icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Petrol Price Today: భారీగా తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు..భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?

Hyderabad, Telangana:

Petrol Diesel Price Today: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొంతమేర శాంతించడం, హార్ముజ్ జలసంధి తెరుచుకుంటుందనే ఆశలు బలపడటంతో చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. అయితే అంతర్జాతీయంగా ధరలు తగ్గుతున్నప్పటికీ, దేశీయంగా మాత్రం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పతనం..
గత కొన్ని వారాలుగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర సుమారు 13 శాతానికి పైగా పడిపోయింది. ఆగస్టు 7 నాటికి ముగిసిన వారంలో ఇది బ్యారెల్‌కు 83.55 డాలర్ల వద్ద సెటిల్ అయింది. డబ్ల్యూటీఐ క్రూడ్ కూడా 78.18 డాలర్ల వద్ద ముగిసింది. వారమంతా చూస్తే ఇది సుమారు 7.7 శాతం వరకు క్షీణించింది.

ఇరాన్-ఒమన్ మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉండటం, హార్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు సజావుగా సాగుతాయనే అంచనాలే ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

భారత్‌లో పెట్రోల్, డీజిల్ ప్రస్తుత ధరలు..
ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ.. దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) గత కొన్ని నెలలుగా ధరలను సవరించలేదు. మే 25 తర్వాత దేశంలో ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో తాజా ధరలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర రూ.115.69 ఉండగా, డీజిల్ ధర రూ. 103.82గా ఉంది. (XP95 పెట్రోల్ రూ. 125.17)

విజయవాడ: లీటర్ పెట్రోల్ ధర రూ. 117.25 కాగా, డీజిల్ ధర రూ. 104.96 వద్ద కొనసాగుతోంది.

విశాఖపట్నం: లీటర్ పెట్రోల్ ధర రూ. 116.39, డీజిల్ ధర రూ. 104.11గా ఉంది.

భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు దేశంగా ఉంది. అంతర్జాతీయంగా ధరలు తగ్గుతున్న తరుణంలో దేశీయంగానూ ఇంధన ధరలను తగ్గించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నప్పటికీ, ఆయిల్ కంపెనీలు ప్రస్తుతానికి ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. భవిష్యత్తులోనూ పశ్చిమాసియా పరిణామాలు, యుద్ధ ఉద్రిక్తతలపైనే చమురు ధరల మనుగడ ఆధారపడి ఉంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

Also REad: యూపీఐ లావాదేవీలపై భారీగా ఛార్జీలు?! అదనపు ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ!

Also Read: జియో వినియోగదారులకు అదిరిపోయే ప్లాన్..రూ.200లకే 30 జీబీ డేటా-15 OTT సబ్‌స్క్రిప్షన్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

బంగారం, వెండి ధరలు.. ఆగస్టు 9వ తేదీ ఆదివారం తులం పసిడి ధర ఎంతంటే..?

BBhoomi1h ago
Secunderabad, Telangana:

Gold Rate Today: ఈరోజు ఆదివారం, ఆగస్టు 9న బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. 10 గ్రాముల 24-క్యారెట్ల బంగారం ధర రూ.152,150కి చేరింది. 10 గ్రాముల 22-క్యారెట్ల బంగారం ధర రూ.139,471కి చేరింది. ఒక కిలోగ్రాము వెండి ధర రూ.232,640కి చేరింది. బంగారం ధరల పెరుగుదలకు అనేక అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి. గత ఆరు వారాల్లో డాలర్ అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడం ఈ పెరుగుదలకు ఒక కారణం. డాలర్ పడిపోయినప్పుడు బంగారం ధరలు పెరుగుతాయని.. దీంతో బంగారానికి డిమాండ్ పెరిగి.. బంగారం  ధర కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అదనంగా, జూలై నెలకు సంబంధించిన యూఎస్ ఉద్యోగాల డేటా అంచనాల కంటే తక్కువగా ఉంది. దీని ఫలితంగా, సెప్టెంబర్‌లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం తగ్గిందని చెబుతున్నారు. పర్యవసానంగా, మార్కెట్లో బంగారం ధరల పెరుగుదలకు ఇది ఒక కారణమని నిపుణులు భావిస్తున్నారు.

బంగారం ధర ఎందుకు పెరుగుతోంది?

ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే, బంగారం ధర గణనీయంగా తగ్గుతుందని అంచనా. అయితే, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది. ద్రవ్య విధాన కమిటీ సెప్టెంబర్‌లో మళ్లీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచవచ్చని లేదా మరింత తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల, సాధారణంగా సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడే బంగారంలో పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడిదారులు ప్రోత్సాహం పొందవచ్చు.

బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం 10 సంవత్సరాల యూఎస్ బాండ్లపై రాబడి తగ్గడమే. ఇది డాలర్ విలువను కూడా ప్రభావితం చేస్తుంది. డాలర్ విలువ పడిపోయినప్పుడు, యూఎస్ బాండ్లపై రాబడి కూడా తగ్గుతుంది. పెట్టుబడిదారులు యూఎస్ ట్రెజరీ బాండ్ల కంటే బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నందున, దీనిని బంగారం ధరల పెరుగుదలగా కూడా భావించవచ్చు. శ్రావణ మాసం ప్రారంభంతో బంగారం ధరలు పెరగడం దీనికి ఒక కారణం.

మరోవైపు, దేశీయ మార్కెట్‌లోని కారణాలను పరిశీలిస్తే, శ్రావణ మాసం ప్రారంభంతో పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలవబోతోంది. దీని కారణంగా, ప్రస్తుతం మార్కెట్‌లో బంగారు ఆభరణాలకు బలమైన డిమాండ్ ఉంది. బంగారం ధరలు పెరగడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. అంతేకాకుండా, ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ముడి చమురు ధరలు కూడా తగ్గాయి, ఇది డాలర్ విలువ తగ్గడానికి  బంగారం ధరలు పెరగడానికి దోహదపడింది. మరోవైపు, భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరుగుతాయని అనేక బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నట్లు మనం చూడవచ్చు.

Also Read: ఉదయ్ కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. గజిని కంటే దారుణం..ఏం అడిగినా.. ఆ మూడే సమాధానాలు..!!

Also Read:ఎస్‌బీఐలో 1,538 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో భారీ నోటిఫికేషన్.. దరఖాస్తు వివరాలు ఇవే..!!

Also Read:ఏమిటీ 'సావోజీ మటన్'? ఒకే ఒక్క కామెంట్‌తో రగిలిన వివాదం.. మహారాష్ట్రలో ఎందుకీ తీవ్ర దుమారం..?

Also Read:  రోజూ ఈ గింజలు తింటే కిలో మటన్ తినంత బలం..!!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

0
0
Report

Mahesh Babu Birthday: నటనలో 'రాజకుమారుడు'..అమ్మాయిల మనసు దోచే 'పోకిరి' ఈ సూపర్ స్టార్..HBD మహేష్ బాబు!

Hyderabad, Telangana:

Mahesh Babu Birthday: తెలుగు సినీ పరిశ్రమలో 'సూపర్ స్టార్' అనగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు హీరో మహేష్ బాబు. అందంతో పాటు అభినయం, అంకితభావం ఉట్టిపడే ఆయన నటనతో కోట్ల మంది హృదయాలను కొల్లగొట్టారు. కేవలం నటుడిగానే కాకుండా, తనదైన శైలిలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ 'రియల్ హీరో' అనిపించుకుంటున్న మహేశ్ బాబు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని ఆయన సినీ ప్రయాణంపై ప్రత్యేక కథనం.

బాలనటుడిగా ఎంట్రీ..
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేసిన హీరో మహేష్ బాబు.. 'రాకుమారుడు' సినిమాతో పూర్తి స్థాయి హీరోగా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో యువతను విపరీతంగా ఆకట్టుకుని 'ప్రిన్స్' బిరుదును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 'మురారి', 'ఒక్కడు', 'అతడు', 'పోకిరి' వంటి సంచలన విజయాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

ప్రయోగాత్మక చిత్రాలు - బాక్సాఫీస్ రికార్డులు..
కేవలం కమర్షియల్ చిత్రాలకే పరిమితం కాకుండా 'శ్రీమంతుడు', 'మహర్షి', 'భారత్ అనే నేను' వంటి సందేశాత్మక చిత్రాలతో సమాజానికి మంచి మెసేజ్ ఇస్తూనే బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించారు. విభిన్న కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో నంబర్ వన్ హీరోగా తన హవాను కొనసాగిస్తున్నారు.

గ్లోబల్ ప్రాజెక్ట్‌తో సరికొత్త మైలురాయి..
ప్రస్తుతం మహేష్ బాబు ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా నిలిచిన ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలోని భారీ యాక్షన్ అండ్ మైథలాజికల్ మూవీ 'వారణాసి' సినిమాలో నటిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన గుర్తింపు పొందిన తర్వాత ఇప్పుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చే మూవీ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.

సామాజిక సేవా కార్యక్రమం..
తెరపైనే కాకుండా తెరవెనుక కూడా మహేశ్ బాబు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. 'మహేష్ బాబు ఫౌండేషన్' ద్వారా వందలాది గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయించి వారి ప్రాణాలు నిలబెడుతున్నారు. అలాగే 'మీనాక్షి' గ్రామం వంటి దత్తత కార్యక్రమాలతో తన మంచితనాన్ని చాటుకుంటున్నారు.

