యూపీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Aadhaar-UAN Linking: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగులకు మరింత సౌకర్యం కల్పించే దిశగా మరో కీలక అడుగు వేసింది. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)తో ఆధార్ను అనుసంధానించే ప్రక్రియను తాజాగా మరింత సులభంగా మార్చింది. దీనివల్ల PF విత్ డ్రా, ఖాతాల బదిలీలు, KYC అప్డేట్లు వంటి సేవలు ఇప్పుడు వేగంగా పూర్తవుతున్నాయి. ఈ మార్పు లక్షలాది మంది ఉద్యోగులు, PF ఖాతాదారులకు ఊరట కలిగిస్తోంది.
ఆధార్–UAN లింక్ ఎందుకు అవసరం?
UANకు ఆధార్ను లింక్ చేయడం EPFO తప్పనిసరి చేసింది. దీని ప్రధాన ఉద్దేశం ఉద్యోగుల గుర్తింపును ఖచ్చితంగా నిర్ధారించడం, మోసాలను అడ్డుకోవడం. PF ప్రయోజనాలు సమయానికి అందేలా చేస్తుంది. గతంలో పేర్లలో తేడాలు, పత్రాల అసమతుల్యత, ధృవీకరణలో జాప్యం వంటి కారణాలతో PF క్లెయిమ్లు ఆలస్యం అవుతుండేవి. కానీ ఇప్పుడు ఆధార్ అనుసంధానం వల్ల ఈ సమస్యలు చాలా వరకు తొలగిపోయాయి.
ఆన్లైన్లో లింక్ చేసే విధానం:
ఆధార్ను UANతో లింక్ చేయడానికి EPFO సులభమైన ఆన్లైన్ ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చింది. సభ్యులు EPFO అధికారిక పోర్టల్లో లాగిన్ అయి, తమ UAN, పాస్వర్డ్తో ఖాతాలోకి ఎంటర్ అవ్వాలి. అనంతరం KYC విభాగంలో ఆధార్ వివరాలను నమోదు చేస్తే UIDAI ద్వారా ఆన్లైన్ ధృవీకరణ జరుగుతుంది. ధృవీకరణ విజయవంతమైన వెంటనే ఆధార్–UAN అనుసంధానం పూర్తవుతుంది. ఇదేకాకుండా UMANG మొబైల్ యాప్ ద్వారా లేదా ఆఫ్లైన్ మార్గాల్లో కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది. ఉద్యోగులు తమకు అనుకూలమైన విధానాన్ని ఎంచుకోవచ్చు.
Also Read: Budget 2026: సీనియర్ సీటిజన్లు ఏం డిమాండ్ చేస్తున్నారు? వారి గోడును నిర్మలమ్మ వింటారా?
PF సేవలు ఇక మరింత వేగంగా:
ఆధార్ లింక్ చేసిన తర్వాత PF విత్ డ్రా, ఖాతాల బదిలీలు గణనీయంగా వేగవంతమయ్యాయి. ఒకప్పుడు క్లెయిమ్లు ప్రాసెస్ కావడానికి రోజులు లేదా వారాలు పట్టేది. కానీ ఇప్పుడు ఆన్లైన్ క్లెయిమ్లు త్వరగా పూర్తవుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు మారే సమయంలో PF బదిలీల్లో ఎదురయ్యే జాప్యాలు చాలా వరకు తగ్గాయి.
ఉద్యోగులకు నిజమైన ఉపశమనం:
గతంలో సరైన డాక్యుమెంట్లు లేకపోవడం లేదా ధృవీకరణ సమస్యల వల్ల PF డబ్బులు రావడానికి నెలల సమయం పట్టేదని చాలా మంది ఉద్యోగులు చెబుతున్నారు. దీనివల్ల వారు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఆధార్–UAN లింక్ అమలులోకి వచ్చిన తర్వాత, నిధులు సమయానికి అందడంతో కుటుంబ అవసరాలు తీర్చుకోవడం సులభమైంది. ఇది కేవలం సాంకేతిక మార్పు మాత్రమే కాదు, ఉద్యోగుల జీవితాల్లో భద్రత, నమ్మకాన్ని పెంచిన సంస్కరణగా మారింది.
EPFO తీసుకున్న ఈ చర్య ఉద్యోగులకు మరింత భద్రత, సౌలభ్యం అందిస్తోంది. ఆధార్–UAN అనుసంధానం వల్ల PF సేవలు సులభమయ్యాయి, ఆలస్యాలు తగ్గాయి. చెల్లింపులు వేగంగా జరుగుతున్నాయి. ఈ మార్పు ఉద్యోగుల ఆర్థిక జీవితాలను మరింత స్థిరంగా, సురక్షితంగా మార్చే దిశగా కీలకమైన ముందడుగుగా నిలుస్తోంది.
Also Read:Sukanya Samriddhi Yojana: ఆడపిల్లలకు రూ.72లక్షలు.. సుకన్య సమృద్ధి యోజన కొత్త మైల్స్టోన్..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Home Loan: కొత్త ఇల్లు నిర్మించుకోవాలన్నా.. ఇప్పటికే ఉన్న ఇంటిని మరమ్మతులు చేయాలన్నా.. చాలా మంది బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థల నుంచి హోమ్ లోన్ను ఆశ్రయిస్తారు. అయితే ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా రుణం మంజూరు చేయరు. రుణం ఇచ్చే ముందు బ్యాంకులు క్రెడిట్ ప్రొఫైల్, సిబిల్ స్కోర్తో పాటు మరికొన్ని కీలక అంశాలను పరిశీలిస్తాయి. అందుకే హోమ్ లోన్కు అప్లై చేసే ముందు అర్హత ఎలా నిర్ణయిస్తారు? ప్రక్రియ ఏంటి? అనే విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం ఉంటుంది.
హోమ్ లోన్ అంటే ఏమిటి అనే విషయానికి వస్తే.. ఇది ఇల్లు కొనుగోలు చేయడానికి.. కొత్తగా నిర్మించడానికి లేదా పునర్నిర్మాణం చేయడానికి రుణదాతలు అందించే సెక్యూర్డ్ లోన్. ఈ రుణానికి తీసుకునే ఆస్తినే బ్యాంకు వద్ద పూచీకత్తుగా ఉంచాలి. భద్రత ఉండటంతో ఇతర రుణాలతో పోలిస్తే హోమ్ లోన్పై వడ్డీ రేటు సాధారణంగా తక్కువగా ఉంటుంది.
