యూపీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు
Bellampalle, Kannal Rural, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డ్ లో యూపీహెచ్సీ షంషీర్ నగర్ ఆధ్వర్యంలో ఆర్బీఎస్కే టీం పర్యవేక్షణలో బుధవారం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో వార్డ్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి వైద్యులు మందులు అందజేశారు. అత్యవసరమైన కేసులను సీహెచ్ సీ కి సూచిస్తున్నారు. ఈ సందర్బంగా వైద్యులు మాట్లాడుతూ వ్యక్తిగత శుభ్రతతో పాటు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటామని అన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
AP Employees Salary: ఉద్యోగులకు సూపర్ గుడ్న్యూస్..ఇకపై ప్రతినెలా 1వ తేదీన జీతాలు అకౌంట్లో జమ!
Vijayawada, Andhra Pradesh:AP Employees Salary On 1st: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థికశాఖ శుభవార్త అందజేసింది. ఇకపై ప్రతి నెలా 1వ తేదీనే ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లక్ష్యాన్ని కచ్చితంగా అమలు చేయాలని కోరుతూ ఆర్థికశాఖ అన్ని ప్రభుత్వ శాఖలకు స్పష్టమైన మెమో జారీ చేసింది.
ఆర్థికశాఖ ముఖ్య ఆదేశాలు, మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు జీతాల బిల్లులను వెంటనే IFMS (Integrated Financial Management System) పోర్టల్లో అప్డేట్ చేయాలని ఆర్థిఖ శాఖ అధికారులు ఆదేశించారు.
జీతాల బిల్లులను సమయానికి అప్డేట్ చేయని పక్షంలో సంబంధిత డ్రాయింగ్ & డిస్బర్స్ మెంట్ ఆఫీసర్ (DDO)పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బిల్లులు పెండింగ్లో ఉంటే ముందుగానే ఆర్థికశాఖకు తెలియజేయాలని సూచించారు.
జూలై 30 లోపు ఏ ఉద్యోగి జీతాల బిల్లు పంపకపోయినా, దానికి పూర్తి బాధ్యత సంబంధిత DDO దేనని ఆర్థికశాఖ తేల్చిచెప్పింది. దీంతో సాంకేతిక సమస్యలను పరిష్కరించుకునేందుకు పలువురు DDOలు సచివాలయానికి పరుగులు పెడుతున్నారు. అలాగే పొరుగుసేవలు (అవుట్సోర్సింగ్), కాంట్రాక్టు ఉద్యోగుల సేవా కాలాన్ని ఈ నెలకు కూడా పొడిగిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర నిధుల బాధ్యత
కేంద్ర ప్రాయోజిత పథకాల కింద పనిచేస్తున్న సుమారు లక్ష మంది ఉద్యోగుల జీతాలకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి రాబట్టుకునే బాధ్యత పూర్తిగా సంబంధిత శాఖాధిపతులదేనని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ కోసం ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శి గౌరవ్ ఉప్పల్ను రాష్ట్ర నోడల్ అధికారిగా నియమించారు. అయితే, కేంద్ర నిధులు ఆలస్యమైనప్పుడు రాష్ట్ర ఆర్థికశాఖ తాత్కాలికంగా నిధులను సర్దుబాటు చేస్తుందా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఆధార్ అప్డేట్ సమస్యలు, పరిష్కార మార్గాలు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,900 మంది ఉద్యోగుల ఆధార్ వివరాలు IFMS పోర్టల్లో అప్డేట్ కాలేదు. వీరిలో సుమారు 1,900 మంది అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. గతంలో డిప్యుటేషన్లో పనిచేసి బదిలీపై కొత్త చోట చేరిన ఉద్యోగులకు కూడా ఆధార్ అప్డేట్కు సంబంధించి సాంకేతిక సమస్యలు ఎదురువుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు నేరుగా సచివాలయానికి వచ్చి ఆర్థికశాఖ అధికారులను సంప్రదిస్తున్నారు.
రాష్ట్రంలో నెలవారీ ఆర్థిక అంచనా
ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెలా చెల్లించాల్సిన వేతనాలు, పింఛన్ల అంచనా వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు నెలకు సుమారు రూ.4,500 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. మాజీ ఉద్యోగులకు పింఛన్ల రూపంలో సుమారు రూ.2,500 కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉంది.
ప్రభుత్వ తాజా ఆదేశాల నేపథ్యంలో, సాంకేతిక ఇబ్బందిలను అధిగమించి ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ప్రతినెలా మొదటి తేదీనే జీతం అందేలా అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ఈ శుభవార్త తెలుసుకున్న ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: పంతం నెగ్గించుకున్న రఘురామ కృష్ణరాజు..ఆకివీడు రామాలయానికి సుప్రీంకోర్టు ఓకే!
Also Read: ఏపీ విద్యార్థులకు పండుగే పండుగ.. స్కూళ్లకు ఏకంగా 10 రోజులు సెలవులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nara Bhuvaneshwari: అసెంబ్లీలో నా శీలం గురించి మాట్లాడారు.. వైఎస్సార్సీపీ నేతలపై నారా భువనేశ్వరీ సెన్సెషనల్ కామెంట్స్..
Hyderabad, Telangana:Nara bhuvaneshwari emotional in kuppam meeting: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం కాక రేపుతున్నాయి. ఒకవైపు వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల్లో అబద్దపు హమీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి కూటమి గద్దెనెక్కిందని విమర్శలు చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యంగంను అమలు చేస్తున్నారని, శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం సైతం వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ లు ఇస్తుంది. ఇక తాజాగా.. ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి కుప్పంలో పర్యటించారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ద్రౌపది అమ్మవారి ఆలయంను సందర్శించారు.
తనపై, తన కుటుంబంపై వైసీపీ నేతలు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల గురించి నారా భువనేశ్వరి తొలిసారిగా ప్రజల మధ్య స్పందించారు.
