ముక్తాపూర్ గ్రామంలో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Srikalahasti Temple: కుమారుడి వివాహం అత్యంత వైభవంగా జరిపించిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అనంతరం ఆధ్యాత్మిక యాత్ర చేపట్టారు. తన కొడుకు, కొత్త కోడలితో కలిసి ప్రముఖ ఆలయాలను సందర్శించి పూజలు చేశారు. వియ్యంకులతోపాటు భార్యా పిల్లలతో కలిసి కుటుంబ సమేతంగా డిప్యూటీ సీఎం విక్రమార్క ఏపీకి వచ్చారు. ఏపీలోని తిరుమలతోపాటు శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించారు. శ్రీకాళహస్తి ఆలయంలో రాహు కేతు పూజ చేశారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాకిచ్చిన తెలంగాణ సీఎం.. ఏం చెప్పారంటే?
తిరుమల వెంకటేశ్వర స్వామిని సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. స్వామిని దర్శించుకున్న అనంతరం డిప్యూటీ సీఎం కుటుంబం మొక్కులు చెల్లించుకుంది. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. టీటీడీ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల వచ్చిన అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. 'మా పెద్ద కుమారుడు వివాహం పూర్తయిన సందర్భంగా తిరుమల శ్రీవారి ఆశీస్సుల కోసం కుటుంబసభ్యులతో తిరుమలకు వచ్చాం' అని తెలిపారు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నామని.. ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఈ బడ్జెట్ ఉండబోతున్నట్లు భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధి చేసేలా త్వరలోనే బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నట్లు వెల్లడించారు.
Also Read: Virosh Gold: విజయ్, రష్మిక పెళ్లిలో 257 తులాల బంగారం.. ఇక పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా?
అనంతరం తిరుపతి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సోమవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయ ఈవో వెంకటేశులు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తన కుమారుడు వివాహానికి ముందు గతనెలలో స్వామి వారి దర్శనానికి వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివాహననంతరం మొక్కు తీర్చుకోవడానికి కుటుంబసమేతంగా శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తన భార్య, పిల్లలు, కొత్త కోడలితో కలిసి భట్టి విక్రమార్క రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు చేశారు. పూజల అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞాన ప్రసునాంబ అమ్మవారిని భట్టి కుటుంబం దర్శించుకుంది. దర్శనం, పూజల అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. 'తెలుగు రాష్ట్రాలలో సంక్షేమం అభివృద్ధి రెండు సమపాళ్లల్లో జరుగుతున్నాయి. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని దేవుని కోరుకున్నా' అని భట్టి విక్రమార్క తెలిపారు. దర్శనం అనంతరం శ్రీ గురుదక్షిణామూర్తి సన్నిధానంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి ఈవో వెంకటేశులు భట్టి కుటుంబానికి తీర్థ ప్రసాదాలు అందజేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Venezuela Gold: అమెరికా ఇటీవల వెనిజులా నుండి భారీ మొత్తంలో బంగారాన్ని దేశానికి తరలించినట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ విషయాన్ని అమెరికా అంతర్గత వ్యవహారాల కార్యదర్శి డగ్ బర్గమ్ ధృవీకరించారు. ఆయన ప్రకారం, సుమారు 100 మిలియన్ డాలర్ల విలువైన బంగారం ఇటీవల అమెరికాకు చేరుకుంది. ఈ బంగారం పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో విస్తృతంగా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా పరిశ్రమల అభివృద్ధి, సాంకేతిక రంగాల విస్తరణలో ఇది కీలక పాత్ర పోషించగలదని చెప్పారు.
బర్గమ్ వివరించినట్లుగా, అమెరికా ప్రస్తుతం వెనెజువెలా లో ఉన్న అరుదైన ఖనిజ సంపదను అన్వేషించేందుకు పలు ప్రణాళికలను రూపొందిస్తోంది. అక్కడ ఉన్న బంగారం నిల్వల విలువ దాదాపు 500 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. బంగారంతో పాటు బాక్సైట్, అల్యూమినియం వంటి కీలక ఖనిజాలు కూడా అక్కడ లభిస్తాయని చెప్పారు. ఈ ఖనిజాలు రక్షణ రంగం, విద్యుత్ ఉత్పత్తి, అలాగే వినియోగ వస్తువుల తయారీలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటాయి.
అదనంగా, ఈ వనరులు సాంకేతిక రంగంలో కూడా అమెరికాకు ప్రయోజనం కలిగిస్తాయని బర్గమ్ తెలిపారు. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతికతల అభివృద్ధిలో ప్రపంచ స్థాయిలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో, చైనాతో జరుగుతున్న సాంకేతిక పోటీలో అమెరికాకు ఈ ఖనిజాలు వ్యూహాత్మకంగా సహాయపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దిశగా డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలు కీలకమని కూడా చెప్పారు.
బర్గమ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇటీవల అమెరికా చమురు, గ్యాస్, మైనింగ్ రంగాలకు చెందిన అధికారులు వెనిజులా పర్యటనకు వెళ్లారు. అక్కడి సహజ వనరులను పరిశీలించి, వాటిని వినియోగించే అవకాశాలపై చర్చలు జరిపారు. స్థానిక ప్రజలు కూడా ఈ ప్రాజెక్టులపై ఆసక్తి చూపుతున్నారని, ఆర్థికాభివృద్ధికి ఇది దోహదపడుతుందని భావిస్తున్నారని ఆయన తెలిపారు.
ఇదిలా ఉండగా, 2026 జనవరిలో అమెరికా వెనిజులాలో సైనిక చర్యలు చేపట్టింది. ఆ సమయంలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్యను అదుపులోకి తీసుకుని అమెరికాకు తరలించినట్లు సమాచారం. నార్కో-టెర్రరిజం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా అధికారులు పేర్కొన్నారు.
వెనిజులా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు కలిగిన దేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. మదురో అధికారాన్ని కోల్పోయిన తర్వాత, అక్కడి చమురు ఉత్పత్తి, విక్రయాల నిర్వహణపై అమెరికా పలు ప్రైవేట్ సంస్థలతో చర్చలు ప్రారంభించింది. అదే సమయంలో కొన్ని ఆర్థిక ఆంక్షలను కూడా తగ్గిస్తూ, వెనిజులాకు ముడి చమురు వ్యాపారం చేయడానికి లైసెన్సులు మంజూరు చేసింది.
