బెల్లంపల్లిలో బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభం
Kannal Rural, Telangana:బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పాత బస్టాండ్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షులు కోడి రమేష్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు గోనె శ్యాంసుందర్ రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గం అత్యధిక సంఖ్యలో బిజెపి సభ్యత్వం నమోదు చేయించాలని నాయకులు కార్యకర్తలు పిలుపునిచ్చారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
బీఆర్ఎస్ పార్టీ గెలిచేది పక్కా.. రాష్ట్రంలో గులాబీ జెండా ఎగిరేది పక్కా: కేటీఆర్
Maheshwaram, Telangana:BRS Party: 'బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో ఎవరు నష్టపోయారో ఆలోచించండి. కేసీఆర్కు పదవులు కొత్త కాదు. ఎన్నో పదవులను త్యాగం చేశారు. 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కేసీఆర్ సొంతం. కేంద్ర కేబినెట్ మంత్రి వరకూ అన్ని పదవుల్లో పనిచేశారు. ఇవాళ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు కోలుకోని నష్టం జరిగింది' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 'మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా నిన్న హైదరాబాద్కు వచ్చారు. కేసీఆర్ నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను చూసి ఆశ్యర్యపోయారు. మేఘాలయ సీఎం సంగ్మా నాకు స్వయంగా ఫోన్ చేసి.. కేసీఆర్ దార్శనికత అద్భుతమని కొనియాడారు' అని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ఇంత అద్భుతమైన వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదని గుండెలనిండా అభినందించారని చెప్పారు. పోరాటయోధుడే పాలకుడైతే పరిపాలన ఎలా ఉంటుందో ఇదో ఉదాహరణ అని పేర్కొన్నారు.
కుంభకోణాల జాతర
బీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. 'రాష్ట్రంలో వికాసం పోయింది. విధ్వంసం, విషాదం మాత్రమే మిగిలింది. కేసీఆర్ కిట్ పోయింది.. కరెంటు కోతల కాలం వచ్చింది. రైతుబంధు పోయింది.. రాహుల్ బంధు వచ్చింది. రాష్ట్రంలో సంక్షేమ పథకాల పాతర.. కుంభకోణాల జాతర నడుస్తోంది' అని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి ఉన్నా ప్రజలు ఇంకా ముఖ్యమంత్రిగా కేసీఆర్ను తలుచుకుంటున్నారని చెప్పారు. 'తెలంగాణ ఉద్యమంలో మహేశ్వరం ముద్దుబిడ్డ సిరిపురం యాదయ్య ఓయూ వద్ద రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేశారు. ఎంతోమంది అమరవీరుల త్యాగాల స్ఫూర్తితోనే.. పదేళ్ల పాలన సాగింది. ప్రజాసంక్షేమం.. ప్రగతిపథం.. రెండు జోడెడ్లలా ముందుకు సాగాయి' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
సబితమ్మ గెలుపు తథ్యం
'కార్యకర్తల జోష్ చూస్తుంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిపోయిన భావన కలుగుతోంది. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయిపోయారని అనిపిస్తోంది. మహేశ్వరంలో మరోసారి సబితమ్మ గెలుపు తథ్యమని తేలిపోయింది. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలిసేది పక్కా' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 'బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచేది పక్కా.. రాష్ట్రంలో గులాబీ జెండా ఎగిరేది పక్కా. తెలంగాణ నలుదిశలా ఒకే నినాదం మారుమోగుతోంది. అదే కాంగ్రెస్ పోవాలె.. కేసీఆర్ రావాలె' అని పిలుపునిచ్చారు.
పిచ్చోడి చేతిలో రాష్ట్రం
'నాడు ఉద్యమ నాయకుడికి ప్రజలు పాలనా పగ్గాలు అప్పగిస్తే.. తెలంగాణను నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు. రాష్ట్రం రాకెట్ వేగంతో దూసుకుపోయే సమయంలో పొరపాటునో, గ్రహపాటునో ఇప్పుడు ఒక తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రి అయ్యిండు. ఓ పిచ్చోడి చేతిలో రాయి ఉంటే చుట్టుపక్కల ఉన్న వారికి నష్టం. అదే పిచ్చోడి చేతిలో.. రాష్ట్రం ఉంటే నాలుగు కోట్ల ప్రజలకు నష్టం. ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది.. ఓ హిట్లర్ రెడ్డి. తనకు హిట్లరే ఆదర్శం అని రేవంతే స్వయంగా అంగీకరించాడు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఎవరైనా శ్రీరామచంద్రుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుంటారు. నరకాసురుడు, రావణాసురుడిని మించిన హిట్లర్ రేవంత్ రెడ్డికి ఆదర్శమట. అందుకే ఆయన పేరు.. ఇక నుంచి హిట్లర్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడో పంటకు రైతుబంధు ఎందుకు ఇవ్వరు అని రేవంత్ రెడ్డి అడిగాడు. ఒక్కరికే పెన్షన్ ఇస్తున్నరు.. నేను కుటుంబంలో ఇద్దరికి ఇస్తా అని మాయమాటలు చెప్పాడు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
రైతుబంధు దేవుడెరుగు
'రైతుబంధు రూ.15 వేలు చేస్తా అని డైలాగులు కొట్టాడు. 420 అబద్ధాలతో ఆగంచేసి గద్దెనెక్కాడు. రైతుబంధు దేవుడెరుగు, కనీసం యూరియాకు రాష్ట్రంలో దిక్కులేదు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నాటి దరిద్రాలన్నీ మళ్లీ దాపురించాయి. షాపులో కాదు.. యూరియాను యాపులో పెడతాం అన్నారు. ఇప్పుడు యాప్లో యూరియా కాదు కదా చివరికి రంగారెడ్డి జిల్లా పేరు లేదు.. మల్కాజ్గిరి పేరు లేదు. ఇక్కడ బ్రహ్మాండమైన రైతులున్నా రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా?' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రంగారెడ్డి, మల్కాజ్గిరి రైతులకు యూరియా అవసరం లేదా? అని నిలదీశారు. ప్రభుత్వానికి ఎంత తెలివి ఉన్నదో దీంతో అర్థమైపోతుందని రేవంత్ రెడ్డి తీరును ఎద్దేవా చేశారు.
అబద్ధపు మాటలు
'అసెంబ్లీ ఎన్నికల్లో లెక్కలేనన్ని అబద్ధాలతో మభ్యపెట్టారు. రేవంత్ రెడ్డి, రజనీకాంత్ను మించిన డైలాగులు కొట్టాడు. భట్టి కమల్ హసన్ను మించి యాక్టింగ్ చేశారు. వంద రోజులు గ్యారెంటీ కార్డు జాగ్రత్తగా పెట్టుకోమన్నారు. రెండున్నరేళ్లయినా నాలుక గీసి పరేయడానికి కూడా ఈ గ్యారెంటీ కార్డు పనికి రావడం లేదు' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు అసైన్డ్ భూముల పట్టాలిస్తాం అని దగా చేశారని.. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్పులపై కూడా అబద్ధపు మాటలు అని విమర్శించారు.
'తెలంగాణ సాదించిన నాడు రాష్ట్రంపై అప్పు రూ.72 వేల కోట్లు. పదేళ్లలో చేసిన అప్పు కేవలం రూ.2 లక్షల 80 వేల కోట్లు. అంటే సంవత్సరానికి రూ.28 వేల కోట్లు మాత్రమే. కేసీఆర్ అప్పుచేసి 1020 గురుకుల పాఠశాలలు పెట్టారు. ఆరున్నర లక్షల మంది పిల్లలకు లక్షా 20 వేల కోట్ల చొప్పున ఖర్చుపెట్టి అత్యుత్తమ విద్యను అందించారు. రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టి ఆరు దశాబ్దాల కరెంట్ కష్టాలను తీర్చారు' అని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు.