"ఈ విషయం గురించి నేను ఇప్పటివరకు ఎక్కడా మాట్లాడలేదు. కానీ ఈ రోజు ద్రౌపది అమ్మవారిని దర్శించుకున్న తర్వాత... స్త్రీ అంటే ఏమిటి, స్త్రీని పురుషులు ఎంత గౌరవించాలో… pic.twitter.com/8EY4DYX1so
— TeluguBulletin.com (@TeluguBulletin) July 29, 2026
ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ తీవ్ర భావొద్వేగంకు గురయ్యారు. ద్రౌపది అమ్మవారిని చూసిన తర్వాత తనకు గత ప్రభుత్వ హయంలో అసెంబ్లీలో ఎదురైన ఘటనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పూర్వకాలంలో పాండవుల్ని ఎదుర్కొలేక కౌరవులు ద్రౌపదమ్మను నిండు సభలోకి లాక్కొచ్చి చీరను లాగి అవమానించిన ఘటనలను గుర్తు చేశారు. ఒక ఆడదిని అడ్డం పెట్టుకుని నీచంగా ప్రవర్తించాని అన్నారు.
అప్పుడు ద్రౌపదిని శ్రీకృష్ణ పరమాత్మ కాపాడాడని చెప్పారు. అదే విధంగా చంద్రబాబును సభలో ఎదుర్కొలేక గత పాలకులు సభలో ఆయనను హింసించాలని తన పేరును లాగి నాశీలం గురించి మాట్లాడారని చెబుతు భావొద్వేగంకు గురయ్యారు. మగాడు మగాడిలా మాట్లాడాలని అన్నారు. ఆ దేవుడే తమకు అండగా నిలిచాడని అందుకే ప్రజల రూపంలో తమను ఎన్నికల్లో గెలిచేలా చేసి మా కుటుంబంకు అండగా నిలిచాడని చెబుతూ నారా భువనేశ్వరీ తీవ్రంగా స్పందించారు.
ఈ విషయం గురించి నేను ఇప్పటివరకు ఎక్కడా మాట్లాడలేదని.. . కానీ ఈ రోజు ద్రౌపది అమ్మవారిని దర్శించుకున్న తర్వాత... స్త్రీ అంటే ఏమిటి, స్త్రీని పురుషులు ఎంత గౌరవించాలో గుర్తు చేయాలనిపించిందని చెప్పుకొచ్చారు. మా కుటుంబాన్ని ఎంతగా అవమానించినా... ప్రతిసారీ ప్రజల రూపంలో దేవుడే వచ్చి మాకు అండగా నిలిచారని నారా భువనేశ్వరీ స్పష్టం చేశారు. తిరుమలలో బాంబులు పెట్టిన ఘటనల్లో కూడా ఆ దేవుడు తమకు అండగా ఉంటున్నాడని అన్నారు.
రాజమండ్రిలో నిర్భందించిన కూడా ఆ దేవుడు ప్రజల రూపంలో తమకు అండగా నిలిచారన్నారు. ప్రతి ఒక్క స్త్రీని అందరు గౌరవించుకొవాలని నారా భుశనేశ్వరీ స్పష్టం చేశారు. ప్రస్తుతం నారా భువనేశ్వరీ చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. దీనిపై వైసీపీ ఏవిధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.
Vijay Vs Dhanush: విజయ్ Vs ధనుష్..2031 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే కనుమరుగు?
Chennai, Tamil Nadu:Vijay Vs Dhanush Politics: 1967, 1977 అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచాయి. 2024 ఫిబ్రవరిలో ఆవిర్భవించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ కేవలం రెండేళ్ల వ్యవధిలోనే అనూహ్య విజయం సాధించి 2026 మేలో అధికార పీఠాన్ని అధిష్టించింది. 'విజయ్' అనే ఒకే ఒక బలమైన మంత్రం ఈ అద్భుత విజయానికి కారణమైంది.
ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ మొత్తం 108 స్థానాలను కైవసం చేసుకుంది. అర్ధ శతాబ్దానికి పైగా తమిళనాడును ఏలిన డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు వరుసగా రెండు, మూడు స్థానాలకు పరిమితమయ్యాయి. మిత్రపక్షాలను మినహాయించి, డీఎంకే 59 స్థానాలు, ఏఐఏడీఎంకే 47 స్థానాలు మాత్రమే సాధించగలిగాయి.
డీఎంకే ఎదుర్కొంటున్న సవాళ్లు
1967, 1971 ఎన్నికల తర్వాత డీఎంకే ఎన్నడూ వరుసగా రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. 2011లో ఓటమి చవిచూసిన తర్వాత సుమారు 10 సంవత్సరాలు వేచి చూసి, ఎట్టకేలకు 2021లో అధికారంలోకి వచ్చింది. 2026 ఎన్నికలలోనూ డీఎంకే కచ్చితంగా విజయం సాధిస్తుందని రాజకీయ పరిశీలకులు భావించినప్పటికీ, టీడీపీ ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేసింది.
ఏఐఏడీఎంకే సంక్షోభం
డీఎంకే ప్రధాన ప్రతిపక్షంగా నిలవగా, ఏఐఏడీఎంకే మూడవ స్థానానికి పడిపోయి ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. ఎన్నికల అనంతరం, ఏఐఏడీఎంకే 'రెండు ఆకుల' గుర్తుపై గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల బలం 41కి పడిపోయింది. మాజీ మంత్రులు ఎస్.పి.వేలుమణి, సి.వి.షణ్ముగం తదితరులు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
మాజీ మంత్రులు, జిల్లా కార్యదర్శులు, ముఖ్య నేతలు పెద్ద ఎత్తున టీడీపీ వైపు చూస్తుండటంతో, ఈ రెండు ప్రధాన పార్టీలకు టీడీపీని ఎదుర్కోవడం కష్టతరంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో, 2031 ఎన్నికలలో డీఎంకే, ఏఐఏడీఎంకేలు కలిసి విజయ్ను ఎలా ఎదుర్కొంటాయనే చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది.
విజయ్ వర్సెస్ ధనుష్..2031 అంచనాలు
ఈ నేపథ్యంలో కొందరు రాజకీయ ప్రముఖులు 2031 అసెంబ్లీ ఎన్నికలపై ఒక సంచలన జోస్యం చెప్పారు. 2031 ఎన్నికలలో సీఎం విజయ్ టీవీకే పార్టీని ఎదుర్కొనేందుకు డీఎంకే, ఏఐఏడీఎంకే లు ఏకమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఒకవేళ నటుడు ధనుష్ కనుక రాజకీయాల్లోకి వస్తే, ఆయన టీవీకే విజయ్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా మారుతారని, అంతేకాకుండా రాజకీయాల్లో నంబర్ వన్ స్థానానికి ఎదుగుతారని తమిళనాడు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల సమయం నాటికి తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల ప్రాధాన్యత తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు.
ధనుష్ రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు
కొద్ది రోజుల క్రితం తన పుట్టినరోజు సందర్భంగా తిరువళ్లూరులో జరిగిన రక్తదాన శిబిరంలో ధనుష్ పాల్గొని ప్రసంగించారు. ఆ వేదికపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ ఉద్దేశంతోనే ఉన్నాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొత్తానికి, తమిళనాడు రాజకీయాలు భవిష్యత్తులో మరింత రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
Also REad: బాలీవుడ్ హీరోయిన్ల బాడీ పార్ట్స్పై సీక్రెట్ టాటూలు..వాటిలో అర్థం అంత ఉందా?
Also Read: "బిగ్బాస్ 10లోకి నన్ను తీసుకోండి"..కింగ్ నాగార్జునకు హీరోయిన్ స్పెషల్ రిక్వెస్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Honor X6e: 7500mAh భారీ బ్యాటరీతో Honor కొత్త ఫోన్ విడుదల.. ధర ఎంతంటే?
Hyderabad, Telangana:Honor X6e 4G Price: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ హోనర్ (Honor) బడ్జెట్ ధరలో మరో శక్తివంతమైన స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు వచ్చింది.. దీనిని కంపెనీ Honor X6e 4G పేరుతో మలేషియా మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. అత్యంత తక్కువ ధరలోనే మోస్ట్ పవర్ఫుల్ భారీ బ్యాటరీతో పాటు అద్భుతమైన డిజైన్, ప్రీమియం కెమెరా సెటప్తో అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
భారీ 7500mAh బ్యాటరీ..
ఈ Honor X6e 4G స్మార్ట్ఫోన్ మోస్ట్ పవర్ఫుల్ 7500mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే.. దాదాపు రెండు నుంచి మూడు రోజుల పాటు సులభంగా వస్తుంది. అంతేకాకుండా ఈ భారీ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి 45W Honor SuperCharge ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ను కూడా కంపెనీ అందిస్తుంది. ఇవే కాకుండా ఇందులో ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది..
డిస్ప్లే, డిజైన్..
ఈ Honor X6e 4G స్మార్ట్ఫోన్ చాలా ప్రత్యేకమైన 6.61 అంగుళాల TFT LCD డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది.. ఇది 1604 × 720 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. కంటికి ఒత్తిడిని తగ్గించే ఐ కంఫర్ట్ (Eye Comfort), డైనమిక్ డిమ్మింగ్ ఫీచర్లతో పని చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.. స్క్రీన్ ప్రొటక్షన్ కోసం అల్యూమినోసిలికేట్ గ్లాస్ను కూడా వినియోగించారు.. అంతేకాకుండా దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణగా IP64 రేటింగ్ అందించడం విశేషం.
ప్రొసెసర్, పెర్ఫార్మెన్స్..
ఈ ఫోన్ మీడియాటెక్ హెలియో G81 ఆల్ట్రా (MediaTek Helio G81 Ultra) ప్రొసెసర్ను కూడా కలిగి ఉంటుంది.. అలాగే 4GB ర్యామ్తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.. ఇందులో మరో 4GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ వల్ల మొత్తం 8GB వరకు పెంచుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత MagicOS 10.0 ఆపరేటింగ్ సిస్టమ్పై ఈ ఫోన్ రన్ అవుతుందని కంపెనీ వెల్లడించింది..
కెమెరా సెటప్ వివరాలు..
ఫొటోగ్రఫీ ప్రేమికులను దృష్టిలో పెట్టుకుని.. వెనుక వైపు అపెర్చర్తో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కూడా అందిస్తోంది.. ఇది 10X డిజిటల్ జూమ్ను సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందర భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరాను కూడా కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ధర వివరాలు..
మలేషియాలో Honor X6e 4G (4GB + 128GB) వేరియంట్ ధర RM 699గా నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది.. భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.16,000గా ఉంటుంది.. ఈ ఫోన్ సన్రైజ్ గోల్డ్తో పాటు మిడ్నైట్ బ్లాక్ అనే రెండు రంగుల్లో విడుదల విడుదల కావడం విశేషం.. తక్కువ బడ్జెట్లో రికార్డు స్థాయి బ్యాటరీ లైఫ్, స్టైలిష్ డిజైన్, నమ్మకమైన కెమెరా కోరుకునే వారికి Honor X6e 4G ఒక అద్భుతమైన ఎంపికగా భావించవచ్చు. అయితే, దీనికి కంపెనీ త్వరలో భారత్లో కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Add Zee News as a Preferred Source
Jogulamba Temple: జోగులాంబ ఆలయం హుండీ లెక్కింపు.. ఎంత ఆదాయం వచ్చిందంటే?
Alampur (P), Telangana:Jubilee Hills: తప్పిపోయిన బాలుడిని కాపాడిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్
Hyderabad, Telangana:Jubilee Hills MLA Naveen Yadav Catches Missing Boy At Roadside ShaikpetTamil Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. మాజీ ముఖ్యమంత్రి రాజీనామా?
