీ షో పటాస్తో ఫైమా వెలుగులోకి వచ్చింది. తనదైన కామెడీతో.. టైమింగ్తో నవ్వులు పూయించిన ఫైమా అనంతరం ఆమె జీవితం తిరిగింది. అనంతరం జబర్దస్త్ షోలోకి అడుగుపెట్టి దాదాపు అందరి టీమ్లలో ఫైమా పనిచేశారు. సీనియర్లకు దీటుగా కామెడీ చేస్తూ ఫైమా తనదైన ప్రత్యేకతను సాధించుకుంది. బుల్లెట్ భాస్కర్ టీమ్లో ఫైమా ప్రధాన కమెడియన్గా కొనసాగారు.
Venu Swamy: అందమైన అమ్మాయిల మొగుళ్లు తొందరగా చనిపోతారు.!. రచ్చగా మారిన వేణు స్వామి కామెంట్స్...
Hyderabad, Telangana:Venu swamy controversy comments on marriages: సెలబ్రీటీల జ్యోతిష్యుడు వేణు స్వామి మరో సారి వార్తలలో నిలిచారు. ఇప్పటికే నాగార్జున కుటుంబం, ప్రభాస్ పెళ్లి, సమంతపై రచ్చ, రష్మికమందన్నలపై వేణు స్వామి ఏ రెంజ్ లో కాంట్రవర్సీ చేశారో అందరికి తెలిసిందే. ఇక కొన్ని నెలల క్రితం నటి ప్రగతి పతకాలు గెల్చిన కూడా తన క్రెడిట్ అంటూ మాట్లాడి వివాదంలో ఇరుక్కున్నారు. వేణుస్వామి వివాదం తెలంగాణ మహిళ కమిషన్ వరకు సైతం వెళ్లిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కాంట్రవర్సీ జ్యోతిష్యాల జోలికి పోనని కూడా చెప్పారు. కానీ మరల రోటీన్ గా వేణు స్వామిఏదో ఒక కాంట్రవర్సీలతో నిత్యం వార్తలలో ఉంటున్నారు. తాజాగా.. ఆయన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారంగా మారాయి.
వేణుస్వామి మాట్లాడుతూ.. అందమైన అమ్మాయిల్ని భార్యలుగా చేసుకున్న వారు తొందరగా చచ్చిపోతారని బాంబు పేల్చారు. వీరిలో చాలా మంది తొందరగా విడిపోవడం లేదా డైవర్స్ లు తీసుకొవడం జరుగుతుందన్నారు. అంతే కాకుండా అమ్మాయిలు ఎక్కువగా తులసీ మొక్కల లాంటి మంచి వారిని కాదని గంజాయి మొక్కల లాంటి చెడు గుణాల్ని ఉన్నవారిని ఎక్కువగా ఇష్టపడుతారని అన్నారు.
ఇది కలియుగం అని అందుకు దీని ప్రభావంతో అమ్మాయిలు ఎక్కువగా చెడు గుణాలు ఉన్నవారి పట్ల ఎక్కువగా అట్రాక్ట్ అవుతారని మాట్లాడారు. కొంత మంది పెళ్లిళ్ల సమయంలో జాతకాలు కలవక పోతే పేర్లు మార్చుకుని పెళ్లిళ్లు చేసుకుంటున్నారని దీని వల్ల కూడా చాలా దోషాలు వస్తాయని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Read more: Ketan Agarwal Death Case: పూణె బిజినెస్ మెన్ ఘటన.. కాబోయే భర్తను చంపిన కిల్లర్ లేడికి చెప్పుల దండ.. వీడియో వైరల్..
దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అమ్మాయిల్ని టార్గెట్ చేసుకుని వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని ఏకీపారేస్తున్నారు. అందరు ఒకలా ఉండరని ఈవ్యాఖ్యలు మహిళల్ని కించపర్చే విధంగా ఉన్నాయని నెటిజన్లు వేణుస్వామిని మరోసారి ట్రోల్స్ చేస్తున్నారు.
Jagtial: టీచర్గా మారిన జగిత్యాల కలెక్టర్.. విద్యార్థులతో కలిసి కూర్చుని భోజనం..
Hyderabad, Telangana:Jagtial Collector Satya Prasad News: మేడిపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో గురువారం ఒక అద్భుతం జరిగింది. ఎప్పుడూ ఫైళ్లు, అధికారిక సమీక్షలతో బిజీగా ఉండే జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.. ఒక్కసారిగా ఉపాధ్యాయుడి అవతారమెత్తి ఆశ్చర్యపరిచారు. పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. విద్యార్థుల మధ్యకు వెళ్లి వారితో ముచ్చటించడమే కాకుండా బ్లాక్బోర్డు ముందుకు వచ్చి స్వయంగా పాఠాలు చెప్పి అందరినీ టీచర్స్తో పాటు విద్యార్థులను ఆశ్చర్యపరిచారు..
క్లాస్ రూమ్లో టీచర్గా మారిన కలెక్టర్..