ఈ పరిణామాలు అమెరికా ఆర్థిక, రక్షణ, ఇంధన వ్యూహాల్లో కీలక మార్పులకు దారి తీసే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. వెనిజులా నుండి వచ్చిన 100 మిలియన్ డాలర్ల బంగారం అమెరికా పరిశ్రమలకు మద్దతు ఇవ్వడమే కాకుండా, ప్రపంచ మార్కెట్లో అమెరికా స్థానాన్ని మరింత బలపరచే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. అలాగే సహజ వనరులపై వ్యూహాత్మక ప్రాప్యతతో అంతర్జాతీయ పెట్టుబడులు పెరగడంతో పాటు, వాణిజ్య, రక్షణ రంగాల్లో కూడా కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Ishan kishan sister dies before t20 wc final: ఈ టోర్నమెంట్లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగింది. సమష్టిగా అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ నేషనల్ క్రికెట్ టీమ్ ను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత్ మూడోసారి టీ20 ప్రపంచకప్ను గెలుచుకుంది. అంతేకాదు డిఫెండింగ్ ఛాంపియన్గా టైటిల్ను నిలబెట్టుకోవడంతో పాటు స్వదేశంలో టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా కూడా చరిత్ర సృష్టించింది.
ఫైనల్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడాడు. 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 54 పరుగులు చేసి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మరోవైపు సంజు శాంసన్ తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు బలమైన స్కోర్ను అందించాడు. మ్యాచ్ అనంతరం అధికారిక ప్రసారకర్తతో మాట్లాడిన ఇషాన్ కిషన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఫైనల్ మ్యాచ్కు రెండు రోజుల ముందు తన కజిన్ సిస్టర్ కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిందని తెలిపాడు. ఆ విషాద వార్త కారణంగా తన కుటుంబ సభ్యులు ఎవరూ ఫైనల్ మ్యాచ్కు రావలేకపోయారని చెప్పాడు. ఈ గెలుపును ఆమెకు అంకితం చేస్తున్నానని చెప్పుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఫైనల్కు ముందు మా కజిన్ సిస్టర్ ప్రమాదంలో మృతి చెందింది. ఆమె కోసం నేనింకా బాగా ఆడాలని అనుకున్నాను. ఈ కప్ను ఆమెకే అంకితం చేస్తున్నాను. ఆమె ఇక మన మధ్య లేదని నమ్మడం చాలా కష్టం. మ్యాచ్కు ముందు ఈ విషాదం నన్ను మానసికంగా బాగా కుంగదీసింది. కానీ ఆమె కోసం ఈ ట్రోఫీ గెలవాలని సంకల్పించాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నా నా విజయాన్ని చూసి ఆమె గర్వపడుతుందని నమ్ముతున్నాను అని ఇషాన్ తెలిపాడు.
ఈ విషాద సమయంలో తనకు జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎంతో ధైర్యం చెప్పాడని కూడా వెల్లడించాడు. “నా సోదరి మరణించిన విషయం తెలిసినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఆ బాధను హార్దిక్ భాయ్తో పంచుకున్నాను. జట్టు ప్రయోజనాలను ముందుగా చూడాలని ఆయన సూచించారు. ఆయన మాటలు నాకు ధైర్యం ఇచ్చాయి. ఈ రోజు మహిళా దినోత్సవం కావడంతో ఈ విజయం నాకు మరింత భావోద్వేగాన్ని కలిగిస్తోంది” అని చెప్పాడు.
ఇలాంటి కష్టకాలంలో తన కుటుంబంతో పాటు జట్టు సభ్యులందరూ తనకు అండగా నిలిచారని, సహచర ఆటగాళ్లు కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారని ఇషాన్ కృతజ్ఞతలు తెలిపాడు. గత రెండు సంవత్సరాలుగా తన కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, జట్టులోకి రావడం–మళ్లీ బయటపడడం వంటి పరిస్థితులు ఎదురైనా ఈ ప్రపంచకప్లో మంచి ప్రదర్శన చేయడం తన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని చెప్పాడు.
ఇక ఇషాన్ కిషన్ కజిన్ సిస్టర్ మరియు ఆమె భర్త మార్చి 6న జరిగిన ఘోర కారు ప్రమాదంలో మరణించారు. ఒక పెళ్లి కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దంపతులకు ఆరు నెలల వయసున్న ఒక శిశువు, మూడు సంవత్సరాల చిన్నారి ఉన్నారు. అదృష్టవశాత్తూ ఆ ఇద్దరు పిల్లలు ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ విషాదం కారణంగా ఫైనల్ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూడడానికి ఇషాన్ కుటుంబ సభ్యులు అహ్మదాబాద్కు రావలేకపోయారు. అయితే ఫైనల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత ఇషాన్ కిషన్ తన బ్యాట్ను ఆకాశం వైపు చూపిస్తూ తన సోదరికి ప్రత్యేకంగా నివాళులర్పించాడు. ఆ క్షణం ప్రేక్షకులను కూడా భావోద్వేగానికి గురి చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Adulterated Wheat Flour: ఏం తినాలన్నా ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నోటిలోకి ఒక ముద్ద పెట్టుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఇది తింటే ఏమవుతుందోనని భయాందోళన చెందాల్సి వస్తోంది. దీనికి కారణం కల్తీ. ఆహార పదార్థాలను యథేచ్చగా కల్తీ చేస్తున్నారు. సులభంగా డబ్బులు సంపాదించడం.. అధిక ఆదాయం.. లాభం కోసం వ్యాపారులు కొందరు కల్తీకి పాల్పడుతున్నారు. వారి దురాశకు ప్రజల ప్రాణాలు దెబ్బతింటున్నాయి. నూనెలు, నెయ్యి, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అన్నీ కల్తీ చేస్తుండగా.. తాజాగా గోధుమపిండిని కూడా కల్తీ చేస్తున్నారు. అలా కల్తీ చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: India vs NZ: విశ్వవిజేతగా భారత్.. కివీస్ను ఊచకోత కోసిన సూర్యసేన
హైదరాబాద్లోని గచ్చిబౌలి పరిధిలో కల్తీ నూనెలు, గోధుమ పిండి తయారీని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు గుట్టురట్టు చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. శేరిలింగంపల్లి ఎస్ఓటీ బృందం గచ్చిబౌలి పరిధిలోని వట్టినాగులపల్లి ఇందిరమ్మ కాలనీలో ఉన్న శ్రీ జస్నాత్ ట్రేడర్స్ అనే దుకాణంపై దాడి చేసింది.