Nagalapuram, Tamil Nadu:Tamil Nadu Politics: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ప్రభుత్వం కొలువుదీరి దాదాపు మూడు నెలలైనా ఇంకా రాజకీయాలు హాట్హాట్గానే కొనసాగుతున్నాయి. అధికారం కోల్పోయిన డీఎంకే పార్టీకి మరో భారీ షాక్ తగలనుందని తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా చేయబోతున్నారని.. ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకోనున్నాడని సమాచారం. అనంతరం అధికార టీవీకే పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని జోరుగా చర్చ జరుగుతోంది.
అన్నాడీఎంకే పార్టీ తరఫున మూడుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్సెల్వం సేవలు అందించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం నుంచి పన్నీర్సెల్వం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తర్వాత ముఖ్యమంత్రి అయినా ఎన్నికల్లో ఓడిపోవడంతో ఏఐడీఎంకేలో కొనసాగారు. ఇటీవల 2026 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డీఎంకే పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా డీఎంకే పార్టీ అధికారం కోల్పోయింది. దీంతో అతడి రాజకీయ భవిష్యత్తు ప్రమాదకరంగా మారింది. ప్రస్తుతం పన్నీర్ సెల్వం రాజకీయంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పన్నీర్సెల్వం డీఎంకే పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తేని నియోజకవర్గం నుంచి డీఎంకే పార్టీ తరఫున పన్నీర్ సెల్వం ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఓటమి పాలైంది. ప్రతిపక్ష పార్టీ డీఎంకేలో మాజీ ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వానికి ఎలాంటి గుర్తింపు లేదు. ఇప్పటివరకు డీఎంకేలో ఆయనకు ఎలాంటి కీలక పదవి దక్కలేదు. దీంతో
పదవీ దక్కకపోవడం.. డీఎంకేలో ఎలాంటి గుర్తింపు లేకపోవడం తదితర కారణాల వల్ల పన్నీర్ సెల్వం రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. అధికారంలోకి వచ్చిన టీవీకే పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. డీఎంకే తరఫున గెలిచిన పన్నీర్సెల్వం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీలో చేరడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో పన్నీర్సెల్వమ్కు మంచి పట్టు ఉంది. దీంతో అక్కడ టీవీకే పార్టీ బలోపేతం కావడానికి పన్నీర్ సెల్వం దోహదం చేస్తుందని.. అందుకే ఆయన చేరికకు విజయ్ కూడా అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా తన కుమారుడు రవీంద్రనాథ్ ఠాగూర్ రాజకీయ భవిష్యత్ కోసం పన్నీర్సెల్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన భవిష్యత్ కన్నా తన కుమారుడి భవిష్యత్ కోసం పార్టీ మారక తప్పని పరిస్థితి అని పన్నీర్సెల్వం వర్గం వివరిస్తోంది. రాబోయే ఉపఎన్నికల్లో పన్నీర్సెల్వం ‘విజిల్’ గుర్తుపై పోటీ చేయబోతున్నారని చర్చ జరుగుతోంది. 2029 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కుమారుడు రవీంద్రనాథ్ ఠాగూర్ను టీవీకే పార్టీ తరఫున బరిలోకి దించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా వార్తలు వస్తున్నాయి.
Ram Charan Surgery: సర్జరీ తర్వాత తొలిసారి కనిపించిన రామ్చరణ్..భార్యతో పాటు అయ్యప్ప దర్శనం, ప్రత్యేక పూజలు!
Coimbatore, Tamil Nadu:Ram Charan Surgery News: టాలీవుడ్ నటుడు మెగా పవర్స్టార్ రామ్చరణ్కు ఇటీవలే మణికట్టు సర్జరీ విజయవంతంగా పూర్తయ్యింది. ఇప్పుడు సర్జరీ విజయవంతంగా పూర్తవ్వడం వల్ల భార్య ఉపాసనతో కలిసి రామ్చరణ్ అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్లారు. కోయంబత్తూరులోని అయ్యప్ప స్వామి దర్శనం కోసం రామ్చరణ్, ఉపాసన కలిసి వెళ్లారు. తాజాగా వైద్యులు విశ్రాంతిని సూచించిన క్రమంలో తాజాగా కోయంబత్తూరులోని గంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ వెంటనే అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించిన అక్కడ మూలవిరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రిలో మణికట్టు సర్జరీ విజయవంతం కావడం వల్ల కుటుంబ సమేతంగా రామ్చరణ్ హైదరాబాద్ బయల్దేరారు. అయితే అంతకు ముందు స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలోని స్వామి వారిని దర్శనం చేసుకున్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హీరో రామ్చరణ్ నలుపు రంగు దుస్తులలో, కుడి చేతికి కట్టుతో కనిపించారు. వారి సందర్శన సమయంలో దేవుడికి ప్రార్థనలు చేస్తుండగా, ఉపాసన ఆవుకు అరటిపండ్లు తినిపిస్తూ కనిపించారు.
ఇటీవలే మణికట్టు సర్జరీ కోసం మెగాస్టార్ చిరంజీవి కుటుంబం కోయంబత్తూరు చేరుకున్న సంగతి తెలిసిందే. హీరో రామ్చరణ్ సర్జరీ కోసం మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన తల్లి సురేఖ, భార్య ఉపాసన కూడా అతనితో పాటు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాణించారు. సర్జరీ పూర్తయ్యే వరకు వీరంతా కోయంబత్తూరులోని ఆస్పత్రిలోనే ఉన్నారు.
కోయంబత్తూరు గంగా ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ ఎస్.రాజశేఖరన్ నేతృత్వంలో రామ్చరణ్ మణికట్టుకు శస్త్రచికిత్స జరిగింది. గాయం తీవ్రత దృష్ట్యా, మయామికి చెందిన ప్రఖ్యాత చేతి, మణికట్టు నిపుణుడు డాక్టర్ అలెజాండ్రో బాడియా శస్త్రచికిత్స బృందంలో చేరారు. డాక్టర్ రాజశేఖరన్, డాక్టర్ బాడియా, డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్, వారి నిపుణుల బృందం ఈ ఆపరేషన్ను నిర్వహించారు.
