icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
504251
KASARLA RAMESHKASARLA RAMESHFollow4 Sept 2024, 03:56 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

NIMS Hospital: నిమ్స్‌లో 100 రోబోటిక్ సర్జరీలు.. వైద్య బృందానికి తెలంగాణ సీఎం ప్రశంసలు

Hyderabad, Telangana:

Robotic Surgeries In NIMs: పేదల ఆస్పత్రిగా పేరుగాంచిన నిమ్స్ ఆస్పత్రి అరుదైన ఘనత సాధించింది. నిమ్స్‌లో రెండున్నరేళ్లలో వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తయ్యాయి. అత్యంత ఖరీదైన ఈ సర్జరీలు పూర్తి చేసుకోవడంతో వైద్య సిబ్బందిపై ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ వెయ్యి శస్త్రచికిత్సలు పూర్తి చేసిన వైద్య సిబ్బందికి తెలంగాణ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. వైద్య నిపుణులు, వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత సాధించినందుకు నిమ్స్​ డైరెక్టర్​ రాహుల్​ దేవరాజ్​తో పాటు వైద్య బృందం,  నర్సింగ్ సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ బృందానికి అభినందనలు తెలిపారు. 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనేతమ ప్రభుత్వ సంకల్పం నెరవేరిందని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు. నిమ్స్​ లో ఇప్పటివరకు నిర్వహించిన రొబోటిక్ సర్జరీల్లో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా నిర్వహించడం ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయమని సీఎం పేర్కొన్నారు.  ఇటీవలే రెండు వేల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను పూర్తి చేసిన నిమ్స్, ఇప్పుడు వెయ్యి రొబోటిక్ సర్జరీల మైలురాయిని చేరుకోవటం ద్వారా కొత్త రికార్డు నెలకొల్పిందని తెలిపారు. వైద్య రంగంలో నిమ్స్ మరిన్ని మైలురాళ్లు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

నిమ్స్ ఆస్పత్రి అరుదైన ఘనతపై సంబంధిత శాఖ మంత్రి దామోదర రాజానర్సింహా స్పందించారు. ‘ప్రభుత్వ వైద్యరంగంలో నిమ్స్ మరో ఘనత సాధించింది. నిమ్స్‌లో 1,000 రొబోటిక్ సర్జరీలు పూర్తయ్యాయి. రెండున్నరేళ్లలోనే వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సల మైలురాయి‘ అని చెప్పిన మంత్రి దామోదర్ రాజనర్సింహ నిమ్స్ వైద్య బృందాన్ని అభినందించారు. ‘90% రొబోటిక్ సర్జరీలు ఆరోగ్యశ్రీ, CMRF ద్వారా ఉచితం. యూరాలజీలో అత్యధికంగా 590 రొబోటిక్ సర్జరీలు. గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో 248 శస్త్రచికిత్సలు. సర్జికల్ ఆంకాలజీలో 162 రొబోటిక్ సర్జరీలు‘ అని మంత్రి వెల్లడించారు. దక్షిణ భారత ప్రభుత్వ రంగంలో తొలి రొబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేసింది నిమ్స్ ఆస్పత్రి అని ప్రకటించారు. నిమ్స్ తర్వాత ఎంఎన్‌జేలోనూ విజయవంతంగా రొబోటిక్ సర్జరీలు జరిగాయని వివరించారు. ‘గాంధీ, కొత్త ఉస్మానియా, కొత్త టిమ్స్ ఆస్పత్రుల్లో రొబోటిక్ ఓటీలు. ప్రపంచ స్థాయి వైద్య సేవలను ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందించడమే లక్ష్యం‘ అని మంత్రి రాజనర్సింహ ప్రకటించారు. అత్యాధునిక వైద్య సేవల విస్తరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

0
0
Report

తాగునీటి ఎద్దడి సమస్యపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశం

Amaravathi, Andhra Pradesh:

Drinking Water Problem: తాగునీటి సమస్యపై అధికార యంత్రాంగానికి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎల్‌నినో పరిస్థితుల కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి సమస్యపై దృష్టిపెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులను, రిజర్వాయర్లలో, నీటి వనరుల్లో నీటి లభ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. 

అమరావతిలోని సచివాలయంలో ఉన్న ఆర్టీజీఎస్ సెంటర్‌లో సోమవారం వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎగువన వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు వివరించారు. కృష్ణానదిలో కొద్ది రోజులుగా ప్రవాహాలు మొదలవడంతో ఆ నీటి వినియోగంపై ఆదేశాలు ఇచ్చారు. గోదావరిలో వరద పరిస్థితిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. 

కృష్ణా బేసిన్‌లో ఎగువ నుంచి వచ్చే వరదను సద్వినియోగం చేసుకునేలా నీటి నిర్వహణ చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వర్షాభావంతో రానున్న రోజుల్లో పశుగ్రాసం కొరత వచ్చే అవకాశం ఉందని.. దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. మున్సిపాల్టీలు, గ్రామీణ ప్రాంతాల్లో తరుచూ తాగునీటి పరీక్షలు చేయాలని.. ల్యాబ్ టెస్టుల నివేదికలను విడుదల చేయాలని సూచించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

రవాణా శాఖలో పూర్తి స్థాయి టెక్నాలజీ వినియోగం, అనవసర నిబంధనల తొలగింపు వంటి అంశాలకు తీసుకుంటున్న చర్యలను సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. 24 గంటల్లో డీమ్డ్ రిజిస్ట్రేషన్ విధానం, ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్స్, ఫారం-5B వంటి పరీక్షలను తొలగించడం వంటి చర్యల ద్వారా అవినీతిని తగ్గించడం, సులభతర సేవలను అందించే అవకాశం కలుగుతుందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. దశలవారీగా రవాణా శాఖలో ఈ సంస్కరణలు చేపట్టేలా తాము ప్రణాళికను సిద్దం చేశామని తెలిపారు. వీలైనంత మేరకు అనవసర నిబంధనలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.

0
0
Report

Bigg Boss 10: తెలుగు బిగ్‌బాస్‌లోకి స్టార్ హీరో లవర్‌ బాయ్..టీఆర్పీ రేటింగ్ రికార్డు బ్రేక్ చేయడం ఖాయం!

Hyderabad, Telangana:

Bigg Boss 10 Telugu Actor Abbas: తెలుగు బుల్లితెరపై అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంచింగ్‌కు రంగం సిద్ధమవుతోంది. ఇది ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో షో నిర్వహకులు భారీ మార్పులు, సరికొత్త నిబంధనలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్ల ఎంపికపై సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వైరల్ అవుతున్నాయి.

