యూపీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు
Bellampalle, Kannal Rural, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డ్ లో యూపీహెచ్సీ షంషీర్ నగర్ ఆధ్వర్యంలో ఆర్బీఎస్కే టీం పర్యవేక్షణలో బుధవారం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో వార్డ్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి వైద్యులు మందులు అందజేశారు. అత్యవసరమైన కేసులను సీహెచ్ సీ కి సూచిస్తున్నారు. ఈ సందర్బంగా వైద్యులు మాట్లాడుతూ వ్యక్తిగత శుభ్రతతో పాటు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటామని అన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
వామ్మె.. పామునే మింగేసిన కప్ప.. వీడియో వైరల్!
Hyderabad, Telangana:Giant Snake Video Viral: ప్రపంచంలో ఎప్పుడు ఏ జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు.. సాధారణంగా మనందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం ఏమిటంటే.. పాము కనిపిస్తే కప్ప భయంతో గజగజ వణుకుతుంది. పాము క్షణాల్లో కప్పను ఆహారంగా మార్చుకుంటుంది. చిన్నప్పటి నుంచి మనం విన్నది.. చూసింది కూడా ఇదే.. కానీ, ప్రకృతి నియమాలను తలకిందులు చేస్తూ.. ఒక ఊహించని వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. పాముకే ఇతర జీవులు ఎరగా మారుతుంటే.. ఇక్కడ మరొక జీవికి అదే ఎరగా మారింది. ఏకంగా ఒక కప్పే పామును సజీవంగా మింగేస్తున్న షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలుఇ ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అసలేం జరిగింది?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం.. ఒక పెద్ద కప్ప ఒక చిన్న పామును తన నోటితో గట్టిగా పట్టుకుంది. పాము తోక భాగం నుంచి మెల్లమెల్లగా లోపలికి మింగేయం మొదలు పెట్టింది. నోటి నుంచి తప్పించుకోవడానికి ఆ పాము తీవ్రంగా శ్రమించింది. తన పడగ విప్పి.. సర్వశక్తులు ఒడ్డి కప్ప పట్టు నుంచి బయటపడటానికి విఫలయత్నం చేసింది. అయితే, ఆ కప్ప మాత్రం తన పట్టును ఏమాత్రం వదలేకుండా ఉండడం మీరు గమనించవచ్చు. పాము ఎంత విలవిలలాడినా వదలకుండా కొద్దికొద్దిగా పామును ప్రాణాలతోనే గుటకలేస్తూ తినే ప్రయత్నం చేస్తోంది.. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ తమ కళ్ళను తామే నమ్మలేకపోతున్నారని కామెంట్స్ చేస్తూ వస్తున్నారు..
बल्कि मेंढक ही साँप को निगलने लगा है। pic.twitter.com/Bp1TYQlqLc
— नई सोच (@NayiSochHQ) August 1, 2026
ఈ అరుదైన దృశ్యాన్ని @NayiSochHQ అనే ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. వీడియోకు ఇది కలియుగం సామీ.. ఇక్కడ పాము కప్పను తినడం లేదు.. కప్పే పామును మింగేస్తోందని రాసుకొచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ రోజు పాముకు టైమ్ అస్సలు బాగున్నట్లు లేదు.. అని కొందరు వ్యాఖ్యానించగా.. మరికొందరు ప్రకృతిలోని సర్వైవల్ అఫ్ ది ఫిట్టెస్ట్ నియమానికి ఇది నిదర్శనమని అంటున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
సాధారణంగా బుల్ఫ్రాగ్ (Bullfrog) రకానికి చెందిన పెద్ద కప్పలు తమ నోటికి చిక్కిన చిన్నపిట్టలు, ఎలుకలు, పురుగులతో పాటు చిన్నపాములను కూడా తింటాయని వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట లక్షలాది మంది వీక్షణలతో ట్రెండింగ్లో కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ వీడియోను చాలా మంది సోషల్ మీడియాల్లో షేర్ చేస్తూ వస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ప్రేమకు వయసుతో పనేంటి? 81 ఏళ్ల బామ్మ.. 24 ఏళ్ల కుర్రాడు.. వీడియో వైరల్..
Hyderabad, Telangana:Elderly Woman Young Man Relationship Video Watch: ప్రేమకి సరిహద్దులు లేవు.. వయసుతో అసలే పనేలేదు.. అనే మాటను మనం చాలాసార్లు వినే ఉంటాం. కానీ ఈ జంటను చూస్తే మాత్రం ఆ మాట వందకు వంద శాతం నిజమేనని ఒప్పుకోక తప్పరు.. ఒకరి వయసు శతాబ్దానికి దగ్గరగా ఉంటే.. మరొకరు ఇప్పుడిప్పుడే 25 ఏళ్ల వయస్సులోకి అడుగుపెట్టారు. సమాజం ఏమనుకున్నా సరే.. తమ బంధమే తమకు ముఖ్యమని నిరూపించిన ఈ విచిత్ర ప్రేమజంట ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సోషల్ మీడియా వేదికగా మొదలైన ఒక సాధారణ చాటింగ్.. వీరిద్దరినీ అంత దగ్గర చేస్తుందని బహుశా వారు కూడా ఊహించి ఉండరు.. 81 ఏళ్ల వయసున్న మహిళ.. 24 ఏళ్ల యువకుడితో ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. మొదట్లో కేవలం స్నేహంగా ప్రారంభమైన వీరి చాటింగ్, రోజులు గడిచేకొద్దీ మంచి ప్రేమగా మారాయి. వయసులో ఏకంగా 57 ఏళ్ల వ్యత్యాసం ఉన్నప్పటికీ.. మనసులు కలవడమే ముఖ్యమని భావించిన ఈ జంట.. తమ అనుబంధాన్ని మరింత అద్భుతమైన స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.