హోమ్ లోన్ ఎలిజిబిలిటీ అనేది పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీ నెలవారీ ఆదాయం, క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్, గతంలో తీసుకున్న లోన్ల చెల్లింపు చరిత్ర, ప్రస్తుత వయసు, పదవీ విరమణ వయసు, అలాగే ఇప్పటికే ఉన్న నెలవారీ ఆర్థిక బాధ్యతలను బ్యాంకులు గమనిస్తాయి. ఈ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే మీరు ఎంత మొత్తానికి రుణం పొందగలరో నిర్ణయిస్తారు.
హోమ్ లోన్ తీసుకుంటే నెలకు ఎంత ఈఎమ్ఐ చెల్లించాలి అనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీని కోసం హోమ్ లోన్ కాలిక్యులేటర్ ఎంతో ఉపయోగపడుతుంది. మీరు తీసుకునే లోన్ మొత్తం, చెల్లింపు గడువు, వడ్డీ రేటు వంటి వివరాలను నమోదు చేస్తే నెలవారీ ఈఎమ్ఐ, మొత్తం వడ్డీ, మొత్తం రీపేమెంట్ ఎంత అవుతుందో స్పష్టంగా తెలుస్తుంది. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఈ కాలిక్యులేటర్లు మీ ఆర్థిక ప్రణాళికను సులభతరం చేస్తాయి.
Also Read: Budget 2026: సీనియర్ సీటిజన్లు ఏం డిమాండ్ చేస్తున్నారు? వారి గోడును నిర్మలమ్మ వింటారా?
హోమ్ లోన్ ప్రీపేమెంట్ గురించి కూడా తెలుసుకోవాలి. అంటే నిర్ణీత కాలానికి ముందే లోన్ మొత్తాన్ని పూర్తిగా లేదా కొంత భాగాన్ని చెల్లించడం. సాధారణంగా హోమ్ లోన్ గడువు 10 నుంచి 30 ఏళ్ల వరకు ఉంటుంది. అయితే అదనపు ఆదాయం లభించినప్పుడు ముందుగానే లోన్ చెల్లిస్తే వడ్డీ భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. అయితే ప్రీపేమెంట్ చేయడానికి ముందు బ్యాంకు నిబంధనలు, ఛార్జీలపై స్పష్టత ఉండాలి.
ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం, ఆ తేదీ నుంచి మంజూరైన లేదా పునరుద్ధరించబడిన ఫ్లోటింగ్ వడ్డీ రేటు లోన్లపై బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ప్రీపేమెంట్ లేదా ఫోర్క్లోజర్ ఛార్జీలను వసూలు చేయరాదు.
Also Read:Sukanya Samriddhi Yojana: ఆడపిల్లలకు రూ.72లక్షలు.. సుకన్య సమృద్ధి యోజన కొత్త మైల్స్టోన్..!!
హోమ్ లోన్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ప్రణాళిక చేయకపోతే దీర్ఘకాలిక అప్పులు, ఆర్థిక ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా మీ నెలవారీ ఈఎమ్ఐ మీ జీతంలో 35 నుంచి 40 శాతం మించకుండా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే హోమ్ లోన్తో పాటు కుటుంబ ఖర్చులు, పిల్లల చదువు, రోజువారీ అవసరాలు కూడా సమతుల్యంగా నడవాలి. అందుకే లోన్ తీసుకునే ముందు మీ ఆదాయం, ఖర్చులు, భవిష్యత్ అవసరాలను సమగ్రంగా అంచనా వేసుకోవడం ఎంతో ముఖ్యం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
BRS Party Ready For Battle: పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించుకున్ని ఫుల్ జోష్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన గులాబీ పార్టీ ఈ క్రమంలోనే ఇన్చార్జ్లను నియమించింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఇన్చార్జ్లు, సమన్వయకర్తలను బీఆర్ఎస్ పార్టీ నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Janasena Party: తెలంగాణలో సంచలన పరిణామం.. సినీ నటుడు ఆర్కే సాగర్ కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి కోసం అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ప్రత్యేక సమన్వయకర్తలను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు. మొత్తం 122 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు సమన్వయకర్తలను ప్రకటించారు. ప్రతి మున్సిపాలిటీకి ఒక సీనియర్ నాయకుడిని ఎన్నికల ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల వ్యూహాలను రూపొందించడం ఈ సమన్వయకర్తల ప్రధాన బాధ్యతగా అని బీఆర్ఎస్ పార్టీ తెలిపింది.
Also Read: Govt Employees: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు.. ఉత్తర్వులు జారీ!
మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ముగిసే వరకు ఇన్చార్జ్లు నిరంతరం ఆయా మున్సిపాలిటీల్లో అందుబాటులో ఉంటారని బీఆర్ఎస్ పార్టీ వెల్లడించింది. మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో సమన్వయకర్తలు కీలక పాత్ర పోషిస్తారని.. స్థానిక నాయకత్వంతో చర్చించి, గెలుపు గుర్రాలను గుర్తించి, నివేదికలను ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానానికి సమర్పించాలని కేటీఆర్ ఆదేశించారు. పార్టీ రూపొందించిన ప్రచార కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడం, బూత్ స్థాయి ఏజెంట్లను సమన్వయం చేయడం వంటి అంశాలను ఇన్చార్జ్లు పర్యవేక్షిస్తారు. మున్సిపల్ ఎన్నికల సరళిని, గ్రౌండ్ రిపోర్టులను ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్కు, వర్కింగ్ ప్రెసిడెంట్కు నివేదించేలా బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. పార్టీ తరపున నియమించిన మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్తల పూర్తి జాబితాను విడుదల చేసి.. ప్రజల మద్దతుతో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
Also Read: KTR Press Meet: ఫోన్ ట్యాపింగ్ విచారణ తర్వాత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Brs ktr sends legal notices to bandi sanjay and mp dharmapuri arvind: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం ప్రస్తుతం దుమారంగా మారింది. ఇప్పటికే దీనిపై హరీష్ రావును, కేటీఆర్ లను సిట్ విచారించింది. అంతే కాకుండా దీనిపై సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని బీఆర్ఎస్ మండిపడింది. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్ లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసుల్ని జారీ చేశారు.నోటీసులు అందిన ఐదురోజుల్లో రియాక్ట్ కాకుంటే సివిల్ తో పాటు క్రిమినల్ చట్టాల కింద కఠిన చర్యలుతీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.