తనిఖీల్లో భాగంగా పాఠశాలలోని తరగతి గదులను సందర్శించిన కలెక్టర్ సత్యప్రసాద్.. విద్యార్థుల టీచింగ్తో పాటు లెర్నీంగ్ లెవల్స్ను(Learning Levels) స్వయంగా పరీక్షించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల గురించి ఉపాధ్యాయులను ఆరా తీశారు. అనంతరం కాసేపు విద్యార్థులకు గురువుగా మారి సబ్జెక్టుల్లోని పలు అంశాలను సులువుగా వివరించే ప్రయత్నం చేశారు.. కలెక్టర్ స్వయంగా పాఠాలు చెబుతుంటే విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా విన్నారు.. ఆయన అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు అంతే చురుగ్గా సమాధానాలు ఇవ్వడంతో కలెక్టర్ వారిని ప్రత్యేకంగా అభినందించిన్నట్లు తెలుస్తోంది.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఎలాంటి రాజీ పడకూడదని ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఆదేశించారు.
విద్యార్థులతో కలిసి భోజనం..
కేవలం చదువుకే పరిమితం కాకుండా.. విద్యార్థులకు అందుతున్న వసతులను కూడా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించిన్నట్లు తెలుస్తోంది. పాఠశాలలోని వంట గదిని సందర్శించి పరిశుభ్రతను చెక్ చేశారు. విద్యార్థులకు నిత్యం మెనూ ప్రకారం పౌష్టికాహారం అందుతుందా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు. అన్నం, కూరల నాణ్యతను స్వయంగా రుచి చూసి పరిశీలించారు.. కలెక్టర్ తమతో కలిసి భోజనం చేయడంతో విద్యార్థుల ముఖాల్లో ఆనందం రెట్టింపు అయ్యింది.. పాఠశాల వాతావరణం, భోజన సదుపాయాలపై విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నట్లు సమాచారం..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
అధికారుల సమక్షంలో తనిఖీలు..
కలెక్టర్ చేపట్టిన ఈ ఆకస్మిక తనిఖీలు స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒక అత్యున్నత స్థాయి అధికారి క్షేత్రస్థాయికి వచ్చి.. విద్యార్థుల్లో ఒకరిగా కలిసిపోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) జీవాకర్ రెడ్డితో పాటు స్థానిక రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు తెలుస్తోంది..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Organ Donation: మరణించి ఆరేళ్లు అయినా ఫొటోకి దండ వేయలేదు..చనిపోతూ ఆరుగురికి ప్రాణం పోసిన హేమంత్ అగర్వాల్!
New Delhi, Delhi:Zee Media Organ Donation: "కొందరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినా.. ఇతరుల రూపంలో ఇక్కడే జీవిస్తూ ఉంటారు" అనే మాటను నిజం చేశారు మీరట్కు చెందిన హేమంత్ కుమార్ అగర్వాల్. కుటుంబం కోసం అహర్నిశలు శ్రమించిన హేమంత్, సుమారు పదేళ్ల క్రితం ఢిల్లీలోని ద్వారకలో తన కలల ఇల్లాంటి ఒక అందమైన ఇంటిని నిర్మించుకున్నారు. కానీ, ఆ సంతోషాన్ని అనుభవించేందుకు విధి ఆయనకు ఎక్కువ సమయాన్ని ఇవ్వలేదు.
ఊహించని మలుపు..
2020, ఫిబ్రవరి 29న హేమంత్కు అకస్మాత్తుగా తీవ్ర జ్వరం, వాంతులు అయ్యాయి. మానసిక స్థితిలో మార్పు రావడంతో మొదట స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చేసిన CT స్కాన్లో బ్రెయిన్ హెమరేజ్ (ఇంట్రావెంట్రిక్యులర్ హెమరేజ్) ఉన్నట్లు తేలింది. పరిస్థితి విషమించడంతో వెంటనే గుర్గావ్లోని ఆర్టెమిస్ ఆసుపత్రికి తరలించి శస్త్రచికిత్స చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. మార్చి 12, 2020న వైద్యులు ఆయనను 'బ్రెయిన్ డెడ్'గా ప్రకటించారు.
ఆ తీరని శోకసమయంలో ఆర్టెమిస్ ఆసుపత్రి వైద్యులు, మోహన్ ఫౌండేషన్ కౌన్సిలర్లు అవయవ దానం గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తండ్రి ఆశయాలను తెలిసిన కుమార్తె అపూర్వ, కుమారుడు ఆర్యన్లతో పాటు భార్య బర్ఖా అగర్వాల్ భారమైన హృదయంతోనే ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. హేమంత్ రెండు మూత్రపిండాలు, కాలేయాన్ని దానం చేశారు. ఆయన కాలేయాన్ని విభజించడం ద్వారా ఒక చిన్నారికి, ఒక వయోజనుడికి పునర్జన్మ లభించింది.