వీరి లవ్ స్టోరీ గురించి తెలిసిన వెంటనే.. నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వచ్చాయి.. కొందరు ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని కామెంట్ చేయగా.. మరికొందరు డబ్బు కోసమే యువకుడు ఈ నిర్ణయం తీసుకున్నాడని విమర్శించారు.. అయితే, ఎలాంటి నెగిటివ్ వ్యాఖ్యలను పట్టించుకోకుండా ఈ జంట ఒకటయ్యారు.. తమ మధ్య ఉన్నది స్వచ్ఛమైన ప్రేమ మాత్రమేనని.. ఒకరికొకరు తోడుగా ఉండటమే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
వీరిద్దరూ కలిసి ఉన్న వీడియోలు, రీల్స్ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. వీరి కెమిస్ట్రీ చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. లక్షలాది మంది ఈ వీడియోలను వీక్షించడమే కాకుండా.. విపరీతంగా షేర్ చేస్తున్నారు. నిజమైన ప్రేమకు రూపం.. వయసుతో సంబంధం లేదని కొందరు నెటిజన్లు వీరికి మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Amaravati Book Launch: ఉపరాష్ట్రపతితో టీడీపీ ఎంపీల బృందం భేటి.. 'అమరావతి' ప్రత్యేక పుస్తకం ఆవిష్కరణ!
New Delhi, Delhi:Vice-President Amaravati Book Launch: భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ గారిని పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు తన సహచర తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎంపీలతో కలిసి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రయాణం, దాని చారిత్రక ప్రాధాన్యతను తెలియజేసే "Amaravati: Built by the People, Secured by Destiny" (అమరావతి) అనే ప్రత్యేక పుస్తకాన్ని వారు ఉపరాష్ట్రపతికి అందజేశారు. ఈ పుస్తకాన్ని చూసి ఉపరాష్ట్రపతి అభినందించినట్లు సమాచారం.
పుస్తకంలో పొందుపరిచిన ముఖ్యాంశాలు..
చారిత్రక ఉద్యమ గాథ.. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాల వారసత్వం, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఈ పుస్తకంలో ప్రధానంగా ప్రస్తావించారు.
రైతుల సుదీర్ఘ పోరాటం అనగా.. రాజధాని పరిరక్షణ కోసం అమరావతి ప్రాంత రైతులు, తల్లులు, మహిళలు ఎండనక, వాననక అప్రతిహతంగా 1,631 రోజుల పాటు చేసిన శాంతియుత సుదీర్ఘ పోరాట విశేషాలను ఇందులో కళ్ళకు కట్టినట్లు వివరించారు.
ఏకైక రాజధానిగా పునరుజ్జీవనం: 2024 జూన్ 2 నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా పునరుద్ధరించిన చారిత్రక పరిణామాలు, ప్రజల ఆకాంక్ష నెరవేరిన వైనాన్ని ఈ గ్రంథంలో స్పష్టంగా పొందుపరిచారు.
ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి..
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో కూడిన అద్భుతమైన నాయకత్వం, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ పూర్తి మద్దతు, సహకారంతో అమరావతిని కేవలం ఒక పరిపాలనా కేంద్రంగా మాత్రమే కాకుండా, అగ్రగామిగా నిలిచే ప్రపంచ స్థాయి (గ్లోబల్) రాజధానిగా తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. భవిష్యత్ తరాలకు ఈ రాజధాని ఒక రోల్ మోడల్గా నిలుస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.
Also Read: విద్యార్థులకు పండగ లాంటి వార్త..ఈ వారంలో వరుసగా 3 రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
Also REad: ఏపీ, తెలంగాణ ఎల్నినో బారి నుంచి బయటపడినట్టేనా? రైతులు తప్పకుండా తెలుసుకోవాలి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
రాత్రి వేళ ఆటో నడుపుతూ పో**ర్న్ చూసిన డ్రైవర్.. నిలదీసిన యువతి! వీడియో
Hyderabad, Telangana:Auto Driver Viral Video: ఢిల్లీకి చెందిన సుకన్య అనే యువతి రాత్రి వేళ సురక్షితంగా ఇంటికి వెళ్లేందుకు ర్యాపిడో (Rapido) యాప్ ద్వారా ఆటోను బుక్ చేసుకుంది. సఫ్దర్జంగ్ నుంచి మోడల్ టౌన్ వరకు వెళ్లేందుకు రాత్రి సుమారు 8:48 గంటల ప్రాంతంలో ఆమె ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అంతా సవ్యంగానే ఉందనుకున్న సమయంలో, ప్రయాణం మధ్యలో ఒక ఊహించని షాకింగ్ దృశ్యం వెలుగులోకి వచ్చింది. అసలేంటి? ఏం జరిగి ఉంటుంది.? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఆటో ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగగా.. పక్కనే బైక్పై వెళ్తున్న మరొక యువతి సుకన్యను అప్రమత్తం చేసింది. ఆటో డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూనే తన మొబైల్ ఫోన్లో అశ్లీల వీడియో చూస్తున్నాడని సైగల ద్వారా చెప్పింది. సుకన్య వెంటనే గమనించడంతో భయపడిన డ్రైవర్, కలవరపడి ఫోన్ను దాచేందుకు ప్రయత్నించాడు. గమ్యస్థానానికి చేరుకోవడానికి ఇంకా అర గంట సమయం ఉందనగా.. అదే ఆటోలో నెమ్మదిగా సుకన్య ప్రయాణాన్ని మధ్యలోనే ఎక్కడ ఆపకుండా ధైర్యంగా తన స్థాపింగ్ పాయింట్ వరకు చేరుకుంది.
గమ్యస్థానానికి చేరుకున్న వెంటనే సుకన్య డ్రైవర్ను నిలదీసింది. ఫోన్లో ఏం చూస్తున్నావు? అని గట్టిగా ప్రశ్నించగా.. ఆ డ్రైవర్ ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా బేషరమ్గా ఫారెన్ వీడియో చూస్తున్నాను అని సమాధానమిచ్చాడు. దాంతో సుకన్య అతనిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడి.. కుటుంబ సభ్యులను పిలుస్తానని హెచ్చరించడంతో డ్రైవర్ నోట మాట రాలేదు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
ఈ ఘటన సమయంలో సుకన్య ర్యాపిడో ఇన్-యాప్ (In-App) అత్యవసర సేఫ్టీ టీమ్ను సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ.. కంపెనీ నుంచి ఎలాంటి తక్షణ స్పందనా లభించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సుకన్య ఇదే సమయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది విపరీతంగా వైరల్ అయ్యింది. నెటిజన్లు నెగెటివ్ కామెంట్లతో విరుచుకుపడ్డాక.. ర్యాపిడో కస్టమర్ సపోర్ట్ టీమ్ స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళల భద్రత పట్ల ఆన్లైన్ క్యాబ్, ఆటో సంస్థలు చూపుతున్న అలసత్వంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
రాహువు ధనిష్ఠా నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల వారికి రాజయోగం, బంపర్ లాభాలు!