Khalistani Terror Threat: ఖలిస్థానీ ఉగ్రవాదుల ముప్పు.. ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు భారీ ముప్పు..రంగంలోకి కేంద్ర బలగాలు!
New Delhi, Delhi:Delhi Uttarakhand Terror Threat: ఖలిస్తానీ ఉగ్రవాద ముప్పు పొంచి ఉందంటూ నిఘా సంస్థల నుంచి వచ్చిన హెచ్చరికలతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఈ రెండు ప్రాంతాల్లోని ప్రముఖ దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లే లక్ష్యంగా ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందని భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.
ఈమెయిల్ బెదిరింపులతో హై అలర్ట్!
ఢిల్లీ, ఉత్తరాఖండ్లలో పెద్ద ఎత్తున ఉగ్రదాడులు జరగొచ్చని హెచ్చరిస్తూ భద్రతా సంస్థలకు బెదిరింపు ఈమెయిళ్లు వచ్చాయి. అందులోని సమాచారం ప్రకారం.. పలు ప్రముఖ దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, రాజకీయ నాయకులు, అలాగే పోలీసు సిబ్బందిని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది.
రాబోయే రోజుల్లో ఖలిస్తానీ ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడవచ్చని నిఘా సంస్థలు గట్టిగా అనుమానిస్తున్నాయి. ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం ఈ ఈమెయిళ్ల మూలాలపై ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్లో నిహాంగ్ సిక్కులకు, స్థానిక పోలీసులకు మధ్య జరిగిన తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఈ భద్రతా హెచ్చరికలు రావడం గమనార్హం.
అసలేం జరిగింది?
జూన్ 16 (చమోలి ఘటన): హేమకుండ్ సాహిబ్ యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న నిహాంగ్ యాత్రికులకు, కర్ణప్రయాగ్లోని స్థానిక వ్యాపారులకు మధ్య చిన్న గొడవ జరిగింది. ఇది కాస్తా హింసాత్మకంగా మారి, నలుగురు నిహాంగ్ సిక్కులు కత్తులతో దాడి చేయడంతో నలుగురు స్థానికులు గాయపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిహాంగ్లను అరెస్ట్ చేశారు. తమ వారిని విడుదల చేయాలంటూ నిహాంగ్ సిక్కుల బృందం జూన్ 20న రుద్రప్రయాగ్లోని ఒక గురుద్వారాను ఆక్రమించింది. ఆ తర్వాత జూన్ 25న డెహ్రాడూన్కు భారీ పాదయాత్ర చేపట్టింది.
సద్దుమణిగిన ఉద్రిక్తతలు
హిమాచల్ ప్రదేశ్ - ఉత్తరాఖండ్ సరిహద్దుల వద్ద నిహాంగ్ సిక్కులకు, పోలీసులకు మధ్య కొన్ని రోజులుగా కొనసాగిన ప్రతిష్టంభన ఎట్టకేలకు శాంతించింది. ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి పక్షపాతం లేకుండా నిష్పాక్షికంగా వ్యవహరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో, నిహాంగ్ బృందం తమ ఆందోళనను విరమించుకుని వెనుదిరిగింది.
ఉద్రిక్తతలు ప్రస్తుతానికి తగ్గినప్పటికీ, ఖలిస్తానీ ముప్పు పొంచి ఉందన్న నిఘా హెచ్చరికల నేపథ్యంలో దేవాలయాలు, రద్దీ ప్రాంతాలు, ప్రభుత్వ సంస్థల వద్ద రక్షణ వలయాన్ని భారీగా పెంచారు.
Also REad: 2005 ముందు నాటి కరెన్సీ నోట్లు పనిచేయవా? షాకింగ్ న్యూస్ చెప్పిన నేషనల్ బ్యాంక్!
Also Read: విద్యార్థులకు గుడ్న్యూస్..జూన్ 29న స్కూళ్లు కాలేజీలకు సెలవు..ఎక్కడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Singareni: సింగరేణిలో బొగ్గు మాయం కాలేదు.. రాజకీయ పార్టీలపై AITUC ఆగ్రహం!
Hyderabad, Telangana:No Coal Missing in Singareni: పెద్దపెల్లి జిల్లా సింగరేణి బొగ్గు గనులలో బొగ్గు మాయమైంది అంటూ వస్తున్న వార్తలను ఏఐటియుసి (AITUC) తీవ్రంగా ఖండించింది. రాజకీయ ప్రయోజనాల కోసమే.. కొన్ని రాజకీయ పార్టీలు సంస్థపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడింది.. పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన.. మీడియా సమావేశంలో ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
బొగ్గు మాయం కాలేదు.. టార్గెట్ కోసమే ఆ లెక్కలు..
సింగరేణిలో బొగ్గు మాయమైందని బిజెపితో పాటు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారం పూర్తిగా బూటకమని ఏఐటియుసి నేతలు స్పష్టం చేశారు. అధికారులు అన్యువల్ టార్గెట్ చేరుకోవడం కోసం లెక్కల్లో అదనపు బొగ్గును కలిపి చూపించడం వాస్తవమేనని.. అయితే ఆ విధానం తప్పే కావచ్చు కానీ.. బొగ్గు మాయమైందని ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు.. గత బిఆర్ఎస్ హయాంలో బొగ్గు మాయమైందని ఆరోపించిన కాంగ్రెస్ నాయకుడే.. ఇప్పుడు BRS లో చేరి రాజకీయాల అద్దె కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు.. రాజకీయ పార్టీలు సింగరేణి పరిరక్షణతో పాటు కార్మికుల హక్కులను పక్కనపెట్టి బూటక మాటలు మాట్లాడుతూ సమస్త ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వాల వైఫల్యాలు.. పెరిగిన రాజకీయ జోక్యం..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోతోందని నేతలు ఆరోపించారు.. సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహణను నిలిపివేసింది యాజమాన్యం కాదని.. రాష్ట్ర ప్రభుత్వమేనని వారు మండిపడ్డారు.. అదేవిధంగా, గత కెసిఆర్ ప్రభుత్వం మూలంగానే సింగరేణి బోర్డు పరిశ్రమ నాశనమైందని.. గత హయాంలోనే బొగ్గు గులాకులను అమ్ముకున్నారని విమర్శించారు. 2014 నుంచి సింగరేణికి చెందిన CSR, DMFT నిధులను ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం జూన్ 8న ప్రత్యేకమైన 31 డిమాండ్లతో యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చినట్లు నేతలు వెల్లడించారు. దీనిపై హైదరాబాద్ లోని రీజనల్ లేబర్ కమిషనర్ (RLC) వద్ద చర్చలు జరిగాయని.. జూలై 10 లోపు యూనియన్ తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆర్.ఎల్.సి యాజమాన్యానికి సూచించిందని తెలిపారు. ఒకవేళ యాజమాన్యం గనుక నిర్లక్ష్యం వహిస్తే.. అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఉమ్మడిగా సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. 12వ వేజ్ బోర్డు సాధన.. కొత్త గనుల ఏర్పాటు కోసం ఏఐటియుసి ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
వాన దేవుడా రావా ఉయ్యాలో.. వర్షాల కోసం సిరిసిల్ల పల్లెలో బతుకమ్మలు..