"ఆయన చనిపోయి ఆరేళ్లు గడిచినా, నేను ఇంకా ఆయన ఫోటోకి దండ వేయలేదు. ఎందుకంటే ఆయన ఈ ప్రపంచంలో వేరొకరి రూపంలో ఇంకా బతుకుతూనే ఉన్నారు" అని హేమంత్ అగర్వాల్ కుమార్తె బర్ఖా అగర్వాల్ పేర్కొన్నారు.
అవయవ మార్పిడి: భయాలు - వాస్తవాలు
సమాజంలో అవగాహన లోపం వల్ల అవయవాలు అమ్ముకుంటారనే అపోహలు ఉన్నాయి. కానీ, భారత ప్రభుత్వ పారదర్శక వ్యవస్థ దీనిని పూర్తిగా అడ్డుకుంటుంది. దానం చేసిన అవయవం సరైన వ్యక్తికే చెందుతుందని నమ్మడానికి గల కారణాలు అనేకం ఉన్నాయి.
NOTTO (నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్).. దేశంలో ఎక్కడ అవయవ దానం జరిగినా, దాని పూర్తి రికార్డు ఈ ప్రభుత్వ ఆన్లైన్ నెట్వర్క్లో నమోదవుతుంది. ధనిక, పేద అనే భేదం లేకుండా కేవలం రోగి అనారోగ్య తీవ్రత, రక్త వర్గం (బ్లడ్ గ్రూప్), అవయవాల సరిపోలిక ఆధారంగా మాత్రమే కంప్యూటర్ ఆటోమేటిక్గా స్వీకర్తను ఎంపిక చేస్తుంది. ఇందులో మానవ జోక్యం సాధ్యం కాదు.
కఠినమైన చట్టాలు..
మానవ అవయవ మార్పిడి చట్టం (THOA) ప్రకారం, అవయవాల అక్రమ రవాణా, విక్రయాలు పూర్తిగా చట్టవిరుద్ధం. ఏ ఆసుపత్రి లేదా వైద్యుడు స్వచ్ఛందంగా ఎవరికీ అవయవాలను ఇవ్వలేరు. ఎలాంటి ఒత్తిళ్లు, వాణిజ్య లావాదేవీలకు తావులేకుండా ఉండేందుకు దాత, గ్రహీత వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతారు.
అవయవ దానం గురించి తెలుసుకోవలసిన 6 ముఖ్య విషయాలు..
1) ఎవరు దానం చేయవచ్చు?: జీవించి ఉన్నవారు (ఒక మూత్రపిండం లేదా కాలేయంలో కొంత భాగం) లేదా బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత (గుండె, కళ్ళు, కాలేయం, మూత్రపిండాలు) దానం చేయవచ్చు.
2) ప్రక్రియ ఎలా ఉంటుంది?: మీ ప్రియమైన వారికి బ్రెయిన్ డెడ్ అని వైద్యులు ధృవీకరించిన వెంటనే ఆసుపత్రి సిబ్బందిని సంప్రదించాలి లేదా ప్రభుత్వ హెల్ప్లైన్ 1800-11-4770 కు కాల్ చేయవచ్చు.
3) ఖర్చులు ఉంటాయా?
అవయవ దానానికి ఎలాంటి రుసుము ఉండదు. దాత కుటుంబం నుండి ఎలాంటి అదనపు చికిత్స ఖర్చులు వసూలు చేయరు.
4) మృతదేహానికి గౌరవం
అవయవాల సేకరణ ఆపరేషన్ అత్యంత గౌరవప్రదంగా జరుగుతుంది. శరీరంపై ఎలాంటి వికృత మచ్చలు పడకుండా జాగ్రత్త వహిస్తారు.
5) అంతిమ సంస్కారాలు: ఆపరేషన్ పూర్తయిన వెంటనే మృతదేహాన్ని అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు.
6) ఒక్కరి నిర్ణయం - ఎందరికో ప్రాణం: ఒకరి అవయవ దానం ద్వారా దాదాపు 8 మంది ప్రాణాలను కాపాడవచ్చు.
జీ మీడియా విజ్ఞప్తి..
భారతదేశంలో ప్రతి ఏడాది అవయవాలు సకాలంలో దొరక్క లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. జీ మీడియా చేపట్టిన 'జిందగీ కే బాద్ భీ' అవగాహన ప్రచారంలో భాగస్వామ్యం అవ్వండి. అపోహలను వీడి అవయవ దానానికి ప్రతిజ్ఞ చేయండి. మీ ఒకే ఒక్క నిర్ణయం మరొక కుటుంబంలో వెలుగులు నింపగలదు.
Also Read: ఉద్యోగులకు గుడ్న్యూస్..20 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు..ఆ రోజు నుంచే అమలు!
Also REad: విద్యార్థులకు చుక్కలు చూపిన నీట్ రీ-ఎగ్జామ్..కటాఫ్ భారీగా తగ్గే ఛాన్స్ ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cobra Video: వాటర్ గన్తో కోబ్రాకు స్నానం.. వామ్మో ఓ సారి వీడియో చూడండి!