Hyderabad, Telangana:Rahu Transit In Dhanishta Nakshatra: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన ఛాయా గ్రహంగా భావించే రాహువు సంచారం ఎప్పుడూ అన్ని రాశులవారిపై ఊహించని ప్రభావాన్ని చూపుతుంది. ఆగస్టు 2న అర్ధరాత్రి 12:08 గంటలకు రాహువు ధనిష్ఠ నక్షత్రంలోకి సంచారం చేసింది.. ఈ అద్భుత సంచార మార్పు ఫలితంగా దశాబ్దాల కష్టాలకు ముగింపు పడుతూ.. ప్రధానంగా 4 రాశుల వారి ఊహించని ప్రయోజనాలను చూపుతుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి ఇది అద్భుతంగా మారుతుంది.
ధనిష్ఠ నక్షత్రంలోకి రాహువు సంచారంతో ఈ కింది రాశులవారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా కోరుకుంటున్న వ్యక్తులకు అద్భుతమైన లాభాలు కలుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారికి విముక్తి కలుగుతుంది. అనుకుంటున్న పనుల్లో విశేషమైన లాభాలు పొందుతారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మేష రాశి (Aries)
ఏళ్ల తరబడి నిలిచిపోయిన పనులు ఇక వేగవంతం కాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఆకస్మిక ధనలాభాలతో పాటు సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు దక్కుతాయి. చాలాకాలంగా విదేశాల్లో ఉద్యోగం చేయాలనే కల నెరవేరేందుకు ఇదే సువర్ణావకాశంగా మారుతుంది.. అనుకుంటున్న పనులు కూడా సులభంగా చేస్తారు.
మిథున రాశి (Gemini)
రాహువు ధనిష్ఠ సంచారంతో మిథున రాశి వారికి అత్యంత శుభఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. తీవ్ర మానసిక ఒత్తిడికి కారణమైన ఆర్థిక టెన్షన్లు నుంచి విముక్తి లభిస్తుంది. పెండింగ్లో ఉన్న కీలక వ్యవహారాలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చి బాకీలు వసూలవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
ధనుస్సు రాశి (Sagittarius)
ఈ రాశి వారికి మనశ్శాంతితో పాటు భౌతిక సుఖసంతోషాలు కలిగే ఛాన్స్లు కనిపిస్తున్నాయి. నూతన ఇల్లు లేదా ఆస్తులు కొనుగోలు చేసేవారికి ఈ సమయం చాలా అద్భుతమైన లాభాలను అందిస్తుంది. కుటుంబంలో, సమాజంలో ఉన్న విభేదాలు కూడా సులభంగా తొలగిపోతాయి. కెరీర్లో ఊహించని పురోగతి సాధ్యమవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రేమ సంబంధాల్లో బాంధవ్యాలు మరింత బలపడతాయి.
మకర రాశి (Capricorn)
కష్టాల సుడిగుండంలో ఉన్న మకర రాశి వారికి ఈ సంచారం ఒక గొప్ప ఊరటను అందించే ఛాన్స్లు కనిపిస్తుంది.. చిక్కుముడిగా మారిన కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారమవుతాయి. దీర్ఘకాలిక అప్పుల భారం తల మీద నుంచి దిగిపోతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. రావలసిన బాకీలు తిరిగి చేతికి అందడంతో ఆర్థికంగా స్థిరపడతారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
12 ఏళ్ల తర్వాత అరుదైన పుష్య అమృత యోగం.. ఈ 5 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం..
Hyderabad, Telangana:Pushya Amrita Yoga Effect On Zodiac: పవిత్రమైన శ్రావణ మాసంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అత్యంత అరుదైన సంఘటన చోటుచేసుకోబోతోంది. సుమారు 12 సంవత్సరాల తర్వాత శ్రావణ మాసంలో పుష్య అమృత యోగం ఏర్పడింది.. జ్యోతిష్య ప్రకారం.. ఈ అత్యంత శుభప్రదమైన రాజయోగం కారణంగా కొన్ని రాశులవారికి విశేష ఫలితాలు కలుగుతాయి. కొత్త పనులు సులభంగా మొదలవుతాయి. అంతేకాకుండా బంగారం, స్థిరాస్తుల కొనుగోలు, వ్యాపార పెట్టుబడులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా మారుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో పుష్య నక్షత్రానికి అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ నక్షత్రం ప్రత్యేక శుభ యోగాలతో కలిసినప్పుడు దానిని పుష్య అమృత యోగం అని పిలుస్తారు. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన దీర్ఘకాలిక విజయాన్ని, సుఖసంతోషాలను పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎంత శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ 5 రాశుల వారికి లక్కీ టైమ్..
వృషభ రాశి (Taurus)
ఈ వృషభ రాశి వారికి ఉద్యోగ, వృత్తి రంగాల్లో నూతన బాధ్యతలు లేదా పదోన్నతి (Promotion) లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు త్వరగా పూర్తయ్యే చాన్స్లు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బలంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
మీన రాశి (Pisces)
ఆర్థిక వృద్ధితో పాటు మానసిక ప్రశాంతత విపరీతంగా లభిస్తుంది. కొత్త ఆస్తులతో పాటు వాహనాలు లేదా బంగారం కొనుగోలు చేయడానికి ఇది బంగారం లాంటి సమయంగా భావించవచ్చు. కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత దృఢపడుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
సింహ రాశి (Leo)
సమాజంలో గౌరవ ప్రతిష్టలు విశేషంగా పెరుగుతాయి. వ్యాపారం, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కుటుంబంలో శుభ వార్తలు కూడా తప్పకుండా వింటారు. ముఖ్యమైన నిర్ణయాల్లో విజయం మీ సొంతమవుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా తొలగిపోతుంది.
ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశివారికి ఈ సమయం ఊహించని అదృష్టాన్ని అందిస్తుంది. విదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్య లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభ ఫలితాలు లభిస్తాయి. ఆధ్యాత్మికతో పాటు ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది. అనుకుంటున్న పనులు సులభంగా చేసే అవకాశాలు ఉన్నాయి.
