యూపీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు
Bellampalle, Kannal Rural, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డ్ లో యూపీహెచ్సీ షంషీర్ నగర్ ఆధ్వర్యంలో ఆర్బీఎస్కే టీం పర్యవేక్షణలో బుధవారం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో వార్డ్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి వైద్యులు మందులు అందజేశారు. అత్యవసరమైన కేసులను సీహెచ్ సీ కి సూచిస్తున్నారు. ఈ సందర్బంగా వైద్యులు మాట్లాడుతూ వ్యక్తిగత శుభ్రతతో పాటు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటామని అన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Lalit Modi: రేటింగ్ కోసం స్టార్ క్రికెటర్, చీర్ గర్ల్ మధ్య అఫైర్ పెట్టాం: లలిత్మోదీ
England:IPL Scripted Controversy: ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ఐపీఎల్లో జరిగే పబ్లిసిటీ స్టంట్లు, రేటింగ్ కోసం తాము ఎలా చేస్తామనే విషయాలను ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ వెల్లడించాడు. ఐపీఎల్కు రేటింగ్.. గుర్తింపు వచ్చేందుకు తాము చేసిన ఒక ఉదంతాన్ని లలిత్ వివరించాడు. ఐపీఎల్లో రేటింగ్ కోసం తాము ఒక స్టార్ క్రికెటర్కు ఓ చీర్ లీడర్కు మధ్య సంబంధం ఉందని తామే ఒక కథనం సృష్టించామని లలిత్ మోదీ బహిర్గతం చేశాడు. ఈ వ్యాఖ్యలు క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.
భారతదేశ క్రికెట్కు ఫ్రాంచైజీని పరిచయం చేసి ఐపీఎల్ను లలిత్ మోదీ ప్రారంభించాడు. ఐపీఎల్ వ్యవస్థాపకుడిగా ఉన్న లలిత్ మోదీ అనంతరం కొన్ని అవినీతి పనులు, మనీలాండరింగ్ తదితర నేరాలకు పాల్పడడంతో అతడు 2010లో విదేశాలకు పారిపోయాడు. ప్రస్తుతం లండన్లో నివసిస్తూ విలాసవంతమైన జీవితాన్ని పొందుతున్నాడు. అక్కడ బహిరంగంగా తిరుగుతూ.. ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ హాయిగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తన సోషల్ మీడియాలో పంచుకున్న ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ఐపీఎల్లో గ్రౌండ్లో జరిగేదాని కన్నా మైదానం బయట జరిగేవన్నీ పక్కా ప్రణాళిక ప్రకారం చేసినవేనని ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ప్రకటించాడు. తన దగ్గర కొంత మంది వ్యక్తులు.. రాజకీయ నాయకులు ఉన్నప్పుడు ప్రతిది ప్రణాళిక ఉంటుందని లలిత్ మోదీ తెలిపాడు. 'రేటింగ్స్ పడిపోతున్నప్పుడు మేం కొన్ని వివాదాస్పద కథనాలను సృష్టిస్తాం. దాన్ని వివాదంలాగా బయటపెడుతాం' అని వివరించాడు.
పక్కా ప్రణాళికగా బయటపెట్టిన ఒక వివాదాన్ని తెలపాలని హోస్ట్ కోరగా.. లలిత్ మోదీ కీలక విషయాన్ని బయటపెట్టాడు. 'ఒక ప్రధాన జట్టుకు కెప్టెన్ ఉండేవాడు. అతడు దక్షిణాఫ్రికాకు చెందినవాడు. అతడికి చీర్లీడర్తో అఫైర్ ఉండేది. దాన్ని కావాలని లీక్ చేశాం' అని తెలిపాడు. దానివలన ఐపీఎల్ రేటింగ్స్ బాగా పెరిగాయని చెప్పుకొచ్చాడు. అయితే అఫైర్ పెట్టుకున్న చీర్లీడర్ను ఆ క్రికెటర్ను తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 'రేటింగ్స్ పడిపోయినప్పుడల్లా వివాదం సృష్టిస్తాం. కాంట్రవర్సీ అనే నంబర్-1 పిల్లర్ మీదే ఐపీఎల్ నిర్మితమైంది’ అని లలిత్ మోదీ తెలిపాడు.
Lalit Modi reveals that everything off the pitch is scripted in IPL
A prominent South African captain was having affair with a cheerleader. Modi found out, he leaked the scandal to press, which caused ratings spike for the IPL.
After this leak, he had to marry that cheerleader pic.twitter.com/szGwHmzGkX
— Chota Don (@choga_don) June 2, 2026
ఇదే ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటి సుష్మితా సేన్తో ఉన్న అనుబంధంపై లలిత్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా సుస్మితపై ప్రశంసలు కురిపించాడు. ఆమె కష్టపడి ఎదిగిన మహిళ అని తెలిపాడు. 'ఆమె వద్ద ఎక్కువ వజ్రాలు ఉన్నాయి. అవన్నింటిని సుస్మిత కష్టపడి సంపాదించుకుంది. ఆమెకు డైమండ్ స్టోర్స్ కూడా ఉన్నాయి' అని వివరించాడు. సుస్మిత తనకు చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని.. తాను ఈరోజు ఈస్థాయిలో ఉండడానికి.. ఎదగడానికి ఎంతో సహాయపడిందని ప్రశంసలు కురిపించారు. తమ ఇద్దరిది చాలా ప్రత్యేకమైన బంధం అని ప్రకటించాడు. తామిద్దరం కలిసి ఉన్నప్పుడు తాను డబ్బులు దేనికి ఖర్చు పెట్టే అవకాశం రాలేదని.. అన్నీ సుస్మిత కట్టేది అని లలిత్ మోడీ వివరించాడు. ఆమె ఎవరి దగ్గర నుంచి ఏదీ ఆశించడానికి ఇష్టపడతని.. ఆమె గురించి తెలియనివాళ్లు మాత్రమే ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని లలిత్ మోడీ ఇంటర్వ్యూలో తెలిపాడు.
YS Jagan: అమరావతి రైతులకు అండగా ఉంటా: మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా
Tadepalli, Andhra Pradesh:Capital MAVIGUN: రాజధాని అమరావతి పేరిట రైతులను బలవంతపెట్టడం మంచి పద్ధతి కాదని కూటమి ప్రభుత్వానికి మాజీ సీఎం వైఎస్ జగన్ హితవు పలికారు. ‘రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తాం. రైతులను బలవంతం పెట్టడం మంచిది కాదు. రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం' అని హామీఇచ్చారు. రైతులకు సంతోష పెట్టేలా చేయాలని.. వారిని కష్ట పెట్టేలా చేయకూడదని చంద్రబాబు ప్రభుత్వానికి సూచించారు.
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం రాజధాని రైతులు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రపాలెం, కుర్రగల్లు గ్రామాలకు చెందిన రైతులు తమ గోడును జగన్ ముందు వెళ్లబోసుకున్నారు. రైతుల సమస్యలు, వారి బాధను సావధానంగా విన్న మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'రాజధాని పేరిట మొదట తీసుకున్న 50 వేల ఎకరాలకే దిక్కులేదు. ఇప్పుడు మళ్లీ 50 వేల ఎకరాలు అంటున్నారు. అందుకే ప్రత్యామ్నాయంగా మావిగన్ను సూచించాం' అని గుర్తుచేశారు.
'విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఉంది. అది ఉండి కూడా మరొక ఎయిర్పోర్టు అంటున్నారు. ఇప్పుడ అక్కడ పనులు కూడా జరుగుతున్నాయి. వచ్చే కొద్ది నెలల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. మచిలీపట్నంలో పోర్టు కూడా వచ్చింది. మన హయాంలో మొదలుపెట్టాం, నిధుల కొరతలేకుండా చూశాం. జాతీయ రహదారులు ఉన్నాయి, రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కాని ఇవేమీ చంద్రబాబుకు పట్టదు' అని విమర్శించారు. భవిష్యత్తులో కూడా రాజధాని అనేది లేకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
'కనీస మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు చేయాలి. జీవితమంతా రోడ్లు వేయడానికి, డ్రైనేజీ తవ్వడానికి, నీళ్లు ఇవ్వడానికి, కరెంటు ఇవ్వడానికే ఖర్చుపెట్టాలి. దాదాపు రూ.రెండు లక్షల కోట్లు ఖర్చు చేయాలి' అని రాజధాని పనులపై మాజీ సీఎం వైఎస్ జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతి రాజధానిలో భారీగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ఏది చూసినా కుంభకోణమే కనిపిస్తోందని తెలిపారు. రాజధాని పేరుతో స్కాములు మీద స్కాములు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
'మావిగన్ను గ్రోత్ కారిడర్గా ప్రకటిస్తే చాలు వెంటనే అభివృద్ధి. 110 కిలో మీటర్ అటు ఇటూ గ్రోత్ కారిడర్కు అటు ఇటూ.. ఈ డబ్బు పెడితే మొత్తం కారిడర్ అభివృద్ధి చెందుతుంది’ అని రాజధానిపై మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. అమరావతి ప్రాంత రైతులకు అండగా ఉంటామని, కూటమి ప్రభుత్వ ఆగడాలను అడ్డుకుంటామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.
ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోంది: రైతులు
మాజీ సీఎం వైఎస్ జగన్తో మాట్లాడుతూ రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 'భూములు ఇవ్వని వారిని ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. భూ సేకరణకు నోటిఫికేషన్లు ఇచ్చి దౌర్జన్యం చేస్తోంది. భూములు ఇవ్వని రైతుల పొలాల్లో దారుణాలకు పాల్పడుతున్నారు. అభివృద్ధి పేరు చెప్పి మా పొలాలను ధ్వంసం చేస్తోంది' అని రైతులు తెలిపారు. భూసమీకరణకు అంగీకరించకపోతే భూసేకరణకు సిద్ధమవుతున్నారని.. ఈ పరిస్థితుల్లో తమకు మీరే అండ అని జగన్తో రైతులు వాపోయారు. తొలి విడత సమీకరణలో భూములిస్తే ఏ మాత్రం అనుకూలంగా లేని లోతట్టు ప్రాంతాల్లో ప్లాట్లు చూపారని.. ఇప్పుడు రెండో విడత సమీకరణలో మళ్లీ భూముల కోసం వేధిస్తున్నారని వెల్లడించారు.
K Annamalai: తమిళనాడులో బీజేపీకి భారీ షాక్.. పార్టీకి అన్నామలై రాజీనామా
Nagalapuram, Tamil Nadu:Annamalai Resignation: అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం తమిళనాడు రాజకీయాలు సంచలనాలకు కేంద్రంగా మారింది. ఇప్పటికే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అధికార టీవీకే పార్టీలో చేరుతుండగా.. ఇతర పార్టీలలో కూడా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీజేపీకి భారీ షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన బీజేపీకి ఆ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రాజీనామా చేశారు. త్వరలో ఆయన కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నారని చర్చ జరుగుతోంది.
తమిళనాడు రాజకీయాల్లో అన్నామలై రాజీనామాతో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేస్తూ 5 పేజీల లేఖ రాశారు. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన అన్నామలై అనూహ్యంగా రాజీనామా చేయడం కలకలం రేపింది. రాజ్యసభ అవకాశం కల్పిస్తామని బీజేపీ ఇచ్చిన ఆఫర్ను కూడా ఆయన తిరస్కరించినట్లు సమాచారం. లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్కి పంపారు. రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేందుకు సిద్ధమైనా కూడా అన్నామలై రాజీనామా చేయడం వెనుక ఆయన తీవ్ర మనస్తాపం చెందినట్లు స్పష్టమవుతోంది.
రాజీనామా చేసిన అనంతరం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అన్నామలై సమావేశమయ్యారు. అధిష్టానం బుజ్జగించే ప్రయత్నాలు చేసినా కూడా అన్నామలై వెనక్కి తగ్గకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న సమాచారం ప్రకారం అన్నామలై త్వరలోనే సొంతంగా ఒక కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ తాజా పరిణామాలతో తమిళనాడు రాజకీయాలతోపాటు దేశవ్యాప్తంగా ఆయన తదుపరి అడుగులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇదే కారణమా?
రాజీనామా చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అసెంబ్లీ సీట్ ఇవ్వకపోవడంతో అన్నామలై తీవ్ర నిరాశకు గురయ్యారు. అన్నాడీఎంకేతో పొత్తు కుదుర్చుకోవడంతో అతడికి పోటీ చేసే అవకాశం దక్కలేదు. అప్పటి నుంచి అసంతృప్తితో రగులుతున్న అన్నామలై చివరకు పార్టీని వీడారు. ఐపీఎస్ అధికారి ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీ శ్రేణులతో సింగం అని పిలిపించుకున్న వ్యక్తి అర్ధాంతరంగా బీజేపీ నుంచి వైదొలిగాడు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన ప్రతిసారి అన్నామలై ఓటమి పాలయ్యారు. అయితే టీవీకే పార్టీ స్థాపించిన కొన్ని నెలల్లోనే అధికారంలోకి వచ్చిన విజయ్ మాదిరి అన్నామలై పార్టీని స్థాపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Monkey Video: కోతికి బ్రాందీ తాగించిన యువకుడు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
Hyderabad, Telangana:Monkey Drinking Brandy Viral Video Watch: సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వింత వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని నవ్వు పుట్టిస్తుంటే మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో మాత్రం చూసి ప్రతి ఒక్కరిని తీవ్ర దిగ్భ్రాంతితో పాటు ఆగ్రహానికి గురి చేసేలా చేస్తోంది. ఎండల తీవ్రతకు నీడ కోసం వచ్చిన ఒక మూగ జీవికి నీళ్లు ఇవ్వాల్సింది పోయి. మద్యం తాగించిన ఒక వ్యక్తి వికృతి చేష్టలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. వేసవికాలం కావడంతో ఎండన తీవ్రతకు తట్టుకోలేక కోతుల మంద ఒకచోట పెద్ద చెట్టు కింద ఆశ్రయం పొందడం మీరు చూడొచ్చు.. తీవ్రమైన దాహంతో పాటు అలసటతో ఉన్న ఒక కోతిని చూసి అక్కడున్న ఒక వ్యక్తి అత్యంత ధారణంగా ప్రవర్తించారు.. మానవత్వాన్ని మరిచి.. ఆ కోతి ముందు ఒక గ్లాసులో చల్లని బ్రాందీ ఉంచాడు... అంతే ఆ కోతి ఏం చేసిందో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు..