Hyderabad, Telangana:Man Gives Bath To King Cobra Video Watch: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ వేలాది వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.. వాటిలో కొన్ని నవ్విస్తే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి.. కానీ, తాజాగా ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం నెటిజన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తోంది.. చూసేందుకే ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియోలో.. ఒక యువకుడు ఏకంగా అత్యంత ప్రమాదకరమైన నాగుపాముకు వాటర్ గన్తో స్నానం చేయించాడు. ప్రస్తుతానికి ఈ వీడియో విపరీతంగా ట్రెండ్ అవుతూ వస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బుసలు కొడుతున్న త్రాచు..
సాధారణంగా నాగుపాము పేరు చెబితేనే.. ఎవరైనా సరే ఆమడదూరం వెళ్లిపోతూ ఉంటారు. అలాంటిది ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.. ఒక పెద్ద నాగుపాము ముందు నిలబడిన ఒక యువకుడు, కారు వాష్ చేసేందుకు వాడే వాటర్ గన్ చేతపట్టుకుని ఉండడం మీరు చూడొచ్చు.. అందులో నీళ్లు నింపి.. ఆ పాముపైకి చిమ్మడం మొదలు పెట్టాడు...
సాధారణంగా పాములు తమపైకి ఏదైనా వస్తువు వస్తున్నప్పుడు తీవ్రంగా స్పందిస్తూ ఉండడం మీరు ఇతర వీడియోల్లో చూసి ఉంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది.. ఆ యువకుడు వాటర్ గన్తో నీళ్లు కొడుతుంటే, ఆ నాగుపాము కోపంతో ఊగిపోవడం మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు.. తన పడగ విప్పి, ఆ యువకుడిపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించడం మీరు గమనించవచ్చు. ఒక్కసారిగా ముందుకు దూకుతూ బుసలు కొట్టడం మీరు చూడొచ్చు. అయితే, ఆ యువకుడు మాత్రం ఏమాత్రం భయపడకుండా.. చాలా చాకచక్యంగా వెనక్కి తప్పుకుంటూ మళ్లీ మళ్లీ దానిపై వాటర్ గన్తో నీళ్లు కొట్టడం మీరు గమనించవచ్చు.
నెటిజన్ల రియాక్షన్ ఇదే..
ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో అప్లోడ్ అయిన కొద్ది గంటల్లోనే లక్షలాది వ్యూస్తో పాటు వేలాది లైకులను సొంతం చేసుకుంది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు. యమధర్మరాజుతో ఇలాంటి ఆటలు వద్దు సోదరా.. ఒక్కసారి మిస్ అయితే ప్రాణాలు గాల్లో కలవడం ఖాయమని ఒకరు కామెంట్ చేయగా.. వీడికి ధైర్యం ఎక్కువో.. లేక వ్యూస్ కోసం పిచ్చి ఎక్కువో అర్థం కావడం లేదంటూ మరికొందరు మండి పడుతున్నారు..
Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
మరికొందరు మాత్రం ఆ పాముకు వేసవి కారణంగా ఎండ తీవ్రతతో పాటు వేడిమి తట్టుకోలేక నీళ్లు పోస్తున్నాడేమో అంటూ జోకులు పేలుస్తున్నారు. ఏదేమైనప్పటికీ, కేవలం సోషల్ మీడియాలో లైకులు, షేర్ల కోసం ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకునే స్టంట్లు చేయడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ వీడియోను kaka_caca_petualang అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. ఇప్పటి వరకు 7 వేల మందికి పైగా లైక్ చేసిన్నట్లు తెలుస్తోంది.
Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Viral Video: పుల్ల ఐస్క్రీమ్లో చనిపోయిన కప్ప.. చూస్తే ఇక జీవితంలో తినరు! వీడియో..
Hyderabad, Telangana:Frog Found in Ice Cream Video: వేసవి కాలంలోనో లేదా కాస్త చల్లదనం కోసమో ఐస్క్రీమ్ తినడం అందరికీ ఇష్టమే.. ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు పుల్ల ఐస్ (Ice Candy) అంటే ఎంతగానో ఇష్టపడి తింటూ ఉంటారు.. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మాత్రం.. ఇకపై ఐస్క్రీమ్ తినే ముందు వంద సార్లు ఆలోచించాల్సిందే.. ఎందుకంటే ఒక వ్యక్తి ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఐస్క్రీమ్లో ఏకంగా ఒక చనిపోయిన కప్ప ప్రత్యక్షమైంది.. ఈ షాకింగ్ దృశ్యం ఇప్పుడు నెటిజన్లను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తింటుండగా బయటపడ్డ కప్ప..
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే... ఒక వ్యక్తి రోడ్డు పక్కన ఐస్క్రీమ్ కొనుక్కుని తింటున్నాడు. సగం ఐస్క్రీమ్ తిన్న తర్వాత.. అతనికి అందులో ఏదో తేడాగా అనిపించింది. రంగు మారి, వింతగా కనిపిస్తున్న ఆ భాగాన్ని గమనించగా.. అది మరేదో కాదు.. ఐస్క్రీమ్తో పాటే గడ్డకట్టుకుపోయిన ఒక చిన్న చనిపోయిన కప్ప అని తేలింది. అంతేకాకుండా మీరు కూడా ఈ వీడియో ఆ చనిపోయిన నల్ల కప్పను చూడొచ్చు..