తులా రాశి (Libra)
ఆదాయానికి కొత్త మార్గాలు సుగమమవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. వ్యాపారంలో ఆశించిన స్థాయి కంటే ఎక్కువ లాభాలు కలుగుతాయి. దీర్ఘకాలిక ప్రణాళికలను అమలు చేయడానికి ఇది అద్భుతమైన సమయంగా భావించవచ్చు. వ్యక్తిగత సంబంధాలలో సానుకూల మార్పులు వస్తాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
2031 వరకు ఈ 3 రాశులకు శని రాజయోగం.. తిరుగులేని ధనలాభం!
Hyderabad, Telangana:Saturn Transit 2027 To 2031: నవగ్రహాలలో కర్మఫల ప్రదాత, న్యాయదేవుడైన శనిభగవానుడి రాశి సంచారానిరి జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. సాధారణంగా శనిదేవుడు ఒక్కో రాశిలో రెండున్నర సంవత్సరాల పాటు సంచారం చేస్తాడు. అయితే, 2027వ సంవత్సరంలో శని భగవానుడు మీన రాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఆ తర్వాత 2031 వరకు అదే రాశిలో సంచార దశలో ఉంటాడు. దాదాపు నాలుగేళ్ల పాటు సంచారం కొన్ని రాశుల వారికి అపారమైన శుభఫలితాలను అందించడమే కాకుండా గోల్డెన్ పిరియడ్ లాగా మారనుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ సంచారంలో ఏయే రాశుల జాతకులు అదృష్టవంతులు కాబోతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులవారికి శని అనుగ్రహం..
తులా రాశి (Libra)
తులా రాశి వారికి ఈ సమయంలో శని భగవానుడు ప్రతి పనిలోనూ విజయాన్ని అందిస్తాడు. ముఖ్యంగా వ్యాపారవేత్తలకు, పెట్టుబడిదారులకు ఇది అత్యంత లాభదాయకమైన సమయంగా భావించవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి పెద్ద పెద్ద డీల్స్ కుదిరే అవకాశముంది. కొత్త పెట్టుబడుల నుంచి ఊహించని స్థాయిలో రాబడులు వస్తూ ఉంటాయి. పాత అప్పుల భారం తగ్గి మనశ్శాంతి లభిస్తుంది. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన వివాదాలు పరిష్కారమై మీకు అనుకూలంగా మారుతాయి. సమాజంలో హోదా, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.
మిథున రాశి (Gemini)
మిథున రాశివారికి ఈ శని సంచారం తిరుగులేని భాగ్యోదయ సమయాన్ని తెచ్చిపెట్టబోతోంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సంచలనాత్మక పురోగతిని సాధించే అవకాశాలు ఉన్నాయి. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు కోరుకున్న అవకాశాలు లభిస్తాయి. ఆఫీసులో ఉన్నతాధికారుల నుంచి పూర్తి సపోర్ట్, ప్రశంసలు అందుతాయి. ఒకదాని కంటే ఎక్కువ మార్గాల్లో కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఉన్నత విద్య లేదా వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది.
వృషభ రాశి (Taurus)
వృషభ రాశి వారికి రాబోయే కొన్నేళ్లు ఆర్థికంగా ఎంతో అద్బుతంగా ఉంటుంది. శని దేవుని శుభ దృష్టి కారణంగా వీరి జాతకంలో పెద్ద ఎత్తున ధనలాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పాత బాకీలు, రావలసిన డబ్బు హఠాత్తుగా చేతికి అందుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్తో పాటు వేతన పెరుగుదల లభించే అవకాశం ఉంది. వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి ఇది అత్యంత అనుకూల సమయంగా భావంచవచ్చు. కొత్త ఇల్లు, స్థలం లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
T Fiber: ప్రైవేటు నెట్ కు బంద్... అన్నీ ప్రభుత్వ కార్యాలయాలకు 'టీ-ఫైబర్' ఇంటర్నెట్
Hyderabad, Telangana:T Fiber: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించే ఇంటర్నెట్ విషయమై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రైవేటు ఇంటర్నెట్ వినియోగం ఇక చేయరాదని.. ప్రభుత్వానికి సంబంధించిన నెట్ వర్క్ టీ ఫైబర్ అన్నీ కార్యాలయాల్లో వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన చేశారు. ‘సెప్టెంబర్ ఒకటి తర్వాత ప్రైవేట్ ఆపరేటర్లకు బిల్లులు చెల్లించొద్దు. ఇంటింటికి ఇంటర్నెట్ అందించే ప్రక్రియను మరింత వేగవంతం చేయండి‘ అని మంత్రి ఆదేశించారు.