వైద్య బృందం ప్రకారం.. శస్త్రచికిత్స విజయవంతమైంది, రామ్ చరణ్ బాగా కోలుకుంటున్నారు. తిరిగి పనిలోకి రావడానికి ముందు కొన్ని రోజులు విశ్రాంతి అవసరం. దాదాపుగా ఎనిమిది వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సలహా ఇచ్చారు. వైద్య అనుమతి లభించిన తర్వాతే ఆయన షూటింగ్ తిరిగి ప్రారంభిస్తారని భావిస్తున్నారు.
నటుడు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన వెంటనే అయ్యప్ప స్వామి ఆలయ సందర్శన చేశారు. ఆయనను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
రామ్చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' సినిమా షూటింగ్ సమయంలో మణికట్టుకు గాయమైంది. అప్పట్లో మైనర్ ఆపరేషన్ జరిగినా.. తరచూ ఆయనకు అసౌకర్యం కలగడం వల్ల మరో సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ఆయన తాజాగా మరో సర్జరీ చేయించుకున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. రామ్ చరణ్ చివరిగా బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, జాన్వీ కపూర్తో కలిసి నటించిన 'పెద్ది' చిత్రంలో కనిపించారు. ఆయన కోలుకున్న తర్వాత దర్శకుడు సుకుమార్తో సినిమా చేయనున్నారు.
Also Read: బాలీవుడ్ హీరోయిన్ల బాడీ పార్ట్స్పై సీక్రెట్ టాటూలు..వాటిలో అర్థం అంత ఉందా?
Also REad: హీరోయిన్తో క్రికెటర్ అర్ష్దీప్ సింగ్ పెళ్లి..లగ్గం ఫిక్స్..ఆమె సంపాదన ఎంతో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
PRTU TS కామారెడ్డి జిల్లా శాఖ సర్వసభ్య సమావేశ ఆహ్వానము..!!
Secunderabad, Telangana:PRTUTS Kamareddy District General Body Meeting: ప్రోగ్రెసివ్ రికాగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (PRTUTS) కామారెడ్డి జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహణ తేదీ మారింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ఆగస్టు 9, 2026లో మార్పులు చేసింది. సవరించిన తేదీ ప్రకారం వచ్చే నెల ఆగస్టు 8, 2026 (రెండవ శనివారం) ఉదయం 10:00 గంటలకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సంఘ నాయకత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కామారెడ్డిలోని బృందావన్ గార్డెన్స్ ప్రాంగణంలో, జిల్లా అధ్యక్షుడు అల్లాపుర్ కుశాల్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ ప్రతిష్ఠాత్మక జిల్లా సమావేశానికి శాసన మండలి సభ్యులు (ఎమ్మెల్సీ) పింగిలి శ్రీపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బి. మోహన్ రెడ్డిలతో పాటు PRTUTS రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు పేరి వెంకట్ రెడ్డి, గుండు లక్ష్మణ్, కులకర్ణి మనోహర్ రావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
కీలక ఎజెండా..
సమావేశంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన, అతిథుల సందేశాల అనంతరం 2025-26 సంవత్సరానికి సంబంధించిన వార్షిక కార్యదర్శి నివేదికను సమర్పించనున్నారు. అనంతరం వార్షిక కార్యదర్శి నివేదికకు సంబంధించి.. సుదీర్ఘ చర్చ అనంతరం ఆమోదించనున్నారు. ఈ చర్చ తర్వాత ప్రస్తుతం బాధ్యతల్లో ఉన్న జిల్లా కార్యవర్గాన్ని అధికారికంగా రద్దు చేసి, 2026-28 రెండేళ్ల కాలవ్యవధికి గాను నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు. ఇక ఉపాధ్యాయుల ప్రధాన సమస్యలైన.. నిలిచిపోయిన డిఏ (DA) బకాయిల విడుదల, సీపీఎస్ (CPS) రద్దు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ఈ సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఉపాధ్యాయుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సాగే ఈ సర్వసభ్య సమావేశానికి జిల్లాలోని మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కాంప్లెక్స్ ఇన్ఛార్జీలు, విద్యాధికారులు.. ప్రాథమిక సభ్యులందరూ పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.
Also Read: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 2 శుభవార్తలు..నెరవేరబోతున్న చిరకాల కోరిక..!!
Also Read: హెల్త్ కార్డులు, పీఆర్సీ కోసం రోడ్డెక్కిన పెన్షనర్లు..!!
Also Read: బ్రిక్స్ వేదికపై మెరిసిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mercury Transit 2026: ఆగస్టు 9 నుంచి ఈ 4 రాశుల జాతకం మారబోతోంది.. జాక్పాట్ కొట్టేది వీళ్లే!
Hyderabad, Telangana:Mercury Transit Effect 2026: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాకుమారుడుగా పిలిచే బుధ గ్రహం కదలికలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.. బుధుడి మార్పు కారణంగా ద్వాదశ రాశులపై శుభ, అశుభ ప్రభావాలు పడుతూ ఉంటాయి. ఇదిలా ఆగస్టు 9వ తేదీ ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో బుధుడు తన దిశను మార్చుకోబోతున్నాడు.. ఈ అరుదైన సంచారం వల్ల 4 రాశుల వారికి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరగడంతో పాటు, ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మాట తీరు కూడా పూర్తిగా మారుతుంది.. వ్యాపారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల విశేష ప్రయోజనాలు పొందనున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారు అద్భుతమైన లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారికి బంపర్ జాక్ఫాట్:
మిథున రాశి (Gemini)
మిథున రాశి అధిపతి బుధుడే కావడం వల్ల వీరికి మరిన్ని శుభఫలితాలు కలుగుతాయి. వ్యక్తిగత జీవితానికి, ఉద్యోగానికి మధ్య చక్కని సమతుల్యత లభిస్తుంది.. ఆఫీసులో పైఅధికారుల నుంచి ప్రశంసల లభించడమే కాకుండా అద్భుతమైన ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలంగా నడుస్తున్న వివాదాలు సులువుగా పరిష్కారమవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. కొత్త ఉత్సాహంతో పనిచేసేవారు ఈ సమయంలో తప్పకుండా ఆర్థికంగా బలంగా స్థిరపడే ఛాన్స్లు ఉన్నాయి..
వృశ్చిక రాశి (Scorpio)
వృశ్చిక రాశి వారికి కూడా ఈ సమయంలో సరికొత్త మార్గాలు చూసే ఛాన్స్లు ఉన్నాయి.. ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురవుతున్న అవాంతరాలు తొలగిపోతాయి. ప్రత్యర్థులతో పాటు శత్రువుల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.. ఆఫీస్ పాలిటిక్స్ నుంచి కూడా వీరికి తప్పకుండా విముక్తి కలుగుతుంది. ఊహించని విధంగా అకస్మాత్తుగా ధనలాభాలు కూడా కలుగుతాయి..
కన్యా రాశి (Virgo)
కన్యా రాశి వారికి బుధుడి ప్రభావంతో అద్బుతమైన ప్రయోజనాలు కలిగే ఛాన్స్లు ఉన్నట్లు జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఎంతటి పెద్ద సమస్యలనైనా ఈ సమయంలో తప్పకుండా పరిష్కరమయ్యే ఛాన్స్లు ఉన్నాయి.. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో మీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. వృత్తిపరంగా మీ పనితీరు మెరుగ్గా మారి ప్రమోషన్ లేదా జీతం విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
మేష రాశి (Aries)
మేష రాశి వారికి ఈ బుధుడి సంచారం ప్రభావంతో అత్యంత కీలకమైన అవకాశాలు కూడా లభిస్తాయి. సుదూర ప్రయాణాలు లాభదాయకంగా సాగే ఛాన్స్లు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొని.. మానసిక ఒత్తిడి పూర్తిగా తొలగిపోతుంది. వ్యాపారవేత్తలకు కొత్త కాంట్రాక్టులు, ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సువర్ణ సమయంగా భావించవచ్చు. మీ మాట తీరు కూడా పూర్తిగా మారిపోతుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Viral News: 'జోగులాంబాదేవీ.. ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించవమ్మా!'.. ఓ లేఖ వైరల్
Alampur (P), Telangana:Jogulamba Temple Letter Viral: జోగులాంబాదేవీ.. ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించవమ్మా.. అంటూ అమ్మవారి హుండీలో ఓ భక్తుడి లేఖ రాశాడు. తనకు ఉద్యోగాలు రావడం లేదని.. వచ్చేలా చేయాలని అమ్మవారికి మొక్కుకున్నాడు. ఆ లేఖ కాస్త వైరల్గా మారింది. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని ఐదో శక్తిపీఠం రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠం జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయానికి సంబంధించిన హుండీని ఇటీవల లెక్కింపు చేపట్టారు.
హుండీ లెక్కిస్తుండగా జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన భక్తుడు అమ్మవారి హుండీలో రాసిన లేఖ సిబ్బందికి కనిపించింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావడం లేదని.. అమ్మవారి చల్లటి చూపు తనపై ఉండాలని ఆ భక్తుడు వేడుకున్నాడు. తనతోపాటు తన భార్య, తల్లిదండ్రులు, తమ్ముడిని కూడా అమ్మవారు కాపాడాలని కోరాడు. కుటుంబంలో ఎలాంటి గొడవలు రాకుండా.. దాంపత్య జీవితంలో భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సంతోషంగా జీవించేలా చూడాలని లేఖలో మొక్కుకున్నాడు.
ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా.. ద్రోహం చేయకుండా ధర్మమార్గంలో నడిచేలా ఆశీర్వదించాలని జోగులాంబ అమ్మవారిని కోరాడు. ఇక ఈ లేఖతో పాటు భక్తుడు తన బయోడేటాను కూడా జత చేశాడు. పదో తరగతిలో 70 శాతం, ఇంటర్లో 68 శాతం, టీటీసీలో 85 శాతం, డిగ్రీలో 84 శాతం, బీఈడీలో 86 శాతం మార్కులు సాధించినట్లు బయోడేటాలో పేర్కొన్నాడు. ప్రస్తుతం బీపీఈడీ కూడా చదువుతున్నట్లు రాశాడు. అన్ని కోర్సుల్లో మంచి మార్కులు సాధించినా ఉద్యోగం దక్కకపోవడంతో.. చివరకు అమ్మవారినే నమ్ముకున్నానంటూ తన ఆవేదనను లేఖలో వ్యక్తం చేశాడు.
మరో లేఖ కూడా..
'చివరగా ఒక్క జాబ్ ప్రసాదించమ్మా.. చాలా ఇబ్బంది అయింది' అంటూ తన భార్యాభర్తల పేర్లతో లేఖను ముగించాడు. ఇక మరో భక్తుడు కూడా తన కోరికను లేఖ రూపంలో అమ్మవారికి సమర్పించాడు. కల్యాణం కావాలని.. భయం తగ్గాలని.. మనసు ప్రశాంతంగా ఉండాలని కోరుతూ లేఖతో పాటు తన పాస్పోర్ట్ సైజ్ ఫొటోతో పాటు తన పేరు, గోత్రాన్ని కూడా రాసి హుండీలో వేశాడు.
హుండీ ఆదాయం..
లేఖలు పక్కనపెడితే జోగులాంబ అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు చేపట్టగా రూ.90 లక్షల ఆదాయం సమకూరింది. జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల 134 రోజుల హుండీ లెక్కింపును ఆలయ అధికారులు నిర్వహించారు. 134 రోజుల వ్యవధిలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా మొత్తం రూ.90 లక్షల 86 వేల 931 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో దీప్తి రెడ్డి వెల్లడించారు.
Tirumala: శ్రీనివాసుడి చెంతకు 'శ్రీనివాస మంగాపురం' చిత్రబృందం
Dharmavaram, Andhra Pradesh:Ghattamaneni Jayakrishna And Srinivasa Mangapuram Movie Team Visits Tirumala Temple Watch Videoవిక్రమార్కుడు సీన్ రిపీట్.. రూ.45 వేలు ఆశచూపి మహిళలకు గుండుకొట్టించిన వ్యక్తి..
Hyderabad, Telangana:Vikramarkudu Scene Recreated Video: సినిమా కథలను తలపించేలా.. ఒక ఆకతాయి చేసిన అల్లరి ఫోన్ కాల్.. అమాయక మహిళల జీవితాల్లో తీవ్ర అవమానాన్ని నింపింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమాలో డబ్బు ఆశ చూపి.. మహిళలకు గుండు కొట్టించిన సందర్భం గుర్తుందిగా? సరిగ్గా అలాగే తమిళనాడులోని సేలం జిల్లా పుదుకొత్తంబాడి గ్రామంలో వెలుగు చూసింది.
అసలేం జరిగింది?
కొద్దిరోజుల క్రితం పుదుకొత్తంబాడి గ్రామానికి చెందిన పళనియమ్మాళ్ అనే మహిళకు ఒక తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది.. అవతలి వ్యక్తి తాను తాలూకా కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారినని పరిచయం చేసుకున్నాడు. రాష్ట్రంలో కొత్తరకం భయంకర వ్యాధి వేగంగా వ్యాపిస్తోందని.. దానిని నివారించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా గుండు విధానాన్ని అమల్లోకి తెచ్చిందని నమ్మించాడు..
ఈ పథకం కింద గుండు గీయించుకున్న సామాన్య మహిళలకు రూ.15,000.. చదువుకునే విద్యార్థినులకు రూ.45,000తో పాటు ఉచితంగా ల్యాప్టాప్ కూడా అందిస్తామని ఫోన్ కాల్ ద్వారా నమ్మించాడు.. అంతేకాకుండా ఈ పథకానికి సంబంధించిన మొదటి టోకెన్ మీకే వచ్చింది. ఈ విషయాన్ని ఇతరులకు చెబితే మీ గ్రామంలోని లబ్ధిదారులకు వెంటనే డబ్బులు జమ అవుతాయని నమ్మించాడు..
క్యూ కట్టిన అమ్మలక్కలు..
ఆ ఆకతాయి మాటలను పూర్తిగా నమ్మిన పళనియమ్మాళ్.. వెంటనే విషయాన్ని ఊరిలోని ఇతర మహిళలకు తెలిపింది. ఉచిత ల్యాప్టాప్తో పాటు భారీ మొత్తంలో నగదు వస్తుందనే ఆశతో గ్రామానికి చెందిన కావేరి, రామాయి, చిత్ర అనే మహిళలు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఊరిలోని మగంళిని ఇళ్లకు పిలిపించుకుని గుండు చేయించుకున్నారు. మరికొందరు విద్యార్థినులు కూడా గుండు చేయించుకోవడానికి రెడీ అయ్యారు.
స్విచ్ఛాఫ్ అయిన ఫోన్..
గుండు చేయించుకున్న అనంతరం.. పథకం ప్రకారం రావాల్సిన డబ్బులు, ల్యాప్టాప్ గురించి సదరు వ్యక్తికి ఫోన్ చేయగా.. ఆ నంబర్ స్విచ్చ్ ఆఫ్ అని వచ్చింది. ఎంతసేపు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో.. తాము ఒక ఆకతాయి చేతిలో దారుణంగా మోసపోయామని గ్రహించిన ఆ మహిళలు లబోదిబోమంటూ.. కన్నీరుమున్నీరవుతున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానిక అధికారులు గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టారు.. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. సోషల్ మీడియా ప్రాంక్లతో పాటు నకిలీ ఫోన్ కాల్స్, లాటరీ లేదా ఉచిత పథకాల పేరుతో వచ్చే మెసేజ్లను బ్లైండ్గా నమ్మవద్దని హెచ్చరించారు. ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా అధికారికంగా సచివాలయాలు, పంచాయతీ కార్యాలయాల ద్వారానే సమాచారం ఇస్తుందని.. అపరిచితులు చేసే ఫోన్ కాల్స్ ఆధారంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేశారు..
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Shukra Gochar 2026: నీచరాశిలోకి శుక్ర సంచారం..ఆగస్టు 1 నుంచి ఈ రాశుల వాళ్లకి కష్టాలే కష్టాలు..పరిహారం ఇదే!
Hyderabad, Telangana:Shukra Neech Gochar 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంపద, శ్రేయస్సు అధిపతి అయిన శుక్రుడు తన మిత్ర రాశి అయిన సింహరాశిని విడిచిపెట్టి 2026 ఆగస్టు 1న కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. జోతిష్య శాస్త్రం ప్రకారం రాశీచక్రంలోని చివరి కన్యారాశిని నీచ రాశిగా పరిగణిస్తారు. ఈ శుక్రగ్రహం నీచరాశిలోకి ప్రవేశించినప్పుడల్లా.. దాని వల్ల కలిగే శుభ ఫలితాలు తగ్గుతాయి. ఈ సంచారం కారణంగా రాశీచక్రంలోని ఇతర రాశులకు ఆర్థిక నష్టంతో పాటు మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు దాపురించే అవకాశం ఉంది. ఆగస్టు 1న నుంచి ప్రారంభమయ్యే శుక్ర గ్రహ సంచారం కారణంగా ఏఏ రాశులు ప్రభావితం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి
ఈ రాశి ఆరవ ఇంట్లో శుక్రుని సంచారం కారణంగా ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదురుకావొచ్చు. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే అనవసరమైన ఖర్చులను నియంత్రించుకొని.. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వడం చేయకపోవడం మంచిది.