దీంతో సదరు వ్యక్తి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు.. వెంటనే ఆ ఐస్ పుల్లను అక్కడే ఉన్న స్థానికులకు చూపించాడు. ఐస్క్రీమ్ మధ్యలో కప్ప కాళ్లు, శరీరం స్పష్టంగా కనిపిస్తుండటంతో చుట్టుపక్కల వారు సైతం ఆశ్చర్యపోయిన్నట్లు తెలుస్తోంది.. ఇదేం ఘోరం.. ఇలాంటి ఐస్క్రీమ్లు తింటే ప్రాణాలు పోవాల్సిందేనా? అంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేయడం వీడియోలో మీరు క్లియర్గా వినొచ్చు..
ఈ భయంకరమైన ఘటన ఎక్కడ, ఏ ప్రాంతంలో జరిగిందనే దానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు ఇంకా తెలియలేదు.. కానీ, ఈ వీడియో మాత్రం ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ (Instagram)తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో విపరీతంగా షేర్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆహార భద్రతా ప్రమాణాలను (Food Safety Standards) గాలికొదిలేసి.. ఇలాంటి నాణ్యత లేని ఐస్క్రీమ్లను తయారు చేస్తున్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
మరికొంతమందైతే.. ఇకపై బయట ఐస్క్రీమ్లు తినడమే మానేయాలని కామెంట్ చేయగా.. తయారీ కేంద్రాల్లో కనీస పరిశుభ్రత పాటించకపోవడం వల్లే ఇలాంటి కీటకాలు, జంతువులు ఐస్క్రీమ్ మిశ్రమంలో పడిపోతున్నాయని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆహార పదార్థాలలో ఎలుకలు, కప్పలు, పాములు రావడం ఎక్కువైపోవడంతో ప్రజలు బయట ఫుడ్ తినాలంటేనే జంకుతున్నారు. ఈ వైరల్ వీడియో ప్రస్తుతం ఐస్క్రీమ్ ప్రియుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తోంది.. ఏదేమైనా.. బయట ఏ వస్తువు కొని తిన్నా.. కాస్త జాగ్రత్తగా చూసుకుని తినడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Free Breakfast Hyderabad: ఆ ప్రాంతంలో నిత్యం టిఫిన్ ఉచితం..365 రోజులు ఎప్పుడు వచ్చినా ఫుడ్ పెడతారు!
Hyderabad, Telangana:Hyderabad Free Breakfast: ఎందరికో ఆశ్రయాన్ని ఇవ్వడమే కాకుండా.. ఆకలితో అలమటించే వారికి ఇంత అన్నం పెట్టే సేవా నిలయంగా హైదరాబాద్ నిలవనుంది. అలాంటి ఒక గొప్ప సేవా దృక్పథంతో, గత కొంతకాలంగా నిరుపేదల ఆకలిని తీరుస్తోంది 'ఆహార్ సేవ' అనే స్వచ్ఛంద సంస్థ. ముఖ్యంగా కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో, ఎలాంటి విరామం లేకుండా సంవత్సరంలో 365 రోజులూ ఉచితంగా రుచికరమైన అల్పాహారాన్ని (టిఫిన్) అందిస్తూ ఈ సంస్థ నగర ప్రజల మన్ననలు పొందుతోంది.
ఈ అద్భుతమైన మహత్ కార్యానికి వ్యవస్థాపకుడు రంజన్ గాంధీ శ్రీకారం చుట్టారు. ప్రతిరోజూ ఉదయం 3 గంటల నుంచే వంటశాలలో టిఫిన్ల తయారీ ప్రారంభమవుతుంది. వర్షం పడినా, చలి వణికించినా, సెలవు రోజైనా ఈ సేవకు ఎటువంటి ఆటంకం కలగదు. సరిగ్గా ఉదయం 7:30 గంటలకల్లా పంపిణీ కేంద్రాల వద్దకు వేడివేడి ఆహారం చేరుకుంటుంది. నిరుపేదలు, రోజువారీ కూలీల కోసం ఇడ్లీ, బోండా, ఊతప్ప, ఉప్మా వంటి నాలుగు రకాల వైవిధ్యమైన, పోషకాలతో కూడిన టిఫిన్లను ఇక్కడ వడ్డిస్తారు.
ప్రస్తుతం ఈ సంస్థ తన సేవా పరిధిని కేవలం కాచిగూడకే పరిమితం చేయకుండా, హైదరాబాద్లోని మరో 5 నుంచి 6 కీలక ప్రాంతాలకు విస్తరించింది. నాంపల్లిలోని శ్యామ్ మందిర్ ఎదురుగా, నిలోఫర్ హాస్పిటల్ వద్ద, పబ్లిక్ గార్డెన్ సమీపంలో, నాంపల్లి సుభాన్ బేకరీ వద్ద, ఉస్మాన్గంజ్లోని బాలసదన్లో ఈ ఉచిత అల్పాహార కేంద్రాలు నడుస్తున్నాయి. వీటితో పాటు బేగంపేట్లోని దేవనార్ బ్లైండ్ స్కూల్, మలక్పేట్లోని డెఫ్ అండ్ డంబ్ పాఠశాలలకు కూడా సంస్థ నిత్యం అల్పాహారాన్ని సరఫరా చేస్తోంది.
ఇంత పెద్ద ఎత్తున ప్రతిరోజూ వేలాది మందికి నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి రోజుకు సుమారు రూ.20,000 వరకు ఖర్చు అవుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఖర్చంతా పూర్తిగా మానవతావాదులు, దాతలు అందించే విరాళాల ద్వారానే సమకూరుతోంది. కేవలం అల్పాహారమే కాకుండా, అనాథాశ్రమాలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లల పాఠశాలలకు కూడా ఆహార్ సేవ నిరంతరం తోడ్పాటునందిస్తోంది.
ఆకలి లేని సమాజ స్థాపనే ధ్యేయంగా రంజన్ గాంధీ నాయకత్వంలో సాగుతున్న "ఆహార్ సేవ" ప్రయాణం నిజంగా అభినందనీయం. ఆకలితో ఉన్న పేదవాడి ముఖంలో ఈ సంస్థ నింపుతున్న నవ్వులు ఎందరికో స్ఫూర్తిదాయకం. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కేంద్రాలు ఏర్పాటై, మరింత మంది నిరుపేదలకు ఆకలి బాధలు తప్పాలని ఆశిద్దాం.
Also Read: అంగన్వాడీల్లో 15,982 ఉద్యోగాలు..ఇంటర్ పాసైతే చాలు..సర్కార్ కొలువు వచ్చినట్టే?!
Also Read: ఉద్యోగులకు గుడ్న్యూస్..20 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు..ఆ రోజు నుంచే అమలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nothing నుంచి సరికొత్త B సిరీస్ ఫోన్.. అదిరిపోయే డిజైన్, గ్లిఫ్ లైటింగ్తో ఎంట్రీ!
Hyderabad, Telangana:Nothing Phone 4b Launch Date In India: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ నథింగ్ (Nothing) టెక్ తమ వినియోగదారులను ఆకర్షించడానికి ఎప్పుడూ ముందే ఉంటుంది. తన అద్భుతమైన ట్రాన్స్పరెంట్ డిజైన్తో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు సరికొత్త డిజైన్తో మార్కెట్లోకి మరో అద్భుతమైన మొబైల్ను విడుదల చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ నథింగ్ ఫోన్ 4b (Nothing Phone 4b) పేరుతో మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ఫోన్ విడుదల చేయబోతోంది.. జూలై 7న భారత మార్కెట్లో గ్రాండ్గా విడుదల కానున్న ఈ స్మార్ట్ఫోన్ అఫీషియల్ డిజైన్ లుక్ను కంపెనీ తాజాగా రివీల్ చేయడం విశేషం.. ఈ కొత్త మొబైల్కు సంబంధించిన డిజైన్, ఫీచర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సిగ్నేచర్ ట్రాన్స్పరెంట్ లుక్..
Nothing ఫోన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది.. దాని వెనుక భాగంలో ఉండే ట్రాన్స్పరెంట్ డిజైన్.. నథింగ్ ఫోన్ (4b)లో కూడా కంపెనీ తన సిగ్నేచర్ ట్రాన్స్పరెంట్ రియర్ ప్యానెల్ను కొనసాగించిన్నట్లు తెలుస్తోంది.. ఈసారి అద్భుతమైన బ్లూ కలర్ ఆప్షన్తో తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఫోన్ వెనుక భాగంలో స్క్రూలతో పాటు ఇండస్ట్రియల్ యాక్సెంట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ మొబైల్కు ప్రీమియంతో పాటు క్లాసీ లుక్ను అందిస్తుంది.. ఎక్కువ సమయం ఫోన్ వాడినా చేతికి సౌకర్యవంతంగా ఉండేలా సాఫ్ట్-టచ్ ఫినిషింగ్ను అందించారు..
మెరిసిపోయే గ్లిఫ్ బార్..
ఈ నథింగ్ ఫోన్ (4b) ఫోన్ వెనుక భాగంలో కెమెరా మాడ్యూల్ పక్కన అడ్డంగా (Horizontal) ఉండే గ్లిఫ్ లైటింగ్ బార్ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది నథింగ్ బ్రాండ్ ప్రత్యేకతగా ఉండబోతోంది.. నోటిఫికేషన్లు, కాల్స్ వచ్చినప్పుడు ఈ గ్లిఫ్ లైట్లు మెరుస్తూ యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. కెమెరా సెటప్ విషయానికి వస్తే.. వెనుక భాగంలో ఎడమ వైపు పైభాగంలో ఓవల్ షేప్లో కెమెరాలను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతోంది.. దీనితో పాటు ఎల్ఈడీ ఫ్లాష్, అదనపు సెన్సార్లను కూడా అందుబాటులో ఉంచారు..