హైదరాబాద్ లోని డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ‘టీ – ఫైబర్’పై అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. 'టీ - ఫైబర్' సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. ‘రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ ఒకటి నుంచి కేవలం ‘టీ-ఫైబర్’ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలి‘ అని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆ గడువు దాటిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సేవల నిమిత్తం ప్రైవేట్ ఆపరేటర్లకు బిల్లులు చెల్లించొద్దని మంత్రి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... టీ-ఫైబర్ నెట్వర్క్ వినియోగం ద్వారా ఏటా ప్రభుత్వానికి సుమారు రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇంట్రానెట్ బేసిస్లో సెక్యూర్డ్ ఇంటర్నెట్ యాక్సెస్ కల్పించడంతో రాష్ట్ర డేటా సెంటర్కు అనుసంధానం ఏర్పడి పూర్తి స్థాయి డేటా సెక్యూరిటీ చేకూరుతుందని వెల్లడించారు. ఆరు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 4,487 ప్రభుత్వ కార్యాలయాలకు ‘టీ – ఫైబర్’ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ప్రభుత్వ ఖజానాకు ఇప్పటికే సుమారు రూ.13 కోట్లు ఆదా అయ్యిందని.. ప్రభుత్వ కార్యాలయాలకు ఈ సేవలను విస్తరించేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
ఈ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో తలెత్తే లోపాలను ఎప్పటికప్పుడు సరిచేస్తూనే.. రాబోయే రోజుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ వైడ్ ఏరియా నెట్వర్క్(టీ – స్వాన్)ను నెల రోజుల్లోపు పూర్తిస్థాయిలో టీ-ఫైబర్కు బదిలీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’కి పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ‘టీ-ఫైబర్’కు సూచించారు. ఇంటింటికి ఇంటర్నెట్ అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని, దీనికోసం ప్రిన్సిపుల్ మానిటైజేషన్ పార్టనర్ను ఎంపిక చేసేందుకు టెండర్లు పిలవాలని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
BRS Party: బీఆర్ఎస్ పార్టీకి భారీ బూస్ట్.. గులాబీ తీర్ధం పుచ్చుకున్న బీజేపీ సర్పంచ్లు
Huzurabad, Telangana:BRS Party Joinings: తెలంగాణ రాజకీయాలు సమూలంగా మారుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకు బలం పెంచుకుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవంతో.. రేవంత్ రెడ్డి అడ్డగోలు పరిపాలనతో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కారణంగా నిలుస్తోంది. తాజాగా బీజేపీ నుంచి భారీగా వలసలు జరిగాయి. ముఖ్యంగా ఎంపీ ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గంలో కాషాయ పార్టీకి భారీ షాక్ తగిలింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు బీఆర్ఎస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నందినగర్ నివాసంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో సిరిసేడు సర్పంచ్ కుమార్ -శ్యామల, వంతడువుల సర్పంచ్ రాజేష్ -మాధవి, టేకుర్తి సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా సర్పంచ్లు మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి, సంక్షేమం ప్రజల మనసుల్లో ఇప్పటికీ చెక్కుచెదరలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బీజేపీ కూడా ప్రజా సమస్యలను పట్టించుకోకుండా రాజకీయాలకే పరిమితమైందని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్, బీజేపీ పాలనలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని.. గ్రామస్థాయిలో ఆ రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని బీఆర్ఎస్లో చేరిన బీజేపీ సర్పంచ్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత మంది నాయకులు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. కేసీఆర్ మళ్లీ తెలంగాణకు నాయకత్వం వహించాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా సర్పంచ్లు వెల్లడించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల పక్షాన నిలుస్తున్నారని ప్రకటించారు. ఆయన నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. కార్యక్రమం లో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, నాయకులు వెంకటేష్ పాల్గొన్నారు.
T Fiber: ప్రైవేటు నెట్ కు బంద్... అన్నీ ప్రభుత్వ కార్యాలయాలకు 'టీ-ఫైబర్' ఇంటర్నెట్
Hyderabad, Telangana:T Fiber: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించే ఇంటర్నెట్ విషయమై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రైవేటు ఇంటర్నెట్ వినియోగం ఇక చేయరాదని.. ప్రభుత్వానికి సంబంధించిన నెట్ వర్క్ టీ ఫైబర్ అన్నీ కార్యాలయాల్లో వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన చేశారు. ‘సెప్టెంబర్ ఒకటి తర్వాత ప్రైవేట్ ఆపరేటర్లకు బిల్లులు చెల్లించొద్దు. ఇంటింటికి ఇంటర్నెట్ అందించే ప్రక్రియను మరింత వేగవంతం చేయండి‘ అని మంత్రి ఆదేశించారు.
హైదరాబాద్ లోని డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ‘టీ – ఫైబర్’పై అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. 'టీ - ఫైబర్' సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. ‘రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ ఒకటి నుంచి కేవలం ‘టీ-ఫైబర్’ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలి‘ అని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆ గడువు దాటిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సేవల నిమిత్తం ప్రైవేట్ ఆపరేటర్లకు బిల్లులు చెల్లించొద్దని మంత్రి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... టీ-ఫైబర్ నెట్వర్క్ వినియోగం ద్వారా ఏటా ప్రభుత్వానికి సుమారు రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇంట్రానెట్ బేసిస్లో సెక్యూర్డ్ ఇంటర్నెట్ యాక్సెస్ కల్పించడంతో రాష్ట్ర డేటా సెంటర్కు అనుసంధానం ఏర్పడి పూర్తి స్థాయి డేటా సెక్యూరిటీ చేకూరుతుందని వెల్లడించారు. ఆరు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 4,487 ప్రభుత్వ కార్యాలయాలకు ‘టీ – ఫైబర్’ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ప్రభుత్వ ఖజానాకు ఇప్పటికే సుమారు రూ.13 కోట్లు ఆదా అయ్యిందని.. ప్రభుత్వ కార్యాలయాలకు ఈ సేవలను విస్తరించేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
ఈ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో తలెత్తే లోపాలను ఎప్పటికప్పుడు సరిచేస్తూనే.. రాబోయే రోజుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ వైడ్ ఏరియా నెట్వర్క్(టీ – స్వాన్)ను నెల రోజుల్లోపు పూర్తిస్థాయిలో టీ-ఫైబర్కు బదిలీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’కి పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ‘టీ-ఫైబర్’కు సూచించారు. ఇంటింటికి ఇంటర్నెట్ అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని, దీనికోసం ప్రిన్సిపుల్ మానిటైజేషన్ పార్టనర్ను ఎంపిక చేసేందుకు టెండర్లు పిలవాలని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
T Fiber: ప్రైవేటు నెట్ కు బంద్... అన్నీ ప్రభుత్వ కార్యాలయాలకు 'టీ-ఫైబర్' ఇంటర్నెట్
Hyderabad, Telangana:T Fiber: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించే ఇంటర్నెట్ విషయమై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రైవేటు ఇంటర్నెట్ వినియోగం ఇక చేయరాదని.. ప్రభుత్వానికి సంబంధించిన నెట్ వర్క్ టీ ఫైబర్ అన్నీ కార్యాలయాల్లో వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన చేశారు. ‘సెప్టెంబర్ ఒకటి తర్వాత ప్రైవేట్ ఆపరేటర్లకు బిల్లులు చెల్లించొద్దు. ఇంటింటికి ఇంటర్నెట్ అందించే ప్రక్రియను మరింత వేగవంతం చేయండి‘ అని మంత్రి ఆదేశించారు.