వినిపిస్తున్న సెలబ్రిటీల పేర్లు..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో పల్లవి గౌడ, ఎక్స్‌ప్రెస్ హరి, తేజస్విని గౌడ, జబర్దస్త్ నూకరాజు, ఆట సందీప్ సతీమణి జ్యోతి, రాకింగ్ రాకేష్, ఇన్‌ఫ్లుయెన్సర్ నందు, శివ్, రాయల్ ఎంసీ రమణ, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, పవిత్ర, వర్ష, వర్షిణీ తదితరుల పేర్లు కంటెస్టెంట్ల జాబితాలో వినిపిస్తున్నాయి. అయితే వీటన్నింటికంటే ముఖ్యంగా ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరో పేరు తెరపైకి రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

బిగ్‌బాస్‌లోకి 'ప్రేమ దేశం' హీరో అబ్బాస్?
ఒకప్పుడు 'ప్రేమ దేశం' సినిమాతో యూత్ ఫేవరెట్ హీరోగా ఓ వెలుగు వెలిగిన హ్యాండ్సమ్ హీరో అబ్బాస్ ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగు, తమిళ భాషల్లో సుమారు 50కి పైగా చిత్రాల్లో నటించిన అబ్బాస్, సినిమాలకు దూరమై విదేశాల్లో స్థిరపడ్డారు. ఇటీవల సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆయన, కొన్ని ప్రాజెక్ట్‌లతో మళ్లీ కెరీర్‌పై దృష్టి పెట్టారు.

ఈ నేపథ్యంలో అబ్బాస్ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఆయన్ని బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకువచ్చేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ నిజంగానే అబ్బాస్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇస్తే మాత్రం షో రేంజ్ మారిపోవడంతో పాటు టీఆర్పీ రికార్డులు బద్దలవడం ఖాయమని టెలివిజన్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది తెలియాలంటే బిగ్‌బాస్ గ్రాండ్ లాంచ్ వరకు వేచి చూడాల్సిందే!

Also Read: భర్తపై కేసు పెట్టిన ఉదయ్ కిరణ్ హీరోయిన్..అత్తమామలు చావకొడుతున్నారని పోలీసు ఫిర్యాదు

Also Read: "ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఇష్టమొచ్చింది పోస్ట్ చేస్తా" మూవీ ఈవెంట్‌లో అనుపమ షాకింగ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Aditi Sharma Harassment: భర్తపై కేసు పెట్టిన ఉదయ్ కిరణ్ హీరోయిన్..అత్తమామలు చావకొడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు!

Mumbai, Maharashtra:

Aditi Sharma Husband Harassment: దివంగత నటుడు ఉదయ్ కిరణ్ సరసన 'గుండె ఝల్లుమంది' సినిమాలో హీరోయిన్‌గా నటించిన అదితి శర్మ గుర్తుందా? చాలా ఏళ్ల తర్వాత ఈ నటి మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి ఏ సినిమా ప్రమోషనో అయితే కాదు. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలతో పాటు బుల్లితెర సీరయల్స్‌లో నటిగా మంచి గుర్తింపు పొందిన అదితి శర్మ తాజాగా తన భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులపై గృహహింస ఫిర్యాదు చేసి ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ముంబై పోలీసులు ప్రస్తుతం ఈ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు.

ఏం జరిగింది?
నటి అదితి శర్మ తన భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులపై గృహహింస కేసును నమోదు చేయించింది. ఆమె ఫిర్యాదు చేసిన వివరాల ప్రకారం.. జూలై 31న గోరేగావ్ పోలీస్ స్టేషన్‌లో ఆమె భర్త అభినిత్ విద్యానంద్ కౌశిక్, అత్త ఊర్మిళా కౌశిక్ (65), ఆడపడుచు కీర్తి కౌశిక్ (29)లపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదైంది. పోలీసులు ఈ ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించారు. శారీరక, మానసిక వేధింపులు, గృహహింస, దాడి, దూషించడం, తన శీలతను ప్రశ్నించడం, తన 'స్త్రీధనం' (వివాహ సమయంలో లభించిన ఆభరణాలు) దుర్వినియోగం చేయడం వంటి ఆరోపణలను అదితి వారిపై చేశారు.

అదితి జూన్ 2021లో ఒక ఆన్‌లైన్ యాక్టింగ్ క్లాస్ సమయంలో అభినిత్‌ను మొదటిసారి కలిశారు. స్నేహితులుగా మారిన తర్వాత, వారు ప్రేమలో పడ్డారు. 2025 జనవరి 1న జరిగిన ఒక సంఘటనను కూడా ఈ ఫిర్యాదులో ప్రస్తావించారు. కాఫీ విషయంలో జరిగిన వాదన దూషణలకు దారితీసిందని అందులో పేర్కొన్నారు. అదితి శర్మ ఫిర్యాదు మేరకు.. గోరేగావ్ పోలీసులు ఆమె భర్త, అత్త, ఆడపడుచుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మోడలింగ్‌లో ప్రయత్నాలు చేసిన తర్వాత ఆమె తన మూవీ కెరీర్‌ను ప్రారంభించింది. అదితి తన పాఠశాల విద్యను ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలో ఉన్న హన్స్‌రాజ్ మోడల్ స్కూల్‌లో పూర్తి చేశారు. ఆమె మొదట 2017లో గురు రంధవాతో కలిసి 'తారే' అనే మ్యూజిక్ వీడియోలో కనిపించారు.

అదితి శర్మ ఎవరు?
నటి అదితి శర్మ 2006లోనే బుల్లితెరపై తన నటనా ప్రయాణాన్ని మొదలుపెట్టిన అదితి.. 2007లో సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తెలుగులో ఉదయ్ కిరణ్ హీరోగా తెరకెక్కిన 'గుండె ఝల్లుమంది' సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత నిఖిల్ సిద్ధార్థ్, నవ్‌దీప్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన 'ఓం శాంతి' సినిమాలోనూ ఓ హీరోయిన్‌గా అలరించింది. చివరిగా 2011లో విడుదలైన 'బబ్లూ' ఈమె నటించిన చివరి తెలుగు చిత్రం కావడం గమనార్హం. అయితే ఈమె కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, పంజాబీ చిత్రాల్లో నటించింది.

Also Read: బాలీవుడ్ హీరోయిన్ల బాడీ పార్ట్స్‌పై సీక్రెట్ టాటూలు..వాటిలో అర్థం అంత ఉందా?

Also Read: సీక్రెట్‌గా టాలీవుడ్ నటి నిశ్చితార్థం! 'గద్దలకొండ గణేష్' హీరోయిన్ కాబోయే భర్త ఇతనే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Sravana Masam Snakes: శ్రావణ మాసంలో పాములు ఎక్కువగా ఎందుకు కనిపిస్తాయి? అసలు కారణాలు ఇవే!

Hyderabad, Telangana:

Sravana Masam Snakes Rituals: హిందూ మాసాలలో శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ పవిత్ర మాసంలో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తారు. అయితే, శ్రావణ మాసం అనగానే అందరికీ శివారాధనతో పాటు మరో విషయం కూడా గుర్తుకు వస్తుంది. అదే.. ఈ కాలంలో పాములు ఎక్కువగా కనిపించడం! మనం చిన్నప్పటి నుంచి ఈ మాట వింటూనే ఉంటాము. అసలు శ్రావణ మాసంలోనే పాములు బయటకు రావడానికి గల శాస్త్రీయ, మతపరమైన కారణాలు ఏమిటో తెలుసుకుందాం.