బడ్జెట్ ధరలోనే B సిరీస్ ప్రారంభం..
నథింగ్ సంస్థ ఇప్పటివరకు ప్రీమియం సిరీస్తో పాటు బడ్జెట్ విభాగాల్లో a-సిరీస్ ఫోన్లను అందిస్తూ వచ్చింది. అయితే, ఈసారి మరింత మంది కస్టమర్లను ఆకర్శించేందుకు B సిరీస్ను పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది a-సిరీస్ కంటే తక్కువ ధరలో, అంటే సుమారు రూ.25,000 బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా.. ఫ్లిప్కార్ట్ (Flipkart)లో దీనికి సంబంధించిన మైక్రోసైట్ కూడా లైవ్ అవ్వడం విశేషం..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ఇక లీక్ అయిన ఫీచర్స్తో పాటు స్పెషిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే, నథింగ్ ఫోన్ (4b)లో అద్భుతమైన ఫీచర్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 జెన్ 4 లేదా 7s జెన్ 4 చిప్సెట్ ప్రాసెసర్ను అందిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది గరిష్టంగా 8GB ర్యామ్తో పాటు 12GB ర్యామ్ వేరియంట్స్లో లాంచ్ కాబోతోంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆధారిత నథింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ను కూడా కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో కూడిన పెద్ద అమోలెడ్ (AMOLED) డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. అలాగే లాంగ్ లైఫ్ ఇచ్చే 5,400mAh బ్యాటరీని కూడా కలిగి ఉండడం విశేషం.. అయితే, దీనిని కంపెనీ జూలై 7న జరిగే అఫీషియల్ లాంచ్లో దీని పూర్తి ఫీచర్స్తో పాటు ధర వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు సంచారం.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Power Sector Jobs: ఏపీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. విద్యుత్ శాఖలో 629 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
Vijayawada, Andhra Pradesh:AP Power Sector Notification 2026: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు యువతకు ఉపాధి కల్పించాలని నిర్ణయంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు విద్యుత్ సంస్థలు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశాయి.
రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ విషయమై మాట్లాడుతూ.. "గత కొంతకాలంగా ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న యువతకు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నందుకు సంతోషంగా ఉంద"ని అన్నారు. రాబోయే రోజులు జాబ్ క్యాలెండర్ ద్వారా అత్యంత పారదర్శకంగా, ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
విద్యుత్ శాఖలో ఖాళీల వివరాలు..
ఈ భార్తీ నియామక ప్రక్రియలో భాగంగా ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో లతోపాటు వివిధ విద్యుత్ పంపిణీ సంస్థలలో (డిస్కమ్స్) ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 629 పోస్టులను విభజన చేసి వివిధ సంస్థలకు కేటాయించారు. ఏపీ ట్రాన్స్కోలో 200, ఏపీ జెన్కోలో 100, ఏపీఎస్పీడీసీఎల్లో 134, ఏపీసీపీడీసీఎల్లో 60, ఏపీఈపీడీసీఎల్లో 135 ఏఈఈ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు.
దరఖాస్తు తేదీలు
APSPDCL పరిధిలో దరఖాస్తులు: దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APSPDCL) పరిధిలోని పోస్టులకు అర్హులైన అభ్యర్థులు జూన్ 30 నుండి జూలై 27 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్లో ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, టెలికాం విభాగాల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు పెద్ద పీట వేశారు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పూర్తి పారదర్శక విధానంలో రిక్రూట్మెంట్ పరీక్షలు జరుగుతాయని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక ప్రగతిలో విద్యుత్ రంగం అత్యంత కీలకమైనది. ఈ నియామకాల ద్వారా అటు విద్యుత్ సంస్థల పనితీరు మెరుగవడమే కాకుండా, వేలాది కుటుంబాల్లో సరికొత్త వెలుగులు నిండనున్నాయి. కొన్నేళ్లుగా లైబ్రరీలలో రాత్రింబవళ్లు కష్టపడుతున్న మధ్యతరగతి నిరుద్యోగ యువతకు ఇది ఒక సువర్ణావకాశం. అర్హులైన అభ్యర్థులందరూ పట్టుదలను ఆయుధంగా చేసుకుని తమ కలల ఉద్యోగాన్ని చేజిక్కించుకోవాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది.
Also REad: బాబాయ్ ఆశీస్సులు తీసుకున్న అబ్బాయ్.. మంగళగిరిలో డిప్యూటీ సీఎంను కలిసిన రామ్చరణ్!