ముఖ్యంగా ఎంపీ ధర్మపురి అర్వింద్, కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని సడలించేలా వీరు చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఎలాంటి ప్రూఫ్ లు లేకుండా అసత్యాలు ప్రచారం చేశారని మండిపడ్డారు.
ఇప్పటికే కేంద్రమంత్రి బండి సంజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసు న్యాయస్థానంలో ఉన్నప్పటికీ… చట్ట వ్యతిరేకంగా మరోసారి నోరు పారేసుకున్నారన్నారు. ఈ మేరకు బండి సంజయ్, అరవింద్ లకు కేటీఆర్ తన న్యాయవాదులతో నోటీసులు పంపించారు.
బండి సంజయ్కు పంపిన నోటీసులో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆయన చేసిన ఆరోపణలను కేటీఆర్ న్యాయవాదులు ప్రస్తావించారు. కేటీఆర్ కుటుంబం ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్లు సంపాదించిందని, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేశారంటూ జనవరి 23న నిర్వహించిన ప్రెస్ మీట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. ఇప్పటికే బండి సంజయ్పై సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా నడుస్తుందని మరల ఈ వ్యాఖ్యలు చేయడంపై కేటీఆర్ మండిపడ్డారు.
మరోవైపు ఎంపీ ధర్మపురి అరవింద్కు పంపిన నోటీసులో ఆయన చేసిన వ్యక్తిగత దూషణలను తప్పుబట్టారు. డ్రగ్స్ సేవించడం, సరఫరా చేస్తున్నారంటూ అరవింద్ చేసిన వ్యాఖ్యలు అక్షేపణీయమని పేర్కొన్నారు.
Read more: CP Sajjanar: నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. నుమాయిష్ సందర్శకులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు..
ఈ ఇద్దరు ఎంపీలు తమ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, బహిరంగంగా నిబంధనలు లేని క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకుండా చట్టపరంగా సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ అంశం పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న చందంలా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Snakes Repellent Plants: ఇళ్లలోకి పాములు రావడం అనేది ప్రాణాపాయంతో కూడుకున్న విషయం. అయితే, వాటిని కొట్టడం లేదా చంపడం కంటే, కొన్ని సహజసిద్ధమైన పద్ధతుల ద్వారా పాములు మీ ఇంటి దరిదాపుల్లోకి రాకుండా నివారించవచ్చు.
పాములు చాలా సున్నితమైన ఘ్రాణశక్తిని (వాసన చూసే శక్తి) కలిగి ఉంటాయి. కొన్ని రకాల మొక్కలు విడుదల చేసే రసాయనాలు, ముళ్లు వాటికి చిరాకును, భయాన్ని కలిగిస్తాయి.
1. బంతి పూలు (Marigolds)
చాలామంది ఇళ్లలో అందం కోసం పెంచుకునే బంతి మొక్కలు పాములను తరిమికొట్టడంలో అద్భుతంగా పనిచేస్తాయి. బంతి పూల వేర్లు, ఆకుల నుండి వచ్చే ఒక ప్రత్యేకమైన ఘాటు వాసన పాములకు అస్సలు పడదు. మీ పెరట్లో వీటిని పెంచడం వల్ల పాములు ఆ దరిదాపుల్లోకి రావడానికి సాహసించవు.
2. సర్పగంధ (Rauwolfia serpentina)
దీని పేరులోనే 'సర్ప' అని ఉంది. ఈ మొక్క ఆకులు, వేర్ల నుంచి వచ్చే వాసన పాములను దరిచేరనీయదు. ఆయుర్వేదంలో కూడా ఈ మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పాములకు ఈ మొక్క వాసన పీల్చడం అసౌకర్యంగా అనిపిస్తుంది, కాబట్టి అవి దూరంగా పారిపోతాయి.
3. వెల్లుల్లి, ఉల్లి (Garlic, Onion)
వెల్లుల్లి, ఉల్లిపాయలలో 'సల్ఫర్' అనే మూలకం ఉంటుంది. వీటి నుంచి వచ్చే తీవ్రమైన ఘాటు పాముల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. వెల్లుల్లి రెబ్బలను దంచి నీటిలో కలిపి ఇంటి మూలల్లో చల్లడం వల్ల కూడా పాములు లోపలికి రాకుండా నివారించవచ్చు.
4. ముళ్లున్న మొక్కలు (Rose or Cactus)
పాము చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే అవి ముళ్లు ఉన్న ప్రదేశాల్లో ప్రయాణించడానికి భయపడతాయి. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద లేదా కిటికీల దగ్గర గులాబీ వంటి ముళ్లున్న మొక్కలను పెంచడం వల్ల అవి లోపలికి రావడానికి వెనుకాడతాయి.
5. లెమన్ గ్రాస్ (Lemon Grass)
లెమన్ గ్రాస్ నుంచి వచ్చే నిమ్మ వాసన పాములను తరిమికొట్టడానికి సహాయపడుతుంది. ఈ మొక్క నుంచి విడుదలయ్యే సిట్రోనెల్లా వాసన పాములకు అస్సలు నచ్చదు.
గమనిక: పాములు మనుషుల మాటలు వింటాయని కొందరు నమ్ముతారు, కానీ శాస్త్రీయంగా పాములకు చెవులు ఉండవు. అవి కేవలం నేల మీద వచ్చే ప్రకంపనలను (Vibrations) మాత్రమే గుర్తించగలవు. కాబట్టి పాములను చూసినప్పుడు అనవసరమైన సాహసాలు చేయకుండా, నిపుణులకు సమాచారం అందించడం ఉత్తమం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Municipal Elections: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీలోని కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న జనసేన పార్టీ తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేస్తామని ప్రకటించింది. కొండగట్టు పర్యటన సమయంలో పవన్ కల్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన సిద్ధమైంది. ఈ మేరకు జనసేన పార్టీ సీనియర్ నాయకుడు, సినీ నటుడు ఆర్కే సాగర్ కీలక ప్రకటన చేశాడు. మున్సిపల్ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Chandrababu: చెడు ఆలోచనలు కలిగిన నేరస్తులతో ఏపీ నాశనం: సీఎం చంద్రబాబు
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ సమావేశం నిర్వహించగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆ పార్టీ ఇన్చార్జ్ ఆర్కే సాగర్ కీలక ప్రసంగం చేశారు. శివనగర్లో జరిగిన సమావేశంలో ఆర్కే సాగర్ మాట్లాడుతూ.. జనసేన పార్టీకి ప్రాంత భేదాలు లేవని స్పష్టం చేశారు. జనసేన పార్టీ తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ అని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న సమయంలో.. ఆ తర్వాత కూడా చేనేతలకు అండగా ఉండాలనే లక్ష్యంతో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రతి సోమవారం చేనేత దుస్తులు ధరిస్తున్నారని వివరించారు. రానున్న రోజుల్లో చేనేతలకు అండగా ఉండేందుకు పవన్ కల్యాణ్ సిరిసిల్లకు వస్తారని ఆర్కే సాగర్ ప్రకటించారు.