Also Read: Abhishek Sharma: ఇది అభిషేక్ నుంచి కోరుకున్నది.. దంచికొట్టిన కాటేరమ్మ కొడుకు
రాజస్థాన్కు చెందిన దుకాణ యజమాని గడువు ముగిసిన వివిధ కంపెనీల వంట నూనెలను సేకరించి వాటిని సోయాబీన్ నూనెతో కలిపి గోల్డ్ ఫేస్ లైట్, రాజ్ గోల్డ్ పామాయిల్, గోల్డ్ డ్రై, గోల్డ్ ఫ్రెష్, హెల్త్ కేర్, నంది ప్యూర్ పూజా ఆయిల్ వంటి పేర్లతో మళ్లీ ప్యాకింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పలు కంపెనీలకు చెందిన గడువు ముగిసిన గోధుమ పిండిని సేకరించి జస్నాత్ గోల్డ్ చక్కి అట్టా పేరుతో తిరిగి ప్యాక్ చేసి అమ్ముతున్నట్లు బయటపడింది.
ఈ దాడిలో పోలీసులు మొత్తం 5,026 లీటర్ల కల్తీ వంట నూనె (సుమారు రూ.10,55,460 విలువ), 5,192 కిలోల గోధుమ పిండి (సుమారు రూ.3,11,520 విలువ)ని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటితోపాటు ఒక వెయింగ్ మెషిన్, ఒక ఆయిల్ ఫిల్టర్ మెషిన్, ఒక గోధుమ ఫిల్టర్ మెషిన్, ఖాళీ సంచులు, రెండు మొబైల్ ఫోన్లు, ఒక టెంపో ట్రాలీ ఆటోను పోలీసులు స్వాధీనం సీజ్ చేశారు.
కల్తీకి పాల్పడుతున్న రాజస్థాన్కు చెందిన భన్వర్ రామ్ జాట్ (46), అతడి కుమారుడు అశోక్ కుమార్ (22)లను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న వస్తువులతో పాటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కల్తీ ఆహార పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తక్కువ ధరకు వచ్చే పదార్థాలను నమ్మకూడదని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Crude Oil Price Today: పశ్చిమాసియాలో ముడిచమురు ధరలు బ్యారెల్ కు దాదాపు 120 డాలర్ల మార్క్ ను దాటేసింది. ఇరాన్ యుద్ధం చమురు ఉత్పత్తి, షిప్పింగ్కు అంతరాయం కలగడం.. గత మూడు సంవత్సరాలకు కాలంలో ఒక బ్యారెల్ ధర ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. అంతర్జాతీయ ప్రమాణం బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు 117 డాలర్లకి చేరుకుంది. ఇది శుక్రవారం ముగింపు ధర $92.69 నుండి 16.5 శాతం పెరుగుదల నమోదు చేసింది. అమెరికా చమురు ధరలకు బెంచ్ మార్క్ గా ఉన్న వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియ్ ధర 106.22 డాలర్లు వరకు పలికింది. అయితే శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి ఆ రేటు 90.90 డాలర్లుగా ఉంది. తాజాగా 16.9 శాతం పెరిగింది. దీంతో షికాగ మెర్కంటైల్ ఎక్స్చేంజీలో ట్రేడింగ్ ప్రారంభమైన అనంతరం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 16.5శాతం పెరిగింది. దీంతో 107. 97డాలర్లకు ఎగిసింది.గత వారం అమెరికా క్రూడ్ ధర 36శాతం, బ్రెంట్ క్రూడ్ 26శాతం వరకు పెరిగాయి. ఈ ఎఫెక్ట్ ట్రేడింగ్ లోనూ కనిపించింది.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఇంధన మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ప్రాంతం ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో కీలక పాత్ర పోషిస్తుంది. సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, ఖతార్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్ వంటి దేశాల నుంచి ప్రపంచానికి పెద్ద మొత్తంలో చమురు, గ్యాస్ ఈ మార్గం ద్వారా సరఫరా అవుతుంది. అయితే తాజా యుద్ధ పరిస్థితుల కారణంగా ఈ సరఫరాలపై అనిశ్చితి నెలకొంది.
నిల్వ ట్యాంకులు ఇప్పటికే నిండిపోవడంతో ఎగుమతులు తగ్గే పరిస్థితి రావడంతో ఇరాక్, కువైట్, యూఏఈ వంటి దేశాలు తమ ఉత్పత్తిని కొంత మేర తగ్గించినట్లు సమాచారం. ఇదే సమయంలో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాలు పరస్పరం చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాలపై దాడులు జరపడం ఆందోళనలను మరింత పెంచింది. ఈ పరిణామాల వల్ల ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో కూడా అస్థిరత కనిపిస్తోంది.
చమురు ధరలు కూడా ఈ ఉద్రిక్తతలతో ప్రభావితమయ్యాయి. అమెరికా ముడి చమురు ధర చివరిసారిగా 2022 జూన్ 30న బ్యారెల్కు 100 డాలర్లను దాటి 105.76 డాలర్ల వరకు చేరింది. అలాగే బ్రెంట్ ముడి చమురు ధర 2022 జూలై 29న బ్యారెల్కు సుమారు 104 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. తాజాగా మార్చి 1న ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్పై దాడులు జరిపిన తర్వాత చమురు ధరలు మళ్లీ పెరగడం ప్రపంచ మార్కెట్లలో ఆందోళనలను రేకెత్తించింది. ఇంధన ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం అధికమవుతుందని, ముఖ్యంగా అమెరికాలో వినియోగదారుల ఖర్చులు తగ్గే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అమెరికాలో పెట్రోల్ ధరలు కూడా ఇటీవల పెరిగాయి. ఆదివారం నాటికి గాలన్ పెట్రోల్ ధర సుమారు 3.45 డాలర్లకు చేరింది. ఇది వారం రోజుల క్రితం కంటే గణనీయమైన పెరుగుదలగా పేర్కొంటున్నారు. డీజిల్ ధరలు గాలన్కు సుమారు 4.6 డాలర్లకు చేరాయి. ఈ ధరలు ఒక వారంలోనే దాదాపు 83 సెంట్లు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్ మాట్లాడుతూ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగదని చెప్పారు. త్వరలోనే పెట్రోల్ ధరలు మళ్లీ గాలన్కు 3 డాలర్ల కంటే దిగువకు రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ ప్రభావం కొన్ని వారాలు మాత్రమే ఉండవచ్చని తెలిపారు.
ఇదే సమయంలో టెహ్రాన్లోని ఒక చమురు డిపో మరియు పెట్రోలియం బదిలీ టెర్మినల్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో నలుగురు మరణించినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఈ డిపోలను ఇరాన్ సైన్యం క్షిపణి ప్రయోగాలకు అవసరమైన ఇంధన నిల్వల కోసం ఉపయోగిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్ రోజుకు సుమారు 1.6 మిలియన్ బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తోంది. ఇందులో ఎక్కువ భాగం చైనాకు వెళ్తుంది. యుద్ధ ప్రభావంతో ఈ ఎగుమతులు తగ్గితే చైనా ఇతర దేశాల నుంచి చమురు సరఫరాను పొందేందుకు ప్రయత్నించాల్సి వచ్చే అవకాశం ఉంది.
