icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

స్మార్ట్‌ఫోన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ చేంజ్.. 185Hz డిస్‌ప్లే, Bose స్పీకర్లతో Redmi K100 Pro ఎంట్రీ..

Hyderabad, Telangana:

Redmi K100 Pro Price: స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రముఖ టెక్ బ్రాండ్ రెడ్‌మి (Redmi) త్వరలోనే మార్కెట్లోకి దిమ్మతిరిగే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది.. రెడ్‌మి K100 ప్రో (Redmi K100 Pro) పేరుతో ఈ ఫోన్ విడుదల కాబోతోంది. అంతేకాకుండా ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన లీక్‌ అయిన వివరాలు స్మార్ట్‌ఫోన్‌ ప్రియులను ఎంతగానో ఆకర్శిస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని ఫీచర్స్‌తో పాటు డిజైన్‌ టెక్ ప్రపంచంలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే, లీక్‌ అయిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 

విడుదలైన పోస్టర్ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌ అత్యంత అద్భుతమైన చేరీ రెడ్ (Cherry Red) కలర్ వేరియంట్‌లో విడుదల కాబోతోంది. దీని ప్రీమియం ఫినిషింగ్ యూజర్లను విశేషంగా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి.. ఇక ఈ ఫోన్ ప్రధాన హైలైట్లలో మొదటిది దీని డిస్‌ప్లేగా భావించవచ్చు. స్మార్ట్‌ఫోన్ చరిత్రలోనే అరుదైన 185Hz రిఫ్రెష్ రేట్ ఉన్న స్క్రీన్‌ను ఇందులో అందిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. దీనివల్ల హై-ఎండ్ గేమింగ్, యాప్స్ స్క్రోలింగ్‌తో పాటు వీడియోలు చూసేటప్పుడు అత్యంత స్మూత్ అనుభూతిని అందిస్తుందని లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి.

200MP ప్రధాన కెమెరా..
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ (200MP) ప్రధాన కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. దీనితో పాటు ఆల్ట్రా-వైడ్‌తో పాటు టెలిఫోటో లెన్స్‌లు కూడా అందుబాటులో ఉండే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.. ఆడియో లవర్స్ కోసం Bose (బోస్) ట్యూన్ చేసిన స్పీకర్లను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతోంది..

గీక్‌బెంచ్ (Geekbench) లిస్టింగ్ వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ అత్యంత వేగవంతమైన Qualcomm Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌తో విడుదల కాబోతోంది.. మల్టీటాస్కింగ్ కోసం ఏకంగా 16GB RAMను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. బెంచ్‌మార్క్ పరీక్షల్లో సింగిల్ కోర్‌లో 3,429 పాయింట్లతో పాటు మల్టీకోర్‌లో 10,461 పాయింట్లు సాధించి తన పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌ను నిరూపించుకున్నట్లు కూడా సమాచారం..

భారీ బ్యాటరీ..
యూజర్లు ఎక్కువ సమయం ఛార్జింగ్ ఇబ్బంది లేకుండా వాడేందుకు ఇందులో 8000mAh భారీ బ్యాటరీని అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. దీనికి తోడు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండే ఛాన్స్‌లు ఉన్నట్లు సమాచారం. సెక్యూరిటీ కోసం 3D అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, నీరు, ధూళి నుంచి ప్రొటక్షన్ పొందేందుకు IP68, IP69 రేటింగ్‌లను అందించబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

చైనాలో జరగనున్న ప్రముఖ ChinaJoy ఈవెంట్‌లో కంపెనీ ఈ ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. ఇది శక్తివంతమైన కెమెరాతో పాటు పవర్‌ఫుల్ బ్యాటరీ, విప్లవాత్మక డిస్‌ప్లేతో రాబోతున్న ఈ Redmi K100 Pro స్మార్ట్‌ఫోన్‌, ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో కొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని కనిపిస్తోంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

AP Electoral Roll: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల ముసాయిదా విడుదల..44 లక్షల ఓట్ల తొలగింపు..మీ పేరు ఉందో లేదో ఇప్పుడే చూసుకోండి!

Vijayawada, Andhra Pradesh:

AP Electoral Roll Draft: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజాగా ఓటర్ల ముసాయిదా (డ్రాఫ్ట్) జాబితాను విడుదల చేసింది. క్షేత్రస్థాయి పరిశీలనలో సరైన సమాచారం లభించకపోవడంతో సుమారు 44.71 లక్షల ఓట్లను 'అన్‌కలెక్టబుల్' (సేకరించలేనివి) వర్గంలో చేర్చి తొలగించారు. తాజా జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3 కోట్ల 71 లక్షల 38 వేల 206 మందితో ముసాయిదా జాబితాను ఖరారు చేశారు.

ముఖ్యమైన తేదీలు, గడువులు
అభ్యంతరాలు, పేర్ల నమోదుకు చివరి తేదీకి గడువుగా వచ్చే నెల (ఆగస్టు) 31 వరకు అవకాశం కల్పించారు. అయితే ఆ అభ్యంతరాల గడువును సెప్టెంబరు 28 వరకు ఎన్నికల సంఘం అధికారులు వీటిని పరిశీలిస్తారు. ఫైనల్ బాబితాను అక్టోబరు 3న విడుదల చేయనున్నారు.

మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవడం ఎలా?
తాజా పరిణామాల నేపథ్యంలో మీ ఓటు ముసాయిదా జాబితాలో ఉందో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించడం ముఖ్యం. ఎన్నికల సంఘం విడుదల చేసిన ఈ ముసాయిదా జాబితాను రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఆఫీసర్ల (BLOs) ద్వారా లేదా అధికారిక ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ద్వారా పరిశీలించవచ్చు.

ఒకవేళ తమ ఓటు అనుమానాస్పదంగా తొలగించించారని భావించేవారు, లేదా 2002 ఓటర్ల జాబితాలో ఉండి మ్యాపింగ్ చేసుకోలేని వారికి నోటీసులు జారీ అవుతున్నాయి. ఆధార్‌తో పాటు ఈసీ సూచించిన 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించి ఓటును పునరుద్ధరించుకోవచ్చు.

కొత్త ఓట్ల నమోదు, మార్పులు: ఓటు లేనివారు కొత్తగా నమోదు చేసుకోవడానికి, అడ్రస్ మార్పు లేదా ఇతర సవరణల కోసం తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవడానికి ఒక నెల రోజుల పాటు గడువు ఇచ్చారు.

మీ ఓటు గైర్హాజరైతే లేదా జాబితాలో మార్పులు చేర్పులు ఉండాలనుకుంటే, నిర్ణయించిన గడువులోగా (ఆగస్టు 31 లోపు) సంబందిత అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. అలా చేసుకోని పక్షంలో అక్టోబరులో విడుదల చేయనున్న తుది ఓటర్ల జాబితాలో మీరు పేరును శాశ్వతంగా తొలగించవచ్చు.

Also Read: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..జూలై 31, ఆగస్టు 1న ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు!

Also REad; ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్..'జాబ్ క్యాలెండర్-2026'పై మంత్రి లోకేష్ కీలక ప్రకటన

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

OnePlus ప్రియులకు గుడ్‌న్యూస్.. రూ.20 వేల లోపే OnePlus N6x లాంచ్!

Hyderabad, Telangana:

OnePlus N6x India Launch: వన్ ప్లస్ ప్రియులకు అద్భుతమైన గుడ్‌న్యూస్‌.. భారతీయ స్మార్ట్‌ఫోన్ ప్రియులను దృష్టిలో పెట్టుకుని.. OnePlus కంపెనీ మార్కెట్‌లోకి దిమ్మతిరిగే స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ OnePlus N6x స్మార్ట్‌ఫోన్‌ పేరుతో లాంచ్‌ చేయబోతోంది. ముఖ్యంగా ఇది ఎన్నో రకాల పవర్‌ఫుల్ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ప్రీమియం డిజైన్‌ సెటప్‌తో విడుదల కాబోతోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే..
వన్‌ప్లస్‌ లవర్స్ కలలో కూడా ఊహించని విధంగా.. ఏకంగా 7,000mAh డిస్ట్రక్టివ్ బ్యాటరీ పవర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రాబోతోంది.. కంపెనీ సమాచారం ప్రకారం.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. ఏకంగా 2.5 రోజుల పాటు ఫోన్ తిరుగులేకుండా పనిచేస్తుంది. ఒక్క సింగిల్ ఛార్జ్‌తో 20 గంటలకు పైగా నాన్‌స్టాప్ వీడియో ప్లేబ్యాక్, 133 గంటలకు పైగా మ్యూజిక్ ఎంజాయ్‌మెంట్, 25 గంటల సోషల్ మీడియా స్క్రోలింగ్ లేదా 11 గంటల నిరంతర వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చని కంపెనీ క్లైమ్‌ చేస్తోంది. ఇది వింటుంటేనే టెక్ ప్రియుల్లో పూనకాలు తెప్పిస్తోంది..

కళ్లు చెదిరే లుక్స్.. 
కేవలం బ్యాటరీ మాత్రమే కాదు.. ఫోన్ లుక్స్ కూడా యూత్‌ను ఆకట్టుకునేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. ఇక దీనికి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన స్మూత్ అండ్ ప్రీమియం ఫ్లాట్ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. దీనిని కంపెనీ ఐస్ బ్లూ (Ice Blue), బర్గుండీ రెడ్ (Burgundy Red)తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు టెక్స్చర్డ్ ఫ్లాట్ రియర్ ప్యానెల్, మెరుపులు మెరిపించే LED ఫ్లాష్ లైట్‌తో ఎంతో స్టైలిష్‌గా డిజైన్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

యూజర్ల అనుభవాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లేందుకు పవర్‌ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ ఇందులో అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ (Amazon)లో ప్రత్యేక మైక్రోసైట్ కూడా రన్‌ అవుతుంది. ఆగస్టు 4వ తేదీ నుంచి భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి రాబోతోంది. గతేడాది విడుదలైన వన్‌ప్లస్ N6 రూ.22,999 ప్రారంభ ధరతో ఆకట్టుకోగా.. ఈ కొత్త N6x మోడల్ సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేలా అత్యంత రీజనబుల్ అండ్ అఫర్డబుల్ ప్రైస్‌లో రాబోతున్నట్లు సమాచారం.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

శ్రావణ మాసంలో 3 శక్తివంతమైన గ్రహాల కదలిక.. ఈ 5 రాశుల వారికి అపార ధన లాభం!

Hyderabad, Telangana:

Sravana Masam Horoscope: శ్రావణ మాసంలో అరుదైన గ్రహాలు కదలికలు చేయబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో దేవగురు బృహస్పతి, బుధుడు, శని గ్రహాల కదలికల్లో కీలకమైన మార్పులు రాబోతున్నాయి.. జులై 19న గురుడు పుష్య నక్షత్రంలోకి ప్రవేశించగా.. జులై 25న బుధ గ్రహం కదలికలు చేసింది.. అలాగే జులై 27న శని దేవుడు మీన రాశిలో వక్రగమనం ప్రారంభించాడు.

ఈ మూడు శక్తివంతమైన గ్రహాల అనుకూల ప్రభావం వల్ల ఏర్పడిన రాజయోగం ఫలితంగా 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. ప్రధానంగా 5 రాశుల వారికి పరమశివుడి ప్రత్యేక ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి.. వీరి ఆర్థిక పరిస్థితులు కూడా రెట్టింపు అవుతాయి.. కెరీర్, వ్యాపారాలలో ఊహించని విజయం సాధిస్తారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ఈ రాశులవారికి బంపర్ లాభాలు:

కర్కాటక రాశి (Cancer)
శ్రావణ మాసంలో గురుడు పుష్య నక్షత్రంలోకి సంచారం చేయడం వల్ల కర్కాటక రాశి వారికి విశేషమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కుటుంబంలో శుభకార్యాలు కూడా తప్పకుండా జరుగుతాయి.. కొత్త ఇళ్లతో పాటు వాహనం లేదా స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సమాజంలో హోదా, గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి.

మేష రాశి (Aries)
గురుగ్రహ సంచారంతో పాటు బుధుడి ప్రభావంతో మేష రాశి వారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని పురోగతి లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తువుతాయి. ఉద్యోగస్తులకు జీతాల పెంపుతో పాటు కొత్త ఉద్యోగావకాశాలు కూడా సులభంగా లభిస్తాయి.. ఆఫీసులో ప్రతిభకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది..

మిథున రాశి (Gemini)
మిథున రాశికి అధిపతి అయిన బుధుడి ప్రభావంతో గురు గ్రహ శుభ ఫలితాల వల్ల వీరి ఆర్థిక స్థితి అత్యంత సానుకూలంగా మారుతాయి.. పాత బాకీలు, నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు ఖరారవుతాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం.

తులా రాశి (Libra)
శని వక్రగమనం, గురు, బుధుల అనుకూల స్థితి తులా రాశి వారికి విశేష ప్రయోజనాలను అందిస్తుంది.. విదేశీ వ్యాపారాలు లేదా విదేశీ సంబంధిత ఉద్యోగాలు చేసేవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. 

మీన రాశి (Pisces)
మీన రాశిలోనే శని వక్రించినప్పటికీ.. గురు, బుధ గ్రహాల అనుకూలత వల్ల పాత సమస్యలు, మానసిక ఒత్తిడుల నుండి విముక్తి కలుగుతుంది.. వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి. గతంలో చేసిన పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు కలుగుతాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

ఆగస్టులో వీరికి పట్టిందల్లా బంగారమే.. ఈ 4 రాశుల జాతకం మారిపోబోతోంది!

Hyderabad, Telangana:

August Horoscope:  ఆగస్టు నెల ప్రారంభంతోనే గ్రహాల కదలికలు జరగబోతున్నాయి. శ్రావణ మాసపు సమయంలో, అరుదైన గ్రహాల సంచారం వల్ల కొన్ని రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా శుక్రుడు, అంగారక గ్రహాలు సంచారం చేయడంతో పాటు, దానికి తోడు సూర్య భగవానుడు సింహ రాశిలోకి ప్రవేశించడం వల్ల విశ్వంలో అద్భుతమైన ధనయోగం, సానుకూల ప్రభావం ఏర్పడబోతోంది.. ఈ ఆగస్టు నెల ముఖ్యంగా 4 రాశుల వారికి సకల శుభాలతో పాటు ఐశ్వర్యాన్ని, ఆనందం లభిస్తుంది. అంతేకాకుండా ఊహించని అదృష్టం కూడా పొందుతారు.

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే కాబోతోంది.. ఆగస్టు నెల మొత్తం అదృష్టం వీరికే లభించబోతోంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు శుభవార్తలు కూడా పొందుతారు.. అంతేకాకుండా వ్యాపారాలు చేస్తున్నవారు చేసే ప్రయాణాలు విశేష లాభాలను కూడా పొందుతారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు రెట్టింపు అయ్యే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి.

మీన రాశి (Pisces)
మీన రాశి వారికి ఆగస్టు నెల ఎంతో అద్భుతంగా ఉంటుంది. కోర్టు కేసులతో పాటు చట్టపరమైన చిక్కుల నుంచి పూర్తీ విముక్తి కలుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. భూములతో పాటు ఆస్తుల వివాదాలు పరిష్కారం అవ్వడంతో పాటు అద్భుతమైన ప్రయోజనాలు పొందే ఛాన్స్‌లు కనిసిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఎంతో సులభంగా తొలగిపోతాయి. అవివాహితులకు వివాహ యోగం కూడా కలుగుతుంది..

సింహ రాశి (Leo)
సింహ రాశి వారికి ఈ నెల ఎంతో అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని కూడా అందిస్తుంది. అపారమైన విజయాలు కూడా సులభంగా పొందుతారు. వీరికి ఈ సమయంలో తప్పకుండా ప్రతిభకు తగిన గుర్తింపు కూడా సులభంగా లభిస్తుంది. పైఅధికారుల నుంచి అద్భుతమైన మద్దతు లభించే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా కొత్త వాహనం లేదా ఇల్లు కొనాలనుకునే వారి కల ఈ నెలలోనే నెరవేరబోతోంది. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది.

మేష రాశి (Aries)
మేష రాశి వారికి ఈ ఆగస్టు నెల అద్బుతంగా ఉంటుంది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న విజయాలు కూడా సులభంగా లభిస్తాయి. ఆదాయ మార్గాల నుంచి కూడా అద్భుతమైన ధన లాభాలు కూడా పొందుతారు. ఉద్యోగాల్లో ఉన్నవారికి పదోన్నతులు, కార్యాలయంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. బంధాల్లో మధురమైన క్షణాలు చోటుచేసుకుంటాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

Harish Rao: ఇంజనీర్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: హరీశ్‌ రావు

Siddipet, Telangana:

Harish Rao vs Revanth Reddy: 'కాంగ్రెస్ మేనిఫెస్టోను సమాధి చేశారా.. 32 నెలలైనా ఓపీఎస్, ఆరు నెలల్లో ఇస్తామన్న పీఆర్సీ ఏవి? ప్రశ్నించే గొంతులపై ఏసీబీ, సీఐడీ అక్రమ కేసులు.. ఉద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది, ఎవరూ భయపడొద్దు' అని ప్రభుత్వ ఉద్యోగులకు బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు భరోసా ఇచ్చారు. 'చాక్‌పీస్ కొనేందుకు పైసల్లేవు, స్కావెంజర్లకు జీతాల్లేవు.. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి కంప్లీట్ ఫెయిల్' అని రేవంత్‌ రెడ్డిపై విమర్శలు చేశారు. అసెంబ్లీని స్తంభింపజేసి అయినా సరే.. ఉద్యోగుల ఓపీఎస్, డీఏల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాడుతామని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు.

పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేటలో సీపీఎస్ ఉద్యోగులు చేపట్టిన నిరసనలో పాల్గొని మాజీ మంత్రి హరీష్ రావు మద్దతు తెలిపారు. అనంతరం ఉద్యోగుల అంశాలతోపాటు రేవంత్‌ రెడ్డి ఇంజనీరింగ్‌ విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు స్పందించారు. 'సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని మీరు అడుగుతున్నది ఎలాంటి గొంతెమ్మ కోరిక కాదు. ఎన్నికల ముందు ఇదే కాంగ్రెస్ నాయకులు చేతులు జోడించి తాము అధికారంలోకి రాగానే ఓపీఎస్ తెస్తామని ఆపద మొక్కులు మొక్కి నమ్మబలికారు' అని గుర్తుచేశారు. 

కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి పుణ్యకాలం సగం దాటిపోయి 32 నెలలు అవుతోంది. విజ్ఞప్తులు చేసినా రేవంత్‌ రెడ్డి స్పందించకపోవడంతో రోడ్డెక్కారు. ఎన్నికల ముందు మాత్రం ఆరు నెలల్లో పీఆర్సీ ఇస్తామని, పెండింగ్ డీఏలు అన్నీ వెంటనే ఇస్తామని, అద్భుతమైన ఈహెచ్ఎస్ పాలసీ తెస్తామని, ఓపీఎస్ తెస్తామని మేనిఫెస్టోలో పెట్టి నమ్మించారు' అని కాంగ్రెస్‌ మోసాలు మాజీ మంత్రి హరీశ్‌ రావు వివరించారు. 'మీరు ఇచ్చిన గ్యారెంటీలను సమాధి చేశారా?  ఆ మేనిఫెస్టో ఈ రోజు ఒక చిత్తుకాగితంగా మారిపోయిందా? ఒక్కటైనా అమలు చేశారా?' అని రేవంత్‌ రెడ్డిని నిలదీశారు.

'ప్రభుత్వ ఉద్యోగులతో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడలేదు. సరైన సమయంలో వారు మీకు తప్పక గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలి' అని కాంగ్రెస్‌ పార్టీకి మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరిక చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఓపీఎస్ సాధనపై రేవంత్‌ రెడ్డిని నిలదీస్తామని.. అవసరమైతే అసెంబ్లీని స్తంభింపజేసి అయినా సరే మీకోసం గళం విప్పుతామని ప్రకటించారు. రేవంత్‌ రెడ్డి ప్రశ్నించే గొంతులను నొక్కేస్తూ, కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడని.. అక్రమ కేసులు, విజిలెన్స్, ఏసీబీ, సీఐడీ ఎంక్వైరీలు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు వివరించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని తెలిపారు. 'ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ డబ్బులను కూడా 8 నెలల పాటు ఈ ప్రభుత్వం కట్టలేదు. అసెంబ్లీలో మేము నిలదీస్తే అప్పుడు కట్టడం మొదలుపెట్టారు. కాంట్రిబ్యూషన్ కూడా కట్టకుండా మిమ్మల్ని ఎలా మోసం చేస్తోందో ఒక్కసారి ఆలోచించాలి' సీపీఎస్‌ ఉద్యోగులకు సూచించారు.

'రేవంత్‌ రెడ్డికి ఎక్కడ, ఏం మాట్లాడాలో తెలియడం లేదు. స్కూల్ పిల్లల ముందు బూతులు మాట్లాడుతారు. ఉపాధ్యాయులను అవమానపరిచేలా మీరు చదువు చెప్పిన ఇంజనీరింగ్ పిల్లలకు కనీసం దరఖాస్తు కూడా రాయరాదు అని హేళన చేశారు. ఇది మొత్తం ఉపాధ్యాయ లోకాన్ని అవమానించడమే' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు. 'ఉపాధ్యాయులు తమ స్కూళ్ల సమస్యలు అడగొద్దట.నేనెందుకు విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి అంటున్నాడు. నీకు నువ్వే సర్టిఫికెట్ ఇచ్చుకుంటావా..? నువ్వు బాగా చేశావో లేదో పిల్లలు, ఉపాధ్యాయులు, ప్రజలు మార్కులు వేయాలి' అని పేర్కొన్నారు.

'విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా స్కూల్ గ్రాంట్స్ రాలేదు, స్కూళ్లలో చాక్‌‌పీస్ కొనుక్కునేందుకు కూడా పైసలు లేవు. స్కావెంజర్లకు 7 నెలల జీతాలు లేవు. పిల్లలకు ఇప్పటిదాకా యూనిఫామ్స్ రాలేదు. మన ఊరు  మన బడి ఆపేశారు' అని రేవంత్ రెడ్డి వైఫల్యాలను మాజీ మంత్రి హరీశ్‌ రావు ఏకరువు పెట్టారు. 'మధ్యాహ్న భోజనంలో గుడ్ల ధరలు పెరిగినా, కనీసం పిల్లలకు సరిగ్గా అన్నం కూడా పెట్టలేని ముఖ్యమంత్రి నువ్వు. ఎంఈఓ, డీఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నా ఒక్కటీ నింపలేదు. బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అన్నావు, ఉత్తిదే' అని తెలిపారు.

'పిల్లల ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రెండున్నరేళ్లలో ఒక్క రూపాయి ఇవ్వలేదు. మెగా డీఎస్సీ అన్నావు, ఉత్తిదే అయిపోయింది. విద్యాశాఖలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే, నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఏం చేసినట్టు?' అని రేవంత్‌ రెడ్డిని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్ రావు ప్రశ్నించారు. 'ఇంతటి వైఫల్యాలు పెట్టుకుని, ప్రపంచ దేశాల్లో అద్భుతంగా రాణిస్తూ మన రాష్ట్రానికి పేరు తెస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులను పట్టుకుని ముఖ్యమంత్రి 'క్రిమినల్ వేస్ట్' అనడం అత్యంత దారుణం. ఆ పిల్లలను, వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి ఘోరంగా అవమానించారు' అని వివరించారు. 'అసలు రేవంత్‌ రెడ్డికి మైండ్ సరిగా లేదు. మాట్లాడిన ఆ మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌కు, ఉపాధ్యాయులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు.

0
0
Report
Advertisement

ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న పంజాబీ డాన్స్.. అబ్బబ్బ భలే ఉంది..

Hyderabad, Telangana:

Punjabi Girl Video Viral: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పడం కష్టం.. ముఖ్యంగా డాన్స్ వీడియోలకు నెటిజన్ల నుంచి లభించే ఆదరణే వేరు.. తాజాగా పంజాబీ సంప్రదాయ దుస్తుల్లో ఒక యువతి చేసిన డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఫిదా అవుతున్నారు. అయితే, ఈ వీడియో ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సాధారణంగా పంజాబీ డాన్స్ అనగానే ఉత్సాహం, ఎనర్జీ, కలర్‌ఫుల్ మూవ్స్ మనకు గుర్తుకొస్తాయి. ఈ వైరల్ వీడియోలోనూ సరిగ్గా అదే జరిగింది.. ఎరుపు రంగు పంజాబీ సూట్ (Red Suit) ధరించిన ఒక యువతి.. పంజాబీ పాటలకు వేసిన స్టెప్పులు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమె డాన్స్ మూవ్స్, బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ పర్ఫెక్ట్‌గా ఉండటంతో ఈ వీడియో తక్కువ సమయంలోనే లక్షలాది మంది దృష్టిని ఆకర్షిస్తోంది..

ఆకట్టుకుంటున్న ఎక్స్‌ప్రెషన్స్..
ఈ వీడియోలోని యువతి డాన్స్ మాత్రమే కాదు.. ఆమె ముఖంలో కనిపిస్తున్న Expressions ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయిగా భావించవచ్చు.. పాటలోని ప్రతి బీట్‌కు అనుగుణంగా ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్, వేసిన స్టెప్స్‌ చూసి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సంప్రదాయ దుస్తులలో ఇంతటి ఎనర్జిటిక్ డాన్స్ చేయడం నిజంగా అద్భుతమని నెటిజన్స్‌ అంటున్నారు..

ఈ వీడియోను వివిధ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో వేలాది మంది షేర్ చేస్తున్నారు. రియల్ టాలెంట్ అంటే ఇదే.. చూపు తిప్పుకోలేకపోతున్నాం.. పంజాబీ సంస్కృతికి తగ్గట్టుగా చాలా అందంగా డాన్స్ చేసింది.. అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియోకు లైకులతో పాటు కామెంట్లు నిమిషాల్లోనే విపరీతంగా పెరిగిపోతున్నాయి.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో ఇంటర్నెట్‌లో ఒక సంచలనంగా మారిందని భావించవచ్చు. గూగుల్ ట్రెండింగ్ లిస్ట్‌లో కూడా చోటు దక్కించుకుంటోంది. టాలెంట్ ఉంటే చాలు.. సరైన వేదిక లభిస్తే ఎవరైనా సోషల్ మీడియా స్టార్‌గా మారవచ్చని ఈ ఘటన మరొకసారి గుర్తు చేసింది..

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు రేపు సెలవు..

Hyderabad, Telangana:

Karimnagar School Holiday News: కరీంనగర్ జిల్లా వాసులకు, ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అత్యంత ముఖ్యమైన వార్త.. గత కొన్ని రోజులుగా పడుతున్న కుండపోత వర్షాలతో జిల్లా తడిసిముద్దవుతోంది. వాగులతో పాటు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు జలమయమై పిల్లలను బడులకు పంపాలంటేనే తల్లిదండ్రుల గుండెలు చేతిలో పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఆందోళనకర పరిస్థితులను, ప్రజల భయాందోళనలను జిల్లా యంత్రాంగం సకాలంలో గుర్తించింది.

రేపు పాఠశాలలకు సెలవు..
వర్ష తీవ్రతను దృష్టిలో ఉంచుకుని.. విద్యార్థుల రక్షణే ధ్యేయంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రత్యేకమైన ఆదేశాలను జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జులై 31వ తేదీన జిల్లాలోని పాఠశాలలన్నింటికీ సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి (DEO) చైతన్య జైనీ అధికారికంగా వెల్లడించారు.

ఈ నిర్ణయం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటుతో పాటు ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలకు వర్తిస్తుందని DEO స్పష్టం చేశారు. చిన్నారి విద్యార్థులు వర్షంలో తడిసి అనారోగ్య సమస్యల బారిన పడకుండా.. ఏ విధమైన ప్రమాదాలకు గురికాకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు..

సాధారణంగా సెలవు అనగానే చదువు వెనుకబడిపోతుందేమోనన్న చింత ఉపాధ్యాయుల్లో, తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతుంటుంది. కానీ.. జిల్లా విద్యాశాఖ దీనికి కూడా సరైన ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేసిన్నట్లు తెలుస్తోంది.. జులై 31న పనిదినాన్ని భర్తీ చేయడానికి రాబోయే ఆగస్టు 8న పాఠశాలలను యథావిధిగా నిర్వహించనున్నట్లు DEO చైతన్య జైనీ తెలిపారు. దీనివల్ల విద్యార్థుల విద్యాసంవత్సర ప్రణాళికకు ఎలాంటి నష్టం కలగదని ఆయన పేర్కొన్నారు.

Also Read: గౌరవెల్లి రిజర్వాయర్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. ప్రజల దశాబ్దాల కల నెరవేరింది..

పాఠశాలలకు, విద్యార్థులకు మాత్రమే ఈ సెలవు వర్తిస్తుందని.. ముందుగా నిర్ణయించిన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాలు (Teacher Training Programs) మాత్రం షెడ్యూల్ ప్రకారమే..  కొనసాగుతాయని అధికారి తెలిపారు. సంబంధిత ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించి శిక్షణకు హాజరుకావాలని సూచించారు.

Also Read: గౌరవెల్లి రిజర్వాయర్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. ప్రజల దశాబ్దాల కల నెరవేరింది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

0
0
Report
Advertisement

Cyber Fraud: బిగ్ అలర్ట్.. ఓటీపీలు చెప్పడంతో తల్లికి వందనం రూ.3 కోట్లు దోపిడీ

Kurnool, Andhra Pradesh:

Thalliki Vandanam Scheme: విద్యా వ్యవస్థ బలోపేతం.. డ్రాపౌట్లు నివారించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన తల్లికి వందనం పథకం విజయవంతంగా అమలవుతోంది. ఈ పథకం కింద విద్యార్థుల తల్లులకు రూ.13 వేలు బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకాన్ని ఆసరాగా చేసుకుని సైబర్‌ మోసగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. రూ.3 కోట్ల మేర దోపిడీ చేశారు. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకోగా.. మోసపోయిన బాధితులు లబోదిబోమంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

'తల్లికి వందనం' పథకం లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని.. వర్చువల్ సిమ్‌ల ద్వారా భారీ సైబర్ మోసానికి పాల్పడ్డారని పథకం లబ్ధిదారులు వాపోయారు. సైబర్ నేరగాళ్లు లబ్ధిదారులకు ఫోన్ చేసి, వారి నుంచి ఓటీపీలను సేకరించి.. తద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయిన నిధులను కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. కర్నూలు నగరానికి చెందిన పలువురు బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వర్చువల్ సిమ్‌లను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించారు.

తల్లికి వందనం పథకం సైబర్‌ మోసం కేసులో ప్రధాన నిందితుడిని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 36 వర్చువల్ సిమ్‌లు, మొబైల్ ఫోన్లు, ఇతర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ద్వారా కోట్ల రూపాయల విలువైన లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ  మాట్లాడుతూ తదుపరి దర్యాప్తు కోసం ఆధారాలు సేకరిస్తున్నామని, త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

ఎంత అవగాహన కల్పిస్తున్నా సైబర్‌ మోసానికి గురవడంతో కర్నూలు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు కీలక సూచనలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించవద్దని సూచించారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్ లేదా సందేశాలు వచ్చిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను లేదా సైబర్ క్రైమ్ విభాగాన్ని సంప్రదించాలని ప్రజలకు సూచనలు చేశారు. తల్లికి వందనం పథకం కింద ఇప్పటికే ఏపీ పోలీస్‌ యంత్రాంగం అవగాహన కల్పించినా ఈ స్థాయిలో పెద్ద ఎత్తున మహిళలు మోసపోవడం విస్మయానికి గురి చేసింది.

0
0
Report

ఎల్లంపల్లి వద్ద వరద ముప్పు.. తీరప్రాంత ప్రజలకు తీవ్ర హెచ్చరికలు!

Hyderabad, Telangana:

Yellampalli Project News: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి ఉత్తర తెలంగాణలోని ప్రధాన జలాశయాలకు జలకళ సంతరించుకుంది. ఎగువన ఉన్న కడెం ప్రాజెక్టు భారీ వరద ప్రవాహం చేరుకోవడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు భారీగా నీటిని విడుదల చేశారు. దీంతో మంచిర్యాలతో పాటు పెద్దపల్లి జిల్లాల సరిహద్దుల్లోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అత్యంత ఉధృతంగా పెరుగుతోంది. అయితే, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇరిగేషన్ శాఖ అధికారులు తక్షణమే అత్యవసర చర్యలు చేపట్టారు.

ఈ రోజు రాత్రి 7:30 గంటలకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ రేడియల్ క్రస్ట్ గేట్లను తెరిచి.. దిగువ గోదావరి నదిలోకి దాదాపు 1,00,000 క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేయనున్నట్లు రామగుండం ఇరిగేషన్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) అధికారికంగా ప్రకటించారు.

వరద నీరు ఒక్కసారిగా ఉప్పొంగే ప్రమాదం ఉన్నందున ప్రాజెక్ట్ దిగువన ఉన్న గోదావరి పరివాహక గ్రామాల ప్రజలను అధికారులు ప్రత్యేకమైన హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి తీర ప్రాంతాల వైపు ఎవరూ వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. ముఖ్యంగా ఈ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అలాగే నదిలో ప్రవాహ వేగం ప్రమాదకర స్థాయిలో ఉన్నందున చేపల వేట కోసం నదిలోకి దిగడం కానీ.. పడవలు నడపడం మానుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పశువులను, గొర్రెలతో పాటు మేకల మందలను మేత కోసం నదీ తీరంలోకి కానీ.. ముంపు ప్రాంతాల్లోకి గానీ తీసుకెళ్లవద్దని కోరారు. దిగువ ముంపు ప్రాంతాల ప్రజలు నిరంతరం పరిస్థితిని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు మారేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

Also Read: గౌరవెల్లి రిజర్వాయర్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. ప్రజల దశాబ్దాల కల నెరవేరింది..

అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలు, ప్రజా ప్రతినిధులు తక్షణమే క్షేత్రస్థాయిలోకి రావాలని.. ఇరిగేషన్ శాఖ విజ్ఞప్తి చేసిన్నట్లు కూడా తెలుస్తోంది.. నదీ తీర గ్రామాల్లో మైకుల ద్వారా దండోరా వేయిస్తూ..  ప్రజలను చైతన్య పరచాలని సూచించారు. ముందస్తు హెచ్చరిక చర్యల ద్వారా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Also Read: గౌరవెల్లి రిజర్వాయర్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. ప్రజల దశాబ్దాల కల నెరవేరింది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

0
0
Report

రైలులో పూజలు.. దీపం వెలిగించి షాకిచ్చిన ప్రయాణికుడు.. వైరల్ వీడియో..

Hyderabad, Telangana:

Man Lights Diya Inside Moving Train Video: భక్తితో ఉండడం తప్పు కాదు.. కానీ అది ఇతరుల ప్రాణాలకు లేదా ప్రజా ఆస్తులకు ముప్పుగా మారినప్పుడు తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.. కదులుతున్న ఒక రైలులో ఒక వ్యక్తి చేసిన నిర్వాకం ఇప్పుడు ఇంటర్నెట్‌లో తీవ్ర దుమారాన్ని రేపుతోంది.. దీనికి సంబంధించిన వీడియో కూడా  ఇప్పుడు సోషల్ మీడియాల్లో సంచలనంగా మారింది. అయితే, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కదులుతున్న రైలులో దీపారాధన..
సాధారణంగా రైలు ప్రయాణాల్లో అగ్గిపెట్టెలు, లైటర్లు లేదా మండే స్వభావం కలిగిన పదార్థాలను తీసుకెళ్లడం చట్టరీత్యా నేరం.. కానీ, ఓ వ్యక్తి వీటన్నింటినీ పక్కన పెట్టి.. భారీగా ప్రయాణికులు కలిగిన కదులుతున్న రైలు భోగిలోనే పూజలు చేయడం ప్రారంభించాడు.. అంతటితో ఆగకుండా ప్రమిదలో నూనె పోసి.. ఒత్తి వేసి నిప్పు వెలిగించాడు. రైలు వేగంగా వెళ్తుండగా దేవుడికి హారతి ఇస్తూ.. నమస్కారాలు చేయడం ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో మీరు క్లియర్‌గా చూడొచ్చు..

ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి?
రైలు వేగంగా వెళ్తున్నప్పుడు గాలి దాటికి ఆ దీపం కిందపడినా.. లేదా పక్కనే ఉన్న ప్రయాణికుల దుస్తులకు, సీట్లకు మంటలు అంటుకున్నా తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉంది.. గతంలో రైళ్లలో సంభవించిన ప్రమాదాలను గుర్తుచేసుకుంటూ.. పలువురు ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక చిన్న నిప్పు రవ్వ కూడా పెద్ద ఎంత ప్రమాదానికి దారితీస్తుందో తెలిసి కూడా ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనులు చేయడంపై ఆ వ్యక్తిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

నెటిజన్ల తీవ్ర ఆగ్రహం..
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగానే సోషల్‌ మీడియా వినియోగదారులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. భక్తి ఉండాలి కానీ ఇలాంటి పిచ్చి పనులు కాదు.. ఇది భక్తి కాదు.. ప్రయాణికుల ప్రాణాలతో ఆడుకోవడమే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు నెటిజన్లు ఈ వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖకు, రైల్వే పోలీస్ ఫోర్స్ (RPF)కు ట్యాగ్ చేస్తూ.. సదరు వ్యక్తిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
0
Report
Advertisement
Advertisement
Back to top