కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలి-మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య
Bellampalle, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ హరికృష్ణ కు వినతిపత్రం అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసానని రైతులని మభ్యపెడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రైతులకు మద్దతుగా ఉంటుందని తెలిపారు. ఆంక్షలతో రైతులను మోసం చేసినందుకు ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
England Vs India ODI: ఇంగ్లాండ్తో మూడో వన్డే ముందు జట్టులో కీలక మార్పులు..వాషింగ్టన్ సుందర్ స్థానంలో యంగ్ ఆల్రౌండర్!
Hyderabad, Telangana:England Vs India 3rd ODI: ఇంగ్లాండ్తో లార్డ్స్ వేదికగా జరగబోయే నిర్ణయాత్మక మూడో వన్డేకు ముందు భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా సిరీస్లోని ఆఖరి మ్యాచ్కు దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ స్పిన్ ఆల్రౌండర్ హర్ష్ దూబేను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జట్టులోకి తీసుకుంది. ఆదివారం జరగబోయే ఈ మూడో వన్డే మ్యాచ్లో గెలిచిన జట్టు వన్డే సిరీస్ను కైవసం చేసుకోనుంది.
కార్డిఫ్ వన్డేలో గాయం..
కార్డిఫ్లో జరిగిన రెండో వన్డేలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 26 ఏళ్ల వాషింగ్టన్ సుందర్ కుడి కాలు హ్యామ్స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. ఆ మ్యాచ్లో కేవలం 5 బంతులు ఆడి 2 పరుగులు మాత్రమే చేసిన సుందర్, గాయం తీవ్రత వల్ల కాలుకు పట్టీలు (స్ట్రాపింగ్) కట్టుకోవాల్సి వచ్చింది.
కనీసం డ్రెస్సింగ్ రూమ్ మెట్లు ఎక్కడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడిన అతడు, ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో ఫీల్డింగ్కు రాలేకపోయాడు. ప్రస్తుతం సుందర్ గాయం తీవ్రతను అంచనా వేయడానికి స్కాన్ పరీక్షలు చేయించుకోనున్నాడని, తదుపరి చికిత్స కోసం నిపుణులైన వైద్యులను సంప్రదిస్తాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
జట్టులోకి హర్ష్ దూబే.. కానీ రేసులో కుల్దీప్!
వాషింగ్టన్ సుందర్ స్థానంలో విదర్భకు చెందిన ఎడమచేతి వాటం స్పిన్ ఆల్రౌండర్ హర్ష్ దూబేకు జట్టులో చోటు లభించింది. ఇటీవల ఆఫ్ఘానిస్తాన్పై జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ వన్డేల్లోకి అడుగుపెట్టిన దూబే.. ధర్మశాలలో జరిగిన ఆ వన్డేలో 47 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు.
అయితే, దూబే జట్టులోకి వచ్చినప్పటికీ లార్డ్స్ వన్డే తుది జట్టు (Playing XI)లో చోటు దక్కించుకోవడం అంత సులువు కాదు. పిచ్ పరిస్థితుల దృష్ట్యా సీనియర్ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మూడో వన్డేకు భారత జట్టు ఇదే..
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబే.
Also Read: రూ.28 లక్షలకు చేరిన ఫైనల్ మ్యాచ్ టికెట్ ధర..అమెరికా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఈవెంట్!
Also Read: రోహిత్ శర్మ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్ వార్తలను BCCI ఖండన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
నేను తెలంగాణ ముఖ్యమంత్రిగా కావడానికి అందెశ్రీ నాకు స్ఫూర్తి: రేవంత్ రెడ్డి
Ghatkesar, Telangana:Hyderabad: 'తెలంగాణలో గత పాలకుల అహంకార వైఖరిపై అందెశ్రీ గళమెత్తారు. నిరాశ, నిస్పృహలకు లోనైనప్పుడు అందెశ్రీ నాకు స్ఫూర్తిగా నిలబడేవారు. అందెశ్రీ పాటలు తూటాలై, మరపిరంగులై గడీలను బద్దలు కొట్టాయి. ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడటానికి అందెశ్రీ నాకు స్ఫూర్తి' అని రేవంత్ రెడ్డి తెలిపారు. అక్షరాలపై అక్షరాలని పేర్చి ఉద్యమ గీతాలు రాసిన అందెశ్రీ ప్రజల్లో చైతన్యం నింపారని ప్రశంసించారు. ఆయన పాట మన గుండెల్లో ఒక చైతన్యాన్ని నింపింది అని ప్రశంసించారు.
హైదరాబాద్ శివారులోని ఘట్కేసర్లో అందెశ్రీ స్మృతివనం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'జయ జయహే తెలంగాణ గీతం రాష్ట్ర గీతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలుస్తుందని ఆనాడు భావించాం. కానీ పదేళ్లలో కుట్రలతో ఆయన పాటను వినిపించకుండా చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రతీ బడిలో, ప్రతీ గడపలో ఆయన పాట వినిపిస్తోంది' అని వివరించారు. తన పాట కోట్లాది తెలంగాణ ప్రజల కోసం తప్ప… గడీలలో దొరల కోసం కాదని అందెశ్రీ నిటారుగా నిలబడ్డారని చెప్పారు.
'మనందరం దండు కట్టి విష సర్పాలను తుదముట్టించాలని అందెశ్రీ అన్న మాటలు నాకు ఇంకా గుర్తొస్తున్నాయి. నా కుటుంబంలో పెద్దన్నగా అందెశ్రీని భావించా. ఏ రోజైతే అందెశ్రీ గళాన్ని బంధించాలనుకున్నారో.. గద్దరన్నను అవమానించారో ఆనాడే గడీల పాలనను శాశ్వతంగా పాతరేయాలని నిర్ణయించుకున్నారు' అని రేవంత్ రెడ్డి వివరించారు. 'మేక తోలు కప్పుకున్న తోడేలు ఇవాళ మాట్లాడుతోంది. ఈ తోడేళ్ల గుంపును నేను ప్రశ్నిస్తున్నా. ఆనాడు కవితను, వినోద్ రావును ప్రజలు తిరస్కరిస్తే ఉద్యోగాలు ఇచ్చినవ్ కదా? తెలంగాణ బిడ్డల ఉద్యోగాల కోసం ఒక్కనాడైనా ఆలోచించారా?' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
'మేం నోటిఫికేషన్లు ఇచ్చినం రేవంత్ రెడ్డి భర్తీ చేశారని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నావు. పేపర్ లీకేజీలతో రూ.వందల కోట్లు సంపాదించుకున్నారు తప్ప.. పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేయాలని మీ కుటుంబం ఏనాడైనా ఆలోచించిందా? నిరుద్యోగులపై మీరెప్పుడైనా మనుషుల్లా ప్రవర్తించారా? మానవీయ కోణంలో చూశారా?' అని ప్రతిపక్షాలపై రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. మేం అధికారంలోకి వచ్చాక అడ్డంకులను తొలగించి ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు.
'పదేళ్లు మీరు నోటిఫికేషన్లు వేయడం తప్ప ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేకపోయారు? ఏడాదిలో 70 వేల ఉద్యోగాలు మేం ఎలా భర్తీ చేశాం? మీరు శ్రీమంతులు ఎలా అయ్యారు? తెలంగాణ అప్పుల్లో ఎలా కూరుకుపోయింది?' అని తెలంగాణ ముఖ్యమంత్రి నిలదీశారు. 'మేక తోలు కప్పుకున్న తోడేళ్లను నేను అడుగుతున్నా. గజ్వేల్లో మిమ్మల్ని రాజకీయ సమాధి చేసే బాధ్యత మా యువకులు చూసుకుంటారు. తెలంగాణ సమాజం మీకు ఏం తక్కువ చేసింది?' అని ప్రశ్నించారు.
'అమెరికాలో బాత్రూమ్లు కడిగే ఆయన కొడుకును మంత్రిని చేసింది. రబ్బరు చెప్పులతో తిరిగిన వాళ్లను, సోడా పోసినోళ్లని మంత్రులను చేసింది. నేను ఉన్నంతవరకు ఈ తెలంగాణ తులసీ వనంలో గంజాయి మొక్కను మొలకెత్తనివ్వం' అని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మీకు ఎవరు స్ఫూర్తి… నిజాం, ఖాసీం రిజ్వీనా మీకు స్ఫూర్తి? నీకు మాకు పోలిక ఎంది.. పోటీ ఏమిటి? మీ దోపిడీని ప్రజలు ఇంకా మరిచిపోలేదు' అని తెలిపారు.
'తెలంగాణ సమాజం అన్నీ గమనిస్తోంది. నిజామ్ను దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ గడ్డది. తెలంగాణ చైతన్యం ముందు మీరెంత? మళ్లీ తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 'తెలంగాణను ఎవరూ చెరబట్టలేరు. నిరుద్యోగులు మాయగాళ్ల మాయలో పడొద్దు. ప్రభుత్వం ప్రతీ ఉద్యోగ ఖాళీని భర్తీ చేసి నియామక పత్రాలు అందిస్తుంది' అని నిరుద్యోగులకు సూచించారు.
'పదేళ్లు బిడ్డ కవితకు పదవి ఇచ్చుకున్నారు. కానీ శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మీకు గుర్తుకు రాలేదా?' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 'మా ప్రభుత్వంలో శంకరమ్మను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాం. చాకలి ఐలమ్మ మనుమరాలిని మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాం. కోదండ రామ్రెడ్డిని ఎమ్మెల్సీ చేసుకున్నాం' అని గుర్తుచేశారు. 'ప్రజా ప్రభుత్వం ఎందుకు పోవాలి? మీ కుటుంబం దోచుకునేందుకా? మీ కుటుంబం పదవుల కోసమా?' అని ప్రతిపక్షాలను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. '2034 వరకు ప్రజా ప్రభుత్వానిదే అధికారం. ఇదే భవిష్యత్, ఇదే చరిత్ర' అని ప్రకటించారు.
ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త- ఆరోగ్య పథకానికి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ!
Baddipadaga, Telangana:Jackpot To Govt Employees: ఉద్యోగులు, పింఛన్దారులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. ఇటీవల అట్టహాసంగా ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రారంభించిన కొత్త ఆరోగ్య పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఉద్యోగులు, పింఛన్దారులకు కొత్త ఆరోగ్య పథకం ఎలా వర్తిస్తుంది? దానికి సంబంధించిన నిబంధనలు ఏమిటో మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉంది. ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకం మార్గదర్శకాలు తెలుసుకుందాం.
ఉద్యోగులు, పెన్షనర్ల కోసం అమలులో ఉన్న ఉద్యోగుల ఆరోగ్య పథకంలో ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల నుంచి రెండుసార్లు చందా మినహాయించిన సందర్భాల్లో అదనంగా వసూలైన మొత్తాన్ని రిఫండ్ చేయడానికి పూర్తి విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.
ఉద్యోగుల ఆరోగ్య పథకానికి చందా ఎంత?
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రతి నెలా ఉద్యోగులు, పెన్షనర్ల కనీస జీతం/ కనీస పింఛన్లో 1.5 శాతం మొత్తాన్ని ఉద్యోగుల ఆరోగ్య పథకానికి చందాగా మినహాయిస్తున్నారు.
డబుల్ డిడక్షన్ జరిగే పరిస్థితులు
ఈ క్రింది సందర్భాల్లో ఒకే కుటుంబానికి రెండుసార్లు ఆరోగ్య పథకానికి చందా మినహాయించే అవకాశం ఉంటుంది.
భార్య, భర్త ఇద్దరూ రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు
ఒకరు ప్రభుత్వ ఉద్యోగి, మరొకరు పెన్షనర్ లేదా కుటుంబ పెన్షనర్గా ఉండడం
ఒకే వ్యక్తి సర్వీస్ పెన్షన్తో పాటు ఫ్యామిలీ పెన్షన్ కూడా పొందుతున్న సందర్భం
ఒకే కుటుంబంపై రెండుసార్లు ఈహెచ్ఎస్ చందా మినహాయించిన ఇతర సమానమైన సందర్భాలు.
రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులకు రీఫండ్ విధానం
సంబంధిత డీడీఓ (డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్)కు దరఖాస్తు సమర్పించాలి
దరఖాస్తుతో పాటు జీవిత భాగస్వామి ఉద్యోగం/ పెన్షన్ ఆధారాలు, ఆరోగ్య కార్డు ఐడీ, ఇతర అవసరమైన ధృవపత్రాలు జత చేయాలి.
డీడీఓ చేయాల్సింది
ఉద్యోగి సమర్పించిన వివరాలను సర్వీస్ రికార్డులు, పత్రాలతో పరిశీలించి అర్హత నిర్ధారించాలి.
అర్హత ఉంటే ఐఎఫ్ఎంఐఎస్లో ఈహెచ్ఎస్ రీఫండ్ ఆప్షన్ ద్వారా సప్లిమెంటరీ బిల్ సమర్పించి రీఫండ్ చెల్లించాలి.
పెన్షనర్లు / కుటుంబ పెన్షనర్లకు
సంబంధిత ట్రెజరీ ఆఫీస్ / పింఛన్ పేమెంట్ ఆఫీస్కు దరఖాస్తు ఇవ్వాలి.
అవసరమైన పత్రాలను జత చేయాలి.
అధికారులు ధృవీకరణ అనంతరం ఐఎఫ్ఎంఐఎస్ ద్వారా రీఫండ్ బిల్లు రూపొందించి చెల్లింపు చేస్తారు.
ఐఎఫ్ఎంఐఎస్లో ప్రత్యేక ఈహెచ్ఎస్ రీఫండ్ ఆప్షన్
రీఫండ్ క్లెయిమ్ల కోసం ఐఎఫ్ఎంఐఎస్లో ప్రత్యేకంగా ఈహెచ్ఎస్ రీఫండ్ మాడ్యూల్ అందుబాటులో ఉంటుంది.
డీడీఓలు ఈ మాడ్యూల్ ద్వారానే రీఫండ్ బిల్లులు సమర్పించాలి.
ముందుగా ఉద్యోగి వివరాలు నమోదు చేసి, అర్హత ధృవీకరణ పూర్తయిన తర్వాత మాత్రమే రీఫండ్ బిల్లు రూపొందించాలి.
డీడీఓలకు కీలక ఆదేశాలు
భవిష్యత్తులో ఈహెచ్ఎస్ డబుల్ డిడక్షన్ జరగకుండా డీడీఓలు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి.
నిర్లక్ష్యంతో మళ్లీ డబుల్ లేదా అదనపు డిడక్షన్ జరిగితే దానికి సంబంధిత డీడీఓనే బాధ్యుడిగా పరిగణించి ప్రభుత్వం తీవ్రంగా వ్యవహరిస్తుంది.
ఒక నెలలోపు రీఫండ్ ప్రక్రియ పూర్తి చేయాలి
Telangana Rains: తెలంగాణలో ఆ ప్రాంతాలకు కాసేపట్లో భారీ వర్షం..లోతట్టు ప్రాంతాలకు వార్నింగ్!
Hyderabad, Telangana:Telangana Rain Alert: నైరుతి రుతుపవనాలు మూగబోయిన వేళ.. వాతావరణ శాఖ మరో ఆసక్తికరమైన వార్త తెలిపింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మరికొద్ది సేపట్లో భారీ వర్షం పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అలాగే పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.మంచిర్యాల కాంగ్రెస్లో ముదిరిన వర్గపోరు? ఎంపీ Vs ఎమ్మెల్యే..
Peddapalli, Telangana:Mancherial Latest News: మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీక్రిష్ణ మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని గూడెం గ్రామంలో పర్యటించాల్సి ఉండగా.. ఆయన పర్యటనను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మంచిర్యాల జిల్లా సరిహద్దు ప్రాంతమైన గూడెం వద్ద ఎంపీ వంశీక్రిష్ణ స్వాగతం కొరకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే అనుచరులు చింపివేయడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ప్రోటోకాల్ వివాదం..
ఈ వివాదానికి ప్రధాన కారణం సమన్వయ లోపమేనని స్థానిక కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేకు గానీ.. నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులకు గానీ.. ఎంపీ వంశీక్రిష్ణ పర్యటనకు సంబంధించిన ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని.. ప్రోటోకాల్ను పక్కనబెట్టి సొంత నిర్ణయాలతో పర్యటనలు చేయడం సరైంది కాదని... అందుకే ఈ పర్యటనను అడ్డుకుంటున్నామని.. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గీయులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే అనుచరులు భారీ సంఖ్యలో తరలివచ్చి.. MLAకు అనుకూలంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
దీంతో ఎంపీ పర్యటనకు ముందే అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. MP వంశీక్రిష్ణ ఇంకా గూడెం గ్రామానికి చేరుకోకముందే.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తడంతో ఉద్రిక్తతను తగ్గించేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ వ్యవహారంపై జిల్లా రాజకీయ నేతలతో పాటు విశ్లేషకులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి మధ్య చాలా సంవత్సరాలుగా రాజకీయ విభేదాలు, ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం బహిరంగ రహస్యమే.. వివేక్ వెంకటస్వామి కుమారుడైన వంశీక్రిష్ణ పెద్దపల్లి ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఈ సఖ్యత కుదరకపోగా.. విభేదాలు మరింత ముదిరాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కావాలనే తన అనుచరుల ద్వారా ఎంపీ పర్యటనను అడ్డుకుంటూ జిల్లాలో తన పట్టును నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ వర్గ పోరు కాంగ్రెస్ అధిష్ఠానానికి సరికొత్త తలనొప్పిగా మారేలా కనిపిస్తోంది.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Realme లవర్స్కు పండగే.. Flipkartలో Realme 16T 5Gపై భారీ డిస్కౌంట్..
Hyderabad, Telangana:Realme 16T 5G Price Drop on Flipkart: మార్కెట్లో మంచి డిమాండ్ కలిగిన రియల్మి 16T 5G స్మార్ట్ఫోన్పై ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ భారీ తగ్గింపును ప్రకటించింది. ఏకంగా 8000mAh బ్యాటరీతో లాంచ్ అయిన ఈ ఫోన్ను ఇప్పుడు అత్యంత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. అయితే, ఈ స్మార్ట్ఫోన్పై లభిస్తున్న స్పెషల్ ఆఫర్స్ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బంపర్ ఆఫర్..
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Realme తన వినియోగదారులకు అదిరిపోయే శుభవార్తను అందించింది. ఈ ఏడాది మే నెలలో మార్కెట్లోకి విడుదల చేసిన మోస్ట్ పాపులర్ స్మార్ట్ఫోన్ Realme 16T 5Gపై ఇప్పుడు భారీ ప్రైస్ కట్ లభించడం విశేషం.. అద్భుతమైన ఫీచర్లతో పాటు ముఖ్యంగా భారీ బ్యాటరీ బ్యాకప్తో లభిస్తున్న ఈ ఫోన్ను మరింత చౌకగా కొనుగోలు చేసేందుకు ఫ్లిప్కార్ట్ ఒక మంచి ఆఫర్ను అందిస్తోంది.
ఫ్లిప్కార్ట్లో భారీ ధర తగ్గింపు..
Realme సంస్థ ఈ ఫోన్ను 6GB ర్యామ్తో పాటు 128GB స్టోరేజ్ వేరియంట్ను రూ.29,999 ధరతో భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అయిత, ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ ఇ-కామర్స్ సైట్లో ఈ ఫోన్ రూ.27,999కే అందుబాటులో ఉంది.. అంటే దాదాపు రూ. 2,000 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు.
బ్యాంక్ ఆఫర్స్..
భారీ ఫ్లాట్ డిస్కౌంట్తో పాటు అదనంగా అదనపు బ్యాంక్ ఆఫర్లను వినియోగించుకుంటే.. ఈ ఫోన్ను మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ లేదా ఫ్లిప్కార్ట్ ఎస్బీఐ (SBI) బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లకు అదనంగా రూ.1,500 తగ్గింపు లభిస్తుంది. దీనితో మొత్తం డిస్కౌంట్ రూ.3,500 వరకు లభిస్తుంది.. ఈ ఆఫర్లన్నీ వినియోగించుకుంటే రియల్మి 16T 5G స్మార్ట్ఫోన్ ఎఫెక్టివ్ ధర కేవలం రూ.26,599 మాత్రమే అవుతుంది.
రియల్మి 16T 5G ఫీచర్స్..
ఈ Realme 16T 5G స్మార్ట్ఫోన్ అద్భుతమైన ఫీచర్స్తో పాటు ప్రీమియం డిజైన్తో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 6.8 అంగుళాల పెద్ద LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది.. ఇది 144Hz రిఫ్రెష్ రేట్తో పాటు 1,200 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్తో లభిస్తుంది. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 (MediaTek Dimensity 6300) చిప్సెట్ ప్రాసెసర్తో అందుబాటులోకి వచ్చింది. ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్కు అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7 సాఫ్ట్వేర్పై పని చేస్తుంది.. ఇందులో స్ప్లిట్-స్క్రీన్, ఫ్లోటింగ్ విండోస్, ఐఓఎస్ ఫైల్ షేరింగ్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్నాయి.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
FIFA World Cup Final: రూ.28 లక్షలకు చేరిన ఫైనల్ మ్యాచ్ టికెట్ ధర..అమెరికా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఈవెంట్ ఇదే!
Hyderabad, Telangana:FIFA World Cup 2026 Final Ticket Price: ఫుట్బాల్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఫిఫా ప్రపంచ కప్ 2026' సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అమెరికా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్, యూఎస్ క్రీడా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఈవెంట్గా నిలవనుందని ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ 'ఫోర్బ్స్' స్పష్టం చేసింది. ఈ మహా సమరానికి సంబంధించిన టికెట్ ధరలు భారీగా ఉన్నట్లు వెల్లడించింది.
ఆకాశాన్నంటుతున్న టికెట్ల ధరలు
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అభిమానులు కోట్లాది రూపాయలు ఖర్చు చేసేందుకు కూడా వెనకాడటం లేదు. ప్రస్తుతం మెట్లైఫ్ స్టేడియంలోని 'సెక్షన్ 115A'లో ఒక టికెట్ ధర ఏకంగా 28,479 డాలర్లకు (సుమారు రూ.23.8 లక్షల పైమాటే) చేరింది.
ప్రముఖ టికెటింగ్ ప్లాట్ఫారమ్ 'టిక్పిక్' (TickPick) ప్రకారం, ఫైనల్ టికెట్ సగటు కొనుగోలు ధర 11,327 డాలర్లు (సుమారు రూ.9.5 లక్షలు)గా నమోదైంది. అమెరికా క్రీడా చరిత్రలో ఒక మ్యాచ్కు ఈ స్థాయి సగటు ధర ఉండటం ఇదే తొలిసారి కావడం విశేషం. దీనికంటే ముందు 2024లో జరిగిన 'సూపర్ బౌల్' (శాన్ ఫ్రాన్సిస్కో vs కాన్సాస్ సిటీ) మ్యాచ్ సగటు టికెట్ ధర 9,411 డాలర్లుగా ఉండేది. ఇప్పుడా రికార్డును ఫిఫా ఫైనల్ బద్దలు కొట్టింది.
2007 నాటి 'ఆ ఆద్భుత ఫోటో' ఇప్పుడు ఫైనల్ ఫైట్!
ఈ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కేవలం ఖరీదైనది మాత్రమే కాదు, ఎంతో సెంటిమెంట్తో కూడుకున్నది కూడా. సుమారు రెండు దశాబ్దాల క్రితం (2007లో) బార్సిలోనాలో జరిగిన ఒక ఛారిటీ క్యాలెండర్ ఫోటోషూట్లో లియోనెల్ మెస్సీ ఒక ఐదు నెలల పసికందుకి స్నానం చేయించడంలో సహాయపడ్డారు. ఆ ఫోటో అప్పట్లో వైరల్ అయింది. కట్ చేస్తే.. ఇప్పుడు అదే పసికందు పెద్దయి, ప్రపంచకప్ ఫైనల్లో మెస్సీని ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఆ ఆటగాడే స్పెయిన్ యువ సంచలనం లామిన్ యమాల్ (19). ఈ అరుదైన భేటీపై అర్జెంటీనా కెప్టెన్, 39 ఏళ్ల మెస్సీ శుక్రవారం స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"నిజం చెప్పాలంటే, మా ఇద్దరి ఆ పాత ఫోటో చూడటానికి చాలా విచిత్రంగా, అద్భుతంగా అనిపిస్తోంది. జీవితం అంటే ఇదేనేమో! ఆ ఫోటో తీసినప్పుడు నేను చాలా చిన్న వయసులో (20 ఏళ్లు) బార్సిలోనాలో కెరీర్ ప్రారంభ దశలో ఉన్నాను, అతను పసికందు. ఇప్పుడు మేమిద్దరం ప్రపంచ కప్ ఫైనల్లో తలపడుతున్నాం" అని అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీ అన్నారు.
యమాల్పై మెస్సీ ప్రశంసల జల్లు
లామిన్ యమాల్ అపారమైన ప్రతిభావంతుడని, తాను ఎంతగానో ప్రేమించే బార్సిలోనా క్లబ్ తరఫున అతను ఆడుతున్నందున చాలా కాలంగా అతని ఆటను గమనిస్తున్నానని మెస్సీ చెప్పారు.
"19 ఏళ్ల వయసులోనే అతను ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగాడు. అతని భవిష్యత్తు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ ఫైనల్లో స్పెయిన్ తరఫున చారిత్రాత్మక విజయాన్ని సాధించే గొప్ప అవకాశం అతనికి ఉంది. అయితే, ఈసారి కప్ మాకే దక్కేలా, ఆ విజయాన్ని అడ్డుకునేందుకు మేము మా శాయశక్తులా ప్రయత్నిస్తాం" అని మెస్సీ చిరునవ్వుతో వ్యాఖ్యానించారు.
2024 యూరోపియన్ ఛాంపియన్షిప్ (Euro 2024) సమయంలో యమాల్ తండ్రి మౌనిర్ నస్రావి ఈ పాత ఫోటోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది మళ్లీ ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. ఆ టోర్నమెంట్లో స్పెయిన్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
Also Read: రోహిత్ శర్మ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్ వార్తలను BCCI ఖండన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Iran Zero Hour: ఇరాన్ 'జీరో అవర్' వార్నింగ్..అమెరికా-ఇరాన్ మధ్య భారీ యుద్ధం జరగబోతుందా?
Haftador, Yazd Province:Iran Zero Hour Warning: ప్రపంచ దేశాలు శాంతిని కోరుకుంటున్నా, మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు మరో భారీ యుద్ధానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య వివాదం తీవ్రరూపం దాల్చడంతో, ఈ ప్రాంతం యుద్ధ మేఘాలతో కమ్ముకుంది. తాజాగా ఇరాన్ జారీ చేసిన 'జీరో అవర్' హెచ్చరిక, దానికి ప్రతిగా అమెరికా తీసుకుంటున్న సైనిక చర్యలు ప్రాంతీయ యుద్ధ ముప్పును మరింత పెంచుతున్నాయి.
ఈ ఉద్రిక్తతలకు సంబంధించిన ప్రధాన పరిణామాలు..
1) ఇరాన్ నుంచి 'జీరో అవర్' వార్నింగ్..
ఇరాన్ స్టేట్ టీవీ ద్వారా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నేవీ కమాండ్ ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. అమెరికా నౌకాదళ (CENTCOM) కదలికలన్నీ తమ నిఘా నీడలోనే ఉన్నాయని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా దళాలపై దాడికి సమయం ఆసన్నమైందనే సంకేతంగా 'జీరో అవర్' వైపు అడుగులు వేస్తున్నట్లు హెచ్చరించింది. "వేచి చూడండి" (Wait and watch) అంటూ ఈ ప్రకటనను ముగించడం ద్వారా ఏ క్షణంలోనైనా దాడులు జరగొచ్చనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
2) ఇజ్రాయెల్కు అమెరికా యుద్ధ విమానాలు..
ఇరాన్పై ఇజ్రాయెల్ మరింత దూకుడుగా విరుచుకుపడేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్లోని బెన్ గురియన్, రామోన్ ఎయిర్పోర్టులకు డజన్ల కొద్దీ అదనపు KC-135, KC-46 ఎయిర్ రీఫ్యూయలింగ్ (గాలిలోనే ఇంధనం నింపే) విమానాలను పంపేందుకు అమెరికా సిద్ధమైంది.
దీని వల్ల ప్రయోజనం ఏమిటంటే.. ఈ రీఫ్యూయలింగ్ విమానాల సాయంతో ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు, బాంబర్లు ఎక్కువ సమయం గాలిలోనే ఉంటూ, ఇరాన్ భూభాగంలో సుదూర ప్రాంతాల వరకు వెళ్లి దాడులు చేయగలుగుతాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దీనికి త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.
3) హార్ముజ్ జలసంధిపై అమెరికా దాడులు.. ఇరాన్ ప్రతిదాడులు
అమెరికా వ్యూహం: వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన హార్ముజ్ జలసంధి పరిసరాల్లోని ఇరాన్ లక్ష్యాలపై అమెరికా వరుసగా 7వ రోజు కూడా దాడులు చేసింది. బందర్ అబ్బాస్ సమీపంలోని 7 ప్రధాన వంతెనలను ధ్వంసం చేయడం ద్వారా, ఇరాన్ తన సైనిక సామగ్రిని జలసంధి వైపు తరలించకుండా అమెరికా కట్టడి చేసింది.
ఇరాన్ ప్రతీకారం: ఇరాన్ సైన్యం కూడా జోర్డాన్, ఖతార్, బహ్రెయిన్, ఇరాక్, కువైట్లలోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడింది. జోర్డాన్లోని అమెరికా యుద్ధ విమానాలను, రీఫ్యూయలింగ్ విమానాలను తాము ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
హార్ముజ్ జలసంధి అనేది ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన మార్గం. ఇరు దేశాల దాడులు, ఆంక్షల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరాకు తీవ్ర విఘాతం కలిగి, క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది.
పెచ్చరిల్లుతున్న యుద్ధ జ్వాలలు
కాల్పుల విరమణ ఒప్పందం విఫలమైనప్పటి నుంచి ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ తన సరిహద్దులను పటిష్టం చేసుకుంటూ అమెరికా నౌకలపై కన్నేయగా, అమెరికా-ఇజ్రాయెల్ కూటమి ఇరాన్ను దెబ్బకొట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. అంతర్జాతీయ సమాజం శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు మాత్రం మిడిల్ ఈస్ట్లో మహా యుద్ధాన్ని సూచిస్తున్నాయి.
Also Read: మరోసారి హద్దుదాటిన ఇరాన్..హోర్ముజ్ జలసంధిలో భారత నౌకపై దాడి..ఒకరు గల్లంతు
Also REad; Vietnam Boat Accident: వియత్నాంలో ఘోర ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి..ఇద్దరు తెలుగోళ్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
లాంచ్కు ముందే లీకైన Google Pixel 11a ఫీచర్స్.. డిస్ప్లే, ప్రొసెసర్ మామూలుగా లేవుగా!
Hyderabad, Telangana:Google పిక్సెల్ లవర్స్కి ఇది అదిరిపోయే వార్తగా భావించవచ్చు.. గూగుల్ తన కొత్త స్మార్ట్ఫోన్ సిరీస్ గూగుల్ పిక్సెల్ 11 (Google Pixel 11)ను త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది.. ఆగస్టు రెండో వారంలో ఈ సిరీస్ గ్రాండ్గా లాంచ్ కాబోతున్నట్లు టెక్ వర్గాల సమాచారం.. అయితే, ఈ ప్రీమియం సిరీస్ లాంచ్కు ముందే.. వినియోగదారులకు అందుబాటు ధరలో రాబోతున్న మోడల్ గూగుల్ పిక్సెల్ 11ఎ (Google Pixel 11a)కి సంబంధించిన కీలక ఫీచర్లు ఆన్లైన్లో ఇటీవలే లీకయ్యాయి. మిస్టిక్ లీక్స్ (Mystic Leaks) ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన కొన్ని కీలకమైన ఫీచర్స్ను లీక్ చేశారు. అయితే, ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
డిస్ప్లే అదిరింది..
లీక్ అయిన సమాచారం ప్రకారం..గూగుల్ పిక్సెల్ 11ఎ స్మార్ట్ఫోన్ 6.3 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది.. ఇది 1,080 × 2,424 పిక్సెల్ల రెజల్యూషన్ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది.. దీనివల్ల ఫోన్ స్క్రీన్ చాలా స్మూత్గా పనిచేస్తుంది. అలాగే ఈ ఫోన్లో డిస్ప్లే బ్రైట్నెస్ అద్భుతంగా ఉండబోతోందని సమాచారం. ఇందులో 2250 నిట్స్ హెచ్డీఆర్ (HDR) బ్రైట్నెస్.. అలాగే ఏకంగా 3350 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్తో లాంచ్ చేసేందుకు సిద్ధమైందని సమాచారం.. అంటే దీని వల్ల మండుటెండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
పవర్ఫుల్ పర్ఫార్మెన్స్..
Google తన సొంత పవర్ఫుల్ ప్రొసెసర్ అయిన Tensor G6 చిప్సెట్ను ఈ పిక్సెల్ 11ఎ మోడల్లో వినియోగించిన్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. దీనితో పాటు అద్భుతమైన నెట్వర్క్ కనెక్టివిటీ కోసం ఇందులో MediaTek M90 ప్రాసెసర్ను కూడా అందుబాటులో ఉంచిన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ 8GB ర్యామ్తో వేరియంట్తో అందుబాటులోకి రానుంది. ఇక సెక్యూరిటీ విషయానికొస్తే.. వినియోగదారుల డేటా ప్రైవసీగా ఉంచేందుకు గూగుల్ ఇందులో ప్రత్యేకమైన Titan M3 సెక్యూరిటీ చిప్ను కూడా అందించడం విశేషం..
సూపర్ ఫాస్ట్ ఫేస్ అన్లాక్ ఫీచర్..
ఈ స్మార్ట్ఫోన్ ప్రత్యేకత ఏంటంటే..దీని ఫ్రంట్ కెమెరా.. ఈ ఫోన్ డిస్ప్లేలో సరికొత్త ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సెన్సార్ను అందుబాటులో ఉంచిన్నట్లు సమాచారం. దీని కోడ్నేమ్ dokkaebi అని అంటారని లీక్ వివరాలు చెబుతున్నాయి. ఈ కొత్త సెన్సార్ వల్ల ఫోన్ ఫేస్ అన్లాక్ ఫీచర్ను గూగుల్ భారీగా అప్గ్రేడ్ చేసిన్నట్లు తెలుస్తోంది.. ఇది మునుపటి కంటే చాలా స్పీడ్గా.. సురక్షితంగా పనిచేస్తుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో లేదా తక్కువ వెలుతురు (Low-light) ఉన్నప్పుడు కూడా చాలా అద్భుతంగా ముఖాన్ని గుర్తించి ఫోన్ను అన్లాక్ చేస్తుందని సమాచారం.
బ్యాటరీ వివరాలు..
బ్యాటరీ సామర్థ్యం విషయానికి వస్తే.. ఈసారి గూగుల్ బ్యాటరీ సైజ్ను కొద్దిగా తగ్గించినట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. పిక్సెల్ 10ఎ మోడల్లో 5100mAh బ్యాటరీ ఉండగా.. ఈ పిక్సెల్ 11ఎ ఫోన్లో 4,870 mAh బ్యాటరీని అందించనున్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ఇక ఈ గూగుల్ పిక్సెల్ 11ఎ స్మార్ట్ఫోన్ వివిధ కలర్ ఆప్షన్స్లో అందుబాటులోకి రాబోతోంది. ఇందులో ఆబ్సిడియన్ బ్లాక్ (Obsidian Black)తో పాటు ఆలివ్ గ్రీన్ (Olive Green), ఫ్రాస్ట్ పర్పుల్ (Frost Purple), ఫాగ్ సిల్వర్ (Fog Silver) కలర్ ఆప్షన్స్ను కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన ఫీచర్స్తో పాటు స్పెషిఫికేషన్స్ కంపెనీ త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Oppo K15 Launch: సాంసంగ్, Vivoలకు గట్టి పోటీగా Oppo K15 ఫోన్.. జూలై 24న లాంచ్!
Hyderabad, Telangana:Oppo K15 Launch News: ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో (Oppo) మార్కెట్లోకి మరో అద్భుతమైన మొబైల్ను విడుదల చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది.. చైనా మార్కెట్లో ఇప్పటికే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న Oppo K15 Proతో పాటు Oppo K15 Pro+ మోడల్స్ను దృష్టిలో పెట్టుకుని.. అత్యంత చీప్ ధరలోనే పవర్ఫుల్ ఫీచర్లతో కూడిన Oppo K15 స్మార్ట్ఫోన్ను త్వరలోనే విడుదల చేయబోతోంది. ఇది ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్ను కలిగి ఉండబోతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Oppo K15 స్మార్ట్ఫోన్ జూలై 24న చైనాలో అధికారికంగా విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు కూడా ఇప్పటికే ప్రారంభమయిన్నట్లు తెలుస్తోంది.. సాంసంగ్, వివో, షావోమి వంటి దిగ్గజ సంస్థలకు గట్టి పోటీనిచ్చేలా ఈ ఫోన్ను ఒప్పో తయారు చేసిన్నట్లు తెలుస్తోంది.. ఈ ఫోన్ మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్తో విడుదల కాబోతోంది. ఇందులో అద్భుతమైన ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 సూపర్ (MediaTek Dimensity 7360 Super) ప్రాసెసర్ను కూడా కలిగి ఉంటుంది.. దీనికి తోడుగా బెస్ట్ పర్ఫార్మెన్స్ అందించేందుకు టైడల్ ఇంజిన్ (Tidal Engine) టెక్నాలజీని కూడా అందుబాటులోకి తీసుకు రాబోతోంది.. గేమింగ్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని.. ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు అద్భుతమైన వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ను ఇందులో ఏర్పాటు చేశారు.
కళ్లు చెదిరే డిస్ప్లే..
Oppo K15 స్మార్ట్ఫోన్ 6.59 అంగుళాల ఫ్లాట్ డిస్ప్లేతో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. యూజర్లకు ప్రీమియం లుక్ ఇచ్చేందుకు ఈ ఫోన్ను వైట్తో పాటు గ్రే రంగుల ఆప్షన్లలో లభిస్తోంది. సాధారణంగా స్మార్ట్ఫోన్లలో 5000 mAh బ్యాటరీలను చూస్తుంటాం.. కానీ ఒప్పో ఈ మోడల్లో ఏకంగా 8,000 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీతో ఈ దీనిని విడుదల చేసేందుకు సిద్ధమైంది.. దీనికి తోడు 80 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తోంది.. బ్యాటరీ లైఫ్ను, ఫోన్ లైఫ్ను పెంచడానికి ఇందులో సరికొత్త గ్లేసియర్ బ్యాటరీ ఎనర్జీ గ్యాదరింగ్ (Glacier Battery Energy Gathering) చిప్ను కూడా అందుబాటులోకి తీసుకు రావడం విశేషం.
50 MP బ్యాక్ కెమెరా..
ఫోటోగ్రఫీ లవర్స్ కోసం ఈ ఫోన్ ఒక అద్భుతమైన వరంగా భావించవచ్చు.. దీని వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ను కూడా కలిగి ఉంటుంది.. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ కూడిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు, మరో 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను కూడా అందిస్తోంది.. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ భాగంలో కూడా 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా అందుబాటులోకి తీసుకు రావడం విశేషం.. ఇవే కాకుండా చాలా రకాల ఫీచర్స్ను కూడా కలిగి ఉంటుంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Guntur Incident: గుంటూరులో మహిళను వివస్త్రను చేసి దాడి..సీఎం చంద్రబాబు ఆగ్రహం, నిందితుడ్ని పార్టీ నుంచి తొలగింపు!
Guntur, Andhra Pradesh:Guntur Incident Today: గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో ఓ మహిళను వివస్త్రను చేసి జరిగిన దాడి ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ దారుణ సంఘటన తనను ఎంతగానో కలచివేసిందని ఆయన సోషల్ మీడియా వేదికగా (ఎక్స్) ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల గౌరవానికి భంగం కలిగించే ఎలాంటి చర్యలనైనా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని, ఇలాంటి అనాగరిక పనులకు సమాజంలో చోటు లేదని సీఎం స్పష్టం చేశారు.
నిందితుడి అరెస్ట్.. పార్టీ నుంచి సస్పెన్షన్
బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దాడికి పాల్పడిన నిందితుడిపై ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదు చేసి, పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ ఘటనతో సంబంధం ఉన్న వ్యక్తిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు.
చట్టం ముందు అందరూ సమానమే
రాజకీయ పార్టీల అండ చూసుకుని తప్పులు చేయొచ్చని భావించే వారికి ఈ ప్రభుత్వం ఎలాంటి రక్షణ కల్పించబోదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. చట్టం ముందు ఎవరైనా సమానమేనని స్పష్టం చేశారు. "ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళకు పూర్తి భద్రత, గౌరవం కల్పించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం అండగా నిలుస్తుంది" అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
వివాదానికి కారణం ఏమిటి?
ఈ నెల 15వ తేదీ రాత్రి కృష్ణబాబు కాలనీకి చెందిన ఓ మహిళ తన ఇంటి ముందున్న మున్సిపల్ కుళాయి నుండి మోటార్ ద్వారా నీటిని పట్టుకుంటున్నారు. ఆ సమయంలో స్థానిక 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి, అతని కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని, మోటార్ తొలగించాలంటూ ఆమెతో గొడవకు దిగారు. వాగ్వాదం కాస్తా ముదిరి బాధితురాలిపై వారు తీవ్రంగా దాడి చేశారు.
నడిరోడ్డుపై అమానవీయ ప్రవర్తన
భయంతో బాధితురాలు తన ఇంట్లోకి వెళ్ళిపోతుండగా, మూర్తి సోదరి (ట్రాన్స్జెండర్ మాధవి) ఆమెను వెంబడించి మరీ దాడి చేసింది. అంతటితో ఆగకుండా బాధితురాలి దుస్తులు చించేసి, నడిరోడ్డుపై పూర్తిగా వివస్త్రను చేశారు. తనను వదిలేయమని బాధితురాలు ఎంతగా వేడుకున్నా నిందితులు కనికరించలేదు. చివరకు స్థానిక మహిళలు చొరవ తీసుకుని, నిందితులను అడ్డుకుని బాధితురాలికి దుస్తులు అందించి కాపాడారు.
Also Read: పంచాయితీ ఎన్నిక సీట్ల విషయంలో జనసేన తగ్గేదేలే.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్య!
Also Read: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం రాజకీయ నేపథ్యం ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ramagiri Gold Mines: 'గోల్డ్ హబ్'గా మారనున్న ఆంధ్రప్రదేశ్..25 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న బంగారు గని..ఎక్కడంటే?
Ramagiri, Andhra Pradesh:Ramagiri Gold Mines Re-Open: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రముఖ 'గోల్డ్ హబ్'గా అవతరించే దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవలే కర్నూలు జిల్లా జొన్నగిరి బంగారు గనుల నుంచి బంగారం ఉత్పత్తి ప్రారంభం కాగా.. ఆ తర్వాత ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లాలోని చారిత్రాత్మక రామగిరి బంగారు గనులు తిరిగి ప్రారంభం కావడానికి సిద్ధమవుతున్నాయి. దాదాపు పావు శతాబ్దం (25 ఏళ్లు) సుదీర్ఘ విరామం తర్వాత ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.
ఒకప్పుడు దేశంలోనే కీలకమైన బంగారు ఉత్పాదక కేంద్రంగా వెలిగిన రామగిరిలో.. నష్టాలు, సాంకేతిక పరిమితుల కారణంగా 2000వ సంవత్సరంలో మైనింగ్ పనులను పూర్తిగా నిలిపివేశారు. గతంలో ఇక్కడ 1982 నుండి 2002 వరకు 'భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్' (BGML) సంస్థ మైనింగ్ లీజును కలిగి ఉండేది.
రీ-ఓపెనింగ్కు దారితీసిన ప్రధాన కారణాలు..
గతంలో తక్కువ గ్రేడ్ ఉన్న నిక్షేపాల నుండి బంగారాన్ని వేరు చేయడం సాధ్యం కాక వదిలేశారు. కానీ, ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన మోడ్రన్ మైనింగ్ టెక్నాలజీ ద్వారా తక్కువ గ్రేడ్ ఖనిజం నుండి కూడా బంగారాన్ని సమర్థవంతంగా సేకరించవచ్చు.
అంతర్జాతీయ మార్కెట్లో లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్, దేశీయంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో.. ఇప్పుడు ఈ గనుల తవ్వకం వాణిజ్యపరంగా భారీ లాభాలను తెచ్చిపెట్టనుంది.
రామగిరిలో ఉన్న సంపద ఎంత?
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) నిర్వహించిన సర్వేలతో పాటు కొన్ని అధికారిక అంచనాలు ప్రకారం రామగిరి గోల్డ్ బెల్ట్ వివరాలు ఇలా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. దాదాపుగా 150 కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో ఈ ఖనిజ నిల్వలు ఉన్నట్లు సమాచారం. ఇందులో సుమారు 11.4 లక్షల టన్నుల మేర నిల్వ ఉండది.. అయితే దీని నుంచి దాదాపుగా 9.1 టన్నుల మేర మొత్తం బంగారం వెలికితీయగల ఆవశ్యకత ఉందని తెలుస్తోంది.
వ్యర్థాల నుంచి కూడా బంగారం..!
గతంలో మైనింగ్ చేసిన తర్వాత మిగిలిపోయిన దాదాపు 4.16 లక్షల టన్నుల భారీ వ్యర్థాల డంపులను అధికారులు గుర్తించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆ కాలపు పాత పద్ధతుల వల్ల ఈ వ్యర్థాలలో కూడా ఇంకా భారీగా బంగారం మిగిలిపోయింది. ఇప్పుడు కొత్త టెక్నాలజీతో ఈ వేస్ట్ను రీ-ప్రాసెస్ చేసి, అందులోని బంగారాన్ని కూడా వెలికితీయడానికి అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
వేగంగా కదులుతున్న అడుగులు
ఇటీవలే ఏపీ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రామగిరి ప్రాంతంలో స్వయంగా పర్యటించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు వేగవంతం కావడంతో స్థానిక ప్రజల్లో ఉపాధి అవకాశాలపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
గమనిక: ఈ కథనం కేవలం సమాచార ప్రయోజనాల కొరకు మాత్రమే అందించబడింది. దీనిని ఎలాంటి పెట్టుబడి సలహాగా భావించరాదు. పెట్టుబడి నిర్ణయాలకు ముందు నిపుణులను సంప్రదించాల్సిందిగా కోరుతున్నాము.
Also Read: గుంటూరులో మహిళను వివస్త్రను చేసి దాడి..సీఎం చంద్రబాబు ఆగ్రహం, నిందితుడి సస్పెండ్!
Also REad: పంచాయితీ ఎన్నిక సీట్ల విషయంలో జనసేన తగ్గేదేలే.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్య!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
QR రేషన్కు ఇంకాస్త వేచి చూడాలి.. ఎందుకంటే?
Karimnagar, Telangana:QR Code Smart Ration Cards: తెలంగాణ ప్రభుత్వం రేషన్ పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పుల కోసం ప్రతిష్టాత్మకంగా క్యూఆర్ కోడ్ (QR Code) స్మార్ట్ కార్డులను సిద్ధం చేసినప్పటికీ.. లబ్ధిదారులకు ఈ కొత్త సేవలు అందడానికి మరికొన్ని రోజులు వేచి చూడక తప్పేలా లేదని సమాచారం.. ప్రభుత్వం కార్డుల ముద్రణ ప్రక్రియను పూర్తి చేసినా.. క్షేత్రస్థాయిలో వాటి ద్వారా రేషన్ పంపిణీని తక్షణమే ప్రారంభించే పరిస్థితి కనిపించడం లేదని తెలుస్తోంది. సాంకేతిక మార్పులతో పాటు డీలర్ల శిక్షణ వంటి కీలక ప్రక్రియలు ఇంకా పెండింగ్లో ఉండటమే.. ఇందుకు ప్రధాన కారణమని సమాచారం..
క్యూఆర్ కోడ్ ఆధారిత రేషన్ పంపిణీ సాఫీగా సాగాలంటే.. ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో ఉన్న ఈ-పాస్ (e-PoS) యంత్రాలను పూర్తిగా అప్డేట్ చేయాల్సి ఉంది. కొత్త సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేయడంతో పాటు.. ఈ యంత్రాలను ఎలా ఆపరేట్ చేయాలనే అంశంపై రేషన్ డీలర్లకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది..
మరోవైపు.. ప్రస్తుతం వాడుకలో ఉన్న ఈ-పాస్ మెషిన్ల నిర్వాహక టెండర్ గడువు ఈ ఏడాది డిసెంబర్తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త టెండర్లు పిలుస్తారా? లేదా పాత యంత్రాలనే అప్గ్రేడ్ చేస్తారా? అనే సందిగ్ధత నెలకుంది. ఈ సాంకేతిక, పరిపాలనాపరమైన ప్రక్రియలన్నీ పూర్తి కావడానికి మరికొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రేషన్ లబ్ధిదారుల సంఖ్య భారీగా ఉంటుందని మనందరికీ తెలుసు. గణాంకాల ప్రకారం.. జిల్లాలో మొత్తం 11,10,655 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా 32,62,857 మంది లబ్ధిదారులు ప్రతి నెల ప్రభుత్వ సాయాన్ని పొందుతున్నారు. వీరి కోసం నెలకు సుమారు 19,875 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఇంత భారీ సంఖ్యలో ఉన్న లబ్ధిదారులకు ఎలాంటి అంతరాయం కలగకుండా కొత్త విధానాన్ని అమల్లోకి తేవడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్ వార్తలను ఖండించిన బీసీసీఐ!
Mumbai, Maharashtra:Rohit Sharma Retirement BCCI: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ భవిష్యత్తుపై గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎట్టకేలకు స్పందించింది. ఇంగ్లాండ్తో జరిగే వన్డే సిరీస్ తర్వాత సెలెక్టర్లు రోహిత్ను పక్కన పెట్టాలని చూస్తున్నారని, లార్డ్స్ మైదానంలో జరిగే మ్యాచ్ ఆయనకు చివరిది కానుందంటూ వచ్చిన వార్తలను బీసీసీఐ ఖండించింది.
అయితే, బోర్డు కార్యదర్శి దేవాజిత్ సైకియా ఇచ్చిన వివరణ రోహిత్ అభిమానులకు తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ, ఆయన ఉపయోగించిన కొన్ని పదాలు రోహిత్ భవిష్యత్తుపై పెద్ద హెచ్చరికగానే కనిపిస్తున్నాయి.
సెలెక్టర్ల చేతుల్లోనే నిర్ణయం!
"రోహిత్ శర్మ జట్టులో ఉన్నంత కాలం భారత్కు ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటాడు" అని సైకియా స్పష్టం చేశారు. పైకి ఇది రోహిత్కు మద్దతుగా నిలిచినట్లు అనిపించినా, ఇందులో ఎంతో వ్యూహాత్మక పదజాలం దాగి ఉంది. రాబోయే వన్డే సిరీస్కు రోహిత్ను ఖచ్చితంగా ఎంపిక చేస్తామని బోర్డు గ్యారెంటీ ఇవ్వలేదు. 2027 ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ కీలక భాగస్వామి అని ఎక్కడా ప్రస్తావించలేదు. యువ ఆటగాళ్ల కంటే రోహిత్కే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేయలేదు. అంటే, "జట్టులో ఉన్నంత కాలం" అనే మాట ద్వారా రోహిత్ కెరీర్ పొడిగింపును బోర్డు పూర్తిగా సెలెక్టర్ల నిర్ణయానికే వదిలేసింది.
భారత క్రికెట్లో సీనియర్ ఆటగాళ్ల కెరీర్ ముగింపు దశకు వచ్చినప్పుడు సెలెక్టర్లు ఇలాంటి దౌత్యపరమైన భాషను ఉపయోగించడం కొత్తేమీ కాదు. గతంలో పలువురు దిగ్గజాల విషయంలోనూ ఇదే జరిగింది. చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానే విషయానికొస్తే.. 2022లో వీరిని టెస్ట్ జట్టు నుండి తొలగించినప్పుడు డొమెస్టిక్ క్రికెట్ ఆడి ఫామ్ నిరూపించుకోమన్నారు. వాళ్లు తిరిగి జట్టులోకి వచ్చారు, కానీ ఆ పునరాగమనం ఎంతో కాలం నిలవలేదు. ప్రదర్శన తగ్గగానే ఎలాంటి వీడ్కోలు మ్యాచ్లు లేకుండానే వారిని పక్కన పెట్టేశారు.
అలాగే శిఖర్ ధావన్ రిటైర్మెంట్ కూడా మరింత నిశ్శబ్దంగా సాగింది. సెలెక్టర్లు ఆయనకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు, కానీ యువ ఓపెనర్లకు అవకాశాలిస్తూ ధావన్ను క్రమంగా పక్కన పెట్టేశారు. ఇటీవల షమీ విషయంలోనూ ఫిట్నెస్, ఫామ్ గురించే చర్చ నడిచింది. దేశీయ క్రికెట్లో రాణించినప్పటికీ జాతీయ జట్టు నుంచి పిలుపు అందుకోవడం ఆయనకు అంత సులువు కాలేదు.
రోహిత్ హోదా వేరు.. కానీ కాలం మారుతోంది!
రోహిత్ శర్మ కేవలం ఒక సాధారణ ఆటగాడు కాదు. ఆధునిక వన్డే క్రికెట్ స్వరూపాన్ని మార్చిన గొప్ప ఓపెనర్, ఐసీసీ ట్రోఫీ అందించిన మాజీ కెప్టెన్. అయితే, ఎంతటి ఘనమైన చరిత్ర ఉన్నా వర్తమాన ప్రదర్శనే జట్టులో స్థానాన్ని నిర్దేశిస్తుంది. ప్రస్తుతం జట్టులో స్థానం కోసం యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ వంటి యువ ఆటగాళ్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. భవిష్యత్తు ప్రపంచకప్ కోసం బలమైన జట్టును నిర్మించాలంటే ప్రతి స్థానం ఎంతో కీలకం.
తదుపరి జట్టు ప్రకటనతోనే అసలు క్లారిటీ!
బీసీసీఐ ప్రకటన ప్రకారం లార్డ్స్లో జరిగే మ్యాచ్ రోహిత్కు చివరిది కాకపోవచ్చు. రోహిత్ శర్మ తన అంతర్జాతీయ వీడ్కోలుపై ఎలాంటి ప్రకటన చేయకముందే ఆయనపై బలవంతపు ముగింపును రుద్దకుండా బోర్డు అడ్డుకుంది. కానీ, ఆయనకు కొత్త ఇన్నింగ్స్ వాగ్దానం కూడా లభించలేదు.
రాబోయే వన్డే సిరీస్కు రోహిత్ను ఎంపిక చేస్తారా? లేక 'విశ్రాంతి' పేరుతో రొటేషన్ పాలసీకి పరిమితం చేస్తారా? అనేదే ఇప్పుడు మిగిలి ఉన్న అసలు ప్రశ్న. బీసీసీఐ ఇచ్చే హామీల కంటే, తదుపరి జట్టు ఎంపికే రోహిత్ భవిష్యత్తుకు అసలైన సమాధానం చెప్పనుంది.
Also Read: డోపింగ్ వివాదంలో పాకిస్థాన్ స్టార్ క్రికెటర్కు షాక్..3 నెలల నిషేధం విధించిన ఐసీసీ!
ALso REad; FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్స్కు రంగం సిద్ధం..ఏ టీమ్కి ట్రోఫీ గెలిచే సత్తా ఉంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Saturday Astrology: శనివారం ఈ పనులు చేస్తే దురదృష్టం వెంటాడుతుందా? ఈ పనులు ఇప్పుడే ఆపేయండి!
Hyderabad, Telangana:Saturday Dos and Don'ts: హిందూ సంప్రదాయంలో శనివారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజును శని దేవునికి అంకితం చేస్తారు. శని దేవుడి అనుగ్రహం కోసం భక్తులు ప్రత్యేక పూజలు, ఉపవాసాలు చేస్తుంటారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం కొన్ని పనులు చేయడం వల్ల శని దేవుని ఆగ్రహానికి గురై, ఆర్థికంగా, కుటుంబపరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు. శనివారం రోజున అస్సలు చేయకూడని ఆ 5 ముఖ్యమైన పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1) జుట్టు, గోళ్లు కత్తిరించుకోవడం
శనివారం నాడు జుట్టు కత్తిరించడం, గడ్డం గీసుకోవడం లేదా గోళ్లు కత్తిరించుకోవడం వంటి పనులు చేయకూడదని పెద్దలు చెబుతారు. ఇలా చేయడం వల్ల శని దోష ప్రభావం పెరిగి, చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయని, ఆర్థిక నష్టాలు సంభవిస్తాయని జ్యోతిష్య విశ్వాసం.
2) ఇనుప వస్తువులు కొనడం
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇనుముకు.. శని గ్రహానికి బలమైన సంబంధం ఉంది. అందుకే శనివారం నాడు ఇనుము లేదా ఇనుముతో చేసిన వస్తువులను ఇంటికి కొనకూడదని పెద్దలు చెబుతుంటారు. ఈ రోజున ఇనుము కొంటే కుటుంబంలో కలహాలు రేగడమే కాకుండా, అనవసరపు ఖర్చులు పెరుగుతాయని నమ్ముతారు.
3) ఉప్పు కొనుగోలు చేయడం
శనివారం రోజున ఉప్పు కొనడం కూడా నిషిద్ధంగా భావిస్తారు. ఈ రోజున ఉప్పును ఇంటికి తెచ్చుకుంటే అప్పుల పాలు కావాల్సి వస్తుందని, అలాగే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టే ప్రమాదం ఉందని మత విశ్వాసాలు చెబుతున్నాయి.
4) మాంసాహారం, మద్యం సేవించడం
పవిత్రమైన శనివారం నాడు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఈ రోజున పూర్తిగా సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. నియమాలను ఉల్లంఘించి తామసిక ఆహారాలు తీసుకుంటే శని దేవుని ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని సంప్రదాయం సూచిస్తోంది.
5) తూర్పు, ఈశాన్య దిశల్లో ప్రయాణాలు
జ్యోతిష్య సూచనల ప్రకారం శనివారం నాడు తూర్పు, ఈశాన్య దిశల్లో ప్రయాణించడం అంత శుభప్రదం కాదు. ఈ దిశల్లో ప్రయాణించడం వల్ల అనుకున్న పనులు పూర్తికాకపోగా, అనేక ఇబ్బందులు ఎదురవుతాయని విశ్వసిస్తారు. అత్యవసరమైతే తప్ప ఈ దిశల్లో ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే మంచిది.
గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం మత విశ్వాసాలు, జ్యోతిష్య నమ్మకాల ఆధారంగా సేకరించబడింది మాత్రమే. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. భక్తుల నమ్మకం కోసమే ఈ సమాచారం అందించడం జరిగింది.
Also REad: ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే ఏమవుతుంది? పుకార్లపై వైద్యుల స్పందన ఇదే!
Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్న్యూస్.. భారీ పతనం దిశగా గోల్డ్..ఎందుకంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