చమురు ధరలతో పాటు సహజ వాయువు ధరలు కూడా యుద్ధ ప్రభావంతో పెరుగుతున్నాయి. అయితే చమురు ధరలతో పోలిస్తే పెరుగుదల కొంత తక్కువగా ఉంది. ఆదివారం రాత్రి నాటికి సహజ వాయువు ధర 1,000 క్యూబిక్ అడుగులకు సుమారు 3.33 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇది శుక్రవారం ముగింపు ధర 3.19 డాలర్లతో పోలిస్తే సుమారు 4.6 శాతం ఎక్కువ. గత వారంలో మొత్తంగా సహజ వాయువు ధరలు దాదాపు 11 శాతం వరకు పెరిగినట్లు మార్కెట్ డేటా సూచిస్తోంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Team India Creates New History: అద్భుతమైన ఆట తీరుతో అదరగొట్టిన భారత జట్టు టీ 20 ప్రపంచకప్ను వరుసగా రెండోసారి చేజిక్కించుకుంది. వరుసగా రెండోసారి ఐసీసీ ట్రోఫీని భారత జట్టు ముద్దాడింది. ఏమాత్రం ప్రత్యర్థి న్యూజిల్యాండ్ అవకాశం ఇవ్వకుండా బ్యాటర్లు, బౌలర్లు చెలరేగి ఆడి భారతదేశాన్ని చాంపియన్గా నిలిపారు. స్వదేశంలో జరిగిన ఫైనల్లో అద్భుతాలు చేసిన టీమిండియా ఆఖరి పోరులో కివీస్పై భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఫలితంగా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ను భారత జట్టు కైవసం చేసుకుంది. మ్యాచ్ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం ఆలయాల్లో పూజలు.. బెట్టింగ్ల జోరు
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడిన భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టు 255 పరుగులు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టు 255 పరుగులు సాధించింది. అనంతరం ఛేదనకు దిగిన కివీస్ జట్టు వికెట్లకు పరుగులు చేసి ౦౦౦౦౦ తేడాతో ఘోరంగా ఓడిపోయి రన్నరప్గా నిలిచింది. భారత్ ధాటికి ఏమాత్రం పోటీనివ్వకుండా కివీస్ ట్రోఫీని చేజార్చుకుంది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టు భారీ స్కోర్ సాధించింది. ట్రోఫీని గెలవాలనే కసితో బ్యాటర్లందరూ అద్భుతంగా ఆడారు. ఓపెనర్ సంజూ శామ్సన్ మొదలుకుని చివరి బ్యాట్స్మన్ తిలక్ వర్మ వరకు అందరూ దుమ్మురేపారు. ప్రపంచకప్ కోసం తన ఇన్నింగ్స్ దాచుకున్నట్టు అభిషేక్ శర్మ ఫైనల్లో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. గత మ్యాచ్ల కన్నాను పరిశీలిస్తే ఈసారి చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చాడు. ఈ మెగాటోర్నీ ప్రారంభం నుంచి నాకౌట్, సూపర్ 8, సెమీ ఫైనల్లో అభిషేక్ శర్మ అస్సలు బ్యాట్ కదిలించలేకపోయాడు. మూడుసార్లు డకౌట్.. తర్వాత డబుల్ డిజిట్ సాధించడానికి చాలా శ్రమించాడు. అలాంటి అభిషేక్ శర్మ ఫైనల్లో మాత్రం మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఔరా అనిపించాడు.
Also Read: IND vs NZ Live: న్యూజిలాండ్కు భారీ లక్ష్యం.. భారత్ ఖాతాలో మరో ట్రోఫీ పక్కానా?
ఆడిన 21 బంతుల్లో 52 పరుగులు సాధించి అభిషేక్ శర్మ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. తొలి ఓవర్ తడబడ్డా కూడా తర్వాత పుంజుకుని సంజూ శామ్సన్తో కలిసి చక్కటి భాగస్వామ్యం నెలకొల్పాడు. అర్ధ సెంచరీలో 6 ఫోర్లు సాధించగా.. 3 సిక్సర్లు బాది అభిమానుల్లో జోష్ నింపాడు. ఎక్కడ డకౌట్ అవుతాడోనని భయాందోళన చెందిన ప్రేక్షకులకు మాత్రం అభిషేక్ ఉత్సాహం నింపి వారి నిరాశను దూరం చేశాడు. వరుసగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న అభిషేక్ ఫైనల్లో మాత్రం నిరాశపరిస్తే భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అయ్యేది. భారీ లక్ష్యం విధించి ప్రత్యర్థిని ప్రమాదంలో నెట్టాలని భారత్ వేసిన వ్యూహం అభిషేక్ శర్మ ఇన్నింగ్స్తో ఫలించిందని చెప్పుకోవచ్చు. సెంచరీ దిశగా అడుగుపెడతానుడనుకుంటే రచిన్ రవీంద్ర వేసిన చక్కటి బంతికి అభిషేక్ దొరికిపోయాడు. ఆ ఔట్ కూడా ఎలా ఔటయ్యాడా? అని ఆశ్చర్యానికి గురవ్వాల్సిన పరిస్థితి. అభిషేక్ ఔటవడంతో క్రీజులోకి ఇషాన్ కిషన్ దిగాడు. మరి ఉత్కంఠ రేపే ఈ మ్యాచ్లో భారత జట్టు అద్భుతంగా ఆడి చివరికి విజయం సాధించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
T20 World Cup 2026 India vs New Zealand Final: టీ20 ప్రపంచకప్ డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు ఫైనల్లో అదరగొట్టింది. నాకౌట్ నుంచి అజేయంగా ఆడిన భారత జట్టు.. సూపర్ 8 మ్యాచ్ల్లో ఉత్కంఠ విజయాలు అందుకుని సెమీస్లోకి అడుగుపెట్టింది. అదిరిపోయే ఇన్నింగ్స్తో సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టిన భారత జట్టు న్యూజిలాండ్పై చితక్కొట్టింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తుది పోరులో అద్భుతంగా ఆడి ప్రత్యర్థి జట్టుకు భారత్ భారీ లక్ష్యం విధించింది. సంజూ శామ్సన్ మొదలుకుని.. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అదరగొట్టారు.