తీవ్రమైన దాహంతో ఉందో.. లేక అది కూల్డ్రింక్ అనుకుందో ఏమో కానీ. ఆ కోతి మాత్రం ఆ గ్లాసును చేత్తో పట్టుకొని గటగటా తాగేయడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అంతటితో ఆ వ్యక్తి ఆగలేదు.. ఆ కోతి తాగుతున్న కొద్ది.. గ్లాసులో బ్రాందీ పోస్తూనే ఉన్నాడు.. ఇలా ఆ కోతి దాదాపు మూడు నుంచి నాలుగు గ్లాసుల వరకు బ్రాందీ తాగేసింది. మద్యం మత్తు తలకెక్కడంతో ఆ కోతి అటు ఇటు ఆడడం మీరు ఈ వైరల్ అవుతున్న వీడియోలో చూడొచ్చు..
ఈ వీడియో సోషల్ మీడియా ఫ్లాట్ఫార్మ్స్లో వైరల్గా మారడంతో నేటిజెన్లు సదరు వ్యక్తిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.. మూగజీవుల పట్ల ఇంత క్రూరత్వమా? నీళ్లు లేకపోయినా పర్లేదు కానీ ఇలాంటి పాడు పనులు చేయకండి.. అని ఒకరు కామెంట్ పెట్టారు.. లైకుల కోసం.. వ్యూస్ కోసం ఇంత నీచానికి దిగజారుతారా? మరికొందరు కామెంట్లు పెడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. సాధారణంగా కోతులు ఎండాకాలంలో దాహం కారణంగా ఏది దొరికితే అది తాగుతూ ఉంటాయి. ఇందులో భాగంగానే ఈ కోతి ఆ బ్రాందీని తాగినట్లు తెలుస్తోంది.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం మూగజీవులను హింసించడంతోపాటు వాటి ప్రాణాలకు హాని కలిగించేలా ప్రవర్తించడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఈ వీడియో ఆధారంగా సదరు వ్యక్తిని గుర్తించి అటవీ శాఖ అధికారులు తక్షణమే శిక్షించాలని సోషల్ మీడియా వినియోగదారులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి వికృతి చేష్టలు సమాజంలో పెరుగుతున్న మానసిక వికృతికి అడ్డం పడుతున్నాయి.. తక్షణమే సదరు వ్యక్తిపై కేసు నమోదు చేయాలని కొంతమంది ఉన్నత అధికారులు కూడా కోరుతున్నారు. అయితే, ఈ వీడియోను క్లియర్ గా గమనించి చూస్తే.. ఇది మన భారత దేశంలో జరిగినట్లు లేదు.. వేరే ఇతర దేశాల్లో జరిగినట్లు తెలుస్తోంది..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Python Video: ఐదు సింహాలకు చుక్కలు చూపించిన కొండచిలువ.. వీడియో వైరల్..
Hyderabad, Telangana:Massive Python Fights Video Watch: ప్రకృతిలో బలవంతుడిదే మనుగడ అనే సూత్రం అడవికి వర్తిస్తూ ఉంటుంది. అడవికి రాజు అయిన సింహాన్ని చూస్తే ఎంతటి క్రూర మృగాలైనా తోక ముడుచుకొని అక్కడి నుంచి వారి పోతూ ఉంటాయి. అలాంటిది ఒకేసారి ఐదు సింహాలు చుట్టుముడితే ఇక ఆ జీవి పని అయిపోయినట్లే అని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఈ అంచనాలను తలకిందులు చేస్తోంది.. ఐదు ఆకలిగా ఉన్న సింహాల మధ్య చిక్కుకున్న ఒక భారీ కొండచిలువ.. ప్రాణాలకు తెగించి పోరాడిన తీరు సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. అడవి మధ్యలో ఒక భారీ కొండచిలువ వెళ్తుండగా ఐదు సింహాలు దానిని గమనించాయి.. సాధారణంగా పాములను వేటాడేందుకు సింహాలు పెద్దగా ఆసక్తి చూపవు.. కానీ ఇక్కడ సింహాల గుంపు ఆ కొండచిలువను ఆహారంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.. ఒకదాని తర్వాత ఒకటిగా ఐదు సింహాలు ఆ అత్యంత ప్రమాదకరమైన కొండచిలువను చుట్టుముత్తాయి. ముందుగా ఒక సింహం తన పనిజాతం కొండచిలువను కొట్టేందుకు ప్రయత్నించింది..
సాధారణంగా ఇలాంటి సమయంలో ఏదైనా జీవి భయంతో పారిపోవడానికి ప్రయత్నిస్తుంది.. కానీ ఆ కొండచిలువ మాత్రం వెనక్కి అస్సలు తగ్గలేకపోయింది.. సింహాలు దాడికి వస్తున్న కొద్ది.. అది తన శరీరాన్ని గాల్లోకి లేపి.. పడగ విప్పినట్లుగా నోరు తెరిచి ఎదురుదాడికి దిగింది.. ఒక సింహం దగ్గరికి రాగానే మెరుపు వేగంతో దానిపై దూసుకు వెళ్లి తన బలమైన పళ్ళతో పాము కొరికేందుకు ప్రయత్నించింది. కొండచిలువ ఉగ్రరూపాన్ని చూసి అడవికి రాజులైన సింహాలే షాక్కు గురైనట్లు తెలుస్తోంది.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
ఈ వీడియో ప్రస్తుతం ఇంస్టాగ్రామ్తో పాటు ఎక్స్ వేదికల్లో మిలియన్ల కొద్ది వ్యూస్ తెచ్చుకుంటోంది. వన్యప్రాణి ప్రేమికులు ఈ అరుదైన పోరాటాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా కొండచిలువలు తమ ఆహారాన్ని చుట్టుముట్టి ఊపిరాడకుండా చేసి చంపుతూ ఉంటాయి.. కానీ ఇక్కడ అది ఒక యోధుడిలా సింహాలతో తలపడటం చాలా విశేషం.. చివరకు ఆ సింహాలు కొండచిలువను వదిలేసాయ లేక వేటాడయా.. అనేది ఈ వీడియోలో లేనప్పటికీ.. ఆ కొండచిలువ ఉగ్రరూపం చూస్తే మాత్రం తప్పకుండా అవి వదిలిపెట్టి ఉంటాయని ఒక నమ్మకం కుదురుతోంది..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Telangana: 6 గ్యారంటీల అమలులో మా ప్రభుత్వమే ముందుంది: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Hyderabad, Telangana:Telangana 6 Guarantees: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్, మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించి.. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.. అనంతరం ఆయన జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.. ఈ ప్రసంగంలో నాలుగు గ్యారెంటీ ల గురించి మాట్లాడారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పటికే నాలుగు గ్యారెంటీలు విజయవంతం..
మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇప్పటికే నాలుగు ప్రధాన పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని ప్రకటించారు. మహిళలందరికీ మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణంతో పాటు.. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ సరఫరా.. గృహలక్ష్మి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. రాజు ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు వంటి పథకాలను ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తూ వస్తోందని తెలిపారు.
ఈ పథకాల ద్వారా అట్టడుగు వర్గాలకు లబ్ధి చేకూరుతుందని ఆయన వివరించారు.. మిగిలిన గ్యారంటీలను కూడా త్వరలోనే అర్హులైన వారందరికీ అందజేస్తామని హామీ ఇచ్చారు.. గత ప్రభుత్వాల తరహాలో కాకుండా.. ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. లబ్ధిదారుల ఎంపికలు పూర్తి పారదర్శకత పాటిస్తున్నట్లు పేర్కొన్నారు..