విలక్షణ నటనతో, బాధ్యతాయుతమైన పౌరుడిగా తెలుగు జాతి గర్వించదగ్గ స్థాయికి ఎదిగిన సూపర్ స్టార్ మహేష్ బాబు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయన కెరీర్ మరిన్ని అద్భుత విజయాలను అందుకోవాలని మనసారా కోరుకుందాం. హ్యాపీ బర్త్ డే మహేష్ బాబు!

Also Read: ప్రభాస్ సినిమాలోని ఈ లేడీ విలన్ గుర్తుందా? 54 ఏళ్ల వయసులోనూ హీట్ పుట్టించే గ్లామర్!

Also Read: యశస్వి జైస్వాల్‌తో స్టార్ హీరోయిన్ డేటింగ్ రూమర్స్..స్పందించిన మృణాల్ ఠాకూర్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Chintada Ravikumar Arrest: మహిళా ఎస్సైపై దురుసు ప్రవర్తన..ఆముదాలవలస వైసీపీ నేత చింతాడ రవికుమార్ అరెస్ట్!

Amadalavalasa, Andhra Pradesh:

YSRCP Chintada Ravikumar Arrest: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆముదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ చింతాడ రవికుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకాకుళం పర్యటన సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా ఎస్ఐపై దౌర్జన్యం చేశారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న ఆయనను ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.

ఘటన నేపథ్యం..
శ్రీకాకుళం పర్యటనలో భాగంగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్.. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జైలులో పరామర్శించేందుకు వైఎస్ జగన్ ఇటీవల శ్రీకాకుళంలో పర్యటించారు. ఈ సందర్భంగా జగన్‌కు స్వాగతం పలికేందుకు చింతాడ రవికుమార్ తన అనుచరులతో కలిసి తరలివచ్చారు.

అయితే ఈ క్రమంలో మహిళా ఎస్సైపై కొందరు వైసీపీ నేతలు దురుసగా ప్రవర్తించారు. కొట్టారోడ్డు వద్ద బందోబస్తులో ఉన్న మహిళా ఎస్ఐ పట్ల రవికుమార్, ఆయన అనుచరులు దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 21 మందిపై పోలీసులు కేసులు నమోదు చేయగా, చింతాడ రవికుమార్‌ను ఈ కేసులో ఏ1 గా చేర్చారు. కేసు నమోదైనప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు.

రవికుమార్ ఆరోపణలు, వివరణ..
అరెస్ట్ సమయంలో చింతాడ రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ పోలీసుల తీరుపై ఆరోపణలు గుప్పించారు. తన కుటుంబ సభ్యులను, వైసీపీ కార్యకర్తలను విచారణ పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు. డీఎస్పీ వద్దకు లొంగిపోయేందుకు వెళ్తుండగా తనను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

అంతకుముందు సోషల్ మీడియా ద్వారా స్పందించిన రవికుమార్.. తనతో పాటు అమాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తే పోలీసులకు లొంగిపోతానని తెలిపారు. జనసంచారం ఎక్కువగా ఉండటం వల్లే మహిళా ఎస్ఐని పక్కకు జరిపామని, అంతేక్రీ ఆమె గౌరవానికి ఎలాంటి భంగం కలిగించలేదని ఆ వీడియోలో వివరణ ఇచ్చారు.

Also Read: రేపటి నుంచి వరుసగా 3 రోజులు సెలవులు..ఆగస్టు 8 నుంచి స్కూళ్లు, కాలేజీలు బంద్!

Also Read: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం..బ్యాలెట్ బాక్సులా? ఈవీఎంలా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Jio Rs 200 Recharge: జియో వినియోగదారులకు అదిరిపోయే ప్లాన్..రూ.200లకే 30 జీబీ డేటాతో 15 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్!

Hyderabad, Telangana:

Jio Rs 200 Recharge Free OTTs: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కస్టమర్ల కోసం మరో ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం మొబైల్ డేటా మాత్రమే కాకుండా, ఎంటర్‌టైన్‌మెంట్ లవర్స్‌ని దృష్టిలో ఉంచుకుని రూ.200 ధరతో ఈ సరికొత్త ప్లాన్‌ను డిజైన్ చేసింది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ OTT ప్రయోజనాలు కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

రూ.200 ప్లాన్ ప్రత్యేకతలు..
ఈ రూ.200 రీఛార్జ్ ప్లాన్ కేవలం 28 రోజుల వ్యాలిడిటీతో వినియోగదారులకు లభిస్తుంది. రోజూవారీ డేటా లిమిట్ ఉండే సాధారణ ప్లాన్‌లా కాకుండా.. మొత్తం 28 రోజులకు కలిపి ఒకేసారి 30 GB హై-స్పీడ్ డేటాను అందిస్తారు. దీన్ని యూజర్లు తమ అవసరానికి తగ్గట్టు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు.