Also Read: T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం ఆలయాల్లో పూజలు.. బెట్టింగ్ల జోరు
అదరగొట్టిన కాటేరమ్మ కొడుకు
తనలోని బ్యాటింగ్ అంతా ఫైనల్ కోసం దాచుకున్నట్టు అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడాడు. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. టోర్నీ మొదలు నుంచి సెమీ ఫైనల్ వరకు పేలవ ప్రదర్శన కనబర్చిన యువ బ్యాటర్ ఫైనల్లో మాత్రం తనదైన శైలిలో ఆడి భారీ స్కోర్కు నాంది పలికాడు. సంజూ శామ్సన్తో కలిసి మెరుపు షాట్లు ఆడుతూ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 21 బంతుల్లో 52 పరుగులు చేసి ఔటయ్యాడు. 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అదరగొట్టిన అభిషేక్ శర్మ తనపై విమర్శలు చేస్తున్న వారికి తన బ్యాట్తోనే సమాధానం ఇచ్చాడు. ఈ ఇన్నింగ్స్తో తన అసలైన బ్యాటింగ్ పవర్ ఏమిటో ఇక ఐపీఎల్లో చూడండి అంటూ అభిషేక్ మైదానంలోకి వెళ్లిపోయాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Abhishek Sharma Half Century: టైటిల్ ఫేవరేట్గా నిలిచిన టీమిండియా టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో అదరగొడుతోంది. నాకౌట్లో అజేయంగా ఆడిన టీమిండియా.. సూపర్ 8లో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా.. సెమీ ఫైనల్లో మాత్రం అద్భుతం చేసి ఫైనల్కు చేరింది. న్యూజిలాండ్లో జరిగిన ఫైనల్లో మాత్రం చెప్పుకోదగ్గ ముచ్చట అభిషేక్ శర్మ బ్యాటింగ్. కివీస్ జట్టుపై దుమ్మురేపాడు. వరుసగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న అభిషేక్ శర్మ తన శక్తిన్నంతా ఫైనల్ కోసం దాచుకున్నట్టు ఆడేశాడు.
Also Read: T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం ఆలయాల్లో పూజలు.. బెట్టింగ్ల జోరు
ఓపెనర్ సంజూ శామ్సన్తో కలిసి అభిషేక్ శర్మ అదరగొట్టాడు. ప్రపంచకప్ కోసం తన ఇన్నింగ్స్ దాచుకున్నట్టు అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. గత మ్యాచ్లను పరిశీలిస్తే ఈసారి చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చాడు. ఈ మెగాటోర్నీ ప్రారంభం నుంచి నాకౌట్, సూపర్ 8, సెమీ ఫైనల్లో అభిషేక్ శర్మ అస్సలు బ్యాట్ కదిలించలేకపోయాడు. మూడుసార్లు డకౌట్.. తర్వాత డబుల్ డిజిట్ సాధించడానికి చాలా శ్రమించాడు. అలాంటి అభిషేక్ శర్మ ఫైనల్లో మాత్రం మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఔరా అనిపించాడు.
Also Read: Bandi Sanjay: హెచ్సీఏ కుంభకోణంపై బండి సంజయ్ ఆగ్రహం.. వాటికి చరమగీతం పాడాలి
ఆడిన 21 బంతుల్లో 52 పరుగులు సాధించి అభిషేక్ శర్మ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. తొలి ఓవర్ తడబడ్డా కూడా తర్వాత పుంజుకుని సంజూ శామ్సన్తో కలిసి చక్కటి భాగస్వామ్యం నెలకొల్పాడు. అర్ధ సెంచరీలో 6 ఫోర్లు సాధించగా.. 3 సిక్సర్లు బాది అభిమానుల్లో జోష్ నింపాడు. ఎక్కడ డకౌట్ అవుతాడోనని భయాందోళన చెందిన ప్రేక్షకులకు మాత్రం అభిషేక్ ఉత్సాహం నింపి వారి నిరాశను దూరం చేశాడు. వరుసగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న అభిషేక్ ఫైనల్లో మాత్రం నిరాశపరిస్తే భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అయ్యేది. భారీ లక్ష్యం విధించి ప్రత్యర్థిని ప్రమాదంలో నెట్టాలని భారత్ వేసిన వ్యూహం అభిషేక్ శర్మ ఇన్నింగ్స్తో ఫలించిందని చెప్పుకోవచ్చు. సెంచరీ దిశగా అడుగుపెడతానుడనుకుంటే రచిన్ రవీంద్ర వేసిన చక్కటి బంతికి అభిషేక్ దొరికిపోయాడు. ఆ ఔట్ కూడా ఎలా ఔటయ్యాడా? అని ఆశ్చర్యానికి గురవ్వాల్సిన పరిస్థితి. అభిషేక్ ఔటవడంతో క్రీజులోకి ఇషాన్ కిషన్ దిగాడు. మరి ఉత్కంఠ రేపే ఈ మ్యాచ్లో భారత జట్టు ఎలా ఆడుతుందా? చివరికి విజయం సాధిస్తుందా? అనేది కొన్ని నిమిషాల పాటు ఉత్కంఠగా ఎదురుచూడాల్సిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Telangana Electricity Bill Hike: తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) పెద్ద ఊరటనిచ్చాయి. గత కొన్ని రోజులుగా కరెంట్ ఛార్జీలు పెరుగుతాయని వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ ఈఆర్సీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతున్నప్పటికీ, సామాన్యులపై భారం పడకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఛార్జీల పెంపుపై క్లారిటీ ఇచ్చింది.
పెంపు వార్తలు అవాస్తవం
విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయని జరుగుతున్న ప్రచారాన్ని ఈఆర్సీ తీవ్రంగా ఖండించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ టారిఫ్లను పెంచే ఆలోచన లేదని స్పష్టం చేసింది. పీక్ అవర్స్లో అదనపు ఛార్జీలు విధిస్తారన్న వార్తల్లో కూడా నిజం లేదని తేల్చి చెప్పింది.
ఆదాయ లోటు ఉన్నా..భారం వేయట్లేదు
విద్యుత్ శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంది. విద్యుత్ సరఫరాకు రూ.50,242 కోట్ల వ్యయం అవుతుండగా, ఆదాయం కేవలం రూ.40,659 కోట్లు మాత్రమే వస్తోంది. దాదాపు రూ.9,583 కోట్ల రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ, దానిని వినియోగదారుల నుంచి వసూలు చేయకుండా ప్రభుత్వమే భరించనుంది. బకాయిల భర్తీ కోసం ప్రభుత్వ సహకారం కోరుతున్నట్లు ఈఆర్సీ తెలిపింది.
తెలంగాణలో పారిశ్రామిక, గృహ అవసరాలకు విద్యుత్ వాడకం గణనీయంగా పెరిగింది. ఎస్పీడీసీఎల్ (TSSPDCL) పరిధిలోనే గత ఏడాది 12 లక్షల మంది కొత్త వినియోగదారులు చేరారు. రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 20,975 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా. విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గడంతో పాటు, పంపిణీ నష్టాలను కూడా తగ్గించగలిగామని ఈఆర్సీ పేర్కొంది.