తెలంగాణ సమాజం ఆశించిన ఆకాంక్షల నెరవేర్పు కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని.. కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని.. తాగునీరుతో పాటు సాగునీరు, విద్యా వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి.. ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని.. మౌలిక వసతుల కల్పనలు రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర పోలీసు అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Jagitial: తెలంగాణ పోరాట చరిత్రలో జగిత్యాలది చెరగని ముద్ర!
Hyderabad, Telangana:Telangana Formation Day In Telugu: తెలంగాణ గడ్డపై సాగిన విరోచిత పోరాటాల చరిత్రను తిరగేస్తే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల ప్రాంతం పోషించిన పాత్ర అద్వితీయం.. అమోఘం.. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ.. ఈ గడ్డ చవిచూచిన పోరాటాలతో పాటు చేసిన త్యాగాలను ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది.. 1969 నాటి తొలిదశ ఉద్యమం నుంచి నిన్న మొన్నటి మలిదశ రాష్ట్ర సాధన పోరాటం వరకు జగిత్యాల ఎల్లప్పుడు ఉద్యమాలకు ఒక దిక్సూచిగా నిలిచింది..
దొరల గడీల అణిచివేతకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ పోరాటాలైన.. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష అయినా.. జగిత్యాల ప్రజలు ఎల్లప్పుడూ వెనకడుగు వేయలేదు.. 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం సాగిన తొలిదశ ఉద్యమంలో ఇక్కడి విద్యార్థులతో పాటు యువత ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రోడ్లపైకి వచ్చారు.. అలాగే ఆంధ్ర పాలకుల వివక్ష పై తిరుగుబావుటా ఎగురవేసి.. ఈ ప్రాంత అస్తిత్వాన్ని చాటిచెప్పారు.. అంతేకాకుండా యువతులు సైతం స్వరాష్ట్ర సాధన కోసం ఎంతగానో కృషిచేసిన చరిత్ర జగిత్యాలది..
మలిదశ ఉద్యమంలో...
మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు.. ప్రొఫెసర్ జయశంకర్ వంటి నేతల పిలుపుతో సాగిన మలిదశ ఉద్యమంలో జగిత్యాల ఒక అగ్నిపర్వతంలా రగిలింది.. ఢిల్లీ పాలకుల మెడలు వంచేందుకు ఈ గడ్డకు చెందిన ఎంతోమంది యువకులతో పాటు విద్యార్థులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి ఉద్యమ జ్యోతిని వెలిగించారు.. లాయర్లతోపాటు డాక్టర్లు, ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయులు, చిరు వ్యాపారులు సైతం రోడ్లపైకి వచ్చి సకలజనుల సమ్మె.. వంటావార్పు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
తెలంగాణ నినాదంతో జగిత్యాల పరిసర పల్లెలు మారుమోగిపోయాయి.. పోలీసుల లాటి దెబ్బలకు భయపడకుండా.. జైలుకు వెళ్లడానికైనా సిద్ధపడి పోరాటాన్ని ఉదృతం చేశారు.. దశాబ్దాల సుదీర్ఘ పోరాటం.. వందలాదిమంది అమరవీరుల త్యాగం ఫలితంగానే 2014 జూన్ రెండవ తేదీన భారతదేశ పటంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఆనాడు జగిత్యాల ప్రజలు సాగించిన ఉద్యమ స్ఫూర్తి వల్లే నీడు స్వరాష్ట్రంలో మనం స్వేచ్ఛ వాయువులను పీలుస్తున్నాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ గడ్డపై ప్రాణాలర్పించిన అమరవీరులకు, పోరాడిన యోధులకు ప్రాంతీయ సమాజం ఘన నివాళులర్పిస్తోంది..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Karimnagar: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. కరీంనగర్ గ్రానైట్ మాఫియాపై సీఐడీ ఉక్కుపాదం!
Hyderabad, Telangana:Karimnagar Mining Scams: తెలంగాణలో గత పది ఏళ్ల BRS పాలనలో జరిగిన మైనింగ్ అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కు పాదం మోపెందుకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనతో రాష్ట్రానికి సంబంధించిన సిఐడి రంగంలోకి దిగింది. 2014 నుంచి కరీంనగర్ జిల్లాలో సాగిన గ్రానైట్ అక్రమాల తవ్వకాలతో పాటు రవాణాపై సిఐడి అధికారులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు. మైనింగ్ శాఖ సమర్పించిన రహస్య నివేదిక ఆధారంగా జిల్లాకు చెందిన పలువురు ప్రముఖ గ్రానైట్ వ్యాపారులతో పాటు కీలక రాజకీయ నేతలపై ప్రత్యేకమైన ఎఫ్ఐఆర్లు (FIRs) నమోదు చేసేందుకు సిఐడి సర్వం సిద్ధం చేసినట్లు విశ్వసినీయ సమాచారం..
వందల కోట్ల దోపిడి..
కరీంనగర్ జిల్లా శంకరపట్నంతో పాటు మానకొండూర్, కరీంనగర్ రూరల్ మండలాల్లో క్వారీల్లో అనుమతులకు మించి భారీ తవ్వకాలు జరిపినట్లు మైనింగ్ శాఖ తన నివేదికలో పేర్కొంది. నకిలీ రవాణా పత్రాలు సృష్టించడమే కాకుండా ఎలాంటి రాయల్టీ చెల్లించకుండా వేలాది క్యూబిక్ మీటర్ల గ్రానైట్ కాంబినేషన్ కేంద్రాలకు, ఓడరేవుల ద్వారా విదేశాలకు తరలించినట్లు తేలింది.. పర్యావరణ నిబంధనలను తుంగలోకి తొక్కేసి.. ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల రూపాయల మేర గండి కొట్టినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది..
ఇప్పటికే కరీంనగర్ కు చెందిన టాప్ 5 గ్రానైట్ ఏజెన్సీల జాబితాను సిఐడి సిద్ధం చేసింది. గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఒక కీలక నేత ప్రధాన అనుచరులే.. ఈ అక్రమాల్లో సూత్రధారులని ప్రచారం జరుగుతోంది. మైనింగ్ అధికారుల అండదండలతోనే.. ఈ ఖజానా దోపిడీ సాగిందనే కోణంలో ఆ శాఖకు చెందిన కొందరు అధికారుల పాత్రలపై సిఐడి విచారణ జరపబోతోంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో కరీంనగర్ మైనింగ్ అక్రమాలపై ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా కేసులు నమోదు కాబోతున్నాయి. దీంతో జిల్లాలోని గ్రానైట్ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సిఐడి తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
ఇదిలా ఉంటే.. కరీంనగర్ జిల్లాలోని ఎక్కువగా గ్రానైట్ వ్యాపారులంతా గత ప్రభుత్వానికి సంబంధించిన వారు కావడంతో.. తప్పకుండా వారిపై కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఇందులో మాజీ MLAలతో పాటు ఇతర బడానేతలే ఉండడం విశేషం.. అయితే, సిఐడికి సంబంధించిన దర్యాప్తు ఎంతవరకు పారదర్శకంగా జరుగుతుందనేది చూడాల్సిందే..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Telangana: పండించిన పాపానికి కన్నీరే మిగిలిందా? ధాన్యం కొనుగోళ్లపై రాజకీయం!
Hyderabad, Telangana:Telangana Latest News: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల చుట్టూ సాగుతున్న రాజకీయ రగడ సామాన్య రైతుల పాలిట శాపంగా మారింది.. అన్నం పెట్టే అన్నదాతను ఆదుకోవాల్సింది పోయి.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకోవడానికి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు.. ఈ రాజకీయ చదరంగంలో ధాన్యం అమ్ముకోలేక.. అమ్ముకున్న డబ్బులు రాక రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. కొన్నిచోట్లనైతే రైతులు వారాల తరబడి మిల్లర్ల కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవైపు వర్షాలు కురుస్తుంటే.. మరోవైపు వడ్లు కొనుగోలు చేయలేకపోవడంతో రైతులంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ వస్తున్నారు..
అగమ్యగోచరంగా ఐకెపి కేంద్రాలు..
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఐకెపి కేంద్రాల్లో ధాన్యం రాశులు కుప్పలు తిప్పలుగా పేరుకు పోతున్నాయి.. రైతులు తమ పంటను అమ్ముకోవడానికి వారాల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.. సరిపడ గన్ని బ్యాగులు లేకపోవడంతో పాటు లారీల కోరత ఏర్పడడం, మిల్లుల తరలింపులో జాప్యం వంటి కారణాలతో కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఈలోగా అకాల వర్షాలు కురుస్తుండడంతో.. ఎంతో శ్రమించి పండించిన పంట కళ్ళముందే తడిసి ముద్దవుతోంది.. ధాన్యం మొలకెత్తడంతో రైతులు కన్నీరు అవుతున్నారు..
ఈ సంక్షోభంపై అధికారిక కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బిజెపి మధ్య మాటల యుద్ధం ముదిరింది. రైతుల వద్ద ప్రతీ గింజ కొంటామని.. అయితే, తాము సేకరించిన ధాన్యాన్ని కేంద్రం వెంటనే ఎగుమతి చేసుకునేలా సహకరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది.. కేంద్రం కావాలనే రాష్ట్రంపై వివక్ష చూపుతోందని ఆరోపిస్తోంది.. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రంపై నెట్టడం పొరపాటుగా మారిందని.. బిజెపి మండిపడుతోంది.. మిల్లుల కేటాయింపులో.. రవాణాలు ప్రభుత్వం విఫలమైందని.. రైతులను నట్టేట ముంచి.. రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని విమర్శిస్తోంది..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
ఐకెపి కేంద్రాల్లోనే.. తూకం వేయడంలో జాప్యం జరుగుతుండడంతో అదనపు తరుగు పేరుతో మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు.. క్వింటాల్కు ఐదు నుంచి పది కిలోల వరకు తరుగు తీస్తుండడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లుతోంది.. మరోవైపు వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనేందుకు అధికారులు నిరాకరిస్తుండడంతో అన్నదాతకు దిక్కుతోచని స్థితి ఏర్పడింది.. పంట పండించే వరకు ఒక యుద్ధం.. పండించిన పంటను అమ్ముకోవడానికి మరో యుద్ధం చేయాల్సి వస్తోంది.. సర్కారుల గొడవలు రైతుల బతుకులు చిత్రమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Venus Transit 2026: శుక్రుడి అద్భుత సంచారం.. జూన్ 11 వరకు ఈ 6 రాశుల వారికి కనకవర్షం.. మీ రాశి ఉందా?
Hyderabad, Telangana:Venus Transit in Punarvasu Nakshatra Effect On Zodiac: జేష్ఠ పౌర్ణమి రోజు శుక్రుడు పునర్వాసు నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల ఆరు రాశుల వారికి 12 రోజుల పాటు అదృష్టం ఊహించని స్థాయిలో పెరిగింది. మే 31వ తేదీన జ్యేష్ఠ పౌర్ణమి రోజు శుక్రుడు పునర్వాసు నక్షత్రంలోకి సంచారం చేశాడు. ప్రస్తుతం శుక్రుడు మిథున రాశిలో సంచార దశలో ఉన్నాడు. అయితే, నక్షత్ర సంచారం కూడా చేయడం కారణంగా జూన్ 11వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. పునర్వాసము నక్షత్రానికి అధిపతి దేవగురువు గురుడు కాగా.. ఈ రాశికి అధిపతి బుధుడు.. దీని కారణంగా సుమారు 12 రోజుల పాటు మకర రాశి తో పాటు మరికొన్ని రాశుల వారికి శుక్రుడి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు ఎంతో సులభంగా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే దీర్ఘకాలిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయి జీవితంలో అద్భుతమైన లాభాలు పొందుతారు. ముఖ్యంగా అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి.
ఈ రాశులకు బంపర్ జాక్పాట్..
మేషరాశి
శుక్ర గ్రహ సంచారం కారణంగా జూన్ 11వ తేదీ వరకు మేష రాశి వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. దీర్ఘకాలంగా చేస్తున్న ప్రయత్నాలు సులభంగా విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ఇళ్లతో పాటు కొత్త కార్లు కొనుగోలు చేయాలనుకునే వారి కోరికలు నెరవేరవచ్చు. ఉద్యోగంలో పురోగతి లభించడమే కాకుండా ఆదాయానికి కొత్త అవకాశాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా స్నేహితులతో పాటు ప్రియమైన వారితో కలిసి చేసే మతపరమైన యాత్రలు చాలా వరకు సక్సెస్ అవుతాయి పలుకుబడి ఉన్న వ్యక్తులతో సంభాషణలు కూడా ఏర్పడతాయి.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ సమయంలో సామాజిక హోదా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వివాహాలు లేదా గృహప్రవేశాలు వంటి చాలాకాలంగా పెండింగ్లో ఉన్న శుభకార్యాలు కూడా త్వరగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆకస్మిక ఆర్థిక లాభాలు చేకూరడమే కాకుండా నిలిచిపోయిన డబ్బులు కూడా తిరిగి పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో శత్రువులు కూడా మిత్రులుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు శుక్రుడి సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా అసంపూర్ణంగా ఉన్న పనులు కూడా ఎంతో సులభంగా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఒకరికొకరు ఎంతో ప్రేమగా పలకరించుకుంటారు. ముఖ్యంగా కుటుంబంలో ఒక్కరికైనా ప్రభుత్వ ఉద్యోగం లభించవచ్చు. ప్రేమ సంబంధాలలో ఉన్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. పిల్లల చదువుతోపాటు వృత్తిలో విజయాలు సాధించే అవకాశాలున్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారు తప్పకుండా విజయాలు సాధిస్తారు.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ సమయంలో అదృష్టం అంచలంచెలుగా పెరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తి జీవితంలో వివిధ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి అద్భుతమైన శుభవార్తలు కూడా లభిస్తాయి.. నిలిచిపోయిన డబ్బులు తిరిగి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో అశాంతి తగ్గి బంధువులతో మంచి సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎన్నో రకాల సమస్యలు ఈ సమయంలో పరిష్కారం దిశగా ముందుకు సాగుతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి శుక్రుడు సంచారం ఆర్థికంగా అద్భుతమైన మెరుగుదలను సూచిస్తుంది. దీంతో పాటు ఆరోగ్య సమస్యలు మెరుగుపడడమే కాకుండా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. అలాగే మీ పిల్లలకు సంబంధించిన అంశాల్లో కొన్ని రకాల శుభవార్తలు కూడా వింటారు. చట్టపరమైన చిక్కులు కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వ్యక్తులు ఈ సమయంలో అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
మకర రాశి
మకర రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో ప్రత్యేకమైన తన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా అనుకున్న పనులన్నీ ఎంతో సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక సమస్యల నుంచి ఆస్తి సంబంధిత చిక్కుల వరకు అన్ని పరిష్కారం అవుతాయి. ఆదాయ మార్గాల్లో ఉన్న అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీ పనుల్లో సహ ఉద్యోగుల కంటే ముందుండే అవకాశాలు లభిస్తున్నాయి. వృత్తిపరమైన విజయాలు కూడా ఈ సమయంలో దక్కుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hamsa Mahapurusha Rajayoga: ఈ రోజు నుంచే ఈ 4 రాశుల వారికి తిరుగులేని అదృష్టం.. లక్ష్మీ దేవి అనుగ్రహం!