మిథున రాశి
మిథునరాశికి చెందిన నాలుగవ ఇంట్లో నీచ స్థితిలో ఉన్న శుక్రుడు కుటుంబ జీవితంలో అశాంతిని, మీ తల్లి ఆరోగ్యం క్షీణించడానికి కారణం కావచ్చు. వాహనం లేదా ఇంటికి సంబంధించిన నిర్ణయాలు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
తులా రాశి
తులా రాశికి అధిపతి అయిన శుక్రుడు 12వ ఇంట్లోకి ప్రవేశించడం వలన అనవసరమైన ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది. అనవసరమైన ప్రయాణాలు, ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంది. బంధుమిత్రులతో అపార్థాలు పెరగవచ్చు.
మీన రాశి
మీన రాశికి చెందిన ఏడవ ఇంట్లో బలహీనమైన శుక్రుడు ఉండటం వలన వైవాహిక జీవితంలో చేదు అనుభవాలు లేదా మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడవచ్చు. వ్యాపార భాగస్వాములతో పారదర్శకంగా ఉండండి, లేకపోతే ఆర్థిక నష్టాలు సంభవించవచ్చు.
శుక్రుని ప్రతికూల ప్రభావాలను నివారించడానికి సులభమైన పరిహారాలు
1) కుదిరితే రోజూ లేదా ముఖ్యంగా శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తెల్లని మిఠాయిలను సమర్పించి, కనకధారా స్తోత్రాన్ని పఠించాలి.
2) శుక్రవారాల్లో పేదలకు తెల్లని వస్తువులను దానం చేయండి.
3) 'ఓం శున్ శుక్రాయ నమః' మంత్రాన్ని 108 సార్లు జపించండి.
(గమనిక: ఇక్కడ పేర్కొన్న సమాచారం కేవలం హిందూ మత సంప్రదాయలు, నమ్మకాలు, జోతిష్యశాస్త్ర నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: ఆగస్టు 12న అతిపెద్ద సంపూర్ణ సూర్యగ్రహణం.. ఈ 3 రాశుల వారికి
Also REad: శుక్ర-కుజుల కలయికతో కేంద్ర దృష్టి యోగం.. లక్ష్మీదేవి అనుగ్రహం పొందే లక్కీ రాశులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
తప్పిపోయిన ఆరేళ్ల బాలుడిని.. తల్లిదండ్రుల వద్దకు చేర్చిన MLA నవీన్ యాదవ్..
Hyderabad, Telangana:Mla Naveen Yadav: ప్రజాసేవే పరమావధిగా భావించే ప్రజాప్రతినిధులు సమాజంలో ప్రతికూల పరిస్థితుల్లో కూడా తమ మంచి మనుసును చాటుకుంటారు. సరిగ్గా అలాంటి ఘటనే హైదరాబాద్లోని షేక్పేట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. రోడ్డుపక్కన దిక్కుతోచక ఏడుస్తున్న ఓ చిన్నారిని చూసి.. చలించిపోయిన జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్.. తక్షణమే స్పందించి ఆ బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చడంలో కీలక పాత్ర పోషించి.. తన ఉదారతను చాటుకున్నారు.
అసలు ఏం జరిగింది?
మంగళవారం రాత్రి షేక్పేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్.. కార్యక్రమం ముగించుకుని తన కాన్వాయ్లో తిరిగి వెళ్తున్నారు. మార్గమధ్యలో రోడ్డు పక్కన సుమారు ఆరేళ్ల వయస్సున్న ఓ చిన్నారి ఒంటరిగా నిలబడి భయంతో ఏడుస్తూ ఉండటాన్ని ఆయన గమనించారు. వాహనాలు వేగంగా వెళ్తున్న ఆ రద్దీ రోడ్డుపై చిన్నారి ఏడుస్తుండటంతో ఎమ్మెల్యే వెంటనే తన వాహనాన్ని పక్కకు ఆపేశారు..
వాహనం దిగి స్వయంగా బాలుడి వద్దకు వెళ్లిన నవీన్ యాదవ్.. అతడిని ప్రేమతో దగ్గరకు తీసుకుని ఓదార్చారు. బాలుడికి ధైర్యం చెప్పి ఆరా తీయగా.. తాను ఇంటి దారి మరిచిపోయి తప్పిపోయినట్లు ఆ చిన్నారి అమాయకంగా తెలిపాడు. బాలుడి పరిస్థితిని అర్థం చేసుకున్న ఎమ్మెల్యే, ఆలస్యం చేయకుండా వెంటనే టోలిచౌకి పోలీసు స్టేషన్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలానికి చేరుకోవాల్సిందిగా కోరారు.
రంగంలోకి దిగిన టోలిచౌకి పోలీసులు..
ఎమ్మెల్యే సమాచారం అందించిన కొద్దిసేపటికే టోలిచౌకి పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. బాలుడి నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలతో పాటు అంతకుముందే నమోదైన మిస్సింగ్ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపారు. కొద్ది సమయంలోనే బాలుడి నివాసాన్ని.. అతడి తల్లిదండ్రుల వివరాలను గుర్తించారు.
కంటికి రెప్పలా చూసుకునే.. తమ కుమారుడు కనిపించకుండా పోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులకు.. పోలీసులు బాలుడిని సురక్షితంగా అప్పగించారు. తమ బిడ్డను క్షేమంగా తమ ఒడికి చేర్చడంలో ప్రధాన పాత్ర పోషించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్కు.. స్పీడ్గా స్పందించిన టోలిచౌకి పోలీసులకు బాలుడి కుటుంబ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Also Read: Revanth Reddy: కేటీఆర్ బర్త్డేపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. 'బర్త్డే దావత్ అడగాలి'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