Hyderabad, Telangana:Telangana Rain Deficit: రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లోని మర్రిగడ్డ గ్రామంలో రైతాంగం తీవ్ర ఆందోళనలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. సకాలంలో రుతుపవనాలు రాకపోవడంతో పాటు.. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఇప్పటికే విత్తనాలు వేసిన రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. ఎండల తీవ్రతకు మొలకలు మాడిపోతుండడంతో.. పెట్టుబడి మట్టి పాలవుతుందేమోనని అన్నదాతలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతి కరుణించాలని.. కరువు నుంచి రక్షించాలని కోరుతూ గ్రామస్తులు కప్పలకు సంబంధించిన పెళ్లిళ్ల లతో పాటు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు..
మర్రిగడ్డ గ్రామంలో శనివారం ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది.. సాధారణంగా దసరా నవరాత్రుల్లో ఆడే బతుకమ్మను.. వర్షాలు సమృద్ధిగా కురవాలని ఏకైక సంకల్పంతో మహిళలు ముందుగానే పేర్చారు.. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న మహిళకు లేదా తో పాటు గ్రామ మహిళలు అందరూ ఏకమై ఈ నూతన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.. రంగురంగు పూలతో బతుకమ్మను అందంగా అలంకరించి.. వాటితో పాటు నీటి కోరత తీరాలని సంకేతిస్తూ.. నీటి బిందెలను కూడా పూల మాలలతో ముస్తాబు చేశారు..
మహిళలంతా ఒకే చోట చేరి.. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ.. వానలు కురవాలి ఉయ్యాలో.. మా కష్టాలు తీరాలి ఉయ్యాలో అంటూ భక్తి శ్రద్ధలతో సామూహికంగా పాడిన పాటలు పల్లె గుండెలను కదిలించాయి.. తమ సుఖ సంతోషాల కంటే.. లోకానికి అన్నం పెట్టే రైతుల కష్టాలు తీరని ముఖ్యమని వరుణ దేవుడిని వేడుకున్నారు.. ఈ సమయంలో గ్రామంలో ఉన్న ప్రతి ఒక మహిళ వరుడిని వానలు సక్రమంగా కురవాలని బతుకమ్మ ఆడుతూ ప్రత్యేకమైన పూజలు చేసినట్లు తెలుస్తోంది.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
ఈ వినూత్న కార్యక్రమం మర్రిగడ్డ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. పంచాయతీ ప్రతినిధులతో పాటు అధికారులు మహిళా కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని.. వ్యవసాయం బాగుంటేనే గ్రామం సురక్షితంగా ఉంటుందని బతుకమ్మల ఆడుతూ చాటి చెప్పారు.. పూజల అనంతరం సాంప్రదాయ పద్ధతుల్లో వరుణ యాగం తరహా ప్రార్థనలు చేసి, ప్రకృతి మాత కరుణిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ సమయంలో తీసిన కొన్ని వీడియోలు వైరల్గా మారాయి.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
వెలిగొండ ప్రాజెక్టుతో మార్కాపురం కరువు తీరిపోతుంది: సీఎం చంద్రబాబు ఆకాంక్ష
Jammana Palle, Andhra Pradesh:Veligonda Project: 'ప్రాజెక్టుకు భూములివ్వడం అంటే త్యాగం చేసినట్టే. పూర్వీకుల నుంచి వచ్చిన భూములను ప్రాజెక్టు కోసం వదులుకున్నారు. వెలిగొండ ప్రాజెక్టు నాలుగు జిల్లాల తలరాతను మారుస్తుంది' అని ఆకాంక్షించారు. ఈ ప్రాంత నీళ్లల్లో ఫ్లోరైడ్ సమస్యలు ఉండడంతో ఇక్కడి స్థానికులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మార్కాపురం ప్రాంతం అంటే కరవు ప్రాంతమని పేరు.. ఈ ప్రాంతానికి కృష్ణా నీళ్లు వస్తాయని ఎవరూ అనుకోలేదని పేర్కొన్నారు.
ఆనాడే ఎన్టీఆర్ ఆలోచన
ప్రకాశం జిల్లా యర్రగొండ నియోజకవర్గం గంటవానిపల్లెలో వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని రైతులు, నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 'మార్కాపురం ప్రాంతానికి కృష్ణా నీళ్లిచ్చేందుకు ఎన్టీఆర్ 1985లోనే ఆలోచన చేశారు. దీని కోసం ఓ కమిటీని వేశారు. ఎన్టీఆర్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 1995లో ప్రకాశం జిల్లా పర్యటనకు ఎప్పుడు వచ్చినా వెలిగొండ ప్రాజెక్టు గురించే అడిగేవాళ్లు. వరద వస్తే ఆ జలాలను మళ్లిస్తే ఆ నీళ్లతో తాము జీవనం సాగిస్తామని ఇక్కడి రైతులు చెప్పేవారు. 1996లో వెలిగొండకు శంకుస్థాపన చేశాం' అని సీఎం చంద్రబాబు తెలిపారు.
నిర్వాసితుల ఖాతాల్లో
'వెలిగొండ ప్రాజెక్టుకు ప్రస్తుత లెక్కల ప్రకారం రూ.10,580 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పటివరకు రూ.6,736 కోట్లు ఖర్చు చేశాం. ఇంకా రూ.3,844 కోట్లు ఖర్చు పెట్టాలి. రూ.1,932 కోట్లు తొలి విడతలో ఖర్చుచేయాలి. రూ.1,906 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది' అని సీఎం చంద్రబాబు వివరించారు. 2024లో ప్రభుత్వం వచ్చాక రూ.759 కోట్లు ఖర్చు చేశామని.. నిర్వాసితుల కోసం రూ.905 కోట్లు మంజూరు చేసి రూ.300 కోట్లు ఈ రోజు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు రోజుల్లో నిర్వాసితుల ఖాతాల్లో ఆర్ అండ్ ఆర్ డబ్బులు జమ అవుతాయని చంద్రబాబు చెప్పారు.
'గత పాలకులతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రం విధ్వంసమైంది. శాంతి భద్రతలకు తీవ్రమైన విఘాతం కలిగించేలా వ్యవస్థలను నిర్వర్యం చేశారు. పరిశ్రమలను తరిమేశారు.. పెట్టుబడులు రాకుండా అడ్డుకున్నారు... అప్పుల భారాన్ని పెంచారు' అని వైఎస్సార్సీపీ పాలనపై సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. 'నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు వద్దే ఉంటారు. టన్నెల్లోకి వెళ్తున్నారు.. పుట్టినరోజు కూడా ఇక్కడే చేసుకున్నారు. వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాం' అని తెలిపారు.
ఆర్ అండ్ ఆర్ నిధులు
వెలిగొండ ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన రైతులు, నిర్వాసితుల జీవితాలు మెరుగ్గా ఉంటాయని సీఎం చంద్రబాబు చెప్పారు. 'ఇవాళ 2,351 మంది నిర్వాసితులకు రూ.300 కోట్లు జమ చేస్తున్నాం. కలనూతల, సుంకేశుల, చింతలముడిపి, బుడుంచెర్ల, కాటంరాజు తండా, సాయిరాంనగర్, మెట్టి గొంది, బసవాయిపల్లి, లక్ష్మీపురం, అక్కచెరువు, గొట్టిపాడు గ్రామాల నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ నిధులు ఇస్తున్నాం' అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
'కలెక్టరేట్ పక్కన కొన్ని గ్రామాలకు నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తున్నాం. కొత్త జిల్లా ఏర్పాటుచేయడంతోపాటు నిర్వాసితుల కాలనీలో కలెక్టరేట్ ఏర్పాటు చేస్తున్నాం. నిర్వాసితుల కాలనీల్లో మౌళిక సదుపాయాలు పూర్తి చేశాం' అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. 'నిర్వాసితుల త్యాగంతో 4.47 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయి. 23 లక్షల మందికి తాగునీరు లభిస్తాయి. జూలై 31 నాటికి వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 నీళ్లను త్వరితగతిన ఇస్తాం' అని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
వెలిగొండ ప్రాజెక్టు స్వరూపం
ఫేజ్-1 కింద 1.19 లక్షల ఎకరాలకు నీళ్లు, 4 లక్షల మందికి తాగునీరు
ఫేజ్-2 కింద 3.25 లక్షల ఎకరాలకు సాగునీరు, 11.25 లక్షల మందికి తాగునీరు
Cobra Video: బాబోయ్ షూలో బ్లాక్ కింగ్ కోబ్రా.. వీడియో ఇదే..
Hyderabad, Telangana:Cobra Inside Shoe Video Watch: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని ఎంతగానో నవ్వుపుట్టిస్తే.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి.. కానీ తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం చూసే ప్రతి ఒక్కరి ఆశ్చర్యపోవడం ఖాయం.. ఒక ఇంటి బయట విడిచిన షూ లోపల అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన బ్లాక్ కింగ్ కోబ్రా నక్కి కూర్చుంది. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలిదు.. కానీ, ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతోంది..
సాధారణంగా వర్షాకాలం, చలికాలంలో లేదా వేడి ఎక్కువగా ఉన్నప్పుడు చల్లదనం కోసం పాములు ఇలాంటి చీకటి ప్రదేశాలలో ఆశ్రయం పొందుతూ ఉంటాయి. ఈ ఘటనలో కూడా ఇలాగే ఉన్నట్లు తెలుస్తోంది. షూ లోపల స్థావరం ఏర్పరచుకున్న ఆ నల్లత్రాచు, ఎవరికీ కనిపించకుండా లోపల నక్కి ఉంది. సాధారణంగా ఆడవులకు దగ్గరగా ఉండే ప్రదేశాల్లో ఇళ్లు ఉన్నవారికి ఇలా జరగడం సర్వసాధారణం..
కదిలిస్తే ఊగిపోయిన కోబ్రా..
వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి కర్ర సహాయంతో ఆ షూను నెమ్మదిగా కదిలించడం మనం చూడవచ్చు. అలా కదిలించిన వెంటనే.. లోపల ఉన్న నల్లటి కింగ్ కోబ్రా తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఒక్కసారిగా షూ లోపలి నుంచి తన పడగను పైకి లేపి.. కెమెరా వైపు చూస్తూ భయంకరంగా బుసలు కొట్టడం మొదలు పెట్టింది.. ఆ పాము కోపం, దాని సైజు చూస్తుంటే ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే.. ఒకవేళ అందులో పాము ఉందని గమనించకుండా ఎవరైనా నేరుగా అందులో కాలు పెట్టి ఉంటే.. ఎంత ఘోరంగా ఉండేదో ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది.. ఆ వ్యక్తి సకాలంలో గమనించి కర్రతో పరిశీలించడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
నెటిజన్ల కామెంట్లు..
ఈ వీడియోను ఇప్పటి వరకు చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించిన్నట్లు తెలుస్తోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇకపై నేను షూ వేసుకునే ముందు వంద సార్లు చెక్ చేసుకుంటానని ఒకరు కామెంట్ చేయగా.. పాములు ఎక్కడ దాక్కుంటాయో చెప్పలేం.. కాబట్టి ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మరొకరు రాసుకొచ్చారు. షూస్, చెప్పులను ఎప్పుడూ ఇంటి బయట పడేయకూడదని.. వీలైతే క్లోజ్డ్ షూ రాక్స్లో పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే పాములు ఇలా చొరబడే అవకాశాలు కూడా ఉన్నాయి.
Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Cobra Video: వామ్మో.. మరుగుదొడ్డిలో ప్రత్యక్షమైన కోబ్రా.. వీడియో ఇదే..
Hyderabad, Telangana:Cobra In Toilet Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎలాంటి వీడియోలు వైరల్ అవుతాయో ఊహించడం కష్టం.. ఇందులో కూడ కొన్ని నవ్విస్తే, మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. కానీ, తాజాగా నెట్టింట హల్చల్ చేస్తున్న ఒక వీడియో మాత్రం నెటిజన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తోంది.. నిత్యం మనం ఉపయోగించే మరుగుదొడ్డిలో ఊహించని విధంగా ఒక ప్రమాదకరమైన కోబ్రా ప్రత్యక్షం కావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా షాక్కు అవుతున్నారు.
కమోడ్లో ప్రత్యక్షమైన కాలనాగు..
జనాభా ఎక్కువగా ఉండే ఒక నివాస ప్రాంతంలోని ఓ ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది.. సదరు ఇంటి సభ్యులు ఎప్పటిలాగే మరుగుదొడ్డికి వెళ్లగా.. అక్కడి వెస్ట్రన్ కమోడ్లో ఏదో కదిలిన్నట్లు కనిపించింది. దానిని గమనించగా.. అందులో ఒక భారీ కోబ్రా పామును చూసి వారు ఒక్కసారిగా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు.. సాధారణంగా అడవులు, పొలాల్లో తిరిగే పాము.. ఇలా ఏకంగా ఇంట్లోని కమోడ్లోకి ఎలా దూరిందో అర్థం కాక.. ఆ కుటుంబ సభ్యులు స్నేక్ క్యాచర్కి సమాచారం అందించారు.
రంగంలోకి స్నేక్ క్యాచర్..
పామును చూసి భయాందోళనకు గురైన ఇంటి యజమానులు వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్కు సమాచారం అందించారు. సమయానికి చేరుకున్న స్నేక్ క్యాచర్, కమోడ్లో నక్కి ఉన్న పామును బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. ఆ స్నేక్ క్యాచర్ తన వద్ద ఉన్న ప్రత్యేకమైన స్టిక్తో పామును పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆ కోబ్రా తీవ్ర కోపంతో పైకి లేస్తూ.. బుసలు కొడుతూ దాడి చేయడానికి యత్నించింది. ఆ సమయంలో అక్కడ ఉన్న వారంతా ఊపిరి బిగబట్టి నిలబడిన్నట్లు తెలుస్తోంది. ఆ స్నేక్ క్యాచర్ అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తూ.. ప్రాణాలకు తెగించి ఆ నాగుపామును రెస్క్యూ చేసేందుకు ప్రయత్నించడం ఈ వీడియోలో మనం స్పష్టంగా చూడవచ్చు.
Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
నెటిజన్లు షాక్...
ఈ భయంకరమైన దృశ్యాలన్నీ అక్కడే ఉన్న కొందరు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది కాస్తా క్షణాల్లో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇకపై బాత్రూమ్కు వెళ్లాలన్నా భయమేస్తోంది బాబోయ్.. అని ఒకరు కామెంట్ చేయగా.. ఇంట్లోకి పాములు రాకుండా డ్రైనేజీ పైపులకు జాలీలు ఏర్పాటు చేసుకోవడం మంచిదని మరికొందరు సలహాలు ఇస్తూ కామెంట్లు పెడుతున్నారు. జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఇలాంటి ప్రమాదకరమైన పాము రావడం నిజంగా ఆందోళనకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Viral Video: వైరల్ బాల బాబా నిమ్మకాయ మ్యాజిక్.. ఎంటో చూశారా?
Hyderabad, Telangana:Bala Baba Viral Video Watch Now: సోషల్ మీడియా ప్రపంచంలో రోజుకో వింతైన వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. అందులో కొన్ని సోషల్ మీడియా వినియోగదారులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని తీవ్ర చర్చలకు దారితీస్తూ ఉంటాయి.. తాజాగా ఒక బాల బాబాకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. నీటిపై ఉన్న నిమ్మకాయను ఒక బాల బాబా తన మాయతో పైకి లేపడం మీరు చూడొచ్చు.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
వైరల్ వీడియోలో ఏముంది?