Hyderabad, Telangana:Hamsa Mahapurusha Rajayoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గురు గ్రహాన్ని ఆనందంతో పాటు శ్రేయస్సు, జ్ఞానం, వివాహం అదృష్టానికి సూచికగా భావిస్తారు.. జూన్ నెల ప్రారంభంలో జ్యోతిష్య శాస్త్రంలో ఒక ముఖ్యమైన శుభ సంఘటన జరగబోతోంది. జూన్ రెండవ తేదీన గురుగ్రహం తన ఉచ్చరాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గురుగ్రహం ఉచ్చరాశిలోకి ప్రవేశించినప్పుడు ఎంతో శక్తివంతమైన ప్రభావం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మోస్ట్ పవర్ఫుల్ హంస మహా పురుష రాజయోగం ఏర్పడుతుంది. అయితే, అత్యంత శుభప్రదమైన యోగాల్లో హంస మహా పురుష రాజయోగం ఒకటి. దీనివల్ల కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా అకస్మాత్తుగా ఉరోగతి లభించడమే కాకుండా నిలిచిపోయిన ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి అవుతూ ఉంటాయి.. అలాగే భారీ ఆర్థిక లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, ఈ యోగ ప్రభావంతో అత్యధిక లాభాలు పొందబోయే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం..
హంస మహా పురుష రాజయోగంతో ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మిథున రాశి
మిధున రాశి వారికి హంస మహా పురుష రాజయోగ ప్రభావంతో వ్యాపారాలతో పాటు కొత్త భాగస్వాములకు మంచి లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా పెద్ద వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభించడమే.. కాకుండా ఉద్యోగాల్లో మెరుగైన అవకాశాలు లభిస్తూ ఉంటాయి. దీంతోపాటు ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత బలోపేతం అవుతాయి. కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరే అవకాశాలు ఉండడం విశేషం..
కన్యా రాశి
కన్య రాశి వారికి ఈ సమయంలో విద్యార్థులకు చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడమే కాకుండా పిల్లలనుంచి కొత్త శుభవార్తలు వింటారు. అలాగే అనుకున్న పనుల్లో దిమ్మతిరిగే ధన లాభాలు పొందగలుగుతారు. ముఖ్యంగా అదృష్టం సహకరించి బ్యాంకు బ్యాలెన్స్ కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే అనుకున్న పనుల్లో అద్భుతమైన లాభాలు సొంతం చేసుకోగలుగుతారు.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి ఈ శక్తివంతమైన హంస మహా పురుష రాజయోగ ప్రభావంతో ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులు అందరికీ దిమ్మతిరిగే ధన లాభాలు కలుగుతాయి. అలాగే జీతాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న వారికి జూన్ నెల ప్రారంభంలో కోరుకున్న కోరికలు కూడా నెరవేరవచ్చు. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మీన రాశి
గురు గ్రహ సంచారంతో మీన రాశి వారికి కూడా ఈ సమయం చాలా లాభదాయకంగా ఉండబోతోంది. భూములతో పాటు కొత్త ఇల్లు, వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. పూర్వీకుల నుంచి ఆస్తులు కూడా సంపాదించి అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. ముఖ్యంగా పాత వివాదాల నుంచి పరిష్కారం లభించబోతోంది. కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు జరిగి అద్భుతమైన ఆనందాన్ని పొందగలుగుతారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Janhvi Kapoor: తెలుగు ప్రేక్షకులు దేవుడితో సమానం.. అమ్మ శ్రీదేవి ఇదే చెప్పేది: హీరోయిన్ జాన్వీ కపూర్
Vijayawada, Andhra Pradesh:Peddi Movie Pre Release Event: రామ్ చరణ్తో కలిసి పెద్ది సినిమాతో తెలుగు ప్రేక్షకులను థియేటర్లలో కలిసేందుకు వస్తున్న నటి జాన్వీ కపూర్ తెలుగు ప్రేక్షకులపై ప్రశంసలు కురిపించారు. తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు చాలా సంతోషంగా ఉందని.. ఈ ప్రేమే తాము రోజు రాత్రి కష్టపడి పని చేయడానికి బలాన్ని ఇస్తుందని చెప్పారు. తెలుగు ప్రేక్షకులు దేవుడితో సమానం అని తన తల్లి శ్రీదేవి చెప్పిన మాటలను జాన్వీ కపూర్ పునరుద్ఘాటించారు.
Also Read: Ram Charan: అభిమానుల కోసం రక్తం చిందించి పనిచేస్తా.. రామ్ చరణ్ భావోద్వేగం
విజయవాడలో సోమవారం జరిగిన పెద్ది సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సినీ నటుడు రామ్ చరణ్తో కలిసి పాల్గొన్న జాన్వీ కపూర్ కొన్ని విషయాలపై మాట్లాడారు. 'పెద్ది సినిమాలో ముఖ్యమైన మెసేజ్ ఏంటంటే.. మీ ఐడెంటిటీని, మీ జీవితానికి ఉన్న అర్థాన్ని కనుక్కోవడం. తన ఐడెంటిటీ ఈ భూమితో, ఇక్కడి ప్రేక్షకులతో ఎంతో లోతుగా కనెక్ట్ అయి ఉంది' అని తెలిపారు. 'సినిమా విడుదల కాకముందే నాకు చాలా విషయాలను ఇచ్చింది. రామ్ చరణ్తో కలిసి పనిచేసే అద్భుతమైన అవకాశం లభించింది. ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. అద్భుతమైన నటుడు' అని రామ్ చరణ్పై జాన్వీ కపూర్ ప్రశంసలు కురిపించారు.
'దర్శకుడు బుచ్చిబాబు నాకు తెలిసిన అత్యంత ప్యాషనేట్ డైరెక్టర్. డీఓపీ రాండీ, సంగీత లెజెండ్ ఏఆర్ రెహమాన్, ప్రొడ్యూసర్ సతీష్, ప్రవీణ్తో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవం' అని జాన్వీ కపూర్ తెలిపారు. 'తెలుగు ప్రేక్షకులు, సినిమా గురించి అమ్మ (శ్రీదేవి) ఎప్పుడూ ఒక మాట చెప్పేవారని గుర్తుచేసుకున్నారు. తెలుగు ప్రేక్షకులు దేవుడితో సమానం అని అమ్మ ఎప్పుడూ చెప్పేవారు. తెలుగు ప్రేక్షకులు ఇచ్చే ప్రేమే నాకు సర్వస్వం' అని జాన్వీ పేర్కొన్నారు.
Also Read: Govt Employees: తెలంగాణ ఉద్యోగులకు మళ్లీ షాక్.. బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రసంగం అనంతరం యాంకర్ సుమ హీరోయిన్ జాన్వీని కొన్ని ప్రశ్నలు అడిగారు. దర్శకుడు బుచ్చిబాబును 'రౌడీ డైరెక్టర్' అని ఎందుకు అన్నారని ప్రశ్నించగా.. 'ఆయన (బుచ్చిబాబు) ప్రతి టేక్ అయిపోయాక అదిరిపోయింది అమ్మా.. అదిరిపోయింది. కానీ మళ్లీ ఒకసారి టేక్' అని జాన్వీ కపూర్ వివరించారు. ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చి వెంటనే ఇంకో టేక్ అడిగేవారని సరదాగా ఆయనను ఇమిటేట్ చేసి జాన్వీ చూపించారు. చిరంజీవి, శ్రీదేవి నటించిన ఐకానిక్ సినిమా 'జగదేక వీరుడు అతిలోక సుందరి'లోని డైలాగ్ను జాన్వీ కపూర్ చెప్పారు. 'ఓ మానవా.. ఒక్కసారి నా చెయ్యి పట్టుకోవా' అని చెప్పడంతో ప్రేక్షకులు కేకలు వేశారు.
ఈ వేడుకకు హాజరైన నటుడు జగపతి బాబు ప్రసంగిస్తూ.. '1962లో విజయవాడలోని బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్న సరోజిని దేవి హాస్పిటల్లోనే నేను పుట్టా. గవర్నర్పేటలో ముంతకింద పప్పు తింటూ, సెలవులన్నీ ఇక్కడే గడిపా' అని గుర్తుచేసుకున్నారు. పెద్ది సినిమా పరిశ్రమకు.. డిస్ట్రిబ్యూటర్స్కు, ఎగ్జిబిటర్స్కు ఒక పెద్ద దిక్కు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అరవింద సమేత తర్వాత దాదాపు ఎనిమిదేళ్లకు తనకు ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ దొరికిందని.. ఇందులో తాను 'అప్పలసూరి' పాత్ర చేస్తున్నా. ఇది నా కెరీర్లోనే ఉత్తమ పాత్ర అవుతుంది' అని తెలిపారు. 'రామ్ చరణ్ ఈ సినిమాలో తన మెగా పవర్ ఏమిటో చూపిస్తాడు. సినిమాలో ప్రతి షాట్ సిక్సర్లా ఉంటుంది.
Also Read: IPL Final Highlights: గుజరాత్ టైటాన్స్ ఓటమి.. ఐపీఎల్ 2026 చాంపియన్ బెంగళూరు
Ram Charan: అభిమానుల కోసం రక్తం చిందించి పనిచేస్తా.. రామ్ చరణ్ భావోద్వేగం
Vijayawada, Andhra Pradesh:Peddi Movie Release Event: 'ఒక నటుడిగా ఎన్నో కథలు వింటూ ఉంటాం.. కొన్ని నచ్చుతాయి.. కొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ 'పెద్ది' కథ విన్నప్పుడు మాత్రం అది గుండెకు హత్తుకుంది' అని సినీ నటుడు రామ్ చరణ్ తెలిపారు. 'మా నాన్న (చిరంజీవి) చెప్పినట్టు ఇలాంటి కథ పది సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. అలాంటి కథ నా వద్దకు వచ్చినందుకు దర్శకుడు బుచ్చిబాబు గురువు సుకుమార్, బుచ్చిబాబుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇది నా జీవితకాల సినిమా లైబ్రరీలో టాప్ ఫిలిమ్స్లో ఒకటిగా నిలిచిపోతుంది' అని రామ్ చరణ్ తెలిపారు.
Also Read: Govt Employees: తెలంగాణ ఉద్యోగులకు మళ్లీ షాక్.. బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా జూన్ 4వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుండగా.. ప్రీ రిలీజ్ వేడుక విజయవాడలో జరిగింది. ఈ సభలో అభిమానులను ఉద్దేశించి రామ్ చరణ్ కీలక ప్రసంగం చేశారు. 'విజయవాడలో వాతావరణం చూస్తుంటే ఇది ప్రీ-రిలీజ్ ఫంక్షన్లా లేదు.. అప్పుడే సక్సెస్ మీట్ చేస్తున్నట్లుగా ఉంది. విజయవాడ అనేది మా కుటుంబానికి ఎంతో లక్కీ సిటీ. గతంలో 'ఇంద్ర', 'ఖైదీ నెంబర్ 150' వేడుకలు కూడా ఇక్కడే జరిగాయి. ఆ లక్ కోసమే మళ్లీ ఇక్కడికి వచ్చాం' అని రామ్ చరణ్ గుర్తుచేశారు.
'ఇది ఒక సినిమా స్టోరీ కాదు, కింద పడిపోయిన ఒక మనిషి మళ్లీ లేచి ఎలా నిలబడ్డాడనే ఒక వ్యక్తి అద్భుతమైన ప్రయాణం. గతంలో నాకు'మగధీర', 'రంగస్థలం', 'ఆర్ఆర్ఆర్' సినిమాలు చేస్తున్నప్పుడు ఎలాంటి అద్భుతమైన ఫీలింగ్, అనుభవం కలిగిందో.. మళ్లీ అంతటి భావం ఈ పెద్ది సినిమా చేస్తున్నప్పుడు కలిగింది' అని రామ్ చరణ్ తెలిపారు. బుచ్చిబాబు ఈ కథను రాసుకున్న విధానం చూసి ఆశ్చర్యపోయానని.. భవిష్యత్లో ఇండియాలోనే టాప్ 3 లేదా 4 డైరెక్టర్ల జాబితాలో బుచ్చిబాబు పేరు కచ్చితంగా ఉంటుందని జోష్యం చెప్పారు.
Also Read: IPL Final Highlights: గుజరాత్ టైటాన్స్ ఓటమి.. ఐపీఎల్ 2026 చాంపియన్ బెంగళూరు
తాను అభిమానుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని రామ్ చరణ్ ప్రకటించారు. తాను ఇటువంటి సినిమాలు ఒప్పుకోవడానికి కారణం అభిమానులే.. వారి ఇచ్చే ఉత్సాహం.. ప్రోత్సాహంతోనే సినిమాలు చేస్తున్నట్లు చెప్పారు. అభిమానుల కోసం చేతులు ఇరగ్గొట్టుకోవడమే కాదు రక్తం చిందించి అయినా పని చేస్తానని భావోద్వేగానికి లోనయ్యారు. చిరంజీవి కొడుకుగా పుట్టి, పవన్ కల్యాణ్ నీడలో పెరిగిన తనకు సినిమా తప్ప ఇంకేమీ తెలియదని తెలిపారు. తాను చనిపోయే వరకు ప్రేక్షకులను అలరిస్తూ.. వారికి వినోదం అందిస్తూనే ఉంటానని హామీ ఇచ్చారు. 'ఈ చిత్రానికి కెమెరామెన్గా పనిచేసిన రత్నవేలుతో నాకు నాలుగో సినిమా. జాన్వీ కపూర్ శ్రీదేవి కంటే గొప్ప నటి కావాలి' అని రామ్ చరణ్ ఆకాంక్షించారు. జూన్ 4వ తేదీన అందరూ థియేటర్లో తప్పకుండా చూడాలని రామ్ చరణ్ కోరారు.
Zee Media: ఫిఫా ప్రపంచకప్ -2026 ప్రసార హక్కులు దక్కించుకున్న 'జీ' మీడియా
Barcelona, Catalunya:Zee Media Enterprises: అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడా సంబరం ఫుట్బాల్ ప్రపంచకప్ ఈనెలలో జరగనుంది. ఫిఫా ప్రపంచ కప్ 2026కు మూడు దేశాలు ఆతిథ్యం ఇస్తుండగా ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాలు జీ మీడియాలో ప్రసారం కానున్నాయి. ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్ల ప్రసారానికి సంబంధించిన హక్కులు జీ మీడియా దక్కించుకుంది. జీ మీడియా ఎంటర్ప్రైజెస్ ఫీఫా ప్రపంచ కప్ 2026 హక్కులను జీ మీడియా దక్కించుకోగా.. ఈనెల నుంచి ప్రసారం కానున్నాయి. ప్రపంచ కప్ మ్యాచ్లు జూన్ 11వ తేదీన అమెరికా, మెక్సికో, కెనడాలో జరగనున్నాయి.
Also Read: Govt Employees: తెలంగాణ ఉద్యోగులకు మళ్లీ షాక్.. బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
జీ మీడియా ఎంటర్ప్రైజెస్ 2026 ఫిఫా ప్రపంచ కప్ ప్రసార హక్కులను పొందింది. ఈ టోర్నమెంట్ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కొత్త స్పోర్ట్స్ ఛానల్ 'యునైట్8 స్పోర్ట్స్'లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఈ ప్రపంచ కప్ మ్యాచ్లు 'జీ5' ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా ప్రత్యక్షంగా ప్రసారం కానుండడం విశేషం. ఐపీఎల్ సంబరం ముగిసిన అనంతరం జరుగుతున్న ప్రపంచ క్రీడా సంబరం ఫుట్బాల్ ప్రపంచకప్కు సమయం ముంచుకొస్తోంది.
ప్రపంచ కప్ మ్యాచ్లు జూన్ 11వ తేదీన అమెరికా, మెక్సికో, కెనడాలలో జరగనున్నాయి. ప్రపంచ కప్ ఫుట్బాల్కు అత్యున్నత పాలకమండలి ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్, ఫీఫాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. జీ మీడియా ఇప్పుడు 2034 వరకు ప్రధాన ఫీఫా టోర్నమెంట్లు, సంబంధిత డాక్యుమెంటరీల ప్రసార హక్కులను పొందాయి. వీటిలో 2026 ఫిఫా ప్రపంచకప్ మాత్రమే కాకుండా 2026, 2030 పురుషుల ప్రపంచ కప్లు, 2027 మహిళల ప్రపంచ కప్ కూడా ఉండడం విశేషం. దీనికి అదనంగా అండర్-17, అండర్-20 పురుషుల, మహిళల ప్రపంచ కప్లు, ఫుట్బాల్ ప్రపంచ కప్లు, ఇంటర్కాంటినెంటల్ కప్లు కూడా జీ మీడియాలో అందుబాటులో ఉంటాయి.
Also Read: IPL Final Highlights: గుజరాత్ టైటాన్స్ ఓటమి.. ఐపీఎల్ 2026 చాంపియన్ బెంగళూరు
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ ఉత్తర అమెరికాలో జరగబోయే వేసవి ఫుట్బాల్ ఈవెంట్తో ప్రారంభించి 2026 నుంచి 2034 వరకు ఎనిమిదేళ్ల కాలానికి మొత్తం 39 ప్రపంచ ఫుట్బాల్ మ్యాచ్ల ప్రత్యేక మీడియా హక్కులను పొందింది. ప్రపంచంలోని అతిపెద్ద క్రీడా ఈవెంట్లలో ఒకదాన్ని భారతీయ ప్రేక్షకులకు అందించడానికి తాము సంతోషిస్తున్నామని జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ సీఈఓ పునీత్ గోయెంకా తెలిపారు. జీ కొత్త స్పోర్ట్స్ ఛానల్ యునైట్8 స్పోర్ట్స్ నాలుగు చానల్స్ ఏర్పాటు కాగా (Unite8 Sports 1), (Unite8 Sports 1 HD), (Unite8 Sports 2), (Unite8 Sports 2 HD) ఆ చానల్స్లో ప్రత్యక్ష ప్రసారాలు జరుగుతాయి.
జీ మీడియా ప్రత్యక్ష ప్రసారాలు ఇవే..!
2027 మహిళల ప్రపంచ కప్
2030 పురుషుల ప్రపంచ కప్లు
2034 వరకు ప్రధాన ఫీఫా టోర్నమెంట్లు
అండర్-17, అండర్-20 పురుషుల, మహిళల ప్రపంచ కప్లు, ఇంటర్కాంటినెంటల్ కప్లు
‘Z’ partners with FIFA to bring 39 global football events including FIFA World Cup 2026™, FIFA World Cup 2030™ & FIFA Women’s World Cup™ 2027 for Indian fans!
Click here to read more: https://t.co/ikr5nUF1Ck#FIFAWorldCup #WorldCup2026 #FIFAonZ pic.twitter.com/jQodlVJh7T
— ZEE (@ZEECorporate) June 1, 2026
Telangana Janasena Sabha: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు తెలంగాణ ప్రభుత్వం ఝలక్..భారీ బహిరంగ సభకు అనుమతి నిరాకరణ!
Hyderabad, Telangana:Janasena Sabha In Telangana: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించేందుకు తలపెట్టిన భారీ బహిరంగ సభకు తెలంగాణ ప్రభుత్వం బ్రేక్ వేసింది. రేపు గచ్చిబౌలి వేదికగా జరగాల్సిన 'తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ'కు అనుమతి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. దీంతో జనసేన పార్టీ తదుపరి కార్యచరణ ఏమిటంటూ ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధానంగా రెండు కారణాలను పోలీసులు, అధికార యంత్రాంగం పేర్కొంది. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అధికారిక ఉత్సవాలు జరుగుతుండటంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఉత్సవాల్లో భాగంగా భద్రతా కారణాలు, ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ సభకు అనుమతి నిరాకరించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
హైకోర్టుకు జనసేన?
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో జనసేన శ్రేణులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యాయి. సభ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో సభ నిర్వహణకు అనుమతి నిరాకరించడంతో జనసేన ముఖ్య నేతలు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రేపు ఉదయమే హైకోర్టును ఆశ్రయించాలని జనసేన లీగల్ టీమ్ యోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ సభపై రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయ వేడి రాజుకుంది. ఈ సభను వ్యతిరేకిస్తూ తెలంగాణ మంత్రులు, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ తెలంగాణ పర్యటన వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయంటూ అధికార పక్షం ఆరోపిస్తుండగా, సభను అడ్డుకోవడానికే ప్రభుత్వం కావాలని అనుమతి నిరాకరించిందని జనసేన వర్గాలు మండిపడుతున్నాయి. అయితే తెలంగాణ హైకోర్టు ఇచ్చే తీర్పుపైనే ఇప్పుడు 'తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ' భవితవ్యం ఆధారపడి ఉందని విశ్లేషకులు అంటున్నారు.
Also Read: ఏపీలో కొత్త పెన్షన్ల పండగ షురూ..దరఖాస్తు అప్పుడే..ఈ పత్రాలు రెడీ చేసుకోండి!
Also Read: రెండు విడతల్లో జమిలి ఎన్నికలు..ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