హైదరాబాద్ లోని డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ‘టీ – ఫైబర్’పై అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. 'టీ - ఫైబర్' సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. ‘రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ ఒకటి నుంచి కేవలం ‘టీ-ఫైబర్’ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలి‘ అని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆ గడువు దాటిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సేవల నిమిత్తం ప్రైవేట్ ఆపరేటర్లకు బిల్లులు చెల్లించొద్దని మంత్రి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... టీ-ఫైబర్ నెట్వర్క్ వినియోగం ద్వారా ఏటా ప్రభుత్వానికి సుమారు రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇంట్రానెట్ బేసిస్లో సెక్యూర్డ్ ఇంటర్నెట్ యాక్సెస్ కల్పించడంతో రాష్ట్ర డేటా సెంటర్కు అనుసంధానం ఏర్పడి పూర్తి స్థాయి డేటా సెక్యూరిటీ చేకూరుతుందని వెల్లడించారు. ఆరు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 4,487 ప్రభుత్వ కార్యాలయాలకు ‘టీ – ఫైబర్’ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ప్రభుత్వ ఖజానాకు ఇప్పటికే సుమారు రూ.13 కోట్లు ఆదా అయ్యిందని.. ప్రభుత్వ కార్యాలయాలకు ఈ సేవలను విస్తరించేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
ఈ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో తలెత్తే లోపాలను ఎప్పటికప్పుడు సరిచేస్తూనే.. రాబోయే రోజుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ వైడ్ ఏరియా నెట్వర్క్(టీ – స్వాన్)ను నెల రోజుల్లోపు పూర్తిస్థాయిలో టీ-ఫైబర్కు బదిలీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’కి పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ‘టీ-ఫైబర్’కు సూచించారు. ఇంటింటికి ఇంటర్నెట్ అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని, దీనికోసం ప్రిన్సిపుల్ మానిటైజేషన్ పార్టనర్ను ఎంపిక చేసేందుకు టెండర్లు పిలవాలని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ ..కారణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!!
Secunderabad, Telangana:Piles Cases in Employees: గంటల తరబడి కూర్చోవడం, జంక్ ఫుడ్ తినడం, ఒత్తిడి, టార్గెట్లు ఇవన్నీ కూడా ఉద్యోగుల జీవితంలో భాగమైపోయాయి. ప్రముఖ ఫిట్నెస్ కోచ్ విశ్వ భరత్, హెమరాయిడ్స్ రావడానికి ఇవే కారణాలని వివరించారు. ఈ రోజుల్లో బరువు పెరగడం, డయాబెటిస్ కంటే ఉద్యోగులలో హెమరాయిడ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు వారిలో హెమరాయిడ్స్ వేగంగా పెరుగుతున్నాయి. అయినప్పటికీ, వారు ఈ సమస్య గురించి మాట్లాడలేక, సిగ్గుతో దాన్ని దాచిపెడుతున్నారు. అయితే, ఈ సమస్యను గుర్తించి చికిత్స చేయకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని అంటున్నారు. హెమరాయిడ్స్ అంటే ఏమిటి? దాని కారణాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
పైల్స్:
పైల్స్ అంటే మూత్ర నాళం లోపల లేదా వెలుపల ఉన్న సిరలలో వచ్చే వాపులు. ఇవి నొప్పి, దురద, రక్తస్రావానికి కారణమవుతాయి. ఈ సమస్య వస్తే, కూర్చోవడం, పడుకోవడం, చివరికి మూత్ర విసర్జన చేయడం కూడా కష్టంగా మారుతుంది.
ఉద్యోగులలో ఈ సమస్య ఎందుకు ఎక్కువగా వస్తుంది?
డెస్క్ వర్కర్లు, ఐటీ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల్లో ఈ సమస్యకు అనేక కారణాలు ఉన్నాయి. ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల కటి ప్రాంతంలో రక్త ప్రసరణ తగ్గుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్లో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం వస్తుంది. పని ఒత్తిడి అనేది జీర్ణక్రియపై ప్రభావం చూపుతాయి. అంతేకాకుండా, ఫోన్ వాడకం వల్ల 10 నిమిషాల కంటే ఎక్కువ సేపు టాయిలెట్లో కూర్చోవడం వల్ల హెమరాయిడ్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
హెమరాయిడ్స్ లక్షణాలు ఏమిటి?
మూత్రంలో రక్తస్రావం, దురద, నొప్పి.. వాపు అనేవి హెమరాయిడ్స్ ప్రధాన లక్షణాలు. కొన్నిసార్లు, ఇవి వాటంతట అవే తగ్గిపోతాయి. అయితే, లక్షణాలు తీవ్రంగా ఉంటే, వైద్య సహాయం అవసరం. చికిత్స తర్వాత కూడా, అవి 4 నుండి 5 వారాల పాటు గణనీయమైన అసౌకర్యాన్ని కలిగిస్తాయి. మీరు వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే, శస్త్రచికిత్స చేయించుకోవలసి రావచ్చు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మొలలను నివారించడంలో పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందువల్ల, పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పప్పులను క్రమం తప్పకుండా తినండి. పుష్కలంగా నీరు త్రాగండి. అలాగే, ప్రతి గంటకు లేచి కొద్దిసేపు నడవండి. మెత్తటి దిండును ఉపయోగించడం ఉత్తమం. టాయిలెట్లో ఉన్నప్పుడు ఫోన్ వాడటం మానుకోండి. క్రమం తప్పని వ్యాయామం.. పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారం కూడా మలబద్ధకాన్ని తగ్గించి, మొలలను నివారించడంలో సహాయపడతాయి.
ఇంటి వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
డాక్టర్ ప్రిస్కప్షన్ లేకుండా దొరికే క్రీములు, ఆయింట్మెంట్లు తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తాయి. అయితే, లక్షణాలు తగ్గకపోతే, మీరు వైద్యుడిని సంప్రదించాలి. చికిత్సను ఆలస్యం చేయడం వల్ల పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. అందువల్ల, మీకు ఈ సమస్య లేదా దాని లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. మీరు ఇబ్బందిపడి వాటిని చెప్పకపోతే, పరిస్థితి మరింత తీవ్రం కావచ్చు.
Also Read: ఉద్యోగులకు డాక్టర్ల సూచన.. ఆఫీస్ టైమ్లో తినాల్సిన 7 హెల్తీ స్నాక్స్..ఇవే..!!
Also Read: ఆ బడుల్లో ఒకే టీచర్.. దేశంలో ఇలాంటి పాఠశాలలు ల
Also Read: స్విగ్గీ, జొమాటోకు పోటీగా ఫ్లిప్కార్ట్.. ఆగస్టు 15 నుంచి ఫుడ్ డెలివరీ..!!
Also Read: వారందరికీ పింఛన్లు రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Kodali Nani: ఆటలు ఆడలేని వారికి పేకాట పేరుతో డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చేశారు: కొడాలి నాని
Gudivada, Andhra Pradesh:AP DSC Recruitment: 'రాష్ట్ర నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది. డీఎస్సీలో స్పోర్ట్స్ 3 శాతం కోటాలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. అర్హత, సర్టిఫికెట్లు లేకపోయినా... పరీక్ష రాయని వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చారు. లోకేష్ నాయకత్వంలో జరిగిన డీఎస్సీలో అక్రమాలకు అడ్డూ అదుపు లేదు. ఆటలు ఆడడం రాని వారికి పేకాట పేరుతో ఉద్యోగాలు ఇచ్చేశారు' అని కొడాలి నాని తీవ్ర ఆరోపణలు చేశారు. 2029లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని ప్రకటించారు.
గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ సమావేశం నిర్వహించగా మాజీ మంత్రి కొడాలి నాని కీలక ప్రసంగం చేశారు. 'ఉద్యోగం వచ్చిన తర్వాత బీఎడ్ పూర్తి చేసేలా అవకాశం కల్పించే పరిస్థితి కూడా ఉంది. ఎమ్మెల్యేని ముందు నియమించి 5 ఏళ్ల తర్వాత ఎన్నికలకు వెళ్లినట్లు డీఎస్సీ చేశారు. పంజాబ్లో టీచర్ పోస్టులు విక్రయించిన కేసులో ముఖ్యమంత్రి అరెస్టు అయ్యి, జైలు శిక్ష పడింది. అక్కడి కంటే ఏపీలో అక్రమాలు పెద్ద స్థాయిలో జరిగి దొరికిపోయారు' అని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. డీఎస్సీ అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపడుతున్నామని తెలిపారు.
'అబద్ధాలు, మోసాలతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. జరిగిన అక్రమాన్ని బయటపెడితే మీడియా కానీ మీడియాతో జగన్ను తిట్టిస్తున్నారు. బీహార్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడి 60 వేల మెజార్టీ సీటులో బీజేపీ 20 తేడాతో ఊడిపోయింది. ప్రజల తీర్పు స్పష్టం రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి వస్తుంది' అని మాజీ మంత్రి కొడాలి నాని జోష్యం చెప్పారు. నీట్ పేపర్ లీకేజ్లో 21 మంది విద్యార్థులు చనిపోయారని.. వారికి న్యాయం చేయమని కాక్రోచ్ పేరుతో ఉద్యమిస్తే ఉగ్రవాదులు, పక్క దేశం వారు ఉద్యమం చేస్తున్నారంటూ తిట్టించారని గుర్తుచేశారు. చివరకు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి ప్రభుత్వం తలవంచిందని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అదే వస్తుందని ప్రకటించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. అక్రమాలపై పోరాటం కొనసాగుతుంది' అని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కొడాలి నాని స్పష్టం చేశారు.
ఆగస్టులో రైతులకు సాగునీరు దిక్కులేకపోయి ఉంటే సీఎం చంద్రబాబు మాత్రం ఎప్పుడో రావాల్సిన ఎండకాలంపై ఇప్పుడు సమీక్ష చేయడాన్ని కొడాలి నాని తప్పుబట్టారు. ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అధికార పార్టీ వేధింపులు, కుట్రలన్నింటిని ఎదుర్కొందామని.. వాటికి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. 2029లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని.. ఇప్పుడు ఎవరెవరు ఏమీ చేస్తున్నారో అప్పుడు పదింతలు అనుభవిస్తారని హెచ్చరించారు. జగన్ మోహన్ రెడ్డిని ఎవరూ ఏమీ చేయలేరని.. కుక్క మూతి ముఖాలు ఏం చేయలేరని ప్రకటించారు. జగన్కు వారికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని వివరించారు.
Retired Employees: పెండింగ్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం మాజీ ఉద్యోగుల భారీ ఆందోళన
Hyderabad, Telangana:RTC Employees Protest: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వంలోని ఉద్యోగుల సమస్యలే పరిష్కారం కాకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపులేదు. తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడం.. పెండింగ్ బకాయిలు చెల్లించపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇన్నాళ్లు విశేష సేవలు అందించిన తర్వాత కూడా తమకు ప్రభుత్వం చెల్లింపులు చేయకపోవడంతో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
హైదరాబాద్లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్ భవన్ వద్ద మాజీ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేశారు. పెండింగ్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇతర డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో బస్ భవన్కు చేరుకొని తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ మేనేజ్మెంట్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.
ఈ సందర్భంగా పలువురు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు మాట్లాడుతూ.. రిటైర్మెంట్ కార్మికులకు రావాల్సిన 2017, 2021 సంవత్సరాల బకాయిలు త్వరగా చెల్లించాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్లో రిటైర్డ్ ఉద్యోగులకు 2 నెలలకు సరిపడా మందులు అందించాలని కోరారు. మరణించిన ఉద్యోగి భార్యాభర్తలకు సూపర్ లగ్జరీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. వితంతు ఉద్యోగులకు పీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు.
ఏపీ, తెలంగాణ కస్టమర్లకు జియో గుడ్ న్యూస్.. రూ.400 నుంచే కొత్త వైఫై, టీవీ, OTT ప్లాన్లు
Hyderabad, Telangana:Jio Launches New 3 in 1 Home Pack: ప్రైవేటు దిగ్గజ కంపెనీ అయిన జియో ఇప్పటికే బడ్జెట్ ఫ్రెండ్లీలో అనేక రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. అయితే, కేవలం మొబైల్ రీఛార్జ్ సేవలకు మాత్రమే పరిమితం కాకుండా, బ్రాడ్బ్యాండ్ రంగంలో కూడా దూసుకుపోతోంది. రిలయన్స్ జియో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ కొత్త జియో హోమ్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఇందులో హై స్పీడ్ వైఫైతో పాటు వెయ్యికి పైగా లైవ్ టీవీ ఛానల్స్, ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారమ్లను ఒకే ప్యాకేజీలో కేవలం రూ.400 ప్రారంభ ధరతో అందిస్తోంది.
జియో హోమ్ ప్యాక్ కింద మూడు రకాల సెలెక్టెడ్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. మొదటిది 'టీవీ ఓన్లీ ప్యాకేజీ', దీని ద్వారా 1000 పైగా లైవ్ ఛానల్స్ను పొందవచ్చు. రెండవది 'వైఫై ఓన్లీ ప్యాకేజీ', ఇందులో 30 Mbps లేదా 100 Mbps హై స్పీడ్ ఇంటర్నెట్ డేటాతో పాటు రెండు యాప్స్ 12 నెలల పాటు ఉచితంగా లభిస్తాయి. ఇక మూడవ ప్యాకేజీలో టీవీ, హై స్పీడ్ ఇంటర్నెట్ డేటాతో పాటు 12 ఓటీటీ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాకేజీలలో మీకు నచ్చిన దానిని ఎంచుకోవచ్చు. కస్టమర్లు బ్రాడ్బ్యాండ్, టెలివిజన్, స్ట్రీమింగ్ వినోదాన్ని ఒకే కనెక్షన్లో పొందవచ్చు. కేవలం టీవీ మాత్రమే చూసేవారికి, అలాగే హై స్పీడ్ లైవ్ టీవీతో పాటు ఓటిటి ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి ఇది ఒక బంపర్ గిఫ్ట్ లాంటిది.
జియో హోమ్ ఓటీటీ విషయానికి వస్తే, ఏపీ, తెలంగాణలో ఎక్కువగా వీక్షించే ఆహా, జియో సినిమా, హాట్స్టార్, జీ5, సోనీ లివ్ వంటి 12 ఓటిటి ప్లాట్ఫారమ్లను ఆస్వాదించవచ్చు. వీటితో పాటు యూట్యూబ్ సదుపాయం, జియో సర్వీస్ ఇంజనీర్ల ద్వారా ఉచిత ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్, లైవ్ టీవీని ప్లే, పాజ్ లేదా రివైండ్ చేసే ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
సాధారణంగా భారీ వర్షాల వల్ల డిటీహెచ్ (DTH) సేవలు నిలిచిపోతుంటాయి, కానీ ఈ వైఫై ద్వారా మీరు లైవ్ టీవీని నిరంతరాయంగా చూడవచ్చు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సీరియల్స్, లైవ్ స్పోర్ట్స్, న్యూస్ ప్రోగ్రామ్స్ను మిస్ కాకుండా వీక్షించవచ్చు.
టీవీ ఓన్లీ ప్యాక్ నెలకు రూ.400 లభిస్తుంది. ఇందులో 200కు పైగా హెచ్డీ ఛానల్స్తో కలిపి వెయ్యికి పైగా లైవ్ టీవీ ఛానల్స్ ఉంటాయి. అలాగే 12 ఓటీటీ యాప్స్, లైవ్ టీవీ కోసం ప్లే, పాజ్, రివైండ్ ఫీచర్లు, యూట్యూబ్ సదుపాయం కూడా ఉన్నాయి. దీని ధరలు రెండు నెలలకు రూ.1000 లేదా ఐదు నెలలకు రూ.2000 ఉన్నాయి. వెల్కమ్ ఆఫర్ కింద 12 ఓటీటీ యాప్స్ను ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. ఇప్పటికే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉన్నవారు కూడా దీనిని పొందవచ్చు.
Reliance Jio Launches New 3-in-1 Jio Home Pack with Wi-Fi, TV, and OTT Benefits from Rs 400
The new 3-in-1 Jio Home Pack includes three selectable packages:
- Jio Home - TV Only Package - Access to 1000+ live channels.
- Jio Home - Wi-Fi Only Package - Access to 30 Mbps or 100… pic.twitter.com/E25aa8GVmo— TelecomTalk (@TelecomTalk) August 3, 2026
వైఫై టీవీ ప్లస్ ఓటీటీ ప్యాకేజీ నెలకు రూ.555 అందుబాటులో ఉంది. ఇందులో 30 Mbps అన్లిమిటెడ్ వైఫై, వెయ్యికి పైగా లైవ్ టీవీ ఛానల్స్,12 ఓటిటి యాప్స్ లభిస్తాయి. ఒకవేళ మీరు మూడు నెలలకు ఒకేసారి రీఛార్జ్ చేసుకుంటే ఒక నెల ఉచితంగా పొందే అవకాశం ఉంది. అదే 100 Mbps స్పీడ్ కావాలనుకునే వారికి రూ.707 ప్యాక్ అందుబాటులో ఉంది. ఇందులో 100 Mbps హై స్పీడ్ ఇంటర్నెట్, వెయ్యి లైవ్ టీవీ ఛానల్స్, 12 ఓటిటి యాప్స్ ఉంటాయి. ఇందులో కూడా రూ.2122 రీఛార్జ్ చేసుకుంటే ఒక నెల ఉచితంగా లభిస్తుంది. హెచ్డీ స్ట్రీమింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఇది చాలా అనువైనది.
ఒకవేళ మీరు వైఫై ఓన్లీ ప్యాక్ కోరుకుంటే, అది నెలకు రూ.450 కే లభిస్తుంది. ఇందులో 30 Mbps అన్లిమిటెడ్ హై స్పీడ్ వైఫై ఉంటుంది. దీనికి రెండు నెలలకు రూ.1100 లేదా ఐదు నెలలకు రూ. 2200 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే కేబుల్ లేదా డిటీహెచ్ వాడుతున్న వారికి ఇది కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక 100 Mbps వైఫై నెలకు రూ.600 లభిస్తుంది. దీనికి సంబంధించి రెండు నెలలకు రూ.1500 లేదా ఐదు నెలలకు రూ.3000 ధర నిర్ణయించారు.
Also Read: ఎయిర్టెల్ యూజర్లకు అదిరిపోయే వార్త.. రూ.1,849 కే సంవత్సరం అంతా ఉచిత కాలింగ్!
Also Read: ఆధార్ వినియోగదారులకు బిగ్ అలెర్ట్.. ప్లాస్టిక్ PVC కార్డ్ ధర భారీగా పెంపు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