Also Read; "బెజవాడ సాయికృష్ణ పోలీస్ కస్టడీలో చనిపోయాడు"..సిట్ రిమాండ్ రిపోర్ట్లో సంచలన నిజాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
తెలంగాణ హక్కులు కాపాడాల్సిన రేవంత్ రెడ్డి కర్ణాటక దోపిడీకి వంతపాడుతున్నాడు: కవిత
Hyderabad, Telangana:తుంగభద్రలో మన నీటి వాటాకు తూట్లు పొడిచే పనికి రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్నాడని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ఆర్డీఎస్ చుట్టూ కర్ణాటక చేపట్టే ప్రాజెక్టులతో తెలంగాణ నీటి హక్కును కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. మన హక్కులను కాపాడాల్సిన రేవంత్ రెడ్డి కర్ణాటక దోపిడీకి వంత పాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీఎస్ మీద నిర్మించి ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వెళ్లవద్దని సూచించారు.
తుంగభద్ర నీటి వ్యవహారాల్లో రేవంత్ రెడ్డి తెలంగాణకు ద్రోహం చేసేలా వ్యవహరిస్తుండడంతో మాజీ ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ వీడియో సందేశం విడుదల చేశారు. తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలని రేవంత్ రెడ్డికి సూచించారు. కేంద్ర జల సంఘం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లి పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు అన్యాయం చేయవద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు.
'తెలంగాణ సాధించుకొని 12 ఏళ్లు గడిచిన తర్వాత కూడా మనం పూర్తిస్థాయిలో కృష్ణా, తుంగభద్రలో మన నీటిని వాడుకోలేదు. ఆర్డీఎస్ ప్రాజెక్ట్ నడిగడ్డను బతికించి ఉమ్మడి మహబూబ్నగర్కు ఉపయోగపడే ప్రాజెక్ట్. ఆర్డీఎస్లో మనకు 16 టీఎంసీల వాటా ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ వచ్చిన తర్వాత గానీ 6 టీఎంసీల కన్నా ఎక్కువ వాడుకోలేదు. మన నీటిని పూర్తిస్థాయిలో వాడుకునేందుకు ఆర్డీఎస్ చుట్టుపక్కల రిజర్వాయర్లను బలోపేతం చేయాల్సి ఉంది' అని మాజీ ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి సర్కార్ దాన్ని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నడిగడ్డకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
'తెలంగాణకు ఆర్డీఎస్లో 16 టీఎంసీలు వచ్చినట్లే ఏపీకి సుంకేశుల నుంచి 16 టీఎంసీల వాటా ఉంది. కానీ వాళ్లు దాన్ని 32 టీఎంసీలు చేసుకోని బీభత్సంగా నీటిని వాడుకుంటున్నారు. మనం మాత్రం ఆ పని చేయలేదు. మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులు కట్టుకునేలోపే కర్ణాటక తుంగభద్ర మీద మూడు ప్రాజెక్టులు కడుతోంది. కురిడి, కల్పగల్ గ్రామాల్లో 2 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు నిర్మిస్తోంది ఆర్డీఎస్కు 15 కిలోమీటర్ ఎగువన చిక్కాలపర్వి వద్ద 2.50 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బ్యారేజ్ నిర్మిస్తోంది. ఆర్డీఎస్కు దిగువన రాయిచూరు జిల్లాలోని చిక్క మంచాల సమీపంలో 5 టీఎంసీల కెపాసిటీతో మరో బ్యారేజి నిర్మిస్తోంది. మొత్తంగా ఆర్డీఎస్కు ఎగువన, దిగువ 10 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా కర్ణాటక ప్రాజెక్టులు చేపడుతోంది' అని కవిత వివరించారు.
'వాస్తవానికి కర్ణాటకకు ఆర్డీఎస్లో 1.20 టీఎంసీ వాటా నీళ్లు మాత్రమే ఉన్నాయి. కానీ పది టీఎంసీల నీళ్లు వినియోగించుకునే ప్రయత్న చేస్తోంది. అలాంటి కార్యక్రమానికి రేవంత్ రెడ్డి వెళ్లి చంద్రబాబు, డీకే శివకుమార్లను కూర్చొబెట్టుకుని తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు. కర్ణాటక ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే తుంగభద్రలో మన వాటా హక్కును పర్మినెంట్గా కోల్పోతాం' అని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు.
'కాంగ్రెస్ పార్టీ మళ్లీ మీరు అధికారంలోకి రాదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై చర్యలు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రే మా ప్రాజెక్టులకు అంగీకారం తెలిపారని కర్ణాటక వాదిస్తుంది. రేవంత్ రెడ్డి చేసే ఈ పని నడిగడ్డ ప్రజలకు అతిపెద్ద గుదిబండగా మారుతుంది' అని మాజీ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కేంద్ర జల సంఘం దగ్గరకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని మరోమారు విజ్ఞప్తి చేశారు. అందరం కలిసి కేంద్రంతో మన నీటి వాటా హక్కుల కోసం పోరాడుదామని.. కృష్ణా, తుంగభద్రలో మన వాటాను కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి శాశ్వతంగా తాగు, సాగు నీరు వచ్చేలా చేసుకుందామని సూచించారు.