Also Read: KTR Press Meet: ఫోన్ ట్యాపింగ్ విచారణ తర్వాత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
యువత రాజకీయాల్లోకి రావాలని వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆర్కే సాగర్ తెలిపారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో జరగనున్న ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆర్కే సాగర్ ప్రకటించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీలో చేరికలను స్వాగతించారు. అంతకుముందు చౌరస్తాలో నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రకటించడంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండగా.. కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలనుంది. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గిఫ్ట్.. బడ్జెట్కు ముందే 63 శాతం డీఏ పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Latest 5-headed Rare Snake Video Watch Here: ఆధునిక యుగంలో స్మార్ట్ ఫోన్ అనేది కీలకమైన వస్తువుగా మారింది. అంతేకాకుండా ఇంటర్నెట్ వినియోగం కూడా విపరీతంగా పెరుగుతూ వస్తోంది. దీని కారణంగా చిన్న పెద్ద అందరూ సోషల్ మీడియాను అతిగా వినియోగిస్తూ వస్తున్నారు. నిజానికి ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత సోషల్ మీడియాలో ఎలాంటి వీడియోలు పెడితే అలాంటివి వైరల్ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా వన్యప్రాణులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తూ వస్తున్నాయి. తరచుగా పాములకు సంబంధించిన వీడియోలైతే ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తున్నాయి. తాజాగా ఓ అరుదైన పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో సోషల్ మీడియా వినియోగదారులను విష్మయానికి గురిచేస్తుంది. ఈ వీడియోలో రోడ్డుపై ఐదు తలలు కలిగిన ఓ పాము వెళ్తుండడం.. దానిని చూసి జనం భక్తితో నమస్కరించడం ఈ వీడియోలో మీరు గమనించవచ్చు. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... వీడియోలో ముందుగా ఓ తార్ రోడ్డు దానిపై ఐదు తలలు కలిగిన ఓ భారీ నాగుపాము జనం మధ్య నుంచి దర్జాగా పాకుతూ వెళ్తోంది. ఈ ఆకారం చూడడానికి పురాణాల్లో పేర్కొన్న శేషనాగును తలపిస్తోంది.
ఈ శేషనాగు రోడ్డు దాటుతున్న సమయంలో అక్కడున్న స్థానికులు ఎవరు భయపడకుండా.. దానిని ఒక దైవ స్వరూపంగా భావించి నమస్కరిస్తూ ఉన్నారు. కొంతమంది మహిళా మనులైతే పక్కనే ఉండి ఆ పామును చూస్తున్నారు.. వీడియోను పూర్తిగా గమనిస్తే.. పాము రోడ్డు దాటుతున్న సమయంలో ఒక మహిళ పసుపు కుంకుమ పూలతో ఉన్న ప్లేటును పట్టుకొని హారతి ఇవ్వడం కూడా మీరు గమనించవచ్చు. పక్కనే ఉన్న వ్యక్తి భక్తితో ఎంతో గంభీరంగా ఓం నమశ్శివాయ అంటూ చేతులు జోడించి నమస్కరించడం మీరు చూడొచ్చు.. ఇక మరి కొంతమంది అయితే నాగదేవత మమ్మల్ని ఆశీర్వదించు అంటూ వారు మాట్లాడడం కూడా వీడియోలో క్లియర్గా వినిపిస్తుంది.
Also Read: Giant Cobra Video: కిచెన్లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..
అయితే, ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారుల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఇది సాక్షాత్తు ఆ పరమశివుడి అనుగ్రహమని.. ఎంతో పుణ్యం చేసుకుంటే ఇలా నాగదేవత ప్రత్యక్షమవుతుందని నమ్ముతుండగా.. ఇక మరి కొంతమంది అయితే దీనిని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ ద్వారా సృష్టించి.. ఎవరో కావాలని అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేశారని అంటున్నారు. అయితే ఫ్యాట్ చెకింగ్ లో భాగంగా ఈ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సృష్టించిందని తేలింది. ఎవరో కావాలని యూట్యూబ్లో వ్యూస్ కోసం ఇలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఇలాంటి వీడియోలు సృష్టించి పోస్ట్ చేశారని ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది.
Also Read: Giant Cobra Video: కిచెన్లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rahu And Venus Conjunction Effect On Zodiac News: శుక్రుడిని సంపాదన అదృష్టం ఐశ్వర్యానికి అధిపతిగా భావిస్తారు. అలాంటి ఈ గ్రహం ఫిబ్రవరి 6వ తేదీన మకరం నుంచి కుంభంలోకి ప్రవేశించబోతోంది. మార్చి రెండో తేదీ వరకు శుక్రుడు శనిపాలించే కుంభరాశిలోనే సంచార దశలో ఉంటాడు. అలాగే దుష్ట గ్రహంగా భావించే రాహువు కూడా ఇదే రాశిలో సంచార దశలో ఉన్నాడు. ఇలాంటి సమయంలో శుక్రుడితో పాటు రాహు గ్రహ కలయిక జరగబోతోంది. అయితే, ఇలాంటి సమయంలో అత్యంత శుభప్రదమైన ప్రభావం అన్ని రాశుల వారిపై పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ సంయోగం కారణంగా మూడురాశుల వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రెండు గ్రహాల ప్రభావంతో కొన్ని రాశుల వారు ఊహించని సంపదను పొందబోతున్నారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, శుక్రుడు, రాహవు సంయోగంతో అత్యద్భుతమైన ప్రయోజనాలు పొందబోయే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశుల వారికి ఊహించని సంపద..