ఈ రీఛార్జ్ ద్వారా అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లతో కలిపి మొత్తం 15 ఓటీటీ సేవలకు ఉచితంగా యాక్సెస్ లభిస్తుంది.

ఓటీటీ ప్రియులు విడివిడిగా వేర్వేరు సబ్‌స్క్రిప్షన్‌లు తీసుకునే పనిలేకుండా, తక్కువ ఖర్చుతోనే సినిమాలు, వెబ్ సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్ ఆస్వాదించాలనుకునే వారికి ఈ ప్లాన్ అద్భుతంగా సరిపోతుంది.

ఈ ప్లాన్ ఎవరికి అనుకూలం?
ప్రతిరోజూ ఇంటర్నెట్ అవసరం పెద్దగా లేనివారికి, లేదా అప్పుడప్పుడు బల్క్ డేటా కావాలనుకునే వారికి ఈ రీఛార్జ్ చక్కగా ఉపయోగపడుతుంది. అయితే, ఈ ప్లాన్‌ను ఎంచుకునే ముందు దీనికి ఏదైనా యాక్టివ్ బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ అవసరమా లేదా అనే పూర్తి వివరాలను 'మై జియో' యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్‌లో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

Also Read: వినియోగదారులకు ఎయిర్‌టెల్ బిగ్‌షాక్..అతిచౌకైన రూ.299 రీఛార్జ్ ప్లాన్ క్యాన్సిల్!

Also Read: మార్కెట్లోకి కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు..చలామణీ ఎప్పటినుంచి అంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Leg Cramps: తరచుగా కాళ్లు నొప్పులు వస్తున్నాయా? ఈ విషయాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు!

Hyderabad, Telangana:

Leg Cramps Deficiency: రాత్రి పడుకున్నప్పుడు లేదా ఎక్కువసేపు కూర్చున్న తర్వాత కాళ్లలో ఆకస్మిక నొప్పి, బిగువును అనుభవించడం చాలా మందిలో సాధారణంగా కనిపించే సమస్యే. కొద్దిసేపట్లో తగ్గిపోయే ఈ నొప్పులను సాధారణంగా 'కాలి తిమ్మిర్లు' అంటారు. అయితే, ఈ సమస్య పదే పదే వేధిస్తుంటే మాత్రం దానిని ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు.

కాలు తిమ్మిర్లకు ప్రధాన కారణాలు..
శరీరంలో తగినంత నీరు లేకపోవడం, ఎండలో ఎక్కువగా పనిచేయడం, లేదా అధిక చెమట వల్ల నీరు, ఎలక్ట్రోలైట్ల కొరత ఏర్పడి కండరాల నొప్పులు వస్తాయి. కండరాలు సక్రమంగా పనిచేయడానికి మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు అత్యంత ముఖ్యం. వీటి లోపం వల్ల కండరాల బలహీనత, సంకోచాలు సంభవిస్తాయి. అయితే, సొంతంగా సప్లిమెంట్లు లేదా మాత్రలు వాడటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.

శరీరానికి అలవాటు లేకుండా అకస్మాత్తుగా ఎక్కువ వ్యాయామాలు చేయడం వల్ల కండాలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. అలాగే ఎక్కువసేపు ఆఫీసుల్లో కూర్చోవడం లేదా ఎక్కువసేపు నిలబడటం వల్ల కాలి కండరాలలో అసమతుల్యత ఏర్పడుతుంది.

తిమ్మిర్లు వచ్చినప్పుడు తక్షణ ఉపశమనం కోసం..
నొప్పిగా ఉన్న కండరాన్ని మెల్లగా సాగదీయాలి (ఉదాహరణకు కాలి వేళ్లను మెల్లగా పైకి లాగడం). కండరాన్ని సున్నితంగా మసాజ్ చేయడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. నొప్పి తగ్గిన తర్వాత కాసేపు నెమ్మదిగా నడవడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి.

ఆరోగ్యకరమైన జీవనశైలి చిట్కాలు..
> రోజంతా తగినన్ని నీరు, ద్రవ పదార్థాలు తీసుకోవాలి.

> వ్యాయామానికి ముందు, తర్వాత సరైన స్ట్రెచింగ్ చేయాలి.

> అప్పుడప్పుడు లేచి నడవడం, కాళ్లను కదిలించడం చేయాలి.

> ఆకుకూరలు, పప్పుధాన్యాలు, గింజలు, విత్తనాలు, పండ్లు, పాలు వంటి సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం ద్వారా అవసరమైన పోషకాలు అందుతాయి.

ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి?
కాలు నొప్పులు తరచుగా వస్తూ, తీవ్రమైన బాధను కలిగిస్తే లేదా రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కాలులో వాపు, ఎరుపు రంగులోకి మారడం, నిరంతర నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి.

(గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీర్ఘకాలిక లేదా తీవ్రమైన సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించాలి.)

Also Read: Muskmelon Benefits: కాన్సర్ కణాలను చంపేసే ఏకైక పండు..రోజూ తింటే మెండు!

Also Read: Detox Overnight: రాత్రికి రాత్రే మీ కడుపంతా క్లీన్ అవ్వాలంటే ఇలా చేయండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Bonalu: రేపు హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా బోనాలు.. 25 ఆలయాలకు పట్టువస్త్రాలు సమర్పించేది వీరే

Hyderabad, Telangana:

Hyderabad Bonalu: రేపు హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా బోనాలు జరగనున్నాయి. ఆషాఢ మాసం పురస్కరించుకుని జరిగే బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం రేపు జరగనుంది. గోల్కొండ, బల్కంపేట, లష్కర్‌ బోనాల అనంతరం హైదరాబాద్‌ మొత్తం రేపు బోనం ఎత్తుకోనుంది. ఈ సందర్భంగా భారీ స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి. అన్నీ ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. విద్యుద్దీపాలంకరణలో ధగధగలాడుతున్నాయి. బోనాల సందర్భంగా రేపు హైదరాబాద్‌లోని అన్నీ ప్రముఖ ఆలయాల్లో తెలంగాణ ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పించనుంది.

ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆగస్టు 9న హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని పలు ప్రముఖ అమ్మవారి ఆలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ భక్తుల విశ్వాసాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ప్రముఖ ఆలయాల్లో ప్రభుత్వ ప్రతినిధులుగా పట్టు వస్త్రాలు సమర్పించే ముఖ్య నేతల వివరాల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. లాల్‌ దర్వాజ సింహావాహిని అమ్మవారు, కార్వాన్‌ దర్బార్‌ మైసమ్మ, అక్కన్న మాదన్న ఆలయం తదితర ఆలయాలతోపాటు మొత్తం 25 ఆలయాలకు ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పించనుంది.

ఆలయాలు.. పట్టువస్త్రాలు సమర్పించే అతిథులు
ఉప్పుగూడ మహంకాళి ఆలయం – గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి చైర్మన్

మీరాలం మండి మహంకాళి ఆలయం – గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభ స్పీకర్

లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం – మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ 

కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయం – దామోదర రాజనర్సింహ, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి

సుల్తాన్‌షాహి బంగారు మైసమ్మ ఆలయం – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి

హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయం – దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంత్రి

చిలకలగూడ కట్ట మైసమ్మ ఆలయం – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి

అంబర్‌పేట మహంకాళి ఆలయం – దనసరి అనసూయ సీతక్క, మంత్రి

సబ్జీ మండి నల్ల పోచమ్మ ఆలయం – తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి

రాంబక్షబండ బంగారు మైసమ్మ ఆలయం – జూపల్లి కృష్ణారావు, మంత్రి

భేలా ముత్యాలమ్మ ఆలయం – గడ్డం వివేక్ వెంకటస్వామి, మంత్రి

సుల్తాన్‌షాహి జగదాంబ ఆలయం – అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంత్రి

గౌలిపూర మహంకాళి ఆలయం – వాకిటి శ్రీహరి, మంత్రి

హరిబౌలి నల్ల పోచమ్మ ఆలయం – వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు

హరిబౌలి బంగారు మైసమ్మ ఆలయం – వి. హనుమంతరావు, ప్రభుత్వ సలహాదారు

బోయిగూడ బంగారు మైసమ్మ ఆలయం – కె. కేశవరావు, అద్దంకి దయాకర్, ప్రభుత్వ ప్రతినిధులు

నాచారం మహంకాళి సమేత మహంకాళేశ్వర ఆలయం – పి. సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు

గౌలిగూడ మహంకాళి ఆలయం – హర్కర వేణుగోపాల్ రావు, ప్రభుత్వ సలహాదారు

ఎల్‌బీనగర్ ఖిల్లా మైసమ్మ ఆలయం – పొచారం శ్రీనివాస్ రెడ్డి, ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్‌లు

అలీజాకోట మహంకాళి ఆలయం – విజయ రమణారావు, ప్రభుత్వ సలహాదారు/ఎమ్మెల్యే

మూసీ బ్రిడ్జి భూలక్ష్మి ఆలయం – పట్నం మహేందర్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్

నట్రాజ్ నగర్ మహంకాళి ఆలయం – బాల్మూరి వెంకట్, ప్రభుత్వ విప్

అలియాబాద్ దర్బార్ మైసమ్మ ఆలయం – జాతోత్ రామ్‌చందర్ నాయక్, ఉప సభాపతి

మురాద్ మహల్ నల్ల పోచమ్మ ఆలయం – డా. బండా ప్రకాశ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ 

సీబీఐ క్వార్టర్స్ నల్ల పోచమ్మ ఆలయం – ఎం. అనిల్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు

చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం – బి. మహేష్ కుమార్ గౌడ్, శాసనమండలి సభ్యుడు

0
0
Report

Rajinikanth Sreeleela: సూపర్ స్టార్ రజినీకాంత్‌తో హీరోయిన్ శ్రీలీల..75 ఏళ్ల హీరో..25 ఏళ్ల హీరోయిన్!

Hyderabad, Telangana:Rajinikanth Sreeleela Movie:సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కొత్త సినిమా గురించి ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో యువ నటి శ్రీలీల కీలక పాత్రలో నటించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ ప్రస్తుతం దర్శకుడు అశ్వత్ మారిముత్తుతో ఓ భారీ సినిమాకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు కమల్ హాసన్ నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి పనిచేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
0
0
Report
Advertisement

Mrunal Thakur Dating: యశస్వి జైస్వాల్‌తో స్టార్ హీరోయిన్ డేటింగ్ రూమర్స్..స్పందించిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్!

Hyderabad, Telangana:

Mrunal Thakur Yashasvi Jaiswal Dating: క్రికెట్ ప్రపంచానికి, సినీ పరిశ్రమకు మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తరచూ క్రికెటర్లు, నటీమణుల ప్రేమ వ్యవహారాలు, పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లపై నటి మృణాల్ స్పందించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

డేటింగ్ రూమర్స్‌కు కారణం ఏమిటి?
ఇటీవల ముంబైలోని ఓ కేఫ్ నుంచి మృణాల్ ఠాకూర్, యశస్వి జైస్వాల్ వేర్వేరుగా బయటకు వస్తున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. 34 ఏళ్ల మృణాల్, 24 ఏళ్ల యశస్వి జైస్వాల్‌తో ప్రేమలో ఉన్నారంటూ వరుస కథనాలు చక్కర్లు కొట్టాయి. వీరి మధ్య దాదాపు 9-10 ఏళ్ల వయసు తేడా ఉండటం గమనార్హం.

నెట్టింట వైరల్ అవుతున్న మృణాల్ కామెంట్..
ఈ పుకార్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ మృణాల్ ఠాకూర్ స్పందించినట్లు ఓ కామెంట్ నెట్టింట వైరల్ అవుతోంది. "బ్రో.. ప్రశాంతంగా ఉండు.. ఇంత చదువుకున్నా కూడా ఇలాంటి పుకార్లను ఎలా నమ్ముతున్నారు? దేశంలో మరే ఇతర విషయాలు లేవా? ఇలాంటివి మానేసి సరైన అంశాలపై వీడియోలు చేయండి, అప్పుడు ఎక్కువ వ్యూస్ వస్తాయి" అంటూ ఆమె గట్టిగానే బదులిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే, ఆ వైరల్ వీడియోలో ప్రస్తుతం ఈ కామెంట్ కనిపించడం లేదు. ఇది నిజంగా మృణాల్ చేసిన కామెంటా లేక ఎడిట్ చేసిన స్క్రీన్ షాట్లా అనే దానిపై స్పష్టత లేదు. గతంలోనూ నటుడు ధనుష్‌తో మృణాల్ పెళ్లి జరగనుందంటూ వార్తలు రాగా, ఆమె సన్నిహితులు ఆ రూమర్లను ఖండించిన సంగతి తెలిసిందే. తాజాగా యశస్వి జైస్వాల్‌తో వస్తున్న వార్తలపై కూడా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి.

Also Read: డిమోన్ పవన్‌తో పెళ్లి అప్పుడే! బిగ్‌బాస్ బ్యూటీ రీతూ చౌదరి క్రేజీ ఆన్సర్!

Also REad: 'కొరియన్ కనకరాజు' సినిమాపై మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్..ఇంటర్నెట్‌లో రివ్యూ వైరల్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Avika Gor Dengue: డెంగ్యూ బారిన పడిన నటి అవికా గోర్.. తీవ్ర జ్వరంతోనూ షూటింగ్ పూర్తి చేసిన వైనం!

Mumbai, Maharashtra:

Avika Gor Dengue News: ప్రముఖ నటి, 'బాలికా వధూ' ఫేమ్ అవికా గోర్ డెంగ్యూ బారిన పడి ఆసుపత్రిలో చేరారు. గత ఐదు రోజులుగా 103 నుంచి 104 డిగ్రీల తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ, ఆమె తన వృత్తిపరమైన బాధ్యతల పట్ల చూపిన నిబద్ధతను భర్త మిలింద్ చంద్వానీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