ఉచిత విద్యుత్ పథకం (గృహ జ్యోతి) అమలు
ప్రభుత్వం అమలు చేస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం విజయవంతంగా సాగుతోంది. ఫిబ్రవరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 5.44 కోట్ల జీరో బిల్లులను విద్యుత్ శాఖ జారీ చేసింది. ఈ పథకం కింద ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రూ.1,930 కోట్ల సబ్సిడీ సొమ్ము విద్యుత్ సంస్థలకు అందింది.
విద్యుత్ ఛార్జీల పెంపుపై వస్తున్న ఊహాగానాలను ప్రజలు నమ్మవద్దని, ఏదైనా మార్పు ఉంటే అధికారికంగా వెల్లడిస్తామని ఈఆర్సీ స్పష్టం చేసింది. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే తమ లక్ష్యమని పేర్కొంది.
Also Read: AC Price Hike: భారీగా పెరగనున్న ఏసీ ధరలు? రేట్ల పెరుగుదలకు ప్రధాన కారణం ఏంటో తెలుసా?
Also Read: Womens Day 2026: మహిళా దినోత్సవం నాడు..మహిళలకు మేలు చేసే పనులు..వీటి ప్రాముఖ్యత తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Air Conditioner Price Hike: వేసవి తాపం నుంచి ఉపశమనం పొందాలని ఏసీ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు ఇప్పుడు మీకు దిమ్మతిరిగే న్యూస్ వచ్చింది. ఈ సమ్మర్లో ఏసీల ధరలు భారీగా పెరగనున్నాయి. ముడి పదార్థాల ధరల పెరుగుదల, రూపాయి విలువ పతనం వంటి కారణాలతో ప్రముఖ కంపెనీలన్నీ ధరల పెంపునకు సిద్ధమయ్యాయి. తయారీ కంపెనీల ప్రతినిధుల ప్రకారం ధరల పెరుగుదలకు ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయి.
ఎయిర్ కండీషనర్ తయారీలో కీలకమైన రాగి వంటి లోహాల ధరలు పెరగడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ తగ్గడంతో విడిభాగాల దిగుమతి ఖరీదైనదిగా మారింది. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల సముద్ర మార్గాల్లో సరుకు రవాణా ఛార్జీలు పెరగడం ద్వారా ఏసీలు మరింత ప్రియంగా మారనున్నాయి. విద్యుత్ వినియోగానికి సంబంధించి ప్రభుత్వం తెచ్చిన కొత్త ఇంధన నిబంధనల వల్ల తయారీ ఖర్చు పెరిగింది.
ఏ కంపెనీ ఎంత పెంచుతోంది?
ప్రముఖ కంపెనీలు తమ ఏసీ ధరలను ఏప్రిల్ నుంచి పెంచేందుకు సిద్ధమయ్యాయి. కంపెనీల వారీగా పెంపు అంచనాలు ఇలా ఉన్నాయి.
| కంపెనీ పేరు | ధరల పెంపు (అంచనా) |
| డైకిన్ (Daikin) | 12% వరకు |
| వోల్టాస్ (Voltas) | 5 - 15% |
| బ్లూస్టార్ (Blue Star) | 8 - 10% (ఇప్పటికే అమలులోకి వచ్చింది) |
| హైయర్ (Haier) | 5 - 8% |
| ఎల్జీ (LG) | 7 - 10% (స్టార్ రేటింగ్ను బట్టి) |
| మిత్సుబిషి (Mitsubishi) | 5% వరకు |
డీలర్ల వద్ద పాత ధరలకే ఛాన్స్!
బ్లూస్టార్ ఏసీల తయారీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బి.త్యాగరాజన్ తెలిపిన ప్రకారం.. కంపెనీలు ధరలు పెంచినప్పటికీ.. డీలర్లు ముందుగానే భారీగా స్టాక్ కొనుగోలు చేశారు. కాబట్టి మార్కెట్లో ఉన్న పాత ఇన్వెంటరీ (స్టాక్) ముగిసే వరకు వినియోగదారులకు పాత ధరలకే ఏసీలు లభించే అవకాశం ఉంది. కొత్త స్టాక్ మార్కెట్లోకి వస్తే మాత్రం పెరిగిన ధరలు భారంగా మారుతాయి.
2026 విక్రయాలపై భారీ అంచనాలు
గతేడాది అకాల వర్షాల వల్ల ఏసీ అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. కానీ 2024లో తీవ్రమైన వేడిగాలుల కారణంగా రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది (2025-26) కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో.. ఏసీ అమ్మకాలు 15 శాతం వృద్ధి చెందుతాయని కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ధరల పెంపు ప్రభావం మీ జేబుపై పడకుండా ఉండాలంటే, ఎండలు మరింత ముదరకముందే.. డీలర్ల వద్ద ఉన్న పాత స్టాక్ను పరిశీలించి ఏసీ కొనుగోలు చేయడం ఉత్తమం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
T20 World Cup Final Latest News: క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద సమరానికి సమయం ఆసన్నమైంది.. టి20 ప్రపంచ కప్ తుది పోరు ఈరోజు న్యూజిలాండ్ తో టీమిండియా ఆడబోతోంది. దశాబ్ద కాలంగా పూరిస్తున్న ఐసీసీ ట్రోపీని ఈసారి ఎలాగైనా అందుకోవాలని కోట్లాదిమంది భారతీయులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత జట్టు విజయం సాధించాలని కోరుకుంటూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి..
ఈ నేపథ్యంలోనే రామ జన్మభూమి అయోధ్యలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భారత ఆటగాళ్ల ఫోటోలను పట్టుకొని సాధువులతో పాటు పూజారులు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నారు.. భారత జట్టు అద్భుతమైన విజయం సాధించాలని.. రోహిత్ సేనకప్పుతో తిరిగి రావాలని రాముడిని కోరుకుంటున్నామని వారు అంటున్నారు. మరో పక్క హారతులు ఇస్తూ జైహింద్ నినాదాలతో అయోధ్య వీధులు ఊహించని స్థాయిలో మారుమోగిపోతున్నాయి.
ఉత్తర భారత దేశంలో క్రికెట్ జ్వరం పీక్స్కు చేరింది.. వారణాసిలోని గంగా తీరంలో గంగ హారతి సందర్భంగా టీం ఇండియా గెలవాలని ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కాన్పూర్ లోని అభిమానులు భారీ ఎత్తున విజయ హోమాలు కూడా నిర్వహిస్తున్నట్లు మనం సోషల్ మీడియాలో చూడొచ్చు. ఆ యజ్ఞం లో ఆహుతులు వేస్తూ.. ఆటగాళ్ల ప్రతిభకు దైవ బలం తోడుండాలని కోరుకుంటూ ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు.
Also Read: Team India: యుద్ధం ఎఫెక్ట్.. టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. మ్యాచ్ లేనట్టే.!!
భారత దక్షిణాది కూడా ఇదే కొనసాగుతూ వస్తోంది. తమిళనాడులోని మధురై లో ఉన్న శ్రీ మహా పెరుయవ ఆలయంలో క్రికెట్ ప్రేమికులు ప్రత్యేకమైన అభిషేకాలు కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వందలాది దీపాలను వెలిగించి.. ప్రత్యేకమైన దీపారాధన కూడా చేశారు. టీమిండియా జెండాలను ఆలయ ప్రాంగణాల్లో ఉంచి ప్రత్యేకమైన భక్తితో పూజలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని నీళ్లుగా నాకౌట్ దశలో ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించి.. ఈసారి కివిస్ ను భారత్ మట్టికరిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో #BleedBlue, #T20WorldCup హ్యాష్ ట్యాగ్లు ట్రెండింగ్లో ఉన్నాయి.
Also Read: Team India: యుద్ధం ఎఫెక్ట్.. టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. మ్యాచ్ లేనట్టే.!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Ind vs New Zealand: టీ20 ప్రపంచకప్లో భారత జట్టు ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. అజేయంగా నాకౌట్ దశను దాటి.. తర్వాత ఉత్కంఠగా జరిగిన సూపర్ 8 దశలో అద్భుతంగా రాణించిన టీమిండియా అనంతరం ఇంగ్లాండ్ను సెమీ ఫైనల్లో చిత్తు చేసి ఫైనల్లోకి అడుగుపెట్టింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఫైనల్లో న్యూజిలాండ్తో భారత జట్టు సమరానికి సిద్ధమైంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా క్రికెట్ మ్యాచ్పై ఉత్కంఠ నెలకొంది. మరోసారి భారత జట్టు క్రికెట్ కప్పును కొట్టాలని అభిమానులు, క్రికెట్ప్రియులు ఆలయాలు, ప్రార్థన మందిరాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
టీమిండియా టీ20 వరల్డ్ కప్లో విజయం సాధించాలని హైదరాబాద్లోని నాచారం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మేడ్చల్ జిల్లా అధికార ప్రతినిధి గోపాల్ గౌడ్ మాట్లాడుతూ.. భారతదేశంలో జరుగుతున్న అంతర్జాతీయ టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు గెలవాలని ఆకాంక్షించారు. అహ్మదాబాద్ స్టేడియంలో జరుగుతున్న ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్లో ఇండియా ఘన విజయం సాధించాలని సాయిబాబాను వేడుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా అలుముకున్న క్రికెట్ ఫీవర్తో సాయంత్రం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఒక్క ఆలయాలే కాదు చర్చిలు, మసీదుల్లో కూడా ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. న్యూజిలాండ్పై భారత్ విజయం సాధించాలని కోరుతూ ప్రార్థనలు చేశారు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్లు భారీగా జరుగుతున్నాయి. కోట్లాకు కోట్ల బెట్టింగ్లు క్రికెట్ మ్యాచ్పై నడుస్తున్నాయి. మ్యాచ్ ప్రభావంతో బార్లు అండ్ రెస్టారెంట్లు ఫుల్ బిజీగా మారాయి. ముందే సీట్లన్నీ రిజర్వ్ చేసుకోవడంతో హౌస్ ఫుల్ బోర్డులు పెట్టుకున్నారు. బార్లు బిజీబిజీగా మారిపోయాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Karimnagar Women IAS Officers Telugu News: కరీంనగర్ జిల్లా పరిపాలన చరిత్రలోనే మహిళా కలెక్టర్లు తమతైన ముద్ర వేసిన సంగతి అందరికీ తెలిసిందే. కేవలం కార్యాలయానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో వీరు క్రియాశీలక పాత్ర పోషించారు. అలాగే వీరి పరిపాలనతో జిల్లాను అభివృద్ధి పథంలో నిలిచేలా చేశారు. భిన్న కాలాల్లో పని చేసిన ఈ మహిళ అధికారులు కరీంనగర్ పేరును రాష్ట్రవ్యాప్తంగా.. దేశవ్యాప్తంగా వినిపించేలా చేశారు. కరీంనగర్ జిల్లాకు చేసిన వీరి సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివే..
సుమితా దాత్రా..
కరీంనగర్ జిల్లా కలెక్టర్గా పని చేసిన సుమి దాత్రా పరిపాలనలో ఒక అద్భుతమైన కొత్త కొరవడిని సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పేదరికంతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థపై ఆమె చేసిన లోతైన అధ్యయనం అందరినీ ఆశ్చర్యపరిచేలా చేసింది. ఇక్కడ ప్రజా జీవనస్థితిగతులను, వారి పోరాటాలను చూపుతూ ఆమె రాసిన పూర్ బట్ స్పిరిటేడ్ ఇన్ కరీంనగర్ అనే పుస్తకం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అంతేకాకుండా కరీంనగర్ జిల్లా పై ఒక అధికారిని ఇంతటి లోతైన పరిశోధన చేయడం జిల్లా చరిత్రలోనే అరుదైన ఘట్టమని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
స్మిత సబర్వాల్..
కరీంనగర్ జిల్లా అనగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు స్మిత సబర్వాల్.. జిల్లాలో పనిచేసిన అంతకాలం ఆమె ప్రజలకు అత్యంత చేరువలోనే ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులెత్తించి.. మౌలిక సదుపాయాల కల్పనలో ఆమె క్రియాశీలక పాత్ర పోషించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆమె చెరువులోనే అనేక పెండింగ్ ప్రాజెక్టులు పట్టలెక్కాయి. అంతేకాకుండా ప్రజలతో నేరుగా కలిసి వారి సమస్యలు వినే ఆమె శైలికి కరీంనగర్ ప్రజలంతా ముగ్ధులయ్యారు. ఇందులో భాగంగానే ఆమెను పీపుల్స్ కలెక్టర్గా ప్రేమగా పిలుచుకునేవారు.
పమేలా సత్పతి..
కరీంనగర్ జిల్లా అభివృద్ధి పదంలో పమేలా సత్పతి ఎంతో అంకితభావంతో పనిచేశారు. విద్యతోపాటు వైద్య, మహిళా సంక్షేమ రంగాల్లో ఆమె తీసుకున్న నిర్ణయాలు జిల్లాను తెలంగాణలోనే ముందంజలో నిలిపాయని భావించవచ్చు. అంతేకాకుండా పరిపాలనలో పారదర్శకతను పెంచుతూ.. ప్రభుత్వ పథకాలను అట్టడుగు వర్గాలకు చేరేలా ఆమె నిరంతరం ఎంతగానో శ్రమించేది. అంతేకాకుండా ప్రతి ఒక్క పేద, మధ్యతరగతి కుటుంబం బాగుపడేలా ప్రత్యేకమైన చర్యలు తీసుకునేవారు..
చిత్రా మిశ్రా..
ప్రస్తుతం జిల్లా కలెక్టర్గా చిత్రా మిశ్రా బాధ్యతలు నిర్వర్తిస్తూ.. జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తున్నారు.. గత అధికారుల స్ఫూర్తిని కొనసాగిస్తూనే.. అభివృద్ధి చెందుతున్న ఆధునిక సాంకేతికతను జోడించి జిల్లాను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంలో ఆమె అద్భుతమైన క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.. అంతేకాకుండా కరీంనగర్ లోని వివిధ పట్టణాల అభివృద్ధికి ఆమె చేసే పనులు ఎంతగానో ఉపయోగపడుతూ వస్తున్నాయి.. చివరిగా కరీంనగర్ జిల్లాకు మహిళా కలెక్టర్లు కేవలం పాలకులు గానే కాకుండా.. ప్రజా సంక్షేమమే ముఖ్యమైనదిగా భావిస్తూ పనిచేసే నాయకులుగా నిలిచారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Telangana Latest News: అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళ శక్తికి అండగా నిలిచే ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లోని మహిళా సంఘాల కార్యకలాపాలకు ఇకపై సొంత చిరునామా లభించబోతుందని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలోని ప్రతి గ్రామపంచాయతీలో మహిళ సమాఖ్యలకు సొంత భవనాలను నిర్మించాలని ప్రభుత్వం ప్రత్యేకమైన ఉత్తర్వులను అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ జారీ చేయడం విశేషం.. అంతేకాకుండా అతి త్వరలోనే దీనికి కావాల్సిన ఆర్థిక సహాయం కూడా అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మహిళా సంఘాలకు భవన నిర్మాణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించిన అధికారులు తక్షణమే చర్యలు మొదలుపెట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.. ప్రతి గ్రామంలోనూ మహిళ భవనం కోసం 200 గజాల స్థలాన్ని గుర్తించాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది. అంతేకాకుండా మార్చి చివరి వారం వరకు అన్ని ప్రాంతాల్లోని ఈ భవనాలకు శంకుస్థాపనలు పూర్తి కావాలని చివరి డెడ్ లైన్ కూడా విధించింది.
భవన నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద వచ్చే ప్రత్యేకమైన నిధులను అందించబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఒక్కొక్క భవనానికి రూ.20 లక్షల వరకు నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆధునిక సౌకర్యాలతో కూడిన ఈ భవనాలు మహిళల అభివృద్ధికి వేదికలుగా మారతాయని ప్రభుత్వం తెలిపింది. కేవలం సమావేశానికే పరిమితం కాకుండా ఈ భవనాలను బహుళ ప్రయోజన కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. గ్రామ సంఘాల సభ్యులు నెలవారి సమీక్షలు నిర్వహించుకోవడానికి అనుకూలమైన ప్రత్యేకమైన హాలును కూడా నిర్మించాలని తెలిపింది.
అలాగే మహిళలకు కుట్టు మిషన్లతో పాటు అగరబత్తుల తయారీ, చేతి వృత్తుల వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకమైన గదులను కూడా నిర్వహించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించడం విశేషం. డ్వాక్రా సంఘాల రికార్డుల నిర్వహణతో పాటు బ్యాంకు లావాదేవీల చర్చలకు వేదికగా ఉండాలని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా సంఘాల్లో దాదాపు 63 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటివరకు వీరి సమావేశాలు నిర్వహించుకోవడానికి పాఠశాల గదులలో లేదా చెట్ల నీడలను ఆశ్రయించాల్సి వచ్చేది. సొంత భవనాల నిర్మాణంతో మహిళల ఆత్మగౌరవం పెరగడమే కాకుండా.. వారి ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగవంతం అవుతాయని ప్రభుత్వ ఉద్దేశం. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Yoga Benefits Women's Health: అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026 సందర్భంగా కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, మహిళల ఆరోగ్యం కోసం కొన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఇంటి బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిళ్లతో మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను అందించే యోగాను ఈరోజు నుంచే ప్రారంభిద్దాం.
మహిళల్లో హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలోనూ, ఒత్తిడిని తగ్గించడంలోనూ యోగా అద్భుతంగా పనిచేస్తుంది. మహిళల కోసం ప్రత్యేకంగా సూచించబడిన కొన్ని ముఖ్యమైన ఆసనాలు, వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
బద్ధకోనాసనం (సీతాకోకచిలుక భంగిమ)
ఇది తుంటి కండరాలను సడలిస్తుంది. ముఖ్యంగా రుతుక్రమ సమస్యలు, పునరుత్పత్తి అవయవాల ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
మార్జరాసనం (పిల్లి-ఆవు భంగిమ)
వెన్నెముక వశ్యతను పెంచుతుంది. వెన్నునొప్పి నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.
వృక్షాసనం (చెట్టు భంగిమ)
శరీర సమతుల్యతను మెరుగుపరుస్తుంది. ఇది ఏకాగ్రతను పెంచి, మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
అధోముఖ శ్వానాసనం
ఇది మొత్తం శరీరానికి శక్తినిస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను పెంచి, రోజంతా ఉండే అలసటను తగ్గిస్తుంది.
బాలాసనం (పిల్లల భంగిమ)
శారీరక, మానసిక విశ్రాంతికి ఇది ఉత్తమమైన ఆసనం. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మెడ, వీపు భాగాల్లో ఉండే ఒత్తిడిని తగ్గిస్తుంది.
విపరీత కరణి (కాళ్లు గోడకు వేసే భంగిమ)
ప్రయోజనం: మోకాళ్ల నొప్పులు, కాళ్ల వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు ఈ ఆసనం వేస్తే మంచి నిద్ర పడుతుంది.
సూర్య నమస్కారాలు
ఇందులో ఉండే 12 దశలు మొత్తం శరీరానికి సంపూర్ణ వ్యాయామాన్ని అందిస్తాయి. హార్మోన్ల సమతుల్యతకు, బరువు తగ్గడానికి ఇది రామబాణంలా పనిచేస్తుంది.
ఆరోగ్యకరమైన అలవాట్లు ఒక్కరోజుతో వచ్చేవి కావు. ఈ మహిళా దినోత్సవం నుంచి ప్రతిరోజూ కనీసం 15-20 నిమిషాల పాటు యోగాను మీ జీవనశైలిలో భాగం చేసుకోండి. సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన 'స్వర్ణాంధ్ర'ను నిర్మించడంలో మహిళల పాత్ర కీలకం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook