యూపీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు
Bellampalle, Kannal Rural, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డ్ లో యూపీహెచ్సీ షంషీర్ నగర్ ఆధ్వర్యంలో ఆర్బీఎస్కే టీం పర్యవేక్షణలో బుధవారం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో వార్డ్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి వైద్యులు మందులు అందజేశారు. అత్యవసరమైన కేసులను సీహెచ్ సీ కి సూచిస్తున్నారు. ఈ సందర్బంగా వైద్యులు మాట్లాడుతూ వ్యక్తిగత శుభ్రతతో పాటు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటామని అన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
July DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్! జూలై డీఏ పెంపుపై కీలక అప్డేట్..
Hyderabad, Telangana:July DA Hike News: కేంద్ర ప్రభుత్వం సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు కరువు భత్యాన్ని సవరిస్తుంది. మొదటి విడత (జనవరి నెలకు సంబంధించి) సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ నెలలో ప్రకటిస్తారు. రెండో విడత (జూలై నెలకు సంబంధించి) సాధారణంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో వెల్లడిస్తారు. రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈసారి ఈ పెంపును కొద్దిగా ముందుగానే ప్రకటించి ఉద్యోగులకు దీపావళి లేదా దసరా కానుక అందించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఎంత శాతం పెరిగే అవకాశం ఉంది?
గత ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం కరువు భత్యాన్ని 58 శాతం నుండి 60 శాతానికి (అనగా 2%) పెంచింది. ప్రస్తుత ద్రవ్యోల్బణం, ధరల సూచీ ట్రెండ్స్ పరిశీలిస్తే, ఈసారి కూడా 2% నుండి 3% వరకు వేతన పెంపును ఉద్యోగులు ఆశించవచ్చు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం 3 శాతం పెంపుకు ఆమోదం తెలిపితే, ఉద్యోగుల మొత్తం డీఏ 63 శాతానికి చేరుకుంటుంది.
ఉద్యోగులు ప్రస్తుతం కొత్త వేతన సంఘం (8వ వేతన సంఘం) ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఈ డీఏ పెంపు కీలకమైనదిగా మారింది. కొత్త వేతన సంఘం అధికారికంగా ఏర్పాటయ్యే వరకు, ఏడవ వేతన సంఘం నిబంధనల ప్రకారమే ఈ అలవెన్సుల పెంపు కొనసాగుతుంది.
ఉద్యోగ సంఘాల డిమాండ్
పండుగ సీజన్ (రక్షాబంధన్, ఓనం వంటి పండుగలు) దృష్ట్యా ఉద్యోగుల జీతాలను ఒకటి లేదా రెండు రోజుల ముందుగానే చెల్లించాలని, అలాగే డీఏ పెంపును ఆలస్యం చేయకుండా త్వరగా ప్రకటించాలని ఆల్ ఇండియా ఎన్పిఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. అక్టోబర్ వరకు ఆలస్యం చేయకుండా, కేంద్ర మంత్రివర్గం త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Also Read: టీచర్లకు బెదిరింపులు.. 'కాక్రోచ్ జనతా పార్టీ' అభిజీత్ దీప్కేపై కేసు నమోదు!
Also Read: రైలు ఒక కిలోమీటర్ ప్రయాణించాలంటే ఎన్ని లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్కు భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అల్పపీడన అలర్ట్!
Hyderabad, Telangana:Andhra Pradesh Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీని ప్రభావం వల్ల రానున్న రెండు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.
మత్స్యకారులకు బలమైన హెచ్చరికలు..
అల్పపీడన తీవ్రత కారణంగా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీనితో పాటు సముద్రం తీవ్ర అలజడిగా మారి అలలు భారీ ఎత్తున ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా మంగళవారం వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఏయే జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది?
సోమవారం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రజలకు కీలక సూచనలు
ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో బయట ఉన్న ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. బలమైన గాలుల వల్ల చెట్లు, భారీ హోర్డింగులు కూలిపోయే ప్రమాదం ఉన్నందున, ఎవరూ వాటి కింద నిలబడకూడదని స్పష్టం చేశారు. వాతావరణంలో వస్తున్న ఈ మార్పులను గమనిస్తూ ప్రజలంతా రక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: ఏపీ నిరుద్యోగులకు విద్యాశాఖ మంత్రి శుభవార్త.. మరో 3,000 టీచర్ పోస్టుల భర్తీకి రెడీ!
Also REad: ఎన్టీఆర్ జిల్లాలో స్కూల్ బస్సుకు ఘోరం ప్రమాదం..20 మంది విద్యార్థులు, దూసుకెళ్లింది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Irumudi Collections: 'ఇరుముడి' సినిమా ఆల్టైమ్ రికార్డ్..36 గంటల్లో బ్రేక్ ఈవెన్ తెచ్చుకొని సంచలనం!
Hyderabad, Telangana:Irumudi Collection Day 2: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన తాజా ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్ 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద అపూర్వ విజయాన్ని అందుకుంది. విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. రవితేజ కెరీర్లోనే మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక వసూళ్లతో ఈ సినిమా ఒక సరికొత్త మైలురాయిని తాకింది. సినిమా విడుదలైన 36 గంటల్లోనే సినిమా కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది.Baingan Bharta: విషంగా మారిన రాత్రి భోజనం.. వంకాయ కూర తిని ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి
Chhatarpur, Madhya Pradesh:Three Sisters Death: ఇంట్లో రాత్రి భోజనంగా చేసిన వంకాయ కూర, చపాతీల ఇంట్లోని ముగ్గురు అక్కాచెల్లెళ్లు తిన్నారు. తిన్న తర్వాత ముగ్గురు బాలికలు తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూశారు. ముగ్గురు కుమార్తెలు మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగింది. అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న ఆ బాలికల మృతి చెందడం పలు అనుమానాలు ఏర్పడుతున్నాయి. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని ఛతర్పూల్ జిల్లాలో చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్ ఛతర్పూర్ జిల్లాలోని పిపోరా ఖుర్ద్ గ్రామానికి చెందిన బాల్ముకుంద్ కుష్వాహకు ముగ్గురు కుమార్తెలు పూనమ్ (7), మనీషా (3), చాహత్ (9 నెలల). వారు ముగ్గురు శుక్రవారం రాత్రి భోజనంగా వంకాయ కూర, చపాతీలు తిన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆ ముగ్గురు పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్దిసేపటికి ఆ ముగ్గురు చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అనంతరం ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలకు అంత్యక్రియలు చేశారు.
అయితే అనుమానాస్పద స్థితిలో బాలికలు మృతిచెందడంతో గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తుల సమాచారం అనంతరం స్థానిక పోలీసులు, వైద్యులతో కలిసి ఆ గ్రామానికి చేరుకున్నారు. పిల్లల మృతదేహాలను పూడ్చిపెట్టిన స్థలాన్ని పరిశీలించారు. బాలికల మృతదేహాలను వెలికితీసి పోస్ట్మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి పోలీసులు ఆధారాలు సేకరించారు.
కుటుంబసభ్యులు చెబుతున్నట్టు బాలికలు తీసుకున్న ఆహారం విషతుల్యమైందని.. వారి మరణానిఇక ఆహారానికి ఏమైనా సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని అధికారులు తెలుసుకుంటున్నారు. పిల్లల అనుమానాస్పద మృతిపై కుటుంబసభ్యులను పోలీసులు విచారణ చేస్తున్నారు. బాలికల మృతిపై పోస్ట్మార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాత వారి మరణానికి కారణాలు తెలియనున్నాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అక్కడి పోలీసులు చెబుతున్నారు. వంకాయ కూర తిని ముగ్గురు చిన్నారులు మరణించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వార్త వైరల్గా మారింది.
BJP Strike: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ పోరు.. 2 రోజుల నిరాహార దీక్ష
Baddipadaga, Telangana:Telangana BJP Protest: విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిపులు చెల్లించడం లేదని తెలంగాణ బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిపులు పెండింగ్లో పడడంతో విద్యార్థుల భవిష్యత్ ప్రమాదకరంగా మారిందని కాషాయ పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేపటి నుంచి తెలంగాణ బీజేపీ నిరాహార దీక్ష చేపట్టనుంది.
రాష్ట్రంలో విద్యావ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంపై తాము పోరాటం చేస్తామని.. ఫీజు బకాయిలు చెల్లించేవరకు బీజేపీ పోరాటం ఆగదని ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు స్పష్టం చేశారు. రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేపటి నుంచి హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో రెండు రోజుల నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు.
న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని.. విద్యార్థులు, యువత తీవ్ర ఆందోళనలో ఉన్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.12,000 కోట్లకు చేరాయని.. నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాలలు అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాయి. విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నాయి' అని వెల్లడించారు.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై హైకోర్టు తీవ్ర స్థాయిలో చీవాట్లు పెడితే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం రాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట రేపటి నుంచి 2 రోజుల నిరాహార దీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. పోలీసుల ఆంక్షలకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
తెలంగాణలో రాహుల్ గాంధీ అడుగుపెట్టే హక్కు లేదు
'రాహుల్ గాంధీకి తెలంగాణలో అడుగుపెట్టే నైతిక హక్కు లేదు. ఎన్నికల వేళ తెలంగాణ విద్యార్థులకు ‘యూత్ డిక్లరేషన్’ పేరుతో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించారు' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులపై లాఠీచార్జీలు జరుగుతుంటే.. ఆయుష్ విద్యార్థులు స్టైపెండ్ల కోసం పోరాడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. పార్లమెంట్లో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా విదేశాలకు పారిపోతూ రోడ్లపై డ్రామాలు చేసే రాహుల్ గాంధీకి దమ్ముంటే హైదరాబాద్కు వచ్చి విద్యార్థుల సమస్యలపై సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. తెలంగాణలో విద్యార్థులు రాహుల్ గాంధీని నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
కాంగ్రెస్ 30 శాతం కమీషన్ల సర్కార్
కాంగ్రెస్ ప్రభుత్వం 'బ్రదర్స్ సర్కార్'గా మారి దోపిడీ చేస్తోందని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా 30 శాతం కమీషన్లు తీసుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో బిల్డర్లను 22ఉ పేరుతో తీవ్రంగా వేధిస్తూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో అవినీతి కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కావడంతోనే ఆ పార్టీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి, అంతర్గత కుమ్ములాటలు, రహస్య సమావేశాలు జరుగుతున్నాయని వివిరించారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు కూడా ప్రభుత్వాన్ని నడిపించేలా కనిపించడం లేదని తెలిపారు.
Jagadish Reddy: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి: జగదీశ్ రెడ్డి
Hyderabad, Telangana:Telangana Bhavan: తెలంగాణ రైతు పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే దానికంటే ఎక్కువ అధ్వానమైపోయిందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కు క్షమాపణలు చెప్పి రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్కు క్షమాపణలు చెప్పి కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలని కోరారు. రైతులకు ఎల్నినో పెట్టిన శాపం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన శాపం అని పేర్కొన్నారు. పోలవరం నుంచి పట్టిసీమ నుంచి బ్రహ్మాండంగా నీళ్లు పోతున్నాయని.. కన్నెపల్లి పంపులు ఆన్ చేసి ఉంటే మల్లన్నసాగర్, కొండ పోచమ్మ, రంగనాయక సాగర్ నిండేవి అని తెలిపారు.
హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ కలిసి ఆడిన నాటకం ద్రోహం ఇప్పుడు తేటతెల్లమైందని తెలిపారు. 'కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ల, అన్నారం బ్యారేజ్లపై కేంద్ర జల సంఘం ఇచ్చిన రిపోర్ట్తో కలిసి ఆడుతున్న నాటకం తేటతెల్లమైంది. మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా కన్నేపల్లి పంపుహౌస్ ఆన్ చేయాలని కేటీఆర్ అనేక సార్లు చెప్పిన రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు. చెప్పిన అబద్ధమే చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ సాకు చెప్పింది' అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. కమీషన్లకు అలవాటుపడిన కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు.
'పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు ఏ విధంగా దోచుకుంటున్నారో వాస్తవాలు ప్రజలకు చూపించా. రాజశేఖర్ రెడ్డి పెట్టిన పోతిరెడ్డిపాడు బొక్కతో అంతులేకుండా నీళ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకెళ్తుంది' అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. పోతిరెడ్డిపాడు నుంచి వరద జలాలను మాత్రమే తీసుకుపోవాలని గుర్తుచేశారు. దుర్మార్గంగా 140 టీఎంసీల నీళ్లను ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీళ్లను తీసుకెళ్లింది. సాగర్లో ఇప్పటివరకు 175 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. 110 టీఎంసీల నీళ్లు వచ్చి ఉంటే సాగర్ నిండేది. నాగార్జున సాగర్లో ఎడమ కాల్వ కింద ఉండే పంటలకు సరిపడే నీళ్లు ఉండేవి' అని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వివరించారు.
'నాగార్జున సాగర్లో 518 అడుగుల నీళ్లు ఉన్నప్పుడే ఎడమ కాల్వ కింద సాగునీరు ఇచ్చాం. సాగర్లో 510 అడుగుల నీళ్లు ఉన్నప్పుడే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎడమ కాల్వ కింద సాగునీరు ఇచ్చాడు. పెన్నా బేసిన్లో వరద రాకున్నా రాయలసీమలో 52 శాతం వర్షపాతం తక్కువ ఉన్నా మహబూబ్ నగర్ పరిధిలో ఉండే పంపులు ఇంతవరకు ఆన్ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి, కృష్ణాలో ద్రోహం చేస్తోంది' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు.
'నీళ్లు ఇస్తే కరెంట్ కొనాలని.. పంటలు వేస్తే ఎరువులు ఇవ్వాల్సి వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వడం లేదు. పంట కొంటే బోనస్ ఇవ్వాలి. దుర్మార్గమైన ఆలోచనతో నీళ్లు ఇవ్వడం లేదు' అని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్నినో పేరుతో దుర్మార్గమైన ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని.. నీళ్లు ఇవ్వొద్దని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారని విమర్శించారు.
'నాగార్జున సాగర్ నిండిన రైతులకు నీళ్లు ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పాడు. ఆరుతడి పంటలు ఏం వేసుకోవాలో ఏ జిల్లాలో ఏం పంటలు పండుతాయిని మంత్రులు ఒక్కరంటే ఒక్కరు చెప్పినవారు లేరు. ఏ గింజ పెట్టుకోవాలన్నా నీళ్లు కావాలి, రైతులకు నీళ్లు ఎలా ఇస్తారు' అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. రైతులకు నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
Revanth Reddy: కొన్ని గంటల్లో వచ్చేస్తున్నా.. అన్నింటిపై మాట్లాడుతా: రేవంత్ రెడ్డి
Baddipadaga, Telangana:USA Tour Cancel: అమెరికా పర్యటన రద్దు అంశంపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో బీజేపీ నాయకులు.. జాతీయవాదులు రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ మద్దతుదారుడిని కలిసేందుకు అమెరికా పర్యటనకు వెళ్లడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. జాతీయవ్యాప్తంగా రాజకీయ వివాదం నెలకొన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ విషయాలపై తాను అన్నింటిపై మాట్లాడుతానని... కొన్ని గంటల్లో తాను వస్తున్నట్లు ప్రకటించారు.
తన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలోనే అనుమతి ఇవ్వలేదని రేవంత్రెడ్డి ఆరోపణలు చేశారు. తనకు అనుమతి నిరాకరించడంతో అమెరికాలోని బోస్టన్ పర్యటనకు వెళ్లలేకపోతున్నట్లు తెలిపారు. తన అమెరికా పర్యటనపై ‘ఎక్స్’లో రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. రాజకీయ కారణాలతోనే తన అమెరికా పర్యటనకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించిందని తెలిపారు.
ఈ కారణంగా అమెరికాలోని బోస్టన్కు వెళ్లలేకపోతున్నట్లు.. విదేశీ పర్యటన అంశంలో తనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. లండన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని మరికొన్ని గంటల్లో హైదరాబాద్కు వస్తున్నట్లు వెల్లడించారు. అక్కడికి (హైదరాబాద్) వచ్చాక మిగిలిన అంశాలపై మాట్లాడతానని రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఇక తనకు మద్దతుగా మూడు రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని.. దీనికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రేవంత్రెడ్డి తెలిపారు.
రేపు ప్రెస్మీట్..?
విదేశీ పర్యటన ముగించుకుని రేవంత్ రెడ్డి రేపు ఉదయం హైదరాబాద్కు చేరుకోనున్నారు. అనంతరం రేపు ఉదయం తన అమెరికా పర్యటన రద్దు అంశంపై మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన తన అమెరికా పర్యటన రద్దుపై కీలక విషయాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా తెలంగాణ కాంగ్రెస్లో నెలకొన్న ఆగస్టు సంక్షోభం.. కొండా సురేఖ, చిన్నారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాలపై కూడా స్పందిస్తారని సమాచారం. దీంతో రేపటి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.
Emotional Video: మతిస్థిమితం లేని వ్యక్తికి రాఖీ కట్టిన విద్యార్థిని.. తర్వాత ఆ వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
Hyderabad, Telangana:Emotional Viral Video Watch: రక్తసంబంధం లేకపోయినప్పటికీ.. సమాజం గుర్తించని స్థితిలో ఉన్నప్పటికీ.. స్వచ్ఛమైన ప్రేమకు ఎలాంటి సరిహద్దులు ఉండవని నిరూపించే హృదయాన్ని హత్తుకునే ఘటన ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మతిస్థిమితం లేని ఓ వ్యక్తి పట్ల పాఠశాల విద్యార్థిని చూపిన ప్రేమ.. ఆమె చూపిన ఆదరణకు ఆ వ్యక్తి స్పందించిన తీరు ప్రతి ఒక్కరి కళ్ళలోనూ నీళ్లు తెప్పిస్తోంది. ఇప్పుడు ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరు బాగోద్వేగానికి గురవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
రోజులాగే యూనిఫామ్ ధరించి బ్యాగ్ తగిలించుకొని పాఠశాలకు వెళ్తున్న ఓ బాలిక దగ్గరకు.. చిరిగిన బట్టలతో.. కర్రతో పాటు సంచిని భుజానికి వేసుకొని ఓ మతిస్థిమితం లేని వ్యక్తి వచ్చాడు. చేతిలో ఒక రాఖీని పట్టుకొని.. దాన్ని తనకు కట్టాలంటూ మూగ సైగలతో దీనంగా వేడుకున్నాడు.. తెలియని వ్యక్తి కావడంతో పాటు.. మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఆ విద్యార్థిని మొదటగా తీవ్రంగా భయపడి వెనకడుగు వేసింది. అయితే.. తనలో ఉన్న అమాయకత్వాన్ని గమనించిన ఆ చిన్నారి.. ఏమాత్రం ఆలోచించకుండా అతని వద్దకు వెళ్లి ఎంతో ఆప్యాయంగా చేతికి రాఖీ కట్టడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు..
రాఖీ కట్టిన మరుక్షణమే ఆ వ్యక్తి ప్రవర్తించిన తీరు అక్కడున్న వారిని.. వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపరిచేలా చేసింది. సోదరి సమానురాలైన ఆ చిన్నారి కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు.. అనంతరం సాంప్రదాయం ప్రకారం చెల్లికి కానుక ఇవ్వాలన్న భావనతో తన జేబులను తడుముకున్నాడు.. జేబులు ఖాళీగా ఉండడంతో పాటు తమ వద్ద ఇచ్చేందుకు చెల్లి గవ్వ లేదంటూ చేతులు జోడించి సైగల ద్వారా క్షమాపణలు కోరాడు.. ఆపై చిరునవ్వుతో అక్కడి నుంచి భారంగా అడుగులు వేస్తూ వెళ్లిపోయాడు..
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్సాయి రాసలీలలు..
ఈ అపురూప ఘట్టానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చెక్కర్లు కొడుతోంది.. సంపద లేకున్నా సంస్కారం ఉంది.. మానసిక స్థితి దెబ్బతిన్న రక్తంలో జీర్ణించుకుపోయిన బంధాల విలువ మరువ లేదంటూ చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు చేస్తున్నారు. ఆపదలో ఉన్న వారిని దూరం పెట్టకుండా ఆదరించిన ఆ పాఠశాల విద్యార్థిని సంస్కారాన్ని కూడా ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు.. మనుషుల మధ్య అంతరాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో.. ఈ అద్భుతమైన వీడియో మానవత్వపు మానవత్వపు గొప్పదనాన్ని మరోసారి చాటి చెప్పింది..
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్సాయి రాసలీలలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
కొండగట్టు అంజన్న సన్నిధిలో ఉద్రిక్తత.. లడ్డూ కౌంటర్ వివాదంపై VHP ధర్నా!
Hyderabad, Telangana:Kondagattu Temple: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం.. చొప్పదండి నియోజకవర్గం పరిధిలో ఉన్న కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ఊహించని ఒక వివాదం చోటుచేసుకుంది.. పవిత్రమైన లడ్డు ప్రసాద పంపిణీ కేంద్రం వద్ద భక్తులతో పాటు ఆలయ సిబ్బంది మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.. సిబ్బంది తీరును నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ సభ్యులు ఆలయ ఈవో కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు..
సాధారణంగా కొండగట్టు స్వామివారి దర్శనార్థం నిత్యం వందలాదిమంది భక్తులు వస్తూ ఉంటారు. దర్శనానంతరం లడ్డు ప్రసాదం కొనుగోలు చేసేందుకు వెళ్లిన విశ్వహిందూ పరిషత్ సభ్యులకు చేదు అనుభవం ఎదురైంది.. ప్రసాదం కోసం వెనక వైపు నుంచి వెళ్ళిన తమపై కౌంటర్లో సిబ్బంది అత్యంత తురుసుగా ప్రవర్తించారని విహెచ్పి నాయకులు ఆరోపించారు. కనీస మర్యాద లేకుండా తమను నెట్టువేసి.. దౌర్జన్యానికి పాల్పడ్డారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు..
ఈ ఘటనతో మనస్థాపానికి చెందిన విశ్వహిందూ పరిషత్ సభ్యులు వెంటనే ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యాలయం వద్దకు చేరుకొని భారీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.. ఈవో డౌన్ డౌన్ అంటే పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఆలయ ప్రాంగణంలో గందరగోల వాతావరణం నెలకొంది. భక్తులతో వింతగా ప్రవర్తించిన సదరు సిబ్బందిని తక్షణమే విధుల్లో నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు..
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్సాయి రాసలీలలు..
దైవ దర్శనానికి వచ్చే భక్తులతో ఆలయ సిబ్బంది ఎంతో మర్యాదగా.. ఓపికగా వ్యవహరించాలని.. భక్తులను ఇబ్బందులకు గురిచేస్తూ దాడులకు దిగడం క్షమించరాన్ని నేరమని.. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న కొండగట్టు ఎస్సై, ఆలయ సూపరింటెండెంట్ హుటాహుటిన అక్కడికి చేరుకొని.. ఆందోళన చేస్తున్న వారితో సంప్రదింపులు జరిపి అన్ని విషయాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అనంతరం విశ్వహిందూ పరిషత్ సభ్యుల నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదును కూడా స్వీకరించారు..
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్సాయి రాసలీలలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Eshwar Sai Madhuri Rathod: మధూరీ రాథోడ్ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి!
Hyderabad, Telangana:Eshwar Sai On Madhuri Rathod: ఇటీవల వివాదం చెలరేగిన నేపథ్యంలో ఈశ్వర్ సాయి, మాధురీ రాథోడ్ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన నేపథ్యంలో ఇటీవలే వైరల్గా మారింది. ఈ ఘటనను భార్య వీడియో తీస్తు రెడ్ హ్మాండెడ్ గా పట్టుకుంది. మాధురిని చెంప మీద కొట్టి నానా బూతులు తిట్టింది. ఈ రచ్చను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది కాస్త విపరీతంగా వైరల్గా మారింది. కొంత మంది ఈశ్వర్ సాయి భార్యకు సపోర్ట్ చేస్తుండగా, మరికొంత మంది మాత్రం మాధురీ రాథోడ్ కు అండగా నిలుస్తున్నారు. తాజాగా ఈ సంఘటనపై ఈశ్వర్ సాయి స్పందించాడు.AP Liquor Scam: వైసీపీ మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం!
Hyderabad, Telangana:Karumuri Nageswara Rao Arrest: ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఈ దర్యాప్తులో భాగంగా వైకాపా నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కొండాపూర్లోని ఆయన నివాసంలో ఆదివారం సాయంత్రం కారుమూరిని అదుపులోకి తీసుకున్న అధికారులు, తదుపరి విచారణ కోసం బషీర్బాగ్లోని ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఈ కేసులో కారుమూరి నాగేశ్వరరావు నాలుగో నిందితుడిగా అరెస్ట్ అయ్యారు.
కాగా, ఇదే కేసులో ఆయన కుమారుడు కారుమూరి సునీల్ను ఈ ఏడాది జూన్ 16న ఈడీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ దందాలో సునీల్ అత్యంత కీలక పాత్ర పోషించారని, ఆయన బ్యాంకు ఖాతాల్లోకి దాదాపు రూ.28 కోట్ల మేర కిక్బ్యాక్స్ (ముడుపులు) వచ్చాయని ఈడీ తన రిమాండ్ నివేదికలో స్పష్టం చేసింది. తండ్రి రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని సునీల్ ఈ భారీ అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే తండ్రి కారుమూరి నాగేశ్వరరావును కూడా ఈడీ అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు.
ఈ కేసులో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, మద్యం నియంత్రణ సంస్థ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి వంటి ప్రముఖులను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తండ్రీకొడుకులిద్దరూ ఈ కేసులో అరెస్ట్ కావడంతో రాబోయే రోజుల్లో మరికొందరు కీలక వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
Also Read: ఏపీ నిరుద్యోగులకు విద్యాశాఖ మంత్రి శుభవార్త.. మరో 3,000 టీచర్ పోస్టుల భర్తీకి రెడీ!
Also REad: ఎన్టీఆర్ జిల్లాలో స్కూల్ బస్సుకు ఘోరం ప్రమాదం..20 మంది విద్యార్థులు, దూసుకెళ్లింది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Anasuya Vs Hema: యాంకర్ అనసూయకు నటి హేమ కౌంటర్..నోరు అదుపులో పెట్టుకోవాలని ఘాటు వార్నింగ్!
Hyderabad, Telangana:Hema On Anasuya Controversy: టాలీవుడ్ యాంకర్ అనసూయ భరద్వాజ్ సనాతన ధర్మం, శ్రీరాముడి నామంపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపాయి. కొందరు శ్రీరాముడి పేరును, దేవుడి ఫొటోలను వాడుకుంటూ సోషల్ మీడియాలో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆమె చేసిన కామెంట్లపై హిందూ సంఘాలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్లోని బోరబండ పోలీస్ స్టేషన్లో ఆమెపై అధికారికంగా ఫిర్యాదు కూడా నమోదైంది. పరిస్థితి తీవ్రతను గమనించిన అనసూయ వివరణ ఇస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. తాను కూడా హనుమాన్ భక్తురాలినేనని, కేవలం సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తూ వేధిస్తున్న కొందరిని ఉద్దేశించి మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశానని, తన మాటలను వక్రీకరించారని అందులో పేర్కొన్నారు. అయితే, ఈ వివరణతో వివాదం ముగియకముందే, సీనియర్ నటి హేమ ఈ వ్యవహారంలోకి ప్రవేశించి అనసూయపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
"సినీ పరిశ్రమలో ఉన్న మనమంతా అద్దాల మేడలో ఉన్నట్లే. మనం మాట్లాడే ప్రతి మాటా, చేసే పనీ ప్రజలు భూతద్దంలో పెట్టి చూస్తారు. ఈ కనీస స్పృహ లేకుండా పదే పదే ఎందుకు నోరు జారుతావు?" అంటూ హేమ అనసూయను సూటిగా ప్రశ్నించారు. కోట్ల మంది హిందువుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న సున్నితమైన విషయాలపై పబ్లిక్గా మాట్లాడేటప్పుడు అత్యంత విచక్షణతో వ్యవహరించాలని హితవు పలికారు. 'జై శ్రీరామ్' నామం కేవలం ఒక నినాదం కాదని, అది కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో నిక్షిప్తమైన ఒక దివ్య మంత్రం అని హేమ భావోద్వేగానికి లోనయ్యారు.
ఎవరైనా వేధిస్తే ధైర్యంగా వారి పేర్లు బయటపెట్టి పోరాడాలి కానీ, పవిత్రమైన దేవుడి పేర్లను, ఫొటోలను కవచంగా వాడుతూ విమర్శలు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని నటి హేమ మండిపడ్డారు. ముందు నోరు జారి, ఆ తర్వాత కవరింగ్ ఇచ్చుకోవడం మానుకోవాలని చురకలంటించారు.
"కర్మ సిద్ధాంతం ఎవరినీ వదిలిపెట్టదు. జాగ్రత్త" అని హేమ హెచ్చరించారు. తెలుగు సినీ ప్రేక్షకుల ఆదరణ వల్లే ఈ స్థాయి గుర్తింపు వచ్చిందని, వారి విశ్వాసాలను గౌరవించడం నేర్చుకోవాలని హేమ ఘాటుగా విమర్శించారు. ప్రస్తుతం ఈ వివాదం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
Also REad: బిగ్బాస్లోకి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..సోషల్ మీడియాలో సుజీత్ హీరోయన్ క్లారిటీ!
Also Read: బాక్సాఫీస్ వద్ద మాస్ మహారాజా ప్రభంజనం.. తొలిరోజే 'ఇరుముడి' ఆల్టైమ్ రికార్డ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. జీతం రూ. 85 వేలకు పైనే! అప్లికేషన్ లింక్!
Hyderabad, Telangana:Bank Of baroda LBO Posts: ఈ నోటిఫికేషన్ ప్రకారం, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆగస్టు 18వ తేదీ నుండి ప్రారంభమై సెప్టెంబర్ 15వ తేదీ వరకు కొనసాగుతుంది. బ్యాంక్ రంగంలో స్థిరమైన ఉద్యోగం సాధించాలని ఎదురుచూస్తున్న వారికి బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ గొప్ప అవకాశాన్ని కల్పించింది. మొత్తం 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి బ్యాంక్ శ్రీకారం చుట్టింది. ఈ నోటిఫికేషన్ ప్రక్రియ ఆగస్టు 18 నుండి సెప్టెంబర్ 7 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ నియామకాల ద్వారా మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-1 కింద ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నిర్వహించబడుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుని, నిర్ణీత దరఖాస్తు రుసుమును చెల్లించి అప్లికేషన్ పూర్తి చేయాలి. అభ్యర్థులు ముందుగా దరఖాస్తు చేసుకున్న తర్వాత, రాబోయే పరీక్షల కోసం కూడా క్రమ పద్ధతిలో ప్రిపేర్ కావాల్సి ఉంటుంది.
కావలసిన అర్హతలు:
బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు పరిమితి 21 ఏళ్ల నుండి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే, కమర్షియల్ బ్యాంకులో పని చేసిన అనుభవం ఉన్న అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ఉపశమనం కలిగే అవకాశం ఉంది. నిర్దిష్ట క్యాడర్లకు దరఖాస్తు చేసేటప్పుడు ఈ నిబంధనలు వర్తిస్తాయి. అంతేకాకుండా, అభ్యర్థులకు సంబంధిత స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడటం వంటి ప్రాథమిక నైపుణ్యాలు తప్పనిసరిగా తెలిసి ఉండాలి.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఎల్బీఓకి దరఖాస్తు చేసుకునే విధానం:
దరఖాస్తు ప్రక్రియ కోసం ముందుగా బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ https://bankofbaroda.bank.in/ను ఓపెన్ చేయాలి. అక్కడ ఉన్న 'కెరియర్' సెక్షన్లోకి వెళ్లి, 'కరెంట్ అపర్చునిటీస్' అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. అక్కడ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి, మొదట రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫారమ్లో అడిగిన అన్ని వివరాలను నింపి, అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. అనంతరం దరఖాస్తు రుసుమును చెల్లించి ఫారమ్ను సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత వచ్చే కన్ఫర్మేషన్ పేజీని భవిష్యత్తు అవసరాల కోసం డౌన్లోడ్ చేసుకుని భద్రపరుచుకోవాలి.
Also Read: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. ఈ వారం ఏకంగా 4 రోజులు బ్యాంకులు బంద్!
Also Read: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సోలాపూర్-అనకాపల్లి కొత్త ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం! శ్రీకాకుళం కూడా!
ఎంపిక ప్రక్రియ, పరీక్షా విధానం:
బ్యాంక్ ఆఫ్ బరోడా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎంపిక ప్రక్రియ అనేది ఆన్లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూల ద్వారా నిర్వహించబడుతుంది. పరీక్షా విధానం విషయానికి వస్తే, మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 సమాన మార్కును కేటాయిస్తారు.. అంటే మొత్తం 120 మార్కులు ఉంటాయి. ఈ పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు నెగటివ్ మార్కింగ్గా తీసివేస్తారు. అభ్యర్థులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాట్లాడటం తప్పనిసరిగా తెలిసి ఉండాలి. చివరగా, పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
జహీరాబాద్లో భారీ మోసం.. బంగారం ట్రేడింగ్ పేరుతో రూ.28 కోట్లు కొల్లగొట్టిన నైకీ ట్రేడర్స్..
Hyderabad, Telangana:Zahirabad Investment Scam: బంగారంతో పాటు వెండి ట్రేడింగ్లో అదిరిపోయే లాభాలు, భారీ వడ్డీలు ఇస్తామంటూ.. అమాయక ప్రజలను నమ్మించి కోట్లాది రూపాయలను కొల్లగొట్టిన ఓ భారీ మోసం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో వెలుగు చూసింది.. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న నైకీ ట్రేడర్స్ సమస్త నిర్వాహకులు ఏకంగా రూ.28 కోట్లకు పైగా టోపీ పెట్టారట.. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రాథమికంగా 22 మంది బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకే రూ.28 కోట్లకు పైగా మోసం బయటపడగా.. బాధితుల సంఖ్య పెరిగే కొద్దీ ఈ కుంభకోణం విలువ దాదాపు 100 కోట్లకు పైగా చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది..
నైకీ ట్రేడర్స్ మేనేజ్మెంట్ గత రెండేళ్లుగా ట్రేడింగ్ పేరుతో ప్రత్యేకమైన కార్యకలాపాలను సాగిస్తోంది.. ప్రముఖ ఓ జ్యువెలరీ సంస్థ కు సంబంధించి తామే బంగారం సరఫరా చేస్తున్నామని ఇన్వెస్టర్లను నమ్మించారు. తమ వద్ద పెట్టుబడి పెడితే. భారీ లాభాలతో పాటు క్రమం తప్పకుండా వడ్డీలు ఇస్తామని ఆశ చూపారు.. బాధితులకు నమ్మకం కలిగేందుకు మొదట్లోనే అనుకున్న సమయానికి లాభాలతో పాటు వడ్డీ చెల్లించారు. దీంతో జహీరాబాద్ వాసులు స్థిరాస్తులు అమ్మి.. అప్పులు తెచ్చి మరి పెద్ద మొత్తంలో కోట్లాది రూపాయలు ఈ సంస్థలు ఇన్వెస్ట్ చేశారు..
డిసెంబర్ వరకు లావాదేవీలు సజావుగా సాగించిన ఆ నిర్వాహకులు.. బాధితులు అడిగిన అసలు డబ్బులు సైతం ఇచ్చేందుకు నిరాకరించారట.. గత తొమ్మిది నెలలుగా అందులో పెట్టిన పెట్టుబడిదారుల ఫోన్ కాల్స్ ఎత్తకుండా తప్పించుకు తిరిగారు. చివరికి తాము నిలువునా మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ జహీరాబాద్ పోలీసులను ఆశ్రయించారు..
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్సాయి రాసలీలలు..
బాధితుడు ఇజ్రాయేల్ బాబీతో ఇతర కొంతమంది బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేకమైన దర్యాప్తును చేపట్టారు. ఈ కుంభకోణానికి ప్రధాన కారకులైన శశివర్ధన్ రెడ్డి తో పాటు రవీంద్రబాబు, సుస్మిత తో పాటు జగదీష్ నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జహీరాబాద్ టౌన్ సీఐ ఆర్. రవి తెలిపారు. నైకీ ట్రేడర్స్ సమస్త ద్వారా ఇంకా ఎవరైనా మోసపోయి ఉంటే నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్సాయి రాసలీలలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
నవ పంచమి రాజయోగం ఎఫెక్ట్.. ఈ 4 రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే!
Hyderabad, Telangana:Nava Panchami Raja Yoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ సంచారాలతో పాటు వాటి ప్రత్యేకమైన మార్పులు అన్ని రాశులతో పాటు ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంటాయి. 2026 సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీన రాహువుతో పాటు కుజ గ్రహాల మార్పుల కారణంగా నవ పంచమి రాజయోగం ఏర్పడబోతోంది. ఇది చాలా శుభ్రమైన అరుదైన యోగంగా పరిగణిస్తూ ఉంటారు.. కుజుడు రాహువుకు ఐదవ స్థానంలోకి వచ్చినప్పుడు.. రాహువు, కుజుడికి 9వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ శక్తివంతమైన రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల అదృష్టం పెరగడమే కాకుండా.. నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం కూడా విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో ఆకస్మికంగా లాభాలు వస్తాయి. కుజుడు ప్రభావం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతారు. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ యోగం వల్ల ఏ రాశుల వారికి ఎక్కువగా మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మేషరాశి
కుజుడు మేష రాశి వారికి అధిపతిగా వ్యవహరిస్తారు.. నీ శక్తివంతమైన నవ పంచమి రాజయోగం ఏర్పడడం కారణంగా మేష రాశి వారి జీవితంలో సానుకూలమైన మార్పులు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా వీరు ఈ సమయంలో కోరుకున్న ప్రదేశాలను సందర్శించే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అత్యంత కష్టమైన ప్రాజెక్టులను కూడా సులభంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా అనుకుంటున్న పనుల్లో ఊహించని లాభాలు పొందుతారు.
మిథున రాశి
మిధున రాశి వారికి ఈ శక్తివంతమైన రాజయోగం చాలా అనుకూలంగా ఉండబోతోంది. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఊహించని దానికంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు పొందగలుగుతారు. ముఖ్యంగా తెలివితేటలతో పాటు వ్యూహాత్మకమైన ఆలోచనల వల్ల జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో ఉన్న వ్యక్తులు కొత్త కొత్త కాంట్రాక్టులు కూడా పొందుతారు.
తులారాశి
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ శక్తివంతమైన నవ పంచమి యోగ ప్రభావంతో అదృష్టం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ముఖ్యంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు వాటంతకావే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు సంబంధించిన వ్యాపారాలతో పాటు ఉద్యోగాల్లో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఉన్నత విద్యను చేపట్టడానికి ప్రయత్నించే పనులు చాలా లాభదాయకంగా మారుతాయి. కారు లేదా భూములు కొనుగోలు చేయాలనుకునే వ్యక్తులందరికీ విశేషమైన లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.
కుంభరాశి
కుంభ రాశిలో జన్మించిన వ్యక్తులకు రాహువుతో పాటు కుజ గ్రహం కలయిక కారణంగా తెలివితేటలతో పాటు ఆదాయ వనరులు కూడా ఊహించని విధంగా పెరుగుతాయి. ముఖ్యంగా వ్యాపారాల్లో అనుకోని ఆర్థికపరమైన లాభాలు కలుగుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు మంచి శుభవార్తలు కూడా లభిస్తాయి. అలాగే వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి.. అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