శాస్త్రీయ కారణాలు..
శ్రావణ మాసంలో అనగా ఆగస్టులో (వర్షాకాలంలో) వానా కాలం తీవ్రస్థాయిలో ఉంటుంది. విపరీతమైన వర్షాల కారణంగా పాములు ఎక్కువగా కనిపించడం వెనుక కొన్ని బలమైన ప్రాకృతిక కారణాలు ఉన్నాయి.

1) శ్రావణ మాసంలో విస్తృతంగా కురిసే వర్షాల కారణంగా, పాములు నివసించే పుట్టలు, బొరియలలోకి నీరు చేరుతుంది. దీనివల్ల వాటికి శ్వాస తీసుకోవడం కష్టమై, సురక్షితమైన పొడి ప్రదేశాల కోసం అవి బయటకు వస్తాయి.

2) వర్షాకాలం కప్పలకు సంతానోత్పత్తి కాలం కావడంతో, కప్పలు విపరీతంగా తిరుగుతుంటాయి. పాములకు కప్పలు ప్రధాన ఆహారం కాబట్టి, వాటిని వెతుక్కుంటూ పాములు జనావాసాల వైపు వస్తుంటాయి.

3) శాస్త్రీయంగా జూలై, ఆగస్టు నెలలను పాముల సంతానోత్పత్తి కాలంగా పరిగణిస్తారు. జత కోసం, ఆహారం కోసం అవి ఒక చోటు నుంచి మరో చోటుకి ఎక్కువగా సంచరిస్తుంటాయి.

హిందూ మతపరమైన నమ్మకాలు..
శివుడితో అనుబంధం: శ్రావణ మాసం మహాశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. శివుని ఆభరణంగా భావించే సర్పాలను ఈ మాసంలో భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు.

నాగపంచమి వేడుకలు: ఈ మాసంలోనే ప్రఖ్యాత 'నాగపంచమి' పండుగను జరుపుకొంటారు. సర్పదేవుడిని పూజించి పాలు పోసే సంప్రదాయం మన దేశంలో ఉంది. ఈ ఆధ్యాత్మిక వాతావరణం కారణంగా కూడా ఈ మాసంలో పాముల గురించి చర్చ ఎక్కువగా జరుగుతుంది.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం శాస్త్రీయ కారణాలు, మన సంప్రదాయాల్లోని నమ్మకాల ఆధారంగా అందించబడింది. వర్షాకాలంలో పాములు బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, పరిసరాల పట్ల అప్రమత్తంగా ఉండటం మంచిది.

Also Read: శ్రావణ మాసం బరువు తగ్గడానికి ఒకే ఒక్కదారి! 10 రకాల శాకాహారంతో కొవ్వు కరిగిపోతుంది!

Also Read: నీచరాశిలోకి శుక్ర సంచారం..ఆగస్టు 1 నుంచి ఈ రాశులకు కష్టాలే కష్టాలు..పరిహారం ఇదే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

8000mAh భారీ బ్యాటరీతో రేపే Poco M8 Power 5G గ్రాండ్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

Hyderabad, Telangana:

Poco M8 Power 5G Price: చాలా మంది రోజు చార్జింగ్ అయిపోతుందని భయపడుతూ.. పవర్ బ్యాంక్‌లు పట్టుకుని తిరిగే స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఇది నిజంగానే అతిపెద్ద ఊరటనిచ్చే వార్తగా భావించవచ్చు.. మొబైల్ మార్కెట్ చరిత్రలోనే పోకో (Poco) ఒక అద్భుతం సృష్టించేందుకు రెడీ అయిన్నట్లు తెలుస్తోంది. రేపే (ఆగస్టు 4న) భారత మార్కెట్లో Poco M8 Power 5G స్మార్ట్‌ఫోన్ అధికారికంగా విడుదల చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా అతిపెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఫోన్ కేవలం ఒక డివైజ్ మాత్రమే కాదు.. ఛార్జింగ్ సమస్యలతో సతమతమయ్యే కోట్లాది మంది యూజర్ల ఆవేదనకు ప్రత్యక్ష సమాధానంగా మారబోతోందని నిపుణులు చెబుతున్నారు. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం.. ఇందులో ఎంతో శక్తివంతమైన 8,000mAh భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీని కలిగి ఉంటుందని తెలిపింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. ఏకంగా మూడు రోజుల పాటు ఛార్జింగ్‌తో సంబంధం లేకుండా గేమ్స్ ఆడుకోవచ్చు.. అంతేకాకుండా వీడియోలు చూడవచ్చని.. మీ పనులను నిరంతరాయంగా పూర్తి చేసుకోవచ్చని వెల్లడించింది.

ఈ ఫోన్ కేవలం బ్యాటరీలోనే కాదు.. విజ్యువల్స్ అనుభూతిలోనూ సరికొత్త డిస్ల్పేతో విడుదల కాబోతోంది. ఇందులో 6.9 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందించారని కంపెనీ తెలిపింది. దీనివల్ల బ్రైట్‌నెస్‌ ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే డిస్‌ప్లేలోనే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండటం దీని మరొక ప్రత్యేకతగా ఉంటుందని సమాచారం.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ఇక ప్రాసెస్‌ విషయానికి వస్తే.. ఇది శక్తివంతమైన Qualcomm Snapdragon 4 Gen 4 ప్రాసెసర్‌తో పాటు 8GB ర్యామ్‌తో పాటు virtual RAM సపోర్ట్‌ను కూడా అందించారు.. హెవీ గేమింగ్ ఆడే సమయంలో ఫోన్ వేడెక్కకుండా 10,416 చదరపు మిమీ గ్రాఫైట్ కూలింగ్ సిస్టమ్‌ను అందించిన్నట్లు తెలుస్తోంది.. ఫోటోగ్రఫీ ప్రేమికుల కోసం 50 మెగాపిక్సెల్ AI ప్రధాన కెమెరాను అందించారు. అంతేకాకుండా ఈ 8000mAh బ్యాటరీని వేగంగా ఛార్జింగ్‌ నింపేందుకు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు, ఇతర ఫోన్‌లకు ఛార్జింగ్ ఇచ్చేందుకు 22.5W రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) వేదికగా ఈ ఫోన్ విడుదల కాబోతోంది. మైక్రోసైట్ ఆధారంగా బడ్జెట్ ధరకు దగ్గరగా రూ.15,000 నుంచి రూ.20,000 పరిధిలో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

NIMS సరికొత్త చరిత్ర.. 3 ఏళ్లలో 1000 రోబోటిక్ సర్జరీలు!