వైరల్ అవుతున్న ఆ వీడియోను గమనిస్తే.. కాషాయ వస్త్రాలు ధరించిన ఒక బాల బాబా నీటిలో కూర్చుని ఉండడం మీరు గమనించవచ్చు. అతని ముందు నీటిలో ఒక నిమ్మకాయ మునిగి ఉండడం మీరు చూడొచ్చు.. ఆ బాల బాబా తన చేతులను గాల్లో ఆడిస్తూ.. ఏదో మంత్రాలు చదువుతున్నట్లు నటిస్తూ.. కెమెరా వైపు చూడడం మీరు గమనించవచ్చు. అంతే, క్షణాల వ్యవధిలో నీటి అడుగున ఉన్న ఆ నిమ్మకాయ నెమ్మదిగా పైకి లేచి.. నీటిపై తేలడం మీరు చూడొచ్చు. తనకున్న అద్భుత శక్తులతోనే ఆ నిమ్మకాయను నీటిపైకి లేపాడం చూసిన సోషల్ మీడియా వినియోగదారులు షాక్ అవుతున్నారు..
నెటిజన్ల ట్రోలింగ్..
ఈ వీడియో ఊహించని స్థాయిలో వ్యూస్, లైకులను సంపాదించుకుంది.. కొందరు భక్తులు ఇది దైవ శక్తి.. బాల బాబా మహిమ అంటూ కామెంట్లు పెడుతుండగా.. మెజారిటీ నెటిజన్లు మాత్రం దీనిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది ముమ్మాటికీ ఫేక్ వీడియో.. జనాలను మోసం చేయడానికి చేస్తున్న విన్యాసం అని కొంతమంది కామెంట్ చేయగా.. సైన్స్ను నమ్మండి, ఇలాంటి మూఢనమ్మకాలను కాదని మరొకరు కామెంట్లు రాసుకొచ్చారు.
మరికొందరు ఈ వీడియోను పూర్తిగా పరిశీలించి.. ఇది కేవలం వీడియో ఎడిటింగ్ ట్రిక్ లేదా గ్రాఫిక్స్ (VFX) అని కొట్టిపారేస్తున్నారు. నిమ్మకాయకు సన్నటి దారం కట్టి పైకి లాగడం లేదా రివర్స్ వీడియో టెక్నిక్ ఉపయోగించి ఉండవచ్చని కొంతమంది నెటజన్స్ అభిప్రాయపడుతున్నారు.
Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
నిజానికి నీటిలో నిమ్మకాయ తేలడం వెనుక ఎలాంటి మంత్రాలు.. తంత్రాలు లేవని, ఇది కేవలం సాంద్రత (Density) ఆధారంగా జరిగే ఒక చిన్న సైన్స్ ప్రయోగమని నిపుణులు చెబుతూ వస్తున్నారు. సాధారణ నీటిలో నిమ్మకాయ మునుగుతుంది. కానీ.. ఆ నీటిలో ఎక్కువ మొత్తంలో ఉప్పు (Salt) కలిపితే నీటి సాంద్రత పెరుగుతుంది. అప్పుడు నిమ్మకాయ మునగకుండా పైకి తేలుతుందని అన్నారు. ఈ వీడియోలో కూడా బాల బాబా కూర్చున్న నీటిలో ఏదైనా కెమికల్ లేదా ఉప్పు కలిపి ఉండవచ్చని, లేదా కెమెరా ట్రిక్స్ వాడి ఉండవచ్చని వారు తెలుపుతున్నారు.
Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
షాకింగ్ ప్రైస్.. అమెజాన్లో రూ.25 వేల Realme 5G ఫోన్ కేవలం రూ.849కే..
Hyderabad, Telangana:Realme Narzo 100 Lite 5G Price Cut: మీరు కొత్త ప్రీమియం ఫీచర్లతో కూడిన బడ్జెట్ ఫ్రెండ్లీ 5G స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, మీకు ఇది అద్బుతమైన అవకాశంగా భావించవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్, ప్రీమియం ఫీచర్లతో విడుదల చేసిన రియల్మి నార్జో 100 లైట్ 5G (realme narzo 100 Lite 5G) స్మార్ట్ఫోన్పై కళ్లు చెదిరే భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అసలు ధరపై ఏకంగా వేల రూపాయల తగ్గింపును అందిస్తూ స్మార్ట్ఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్ అందిస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి చాలా ఛీప్ ధరకే సొంతం చేసుకోవచ్చు.
MRPపై ఏకంగా రూ.10,000 ఫ్లాట్ డిస్కౌంట్..
ప్రస్తుతం రియల్మీ కంపెనీ మార్కెట్లో ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర (MRP) రూ. 24,999తో విక్రయిస్తోంది. అమెజాన్ అందిస్తున్న ప్రత్యేక సేల్ ఆఫర్లలో భాగంగా దీనిని కొనుగోలు చేసేవారికి ఏకంగా రూ. 10,000 ఫ్లాట్ తగ్గింపు అందుబాటులో ఉంది.. ఈ భారీ డిస్కౌంట్ వినియోగిస్తూ.. ఈ ప్రీమియం స్మార్ట్ఫోన్ను వినియోగదారులు కేవలం రూ.14,999 లోపే సొంతం చేసుకోవచ్చు.. బడ్జెట్ ధరలో 5G స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారి ఇది ఒక గొప్ప డీల్ అని భావించవచ్చు.
అదనపు బ్యాంక్ ఆఫర్స్..
ఫ్లాట్ డిస్కౌంట్తో పాటు కస్టమర్లకు మరింత తగ్గింపు అందించేందుకు అమెజాన్ అదిరిపోయే బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తూ వస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేసే సమయంలో Amazon Pay ICICI లేదా HSBC Bank క్రెడిట్ కార్డ్లను ఉపయోగించి పేమెంట్ చేస్తే.. అదనంగా దాదాపు రూ.749 వరకు తక్షణ తగ్గింపు (Instant Discount) పొందవచ్చు. అలాగే కంపెనీ వీటిని అదనంగా ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా అందిస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి అత్యంత చీప్ ధరకే ఈ స్మార్ట్ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ఎక్స్ఛేంజ్ ఆఫర్తో ఊహించని తగ్గింపు..
ఈ సేల్లో అన్నింటికంటే హైలైట్ ఏమిటంటే.. అమెజాన్ అందిస్తున్న భారీ ఎక్స్ఛేంజ్ బోనస్.. మీ పాత స్మార్ట్ఫోన్ను ఎక్స్ఛేంజ్ చేస్తే.. ఈ సరికొత్త రియల్మి ఫోన్పై దాదాపు రూ.14,150 వరకు అదనపు బోనస్ అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ను పూర్తిగా క్లెయిమ్ చేసుకోగలిగితే.. అన్ని ఆఫర్లు పోను ఈ ప్రీమియం 5G స్మార్ట్ఫోన్ కేవలం రూ.849 లోపే సొంతం చేసుకోవచ్చు. అయితే, రూ.25 వేల విలువైన ఫోన్ను ఇంత తక్కువ ధరకు లభించడం నిజంగా ఊహించని ఆఫర్గానే చెప్పొచ్చు.. అయితే, ఈ బోనస్ అనేది పాత స్మార్ట్ఫోన్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా పర్ఫెక్ట్ వర్కింగ్ కండీషన్లో ఉంటేనే లభిస్తుంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Amazonలో Redmi Turbo 5 ఫోన్పై రూ.53,000 తగ్గింపు.. ఎలా కొనాలో చూడండి!
Hyderabad, Telangana:Redmi Turbo 5 Offer News: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ కస్టమర్ల కోసం.. అదిరిపోయే ప్రత్యేక డీల్స్ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రీమియం ఫీచర్లతో పాటు అద్భుతమైన పనితీరుతో మార్కెట్లో మంచి డిమాండ్ సొంతం చేసుకున్న Redmi Turbo 5 స్మార్ట్ఫోన్పై ఊహించని రీతిలో భారీ డిస్కౌంట్లను అందిస్తూ.. స్మార్ట్ఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్ అందించింది. రూ.55 వేల విలువైన ఈ ఫోన్ను కస్టమర్లు ఇప్పుడు అత్యంత చీప్ ధరకే సొంతం చేసుకునే సువర్ణావకాశం లభిస్తోంది. అయితే, అమెజాన్ ఈ స్మార్ట్ఫోన్పై ఎలాంటి ఆఫర్స్ను అందిస్తోంది? ఎలా కొనుగోలు చేస్తే చాలా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చో? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్లాట్ డిస్కౌంట్తో భారీగా తగ్గిన ధర..
మార్కెట్లో Redmi Turbo 5 అసలు ధర (MRP) రూ.54,999తో అందుబాటులో ఉంది.. అయితే, అమెజాన్ అందిస్తున్న స్పెషల్ డీల్స్లో భాగంగా భాగంగా ఈ స్మార్ట్ఫోన్పై ఏకంగా రూ.17,000 వరకు ఫ్లాట్ తగ్గింపు అందుబాటులో ఉండడం విశేషం. ఈ భారీ డిస్కౌంట్ తర్వాత కస్టమర్లు ఈ ఫోన్ను చీప్ ధరకే రూ.37,999 లోపే సొంతం చేసుకోవచ్చు. ఇవే కాకుండా మరింత తగ్గింపు కావాలనుకునేవారు తప్పకుండా ఎక్చేంజ్ ఆఫర్స్ వినియోగించాల్సి ఉంటుంది.
అదనపు బ్యాంక్ ఆఫర్లతో మరో రూ.2,000 తగ్గింపు..
ఫ్లాట్ డిస్కౌంట్తో పాటు కస్టమర్ల కోసం అదనపు బ్యాంక్ ఆఫర్లను కూడా అమెజాన్ అందుబాటులో ఉంచింది. ఈ ఫోన్ను కొనుగోలు చేసే సమయంలో ప్రముఖ బ్యాంకులైన Amazon Pay ICICI, SBI బ్యాంక్, Kotak బ్యాంక్తో పాటు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్లను ఉపయోగించి.. పేమెంట్ చేస్తే, కస్టమర్లకు దాదాపు రూ.2,000 వరకు అదనపు ఇన్స్టంట్ తగ్గింపు పొందవచ్చు. దీనితో ఫోన్ ధర మరింతగా తగ్గే అవకాశాలు ఉన్నాయి..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
కేవలం రూ.1,900కే ఈ స్మార్ట్ఫోన్ కొనొచ్చా?
ఈ ఆఫర్లలో అన్నింటికంటే హైలైట్ ఏమిటంటే భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్.. మీ వద్ద ఉన్న పాత స్మార్ట్ఫోన్ను ఎక్స్ఛేంజ్ చేయడం వల్ల గరిష్టంగా రూ.36,099 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందే అవకాశం ఉంది. అయితే, మీరు ఈ పూర్తి ఎక్స్ఛేంజ్ బోనస్ పొందితే.. అన్ని ఆఫర్లు పోను ఈ ప్రీమియం స్మార్ట్ఫోన్ను కేవలం రూ.1,900 లోపే మీ సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ ఆఫర్ అనేది కేవలం మీరు ఎక్చేంజ్ చేసే పాత మొబైల్ కండీషన్పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీకు భారీ ఎక్చేంజ్ ఆఫర్ లభిస్తే.. ఈ స్మార్ట్ఫోన్ చీప్ ధరకే సొంతం చేసుకొవచ్చు..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sun Transit: పుష్య నక్షత్రంలోకి సూర్యుడి సంచారం.. ఆగస్టు 3 వరకు ఆ రాశుల వారికి అదృష్ట కాలం..
Hyderabad, Telangana:Sun Transit In Pushya Nakshatra 2026 Effect On Zodiac: జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల రాజు అయిన సూర్య భగవానుడి నక్షత్ర మార్పుకు అత్యంత ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.. రాబోయే జూలై 20, సోమవారం ఉదయం 11:33 గంటలకు ఆత్మవిశ్వాసం, కీర్తి ప్రతిష్టలకు కారకుడైన సూర్య దేవుడు తన స్థానాన్ని మార్చుకుని పుష్య నక్షత్రం లోకి సంచారం చేయబోతున్నాడు.
ఆగస్టు 3వ తేదీ వరకు సూర్యుడు ఇదే నక్షత్రంలో సంచార దశలో కొనసాగుతూ ఉంటాడు. జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. సూర్యుడి ఈ నక్షత్ర మార్పు అన్ని రాశుల వారిపై ప్రభావం చూపినప్పటికీ.. ముఖ్యంగా నాలుగు రాశుల వారి జీవితాలను పూర్తిగా మార్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరికి ఆర్థికంగా విపరీతమైన ధన లాభాలు కలగడమే కాకుండా.. ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఊహించని విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సింహ రాశి (Leo)
సింహ రాశికి అధిపతి సూర్యుడే కావడం వల్ల ఈ నక్షత్ర సంచారం వీరికి అద్భతమైన లాభాలను తెచ్చిపెడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు లేదా వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయంగా భావించవచ్చు.. ధన లాభం కలగడం వల్ల మానసిక ప్రశాంతత కూడా సులభంగా లభించబోతోంది..
వృషభ రాశి (Taurus)
వృషభ రాశి వారికి ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరి జీవితంలో సానుకూల ప్రయోజనాలు కలుగుతాయి.. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే చాలా బలంగా మారుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఏదైనా పెద్ద సమస్య లేదా ప్రమాదం నుంచి స్నేహితుల సహాయంతో సురక్షితంగా బయపడే అవకాశాలు ఉన్నాయి.. ఆఫీసులో పెద్ద బాధ్యతలు లేదా ప్రమోషన్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయాల్సి వచ్చే ఛాన్స్లు కూడా కనిపిస్తున్నాయి.
మేష రాశి (Aries)
మేష రాశివారికి సూర్యుని నక్షత్ర సంచారంతో పనితీరులో అద్భుతమైన విజయాలు చేకూరుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థిక స్థిరత్వం గణనీయంగా పెరుగుతుంది.. వృత్తి జీవితంలో మెరుగైన అవకాశాలు కలుగుతాయి. మీ శ్రమకు కార్యాలయంలో అద్బుతమైన గుర్తింపు, ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా సులభంగా లభిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రేమ జీవితంలో కూడా సానుకూల మార్పులు వస్తాయి.. సామాజికంగా మీ గౌరవ ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి.
ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఆర్థికంగా ఈ సమయం ఒక వరం లాంటిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వివిధ మార్గాల నుంచి వీరు తప్పకుండా ఆకస్మిక ధనలాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెరీర్లో పెద్ద పురోగతిని సాధిస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది. సమాజంలో ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.. ఇవి మీ వ్యాపార లేదా వృత్తి ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Labhadrishti Rajayoga: శని, కుజుల లాభదృష్టి రాజయోగం.. ఈ 3 రాశుల వారికి ఇక తిరుగుండదు, డబ్బే డబ్బు!
Hyderabad, Telangana:Saturn Mars 60 Degree Conjunction Telugu News: వేద జ్యోతిష్య శాస్త్రంలో అనేక గ్రహాలు కలిసి వివిధ యోగాలను ఏర్పాటు చేస్తూ ఉంటాయి. ఈ యోగాలు అన్ని రాశుల పైన ముఖ్యమైన ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే 2026 జూలై 19వ తేదీన ఎంతో శక్తివంతమైన రాజయోగం ఏర్పడబోతోంది. ఇది అత్యంత శక్తివంతమైన యోగాల్లో ఒకటిగా భావిస్తారు. కుజ శని గ్రహాల కలయిక కారణంగా.. ఒక దానికి ఒకటి 60 డిగ్రీల కోణంలోకి రావడం వల్ల ఎంతో శక్తివంతమైన లాబదృష్టి యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో ఆనందంతో పాటు శ్రేయస్సు ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అలాగే ఆర్థికపరమైన వృద్ధి కూడా పెరగడం ఖాయమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కోరుకుంటున్న కోరికలు ఎంతో సులభంగా నెరవేరబోతున్నాయి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విముక్తి లభించబోతా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తూ ఉన్నారు. వీరికి ఈ సమయంలో ఎన్నో రకాల సమస్యల నుంచి విముక్తి లభించబోతోంది. అయితే, ఈ మూడు రాశుల వారికి లాభదృష్టి రాజయోగం అద్భుతమైన ఫలితాలను అందించబోతుందో.. ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ రాశుల వారికి లాభాలే..
మేషరాశి
శని కుజ గ్రహాలు ఒకదానికొకటి 60 డిగ్రీల కోణంలోకి రావడం వల్ల నాలుగు రాశుల వారిలో ముఖ్యంగా మేష రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది.. ఈ కాలంలో వైవాహిక జీవితంలో అద్భుతమైన ప్రశాంతత లభించబోతోంది. ముఖ్యంగా వృత్తిపరమైన జీవితంలో విపరీతమైన పురోగతి సాధించే అవకాశాలున్నాయి. అలాగే ఉద్యోగస్తులు ఉన్నత అధికారుల తో మంచి పరిచయాలు ఏర్పడి పదోన్నతులు కూడా వారి నుంచి పొందే అవకాశాలున్నాయి. ఈ సమయంలో సహుద్యోగులు కూడా పనిలో మీకు తోడు ఉండడం వల్ల ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో భారీ ధన లాభాలు కూడా పొందగలుగుతారు. ఈ సమయంలో ఎలాంటి ప్రయత్నాలు చేసినా అదృష్టం విపరీతంగా లభిస్తుంది.
వృశ్చిక రాశి
ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి కూడా ఈ సమయం ఎంతో అదృష్టాన్ని కలిగించబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీరికి ఈ సమయంలో విపరీతమైన ప్రయోజనాలు కలగడమే కాకుండా.. మానసిక సమస్యలు తొలగిపోబోతున్నాయి. అలాగే ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరిగి శారీరక బలం కూడా విపరీతంగా పెరుగుతుంది. దీంతోపాటు శత్రుత్వం తొలగిపోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో వీరు అందరితో స్నేహంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు తప్పకుండా ఈ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దీని కారణంగా వీరు ఊహించని ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా జీవితంలో వచ్చే అన్ని సమస్యలు సులభంగా పరిష్కారం కాబోతున్నాయి..
మకర రాశి
మకర రాశి లో జన్మించిన వ్యక్తులకు కూడా శని కుజ గ్రహాల ప్రభావం ఊహించని స్థాయిలో పడుతుంది. దీని కారణంగా వీరికి ఈ సమయం ఎంతో బాగుంటుంది. వీరికి ఊహించని స్థాయిలో అదృష్టం కూడా కలిసి రాబోతోంది. ఈ సమయంలో కష్టమైన పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. వీరి జీవితం పై విశ్వాసాన్ని తిరిగి పొందుతారు. అంతేకాకుండా వ్యాపారాల్లో పెద్ద పెద్ద ఒప్పందాలు కూడా కుదుర్చుకుని అవకాశాలు ఉన్నాయి. నిలిచిపోయిన పాత పనులు ఇప్పుడు సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కూడా గొప్ప పురోగతి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఆదాయ వనరులు కూడా విపరీతంగా ఏర్పడి అవసరమైన ఒత్తిడిని వదిలేసుకునే అదృష్టాన్ని పొందుతారు. అంతేకాకుండా ఇతరులతో మంచి సమయాన్ని గడుపుతారు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Skoda Kodiaq RS: జనానిది కడుపు మంటా? కారు క్రేజా? అంతలా ఏకిపారేసి.. 6 నిమిషాల్లో ఎలా కొనేశారయ్యా బాబూ..!!
Secunderabad, Telangana:Skoda Kodiaq RS: స్కోడా భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన వాహన శ్రేణిని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆ సంస్థ తన కొత్త కోడియాక్ ఆర్ఎస్ ఎస్ యూవీని మార్కెట్లోకి లాంచ్ చేయబోతోంది. జూన్ 22 నుంచి కోడియాక్ ఆర్ఎస్ కోసం అధికారికంగా బుకింగ్స్ ను కూడా ప్రారంభించింది. అయితే లాంచ్ కు ముందే ఈ ఎస్ యూవీ భారీ సక్సెస్ సాధించింది. అన్ని యూనిట్లు కేవలం నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. స్కోడా ఈ ఎస్ యూవీని లిమిటెడ్ ఎడిషన్ గా అందిస్తోంది కంపెనీ. బుకింగ్స్ ప్రారంభించిన వెంటనే దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఈ ఎస్ యూవీ కోసం పోటెత్తారు.
మొత్తం 20 యూనిట్లు కేవలం 6 నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి. కోడియాక్ ఆర్ఎస్ బుకింగ్లను ప్రారంభించడానికి ముందు.. భారతదేశంలో కేవలం 50 యూనిట్లను మాత్రమే విక్రయిస్తామని కంపెనీ ప్రకటించింది. కంపెనీ తదుపరి బ్యాచ్ను భారతదేశానికి తీసుకువస్తుందో లేదో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ శక్తివంతమైన ఎస్యూవీ భారతదేశంలోకి పూర్తిగా నిర్మించిన యూనిట్గా దిగుమతి కానుంది. ఫలితంగా, దిగుమతి చేసుకున్న వాహనాలపై అధిక పన్ను భారం కారణంగా భారతదేశంలో దీని ధర ఎక్కువగా ఉంటుంది.
కోడియాక్ RS దాని రూపాన్ని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంచుకుంది. కానీ RS బ్యాడ్జింగ్, స్పోర్టీ హంగులను కలిగి ఉంది. ఇందులో గ్లాస్ బ్లాక్ గ్రిల్, మ్యాట్రిక్స్ LED హెడ్ల్యాంప్లు, పెద్ద ఎయిర్ ఇన్టేక్లు, బ్లాక్-అవుట్ ఎలిమెంట్స్తో కూడిన ఫ్రంట్ బంపర్ ఉన్నాయి. ఎరుపు రంగు బ్రేక్ కాలిపర్లు, పెద్ద అల్లాయ్ వీల్స్ దీని దూకుడు రూపాన్ని మరింత పెంచుతాయి.
ఈ 7-సీటర్ SUVలో అనుసంధానించిన LED టెయిల్ ల్యాంప్లు, బ్యాక్ సైడ్లో స్పోర్టీ రూఫ్ స్పాయిలర్ ఉన్నాయి. క్యాబిన్ కూడా విశాలంగా ఉండి, ప్రయాణీకులందరికీ తగినంత స్థలాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. దీని క్యాబిన్లో స్పోర్ట్ సీట్లు, లెదర్, స్యూడ్ ఫినిషింగ్లు, ఎరుపు రంగు కుట్లు, RS బ్రాండింగ్ ఉన్నాయి. అంతేకాదు.. ఇందులో 12.9-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 13-స్పీకర్ల కాంటన్ ఆడియో సిస్టమ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, పనోరమిక్ సన్రూఫ్, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్ టెయిల్గేట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఈ ఎస్యూవీకి 2.0-లీటర్, 4-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ను అమర్చారు. ఇది 265 హెచ్పి, 400 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. స్కోడా ఆక్టేవియా ఆర్ఎస్, వోక్స్వ్యాగన్ గోల్ఫ్ జిటిఐలకు శక్తినిచ్చే ఇంజన్ కూడా ఇదే. దీనికి 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ను జతచేశారు. ఇది నాలుగు చక్రాలకూ శక్తిని అందిస్తుంది.
భద్రత పరంగా చూస్తే.. ఈ ఎస్యూవీలో9 ఎయిర్బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ బ్రేక్ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, హిల్ అసిస్ట్, లెవెల్-2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు.
8-లీటర్ల ఇంధన ట్యాంక్ కలిగిన ఈ మూడు వరుసల SUV, అన్ని సీట్లను మడిచినప్పుడు 281 లీటర్ల బూట్ స్పేస్ను, కేవలం మూడవ వరుసను మడిచినప్పుడు 786 లీటర్లను, రెండవ, మూడవ వరుసలను మడిచినప్పుడు ఏకంగా 1,976 లీటర్ల స్థలాన్ని అందిస్తుంది. తక్కువ సమయంలోనే పూర్తిగా అమ్ముడైపోవడం భారత మార్కెట్లో పెర్ఫార్మెన్స్ ఎస్యూవీలకు వేగంగా పెరుగుతున్న డిమాండ్కు నిదర్శనమని చెప్పాలి. కోడియాక్ ఆర్ఎస్ ఈ విభాగంలో ఒక కొత్త సంచలనాన్ని సృష్టించింది.
Also Read: జూలైలో మరింత పతనం.. 10గ్రాముల పసిడి రూ. 1 లక్షకు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
ఆర్టీసీ బస్సులో సిగరెట్ కాల్చిన కండక్టర్.. మద్యం మత్తులో వీరంగం
Vinukonda, Andhra Pradesh:RTC Bus Cigarette Smoke: ఎంతో మంది ప్రయాణికులను ప్రజా సేవగా భావించి వారితో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఆర్టీసీ కండక్టర్ రెచ్చిపోయాడు. తాగి విధులకు హాజరవడమే కాకుండా తాగిన మైకంలో అనుచితంగా ప్రవర్తించాడు. ప్రయాణికులతో దుర్భాషలాడుతూ వారిపై బూతు పంచాంగం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా బస్సులోనే సిగరెట్ కాలుస్తూ వీరంగం సృష్టించాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. వైరల్గా మారిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో ఆర్టీసీ కండక్టర్ అత్యంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన సంఘటన వినుకొండలో జరగడం కలకలం రేపింది. మద్యం మత్తులో బస్సులోనే సిగరెట్ కాలుస్తూ.. ఇదేమిటని ప్రశ్నించిన ప్రయాణికులను అసభ్య పదజాలంతో దూషించాడు. బొల్లపల్లి మండలం దోమలగుండం గ్రామానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో డ్యూటీ ముగించుకుని తిరుగు ప్రయాణమైన ఒక ఆర్టీసీ కండక్టర్ ఎక్కాడు.
అతడు అప్పటికే పూర్తిగా మద్యం మత్తులో తూగుతున్నాడు. తాగిన మైకంలో ఆర్టీసీ బస్సులోనే నిబంధనలకు విరుద్ధంగా సిగరెట్ వెలిగించాడు. సిగరెట్ పొగతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అతడిని ప్రయాణికులు వారించబోగా ఆ కండక్టర్ మరింత రెచ్చిపోయాడు. తాగిన మైకంలో ప్రయాణికులతో అసభ్యకర రీతిలో ప్రవర్తించడమే కాకుండా బూతుల పంచాంగం మొదలుపెట్టాడు. అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ వీరంగం సృష్టించాడు.
అతడు బస్సులో వ్యవహరించిన తీరుతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. తమకు రక్షణగా.. ఆదర్శంగా ఉండాల్సిన ఆర్టీసీ సిబ్బందే ఇలా ప్రవర్తించడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన ఆ కండక్టర్పై అంతర్గత విచారణకు ఆర్టీసీ అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. అతడిని విధుల నుంచ సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నట్ల తెలుస్తోంది.
శైలజా రామయ్యర్కు స్థాన చలనం.. తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు
Hyderabad, Telangana:Telangana IAS Officers Transfers: పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం మరోసారి అధికారులకు స్థాన చలనం కల్పించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మారిన రోజే ఐఏఎస్లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కీలకమైన శాఖలకు సంబంధించిన అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మారిన తర్వాత మరోసారి అధికారుల మార్పులు చేర్పులు జరిగాయి. 13 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ జరగ్గా ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
దేవాదాయ శాఖ నుంచి బదిలీ
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు జరిగాయి. 13 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగులు ప్రభుత్వం ఇచ్చింది. జీఓ ఆర్టీ నంబర్ 914ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్ శ్రీధర్ నియమితులవగా.. దేవాదాయ శాఖ నుంచి ఈఎఫ్ఎస్ అండ్ టీ శాఖకు శైలజా రామయ్యర్ బదిలీ అయ్యారు. ఇక పొలిటికల్ జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా అహ్మద్ నదీమ్ పోస్టింగ్ లభించింది.
రాహుల్ బొజ్జాకు స్థాన చలనం
డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జా నియామకం కాగా.. ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా అజిత్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. టీజీఆర్ఈడీసీఓ వీసీ, ఎండీగా ముషర్రఫ్ అలీ ఫారూఖీకి అదనపు బాధ్యతలు అప్పగించింది. హ్యాండ్లూమ్స్, టెక్ట్స్టైల్స్ స్పెషల్ సీఎస్గా పి. కాత్యాయిని దేవి నియమితులవగా.. టీజీఆర్ఈఆర్ఏ ఈడీ కె. గంగాధర్కు ఆర్ అండ్ బీ శాఖలో పోస్టింగ్ లభించింది. జీడబ్ల్యూఎంసీ కమిషనర్గా టి. వెంకన్న బదిలీ కాగా.. టూరిజం డైరెక్టర్గా కె. విద్యాసాగర్ నియామకం అయ్యారు. హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా కే. చంద్రకళకు ఎఫ్ఏసీ బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది.
అదనపు బాధ్యతలు
మైన్స్ అండ్ జియాలజీ శాఖ కార్యదర్శిగా ఎం. రఘునందన్ రావుకు పూర్తి అదనపు బాధ్యతలు ప్రభుత్వం అప్పగించగా.. టీజీ ట్రాన్స్కో వీసీ,ఎండీగా ముషారఫ్ అలీ ఫరూఖీకి ఎఫ్ఏసీ బాధ్యతలు ప్రభుత్వం ఇచ్చింది. ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్గా విద్యాసాగర్కు అదనపు బాధ్యతలు ఇవ్వగా.. శంషాబాద్ జోనల్ కమిషనర్ కె. చంద్రకళకు హెచ్ఎండీఏలో ఎఫ్ఏసీ బాధ్యతలు ఇచ్చింది. కొత్త ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా నియమితులైన సంజయ్ జాజుకి అదనపు బాధ్యతల కొనసాగింపుపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బాధ్యతలు సంజయ్ జాజుకే సీఎస్గా అవకాశం ఇచ్చింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ అదనపు బాధ్యతలు కొనసాగించింది. ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఇండస్ట్రీ, ఇన్వెస్ట్మెంట్ సెల్ సీఈఓగా కూడా సంజయ్ జాజు కొనసాగనున్నారు. స్పీడ్ వ్యవస్థ బాధ్యతలు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దే ఉన్నాయి.
