icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
504251
KASARLA RAMESHKASARLA RAMESHFollow4 Sept 2024, 03:56 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Nara Lokesh DSC: వైఎస్ జగన్ ఇంటి దగ్గరకు వెళ్లి సవాల్ చేసిన మంత్రి లోకేష్.."దమ్ముంటే డీఎస్సీపై చర్చకు రండి!"

Vijayawada, Andhra Pradesh:

Nara Lokesh On DSC: ఏపీలో గతేడాది జరిగిన మెగా డీఎస్సీ నియామకంపై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నాయకుల నుంచి వస్తున్న అనేక ఆరోపణలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉండి పెద్ద సవాల్ విసిరారు. మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ..తాను 'గొడ్డలి' పార్టీ నాయకుల్లా బురదచల్లి పారిపాయే రకాన్ని కాదని అన్నారు. అలాగే డీఎస్సీపై ఎవరికైనా అనుమానాలు ఉంటే అదే ప్రదేశంలో బహిరంగ చర్చకు సిద్ధమని ఈ సందర్భంగా ఆయన గట్టిగా కౌంటర్ ఇచ్చారు. 

మంత్రి లోకేష్ సవాలు ఇదే!
మెగా డీఎస్సీ నియామకంపై, దాని ప్రక్రియపై ఎవరికైనా ఎలాంటి అనుమానాలు ఉన్నా.. వాటిని ఇక్కడే (జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో) నిలబడి సమాధానం చెప్తానని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. సవాస్ స్వీకరించే దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలని ప్రతిపక్ష వైసీపీ నేతలకు సవాల్ విసిరారు.

అయితే మెగా డీఎస్సీపై వస్తున్న విమర్శలపై స్పందించిన మంత్రి నారా లోకేష్.. వైఎస్ జగన్ ఎన్ని జన్మలెత్తినా.. ప్రస్తుతం జరుగుతున్న, జరగబోతున్న డీఎస్సీ నియామకాలను ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

అదే విధంగా గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జాబ్ క్యాలెండర్లు కేవలం 'సాక్షి' పత్రికకే పరిమితమయ్యే క్యాలెండర్ల తాము రెడీ చేయలేదని మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు మేలు చేసే విధంగా తమ కూటమి ప్రభుత్వం ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేసిందని.. అదే విధంగా వాటి అమలుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. అలాగే తాము అమలు చేసే జాబ్ నోటిఫికేషన్లను మాత్రమే రిలీజ్ చేస్తున్నట్లు నారా లోకేష్ ప్రకటించారు. 

గత ఐదేళ్ల పాలనలో కనీసం ఒక్క డీఎస్సీని కూడా సరిగ్గా నిర్వహించని వారికి.. హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ల ప్రక్రియ గురించి ఏం తెలుస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. ఒక్కసారి డీఎస్సీ నిర్వహిస్తే కదా ఆ రిజర్వేషన్ల విధానంపై అవగాహన వచ్చేదంటూ మంత్రి చురకలు అంటించారు.

Also Read: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో అల్లు అర్జున్ సీక్రెట్ మీటింగ్..ఏం జరిగిదంటే?

Also Read: భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం..జూన్ 10 నుంచి ఆ టికెట్ల జారీకి ఆదేశం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Shani Vakragati: శని వక్రగతి, శశ రాజయోగం.. జులై నుంచి ఈ 4 రాశుల వారికి బంపర్ జాక్‌పాట్!

Hyderabad, Telangana:

Shani Vakragati Effect On Zodiac: జులై 27వ తేదీన కర్మ ప్రధాన ప్రధాన శని దేవుడు మీనరాశిలోకి వక్రగతిలోకి ప్రవేశించబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శనిగ్రహం వక్రగతి లోకి వెళ్లడం ఒక ముఖ్యమైన సంఘటనగా పరిగణిస్తారు. ఎందుకంటే వక్రగతిలోకి వెళ్లిన తర్వాత శని ప్రభావం మరింత లోతుగా.. తీవ్రంగా మారుతుంది. సాధారణంగా శని వక్రగతిని చెడుగా భావించినప్పటికీ.. కొన్ని రాశుల వారికి ఈ సమయంలో ఆశుభానికి బదులుగా శుభాలు కలుగుతూ ఉంటాయి. అయితే, శని ప్రభావం.. అనేది వ్యక్తులు చేసే కర్మలను బట్టి ఆధారపడి ఉంటుంది. కర్మలకు అనుకూలంగానే ఫలితాలు అందిస్తాడు. ఇదిలా ఉంటే శని వక్రగతిలోకి వెళ్లిన వెంటనే ఎంతో శక్తివంతమైన శశ మహాపురుష రాజయోగం కూడా ఏర్పడుతుంది. ఈ యోగానికి కూడా ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే శని వక్రగతిలోకి వెళ్లడం వల్ల నాలుగు రాశుల వారికి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి అద్భుతమైన పురోగతి లభించడమే కాకుండా సామర్థ్యం కూడా విపరీతంగా పెరుగుతుంది.. అనుకున్న పనుల్లో విపరీతమైన ధన లాభాలు పొందగలుగుతారు. 

ఈ రాశులవారికి బంపర్‌ జాక్‌పాట్..
వృషభరాశి 
ముఖ్యంగా ఈ రాశికి శుక్రుడు అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటాడు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని, శుక్ర గ్రహాలు ఒకదానికొకటి సన్నిహిత గ్రహాలుగా పరిగణిస్తూ ఉంటారు. దీని కారణంగా వీరికి కర్మలను బట్టి అద్భుతమైన ధన లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి అద్భుతమైన పదోన్నతులు లభించి జీతాలు విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కోరుకున్న చోటికి బదిలీలు కూడా జరిగే అవకాశాలున్నాయి. నిలిచిపోయిన వ్యాపారాలకు సంబంధించిన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమవుతాయి. ఆస్తులతో పాటు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి అపారమైన ప్రయోజనాలు కలుగుతాయి. సమాజంలో వీరికి అద్భుతమైన గుర్తింపు లభించబోతోంది..

మిథున రాశి 
శని శక్తివంతమైన శశ మహాపురుష రాజయోగంతో మిధున రాశి వారికి అదృష్టంతో పాటు ఆనందం కూడా విపరీతంగా పెరుగుతుంది. కొంతకాలంగా మీ పనికి వస్తున్న ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి. అనుకున్న పనుల్లో అన్ని రకాల సమస్యలు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వ్యక్తులందరికీ అద్భుతమైన విజయాలు కలుగుతాయి. వ్యాపారాలపరంగా విపరీతమైన ధన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా పర్యటనలు చేయడం వల్ల ఈ సమయంలో ఎంతో లాభదాయకంగా ఉంటుంది. సౌకర్యాలతో పాటు విలాసవంతం కూడా పెరుగుతుంది. కొత్త వాహనాలతో పాటు ఇండ్లు కొనుగోలు చేయాలనుకునే వ్యక్తులందరికీ మంచి ధన లాభాలు కలుగుతాయి..

తులారాశి 
శక్తివంతమైన శశ మహాపురుష రాజయోగ ప్రభావంతో తులా రాశి వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఐదవ స్థానంలో ఈ రాజయోగం ఏర్పడడం కారణంగా విశేషమైన ప్రయోజనాలు కలుగబోతున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అద్భుతమైన శుభవార్తలు లభిస్తాయి. ఆకస్మిక ఆర్థిక లాభాలు కలగడమే కాకుండా గతంలో చిక్కుకుపోయిన డబ్బులు కూడా తిరిగి పొందగలుగుతారు. ముఖ్యంగా ప్రేమ సంబంధాలు మరింత లోతుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటినుంచో మంచి భాగస్వామితో ప్రయాణం చేస్తున్న వ్యక్తులందరికీ ఈ సమయంలో తప్పకుండా వివాహ యోగం మెండుగా కనిపిస్తుంది. 

వృశ్చిక రాశి 
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులందరికీ శని ప్రభావంతో విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా గణనీయమైన సమస్యల నుంచి ఈ సమయంలో పరిష్కారం లభించబోతోంది. ముఖ్యంగా కుటుంబ కలహాలు లేదా మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి గొప్ప పరిష్కారం లభించబోతోంది. ముఖ్యంగా కొత్త ఇల్లులతో పాటు భూములు లేదా వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటున్న వ్యక్తులందరికీ ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. పూర్వికుల ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా అద్భుతమైన ధన లాభాలు కలుగుతాయి. పాత వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం కావచ్చు. పని ప్రదేశాల్లో ప్రశంసలు లభించడమే కాకుండా మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

 

0
0
Report

Lionel Messi: మెస్సీ హిస్టారికల్ రికార్డ్.. హాట్రిక్ గోల్స్‌తో అల్జీరియా ఊచకోత.. వరల్డ్ కప్ ఆల్‌టైమ్ రికార్డ్ సమం..!

BBhoomi1h ago
Secunderabad, Telangana:

Argentina vs Algeria FIFA World Cup 2026 match Marathi report : 20 ఏళ్ల అనుభవం ఉన్న లియోనెల్ మెస్సీ తన మాయాజాలాన్ని మరోసారి ప్రదర్శించాడు. 38 ఏళ్ల మెస్సీకి ఇది బహుశా చివరి ప్రపంచ కప్ కావడంతో..  అతను మైదానంలోకి అడుగుపెట్టిన వెంటనే వాతావరణం చాలా భావోద్వేగభరితంగా మారింది. అర్జెంటీనా అభిమానులు కన్నీళ్ల ద్వారా తమ భావోద్వేగాలను వెలిబుచ్చడం కనిపించింది. మెస్సీ మూడు అద్భుతమైన గోల్స్ చేసి అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టడమే కాకుండా ఫీఫా ఫుట్‌బాల్ ప్రపంచ కప్ చరిత్రలో అనేక రికార్డులను నెలకొల్పాడు. అతను అర్జెంటీనా తరఫున గోల్స్ చేసిన అతి పిన్న వయస్కుడైన..  అతి పెద్ద వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. గొప్ప ఫుట్‌బాల్ ఆటగాడు పీలే రికార్డును కూడా బద్దలు కొట్టాడు. మెస్సీ   మాయాజాలపు హ్యాట్రిక్ బలంతో, అర్జెంటీనా 3-0 తేడాతో అల్జీరియాను ఓడించింది.

కాన్సాస్ సిటీలోని ఆరోహెడ్ స్టేడియం  మెస్సీతో నిండిపోయింది. 2006 జూన్ 16న తన ప్రపంచ కప్ అరంగేట్రం చేసిన యువ మెస్సీ, ఇప్పుడు అర్జెంటీనా తరపున వయోజనుడిగా ఆడుతున్నాడు. కానీ అతని వేగం, గోల్స్ చేయాలనే తపన ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అందుకే అతను మ్యాచ్ ఐదవ నిమిషంలో ఒక అద్భుతమైన గోల్ చేశాడు.  కానీ దురదృష్టవశాత్తు అది ఆఫ్ సైడ్ అయింది. అతనికి అల్జీరియా నుంచి కూడా వెంటనే సమాధానం లభించింది.  కానీ అంపైర్ ఆఫ్ సైడ్ జెండా చూపడంతో వారు కూడా నిరాశపడాల్సి వచ్చింది. ఇరు జట్లు సమానంగా తలపడుతుండగా, మెస్సీ తన ఆకర్షణను ప్రదర్శించాడు. 17వ నిమిషంలో, అతను బాక్స్ వెలుపల నుంచి ఒక అద్భుతమైన గోల్ చేసి అర్జెంటీనాకు 1-0 ఆధిక్యాన్ని అందించడమే కాకుండా, అనేక రికార్డులను నెలకొల్పాడు.

డి పాల్ కొట్టిన ఫ్రీ కిక్‌ను ఒక డిఫెండర్ అడ్డుకున్నాడు. అతను మైదానం మధ్య నుండి ముందుకు దూసుకొచ్చి దూరం నుండి బలమైన షాట్ కొట్టాడు. ఆ బంతి గోల్ కీపర్ లూకా జిదాన్ వేళ్లను తాకుతూ నేరుగా నెట్‌లోకి దూసుకెళ్లింది. దీంతో స్టేడియం మొత్తం  కేకలతో మారుమోగింది. మెస్సీ సాధించిన ఈ 14వ ప్రపంచ కప్ గోల్ అర్జెంటీనాకు ఆధిక్యాన్ని ఇచ్చింది. వారు మ్యాచ్‌పై తమ పట్టును నిలుపుకున్నారు. అల్జీరియా కూడా స్కోరును సమం చేయడానికి ప్రయత్నించింది, కానీ అర్జెంటీనా రక్షణ బలంగా ఉంది. రెండవ అర్ధభాగంలో కూడా అర్జెంటీనా దాడిని కొనసాగించింది. 60వ నిమిషంలో మెస్సీ సులభమైన గోల్ చేసి అర్జెంటీనా ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు.

ప్రపంచ కప్‌లో ఇది అతనికి 15వ గోల్, దీనితో అతను టోర్నమెంట్  ఆల్-టైమ్ లీడింగ్ స్కోరర్‌గా బ్రెజిల్‌కు చెందిన రొనాల్డోతో కలిసి రెండవ స్థానానికి చేరుకున్నాడు. జర్మనీకి చెందిన మిరోస్లావ్ క్లోస్ (16) అగ్రస్థానంలో ఉన్నాడు. అలెక్సిస్ మెక్‌అలిస్టర్ దూరం నుండి కొట్టిన పవర్ ఫుల్ షాట్‌ను జిదాన్ అడ్డుకున్నాడు, అతను అక్కడే ఉండి రీబౌండ్‌ను ప్రశాంతంగా గోల్‌లోకి నెట్టాడు. 66వ నిమిషంలో మెస్సీ హ్యాట్రిక్‌ను అల్జీరియన్ గోల్ కీపర్ అడ్డుకున్నాడు.

ఫ్రాన్స్‌కు చెందిన కైలియన్ ఎంబాపే, నార్వేకు చెందిన ఎర్లింగ్ హాలాండ్ .. ఇప్పుడు అర్జెంటీనాకు చెందిన మెస్సీ తలా రెండు గోల్స్ చేసి ఈ ప్రపంచ కప్‌ను ఈరోజు చిరస్మరణీయం చేశారు. మెస్సీ 76వ నిమిషంలో ఒక అడుగు ముందుకు వేసి తన హ్యాట్రిక్‌ను పూర్తి చేశాడు. ఇది ప్రపంచ కప్‌లో అతనికి తొలి హ్యాట్రిక్. దీనితో, అతను ప్రపంచ కప్‌లో 16 గోల్స్‌తో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడి రికార్డును సమం చేశాడు. ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్ సాధించిన అత్యంత పెద్ద వయసు ఆటగాడిగా నిలిచాడు. అర్జెంటీనా 3-0 తేడాతో విజయం సాధించింది.

Also Read:  Business Ideas: మోదీ సర్కార్ అందిస్తున్న రూ.5 లక్షల లోన్‎ తీసుకుని

Also Read:  కేంద్రంలోని మోదీ సర్కార్ అందించే రూ. 10లక్షలతో ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

UGC NET 2026: నెట్ రాసే అభ్యర్థులకు అలర్ట్.. అడ్మిట్ కార్డ్ లింక్ యాక్టివ్, ఇలా నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకోండి!

Hyderabad, Telangana:

UGC NET 2026 Admit Card Out: జూన్ 22, 23, 24, 25, 30 తేదీల్లో జరగబోయే పరీక్షల కోసం అడ్మిట్ కార్డులను NTA విడుదల చేసింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, లాగిన్ క్రెడియన్షియల్స్ ఉపయోగించి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 2026 నెట్ పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా (CBT) దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో జూన్ 22 నుండి 30 వరకు నిర్వహించబడతాయి. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌ను వెంట తెచ్చుకోవాలి.

యూజీసీ నెట్ అడ్మిట్ కార్డ్ 2026 డౌన్‌లోడ్ చేసే విధానం:
యూజీసీ నెట్ పరీక్ష రాసే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌
https://ugcnet.nta.nic.in/ ను ఓపెన్ చేసి, అక్కడ ఉన్న 'UGC NET Admit Card 2026' లింక్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత తమ లాగిన్ వివరాలను సబ్మిట్ చేస్తే అడ్మిట్ కార్డ్ కనిపిస్తుంది. అందులో మీ వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకుని వెంటనే ప్రింట్ తీసుకోవాలి.

యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షలు రెండు షిఫ్టులలో నిర్వహిస్తారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. అభ్యర్థులు తమ హాల్ టికెట్‌పై ఉన్న పేరు, ఫోటోగ్రాఫ్, పరీక్ష తేదీ, షిఫ్ట్ సమయాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. పరీక్షా కేంద్రానికి అడ్మిట్ కార్డ్‌తో పాటు ఒక గుర్తింపు కార్డును (ID Proof) తప్పనిసరిగా తీసుకురావాలి.. లేనిపక్షంలో పరీక్ష రాయడానికి అనుమతించబడరు.

Also Read: యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. ఆ లిస్ట్‌లో మీ నెంబర్ ఉందో లేదో వెంటనే చూసుకోండి!

Also Read: జూన్ 21న నీట్ రాసే వారికి అలర్ట్.. పరీక్ష సమయం పెంపు, ఎన్టీఏ కీలక మార్పులు!

ఈ పరీక్షలో అర్హత సాధించిన వారు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), వివిధ యూనివర్సిటీలు లేదా కాలేజీల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్లకు ప్రవేశం పొందవచ్చు. ఇప్పటికే NTA ఎగ్జామినేషన్ సిటీ డేట్ అడ్వాన్స్ స్లిప్స్‌ను జూన్ 10న విడుదల చేసింది. అభ్యర్థులు తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడానికి ఈ స్లిప్ ఉపయోగపడుతుంది.

అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేయడంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే, అభ్యర్థులు 011-4075900 నంబర్‌ను సంప్రదించవచ్చు లేదా NTA హెల్ప్ లైన్ డెస్క్ ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. పరీక్ష నిర్వహణకు సంబంధించిన తాజా సమాచారం కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా అధికారిక యూజీసీ నెట్ వెబ్‌సైట్‌ను పర్యవేక్షించాలని NTA కోరింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

KTR: రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ హితవు.. 'నిరుద్యోగులను 5 వేల పోస్టులతో మోసం చేయొద్దు'

Hyderabad, Telangana:

Police Aspirants Protest: ఏడాదికి రెండు లక్షలు ఉద్యోగాలు అంటూ హామీ ఇచ్చిన రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మోసం చేయడంపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తుండగా వారికి అండగా బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ నిలిచారు. నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం లాఠీఛార్జ్ ప్రయోగించడాన్ని ఖండించారు. ఇది అత్యంత హేయమైన చర్యగా ప్రకటించారు. 5 వేల పోస్టులతో మరో మోసం చేయొద్దని.. 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని మాజీ మంత్రి డిమాండ్‌ చేశారు.

లాఠీచార్జ్ ఖండన
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో పోలీస్ కానిస్టేబుల్‌ ఉద్యోగాల అభ్యర్థులు ఆందోళన చేయగా.. పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని ఖండిస్తూ కేటీఆర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌లో తమ న్యాయమైన డిమాండ్ల కోసం, ఉద్యోగాల భర్తీ కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగ యువతపై, పోలీస్ అభ్యర్థులపై ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి లాఠీఛార్జ్ చేయించడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న అభ్యర్థులను వీధుల వెంట వెంటాడి వేటాడటం, అక్రమంగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి, నిరంకుశత్వానికి నిదర్శనమని కేటీఆర్‌ మండిపడ్డారు.

పోలీసులతో అణగదొక్కడమే ఇందిరమ్మ పాలనా?
విద్యార్థులను నిరుద్యోగులను పోలీసులతో అణగదొక్కడమే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఇందిరమ్మ ప్రజా పాలననా అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు అన్ని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయాలని అనేక రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాల్సిందేనని మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.

20 వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు
'ఎన్నికల ముందు ఒకే ఏడాది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, 'మెగా నోటిఫికేషన్లు', 'జాబ్ క్యాలెండర్' అంటూ కోతలు కోసి.. నిరుద్యోగ యువతను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, నేడు నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతోంది' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 20 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. 5 వేల పోస్టులతో చేతులు దులుపుకోవాలని చూడడం అన్యాయమని తెలిపారు. సుదీర్ఘకాలంగా కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటూ.. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే 20,000 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తూ మెగా నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

తక్షణమే విడుదల చేయాలి
దిల్‌సుఖ్‌నగర్‌లో హక్కుల కోసం పోరాడిన నిరుద్యోగ జేఏసీ నేతలను, విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించడాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. అరెస్టయిన ప్రతి ఒక్క నిరుద్యోగ బిడ్డను బేషరతుగా తక్షణమే విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ డిమాండ్ చేశారు. లాఠీలతో నిరుద్యోగుల గొంతు నొక్కాలని చూస్తే ఈ ప్రభుత్వానికి కాలం దగ్గరపడినట్టేనని హెచ్చరించారు.

లాఠీలతో అణచివేయలేరు
నిరుద్యోగుల ఆవేదనను, వారి న్యాయమైన డిమాండ్లను లాఠీలతో అణచివేయలేరని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్‌ రెడ్డి ఇప్పటికైనా తన మొండివైఖరి వీడి 20 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేయాలని కోరారు. అంతేకాకుండా వయో పరిమితి సడలింపు చేసి నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే.. నిరుద్యోగ, విద్యార్థి సమాజానికి అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ప్రకటించారు. భవిష్యత్‌లో తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తామని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు.

0
0
Report
Advertisement

Revanth Reddy: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి రేవంత్‌ రెడ్డి లేఖ.. రైల్వే మంత్రితో భేటీ ఏర్పాటు చేయండి

Baddipadaga, Telangana:

Hyderabad Metro Rail: హైదరాబాద్‌ మెట్రో రైలు అంశంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య కౌంటర్లు, ప్రతి కౌంటర్లు నడుస్తుండగా.. మంగళవారం ఇద్దరి మధ్య మరింత రాజుకుంది. ఉదయం కిషన్‌ రెడ్డి ప్రెస్‌మీట్‌ నిర్వహించగా.. సాయంత్రం రేవంత్‌ రెడ్డి లేఖ రాశారు. విబేధాలు కొనసాగుతున్న వేళ రైల్వే శాఖ మంత్రితో సమావేశం ఏర్పాటుచేయాలని.. అనుమతులు, రుణాల విడుదలలో జాప్యం చేయవద్దని లేఖలో విజ్ఞప్తి చేశారు.

Also Read: Kishan Reddy: రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కౌంటర్‌.. పనుల చిట్టా ఇదే

హైదరాబాద్ మెట్రో ఫేజ్–2కు కేంద్ర అనుమతులు, ఐఆర్‌ఎఫ్‌సీ రుణ విడుదలలో జాప్యం చేయవద్దని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి తెలంగాణ సీఎం బహిరంగ లేఖ రాశారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. మెట్రో ఫేజ్–2 కోసం 7 కారిడార్లు, 122.9 కి.మీ., రూ.38,595 కోట్ల ప్రతిపాదన కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిందని వివరించారు. కేంద్ర అభ్యంతరాల నేపథ్యంలో మెట్రో ఫేజ్–1ను స్వాధీనం చేసుకునే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

హైదరాబాద్‌ మెట్రో ఫేజ్–1 స్వాధీనానికి మొత్తం రూ.15,000 కోట్ల లావాదేవీలు పూర్తి చేశాం. కేంద్రం నామినేట్ చేసిన యూపీఎంఆర్‌సీఎల్ ఎండీ సుశీల్‌కుమార్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు' అని లేఖలో తెలంగాణ సీఎం గుర్తు చేశారు. 'డ్యూ డిలిజెన్స్ పూర్తి చేసి రుణ ఒప్పందం చేసిన ఐఆర్‌ఎఫ్‌సీ. రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ, ఆర్‌బీఐ డైరెక్ట్ డెబిట్ అంగీకరించింది' అని లేఖలో ప్రస్తావించారు. 'తొలి విడత రుణ విడుదల కోసం రూ.84.32 కోట్ల అప్‌ఫ్రంట్ ఫీజు తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది. రూ.1,461.47 కోట్ల ఈక్విటీని ఇప్పటికే ఎస్క్రో ఖాతాలో జమ చేశాం' అని లేఖలో సీఎం పేర్కొన్నారు.

జూన్ 15వ తేదీన విడుదల కావాల్సిన తొలి విడత రుణం ఇంకా విడుదల కాలేదని తెలంగాణ సీఎం లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం దానం అడగడం లేదని, ఒప్పందం ప్రకారం రుణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన సీనియర్ కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి బాధ్యత తీసుకోవాలని రేవంత్‌ రెడ్డి సూచించారు. మెట్రో ఫేజ్-2ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 50:50 జాయింట్ వెంచర్‌గా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. అనుమతులు ఆలస్యమైనా రాష్ట్ర వనరులు, సంస్థాగత రుణాలతో ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తామని తెలంగాణ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అవసరమైన ముందస్తు అనుమతులను వెంటనే మంజూరు చేయాలని లేఖలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అన్ని ఒప్పందాలు, ఆధారాలతో సమావేశానికి హాజరై వివరణ ఇవ్వడానికి సిద్ధమని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

0
0
Report

Kishan Reddy: రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కౌంటర్‌.. 'నేను చేసిన పనుల చిట్టా ఇదే!'

New Delhi, Delhi:

Kishan Reddy vs Revanth Reddy: 'హైదరాబాద్‌ మెట్రోప్రాజెక్టు విషయంలో అనేక రకాలుగా రేవంత్‌ రెడ్డి నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. ఏడేళ్లుగా కేంద్ర సహాయమంత్రిగా, కేబినెట్ మంత్రిగా నేను తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేశా. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరగాలనే కోరుకున్నా తప్ప ఏనాడూ  అడ్డుకునే ప్రయత్నం చేయలేదు' కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి వివరణ ఇచ్చారు. 'హైదరాబాద్‌ మెట్రో ఫేజ్ 1, ఫేజ్ 2 విషయంలో రేవంత్‌ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఫేజ్ 2 విషయంలో 50:50 నిష్పత్తిలో ముందుకెళ్లాలని సూత్రప్రాయంగా అంగీకరించింది. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నాతో, రేవంత్‌ రెడ్డి కలిసినప్పుడు కూడా ఈ విషయాన్ని తెలిపారు' అని వివరణ ఇచ్చారు.

కేంద్ర మంత్రిగా తెచ్చిన నిధులు
హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టుపై రేవంత్‌ రెడ్డి చేసిన విమర్శలపై మరోసారి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. రేవంత్‌ రెడ్డి విమర్శలను తిప్పి కొడుతూ తాను కేంద్ర మంత్రిగా తెలంగాణకు తెచ్చిన నిధులు, ప్రాజెక్టుల చిట్టాను బహిర్గతం చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కిషన్‌ రెడ్డి గట్టి బదులు ఇచ్చారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవే.

'మెట్రో ఫేజ్-1కు కేంద్ర ప్రభుత్వం రూ.1,250 కోట్లు ఇచ్చింది. మోదీ స్వయంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. దేశంలోని మిగిలిన నగరాల్లాగే హైదరాబాద్ విషయంలోనూ సాంకేతికతంగా చర్చించి కేంద్రం సహకరిస్తుంది. అంతే తప్ప కిషన్ రెడ్డి ఆపమంటే ఆపరు. తెలంగాణ అభివృద్ధిపై మాకు చిత్తశుద్ధి ఉంది. మాకు ఈ విషయంలో ఎవరి సర్టిఫికెట్లు అవసరం లేదు' అని రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు.

సర్టిఫికెట్లు అవసరం లేదు
నాకు, ప్రధానికి, కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్, రేవంత్ రెడ్డి సర్టిఫికెట్లు అవసరం లేదని.. తాను తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉంటానని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో మేం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తున్నామని.. జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, ఇతర మౌలికవసతుల ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తోందని వెల్లడించారు. 'ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బిడ్డగా నేను ఉద్యమాలు చేశా. అమరణ నిరాహార దీక్ష చేశా. బిల్లు పాసైన తర్వాతే దీక్ష విరమించా' అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వివరించారు.

ఎవరి సూచనలు అవసరం లేదు
తెలంగాణ విషయంలో, అభివృద్ధి విషయంలో ఎవరి సూచనలు తమకు అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. రూ.1.75 లక్షల కోట్లతో జాతీయ రహదారుల ప్రాజెక్టులు తెలంగాణలో నిర్మించామని.. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, 42 రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనులు ఇలా అనేక అభివృద్ధి పనులు చేశామని వెల్లడించారు. సికింద్రాబాద్, నాంపల్లి, చర్లపల్లి విషయంలో అభివృద్ధి పనుల కోసం భూసేకరణ కావాలని అడిగినా రేవంత్ రెడ్డి స్పందించలేదని ఆరోపించారు.

వడ్డీలేని రుణాలు
'ఎంఎంటీఎస్‌ ఫేజ్‌-2ను కేంద్ర నిధులతో నిర్మించాం. జహీరాబాద్ పారిశ్రామిక కారిడార్ వంటి ఎన్నో కార్యక్రమాలు తెలంగాణలో అమలు చేస్తున్నాం. ఏ ప్రభుత్వమైనా ఎలాంటి వివక్ష లేకుండా తమ సహకారం ఉంటుంది. రేవంత్ రెడ్డివి దిగజారుడు రాజకీయాలు. మేం ఉన్నన్ని రోజులు తెలంగాణ పురోగతికి కట్టుబడి ఉంటాం' అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. 'రూ.11వేల కోట్ల రుణాలను 50 ఏళ్ల కోసం వడ్డీలేని రుణాలు ఇచ్చింది. మూసీ పునరుజ్జీవనం కోసం ఏషియా డెవలప్‌మెంట్ బ్యాంకు నుంచి రూ.4,100 కోట్ల రుణం ఇప్పించాం. ఎస్‌సీడీసీ కోసం 12 ఏళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు ఇచ్చాం. ఈ ఏడాది ధాన్యం కొనుగోలుకు రూ.34 వేల కోట్లను అందించాం' అని వివరించారు. 

ఆ సంస్కృతి బీజేపీలో ఉండదు
ప్రాజెక్టులు ఆపే సంస్కృతి బీజేపీలో ఉండవని.. ఏదైనా చెప్పాలనుకుంటే.. ప్రాజెక్టు విషయంలో మార్పులు అవసరమైతే.. ధైర్యంగా చెబుతాం తప్ప.. ఇలా ప్రాజెక్టులను అడ్డుకోమని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రాజెక్టులకు సహకరిస్తామని.. అందులో సందేహం అక్కర్లేదని కుండబద్దలు కొట్టారు. దేశవ్యాప్తంగా అన్ని మెట్రోలు తీసుకున్న అప్పులను ముందే చెల్లించరు.. మెట్రో ఆదాయంలో.. ఆపరేషన్స్, మెయింటేనెన్స్‌కు ఖర్చు చేయాలని వివరించారు. ఆ తర్వాతే రుణాలు చెల్లించాలని చెప్పారు. ఆరు గ్యారంటీలపై వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి విమర్శించారు. 'కాంగ్రెస్‌ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీలు ఏమయ్యాయి? దాని గురించి ఏనాడూ మాట్లాడటం లేదు ఎందుకు?' అని ప్రశ్నించారు.

0
0
Report

Save The Tigers 3: ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3పై ప్రముఖుల రివ్యూ ఇదే!

Hyderabad, Telangana:

Save The Tigers Season 3 premiere: భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న తగాదాలను వినోదంగా మలచి తెరకెక్కించిన ‘సేవ్ ది టైగ‌ర్స్’ వెబ్‌ సిరీస్‌ సూపర్‌హిట్‌ నిలవగా.. మూడో సీక్వెల్‌ విడుదలకు సిద్ధమైంది. ఈనెల 19వ తేదీన విడుదలవుతున్న సందర్భంగా ప్రీమియర్‌ షో వేయగా.. చక్కటి స్పందన లభించింది. సరికొత్త సీజన్‌కు సంబంధించి పలువురు ప్రమఖులు తమ అభిప్రాయాలు పంచుకుని రివ్యూగా ఇచ్చారు. ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ఎలా ఉందో వారి మాటల్లో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో సోమవారం సాయంత్రం “సేవ్ ది టైగర్స్ సీజన్ 3” గ్రాండ్ ప్రీమియర్‌ నిర్వహించగా అద్భుతమైన స్పందన లభించింది. ప‌లువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. వారి న‌వ్వుల‌తో థియేటర్‌ సందడిగా మారింది. వెబ్‌ సిరీస్‌లోని నటీనటులు, సాంకేతిక బృందం, క్రియేటర్లతోపాటు అతిథులు, సెలబ్రిటీలు అంద‌రూ క‌లిసి ప్రీమియర్‌ షో చూశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెడ్ కార్పెట్లు, హై-ఫ్యాషన్‌లో సెలబ్రిటీలు మెరిశారు.

హాజరైన వారు వీరే..
సేవ్ ది టైగ‌ర్స్ 3 స్పెష‌ల్ సెల‌బ్రిటీ ప్రీమియ‌ర్ వేడుక‌లో యువ నటుడు సందీప్ కిషన్, సినీ ప్రముఖులు కామాక్షి భాస్కర్ల, రాగ్ మయూర్, బిగ్‌బాస్ తెలుగు 5 విజేత వీజే సన్నీ, సీజన్‌ 9 విజేత కల్యాణ్ పడాల, చైతన్య రావు, వెంకటేష్ కాకుమాను, కార్తీక్ రత్నం, ఆదిత్య మండల, శ్రీనాథ్ మాగంటి, జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్, నిరుపమ్, కిరీటి దామరాజు, మాన‌స్ తదితరులు పాల్గొని ప్రీమియ‌ర్‌ను చూసి తమ ఆనందాన్ని పంచుకున్నారు.

ఎప్పుడు రిలీజ్?
సేవ్‌ ది టైగర్‌ నటీనటులు ప్రియదర్శి, వెన్నెల కిషోర్, జోర్దార్ సుజాత, కృష్ణ చైతన్య, దేవియాని శర్మ, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి నటనకు ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన వ‌చ్చింది. మూడు జంటల కథతో పాటు ప్ర‌త్యేక‌మైన పాత్ర‌లో వెన్నెల కిశోర్ న‌టించిన ఈ సిరీస్‌ను ప్రేక్షకులు ఆదరించారు. జూన్ 19 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానున్న సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్‌-3కి కౌంట్‌డౌన్ ప్రారంభ‌మైంది.  రెండు ప్రపంచాలు ఢీకొట్టేలా చేసిన గర్జన! దీనిని దేవుడి ప్లాన్ అనాలా, లేక విధి అనాలా!… అంటూ ప్రొమోలతో ప్రేక్షకులను వెబ్‌సిరీస్‌ ఆకర్షిస్తోంది. ఓటీటీల్లో వీక్షణలప‌రంగా సేవ్ ది టైగర్స్ అతిపెద్ద తెలుగు వెబ్ సిరీస్‌గా నిలిచింది. తొలి రెండు సీజన్స్‌లు కామెడీ, ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లు, ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకున్నాయి. రెండు సీజన్‌లు ఊహించని విజయం పొందడంతో సీజ‌న్‌-3పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ కొత్త సీజ‌న్ ఎలా ఉంటుంది? మూడు జంటలు ఏం చేయబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

0
0
Report
Advertisement

The Suraka School: కొల్లూరులో ది సురాకా స్కూల్ కొత్త అకడమిక్ బ్లాక్ ప్రారంభం

Hyderabad, Telangana:

The Suraka School: సీబీఎస్‌ఈ, కేంబ్రిడ్జ్ పాఠ్యాంశాలను ఒకే వేదికపై అందిస్తూ విద్యా సంస్థల్లో విశేష గుర్తింపు పొందిన ది సురాకా స్కూల్ - ఫ్యూచురా ఎక్సలెన్స్ తన అత్యాధునిక క్యాంపస్‌లో కొత్తగా అకడమిక్ బ్లాక్‌ను ప్రారంభించుకుంది. హైదరాబాద్‌ శివారులోని కొల్లూరు పాఠశాల ప్రాంగణంలో అకడమిక్‌ బ్లాక్‌ను ప్రారంభించుకుని విద్యార్థులకు అత్యుత్తమ విద్యా బోధన అందించేందుకు సిద్ధమైంది. భవిష్యత్‌కు అనుగుణమైన, విలువల ఆధారిత విద్యను అందించాలనే సంస్థ లక్ష్యానికి ఈ ప్రారంభోత్సవం ఒక కీలక ఘట్టంగా నిలిచిందని ది సురాకా స్కూల్‌ యాజమాన్యం తెలిపింది. అట్టహాసంగా జరిగిన ఈ అకడమిక్‌ బ్లాక్‌ ప్రారంభోత్సవంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేశ్‌, మాజీ డీజీపీ ఎన్. సాంబశివరావు ముఖ్య అతిథులుగా హాజరై అకడమిక్‌ బ్లాక్‌ను ప్రారంభించారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ రమేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలు  అంకితభావంతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. నాణ్యమైన విద్య సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. మాజీ డీజీపీ  సాంబశివరావు మాట్లాడుతూ.. 'భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దడంలో విద్యాసంస్థల పాత్ర ఎంతో కీలకం. విద్య, విలువలు, ఆవిష్కరణ  వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యం ఇచ్చే విద్యా వాతావరణాన్ని సృష్టించారు' అని పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం జరిగిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థుల మార్చ్‌పాస్ట్ కలర్ పార్టీ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. క్యాంపస్‌లో భారత క్రికెట్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన క్రిక్‌కింగ్‌డమ్ క్రికెట్ అకాడమీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాల క్రీడా మౌలిక సదుపాయాలు  నిపుణుల శిక్షణను అందిస్తుంది.

ది సురాకా స్కూల్ – ఫ్యూచురా ఎక్సలెన్స్ అకాడమిక్ బ్లాక్ ప్రారంభం భవిష్యత్‌కు అనుగుణమైన విద్య, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, విలువల ఆధారిత బోధన, అనుభవాత్మక అభ్యాసం  సమగ్ర వికాసం వైపు సంస్థ చేస్తున్న ప్రయాణంలో ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచింది. ఈ కార్యక్రమంలో మాజీ ఐసీఎల్ఎస్ అధికారి డాక్టర్ డి. విజయ భాస్కర్, ది వింటేజ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మహమ్మద్ తాహిర్, ది కాశ్మీర్ ఫైల్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్, టీసీఎస్‌  హైదరాబాద్- సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వి. చెన్నారెడ్డి, హెక్సాగాన్ సీఈఓ భల్లవ్ ముండ్రా, వ్యవస్థాపక ప్రిన్సిపాల్ అకడమిక్ డైరెక్టర్ మరుతీ రాంప్రసాద్ పెళ్లూరి హాజరయ్యారు.

డ్జోనియా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ద్వారా 12 సంవత్సరాలకు పైగా విద్యారంగ అనుభవాన్ని కలిగి ఉన్న పాఠశాల వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ నిలోఫర్ షేక్ ఆధ్వర్యంలో పాఠశాల కొనసాగుతోంది. సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ షాహిద్ షేక్‌తోపాటు డైరెక్టర్లు సుభాష్ దాభాడే  శ్యామ్ సుందర్ మోదాని మార్గదర్శకత్వంలో సురాకా పాఠశాల వ్యవహారాలు కొనసాగుతున్నాయి. వారి తమ దూరదృష్టి, మార్గదర్శకత్వంతో విద్యా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు.

సురాకా అంటే?
సురాకా అనే పదం సంస్కృతంలో పవిత్ర జ్ఞానం అనే అర్థాన్ని సూచిస్తుంది. విద్యా ప్రావీణ్యం, ఆవిష్కరణ, వ్యక్తిత్వ వికాసం సమగ్ర అభివృద్ధి కలిసిన ఒక రూపాంతరాత్మక విద్యా వాతావరణాన్ని సృష్టించాలనే లక్ష్యంతో ఈ విద్యాసంస్థకు సురాకా అనే పేరు పెట్టారు.

క్యాంపస్‌లో ప్రత్యేక సదుపాయాలు
రోబోటిక్స్ ల్యాబ్, వండర్ ల్యాబ్, సుకూన్ ల్యాబ్

దరఖాస్తులు ప్రారంభం
2026–27 విద్యా సంవత్సరానికి సీబీఎస్‌ఈ, కేంబ్రిడ్జి ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. భవిష్యత్‌కు సిద్ధం చేసే.. విలువలతో కూడిన విద్యను కోరుకునే తల్లిదండ్రులు కొల్లూరులోని పాఠశాలను సందర్శించవచ్చు. క్యాంపస్ టూర్‌ను బుక్ చేసుకోవచ్చు లేదా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు వెబ్‌సైట్:
www.thesurakaschool.com సందర్శించవచ్చు

0
0
Report

Tecno కొత్త సంచలనం.. భారీ బ్యాటరీ, అడ్వాన్స్‌డ్ AI ఫీచర్లతో Tecno Spark 50 Pro లాంచ్..

Hyderabad, Telangana:

Tecno Spark 50 Pro Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ టెక్నో (Tecno) తన స్పార్క్ సిరీస్‌ను మరింత విస్తరిస్తూ మార్కెట్లోకి సరికొత్త మొబైల్‌ను లాంచ్‌ చేసింది.. అద్భుతమైన ఫీచర్లతో పాటు శక్తివంతమైన కెమెరాతో టెక్నో స్పార్క్ 50 ప్రో (Tecno Spark 50 Pro) స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఇది అధునాతన మీడియాటెక్ ప్రాసెసర్‌తో పాటు చాలా ప్రత్యేకమైన కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అద్భుతమైన డిస్‌ప్లే..
ఈ Tecno Spark 50 Pro స్మార్ట్‌ఫోన్‌ ఎంతో ప్రత్యేకమైన 6.78 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.. అంతేకాకుండా దీనికి తోడు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండటం విశేషం..  అయితే, ఇది డిస్ల్పే పరంగా ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రావడం వల్ల  గేమింగ్, వీడియోలు చూసేటప్పుడు డిస్‌ప్లే ఎంతో స్మూత్‌గా, స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇందులో SGS ఫైవ్-స్టార్ ప్రీమియం డ్రాప్ రెసిస్టెన్స్ సపోర్ట్‌ కూడా అందుబాటులో ఉంది. దీని వల్ల ఫోన్ పొరపాటున కింద పడినా త్వరగా పాడవ్వదని కంపెనీ క్లైమ్‌ చేస్తూ వస్తోంది..

50MP సోనీ కెమెరా.. 
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం టెక్నో కంపెనీ చాలా అద్భుతమైన కెమెరా సెటప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీని వెనక భాగంలోని కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ LYT-600 ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన ఫోటోలను క్లిక్ చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో ఫ్రంట్‌లో భాగంగా అద్భుతమైన  8 మెగాపిక్సెల్ కెమెరాను అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు కంపెనీ తెలిపింది. 

శక్తివంతమైన ప్రాసెసర్‌..
టెక్నో స్పార్క్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ హెలియో G100 అల్టిమేట్ (Helio G100 Ultimate) చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతున్నట్లు కంపెనీ తెలిపింది.. ఈ ఫోన్‌లో ఎంతో ప్రత్యేకమైన ఎల్లా AI ఏజెంట్‌తో పాటు AI హెల్త్ అసిస్టెంట్, AI రైటింగ్, AI నాయిస్ క్యాన్సలేషన్, AI ఎరేజర్ 2.0 వంటి ఎన్నో రకాల అడ్వాన్స్‌డ్ AI టూల్స్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

భారీ బ్యాటరీ.. 
ఈ స్మార్ట్‌ఫోన్‌ మొత్తం రెండు బ్యాటరీ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. ఇందులో మొదటి ఆప్షన్‌  5,600mAh ఉండబోతోంది. అంతేకాకుండా రెండవది 6,000mAh బ్యాటరీ ఆప్షన్లలో లభించనుంది. దీనికి 60W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఫీచర్‌ కూడా అందుబాటులో ఉండడం విశేషం.. అలాగే కేవలం 30 నిమిషాల్లోనే 63 శాతం వరకు బ్యాటరీ ఫుల్‌ అవుతుంది. దీంతో పాటు ఇందులో కంపెనీ  IP68తో పాటు IP69 రేటింగ్స్ ఇచ్చారు.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Redmi Turbo 5: రూ.38 వేలకే ఐఫోన్ రేంజ్ ఫీచర్స్.. 7540mAh బ్యాటరీతో సరికొత్త Redmi Turbo 5 లాంచ్!

Hyderabad, Telangana:

Redmi Turbo 5 India Launch News: భారతదేశ మొబైల్ మార్కెట్లోకి రెడ్‌మి (Redmi) సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. దీనిని కంపెనీ రెడ్‌మి టర్బో 5 (Redmi Turbo 5) స్మార్ట్‌ఫోన్‌ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది చైనాలో విడుదలైన కొద్ది రోజులకే భారత మార్కెట్‌లోకి అందుబాటులోకి రావడం విశేషం.. అయితే, దీనిని కంపెనీ రూ.34 వేల నుంచి రూ.38 వేల బడ్జెట్‌ విభాగంలో ఐఫోన్ రేంజ్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ ప్రియులను ఆకట్టుకునేందుకు ఇది సిద్ధమైంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ధర వివరాలు..
భారతదేశంలో రెడ్‌మి టర్బో 5 బేస్ వేరియంట్ (8GB RAM + 256GB స్టోరేజ్) ధర రూ. 37,999 నుంచి ప్రారంభమవుతుంది.. ఈ స్మార్ట్‌ఫోన్ అస్ఫాల్ట్ బ్లాక్, నైట్రో బ్లూతో పాటు టర్బో వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది.. కస్టమర్లు ఈ మొబైల్‌ను ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ (Amazon India)తో పాటు Mi.com, అధికారిక స్టోర్ల ద్వారా కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది.. అంతేకాకుండా మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

కళ్లు చెదిరే డిస్‌ప్లే.. 
ఈ రెడ్‌మి టర్బో 5 ఫోన్‌లో 6.59-ఇంచుల 1.5K అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌తో పాటు 3,500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది.. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా, ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది.. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఇచ్చారు. అంతేకాకుండా, ధూళి మరియు నీటి నుండి రక్షణ కోసం అత్యుత్తమమైన IP66, IP68, IP69 మరియు IP69K రేటింగ్స్‌ను కలిగి ఉండటం విశేషం.

సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్.. 
గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం ఇందులో శక్తివంతమైన ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా (MediaTek Dimensity 8500 Ultra) చిప్‌సెట్‌ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది.. ఇది గరిష్టంగా 3.4GHz క్లాక్ స్పీడ్‌ను అందిస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3 (HyperOS 3)పై  ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇందులో అడ్వాన్స్‌డ్ AI ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది..

7,540mAh మెగా బ్యాటరీ.. 
రెడ్‌మి టర్బో 5 స్మార్ట్‌ఫోన్‌లో అతిపెద్ద హైలైట్ దీని బ్యాటరీ.. ఇందులో కంపెనీ ఏకంగా శక్తివంతమైన 7,540mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి తీసుకు వచ్చింది.. దీనికి తోడు 100W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఫీచర్‌ కూడా లభిస్తోంది. ఇది ఫోన్‌ను చాలా త్వరగా చార్జ్ చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది.. అలాగే 27W రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. దీని ద్వారా ఇతర డివైజ్‌లను కూడా ఎంతో సులభంగా చార్జ్ చేసుకుని సదుపాయం లభిస్తుంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

50MP అల్ట్రా కెమెరా..
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది.. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్‌తో కూడిన మోస్ట్ పవర్‌ఫుల్‌ 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రధాన కెమెరాతో పాటు అదనంగా శక్తివంతమైన 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాలు కూడా లభిస్తున్నాయి. ఇక ఫ్రంట్‌ భాగంలో సెల్ఫీల కోసం 20-మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

 

0
0
Report
Advertisement

Sircilla: అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర.. దుర్గమ్మకు సిరిసిల్ల నేతన్న అద్భుత కానుక..

Hyderabad, Telangana:

Sircilla Matchbox Silk Saree: మన భారతీయ చేనేత కళా వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే.. మరో అద్భుతమైన అరుదైన ఘట్టం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆవిష్కృతమైంది. అగ్గిపెట్టెలో పట్టే.. అత్యంత సూక్ష్మమైన, అరుదైన పట్టుచీరను ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ఓ భక్తుడు భక్తిశ్రద్ధలతో సమర్పించారు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కార్మికుడు.. చేనేత కళారత్న అవార్డు గ్రహీత నల్ల విజయ్ కుమార్ తన చేతులతో మగ్గంపై అద్భుతంగా నేసిన ఈ ప్రత్యేక పట్టుచీరను మంగళవారం అమ్మవారికి కానుకగా అందించారు.

వారం రోజుల శ్రమ.. 
ఈ అద్భుతమైన లలిత కళాఖండాన్ని రూపొందించడానికి విజయ్‌ కుమార్‌ దాదాపు వారం రోజుల పాటు రాత్రి పగలు మగ్గంపై శ్రమించారు.. ఈ  పట్టుచీర పొడవు 5.5 మీటర్లు కాగా..వెడల్పు 48 అంగుళాలు ఉంది. ఇంత పెద్ద చీర అయినప్పటికీ.. దీని మొత్తం బరువు కేవలం 200 గ్రాములు మాత్రమే కావడం విశేషం.. సాంప్రదాయ ఇక్కత్‌ డిజైన్‌తో.. అత్యంత అద్భుతంగా.. ఆకర్షనీయమైన రంగులతో నేసిన ఈ చీరను మడత పెడితే.. ఒక చిన్న అగ్గిపెట్టేలో సులువుగా పడుతుంది. సిరిసిల్ల నేతన్నల మంచి నైపుణ్యానికి ఈ చీర నిదర్శనమని చెప్పొచ్చు..

అమ్మవారు కనకదుర్గమ్మపై ఉన్న భక్తితో.. మా సిరిసిల్ల చేనేత కళా వైభవాన్ని అమ్మవారి పాదాల చెంత ఉంచాలనే సంకల్పంతో ఈ చీరను నేచారని చేనేత కళారత్న నల్ల విజయ్ కుమార్ తెలిపారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న విజయ్ కుమార్.. దుర్గమ్మ ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్‌ను కలిసి ఈ పట్టుచీరను అధికారికంగా అందజేశారు.. ఒక చిన్న అగ్గిపెట్టెలోంచి 5.5 మీటర్ల పట్టుచీరను బయటకు తీసి చూపిస్తుంటే ఆలయ అధికారులతో పాటు అర్చకులు, అక్కడున్న భక్తులు ఆశ్చర్యపోతున్నట్లు తెలుస్తోంది.. 

ఇంతటి చాలా అద్భుతమైన కళాఖండాన్ని అమ్మవారికి సమర్పించిన విజయ్ కుమార్‌ను ఈవో శీనా నాయక్ శాలువాతో సత్కరించి.. అమ్మవారి ప్రసాదాన్ని అందించి ప్రత్యేకంగా అభినందించారు. తాజాగా ఈ వార్తకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు సిరిసిల్లకు చెందిన చాలా మంది చేనేతలు ఇలాంటి చీరలను ఎన్నో నేచారు. అంతేకాకుండా చాలా మంది విదేశీయులు కూడా ఇలాంటి చీరలను కొనుగోలు చేసిన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి చీరలను చాలా అరుదుగా మాత్రమే నేస్తారు.  

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Cobra Video: శివలింగంపై కోబ్రా.. ప్రాణాలకు తెగించి అభిషేకం చేసిన మహిళ.. వీడియో..

Hyderabad, Telangana:

 Cobra Abhishekam Viral Video: హిందువుల మహా భక్తికి హద్దులు ఉండవని అంటూ ఉంటారు. కానీ ఇక్కడొక భక్తరాలు ఏకంగా తన ప్రాణాలనే పణంగా పెట్టి.. శివునిపై ఉన్న భక్తిని చూటుకుంది. సాధారణంగా పాము కనిపిస్తేనే కాళ్లూ చేతులూ వణికిపోతుతూ ఉంటాయి. అలాంటిది అత్యంత ప్రమాదకరమైన నాగుపాముకు ఓ మహిళ భయపడకుండా అభిషేక్ చేసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌ చల్‌ చేస్తున్నాయి. దీనికి సంబంధించి వీడియో చూసిన నెటిజన్స్‌ ఒక్కసారిగా షాక్‌ అవుతున్నారు. ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శివలింగంపై నాగుపాము..
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడిమో ప్రకారం.. ఒక శివాలయంలోని శివలింగంపై పెద్ద నాగుపాము పడగ విప్పి కూర్చిని ఉంది. అయితే, దాన్ని చూసి భయపడి పారిపోవాల్సింది పోయి.. అక్కడ ఉన్న ఇద్దరు భక్తులు ఆ స్వామికి అభిషేక్‌ చేయడం ప్రారంభించారు. అయితే, అక్కడే అసలైన ట్విస్ట్ ఉంది.. ఆ ఇద్దరిలో ఒక మహిళా భక్తురాలు ఏకంగా ఈ విషపూరితమైన కోబ్రా పడగను చేతులతో పట్టుకుని ఉండడం మీరు ఈ వీడియో క్లియర్‌గా చూడొచ్చు.. 

మరో భక్తుడు శివలింగంతో పాటు ఆ నాగుపాము తలపై నీళ్లు పోస్తూ అభిషేకం చేస్తుండగా.. సదరు మహిళ పామును కదలకుండా పట్టుకుని సహకరించడం మీరు ఈ వీడియోలో క్లయర్‌గా చూడొచ్చు.. ఆ పాము కూడా ఎలాంటి హాని చేయకుండా ప్రశాంతంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్‌ వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. కొంతమంది శివునిపై నమ్మకంతోనే ఆమె అలా చేయగలిగిందని కామెంట్స్‌ చేస్తుంటే.. మరికొంతమంది ఇది భక్తి కాదు, మూఢనమ్మకం.. ప్రాణాలతో చెలగాటం.. అంటూ మరికొందరు మండిపడుతున్నారు. చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

 
 
 
 
 

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు తీశారనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఏది ఏమైనప్పటికీ, ఈ నాగుపాము అభిషేకం వీడియో మాత్రం ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఈ అరుదైన, ఆశ్చర్యం కలిగించే వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే ఆలస్యం.. క్షణాల్లో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను bass.bhaskaran's అనే ఇన్‌స్టా అకౌంట్‌ నుంచి పోస్ట్‌ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియో 66 వేల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు లైక్‌ చేశారు. చాలా మంది వీక్షించిన్నట్లు తెలుస్తోంది. 

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

  

0
0
Report

Cobra Vs Rat Video: పాముకే చుక్కలు చూపించిన ఎలుక.. ఒకే డ్రమ్ములో కింగ్ కోబ్రా, ఎలుక ఫైట్ వీడియో వైరల్..

Hyderabad, Telangana:

 Cobra Vs Rat Video Watch Here: ప్రమాదకరమైన కింగ్‌ కోబ్రాలు కనిపిస్తేనే ఎలుకలు ప్రాణభయంలో పరుగులు తీస్తూ ఉంటాయి. మానవులు సైతం పరుగులు తీస్తూ ఉంటారు. అలాంటిది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన కింగ్‌ కోబ్రాతో ఓ ఎలుక తలపడితే.. ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? వినడానికే వింతగా ఉన్నప్పటికీ ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒకే ప్లాస్టిక్‌ డ్రమ్ములో చిక్కుక్కున్న కింగ్‌ కోబ్రాతో పాటు ఎలుక వీడియోకి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వీడియోలో అసలేం జరిగిందంటే..?
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక పెద్ద నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్ములో ప్రమాదవశాత్తు ఒక కింగ్ కోబ్రా, ఒక ఎలుక చిక్కుకుని ఉండడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు.. డ్రమ్ లోపల స్థలం తక్కువగా ఉండటంతో ఒకదానికొకటి ఎదురుపడక తప్పలేని సంర్భంగా కూడా గమనించవచ్చు.. సాధారణంగా పామును చూడగానే పారిపోయే ఎలుక, ఇక్కడ తప్పించుకునే దారి లేకపోవడంతో చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది..

కింగ్ కోబ్రా తన పడగ విప్పి ఎలుకపై దాడి చేయడానికి ప్రయత్నించడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు. అయితే, ఆ ఎలుక ఏమీ భయపడకుండా.. తన ప్రాణాలను కాపాడుకోవడానికి కోబ్రాపై ఎదురుదాడికి దిగడం మీరు గమనించవచ్చు.. పాము కాటు వేయడానికి ప్రయత్నించిన ప్రతిసారీ ఎలుక గాల్లోకి ఎటూ తప్పించుకుంటూ.. వీలైతే పాముపైనే దాడి చేస్తూ ఉండడం మీరు చూడొచ్చు..

 
 
 
 
 

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

నెటిజన్ల షాక్.. 
ఈ ఊహించని వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా ఈ వీడియోపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. పరిస్థితి ఎదురైతే ఎంతటి బలహీనుడైనా సింహంలా పోరాడతాడని ఈ ఎలుక నిరూపించిందని ఒకరు కామెంట్ చేయగా.. లక్, టైమింగ్ బాగుంటే కింగ్ కోబ్రా నుంచి కూడా ప్రాణాలతో బయటపడొచ్చని ఈ వీడియో చూస్తే అర్థమవుతోందని మరొకరు పేర్కొన్నారు. సాధారణంగా కోబ్రా ఒకసారి కాటు వేస్తే.. ఏనుగు అయినా సరే కొన్ని నిమిషాల్లో ప్రాణాలు కోల్పోతుంది. అలాంటిది ఆ డ్రమ్ములో ఎలుక చూపించిన ధైర్యం, చాకచక్యం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

  

0
0
Report
Advertisement
Advertisement
Back to top