జ్వరంతోనూ వెనకడుగు వేయని అవికా..
అవికా గోర్ అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ తన వృత్తిపరమైన బాధ్యతల పట్ల చూపిన అంకితభావాన్ని భర్త మిలింద్ ప్రశంసించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ఐదు రోజులుగా 104 డిగ్రీల జ్వరం ఉన్నప్పటికీ, రెండు రోజులు మిగిలి ఉన్న ఒక ప్రాజెక్ట్ షూటింగ్‌ను ఆమె కేవలం ఒక్క రోజులోనే పూర్తి చేశారని మిలింద్ తెలిపారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి.. ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లి మరీ ఒక యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నారని, ఇతరుల సమయం, డబ్బు వృథా కాకూడదనే ఉద్దేశంతోనే ఆమె ఈ సాహసం చేశారని ఆయన చెప్పారు. షూటింగ్ ముగించుకుని ముంబైకి తిరిగి వచ్చి టెస్ట్ చేయించుకోగా, ఆమెకు డెంగ్యూ ఉన్నట్లు తేలిందని, దీంతో వెంటనే ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చిందని తెలిపారు.

"ఇతరుల సమయానికి, వనరులకు ఆమె ఇచ్చే విలువ నాకు ఎప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తుంది. పరిశ్రమలో అలా ఆలోచించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అవికా, నీ గురించి నాకు గర్వంగా ఉంది" అంటూ మిలింద్ భావోద్వేగానికి గురయ్యారు.

అవికా గోర్ సినీ ప్రస్థానం..
2007లో ఓ ధారావాహిక ద్వారా బాలనటిగా ప్రయాణం ప్రారంభించిన అవికా.. 'బాలికా వధు'లో 'ఆనంది' పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా అపారమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత 'ససురల్ సిమర్ కా', 'లాడో' వంటి పలు విజయవంతమైన ధారావాహికల్లో నటించారు. కేవలం బుల్లితెరపైనే కాకుండా, పలు హిందీ, తెలుగు చిత్రాల్లోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Also Read: ప్రభాస్ సినిమాలోని ఈ లేడీ విలన్ గుర్తుందా? 54 ఏళ్ల వయసులోనూ హీట్ పుట్టించే గ్లామర్!

Also Read: డిమోన్ పవన్‌తో పెళ్లి అప్పుడే! బిగ్‌బాస్ బ్యూటీ రీతూ చౌదరి క్రేజీ ఆన్సర్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

OYO ఫుల్ ఫార్మ్ ఏంటో మీకు తెలుసా? తప్పకుండా తెలుసుకోండి..

Hyderabad, Telangana:

Oyo Full Form In Telugu: యో (OYO)... ఈ పేరు వినని వారు, ఈ హోటళ్లలో ఉండని వారు చాలా అరుదు.. సామాన్యుడి బడ్జెట్‌లో నాణ్యమైన గదులను అందుబాటులోకి తెచ్చి.. భారత్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన రంగంలో సంచలనం సృష్టించిన సంస్థ ఇది.. అయితే, మనం రోజూ చూసే ఈ OYO అనే పదానికి Full Form ఏమిటో చాలామందికి తెలియదు.. OYO అంటే On Your Own (ఆన్ యువర్ ఓన్) అని అర్థం.. తెలుగులో దీని అర్థం మీ సొంతంగా లేదా  మీకై మీరుగా అని చెప్పుకుంటారు..

ఈ సంస్థ ప్రస్థానం వెనుక ఒక యువకుడి కష్టం, మంచి ఆలోచనలు ఉన్నాయి. ఒడిశాకు చెందిన రితేష్ అగర్వాల్ అనే 19 ఏళ్ల యువకుడు 2012లో ఓరావెల్ స్టేస్ (Oravel Stays) పేరుతో ఒక వెబ్‌సైట్‌ను మొదలు పెట్టారు. ప్రయాణికులకు తక్కువ ధరలో మంచి హోటళ్లను వెతుక్కోవడానికి ఇది ఎంతగానో సహాయపడింది.. అయితే, కేవలం హోటళ్ల సమాచారం ఇవ్వడమే కాకుండా.. వాటిలో కనీస హోటల్ వివరాలు, ఫీచర్స్‌, ధరలు అన్ని అందుబాటులో ఉంచారు. అయితే, దీనిని పెంచితే బాగుంటుందని భావించిన రితేష్.. 2013లో దీనిని OYO Roomsగా పేరు మార్చేశారు. 

On Your Own అనే పేరు పెట్టడానికి ప్రధాన కారణం... ప్రయాణికులు ఎక్కడికి వెళ్లినా సరే.. తమ సొంత ఇంట్లో ఉన్నంత సౌకర్యవంతంగా.. స్వేచ్ఛగా, తక్కువ బడ్జెట్‌లో బస చేయాలనే ఉద్దేశమని ఆయన తెలిపారు. సాధారణ హోటల్ యజమానులతో భాగస్వామ్యం కుదుర్చుకుని.. ఆ గదుల్లో ఏసీ, వైఫై, శుభ్రమైన బెడ్డింగ్, మంచి వాష్‌రూమ్‌లు వంటి సౌకర్యాలను ఒకే రకమైన ప్రమాణాలతో అందించడం ఓయో ప్రత్యేకత..

