icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
504251
KASARLA RAMESHKASARLA RAMESHFollow4 Sept 2024, 03:56 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

AP Govt Holiday: సెలవులు ఇచ్చేయండి.. సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!

Amaravathi, Andhra Pradesh:

AP Govt Holiday: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు భారీ శుభవార్త. వేసవికాలంలో ఎండలు దంచికొడుతుండడంతో ప్రత్యేక సెలవులను ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర వడగాల్పులు వీస్తుండడంతో పలు ప్రాంతాల్లో నిప్పులు చిమ్మినట్టు ఎండ తీవ్రత ఉండడంతో ప్రభుత్వం స్పందిస్తూ.. స్థానికంగా సెలవులు ఇవ్వాలని సూచించింది. ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఎండల తీవ్రత అధికమైతే సెలవులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు.

Also Read: Vishnu Priya: 'డబ్బుల కోసం శరీరం అమ్ముకుంటున్నావు'.. ట్రోల్స్‌పై విష్ణుప్రియ ఆగ్రహం

రాష్ట్రంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. రాష్ట్రంలో తీవ్రస్థాయిలో నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలు, వడ గాల్పుల నేపథ్యంలో ప్రజారోగ్యం, వారి భద్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించారు. తీవ్ర వడగాల్పులపై రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించాలని.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నచోట స్థానికంగా సెలవుల ప్రకటించాలని సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. 

Also Read: SRH vs RCB Highlights: బెంగళూరు బోల్తా.. ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ బంపర్‌ విన్

ఎండల తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి.. ఆయా ప్రాంతాల్లో ప్రజలకు నిరంతరం హెచ్చరికలు పంపాలని అధికారులకు సూచించారు. ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి స్థానికంగా సెలవులు ప్రకటించాలని ఆదేశించారు. 

తీవ్రస్థాయి ఎల్ నినో కారణంగా వడగాలుల తీవ్రత కూడా గణనీయంగా పెరిగిందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేలా రద్దీగా ఉన్న ప్రాంతాలు, ప్రజలు ఎక్కువగా తిరిగే చోట్ల చల్లని తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వడగాలుల నుంచి ఎలా రక్షించు కోవాలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కలెక్టర్లు మీడియా సమావేశాలు నిర్వహించాలని.. సామాజిక మాధ్యమాల ద్వారా నిరంతరం సమాచారాన్ని చేరవేయాలని దిశానిర్దేశం చేశారు. 

ప్రజల ప్రాణాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని.. ఎండ తీవ్రత నేపథ్యంలో బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావొద్దని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి కలెక్టర్లు, మండల స్థాయి అధికారులు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో 1,349 హీట్ షెల్టర్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. 446 ట్రాఫిక్ జంక్షన్లలో వాహనదారులు, పోలీసులకు నీడ కల్పించేలా  ఏర్పాట్లు చేశామని.. మూగ జీవులు, పక్షులకు కూడా నీటి తొట్టెలు, మట్టి కుండలతో నీటిని ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగానికి సీఎం సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా తాగు నీటి కొరత రాకుండా చూడాలని.. నీటి ఇబ్బందులు ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

0
0
Report

SRH vs RCB Highlights: బెంగళూరు బోల్తా.. ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ బంపర్‌ విజయం

Hyderabad, Telangana:

SRH Won Beat By 55 Runs RCB: ప్లేఆఫ్స్‌లోకి చేరిన రెండు జట్ల మధ్య జరిగిన పోరులో సన్‌రైజర్స్‌ టాప్‌ ప్లేస్‌లోకి వెళ్లేందుకు చేసిన పోరాటం ఫలించలేదు. అయినా కూడా సొంత గడ్డపై అద్భుతమైన విజయంతో బెంగళూరును బోల్తా కొట్టించింది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌లోనూ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఇషాన్‌ కిషన్‌, అభిషేక్‌ శర్మ, క్లాసెన్‌ భారీ స్కోర్‌కు తోడు బౌలర్లు రాణించడంతో సొంత గడ్డ ఉప్పల్‌ స్టేడియంలో బెంగళూరును 55 పరుగుల తేడాతో ఓడించింది. ఓడినా కూడా బెంగళూరుకు జరిగిన నష్టమేమీ లేదు. టాప్‌ 1లో కొనసాగుతూ గుజరాత్‌ టైటాన్స్‌తో తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. స్టార్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ 46 బంతుల్లో 79 పరుగులు చేసి ఊచకోత కోశాడు. 8 ఫోర్లు, 3 సిక్సర్లతో దూకుడుగా ఆడి భారీ స్కోర్‌ను నమోదు చేశాడు. అభిషేక్‌ శర్మ 22 బంతుల్లో మెరుపు వేగంతో 56 పరుగులు చేసి.. 4 ఫోర్లు, 5 సిక్సర్లతో మరో అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. ట్రావిస్‌ హెడ్‌ 26 పరుగులకు పరిమితమవగా.. హెన్రిచ్‌ క్లాసెన్‌ 24 బంతుల్లో 51 స్కోర్‌తో.. 2 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. నితీశ్‌ కుమార్‌ రెడ్డి 29 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బెంగళూరు బౌలింగ్‌పరంగా చూస్తే రసిక్‌ సలామ్‌ 2 వికెట్లు తీయగా.. సుయాశ్‌ శర్మ, కృనాల్‌ పాండ్యా తలా ఒక్కో వికెట్‌ తీశారు.

0
0
Report

Sunrisers Hyderabad: బెంగళూరుకు భారీ లక్ష్యం.. దంచికొట్టిన ఇషాన్‌, అభిషేక్‌, క్లాసెన్‌

Hyderabad, Telangana:

Ishan Kishan Slams 79 Runs: సంచలన ప్రదర్శనతో భారీ విజయాలను అందుకుని ఐపీఎల్‌ 2026 ప్లేఆఫ్స్‌లో స్థానం పొందిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరోసారి భారీ ఇన్నింగ్స్‌ ఆడింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై హైదరాబాద్‌ బ్యాటర్లు ఊచకోత కోశారు. ఇషాన్‌ కిషన్‌ బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించగా.. అభిషేక్‌ శర్మ, హెన్రిచ్‌ క్లాసెన్‌ అర్ధ సెంచరీలతో చెలరేగి ఆడారు. సిక్స్‌లు, ఫోర్లతో పరుగుల వరద పారడంతో ఉప్పల్‌ స్టేడియం దద్దరిల్లింది. బెంగళూరు జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

టాస్‌ గెలిచి అనూహ్యంగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది. స్టార్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ బ్యాట్‌తో బీభత్సం చేశాడు. 60 బంతుల్లో 90 పరుగులు చేసి కొద్దిలో సెంచరీని మిస్సయ్యాడు. 10 ఫోర్లు, 5 సిక్సర్లతో దూకుడుగా ఆడి భారీ స్కోర్‌ను నమోదు చేశాడు. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ 22 బంతుల్లో మెరుపు వేగంతో 56 పరుగులు చేశాడు. 4 ఫోర్లు, 5 సిక్సర్లు బాది ఈ సీజన్‌లో మరో అర్ధ శతకాన్ని నమోదుచేశాడు. ట్రావిస్‌ హెడ్‌ 26 పరుగులకు పరిమితమవగా.. హెన్రిచ్‌ క్లాసెన్‌ 24 బంతుల్లో 51 స్కోర్‌తో.. 2 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. తెలుగు ఆటగాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి 40 పరుగులతో రాణించాడు. 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటింగ్ దళాన్ని దెబ్బతీసేందుకు బెంగళూరు బౌలర్లు చేసిన ప్రదర్శన ఫలించలేదు. అతి కష్టంగా మూడు వికెట్లు తీశారు. రసిక్‌ సలామ్‌, సుయాశ్‌ శర్మ, కృనాల్‌ పాండ్యా తలా ఒక్కో వికెట్‌ తీశారు.

ఉప్పల్‌ స్టేడియంలో బ్యాటర్లు చెలరేగి ఆడడంతో ప్రేక్షకులు పండుగ చేసుకున్నారు. ప్లేఆఫ్స్‌ చేరడంతోపాటు టాప్‌ జట్టు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో ఆడుతుండడంతో ప్రేక్షకులతో స్టేడియం కిక్కిరిసింది. కళ్లు చెదిరే షాట్లతో ఉప్పల్‌ స్టేడియంలో ప్రేక్షకులు ఉర్రూతలూగారు. సొంతగడ్డపై ఆడుతున్న హైదరాబాద్‌ జట్టుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

0
0
Report
Advertisement

Vishnu Priya: 'డబ్బుల కోసం శరీరం అమ్ముకుంటున్నావు'.. ట్రోల్స్‌పై విష్ణుప్రియ తీవ్ర ఆగ్రహం

Hyderabad, Telangana:

Vishnu Priya Bhimeneni: 'డబ్బుల కోసం శరీరం అమ్ముకుంటున్నావు' అంటూ తనపై అసభ్య వ్యాఖ్యలతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని బిగ్‌బాస్‌ తెలుగు కంటెస్టెంట్‌, యాంకర్‌ విష్ణుప్రియ వాపోయారు. సోషల్‌ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాడీ షేమింగ్‌, అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

Also Read: Sara Tendulkar: బాడీ షేమింగ్‌.. సచిన్‌ గారాల పట్టీ సారా టెండూల్కర్‌కు అవమానం

సోషల్ మీడియాలో సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేసే ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ నటి, యాంకర్ విష్ణుప్రియ దీనికి బాధితురాలిగా మారారు. తనపై సోషల్ మీడియా వేదికగా కొందరు వ్యక్తులు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. తనపై సోషల్‌ మీడియాలో దాడి జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ నటి, యాంకర్ విష్ణుప్రియ హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన న్యాయవాదితో కలిసి తనపై జరుగుతున్న దాడి.. ట్రోలింగ్స్‌పై ఆధారాలతో సహా వివరించారు. సదరు అకౌంట్ల వివరాలను, పోస్టుల స్క్రీన్‌షాట్లను కూడా ఆమె పోలీసులకు సమర్పించినట్లు తెలిపారు. విష్ణుప్రియ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: Save KBR Park: కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి.. పర్యావరణ పరిరక్షణలో అండగా ఉంటాం: కేటీఆర్

కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా.. తీవ్ర అభ్యంతరకరంగా ఉన్న పోస్టులు, కామెంట్లు తన దృష్టికి వచ్చాయని విష్ణుప్రియ వివరించారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా.. సమాజంలో తనకున్న గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 'దీనిపై ఎప్పుడో తాను స్పందించాల్సి ఉంది. కానీ చాలా రోజులు ఎదురుచూసి చాలా నిందలు, అవమానాల తర్వాత ఫిర్యాదు చేశా. చాలా నెగిటివ్, బ్యాడ్ పబ్లిసిటీ, రాంగ్ పబ్లిసిటీ, తప్పుడు ప్రచారం.. కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో అసభ్యకర సమాచారం వ్యాప్తి చేస్తుండడంతో వారందరి మీద పోలీసులకు వివరించా' అని విష్ణుప్రియ వెల్లడించారు.

Also Read: GT vs CSK Highlights: టాప్‌ 2లోకి గుజరాత్‌ టైటాన్స్‌.. ఘోర పరాభవంతో చెన్నై ఇంటికి

'మానసికంగా దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. మేము ప్రజలకు వినోదం అందించేందుకు ఈ రంగంలోకి వచ్చాం. ఐదు, పది నిమిషాలు మా కంటెంట్ చూసి ఎంజాయ్ చేయాలని మేం కార్యక్రమాలు చేస్తున్నాం. ఏ సెలబ్రిటీ కూడా ప్రేక్షకులకు హాని కలిగించేలా చేయలేదు' అని విష్ణుప్రియ తెలిపారు. కొన్ని కొన్ని సార్లు తెలియకుండా కొన్ని చేస్తాం. అవి తప్పులైనప్పుడు నిజంగా తప్పులైనప్పుడు నిందించండి, ఖండించండి. తలవంచుకొని ఎన్నైనా మాటలు తీసుకుంటాం' అని విష్ణుప్రియ స్పష్టం చేశారు. 

తప్పు కానివి.. వ్యక్తిగత హననం చేస్తూ.. డబ్బుల కోసం శరీరం అమ్ముకుంటుంది ఇలాంటి వ్యాఖ్యలు కొందరు వాడుతున్నారు. కొంతమంది పెద్ద పెద్ద వాళ్లు.. పెద్ద పెద్ద ఛానల్స్‌లో మాట్లాడుతున్నారు. 'కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయితే అసలు వాళ్లు ఏమి లైఫ్‌లో ఏమీ చేయకుండా.. వేరే వాళ్లని కించపరచడం మంచి పద్ధతి కాదు. ఇలాంటి వాటిపై ఇంకా ఎన్ని రోజులు ఇలా నోరు మూసుకొని ఉంటా? ఒక్కసారైనా నా కోసం నేను పోరాడాలనుకున్నా. నా కోసమే కాదు, ఇంకా వేరే ఏ ఆడపిల్లల గురించి ఎలా పడితే అలా.. ఎవరు పడితే ఎవరు అయినా మాట్లాడుకోకూడదని పోలీసులకు ఫిర్యాదు చేశా' అని విష్ణుప్రియ వివరించారు.

0
0
Report

Rajya Sabha Elections: తెలుగుదేశం పార్టీకి జోష్‌.. పెద్దల సభలో పెరగనున్న బలం

Nuzendla, Andhra Pradesh:

TDP Rajya Sabha Seats: దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేయడంతో ఆంధ్రప్రదేశ్‌లో జోష్‌ వచ్చింది. 10 రాష్ట్రాల పరిధిలో మొత్తం 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న పోలింగ్ నిర్వహించనుండగా.. వాటిలో ఏపీలోని నాలుగు స్థానాలు ఉన్నాయి. జూన్ 1న ఈ ఎన్నికలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుండగా, జూన్ 8 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు విధించారు. జూన్ 18వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు.

Also Read: Sara Tendulkar: బాడీ షేమింగ్‌.. సచిన్‌ గారాల పట్టీ సారా టెండూల్కర్‌కు అవమానం

ఈ రాజ్యసభ ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, సానా సతీష్ పదవీకాలం జూన్ 26తో ముగియనుంది. ఈ 4 స్థానాలు అధికారంలోని ఎన్డీయే కూటమికి దక్కనున్నాయి. టీడీపీకి రెండు, బీజేపీ, జనసేనకు చెరో ఒకటి దక్కుతుందని సమాచారం. వైఎస్సార్‌సీపీకి ఎమ్మెల్యేల సంఖ్యా బలం లేకపోవడంతో ఒక్క రాజ్యసభ స్థానం కూడా దక్కదు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బలాబలాల ఆధారంగా నాలుగు రాజ్యసభ స్థానాలూ కూడా కూటమికే చెందనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల త్యాగాలు, రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా తమకు ఈ ఎన్నికల్లో కచ్చితంగా అవకాశం ఇవ్వాలని జనసేన, బీజేపీ గట్టిగా కోరుతున్నాయి. జాతీయ స్థాయిలో పెద్దల సభలో తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవడానికి ఇదొక సువర్ణావకాశంగా మిత్రపక్షాలు భావిస్తున్నాయి. ఈ నాలుగు రాజ్యసభ స్థానాల సర్దుబాటుపై కూటమి నాయకులు సమావేశమై నిర్ణయం తీసుకోబోతున్నట్లు చర్చ జరుగుతోంది.

Also Read: Bank Employees: బ్యాంకు ఉద్యోగులకు బంపర్‌ శుభవార్త.. రెండు రోజులు ఏమిటంటే?

తెలుగుదేశం పార్టీలో ఆశావహుల సంఖ్య భారీగా ఉంది. రాజ్యసభ స్థానం కోసం పెద్ద ఎత్తున పోటీ ఉండడంతో ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారింది. పార్టీ కోసం సుదీర్ఘకాలంగా కష్టపడిన సీనియర్ నాయకులు.. గత ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారు, సామాజిక సమీకరణాల రీత్యా ప్రాధాన్యం ఉన్న నాయకులు ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని లాబీయింగ్‌ మొదలుపెట్టారు. ఈసారి ఎలాగైనా అవకాశం దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ రాజ్యసభ ఎన్నికలు ఏపీలోని కూటమి ప్రభుత్వంలో సీట్ల సర్దుబాటుకు పరీక్ష కానుంది. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పేందుకు బీజేపీ, జనసేన పట్టుబడుతుండగా.. సొంత పార్టీ నాయకుల ఒత్తిడిని తట్టుకుని టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ నెలకొంది. 

Also Read: Petrol Price: 'మోదీ పిలక ట్రంప్ చేతికి చిక్కింది.. ఇందిరకు ఉన్న తెగువ మోదీకి లేదు

ప్రస్తుతం రాజ్యసభ రేసులో వినిపిస్తున్న పేర్లు ఇవే
సానా సతీష్ కొనసాగింపు
గల్లా జయదేవ్, కంబంపాటి రామ్మోహన్ రావు, కిలారు రాజేష్
బీసీ కోటాలో జంగా కృష్ణమూర్తి
ఎస్సీ సామాజిక వర్గం నుంచి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఏపీ మాదిగ కార్పొరేషన్ రాష్ట్ర చైర్‌పర్సన్)

0
0
Report

Karimnagar: విశ్వవేదికపై తెలుగు కళల వైభవం.. విదేశీ అధినేతలకు ప్రధాని మోదీ అరుదైన కానుకలు!

Hyderabad, Telangana:

Global Stage for Indian Art: భారతీయ సంప్రదాయ కళలు, అపార సాంస్కృతిక వైభవానికి ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ వేదికలపై మరోసారి అగ్రతాంబూలం అందించడం విశేషం. ఇటీవల ఐదు దేశాల అధికారిక పర్యటనలను సక్సెస్‌ ఫుల్‌గా పూర్తి చేసుకుని స్వదేశానికి వచ్చిన ప్రధాని, ఆయా దేశాలకు సంబంధించిన అధినేతలకు మన దేశానికి సంబంధించిన విశిష్ట హస్తకళలను కానుకలుగా సమర్పించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రాలకు చెందిన అరుదైన కొన్ని రకాల హస్తకళాఖండాలను ప్రపంచ దేశాల ప్రతినిధులకు బహుకరించి.. తెలుగు సంస్కృతి గొప్పదనాన్ని విశ్వవ్యాప్తం చేశారు. 

మోదీ తన పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి సంబంధించిన ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా UAE రాణికి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రపంచ ప్రసిద్ధ సిల్వర్ ఫిలిగ్రీతో తయారు చేసిన అత్యంత అద్భుతమైన జ్యువెలరీ పెట్టెను ప్రధాని కానుకగా అందించారు.. వెండిని సన్నని తీగలుగా తయారు చేసి.. ఎంతో నైపుణ్యంతో, సున్నితంగా అల్లిన ఈ పెట్టె రాణిని ఎంతగానో ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. శతాబ్దాల చరిత్ర కలిగిన కరీంనగర్ ఫిలిగ్రీ కళకు అంతర్జాతీయ గుర్తింపు తేవడంలో ప్రధాని తీసుకున్న ఈ చొరవపై తెలంగాణ కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా నార్వే యువరాజుకు ఏపీకి చెందిన సుప్రసిద్ధ కళంకారీ శైలిలో రూపొందించిన ఒక అద్భుతమైన చిత్రపటాన్ని ప్రధాని మోదీ గిఫ్టుగా ఇచ్చారు. పూర్తిగా నాచ్యురల్‌ రంగులు, కలం ఉపయోగించి వస్త్రాలపై పురాణ గాథలతో పాటు ప్రకృతి అందాలను చిత్రించే ఈ కళాఖండం నార్వే ప్రతినిధులను మంత్రముగ్ధులను చేసిందని సమాచారం. 

Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..

అలాగే ఇటలీ పర్యటనలో ఆ దేశ మహిళా పీఎం జార్జియా మెలోనీకి అస్సాం రాష్ట్రానికి సంబంధించిన అత్యంత విలువైన ముగా సిల్క్ శాలువాను మోదీ కానుకగా అందించారు. కేవలం అస్సాంలో మాత్రమే లభించే ఈ ముగా పట్టు వస్త్రం దాని సహజ సిద్ధమైన మెరుపు, మన్నికకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా ఇది చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. 

Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

Top 50 Hot cities: బాబోయ్ భానుడు.. ప్రపంచంలోనే టాప్ 50 హాటెస్ట్ సిటీస్ అన్నీ మన ఇండియాలోనే! తెలంగాణ నుంచి ఆ జిల్లా కూడా పోటీ!

Hyderabad, Telangana:

World Top 50 Hot Cities In India Today: ఎయిర్ క్వాలిటీ వెదర్ ట్రాకర్ నివేదిక ప్రకారం ఈ రోజు శుక్రవారం నాటికి టాప్ 50 హాటెస్ట్ సిటీస్ మన దేశంలోనే ఉన్నాయి. ఉదయం 10:50 గంటల సమయంలో బాలాసోర్ లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఆ తరువాత స్థానంలో చంద్రపూర్, ప్రయాగ రాజ్ నగరాలు 44 డిగ్రీల ఉష్ణోగ్రతను దాటేశాయి. చత్తీస్‌గఢ్‌, తెలంగాణ, హర్యానా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ రికార్డులు బద్దలు కొట్టేలా ఉన్నాయి.

ఇప్పటికే ఈ ప్రాంతాల్లో వేడి తీవ్రత అధికంగా ఉంది. ఉత్తరప్రదేశ్ లోని చాలా జిల్లాలు ఈ 50 హాటెస్ట్ సిటీస్ లో స్థానం సంపాదించాయి. వారణాసి, బరేలీ, అయోధ్య వంటి నగరాలు రికార్డు స్థాయిలో 42, 43 డిగ్రీల ఉష్ణోగ్రతలను మధ్యాహ్నం వేళకు దాటేశాయి. తెలంగాణ నుంచి ఖమ్మం జిల్లా కూడా ఈ టాప్‌ 50 లో ఉంది. 

ప్రజలు ఉక్కిరిబిక్కిరి..
భారత వాతావరణ శాఖ ప్రకారం మన దేశంలో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా నార్త్ వెస్ట్రన్, సెంట్రల్ ఇండియాలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతంలో పొడిగాలులు వీస్తున్నాయి. రుతుపవనాలు రాక ఆలస్యం కావడం వల్ల ఉపశమనం కూడా ఆలస్యమవుతోంది. ఇండో గంగా మైదానం పొడిగాలులతో నిరంతరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

రాజధాని ఢిల్లీలో కూడా తీవ్రమైన వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక్కడ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోతాయని హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, మహారాష్ట్ర వరకు ఇవి వీస్తున్నాయి. దీనివల్ల ఉష్ణ గుమ్మటం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విదర్భాలోని కొన్ని నగరాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత దాటిపోయింది.

ఎండకు ఈ జాగ్రత్తలు..
దేశవ్యాప్తంగా చాలా జిల్లాల్లో డీహైడ్రేషన్ కు గురై చాలామంది హీట్ స్ట్రోక్ బారిన పడి ఆసుపత్రిలో చేరుతున్నారు. ముఖ్యంగా ఆరుబయట పనిచేసేవారు, పిల్లలు, వృద్ధులు ఈ హీట్ స్ట్రోక్ బారిన పడుతున్నారు. అందుకే వైద్య నిపుణులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు రాకూడదని, ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండాలని, ఎండకు తగిన దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు.

ప్రపంచంలోనే ఎక్కువ వేడి కలిగిన నగరంగా బాలాంగిర్ నిలిచింది 48 డిగ్రీలు కూడా దాటేసింది. ఇది వెస్టన్ ఒడిశా ప్రాంతంలోని తితిలాగఢ్‌, బాలాంగిర్ బెల్ట్. ఇది అత్యంత హాటెస్ట్ జోన్ గా పేరుగాంచింది. హాటెస్ట్ సిటీస్ లో ఎక్కువ భాగం భారతదేశంలోనే ఉండడం ఒక భయంకరమైన హెచ్చరిక. 

 

 

భారత వాతావరణ శాఖ హెచ్చరిక..
ఐఎండీ ఇప్పటికే వాయువ్య, మధ్యభారతంలో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదు. అత్యవసరమైతే తప్ప బయట తిరగకూడదని ఐఎండి హెచ్చరించింది. వృద్ధులు, మహిళలు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీలకు కూడా ఇదే హెచ్చరిక జారీ చేశారు. బయటకు వెళ్లాల్సిన సమయంలో టోపీ, గొడుగు వంటివి తప్పనిసరిగా వాడాలి. ప్రతి ఒక్కరూ తమతో పాటు నీళ్ల సీసాను తీసుకువెళ్లడం మంచిది.

Read more:​ Telangana Summer Effect: అగ్నిగుండంగా తెలంగాణ.. 20 జిల్లాల్లో రికార్డు ఉష్ణోగ్రతలు..

Read more:​ AP Weather Update: నిప్పుల కొలిమిలా ఆంధ్రప్రదేశ్‌..

2026 మే 19వ తేదీ నాటికి టాప్ 100 వేడి దేశాలతో పోలిస్తే అందులో ఉత్తరప్రదేశ్ లోని 44 నగరాలు ఉన్నాయి. శుక్రవారం ఉదయానికి అది 50 కి చేరింది.
ఇప్పటికే 46 డిగ్రీలు దాటిన నగరాలు:
ప్రయాగ రాజ్, రాంపూర్, ఫతేపూర్, సంబల్, అమ్రేహా, మీర్జాపూర్, ఆలీఘర్, బరేలీ, వారణాసి ప్రాంతాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
0
Report

Anjanadri Hanuman Temple: అంజనాద్రి హనుమాన్ ఆభరణాలపై అసత్య ప్రచారాలు వద్దు: ఏఎంఆర్ ఇండియా లిమిటెట్ స్పష్టత

Bengaluru, Karnataka:

Anjanadri Hanuman Temple Gold Ornaments: కర్నాటక రాష్ట్రంలోని కొప్పళ జిల్లా గంగావతి ప్రాంతంలోని ప్రసిద్ధ అంజనాద్రి హనుమాన్ దేవస్థానానికి సమర్పించిన బంగారు ఆభరణాలపై జరుగుతున్న ప్రచారాన్ని ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ (AMR India Ltd) తీవ్రంగా ఖండించింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఏఎంఆర్ సంస్థ చైర్మన్ శ్రీ ఎ.మహేష్ కుమార్ రెడ్డి ఆ ఆభరణాలను విరాళంగా అందించారు.

ఈ ఆభరణాలలో కేవలం 250–300 గ్రాముల బంగారమే వాడారంటూ సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలు ముమ్మాటికీ అసత్యమని ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ బి.సుబ్బరామిరెడ్డి స్పష్టం చేశారు. ఈ వివాదానికి సంబంధించిన అసలు వాస్తవాలు, అధికారిక వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

2026 మే 8వ తేదీన ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ తరఫున అంజనాద్రి హనుమాన్ స్వామి వారికి దాదాపుగా రూ.2,20,42,000 (రూ.2.20 కోట్లు) విలువైన ఆభరణాలను విరాళంగా ఇచ్చారు.  దాదాపుగా ఒక కిలో 280 గ్రాముల (నికర బరువు) ఉన్న ఈ ఆభరణాలలో కిరీటం, మకరతోరణం, గద, ఛత్రి, సూర్య చంద్ర, గరుడ హనుమ జెండా సహా మొత్తం 12 రకాలు ఆభరణాలను స్వామి వారికి సమర్పించారు. 

జ్యుడీషియల్ బాండ్ వివరాలు
ఈ ఆభరణాలను కర్నూలు జిల్లా ఆదోనిలోని ప్రసిద్ధ 'కె. రంగనాచారి సన్స్ మెటల్ వర్క్స్' సంస్థ వీటిని తయారు చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి వారు జ్యుడీషియల్ బాండ్ ద్వారా పూర్తి వివరాలను వెల్లడించారు. ఆభరణాల తయారీ కోసం ఏఎంఆర్ చైర్మన్ మహేష్ రెడ్డి తమకు 1400 గ్రాముల (1.4 కిలోలు) బంగారాన్ని అందజేశారు. తయారీలో తరుగు (Wastage) పోగా మిగిలిన 1 కిలో 280 గ్రాముల నికర బరువుతో 12 ఆభరణాలను రూపొందించారు. ఈ బంగారు ఆభరణాలకు తయారీ సంస్థ 50 సంవత్సరాల గ్యారంటీ ఇస్తూ బాండ్ సమర్పించింది. హైదరాబాద్‌కు చెందిన ప్రసిద్ధ 'Tibarumal Jewellery' ఇన్వాయిస్ ఆధారంగా ఈ ఆభరణాల విలువ రూ.2,20,42,000/- గా నిర్ధారించారు.

"అవగాహన లోపంతోనో లేదా కావాలనే తప్పుదారి పట్టించేందుకో కొందరు కేవలం 300 గ్రాముల బంగారమే వాడారని దుష్ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అన్ని రకాల ఒరిజినల్ బిల్లులు, ఆధార పత్రాలను ఇప్పటికే ఆలయ అధికారులకు సమర్పించాము. దేశవ్యాప్తంగా ఉన్న శ్రీశైలం, శ్రీకాళహస్తి, షిర్డీ సాయి బాబా వంటి ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలకు కోట్ల రూపాయల విలువైన ఆభరణాలను విరాళంగా ఇచ్చిన గొప్ప చరిత్ర దాత మహేష్ రెడ్డి గారికి ఉంది. అలాంటి వారిపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం అత్యంత బాధాకరం." అని ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ సంస్ధ డైరెక్టర్ బి.సుబ్బిరామిరెడ్డి స్పష్టం చేశారు. 

లీగల్ యాక్షన్ హెచ్చరిక
భక్తులు, ప్రజలు ఎవరూ ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని సంస్థ విజ్ఞప్తి చేసింది. దేవుడికి భక్తితో సమర్పించిన పవిత్ర ఆభరణాల విషయంలో హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించవద్దని మీడియా, సోషల్ మీడియా సంస్థలను కోరింది. వాస్తవాలను పరిశీలించకుండా కుట్రపూర్వకంగా అసత్యాలు వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు (Legal Action) తీసుకుంటామని ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ హెచ్చరించింది.

ప్రకటన విడుదల చేసినవారు: 
బి. సుబ్బరామిరెడ్డి 
డైరెక్టర్, AMR India Limited, హైదరాబాద్.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం ప్రకటన మాత్రమే. ఇందులో సదరు ఆలయంతో గానీ, దాతల వ్యవహారాల్లో కానీ జీ తెలుగు న్యూస్ కు ఎలాంటి ప్రమేయం లేదు. దీన్ని జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులు కేవలం ప్రకటనగానే తీసుకుంటురాని ఆశిస్తున్నాం.)

Also Read; Gudivada Temple: తాకట్టులో వెంకటేశ్వరస్వామి బంగారు కిరీటం..దాని విలువ అక్షరాల రూ.కోటి!

Also Read: తెలంగాణ కార్మికులకు గుడ్‌న్యూస్..రూ.20,000లకు జీతం పెంచిన రేవంత్ సర్కార్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Employees Train Piduguralla: పల్నాడు ప్రజలకు శుభవార్త..ఫలించిన ఎంపీ కృషి..పిడుగురాళ్లలో ఎంప్లాయిస్ ట్రైన్ స్టాపేజ్..

Piduguralla, Andhra Pradesh:

Employees Train Stoppage Piduguralla: పల్నాడు జిల్లా ప్రయాణీకులు, ఉద్యోగుల దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ రైల్వే శాఖ నేడు కీలక ప్రకటన చేసింది. లింగంపల్లి - విజయవాడ - లింగంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్స్: 12796 / 12795) రైలుకు పిడుగురాళ్ల స్టేషన్‌లో స్టాపేజ్‌కు రైల్వే శాఖ అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. అయితే దీని వెనుక పట్టువదలని విక్రమార్కుడిలా పల్నాడు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు చేసి కృషి ఫలించడంతో పల్నాడు ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో హైదరాబాద్, విజయవాడ వైపు వెళ్లేందుకు పల్నాడు ప్రాంత ప్రజలకు సరైన రైలు రవాణా సదుపాయం అందుబాటులో లేదు. ఈ మార్గంలో ప్రయాణించే అత్యధిక శాతం మంది ప్రజలు, ఉద్యోగులు ఈ రైలుపై ఆధారపడ్డారు. ప్రయాణీకులు, ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తుల ఈ ప్రధాన రవాణా సమస్యను గుర్తించిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు.. ఎంప్లాయీస్ రైలును పిడుగురాళ్లలో ఆపడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు లబ్ధి చేకూరుతుందని భావించారు.

ఇదే సమస్యను రైల్వే మంత్రి దృష్టికి పదేపదే తీసుకెళ్లారు. దీనిపై తాజాగా సమాలోచనలు చేసి ఎట్టకేలకు పిడుగురాళ్ల రైల్వే స్టేషన్‌లో ఎంప్లాయిస్ రైలు ఆపేందుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అనుమతి ఇచ్చారు. దీంతో తన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ధన్యవాదాలు తెలియజేశారు.
Employees Train Piduguralla Stoppage

పల్నాడు ప్రజలకు ఉపశమనం
లింగంపల్లి - విజయవాడ మధ్య నడిచే ఈ 'ఎంప్లాయ్స్ ట్రైన్' పిడుగురాళ్లలో ఆగడం వల్ల నిత్యం విజయవాడ, హైదరాబాద్ వైపు వెళ్లే వందలాది మంది ఉద్యోగులకు, పై చదువుల కోసం వెళ్లే విద్యార్థులకు, వ్యాపారస్తులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు తెలియజేశారు. ఇప్పటివరకు సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడిన పల్నాడు పరిసర ప్రాంతాల ప్రజలు ఇకపై ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. త్వరలోనే ఈ స్టాపేజ్ అమలులోకి వచ్చే తేదీ, సమయాల పూర్తి వివరాలను రైల్వే శాఖ అధికారికంగా ప్రకటిస్తుందని శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు స్పష్టం చేశారు.

రైలు ప్రయాణ వివరాలు (సమయాలు):

1) ట్రైన్ నెం. 12796 (లింగంపల్లి ➔ విజయవాడ): ప్రతిరోజూ ఉదయం 04:40 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి, సికింద్రాబాద్ (05:20) మీదుగా ఉదయం 10:35 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

2) ట్రైన్ నెం. 12795 (విజయవాడ ➔ లింగంపల్లి): ప్రతిరోజూ సాయంత్రం 17:30 గంటలకు (సాయంత్రం 05:30 PM) విజయవాడలో బయలుదేరి, రాత్రి 23:35 (11:30 PM) గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది.

Also Read: 2027 నుంచి అమలులోకి కొత్త జీతాలు..భారీగా రానున్న 'అరియర్స్'..8 పే కమిషన్ క్లారిటీ!

Also REad: ఆ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు..భారీగా నిధుల విడుదల..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Nissan Tekton: క్రెటా, సెల్టోస్‌లకు పోటీగా Nissan Tekton.. రూ. 11 లక్షలకే అద్భుతమైన ఫీచర్లు!

Hyderabad, Telangana:

Nissan Tekton Launch Price: ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ Nissan భారత మార్కెట్లో అద్భతమైన మిడ్-సైజ్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ టెక్టాన్ అనే పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఈ Nissan Tektonను కంపెనీ జూలై 9న భారత మార్కెట్‌లోకి అధికారికంగా విడుదల చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ గతంలో మంచి డిమాండ్‌ కలిగిన కిక్స్ ఎస్‌యూవీ తయారీని నిలిపివేసిన తర్వాత దాదాపు మూడేళ్ల విరామం అనంతరం నిస్సాన్ ఈ విభాగంలోకి గ్రాండ్ రీ-ఎంట్రీ ఇస్తుండటం విశేషం.. అయితే, ఈ SUV అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. 

నిస్సాన్ టెక్టాన్ ఎస్‌యూవీని ప్రముఖ రెనో డస్టర్ (Renault Duster)కు సంబంధించిన ఆర్‌జీఎమ్‌పీ (RGMP) ప్లాట్‌ఫామ్‌పైనే రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇంజన్‌తో పాటు సాంకేతికత పరంగా డస్టర్‌ SUVని పోలి ఉంటుందని వార్తలు వస్తున్నాయి. దీని డిజైన్, క్యాబిన్ లుక్‌తో పాటు ఫీచర్లలో నిస్సాన్ కొన్ని రకాల మార్పులు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయంగా ఎంతో ప్రజాదరణ పొందిన నిస్సాన్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ఈ సరికొత్త డిజైన్‌తో అందుబాటులోకి తీసుకు రావడం వల్ల మార్కెట్‌లో దీనికి మరింత అద్భుతమైన డిమాండ్‌ పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ కారుకు సంబంధించిన డిజైన్‌కి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇది వెడల్పైన గ్రిల్‌తోపాటు పూర్తిగా పొడవుగా ఉండే కనెక్టెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, సీ-షేప్ హెడ్‌ల్యాంప్‌లు ఈ కారుకు మరింత అద్భుతమైన లుక్‌ను అందిస్తుంది.. అంతేకాకుండా 18-ఇంచుల స్టైలిష్ అలాయ్ వీల్స్‌తో పాటు వెనుక వైపు కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్‌లు ఈ కారుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..

ఈ కారులో ఇంటీరియర్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకునేలా త్రీ-టోన్ కలర్ థీమ్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఇందులో కంపెనీ చాలా ప్రత్యేకమైన 10.1-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా అందిస్తోంది. అలాగే పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు అద్భుతమైన పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి అనేక రకాల ప్రత్యేకమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఇందులో కంపెనీ సెఫ్టీకి పెద్దపీట వేసింది. ఇందులో  6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు లెవెల్-2 ఏడీఏఎస్ టెక్నాలజీ అందిస్తోంది. అదేవిధంగా 360-డిగ్రీల కెమెరాను కూడా ఇందులో అందిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read:  బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్లు..మే 28న సరికొత్త డిజైన్‌తో టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ లాంచ్

ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఇంజన్‌ వివరాల్లోకి వెళితే.. ఇందులో రెండు రకాల టర్బో-పెట్రోల్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది. బేస్ వేరియంట్లలో 100 హార్స్‌పవర్ ఇచ్చే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా హై-ఎండ్ మోడల్‌లో 163 హార్స్‌పవర్ ఉత్పత్తి చేసే శక్తివంతమైన 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా 6-స్పీడ్ మాన్యువల్‌తో పాటు డీసీటీ (DCT) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు లభిస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో కంపెనీ ఇందులోనే స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక భారత మార్కెట్లో నిస్సాన్ టెక్టాన్ ధర రూ.11 లక్షల నుంచి ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి.

Also Read:  బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్లు..మే 28న సరికొత్త డిజైన్‌తో టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ లాంచ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Tata Tiago 2026: బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్లు.. మే 28న సరికొత్త డిజైన్‌తో టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ లాంచ్!

Hyderabad, Telangana:

Tata Tiago Ev 2026 Facelift Revealed: హ్యాచ్‌బ్యాక్ కార్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా టాటా బ్రాండ్‌కి సంబంధించిన కార్లు ఊహించని స్థాయిలో వినియోగదారులు కొనుగోలు చేస్తూ ఉంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుని టాటా మోటార్స్ టియాగో (Tiago)తో పాటు టియాగో ఈవీ (Tiago EV)లకు సంబంధించిన ఫేస్‌లిఫ్ట్ మోడల్స్‌ను ఈ నెల 28వ తేదిన మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. అయితే, ఈ మోడల్స్‌ లాంచ్‌కి ముందే ఎక్స్‌టీరియర్ డిజైన్‌కి సంబంధించిన ఫోటోతో పాటు వీడియోలను కంపునీ టీజర్‌ విడుదల చేసింది. గత మోడల్స్‌తో పోలిస్తే ఈ ఇవి డిజైన్‌ పరంగా మరింత అద్భుతంగా, ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. 

కొత్త టాటా టియాగోతో పాటు టియాగో ఈవీ మోడల్స్‌కి సంబంధించిన డిజైన్స్‌ చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వీటి ముందు భాగంలో ఐబ్రో-షేప్ (Eyebrow-shaped) ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు (DRLs)తో పాటు కొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. పెట్రోల్ (ICE) మోడల్‌లో నల్లటి గ్రిల్‌తో పాటు ప్రత్యేకమైన డిజైన్‌తో ఫాగ్ ల్యాంప్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈవీ వెర్షన్‌లో బాడీ కలర్ గ్రిల్‌తో పాటు ఫాగ్ ల్యాంప్స్ లేని క్లీన్ బంపర్ డిజైన్‌ను అందిస్తున్నట్లు టీజర్‌లోని డిజైన్‌ క్లియర్‌గా చెబుతోంది. ఈ కారు వెనుక భాగంలో సరికొత్త  కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్-లైట్లతో పాటు ప్రత్యేకమైన బంపర్ డిజైన్ ఈ కార్లుకు మరింత ప్రీమియం లుక్‌ను అందించబోతోంది. అదనంగా వీల్ ఆర్చ్‌లపై క్లాడింగ్, కొత్త డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్ కారుకు స్పోర్టీ లుక్కును అందిస్తాయి. 

ఫీచర్స్‌ పరంగా ఈ బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్‌లలో టాటా కంపెనీ ఒక అద్భతమైన పెద్ద అప్‌గ్రేట్‌ అందించిన్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ మొట్టమొదటిసారిగా 360-డిగ్రీ కెమెరా ఫీచర్‌ను అందిస్తోంది. అంతేకాకుండా కారు ముందు బంపర్‌తో పాటు సైడ్ మిర్రర్ల (ORVMs) కింద ఉన్న కెమెరా మాడ్యూల్స్‌ను వినియోగించి ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా క్యాబిన్‌లో 10.25-ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్‌తో పాటు కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇల్యూమినేటెడ్ లోగోతో కూడిన స్టీరింగ్ వీల్ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.. అలాగే ఇందులో కంపెనీ సెఫ్టీని దృష్టిలో పెట్టుకుని ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read:  Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!

ఇక ఇందులోని పెట్రోల్ వేరియంట్ గతంలోని మోడల్స్‌ లాగే 1.2-లీటర్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, AMT ఆప్షన్లతో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా  i-CNG వెర్షన్ కూడా అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే టియాగో ఈవీకి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతమున్న 19.2kWhతో పాటు 24kWh బ్యాటరీ ప్యాక్‌ల సామర్థ్యాన్ని మరింత పెంచి మార్కెట్‌లోకి తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈవీ రేంజ్‌ గరిష్టంగా 293 కిలోమీటర్లు కాగా.. రాబోయే కొత్త మోడల్స్‌లో రేంజ్‌ మరింత పేరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కార్లుకు సంబంధించిన ధరల వివరాల్లోకి వెళితే.. పెట్రోల్ ధర రూ.4.60 లక్షల నుంచి ప్రారంభమై..రూ.7.68 లక్షల వరకు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈవీ మోడల్స్‌ రూ.7.99 లక్షల నుంచి రూ.11.14 లక్షలు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read:  Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Bus Accident: ఉత్తరప్రదేశ్‌లో తెలుగోళ్ల బస్సు ప్రమాదం.. నరసరావుపేటకు చెందిన 50 మందితో వెళ్తుండగా..

Misrikh-cum-Neemsar, Uttar Pradesh:

Narasaraopet Bus Accident: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకుల బస్సుకు ఒక పెద్ద ప్రమాదం తప్పింది. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మార్గమధ్యంలో ప్రమాదానికి గురైంది. అయితే, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అసలేం జరిగిందంటే?
నరసరావుపేటకు చెందిన యాత్రికులు ఉత్తర భారతదేశ పర్యటనలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నైమిశారణ్యం దర్శించుకుని, అక్కడ నుండి అయోధ్యకు బస్సులో బయలుదేరారు. లక్నో, అయోధ్య మీదుగా వారు నేపాల్ వెళ్లాల్సి ఉంది. అయితే, మార్గమధ్యంలో వీరి బస్సు ప్రమాదానికి గురైంది.

ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం.. బస్సులో ఉన్న నరసరావుపేటకు చెందిన 50 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు. కానీ, ప్రమాదం కారణంగా ప్రయాణికులందరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఎవరికీ తీవ్రమైన గాయాలు కాకపోవడం, ప్రాణాపాయం తప్పడంతో బాధితులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read: 2027 నుంచి అమలులోకి కొత్త జీతాలు..భారీగా రానున్న 'అరియర్స్'..8 పే కమిషన్ క్లారిటీ!

Also Read: అనిరుధ్‌తో కావ్యా పాప పెళ్లి ఫిక్స్?! ఐపీఎల్ అవ్వగానే ముహూర్తం! నిజం బయటకొచ్చింది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

8th Pay Commission: 2027 నుంచి అమలులోకి కొత్త జీతాలు..భారీగా రానున్న 'అరియర్స్'..8వ వేతన సంఘం ఏం చెబుతోంది!

Hyderabad, Telangana:

8th Pay Commission Update: దేశవ్యాప్తంగా ఉన్న కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం పరిధిలో వేతన సవరణల ప్రక్రియ ఊపందుకుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిషన్, ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాలలో భాగస్వామ్య పక్షాలతో క్షేత్రస్థాయి చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల పెంపును డిసైడ్ చేసే 'ఫిట్మెంట్ ఫ్యాక్టర్' ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కొత్త పే స్కేల్ ఖరారైతే ఉద్యోగుల కనీస బేసిక్ శాలరీ ఏకంగా మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని రక్షణ, రైల్వే తదితర కార్మిక సంఘాల అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పాత ప్రాథమిక వేతనాన్ని (బేసిక్ పే) కొత్త పే-స్ట్రక్చర్‌కు అనుగుణంగా మార్చడానికి ఉపయోగించే ఒక గణిత గుణకాన్ని 'ఫిట్మెంట్ ఫ్యాక్టర్' అంటారు. సరళంగా చెప్పాలంటే, ప్రస్తుత బేసిక్ జీతాన్ని ఈ నంబర్‌తో గుణించి కొత్త జీతాన్ని లెక్కిస్తారు.

7వ వేతన సంఘం హయాంలో ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57గా ఖరారు చేయగా.. దీనివల్ల ఉద్యోగుల కనీస ప్రాథమిక వేతనం అప్పట్లో రూ.7,000 నుండి ఒకేసారి రూ.18,000కి పెరిగింది. ఇప్పుడు ద్రవ్యోల్బణం, పెరిగిన జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని ఈ గుణకాన్ని భారీగా పెంచాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి.

రూ.18 వేల నుండి రూ.72 వేలకు పెంపు?
ప్రస్తుతం కొనసాగుతున్న చర్చల్లో వివిధ ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను కమిషన్ ముందు ఉంచాయి. నేషనల్ కౌన్సిల్ (NC-JCM) ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను 3.83కి పెంచాలని ప్రతిపాదించింది. ఒకవేళ ప్రభుత్వం దీనిని అంగీకరిస్తే, కనీస ప్రాథమిక వేతనం రూ.18,000 నుండి ఒకేసారి రూ.51,480కి చేరుతుంది.

భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఘ్ (BPMS) ఒక అడుగు ముందుకు వేసి దీనిని 4.0 శాతానికి పెంచడంతో పాటు వార్షిక ఇంక్రిమెంట్‌ను 3% నుండి 6% కి పెంచాలని డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్‌కు గ్రీన్ సిగ్నల్ లభిస్తే, కనీస బేసిక్ శాలరీ ఏకంగా రూ.72,000 కు పెరుగుతుంది.

రైల్వే టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ (IRTSA) కూడా ఉద్యోగుల స్థాయిని బట్టి (లెవెల్ 1 నుండి లెవెల్ 18 వరకు) 2.92 నుండి 4.38 వరకు వేర్వేరు మల్టిపుల్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్లను ఇవ్వాలని, కనీస జీతం రూ.52,000 ఉండాలని సరికొత్త ప్రతిపాదనను తెచ్చింది.

జనవరి 1, 2026 నుండి కొత్త వేతన సవరణలు అమలులోకి రావాల్సి ఉన్నందున, 8వ పే కమిషన్ తన కసరత్తును వేగవంతం చేసింది. మే 18, 19 తేదీల్లో హైదరాబాద్‌లో పర్యటించిన కమిషన్ సభ్యులు, జూన్ మొదటివారంలో శ్రీనగర్, లడఖ్, లక్నోలలో పర్యటించి ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను సేకరించనున్నారు. ప్రతి 10 ఏళ్లకు కాకుండా, ప్రతి ఐదేళ్లకోసారి పెన్షన్ సవరణ చేపట్టాలనే పార్లమెంటరీ కమిటీ సిఫార్సును కూడా పరిశీలించాలని క్యాబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్ నేతృత్వంలోని జేసీఎం (JCM) సమావేశంలో నిర్ణయించారు.

కమిషన్ డేటా విశ్లేషణ, నివేదిక తయారీకి ప్రభుత్వం సుమారు 18 నెలల సమయం కేటాయించింది. దీని ప్రకారం 2027 మధ్య నాటికి కానీ కమిషన్ తన తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే అవకాశం లేదు. ఆ తర్వాతే కేంద్ర క్యాబినెట్ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుంది. అంటే పెరిగిన కొత్త జీతాలు చేతికి అందడానికి ఉద్యోగులు 2027 వరకు వేచి చూడక తప్పదు.

అయితే, ఈ కొత్త పే స్కేల్స్ 2026 జనవరి 1 నుండి పాత తేదీతో వర్తిస్తాయి. కాబట్టి, అమలు ఆలస్యమైనప్పటికీ మధ్యలో ఉన్న నెలలన్నింటికీ భారీ మొత్తంలో బకాయిలు ఒకేసారి ఉద్యోగుల ఖాతాల్లో జమకానున్నాయి. అప్పటివరకు ఉద్యోగులకు 7వ పే కమిషన్ నిబంధనల ప్రకారమే కరువు భత్యం (DA) పెంపుదల వంటి ఆర్థిక ప్రయోజనాలు కొనసాగుతాయి.

Also Read: బ్యాంకు కస్టమర్లకు విజ్ఞప్తి..వరుసగా 4 రోజులు ఆ బ్యాంకు బంద్..ఈ పనులు పూర్తి చేయండి!

Also Read: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై..జనసేన, టీడీపీ లిస్టు కూడా రెడీ..రేపే నోటిఫికేషన్?!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Rahu Effect: రాహువు అనుగ్రహం.. ఈ 5 రాశుల వారికి ఇక తిరుగుండదు, కుబేరులవ్వడం ఖాయం!

Hyderabad, Telangana:

Rahu Blessing On These Zodiac Signs Telugu News: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాహువు గ్రహాన్ని ఎంతో శక్తివంతమైన, క్రూరమైన గ్రహంగా పరిగణిస్తారు. రాహువు బాధలను కలిగించడమే కాకుండా.. ఈ గ్రహం జాతకంలో శుభస్థానంలో ఉంటే జీవితంలో అనేక రకాల అద్భుతాలను సృష్టిస్తాడు. అంతేకాకుండా పేదవాడి నుంచి డైరెక్ట్‌గా కోటీశ్వరులను కూడా చేయగలుగుతాడు. కాబట్టి ఈ గ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే రాహువు అనుగ్రహం కొన్ని రాశులవారు ఎల్లప్పుడు పొందుతారు. కాబట్టి ఆయా రాశులవారికి ఎల్లప్పుడు ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా జీవితం మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతూ ఉంటాయి. అనుకోకుండా ఊహించని స్థాయిలో డబ్బులు సొంతం చేసుకుంటారు. అలాగే జీవితం మొత్తం ఎంతో అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

ఈ రాశులవారికి రాహువు అనుగ్రహం..
మకర రాశి
రాహువు ప్రభావంతో మకర రాశివారికి జీవితంలో అద్బుతమైన అధికారం దక్కుతుంది. అంతేకాకుండా రాహువు అనుగ్రహంతో జీవితంలో వీరు శుభప్రభావంతో ముందుకు సాగుతారు. వీరు చేసే పనుల్లో గణనీయమైన విజయాలు సాధిస్తారు. వీరు రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో పనులు చేస్తే మరింత సక్సెస్‌ అవుతారు. కఠోర శ్రమతో ఊహించని దాని కంటే అద్భుతమైన విజయాలు సాధిస్తారు. సాంకేతిక రంగంలో పనులు చేసేవారికి బంపర్ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

వృషభ రాశి 
ఈ వృషభ రాశివారికి అధిపతి శుక్రుడు వ్యవహరిస్తాడు. కాబట్టి రాహువుకు ఈ గ్రహం చాలా సన్నిహిత మిత్ర సంబంధం ఉంటుంది. దీని కారణంగా వీరికి రాహువు ప్రభావంతో కూడా దీర్ఘకాలిక సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. వీరు తప్పకుండా లౌకిక సుఖాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ రాశివారు ఆకస్మికంగా ఆర్థిక లాభాలు కూడా పొందుతారు. భూమి, ఆస్తి, వాహనాలతో సహా వారి సంపదన కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. 

మిథున రాశి
మిథున రాశివారికి రాహువు ప్రభావంతో ఎల్లప్పుడు అద్భుతమైన ఆలోచనలతో ముందుకు సాగుతారు. అంతేకాకుండా రచన, మీడియా, మార్కెటింగ్ రంగాల్లో ఈ రాశులవారికి దిమ్మతిరిగే లాభాలు కలుగుతాయి. అత్యంత క్లిష్ట పరిస్థితులలో కూడా బంపర్‌ లాభాలు పొందుతారు. అలాగే అనుకోకుండా కూడా దిమ్మతిరిగే ధన లాభాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. జీవితం ఎల్లప్పుడు సంతోషంగా ఉంటుంది. 

కన్యారాశి
కన్యా రాశివారికి కూడా రాహువు ప్రభావంతో అనేక సమస్యల నుంచి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. వీరికి శ్రమకు తగ్గ ప్రతిఫలాలు లభిస్తాయి. అంతేకాకుండా శత్రువులు కోరుకున్నా కూడా వారికి హాని చేయలేరని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే వ్యాపారాల్లో కూడా అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా అకౌంటింగ్‌ రంగాల్లో పనులు చేసే ఈ రాశులవారు అద్భుతమైన లాభాలు సొంతం చేసుకుంటారు. అలాగే కోర్టు కేసుల నుంచి కూడా పూర్తి పరిష్కారం లభిస్తుంది. 

తులారాశి 
తులారాశి వారికి కూడా రాహువు ప్రభావంతో భారీ ధన లాభాలు పొందుతారు. వీరు విదేశాల నుంచి కూడా భారీ మొత్తంలో డబ్బులు సంపాదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సామాజిక హోదా కూడా విపరీతంగా పెరుగుతుంది. రాజకీయాలు లేదా ప్రజా సంబంధాల రంగంలో విస్తృతమైన కీర్తిని కూడా పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారికి కూడా ఈ సమయంలో తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Guru Pushya Yoga: గురు పుష్యమి యోగం.. ఈ 4 రాశుల వారికి వారం రోజుల పాటు కాసుల వర్షం!

Hyderabad, Telangana:

Guru Pushya Yoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మే నెలలోని 21వ తేదికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ రోజు గ్రహాల సంయోగం జరిగింది. ముఖ్యంగా ఈ గురు సంచారంతో శుక్రుడి కలయిక జరిగి ఎంతో శక్తివంతమైన గజలక్ష్మి యోగం ఏర్పడింది. అలాగే చంద్రుడు కూడా కర్కాటక రాశిలోకి సంచారం చేయడం వల్ల గౌరీ యోగం ఏర్పడింది. ఈ సమయంలో అనేక రాజయోగాలు ఏర్పడ్డాయి. దీని కారణంగా వీటి ప్రభావం దాదాపు వారం రోజుల పాటు కొనసాగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఏర్పడే గురు పుష్యమి యోగంతో ఆయా రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా బోలెడు లాభాలు చేకూరుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
మేషరాశి 
మేష రాశివారికి మే 21వ తేది చాలా శుభప్రదమైనదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి ఈ సమయంలో సంభాషణ నైపుణ్యం విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా ఇతరుల నుంచి కూడా భారీ మొత్తంలో డబ్బు కూడా సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి చంద్రుడు శుభ స్థానంలో ఉండడం వల్ల కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా వీరికి అదృష్టం కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే జీవితంలో కూడా విలాసవంతం గడుపుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కార్యాలయాల్లో ఉన్న వ్యక్తులకు జీవితంలో సానుకూలమైన మార్పులు రావడం ప్రారంభమవుతాయి. వ్యాపారాలు కూడా సక్రమంగా సాగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే సంబంధాల్లో భావోద్వేగ బంధం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. 

వృషభ రాశి
వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు ఈ గురు పుష్యమి యోగంతో జీవితంలో అపారమైన తెలివితేటలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులకు అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో తోబుట్టువుల నుంచి కూడా సపోర్ట్‌ పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. దీంతో పాటు వైవాహిక బంధం మధురంగా మారుతుంది. వీరికి జీవిత భాగస్వామితో అద్భుతమైన ప్రేమ సంబంధాలు ఏర్పడతాయి. దీని వల్ల వైవాహిక బంధం చాలా మధురంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకుంటున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించే ఛాన్స్‌లు ఉన్నాయి. 

కర్కాటక రాశి
కర్కాటక రాశి రాశివారికి కూడా ఈ యోగంతో దిమ్మతిరిగే లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరికి చంద్రుడి సంచారంతో వివిధ రకాల కళలు, కళాత్మక విషయాలపై ఆసక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఇతరులతో సంబంధాలు స్నేహపూర్వకంగా మారుతాయి. దీంతో పాటు వీరు తప్పకుండా విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కాబట్టి దీని కారణంగా డబ్బులు కూడా విపరీతంగా ఖర్చయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో  సహోద్యోగుల నుంచి మీకు మంచి సపోర్ట్‌ కూడా లభిస్తుంది. అలాగే అదృష్టం ఈ సమయంలో 99 శాతం వరకు సహకరిస్తుంది. 

మకర రాశి 
మే 21వ తేదీ నుంచి మకర రాశివారికి కూడా ఈ సమయం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారాల విషయాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఏడవ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల వీరికి తగిన తెలివితేటలు కూడా విపరీతంగా పెరుగుతాయి. అలాగే అద్భుతమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. దీంతో పాటు మీ సామాజిక పలుకుబడి, గౌరవం పెరుగుతాయి. ఈ సమయంలో తప్పకుండా ప్రభుత్వ పనులలో విజయం సాధిస్తారు. వీరికి ఈ సమయంలో ఎలాంటి ప్రత్యర్థులు మీకు హాని చేసే అవకాశాలు ఉండవని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ప్రేమ జీవితంలో సంబంధాలు కూడా మధురంగా మారుతాయి. వీరికి అదృష్టం కూడా 87 శాతం వరకు సహకరిస్తుంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement
Advertisement
Back to top