వృషభరాశి
శుక్రుడు రాహువు కలయిక కారణంగా వృషభ రాశి వారికి పురోగతి ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు చాలా లాభదాయకంగా మారుతాయి. ఎప్పటినుంచో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులు ఈ సమయంలో కొన్ని రకాల శుభవార్తలు వింటారు. అలాగే ఈ సమయంలో ఖర్చులు విపరీతంగా పెరిగినప్పటికీ.. ఖర్చులకు తగ్గ ఆదాయం కూడా సమకూరుతుంది. అంతేకాకుండా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వీటివల్ల భవిష్యత్తులో అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా మెరుగుపడుతుంది.
వృశ్చిక రాశి
శుక్రుడు, రాహవు గ్రహాల సంయోగం కారణంగా వృశ్చిక రాశి వారికి కూడా ఆకస్మిక ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో డబ్బు ఉన్నట్టుండి పెరుగుతుంది. దీంతోపాటు ఆనందం ఆస్తులు కూడా అనుకున్నంత స్థాయిలో పెరుగుతాయి. అలాగే ఈ సమయంలో సానుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా కొత్త ఇళ్లతో పాటు కార్లు కూడా కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. ఆస్తులపరంగా కొన్ని రకాల శుభవార్తలు కూడా వినగలుగుతారు. కుటుంబ సంబంధాలు ఈ సమయంలో మధురంగా మారుతాయి. వీరు పూర్వీకుల ఆస్తుల నుంచి బహరి లాభాలు పొందగలుగుతారు. ముఖ్యంగా ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
కుంభరాశి
కుంభ రాశిలో జన్మించిన వ్యక్తులకు శుక్రుడు, రాహవు గ్రహాల సంయోగంతో మంచి ఫలితాలు రావడం ప్రారంభమవుతాయి. వీరికి ఈ సమయంలో ఆదాయం కూడా పెరుగుతుంది. దీంతో పాటు ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. ముఖ్యంగా ప్రవర్తనలో ఊహించని మార్పులు సంభవిస్తాయి. పెట్టుబడులపై నియంత్రణ కూడా పెరుగుతుంది. ఉద్యోగాలు చేస్తున్న వారు తాము చేస్తున్న పనుల్లో సంతృప్తి కూడా పొందుతారు. భాగస్వామ్య వ్యాపారస్తులకు సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా కెరీర్ పరంగా ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. వ్యక్తిగత జీవితంలో అద్భుతమైన మార్పులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మంచి పనులు చేసేందుకు ప్రయత్నించడం చాలా మంచిది.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Oppo Find X9 Ultra Price In India: చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో మార్కెట్లోకి తమ అద్భుతమైన మొబైల్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇది ప్రీమియం ఫీచర్స్తో హై బడ్జెట్లో అందుబాటులోకి రాబోతోంది. దీనిని కంపెనీ ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా పేరుతో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ మొబైల్ డిజైన్ గతంలో విడుదల చేసిన అన్ని స్మార్ట్ఫోన్స్ మోడల్స్ లా కాకుండా చాలా భిన్నంగా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మొబైల్కు సంబంధించిన ఫీచర్ ఇటీవల సోషల్ మీడియాలో లీక్ కూడా అయ్యాయి. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా స్మార్ట్ఫోన్ గత ఏడాది ఏప్రిల్లో ప్రారంభించబడిన ఒప్పో ఫైండ్ X8 అల్ట్రా సక్సెస్గా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మొబైల్కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఇది ఎంతో శక్తివంతమైన 200-మెగాపిక్సెల్ సోనీ LYT-901 ప్రధాన కెమెరాతో అందుబాటులోకి రాబోతోంది. దీంతోపాటు అదనంగా 50-మెగాపిక్సెల్ శామ్సంగ్ JN5 అల్ట్రా-వైడ్ కెమెరా కూడా లభిస్తుంది. అదేవిధంగా ఈ స్మార్ట్ఫోన్లో 3X ఆప్టికల్ జూమ్తో 200-మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ కెమెరా కూడా అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రత్యేకంగా 50-మెగాపిక్సెల్ సోనీ LYT-600 కెమెరా కూడా ఉంటుంది.
అలాగే ఇందులో ప్రత్యేకమైన సెల్ఫీ వీడియో కోసం 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ను కూడా అందుబాటులో ఉంచారు. ఈ మొబైల్ చాలా ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ 16 ఆధారంగా కలర్ఓఎస్ 16 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. ఈ ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ఎంతో శక్తివంతమైన 7,000 mAh బ్యాటరీతో అందుబాటులోకి రాబోతున్నట్లు సోషల్ మీడియాలో లీకైన వివరాలు చెబుతున్నాయి. దీంతోపాటు ఇందులో కంపెనీ మల్టీ టాస్కింగ్తో పాటు గేమింగ్ కోసం స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ను కూడా అందిస్తోంది. ఈ ప్రాసెసర్ పెద్ద పెద్ద గేమ్స్ ఆడే వారికి ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది చాలా అద్భుతమైన పనితీరును అందిస్తుంది.
ఇక ఈ ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా స్మార్ట్ఫోన్లో కంపెనీ సెక్యూరిటీ పరంగా అల్ట్రాసోనిక్ ఫింగర్ప్రింట్ స్కానర్ను కూడా అందించబోతోంది. దీంతోపాటు 120 Hz రిఫ్రెష్ రేట్తో 6.82-అంగుళాల 2K AMOLED డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. దీనివల్ల అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ పొందవచ్చు. అలాగే స్క్రోలింగ్ కూడా చాలా స్మూతీగా ఉంటుంది. ఎంతసేపు స్క్రోల్ చేసిన మంచి అనుభూతి కలుగుతుంది. ఇటీవల లీకైన వివరాల్లోకి వెళ్తే.. దీనిని కంపెనీ బేస్ మోడల్ 6.59-అంగుళాల AMOLED డిస్ప్లేతో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్లో పాటు 7,025mAh బ్యాటరీ, 80W వైర్డు చార్జింగ్ సపోర్ట్ను కలిగి ఉంటుంది. అయితే, ఈ స్మార్ట్ఫోన్పై కంపెనీ అది త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందులో భాగంగా మరిన్ని ఫీచర్లతో పాటు ధర వివరాలు కూడా అందుబాటులోకి వస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Google Pixel 10 Offer Price: గూగుల్ తన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ గూగుల్ పిక్సెల్ 10 (Google Pixel 10) పై భారత మార్కెట్లో అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ ప్రేమికులకు, ముఖ్యంగా బెస్ట్ కెమెరా ఫోన్ కోరుకునే వారికి ఇది సరైన సమయం. ఎటువంటి ఎక్స్ఛేంజ్ లేకుండానే కేవలం బ్యాంక్ ఆఫర్లతో ఈ ఫోన్ ధరను భారీగా తగ్గించుకోవచ్చు.