ఒక్క గది సరిగ్గా లేకపోవడం వల్ల పడిన ఇబ్బంది నుంచి పుట్టుకొచ్చిన ఈ ఆలోచన.. నేడు వేల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన గ్లోబల్ బ్రాండ్‌గా మారింది. ప్రస్తుతం భారత్‌తో పాటు US, యుకె, మలేషియా, ఇండోనేషియా వంటి అనేక దేశాల్లో OYO సేవలు విస్తరించాయి. ఒక చిన్న ఆలోచనతో హోటల్స్‌ రంగ చిత్రపటాన్నే మార్చేసి.. కోట్లాది మందికి తక్కువ ఖర్చులో ఆతిథ్యం అందిస్తున్న OYO కథ నిజంగానే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం..

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

కెమెరా ఆన్ చేయమన్న బాస్.. ఫేస్ మాస్క్‌తో షాకిచ్చిన Gen-Z ఎంప్లాయ్‌.. వీడియో!

Hyderabad, Telangana:

 Gen-Z WFH Viral Video Viral: కరోనా మహమ్మారి తర్వాత వెలుగులోకి వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) సంస్కృతి ప్రస్తుతం కార్పొరేట్ ఆఫీసుల్లో సర్వసాధారణమైపోయింది. ఇంటి నుంచే పనిచేసే సౌలభ్యం ఉన్నప్పటికీ.. ఆన్‌లైన్ మీటింగ్‌ల సమయంలో అనేక ఆసక్తికర, విచిత్ర సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఒక జెన్-జీ (Gen-Z) ఉద్యోగిని వర్క్ ఫ్రమ్ హోమ్ మీటింగ్‌లో చేసిన పని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, ఆ మహిళ ఉద్యోగిని ఏం చేసింది. ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒక కంపెనీకి చెందిన ఆన్‌లైన్ రిమోట్ మీటింగ్ జరుగుతుండగా.. ఒక జెన్-జీ ఉద్యోగిని తన వెబ్‌క్యామ్‌ను ఆఫ్ చేసి ఉంచింది.. మీటింగ్‌లో అందరూ పాల్గొనాలని భావించిన మేనేజర్ ఆమెను పలుమార్లు క్యామెరా ఆన్ చేయాల్సిందిగా కోరారు.. మేనేజర్ పట్టుబట్టడంతో చేసేదేమీ లేక ఆ ఉద్యోగిని తన వీడియోను ఆన్ చేసింది.

అయితే, స్క్రీన్ పై ఆమెను చూసిన మేనేజర్‌తో పాటు మీటింగ్‌లో ఉన్న ఇతర ఉద్యోగులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.. ఎందుకంటే, ఆమె ముఖానికి ఫేస్ ప్యాక్ (Face Pack) వేసుకొని చాలా ప్రశాంతంగా మీటింగ్‌లో కూర్చుంది. ఆమె అవతారాన్ని చూసి నవ్వు ఆపుకోలేకపోయిన మేనేజర్ సరదాగా స్పందిస్తూ.. ఇలాంటి ఫేస్ ప్యాక్‌లు, స్కిన్ కేర్ పనులన్నీ మీ లంచ్ టైమ్‌లో చేసుకోవచ్చు కదా.. అని అన్నాడు.

దానికి ఆ జెన్-జీ ఉద్యోగిని ఏమాత్రం తడబడకుండా.. చాలా అద్భుతంగా సమాధానం ఇచ్చింది.. సార్, మీరు ఇచ్చే లంచ్ బ్రేక్ కేవలం 15 నిమిషాలు మాత్రమే.. కానీ నా ఫేస్ ప్యాక్ ఆరడానికి కనీసం 20 నిమిషాలు పడుతుంది!.. అని చిరునవ్వుతో బదులిచ్చింది. ఆమె జవాబుదారీతనానికి టీమ్ సభ్యులతో పాటు నెటిజన్స్‌ సైతం ఫిదా అవుతున్నారు.

 
 
 
 
 

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే, ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచింది.. దీనిపై నెటిజన్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. ఆఫీస్ ఒత్తిడిని తేలికగా తీసుకుంటూ.. తమ వ్యక్తిగత పనులకు ప్రాధాన్యత ఇచ్చే జెన్-జీ మనస్తత్వాన్ని చాలామంది సమర్థిస్తున్నారు. అంతేకాకుండా ఉద్యోగి తనకు కేటాయించిన పనిని సమయానికి పూర్తి చేస్తున్నప్పుడు.. ఆమె ముఖానికి ఫేస్ ప్యాక్ ఉందా లేదా పాటలు వింటోందా అనే దానితో పనిలేదని కొందరు కామెంట్ చేశారు.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

  

0
0
Report
Advertisement
Advertisement
Back to top