Hyderabad, Telangana:

NIMS Creates History: తెలుగు రాష్ట్రాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందిస్తున్న నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) మరొక అరుదైన, చారిత్రాత్మక ఘనతను సాధించింది. అత్యంత సంక్లిష్టమైన, అత్యాధునికమైన రోబోటిక్ శస్త్రచికిత్సలలో నిమ్స్ రికార్డు కొట్టింది. అందుబాటులోకి వచ్చిన కేవలం మూడేళ్ల వ్యవధిలోనే ఏకంగా 1,000 రోబోటిక్ సర్జరీలను అత్యంత విజయవంతంగా పూర్తి చేసి, ప్రభుత్వ వైద్యరంగంలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించింది.

ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయల ఖర్చు అయ్యే.. ఈ రోబోటిక్ సర్జరీలను, నిమ్స్ నిరుపేదలకు సైతం సులభంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మొత్తం 1,000 ఆపరేషన్లలో 90 శాతానికి పైగా శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా బాధితులకు పూర్తిగా ఉచితంగా అందిస్తోంది.

ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకోవడంలో నిమ్స్‌లోని వివిధ వైద్య విభాగాలు కీలక పాత్ర పోషించాయి. యూరాలజీ విభాగం అత్యధికంగా 590 రోబోటిక్ శస్త్రచికిత్సలతో అగ్రస్థానంలో నిలిచింది. అలాగే సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ అత్యంత క్లిష్టమైన 248 ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించింది. ఇక సర్జికల్ ఆంకాలజీ క్యాన్సర్ చికిత్సల్లో భాగంగా 162 సర్జరీలను పూర్తి చేసిన్నట్లు అధికారులు తెలిపారు.

సాధారణ కోతలతో పనిలేకుండా.. తక్కువ రక్తస్రావంతో, రోగులు త్వరగా కోలుకునేలా ఈ రోబోటిక్ పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడింది. నిమ్స్ వైద్య బృందం ఈ సాంకేతికత ద్వారా పలు సంక్లిష్టమైన ప్రాణాంతక చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసింది. ముఖ్యంగా ప్రోస్టేట్, మూత్రాశయంతో పాటు కిడ్నీ మార్పిడి (Kidney Transplant) శస్త్రచికిత్సలు చేసిన్నట్లు వెల్లడించారు. అలాగే కాలేయం (Liver), ప్యాంక్రియాస్ (Pancreas) పేగులకు సంబంధించిన కష్టమైన శస్త్రచికిత్సలు కూడా అందించారని అధికారులు వెల్లడించారు.

Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!

ఈ అద్భుతమైన ఘనతపై నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి స్థాయిలో 1,000 రోబోటిక్ సర్జరీలు పూర్తి చేయడం సాధారణ విషయం కాదని.. ఇది తమ ఆసుపత్రి వైద్యుల పనితీరుకు నిదర్శనమని కొనియాడారు. ఈ సందర్భంగా శస్త్రచికిత్సలు నిర్వహించిన స్పెషలిస్ట్ వైద్యులు, నిరంతరం శ్రమించిన నర్సింగ్ సిబ్బంది, అనస్థీషియా నిపుణులు, ఆపరేషన్ థియేటర్ (OT) సాంకేతిక బృందానికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులోనూ పేద రోగులకు మరిన్ని అత్యాధునిక సాంకేతిక సేవలు అందిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

80 ఏళ్ల వయసులో 16 గంటల కష్టం.. నెటిజన్స్‌ను కంటతడి పెట్టిస్తున్న టాక్సీ డ్రైవర్ కథ!

Hyderabad, Telangana:

 80-Year-Old Kolkata Taxi Driver Video Watch: వృద్ధప్యంలో హాయిగా విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో.. జీవనోపాధి కోసం ఒక వృద్ధుడు పడుతున్న కష్టం సోషల్ మీడియా వేదికగా లక్షలాది మంది హృదయాలను కలచివేస్తోంది. కోల్‌కతాకు చెందిన 80 ఏళ్ల రవీంద్రనాథ్ సర్కార్ అనే టాక్సీ డ్రైవర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతన్నాడు. అసలు ఇంత కష్టపడడానికి గల కారణాలేంటో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

రవీంద్రనాథ్ సర్కార్ గత 52 సంవత్సరాలుగా కోల్‌కతా వీధుల్లో టాక్సీ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. 80 ఏళ్ల వయసులోనూ ఆయన ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే అద్దె టాక్సీతో రోడ్డుపైకి వచ్చి.. రాత్రి 10 నుంచి 11 గంటల వరకు కష్టపడతారు. అంటే రోజుకు ఏకంగా 16 గంటల పాటు ఆయన స్టీరింగ్ పట్టుకుని ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంటారు. సొంత టాక్సీ లేకపోవడంతో రోజువారీ వాహన అద్దె.. పెట్రోల్‌ ఖర్చులు పోను ఆయనకు మిగిలేది చాలా తక్కువే.. కొన్నిసార్లు కనీసం రోజువారీ మందులకు కూడా డబ్బులు చాలని పరిస్థితి ఏర్పడుతుంది.

రవీంద్రనాథ్ సర్కార్ తన 77 ఏళ్ల భార్యతో కలిసి కోల్‌కతాలోని దమ్‌దమ్ ప్రాంత సమీపంలో ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నారు. ఈ వృద్ధ దంపతులకు పిల్లలు లేరు.. వారు నివసించే రేకుల ఇల్లు పూర్తిగా దెబ్బతినింది. వర్షాకాలంలో కప్పు నుంచి నీరు కారుతున్నా.. కిటికీలు ఊడిపోయిన.. రిపేరు చేయించే ఆర్థిక స్తోమత లేదు. వయసు పెరగడంతో చేతులు వణుకుతున్నా.. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్నా ఆయన ఏనాడూ ఎవరినీ చేయి చాచి అడగలేదు. ప్రయాణికులు అద్దె ఎంత అని అడిగితే.. మీకు ఎంత తోస్తే అంత ఇవ్వండి అని చిరునవ్వుతో చెప్పడం ఆయన ఆత్మాభిమానానికి అద్దం పడుతోంది.

 
 
 
 
 

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

డిజిటల్ కంటెంట్ క్రియేటర్  చైతాలీ బోస్.. ఆయన జీవితాన్ని, పడుతున్న కష్టాన్ని ఇన్స్టాగ్రామ్‌లో ఒక వీడియో రూపంలో పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా చలించిపోయారు. వేలాది మంది ఆయనకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. సాయం కోసం కేటాయించిన బ్యాంకు ఖాతా రోజువారీ పరిమితి (Transaction Limit) పూర్తయ్యేంతగా ప్రజలు డబ్బులు పంపడం విశేషం.. ఎవరి ముందూ చెయ్యి చాచకుండా.. 80 ఏళ్ల వయసులోనూ కష్టపడి గౌరవంగా జీవిస్తున్న రవీంద్రనాథ్ సర్కార్ నేటి సమాజానికి, యువతకు నిజమైన స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని నెటిజన్లు కొనియాడుతున్నారు.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

  

0
0
Report

D-Mart Store Sarees: అన్నీ వస్తువులు దొరికే డీమార్ట్‌లో చీరలు ఎందుకు అమ్మరు? ఇదే బిజినెస్ టాప్ సీక్రెట్!

Hyderabad, Telangana:

Sarees In D-Mart Stores: దేశవ్యాప్తంగా సామాన్యుడి నుంచి మధ్యతరగతి కుటుంబాలను తక్కువ ధరలతో ఆకర్షిస్తున్న షాపింగ్ స్టోర్ డీమార్ట్. కిరాణా సామాగ్రి, నిత్యావసరాలు అందించే ఈ స్టోర్‌లో కుర్తీలు, టీ-షర్టులు, పిల్లల బట్టలు వంటి రకరకాల రెడీమేడ్ వస్త్రాలు తక్కువ ధరకే లభిస్తాయని ప్రజల అభిప్రాయం. కానీ, మన దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే చీరలు మాత్రం డీమార్ట్‌లో సాధారణంగా కనిపించవు. ఇంత పెద్ద రిటైల్ స్టోర్ చైన్ చీరలను ఎందుకు విక్రయించదో తెలుసా? దీని వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉంది. 

డీమార్ట్ బిజినెస్ మోడల్..
డీమార్ట్ విజయ రహస్యం అంతా దాని ప్రత్యేకమైన బిజినెస్ మోడల్‌పైనే ఆధారపడి ఉంటుంది. కంపెనీ ప్రధానంగా రోజువారీ జీవితంలో నిత్యం అవసరమయ్యే, వేగంగా అమ్ముడయ్యే ఉత్పత్తులపై దృష్టి పెడుతుంది. తక్కువ లాభాలతో ఎక్కువ మొత్తంలో వస్తువులను విక్రయించడం, స్టాక్ త్వరగా క్లియర్ కావడం ద్వారా కస్టమర్లకు భారీ డిస్కౌంట్లు అందించడం వీరి ప్రధాన సూత్రం.

చీరల వ్యాపారంలో ఉన్న సవాళ్లు..
ఇతర రెడీమేడ్ దుస్తులతో పోలిస్తే చీరల వ్యాపారం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చీరల్లో వేలాది రకాల ఫ్యాబ్రిక్‌లు, విభిన్న డిజైన్లు, ప్యాటర్న్లు, రంగులు, ఎప్పటికప్పుడు మారే ఫ్యాషన్ ట్రెండ్‌లు ఉంటాయి. వీటన్నింటితో మహిళలను మెప్పించాలంటే భారీ స్థాయిలో స్టాక్ నిర్వహించాల్సి ఉంటుంది.

కుర్తీలు లేదా కిరాణా సామాగ్రి మాదిరిగా చీరలు అంత వేగంగా అమ్ముడవ్వవు. స్టాక్ ఎక్కువ కాలం కౌంటర్లోనే నిల్వ ఉండిపోతే కంపెనీకి పెట్టుబడి నిలిచిపోయి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది.

డీమార్ట్ తన వేగవంతమైన అమ్మకాల విధానానికి కట్టుబడి ఉంటుంది కాబట్టి, చీరల వంటి సంక్లిష్టమైన విభాగంలో భారీగా పెట్టుబడి పెట్టడం వారికి లాభదాయకం కాదు. అందుకే కిరాణా, హోమ్ కేర్, రోజూ అమ్ముడయ్యే ప్రాథమిక వస్త్రాలకే డీమార్ట్ ప్రాధాన్యత ఇస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లోని ఎంపిక చేసిన స్టోర్లలో కస్టమర్ల డిమాండ్‌ను బట్టి ఎప్పుడైనా పరిమిత సంఖ్యలో చీరలు అందుబాటులో ఉంచినప్పటికీ, దేశవ్యాప్తంగా మాత్రం దీనికోసం ప్రత్యేక విభాగం ఉండదు.

Also Read; ఉద్యోగులకు తీపి కబురు! మరో 3 శాతం పెరగనున్న డీఏ..జీతం ఎంత మేర పెరుగుతుందంటే?

Also Read: నీట్ విద్యార్థులకు అలర్ట్..కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల..ఆగస్టు 5 నుంచి రిజిస్ట్రేషన్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Bank Holiday: రేపు మంగళవారం బ్యాంకులకు సెలవు..ఆగస్టు 4వ తేదీన అక్కడ ఈ బ్యాంకులు బంద్! ఎందుకంటే?

Hyderabad, Telangana:

Bank Holiday Tomorrow: దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు రేపు అనగా 2026 ఆగస్టు 4న సెలవు రానుంది. మీరు రేపు ఏదైనా బ్యాంక్ పనులు ప్లాన్ చేసుకుంటే వెంటనే వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. అయితే ఈ సెలవు కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం.. రేపు ఏఏ ప్రాంతాల్లో బ్యాంకులు బంద్‌ కానున్నాయనే వార్తలు ఇప్పుడు తెలుసుకుందాం. 

దేశంలోని త్రిపుర రాష్ట్రంలో ఆగస్టు 4న బ్యాంకులు మూతపడనున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యాక్సిస్, కెనరా, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐతో సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు సెలవు ఉండనుంది. భారత రాష్ట్రమైన త్రిపురలో జరిగే ప్రధాన హిందూ పండుగ అయిన కేర్ పూజ కారణంగా త్రిపురలోని బ్యాంకులు మూసివేయబడతాయి.

కేర్ పూజ అంటే ఏమిటి?
త్రిపుర రాష్ట్రంలో ఖర్చీ పూజ జరిగిన రెండు వారాలకు కేర్ పూజను ప్రజలకు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. త్రిపుర రాష్ట్రానికి వాస్తు దేవతగా కేర్‌ను పూజిస్తారు. సుమారు ఈ పూజను రెండున్నర రోజుల పాటు నిర్వహిస్తారు. త్రిపురలోని మాణిక్య రాజవంశపు రాజులు ఈ ఆచారాన్ని ప్రారంభించగా.. శతాబ్దాల నాటి నుంచి ఆనవాయితీగా వస్తుంది.

అయితే ఈ కేర్ పూజ నేపథ్యంలో త్రిపుర రాష్ట్రంలో సెలవును ప్రకటించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలతో పాటు బ్యాంకులు, ఇతర ప్రభుత్వ రంగ కార్యాలయాలు మూతపడనున్నాయి. అయితే త్రిపుర మినహా మిగిలిన రాష్ట్రాల్లో బ్యాంకులు యథావిధిగా తెరిచే ఉంటాయి. 

ఆగస్టులో బ్యాంకులు ఎప్పుడు మూసి ఉంటాయి?
ఆగస్టు 4 -  త్రిపుర కేర్ పూజ (మంగళవారం)
ఆగస్టు 8 - శనివారం (రెండో శనివారం)
ఆగస్టు 9 - ఆదివారం (వారాంతపు సెలవు)

ఆగస్టు 13 - మణిపూర్‌లో పెట్రియాట్స్ డే (గురువారం) 
ఆగస్టు 15 - శనివారం (నేషనల్ హాలీడే)
ఆగస్టు 16 - ఆదివారం (వారాంతపు సెలవు)

ఆగస్టు 19 - త్రిపుర మహారాజా బీర్ విక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ జయంతి (బుధవారం) 
ఆగస్టు 22 - శనివారం (నాలుగో శనివారం)
ఆగస్టు 23 - ఆదివారం (వారాంతపు సెలవు)

ఆగస్టు 25 -  మిల్-ఉన్-నబీ సెలవు (మంగళవారం)
ఆగస్టు 26  -  మిల్-ఉన్-నబీ సెలవు (కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే)

Also Read: ఉద్యోగులకు తీపి కబురు! మరో 3 శాతం పెరగనున్న డీఏ..జీతం ఎంత మేర పెరుగుతుందంటే?

Also Read: విద్యార్థులకు పండగ లాంటి వార్త..ఈ వారంలో వరుసగా 3 రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

వామ్మె.. సన్‌రూఫ్ నుంచి బయటకొచ్చిన వ్యక్తిపై చిరుత దాడి.. వీడియో..

Hyderabad, Telangana:

Leopard Attack Viral Video: సోషల్ మీడియాల్లో (Social Media) ప్రతి రోజు రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా నెట్టింట హల్‌చల్ చేస్తున్న ఒక వీడియో మాత్రం నెటిజన్లను భయాందోళనకు గురిచేస్తోంది.. ఒక కారు సన్‌రూఫ్ (Car Sunroof) నుంచి సగం వరకు బయటకు వచ్చి నిలబడిన ఒక వ్యక్తిపై.. ఒక్కసారిగా చిరుతపులి (Leopard Attack) దాడి చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ స్పందిస్తూ వస్తున్నారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

వైరల్ అవుతున్న వివరాల ప్రకారం... ఒక కారు ప్రయాణిస్తున్న సమయంలో.. కారులోని వ్యక్తి సన్‌రూఫ్ తెరిచి.. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు బయటకు వచ్చి నిలబడి ఉండడం మీరు చూడొచ్చు.. అదే సమయంలో అకస్మాత్తుగా ఎక్కడి నుంచో దూసుకొచ్చిన చిరుతపులి.. నేరుగా ఆ వ్యక్తిపైకి దూకి దాడికి యత్నించింది. అత్యంత ప్రమాదకరమైన రీతిలో ఉన్న ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిని చూసిన వారు ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఫేస్‌బుక్‌లలో వేల సంఖ్యలో షేర్‌లు అవుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలతో పాటు అడవి జంతువుల ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు సన్‌రూఫ్‌ల నుంచి బయటకు రావడం ఎంత ప్రమాదకరమో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది..

అయితే, ఈ వీడియోపై ఇప్పుడు తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీడియోను క్షుణ్ణంగా పరిశీలించిన అనేక మంది సాంకేతిక నిపుణులు, నెటిజన్లు ఇది నిజమైన సంఘటన కాదని.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సృష్టించిన ఫేక్ వీడియో అని అభిప్రాయపడుతున్నారు. 

కంప్యూటర్ జెనరేటెడ్ విజువల్స్ (CGI)తో పాటు AI టూల్స్ ఉపయోగించి ఇలాంటి వీడియోలను క్రియేట్‌ చేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువైందని అంటున్నారు. చిరుతపులి కదలికలతో పాటు వెలుగు-నీడలు సరిగ్గా లేకపోవడం, సదరు వ్యక్తి ప్రవర్తనను గమనిస్తే ఇది ఖచ్చితంగా డిజిటల్ క్రియేషన్ అని తెలుస్తోందని స్పష్టం చేస్తున్నారు.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

ఒకవైపు సన్‌రూఫ్‌లను ఉపయోగించి విన్యాసాలు చేయడం ఎంత ముప్పైనప్పటికీ.. మరోవైపు ఇలాంటి AI వీడియోలు ప్రజల్లో లేనిపోని భయాందోళనలను రేకెత్తిస్తున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. టెక్నాలజీ మంచికి ఉపయోగించాల్సింది పోయి.. ఇటువంటి లైక్లు, వ్యూస్ కోసం ఫేక్ కంటెంట్‌ను వైరల్ చేయడంతో పలువురు మండిపడుతున్నారు.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

5 కళ్లు, ఏనుగు తొండం.. 50 కోట్ల ఏళ్ల నాటి ఈ వింత జీవిని చూశారా?

Hyderabad, Telangana:

Opabinia Regalis Facts: మన భూమిపై లక్షలాది సంవత్సరాల క్రితం నివసించిన జీవుల గురించి తెలిసిన ప్రతిసారీ శాస్త్రవేత్తలతో పాటు సామాన్యులు కూడా ఆశ్చర్యపోతుంటారు. సాధారణంగా మనం రెండు కళ్లు ఉన్న జీవులను, లేదా కొన్ని క్రిమి కీటకాలకు ఉండే మల్టిపుల్ కళ్లు గురించి వినే ఉంటాం. కానీ, ఏకంగా ఐదు కళ్ళతో, వింత శరీర ఆకృతితో సముద్రాల్లో ఈదుతున్న ఒక పురాతన జీవి గురించి మీకు తెలుసా? ఈ జీవి గురించి తెలుసుకున్న ప్రతి ఒకరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే, దీనికి సంబంధంచిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సుమారు 50.5 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై జీవించిన ఈ విచిత్ర జీవి పేరు ఓపాబినియా రేగాలిస్ (Opabinia regalis).. కెనడాలోని బర్గెస్ షేల్ (Burgess Shale) అనే ప్రసిద్ధ శిలాజ ప్రాంతంలో దీనికి సంబంధించిన శిలాజాలు లభ్యమయ్యాయి. ఇది చూడడానికి చాలా వింతగా కనిపిస్తుంది. దీని తల భాగంలో ఐదు కళ్లు ఉన్నాయి. ఇవి చుట్టూ 360 డిగ్రీల కోణంలో శత్రువులను, ఆహారాన్ని చూడటానికి సహాయపడేవని పరిశోధకులు భావిస్తున్నారు.

ముఖం ముందు భాగంలో ఏనుగు తొండం లాంటి ఒక పొడవైన అవయవం ఉంటుంది. దానికి చివర పంజాల వంటి నిర్మాణాలు ఉంటాయి. దీని సహాయంతో బురదలో దాగి ఉన్న చిన్న చిన్న జీవులను పట్టుకుని తినేది. చూడటానికి ఏలియన్ లాగా.. భయంకరంగా అనిపించినప్పటికీ.. దీని పరిమాణం కేవలం 4 నుంచి 7 సెంటీమీటర్లు మాత్రమే ఉండేది. అంతేకాకుండా వింత కలర్స్‌లో ఉండేదని సమాచారం.. 

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

కెంబ్రియన్ కాలం (Cambrian Period)లో భూమిపై జీవుల విచ్ఛిన్నం, పరిణామం శరవేగంగా జరిగింది. ఆ సమంలోనే ఈ ఓపాబినియా సముద్రాల అడుగుభాగంలో ఈదుతూ జీవించేది.. మొదటిసారి దీని శిలాజాలను పరిశోధించినప్పుడు, శాస్త్రవేత్తలు సైతం దీని శరీర నిర్మాణాన్ని నమ్మలేకపోయారు. ఇది అసలు నిజమైన జీవా లేక పొరపాటుగా ఏర్పడిన శిలాజమా అని కూడా సందేహించారని సమాచారం.. ప్రస్తుతం జీవుల్లో ఆర్థ్రోపోడ్స్ జీవులకు ఇది దగ్గరి సంబంధం ఉంటుందని భావించినప్పటికీ.. ఓపాబినియా శైలి పూర్తిగా ప్రత్యేకమైనది. 

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

DA Hike Today: ఉద్యోగులకు తీపి కబురు! మరో 3 శాతం పెరగనున్న డీఏ..జీతం ఎంత మేర పెరుగుతుందంటే?

Hyderabad, Telangana:

DA Hike Calculator: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో కరువు భత్యం (డీఏ) పెంపు రూపంలో మరో శుభవార్త అందే అవకాశం ఉంది. జూన్ 2026 నాటికి విడుదలైన ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ (AICPI-IW) డేటా ప్రకారం.. ఉద్యోగుల డీఏ మరో 3 శాతం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే గనుక అమలులోకి వస్తే.. 7వ వేతన సంఘం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రస్తుత 60% నుండి 63%కి పెరుగుతుంది.

డీఏ లెక్కింపు, తాజా అంచనాలు..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ - ఇండస్ట్రియల్ వర్కర్స్ (AICPI-IW) 12 నెలల సగటు ఆధారంగా లెక్కిస్తారు. లేబర్ బ్యూరో విడుదల చేసిన జూన్ 2026 నాటి గణాంకాల ప్రకారం AICPI-IW సూచీ 151.9గా ఉండగా, 12 నెలల సగటు 148.65గా నమోదైంది.

నిర్ణీత సూత్రం ప్రకారం లెక్కించగా డీఏ 63.76% వచ్చింది. సాధారణంగా ప్రభుత్వం దశాంశాలను కాకుండా రౌండ్ ఫిగర్లను పరిగణనలోకి తీసుకుంటుంది కాబట్టి, ఇది 63%గా ఉండనుంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ప్రభుత్వం కొత్త 8వ పే కమిషన్‌ను ప్రకటించినప్పటికీ, దాని సిఫార్సులు అమల్లోకి వచ్చే వరకు కేంద్ర ఉద్యోగులు 7వ పే కమిషన్ నిబంధనల ప్రకారమే డీఏను అందుకుంటారు.

జీతంలో పెరుగుదల, బకాయిల లెక్కలు..
డీఏ 3% పెరిగితే ఉద్యోగుల బేసిక్ పే ఆధారంగా నెలసరి జీతంతో పాటు బకాయిలు కూడా మంజూరవుతాయి. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనిష్ట బేసిక్ జీతం రూ.18,000 ఉండగా.. అలాంటి ఉద్యోగులకు 63 శాతం డీఏ పెంపు తర్వాత నెలవారీ జీతంలో రూ.540 పెరుగుతుంది. అలాగే బకాయిల రూపంలో రూ.3,240 వరకు అందుకుంటారు. 

అదే విధంగా పే లెవల్ 10 స్థాయిలో ఉన్న ఉద్యోగలు అనగా.. బేసిక్ పే రూ.56,100 జీతం అందుకుంటున్న వారికి.. రాబోయే 63 శాతం డీఏ పెంపు తర్వాత నెలవారీ జీతంలో రూ.1,683 వరకు పెంపు ఉంటుంది. అలాగే సుమారు రూ.10,098 వరకు బకాయిల రూపంలో అందుకుంటారు. 

అధికారిక ప్రకటన ఎప్పుడు?
ప్రస్తుతానికి జూన్ 2026 ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ డేటా ఆధారంగా డీఏ 63%కి చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనిపై అధికారికంగా ఆమోదం తెలిపి, తదనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసిన తర్వాతే పెరిగిన రేట్లు, బకాయిలు ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయి.

Also REad: ప్రధాని మోదీని బూతులు పట్టిన యువతి..ఇప్పుడు అమాయకంగా క్షమాపణలు చెబుతోంది!

Also Read: LPG Cylinder Price: సామాన్యులకు గుడ్‌న్యూస్..భారీగా పడిపోయిన సిలిండర్ ధరలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

రైలు సీట్లలో మేకలు, ప్లాట్‌ఫామ్‌పై గేదెలు.. వీడియో చూస్తే నవ్వుకుంటారు!

Hyderabad, Telangana:

 Bihar Railway Viral Video: భారత రైళ్లలో నిత్యం అనేక ఆసక్తికరమైన సంఘటనలు వెలుగులోకి వస్తుంటాయి. అయితే, తాజాగా బీహార్‌లోని ఛాప్రా రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న ఒక ఉదంతం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తోంది. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై గేదెలు స్వేచ్ఛగా తిరగడంతో పాటు మరోవైపు రైలు బోగీలోని సీట్లలో మేకలు అత్యంత రాజసంగా కూర్చోవడం ప్రయాణికులను ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజా వైరల్ అవుతున్న వీడియోను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అసలేం జరిగింది?
ఛాప్రా జంక్షన్ పరిసరాల్లో తీసిన ఈ వీడియోలో.. ప్లాట్‌ఫామ్ పైభాగంలో ప్రయాణికులు నడిచే మార్గంలో పెద్ద సంఖ్యలో గేదెలు హల్‌చల్ చేస్తూ కనిపించాయి. రైలు కోసం ఎదురుచూసే బెంచీల సమీపంలో పశువులు గుంపులుగా సంచరిస్తుండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అంతేకాకుండా చాలా మంది ఈ వింతను చూసి మొబైల్స్‌లో వీడియోలు కూడా రికార్డ్‌ చేశారు.

 
 
 
 
 

ఇక అసలు సిసలైన దృశ్యం రైలు బోగీ లోపల కనిపిస్తుంది.. ఒక ప్యాసింజర్ రైలులో ప్రయాణికుల కోసం కేటాయించిన సీట్లపై మనుషులకు బదులుగా మేకలు ప్రశాంతంగా కూర్చుని ఉన్నాయి. సాధారణంగా ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడే రైలు బోగీల్లోకి ఈ మేకలు ఎలా వచ్చాయనేది అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది.. తోటి ప్రయాణికులు కూడా వాటిని తోలే ప్రయత్నం చేయకుండా వింతగా చూస్తూ ఉండిపోయారు. కొందరు ఈ దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది క్షణాల్లో వైరల్‌గా మారింది.

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ఇది రైల్వే స్టేషన్ లా లేదు.. పశువుల సంతలా ఉంది!.. అని ఒకరు కామెంట్ చేయగా.. వీటికి కూడా కన్ఫర్మ్డ్ టికెట్లు లభించాయేమో.. అందుకే సీట్లలో అంత ప్రశాంతంగా కూర్చున్నాయని మరొకరు సెటైర్ వేశారు. భారతీయ రైల్వేల్లో అందరికీ సమ ప్రాధాన్యం ఉంటుంది అనడానికి ఇదే నిదర్శనం అంటూ.. మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

ఈ ఘటన నవ్వు తెప్పించేలా ఉన్నప్పటికీ.. రైల్వే స్టేషన్లలో భద్రతతో పాటు పరిశుభ్రత తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రయాణికుల రక్షణ కోసం ఉండే రైల్వే భద్రతా బలగాలు (RPF) కన్నుగప్పి పశువులు ప్లాట్‌ఫామ్‌లు, రైలు బోగీల వరకు ఎలా రాగలిగాయనేది ప్రశ్నార్థకంగా మారింది. పశువుల వల్ల ప్రయాణికులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందనే ఆందోళన ఇక్కడ వ్యక్తమవుతోంది. రైల్వే పరిపాలన విభాగాలు తక్షణమే స్పందించి స్టేషన్లలో పశువుల సంచారాన్ని అరికట్టాలని.. ప్రయాణికులకు తగిన సదుపాయాలు కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

  

0
0
Report

Independence Day 2026: భారతదేశంలో ఈసారి నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవం 79వదా లేదా 80నా? చరిత్ర ఏం చెబుతుందంటే?

New Delhi, Delhi:

80th Independence Day 2026: 1947లో దేశం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందిన చారిత్రాత్మక రోజుకు గుర్తుగా, భారతదేశం 2026 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గౌరవించడానికి, ఒక స్వతంత్ర దేశంగా భారతదేశం సాధించిన ప్రయాణాన్ని వేడుకగా మార్చుకోవడానికి ఈ పవిత్ర దినాన్ని ప్రతి ఏటా జరుపుకొంటారు.

దేశవ్యాప్తంగా జరిగే ఈ వేడుకలలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, భారతదేశ చరిత్ర, ఐక్యతను చాటిచెప్పే వివిధ కార్యక్రమాలు ఉంటాయి. ఈ ముఖ్యమైన రోజున ప్రధానమంత్రి సాంప్రదాయకంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఎగురవేసి, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.

2026 స్వాతంత్ర్య దినోత్సవం: 79వదా లేక 80వదా?
భారతదేశం మరో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో, ఒక ప్రశ్న చాలా మందిలో చర్చకు దారితీసింది. ఆగస్టు 15, 2026 భారతదేశపు 79వ స్వాతంత్ర్య దినోత్సవమా లేక 80వదా అనేది అందరిలో తొలుస్తున్న ప్రశ్న? ప్రజలు లెక్కించడానికి రెండు వేర్వేరు పద్ధతులను ఉపయోగించడం వల్ల ఈ చిన్నపాటి గందరగోళం తలెత్తుతోంది.

సంవత్సరాల లెక్కింపు: 2026 నుండి 1947ని తీసివేస్తే (2026 - 1947 = 79). దీని అర్థం ఆగస్టు 15, 2026 నాటికి భారతదేశం పూర్తి చేసుకున్న స్వాతంత్ర్య సంవత్సరాలు 79.

వేడుకల లెక్కింపు: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సంఖ్యను లెక్కించేటప్పుడు, ఆగస్టు 15, 1947న జరిగిన మొదటి వేడుకను కూడా కలుపుకోవాలి (2026 - 1947 + 1 = 80). 2026 ఆగస్టు 15 నాటికి భారతదేశం 79 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని పూర్తి చేసుకుని, 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది.

భారత స్వాతంత్ర్య ఉద్యమ చారిత్రక ఘట్టాలు
భారత స్వాతంత్ర్య దినోత్సవం దాదాపు రెండు శతాబ్దాల బ్రిటిష్ వలస పాలన ముగింపును సూచిస్తుంది. స్వయం పాలనను కోరుకున్న నాయకులు, విప్లవకారులు, సామాన్య పౌరుల నిరంతర కృషి ఫలితంగా దశాబ్దాల తరబడి ఈ స్వాతంత్ర్య పోరాటం సాగింది.

1857 తిరుగుబాటు: బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన తొలి ప్రధాన తిరుగుబాటు.

1920: మహాత్మా గాంధీ నేతృత్వంలో ప్రారంభమైన సహాయ నిరాకరణ ఉద్యమం.

1930: ఉప్పు సత్యాగ్రహంతో ప్రారంభమైన శాసనోల్లంఘన ఉద్యమం.

1942: బ్రిటిష్ వారు దేశం విడిచి వెళ్లాలని డిమాండ్ చేస్తూ ప్రారంభించిన 'క్విట్ ఇండియా' ఉద్యమం.

1947 ఆగస్టు 15: భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత, మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తన ప్రసిద్ధ "ట్రైస్ట్ విత్ డెస్టినీ" (భాగ్యంతో ఒప్పందం) ప్రసంగాన్ని చేశారు.

పాఠశాలలు, కార్యాలయాలలో వేడుకల ఆలోచనలు
పాఠశాలల్లో జెండా ఎగురవేత, దేశభక్తి గీతాలు, నృత్యాలు, వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

అలాగే కార్యాలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, స్ఫూర్తిదాయక భారతీయుల ప్రయాణాలను గుర్తుచేసుకోవడం, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం వంటి చేయాలి..

చివరగా ఇళ్లలో దేశభక్తి చిత్రాలు లేదా డాక్యుమెంటరీలు చూడటం, పిల్లలకు స్వాతంత్ర్య పోరాట చరిత్రను వివరించడం వల్ల రాబోయే తరాలకు మన స్వాతంత్ర్యం విలువను తెలియజెప్పినట్లు ఉంటుంది.

స్వాతంత్ర్య దినోత్సవం కేవలం ఒక జాతీయ వేడుక మాత్రమే కాదు. ఇది మనకు స్వేచ్ఛ, ఐక్యత, బాధ్యతల విలువలను గుర్తుచేస్తుంది. 2026లో భారతదేశం తన 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, ఘనమైన మన గతాన్ని స్మరించుకుంటూ, మరింత బలమైన భవిష్యత్తు వైపు ముందడుగు వేద్దాం.

జై హింద్!

Also Read: నీట్ విద్యార్థులకు అలర్ట్..కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల..ఆగస్టు 5 నుంచి రిజిస్ట్రేషన్

Also REad: ప్రధాని మోదీని బూతులు పట్టిన యువతి..ఇప్పుడు అమాయకంగా క్షమాపణలు చెబుతోంది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top