ధర, ఆఫర్ల వివరాలు:
గూగుల్ పిక్సెల్ లాంచ్ ధర రూ.79,999గా (12GB RAM + 256GB వేరియంట్) ఉంది. ప్రస్తుతం రిపబ్లిక్ సేల్ నేపథ్యంలో ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లో నేరుగా రూ.5,000 తగ్గించి రూ.74,999 కి అందుబాటులో ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్ (HDFC) ఉపయోగించి EMI ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.7,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ రెండు ఆఫర్లు కలిపితే పిక్సెల్ 10 మీకు కేవలం రూ.67,999కే లభిస్తుంది.
ICICI బ్యాంక్ కార్డ్స్ ద్వారా 5% (గరిష్టంగా రూ.3,000) వరకు తగ్గింపు పొందే వీలుంది. దీంతో పాటు మీ పాత మొబైల్ను ఎక్ఛేంజ్ చేయడం ద్వారా మీకు దాదాపుగా రూ.25,000 వరకు తగ్గింపు లభించే అవకాశం ఉంది. అయితే ఎక్ఛేంజ్ ఆఫర్ అనేది మీ మొబైల్ బ్రాండ్, వాల్యూ, కొనుగోలు చేసిన సంవత్సరం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది.
గూగుల్ పిక్సెల్ 10 - ఫీచర్లు..
అత్యాధునిక డిస్ప్లే: 6.3-అంగుళాల యాక్చువా OLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గరిష్టంగా 3,000 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది.
టెన్సర్ G5 చిప్సెట్: గూగుల్ సొంతంగా తయారు చేసిన సరికొత్త Tensor G5 ప్రాసెసర్ ద్వారా ఇది అత్యంత వేగంగా పనిచేస్తుంది.
ప్రో-గ్రేడ్ కెమెరా: 48MP మెయిన్ సెన్సార్, 13MP అల్ట్రావైడ్, 10.8MP టెలిఫోటో కెమెరాలతో అద్భుతమైన ఫోటోలు తీయవచ్చు.
ఆండ్రాయిడ్ 16 & AI: ఇది నేరుగా ఆండ్రాయిడ్ 16 ఓఎస్తో వస్తుంది. గూగుల్ జెమిని AI (Gemini AI), మ్యాజిక్ ఎడిటర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
7 ఏళ్ల భరోసా: గూగుల్ ఈ ఫోన్కు 2033 వరకు (ఏకంగా 7 సంవత్సరాలు) సాఫ్ట్వేర్, సెక్యూరిటీ అప్డేట్లు అందిస్తామని హామీ ఇచ్చింది.
బ్యాటరీ: 4,835mAh బ్యాటరీతో పాటు 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలదు.
పిక్సెల్ సిరీస్లో కెమెరా క్వాలిటీ, సాఫ్ట్వేర్ అనుభవం ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటాయి. ప్రస్తుతం లభిస్తున్న రూ.12,000 తగ్గింపు ఈ ప్రీమియం ఫోన్ను మంచి డీల్గా మారుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Maoist Surrender Today News: మారుతున్న కాలంతో పాటు ప్రభుత్వ పునరావాస కార్యక్రమాలకు ఆకర్షితులైన మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి కలిసిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో 8 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝ (Amber Kishore Jha) ఎదుట లొంగిపోయారు. శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా సిపి వారికి ఘనస్వాగతం పలికి.. ప్రభుత్వం తరఫున అందాల్సిన తక్షణ సహాయాన్ని అక్కడే అందజేశారు.
లొంగిపోయిన వారిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంపూర్ గ్రామానికి చెందిన ఏడుగురు సభ్యులతో పాటు తెలంగాణలోని జగిత్యాల జిల్లా చెగ్యాం గ్రామానికి చెందిన ఒకరు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరంతా గత కొద్ది కాలం నుంచి మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులై మిలీషియా సభ్యులుగా కొనసాగుతున్నారని సమాచారం.. అయితే, ఇటీవలే అడవుల్లో కఠినమైన పరిస్థితులు ఏర్పడడం, పోలీసులనిగా, ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల అవగాహన పెరగడంతో వారు లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో వారు పోలీసుల ఎదుట పొంగిపోయినట్లు తెలుస్తోంది.
లొంగిపోయిన ఎనిమిది మంది సభ్యులకు ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి తక్షణమే రూ.25 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని సిపి అందజేశారు. అంతేకాకుండా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లొంగిపోయిన వారికి తప్పకుండా పూర్తిస్థాయిలో పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు.. అలాగే ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రతి ఫలాలను వారికి అందేలా చూస్తామన్నారు.. ప్రస్తుతం చదువుకున్న వారెవరు మావోయిస్టు పార్టీ వైపు వెళ్లేందుకు మొగ్గు చూపటం లేదని.. అందరూ ఉపాధి అవకాశాల వైపు, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారని ఆయన తెలిపారు.
అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా చేపడుతున్న అభివృద్ధి పనులతో పాటు పోలీస్ కౌన్సిలింగ్ వల్ల మావోయిస్టులు లొంగుబాట పడుతున్నారని.. అడవుల్లో మిగిలిన వారు కూడా ఆయుధాలు వీడి.. జనజీవన స్రవంతిలో కలవాలని సిపి అంబర్ కిషోర్ ఝ సూచించారు.. లొంగుతున్న సభ్యుల్లో ఒకరైన శ్రీకాంత్ మాట్లాడుతూ.. అడవుల్లో ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వివరించారు.. ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస ప్యాకేజీలు.. ఉపాధి హామీలు తమలో ధైర్యాన్ని నింపాయని, అలాగే గౌరవమైన జీవితాన్ని గడపాలని ఉద్దేశంతోనే లొంగిపోతున్నట్లు ఆయన తెలిపారు. తమలాగే ఇతరులు కూడా అడవుల నుంచి బయటికి వచ్చి ప్రశాంతమైన జీవితాన్ని ప్రారంభించాలని ఆయన కోరారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Massive fire accident at furniture shop in nampally: హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ దుకాణంలో గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో మొత్తంగా ఆరుగురు చిక్కుకున్నారు. రెప్పపాటులో బిల్డింగ్ అంతా మంటలు వ్యాపించాయి.ఈ ప్రాంత మంతా దట్టమైన నల్లని పొగలు అలుముకున్నాయి. వెంటనే స్థానికులు ఫైర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన స్థలంకు చేరుకున్న ఫైర్ డిపార్ట్ మెంట్ అధికారులు నాలుగు ఫైరింజన్ లతో మంటలు అదుపు చేస్తున్నారు.
హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నీచర్ షాపులో భారీ అగ్ని ప్రమాదం
షాపులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి నాలుగు అంతస్థులకు వ్యాపించాయి.
ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు మంటల్లో చిక్కుకున్నారు.
ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.#FireAccident pic.twitter.com/ZY6NLWTUtU
— greatandhra (@greatandhranews) January 24, 2026
మొత్తంగా మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అగ్ని ప్రమాదంకు షార్ట్ సర్క్యూట్ కారణం కావొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఈ ఘటన మాత్రం నాంపల్లిలో గందర గోళంగా మారింది. నుమాయిష్ నేపథ్యంలో చాలా మంది వీకెండ్ కావడంతో నాంపల్లి పరిసర ప్రాంతంలో షాపింగ్ చేస్తారు.
ఇలాంటి తరుణంలో ఈ ఘటన సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. ప్రమాద సమయంలో నాలుగు అంతస్తుల భవనంలో ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ఆరుగురు వ్యక్తులు చిక్కుకున్నట్లు సమాచారం. మొత్తంగా ఇంకా అధికారులు మంటలను ఆర్పుతున్నారు. దీనిపై అధికారులు రియాక్ట్ అయితే అసలు విషయాలు బైటకు రానున్నాయని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Lion Symbol For Kavitha Municipal Election: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మాజీ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత, తన సొంత రాజకీయ ప్రస్థానాన్ని స్థానిక మున్సిపల్ ఎన్నికల ద్వారా ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. భారత రాష్ట్ర సమితి (BRS) నుండి బయటకు వచ్చిన ఆమె, తన 'జాగృతి' సేనను ఎన్నికల బరిలోకి దించుతున్నారు. జాగృతి పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో, రాబోయే మున్సిపల్ ఎన్నికల కోసం కవిత ఒక వ్యూహాత్మక అడుగు వేశారు.
1. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB)తో ఒప్పందం..
కవిత తన సొంత పార్టీ 'జాగృతి' రిజిస్ట్రేషన్ పూర్తి కావడానికి ఇంకా 4-5 నెలల సమయం పట్టేలా ఉంది. అయితే ఈనెల 27న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో, ఆమె ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో జతకట్టారు. ఆ పార్టీకి చెందిన 'సింహం' గుర్తుపైనే జాగృతి అభ్యర్థులు పోటీ చేయనున్నారు.
2. 'సింహం' గుర్తు ఎందుకు?
తెలుగు రాష్ట్రాల్లో 'సింహం' గుర్తుకు ప్రత్యేక ఆదరణ ఉంది. స్వతంత్రులు, రెబల్ అభ్యర్థులు ఈ గుర్తును ఎక్కువగా కోరుకుంటారు. గతంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ మున్సిపాలిటీలో ఇదే గుర్తుతో ఘనవిజయం సాధించి, ప్రధాన పార్టీలకు షాక్ ఇచ్చారు. ఓటర్లలో ఈ గుర్తు సులభంగా రిజిస్టర్ అవుతుందని, ధైర్యానికి ప్రతీకగా కనిపిస్తుందని భావిస్తున్నారు.
3. ఎన్నికల బరిలో 'జాగృతి' వ్యూహం..
ఎన్నికలు జరుగుతున్న అన్ని మున్సిపాలిటీల్లోనూ జాగృతి అభ్యర్థులను నిలబెట్టాలని కవిత నిర్ణయించారు. ఫార్వర్డ్ బ్లాక్ బీ-ఫార్మ్లను ఉపయోగించి ఈ అభ్యర్థులు ఎన్నికల రంగంలోకి దూకనున్నారు.
4. ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
కవిత అభ్యర్థుల ఎంట్రీ ఇప్పుడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీల్లో వణుకు పుట్టిస్తోంది. జాగృతి అభ్యర్థులు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలుస్తారా? లేక బిఆర్ఎస్ ఓట్ బ్యాంక్ను దెబ్బతీస్తారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. కేసీఆర్ కుమార్తెగా కవితకు ఉన్న పట్టు, ఇప్పుడు సొంతంగా పోటీ చేయడంపై బిఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత కవిత ఏ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తారో చూడాలి. 'సింహం' గుర్తు ఆమె రాజకీయ భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తుందో కాలమే నిర్ణయించాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Swarnandhra Swachhandhra: 'చెడు ఆలోచనలు పెట్టుకుని నేరస్తులు రాజకీయాలు చేసి రాష్ట్రానికి భవిష్యత్ లేకుండా చేశారు. దేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంలో జన్మభూమి, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు చేపట్టి స్వచ్ఛత కోసం పనిచేశాం' అని సీఎం చంద్రబాబు తెలిపారు. పరిశుభ్రత విషయంలో మన అందరి ఆలోచనలూ మారాలని.. ఇల్లు ఒక్కటే కాదు మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.
Also Read: KTR Press Meet: ఫోన్ ట్యాపింగ్ విచారణ తర్వాత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
నగరిలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. 'ఏడాది కిందట స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర ఓ ఉద్యమంగా ప్రారంభించా. ప్రతీ నెలా మూడో శనివారం ప్రత్యేకమైన థీమ్తో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపడుతున్నా. స్వచ్ఛాంధ్ర అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు ఇది మన జీవన విధానం కావాలి' అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. 'ప్రతీ నెలా మొదటి తారీఖున పేదల సేవలో కార్యక్రమం ద్వారా పెన్షన్ల పంపిణీ చేస్తున్నాం. ప్రజల సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పనిచేయాలనే ఉద్దేశంతోనే పేదల సేవలో కార్యక్రమాన్ని పెట్టాం' అని తెలిపారు.
Also Read: DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గిఫ్ట్.. బడ్జెట్కు ముందే 63 శాతం డీఏ పెంపు
'కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసి చూపించింది. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆడపడుచులు ఉచితంగా ఎక్కడికైనా వెళ్లగలుగుతున్నారు. ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లను అక్కచెల్లెళ్ల సంక్షేమం కోసమే ఇస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా ద్వారా ఏడాదికి రూ.33 వేల కోట్లను పంపిణీ చేస్తున్నది కూటమి ప్రభుత్వమే' అని సీఎం చంద్రబాబు తెలిపారు. పీల్చేగాలి, తినేతిండి, తాగేనీరు కాలుష్య రహితంగా ఉండాలని ప్రకటించారు.
Also Read: Red Nagamani: స్కూల్లో కలకలం.. నాగుపాము తలపై ఎర్రటి నాగమణి
'రూ.573 కోట్లతో స్వచ్ఛాంధ్ర కోసం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశాం. 110 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ల ఏర్పాటుకు రూ.510 కోట్లు వ్యయం చేస్తున్నాం. కంపోస్ట్ తయారీ కోసం డస్ట్ బిన్లను కూడా ఇస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం ఈ-ఆటోలు, ట్రై సైకిళ్లు, పుష్ కార్డులను ఇచ్చాం. గత ప్రభుత్వం లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను పట్టణ ప్రాంతాల్లో వదిలేసి వెళ్లిపోయింది. దీంతో భూమి, భూగర్భజలాలు, వాయు కాలుష్యం పెరిగిపోయింది' అని సీఎం చంద్రబాబు తెలిపారు.
Also Read: PM Kisan: రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. పీఎం కిసాన్ సహాయం డబ్బుల్ డబుల్
'ఇప్పుడు ఆ వ్యర్ధాలన్నీ తొలగించి మళ్లీ శుభ్రమైన పరిస్థితులు తీసుకువస్తున్నాం. 112 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను పూర్తిగా తీసేసి పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తాం. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ 100 శాతం చెత్త సేకరణ చేపట్టేలా కృషి చేస్తున్నాం' అని సీఎం చంద్రబాబు చెప్పారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారు చేసే యూనిట్లు 4 ఉన్నాయి. రాజమండ్రి, విజయవాడలలోనూ మరో రెండు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. వీటితో పాటు కాంపోస్టు ఎరువు తయారీ కోసం కూడా ప్రత్యేకంగా కార్యాచరణ చేపట్టినట్లు వెల్లడించారు.
'ప్లాస్టిక్, ఈ-వేస్ట్లను సేకరించేందుకు 130 స్వచ్ఛ రథాలను ఏర్పాటు చేశాం. 2026 మార్చి నాటికి 660 స్వచ్ఛ రథాలను రాష్ట్రవ్యాప్తంగా తీసుకువస్తాం. పాఠశాలల్లో విద్యార్థులు పరిశుభ్రంగా ఉండడానికి ముస్తాబు అనే వినూత్న కార్యక్రమం చేపట్టాం. ఈ చర్యతో విద్యార్ధులకు ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నగరాల్లో భారీ స్వీపింగ్ యంత్రాలను కూడా కొనుగోలు చేసి వినియోగిస్తున్నాం' అని సీఎం చంద్రబాబు వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
8th Pay Commission DA Hike Update: 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటు, రాబోయే రోజుల్లో కరువు భత్యం (DA) పెంపుపై ప్రభుత్వ ఉద్యోగులలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జీతాల పెంపు, డీఏ విలీనం, ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై సమగ్ర విశ్లేషణ ఇక్కడ ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన సంఘం అమలు కోసం ఎదురుచూస్తున్నారు. 2026 నాటికి డీఏ గణనీయంగా పెరిగి, కొత్త పే కమీషన్ అమల్లోకి వచ్చే సమయానికి జీతాల ముఖచిత్రం పూర్తిగా మారనుంది.
1. 70% డీఏ దిశగా అడుగులు?
నవంబర్ 2025లో 8వ వేతన సంఘం ఏర్పడినప్పటికీ, నివేదిక సమర్పించడానికి సమయం పడుతుంది. ప్రస్తుతం డీఏ ప్రాథమిక వేతనంలో 58% గా ఉంది. జనవరి 2026 నాటికి ఇది 60% కి చేరుతుందని అంచనా. 2027 మధ్య నాటికి పే కమీషన్ నివేదిక వచ్చే సమయానికి, డీఏ కనీసం మూడు సార్లు సవరించబడి సుమారు 70% కి చేరుకునే అవకాశం ఉంది.
2. గత వేతన సంఘాల డీఏ గణాంకాలు
కొత్త వేతన సంఘం అమల్లోకి వచ్చిన ప్రతిసారీ డీఏను ప్రాథమిక వేతనంలో విలీనం చేసి, డీఏను సున్నా (0) నుండి తిరిగి ప్రారంభిస్తారు.
| వేతన సంఘం | ముగిసే సమయానికి డీఏ శాతం |
| 5వ వేతన సంఘం | 74% |
| 6వ వేతన సంఘం | 125% |
| 7వ వేతన సంఘం | 58% - 60% (ప్రస్తుత అంచనా) |
3. ప్రాథమిక వేతనంలో డీఏ విలీనం?
కొత్త పే స్కేల్ అమలు చేసేటప్పుడు, ఆ సమయంలో ఉన్న డీఏను మూల వేతనానికి (Basic Pay) జోడించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. డీఏ మొత్తాన్ని పూర్తిగా మూల వేతనంలో కలిపి, ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో గుణించి కొత్త జీతాన్ని నిర్ణయించడం. 50% డీఏను మాత్రమే కలిపి మిగిలిన దానిని విడిగా ఉంచడం. అయితే, ఇది పూర్తిగా ప్రభుత్వ అభీష్టానుసారం జరుగుతుంది.
4. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రభావం
7వ వేతన సంఘంలో 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను వాడారు. దీనివల్ల కనీస జీతం ₹7,000 నుండి రూ.18,000 కి పెరిగింది. ప్రస్తుతం డీఏ శాతం (60%) గతంలో కంటే తక్కువగా ఉన్నందున, 8వ వేతన సంఘం అమలులో ప్రాథమిక జీతం పెరిగితే, అది ఉద్యోగుల చేతికి వచ్చే జీతంపై మరింత సానుకూల ప్రభావం చూపుతుంది.
8వ వేతన సంఘం నివేదిక వచ్చే నాటికి డీఏ 70% కి చేరితే, ఉద్యోగుల జీతాలు గత కమిషన్ల కంటే మరింత సమర్థవంతంగా పెరిగే అవకాశం ఉంది. అయితే, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది. డీఏ విలీనం ఎలా జరుగుతుందనే దానిపై ప్రభుత్వం నుండి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook