బెల్లంపల్లిలో బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభం
Kannal Rural, Telangana:బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పాత బస్టాండ్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షులు కోడి రమేష్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు గోనె శ్యాంసుందర్ రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గం అత్యధిక సంఖ్యలో బిజెపి సభ్యత్వం నమోదు చేయించాలని నాయకులు కార్యకర్తలు పిలుపునిచ్చారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Dhimsa Dance: కళ్లు చెదిరేలా థింసా డ్యాన్స్.. మోదీ సంభ్రమాశ్చర్యాలు
Bhogapuram, Andhra Pradesh:Dhimsa Dance Set Guinness World Record With 13000 Tribal Women Performance In Bhogapuram Airport Watch VideoTirumala: తిరుమల సేవలో జపాన్ ఓపెన్ చాంపియన్ పీవీ సింధు.. ఇతర ప్రముఖులు
Tirupati Urban, Andhra Pradesh:PV Sindhu In Tirumala: కోరిన కోరికలు మొక్కులు తీర్చే కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. సాధారణ భక్తులతోపాటు వీఐపీలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. శనివారం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి రితురాజ్ సిన్హా, తమిళనాడు మంత్రి వినోద్, ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, ఎమ్మెల్సీ పద్మశ్రీ తిరుమలకు విచ్చేసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం టీటీడీ అధికారులు ప్రముఖులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
స్వామి సేవలో పీవీ సింధు
తిరుమల శ్రీవారిని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దర్శించుకున్నారు. ఉదయాస్తమాన సేవలో భాగంగా శ్రీవారి ఆలయానికి చేరుకున్న పీవీ సింధు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు పీవీ సింధుకు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందించారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన పీవీ సింధిని చూసేందుకు ఆలయ పరిసరాల్లో భక్తులు ఆసక్తి చూపించారు. ప్రపంచ వేదికపై ఇటీవల చాంపియన్గా నిలిచి భారతదేశానికి పీవీ సింధు గౌరవం తీసుకువచ్చారు. బ్యాడ్మింటన్లో ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్లో పీవీ సింధు చాంపియన్గా నిలిచారు. దాదాపు మూడేళ్ల తర్వాత ఒక టైటిల్ సాధించడంతో సింధు స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చారు.
కొనసాగుతున్న భక్తుల రద్దీ
నిన్న శ్రీవారిని మొత్తం 71,393 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు 27,846 మంది భక్తులు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం హుండీ కానుకలు రూ.4.46 కోట్లు వచ్చాయని.. లడ్డూ విక్రయాలు 4.33 లక్షలు జరిగాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక అన్నప్రసాదాలు 2.58 లక్షల మంది భక్తులు స్వీకరించారని.. వైద్య సేవలు 2,946 మంది భక్తులు పొందారు. భక్తుల రద్దీ కొనసాగుతుండడంతో 31 కంపార్ట్మెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూలైన్ ఉంది. సర్వదర్శనానికి (ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా) 12 గంటలు సమయం పడుతోంది.
ప్రాజెక్టులపై అవగాహన లేని కేటీఆర్ మళ్లీ అమెరికాలో ఉద్యోగానికి వెళ్లాలి
Old Pochampad, Telangana:BRS Party vs Ministers: తెలంగాణ ప్రాజెక్టులపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అవగాహన లేదని.. ఆయన మరోసారి ఉద్యోగం చేసుకునేందుకు అమెరికా వెళ్లాలని తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. ప్రాజెక్టుల విషయమై కేటీఆర్, హరీశ్ రావు ఇద్దరూ కలసి కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వర్షాలు రావొద్దని బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటోందని తెలిపారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల ద్వారానే నీళ్లు ఇచ్చుకుంటున్నామని చెప్పారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టులకు భారీ వరద పోటెత్తుతుండడంతో వాటిని పరిశీలించేందుకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, కార్మిక శాఖ మంత్రి వివేక్ నిర్మల్ జిల్లాకు వచ్చారు. అనంతరం నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నీటి మట్టం, ఇన్ ఫ్లోలు పరిశీలించిన అనంతరం మంత్రి వివేక్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, హరీశ్ రావులపై తీవ్ర విమర్శలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో తెలంగాణ ప్రభుత్వంపై భారం పడిందని.. 60 టీఎంసీల నీరు వృథా కావడమే కాకుడా సుమారు రూ.3 వేల కోట్ల నష్టం మిగిలిందని వివేక్ వెంకటస్వామి విమర్శించారు. కేటీఆర్కు ప్రాజెక్టులపై అవగాహన లేదని.. మళ్లీ అమెరికా వెళ్లి ఉద్యోగం చేసుకోవడం మంచిదని ఎద్దేవా చేశారు. హరీశ్ రావుతో కలిసి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని.. వర్షాలు రాకూడదని బీఆర్ఎస్ నాయకులు కోరుకుంటున్నారని మండిపడ్డారు.
ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టిందని.. తామే కట్టామంటూ బీఆర్ఎస్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని తప్పుబట్టారు. వాళ్లు (బీఆర్ఎస్ పార్టీ) కట్టిన ప్రాజెక్టులు కూలిపోయాయని తెలిపారు. ఎస్సారెస్పీకి పూర్వవైభవం తీసుకువస్తామని ప్రకటించారు. త్వరలోనే ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులకు సాగునీటిపై స్పష్టమైన ప్రకటన చేస్తామని తెలిపారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు రాష్ట్రానికే గర్వకారణం అని ప్రకటించారు.
తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్..హెల్త్ కార్డ్ వివరాల అప్ డేట్ పై ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు..!!
Lakshmapur, Telangana:Telangana EHS health card: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు మరింత సులభంగా, నాణ్యంగా అందేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (NEHS) అమలు ప్రక్రియను పటిష్టం చేస్తూ ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థిక (EBS-V) శాఖ స్పెషల్ సెక్రటరీ సిక్తా పట్నాయక్ జులై 31, 2026 నాటి సర్క్యులర్ మెమో ద్వారా అన్ని విభాగాల అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేశారు.
కొత్త హెల్త్ స్కీమ్ (NEHS) ప్రాముఖ్యత:
ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, అలాగే వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు మెరుగైన కార్పొరేట్, నిబంధనల పరిధిలోని వైద్య చికిత్సలను అందించడమే ఈ ఈహెచ్ఎస్ (EHS) ముఖ్య ఉద్దేశం. నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన డిజిటల్ హెల్త్ కార్డులను జారీ చేయడానికి ఈ డేటా సేకరణ అత్యంత కీలకంగా మారింది.
IFMIS పోర్టల్లో కొత్త మార్పులు:
నూతన హెల్త్ కార్డుల మంజూరు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సాంకేతిక మార్పులు చేసింది. ఇందులో భాగంగా 'ఐఎఫ్ఎంఐఎస్' (IFMIS) పోర్టల్లోని "Employee Master" మోడ్యూల్లో డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ల (DDO) లాగిన్లకు అదనపు ఫీల్డ్స్ను జోడించింది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల సమగ్ర సమాచారాన్ని, సంబంధిత సర్వీస్ రికార్డులు, ధ్రువీకరణ పత్రాల ఆధారంగా డీడీఓలు నిశితంగా పరిశీలించి ఈ పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది.
ఆగస్టు 15 ఆఖరి తేదీ:
రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న ఏ ఒక్క ఉద్యోగి లేదా వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుడు ఈ పథకం నుంచి మినహాయించకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రక్రియకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది. డీడీఓలు తమ పరిధిలోని సమాచారాన్ని సరిచూసి ఆగస్టు 15, 2026 నాటికి అప్డేషన్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
కార్డుల జారీలో ఆలస్యం జరగకుండా ఉండాలంటే నిర్దేశిత కాలపరిమితిలోగా డేటా నవీకరణ పూర్తవ్వడం అత్యవసరమని అధికారులు స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులోగా డీడీఓలు డేటా నమోదు పూర్తి చేసిన వెంటనే అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లకు నూతన ఈహెచ్ఎస్ (EHS) హెల్త్ కార్డులను పంపిణీ చేయనున్నారు. కాబట్టి ఉద్యోగులు కూడా తమ వివరాలను తక్షణమే డీడీఓల వద్ద సరిచూసుకోవాలని సూచించింది.
Also Read: మీ సమస్యలు నాకు వదిలేయండి.. ముందు పిల్లల భవిష్యత్తుపై పోరాడండి
Also Read: ఒక్కో విద్యార్థిపై రూ. 1.08 లక్షల ఖర్చు.. అయినా ప్రైవేట్ వైపేనా
Also Read: ఆ పరిచయమే కొంపముంచిందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
EPF పెన్షనర్లకు షాక్.. నిలిచిపోయిన పింఛన్లు.. అసలు కారణం ఇదే..!!
Lakshmapur, Telangana:EPF Pension: ప్రతి నెలా క్రమం తప్పకుండా తమ ఖాతాల్లో జమ కావాల్సిన ఈపీఎఫ్ఓ పింఛను నిధులు, ఆగస్టు 1వ తేదీ నాటికి కూడా జూలై నెలకు అందకపోవడంతో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. ఈపీఎఫ్ఓ సిస్టమ్స్లో చేసిన కొత్త సాఫ్ట్వేర్ మార్పులు, కేంద్రీకృత డేటాబేస్ అప్గ్రేడ్ ప్రక్రియే ఈ ఆలస్యానికి కారణమని అధికారులు పేర్కొన్నారు. సాధారణంగా, ఈపీఎఫ్ఓ పింఛను నిధులు ప్రతి నెలా 27వ తేదీలోగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. అయితే, ఈసారి సాంకేతిక మార్పుల వల్ల చెల్లింపులు ఆలస్యమయ్యాయి. ఫలితంగా, తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది పింఛనుదారులు తమ రోజువారీ అవసరాలు, వైద్య ఖర్చులు తీర్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణ: సుమారు 4.63 లక్షల మంది పింఛనుదారులు
ఆంధ్రప్రదేశ్: సుమారు 3.29 లక్షల మంది పింఛనుదారులు
ఆలస్యానికి ప్రధాన కారణం ఏమిటి?
ఈపీఎఫ్ఓ ఇటీవల తన పాత సాంకేతిక వ్యవస్థ స్థానంలో కేంద్రీకృత డేటాబేస్ను ఏర్పాటు చేసింది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా పింఛన్ల ప్రాసెసింగ్, ఆమోదం జరుగుతోంది. కొత్త సిస్టమ్లోకి డేటాను మార్చేటప్పుడు ఈ సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఈపీఎఫ్ఓ పెన్షన్: పెన్షన్ నిధులు ఎప్పుడు జమ అవుతాయి?
పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ వర్గాలు కొంత ఉపశమనం కల్పించాయి:
స్లాట్ పూర్తి: రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చెల్లింపుల ప్రాసెసింగ్ స్లాట్ శుక్రవారానికే పూర్తయినట్లు సమాచారం. దీంతో నిధుల విడుదల ప్రక్రియ వేగవంతమైంది.
జమ చేసే తేదీ: సాంకేతిక సమస్యలు పరిష్కారమైనందున, శనివారం లేదా సోమవారం నాటికి పెన్షనర్ల ఖాతాల్లో నిధులు పూర్తిగా జమ అవుతాయని స్పష్టం చేశారు.
ఒక నెలకు పరిమితం: ఈ జాప్యం జూలై నెలకు మాత్రమే పరిమితం. రాబోయే నెలల్లో (ఆగస్టు నుండి) పెన్షన్లు యధావిధిగా పాత సమయానికి (నెల చివరి నాటికి) జమ అవుతాయి.
Also Read: మీ సమస్యలు నాకు వదిలేయండి.. ముందు పిల్లల భవిష్యత్తుపై పోరాడండి
Also Read: ఒక్కో విద్యార్థిపై రూ. 1.08 లక్షల ఖర్చు.. అయినా ప్రైవేట్ వైపేనా
Also Read: ఆ పరిచయమే కొంపముంచిందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Korean Kanakaraju Trailer:'కొరియన్ కనకరాజు' ట్రైలర్ వచ్చేసింది! వరుణ్ తేజ్ డ్యుయెల్ రోల్..సత్య వేరే లెవల్ కామెడీ!
Hyderabad, Telangana:Korean Kanakaraju Trailer Out: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన హారర్ కామెడీ చిత్రం 'కొరియన్ కనకరాజు'. ఆగస్టు 7న ఈ సినిమా విుడదల కానుంది. ఇటీవలే యమా జోష్లో ప్రమోషన్స్ ప్రారంభించిన చిత్రబృందం తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ను మెగా పవర్స్టార్ రామ్చరణ్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమాలో కామెడీతో పాటు యాక్షన్, అతీంద్రియ శక్తుల అంశాలను మిళితం చేసి ఫుల్ ఎంటర్టైనింగ్గా రూపొందిచినట్లు తెలుస్తోంది.
ట్రైలర్లోని అతిపెద్ద హైలైట్లలో ఒకటి వరుణ్ తేజ్ ద్విపాత్రాభినయం. హీరో వరుణ్ తేజ్ పోషించిన పాత్ర కనకరాజు అనంతపురానికి చెందిన యువకుడిగా, కొరియన్ మాఫియా డాన్గా రెండు పూర్తిగా విభిన్నమైన పాత్రలను పోషించాడు. ప్రతి పాత్రకు తగినట్లుగా అతను తన రూపాన్ని, హావభావాలను, బాడీ లాంగ్వేజ్ను మార్చుకోవడం ట్రైలర్లో చూడవచ్చు. ఇది ఆ రెండు పాత్రలను విభిన్నంగా కనిపించేలా, అనిపించేలా చేస్తుంది. పాత్రల వ్యక్తిత్వాల మధ్య వైరుధ్యం సినిమాలోని కామెడీకి, అలాగే యాక్షన్ సన్నివేశాలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది.
#KoreanKanakaraju trailer is an absolute laugh riot from start to finish!@IAmVarunTej is fantastic and slips into the role with such ease 🤗🤗🤗@GandhiMerlapaka seems to have packed this one with loads of entertainment. Satya is in top form, @RitikaNayak_ looks lovely!… pic.twitter.com/363PAAgowg
— Ram Charan (@AlwaysRamCharan) August 1, 2026
ఈ కథ హారర్, కామెడీలను కలగలిపి యాక్షన్ సన్నివేశాలను కూడా జోడించినట్లుగా కనిపిస్తుంది. విభిన్న సంస్కృతుల నేపథ్యం రెండు వేర్వేరు ప్రపంచాలను ఒకచోట చేర్చి, ఉత్కంఠ, హాస్యం రెండింటికీ దారితీసే పరిస్థితులను సృష్టిస్తుంది.
ఈ చిత్రంలో హాస్యనటుడు సత్య ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. ట్రైలర్ అంతటా అనేక ఫన్నీ వన్ లైనర్ డైలాగులతో అలరించారు. అతని కామెడీ టైమింగ్ కథకు తేలికపాటి ఊపును అందిస్తుంది. అలాగే ఉత్కంఠభరితమైన సన్నివేశాల్లో ఉపశమనాన్ని కలిగించేలా చేస్తుంది.
వరుణ్ తేజ్తో అతని సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా నిలుస్తాయని భావిస్తున్నారు. ఈ ట్రైలర్లో హీరోయిన్ రితికా నాయక్ అంతగా కనిపించలేదు. కానీ, ట్రైలర్ ఆద్యంతం హీరో వరుణ్ తేజ్, హాస్యనటుడు సత్య తమ ఇన్సెన్టివ్ డైలాగులతో అలరించారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించగా.. ఇప్పటికే విడుదలైన రెండు పాటల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Also Read: అందంలో హీరోయిన్లను మించిపోయిన నటి రోజా కూతురు..అన్షు లేటెస్ట్ ఫొటోలు!
Also Read: రెండో పెళ్లికి సిద్ధమైన నటి సురేఖా వాణి! కూతురు సుప్రీత పెళ్లి కూడా అప్పుడేనట!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
హైదరాబాద్ ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే టికెట్..!!
Lakshmapur, Telangana:Hyderabad Metro: హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్. ప్రజా రవాణాను మరింత సులభం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. మెట్రో రైలు, టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఒకే టికెట్ తో ప్రయాణించే వెసులుబాటును త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ అధ్యక్షతన జరిగిన హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించారు.
ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో, ఆర్టీసీ సేవలను అనుసంధానిస్తూ.. కామన్ మొబిలిటీ టికెటింగ్ విధానాన్ని రూపొందించాలని సీఎస్ సంజయ్ జాజూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికోసం టీజీఎస్ ఆర్టీసీ అధికారులతో సంప్రదింపు జరపాలని.. ప్రయాణికులందరికీ ఉపయోగపడే విధంగా ఒక ఉమ్మడి మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయాలని సూచించారు. అంతేకాదు మెట్రో ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా రోజువారీ, వారపు, నెలలవారీ ట్రావెల్ పాసులను ప్రవేశపెట్టే అవకాశాలను కూడా పరిశీలించాలని కోరారు. మెట్రో నెట్ వర్క్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల అవసరాలను ద్రుష్టిలో ఉంచుకుని అదనపు మెట్రో కోచ్ లు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మెట్రో రెండో దశకు సంబంధించి భూసేకరణ, ఇతర పనుల పురోగతిని కూడా సమీక్షించారు. మెట్రో మొదటి దశ స్వాధీనం, రెండవ దశ అనుమతుల తాజా ప్రగతిని సీఎస్ సమావేశంలో క్షుణ్ణంగా చర్చించారు. అదనపు బోగీలను కూడా వీలైనంత త్వరగా సమీకరించేందుకు తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో రోడ్లు,రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ వికాస్ రాజ్, డీజీపీ శాంతి భద్రతలు మహేష్ భగవత్, బోర్డు అఫ్ డైరెక్టర్లు మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్, హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ వర్క్స్, సీవరేజ్ బోర్డు ఎండీ కె.అశోక్ రెడ్డి, హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి.అజిత్ రెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివేంద్ర ప్రతాప్ పాల్గొన్నారు.
Also Read: మీ సమస్యలు నాకు వదిలేయండి.. ముందు పిల్లల భవిష్యత్తుపై పోరాడండి
Also Read: ఒక్కో విద్యార్థిపై రూ. 1.08 లక్షల ఖర్చు.. అయినా ప్రైవేట్ వైపేనా
Also Read: ఆ పరిచయమే కొంపముంచిందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Chittoor: రాంగ్ కాల్తో పరిచయం.!. ప్రియుడితో మహిళ వివాహం.. ఏపీ ఘటనలో సినిమాలకు మించిన ట్విస్ట్లు.!
Hyderabad, Telangana:Wife leaves husband and children in chittoor: ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరులో ఇటీవల ఒక వివాహిత భర్త,ఇద్దరు పిల్లల్నివదిలేసి ఇన్ స్టా లవర్ కోసం ఇల్లు వదిలి వెళ్లిపోయింది. మరోవైపు భర్త తన భార్య కన్పించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం గుడికొత్తూరు గ్రామంలో చోటు చేసుకున్న ఘటన స్థానికంగా రచ్చగా మారింది. స్థానికంగా ఉండే చిరంజీవికి, శోభ(27) అనే మహిళతో 8 ఏళ్ల క్రితం వివాహం కాగా.. వీరికి ఇద్దరు పిల్లలు. ఇటీవల రాంగ్ కాల్ తో శోభకు గుంటూరు జిల్లా కండ్రిగకు చెందిన బాలాజీ నాయక్ తో పరిచయం ఏర్పడింది.
ప్రియుడిపై మోజుతో భర్త, పిల్లలను వదిలేసి వేరే కాపురం పెట్టిన వివాహిత
మొదట భర్తను చంపాలనుకొని స్కెచ్ వేసి.. తర్వాత మనసు మార్చుకొని పారిపోయి ప్రియుడిని పెళ్లి చేసుకున్న వివాహిత
చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం గుడికొత్తూరు గ్రామానికి చెందిన చిరంజీవికి శోభ(27) అనే మహిళతో 8 ఏళ్ల… pic.twitter.com/C0QF4uspGx
— Telugu Scribe (@TeluguScribe) August 1, 2026
అది కాస్త ప్రేమగా మారింది. వీరి యవ్వారం కాస్త భర్తకు తెలియడంతో భర్తను లేపేద్దామని భావించారు. కానీ ఆ తర్వాత మనసు మార్చుకున్న వివాహిత భర్త, పిల్లల్ని వదిలేసి పారిపోయింది. కుప్పంలో ఓ గుడిలో పెళ్లి చేసుకున్న శోభ, బాలాజీ నాయక్ పెళ్లి చేసుకున్నారు.ఆ తర్వాత శోభ మరో యువకుడితో కలిసి బెగ్గిలిపల్లిలో ఉంటున్నట్టు గుర్తించారు.
దీనిపై పోలీసులు రంగంలోకి దిగారు. వివాహిత ప్రియుడు మాత్రం తనను పెళ్లిచేసుకొకుంటే చచ్చిపోతానని శోభ బలవంతం పెట్టిందని చెప్పాడు. ఆమె బలవంతం వల్ల పెళ్లి చేసుకున్నానని చెప్పాడు.
ఆమె భర్త రోజు కొట్టడం , వేధించడంవల్ల ఈ విధంగా నిర్ణయం తీసుకుందని చెప్పాడు. దీంతో డైవర్స్ తీసుకొకుండా పెళ్లి చేసుకొవడం ఏంటని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఈ రచ్చ కాస్త స్థానికంగా రెండు కుటుంబాల మధ్య తీవ్ర దుమారంగా మారింది. ప్రస్తుతం పోలీసులు వారిని కౌన్సెలింగ్ కు తరలించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
PM Modi Tour: భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంపై చంద్రబాబు సమీక్ష
Visakhapatnam, Andhra Pradesh:Chandrababu Review On Bhogapuram Airport Launching Programme With PM Modiకళ్లు చెదిరే 3D కర్వ్డ్ డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11 త్వరలోనే లాంచ్!
Hyderabad, Telangana:Iqoo Z11 5g Price: ప్రస్తుతం డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్ ఒక భాగమైపోయింది. సరికొత్త టెక్నాలజీ కోసం ఎదురుచూసే మన భారతీయులకు వీవో (Vivo) సబ్బ్రాండ్ అయిన ఐకూ (iQOO) ఊహించని శుభవార్తను త్వరలో అందించబోతోంది.. ఎప్పటికప్పుడు సరికొత్త వినూత్న మోడళ్లతో మార్కెట్ను షేక్ చేసే ఐకూ కంపెనీ.. త్వరలోనే భారత మార్కెట్లోకి iQOO Z11 మోడల్ను విడుదల చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X లో iQOO ఇటీవల విడుదల చేసిన ఒక బైనరీ కోడ్ పోస్ట్ ఇప్పుడు టెక్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ కోడ్ను విశ్లేషించగా.. భారత్కు రాబోతున్నది మరేదో కాదని.. శక్తివంతమైన iQOO Z11 అని స్పష్టమవ్వడంతో ఇప్పుడు అందరూ దీని కోసమే ఎదురు చూస్తున్నారు.
3D కర్వ్డ్ డిస్ప్లే..
ఈ స్మార్ట్ఫోన్ ఇప్పటికే చైనాలో లాంచై.. విశేష ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. అయితే, మన భారతీయ వినియోగదారుల అలవాట్లు, ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని కొన్ని అద్భుతమైన మార్పులతో దీనిని రూపొందించినట్లు వార్తలు వస్తున్నాయి. చైనా వేరియంట్తో పోలిస్తే.. భారతీయ వెర్షన్లో అద్భుతమైన 3D కర్వ్డ్ డిస్ప్లే (3D Curved Display)ను అందించబోతున్నట్లు తెలుస్తోంది.. చేతిలో పట్టుకోగానే ఇచ్చే రాయల్ లుక్.. కంటెంట్ చూస్తున్నప్పుడు కలిగే విజువల్ అనుభూతి ప్రాణాన్ని లేపి నిలబెట్టేలా ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్..
ఇటీవలే లీక్ అయిన కొన్ని వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్ఫోన్ భారతదేశంలోనే తొలిసారిగా MediaTek Dimensity 7500 Turbo ఆక్టాకోర్ చిప్సెట్తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. గేమింగ్ ఆడేటప్పుడు కానీ.. మల్టీటాస్కింగ్ చేసేటప్పుడు కానీ ఎక్కడా హ్యాంగ్ అవ్వకుండా.. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ను ఇది అందిస్తుంది.
కళ్లు చెదిరే కెమెరా..
చైనా వేరియంట్ ఫీచర్ల వివరాల్లోకి వెళితే... ఇది 6.83 అంగుళాల AMOLED డిస్ల్పేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 165Hz రిఫ్రెష్ రేట్తో పాటు 16GB వరకు ర్యామ్, 512GB స్టోరేజ్ ఉన్నాయి. ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసం.. ఇందులో కంపెనీ 50MP OIS ప్రధాన కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా భారీ బ్యాటరీతో పాటు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
వచ్చే ఆగస్టు నెలలోనే ఈ అద్భుతమైన మొబైల్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని.. టెక్ నిపుణులు భావిస్తున్నారు. సరసమైన ధరలో ప్రీమియం అనుభూతిని పొందాలని అనుకునే ప్రతి ఒక్కరికీ.. iQOO Z11 స్మార్ట్ఫోన్ ఒక అద్భుతమైన కానుక కాబోతోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ప్రాణ భయంతో విలవిలలాడిన ఈతగాడు.. ఆక్టోపస్ ఏం చేసిందో చూడండి.. వీడియో!
Hyderabad, Telangana:Octopus Attacks Video Watch Here: సముద్రం.. అనంతమైన అందాలకు నిలయం మాత్రమే కాదు.. అంచనా వేయలేని ఎన్నో ప్రమాదకరమైన జీవులకు నిలయం కూడా.. నీలిరంగు అలల వెనుక దాగి ఉన్న అజ్ఞాత ప్రపంచంలో ఏ క్షణాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఊహించడం చాలా కష్టం.. సరిగ్గా అలాంటి ఒక వెన్నులో వణుకు పుట్టించే భయంకరమైన ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సముద్రంలో హాయిగా ఈత కొడుతూ ఆస్వాదిస్తున్న ఒక వ్యక్తికి ఊహించని విధంగా ఒక జీవి కాలయముడిలాగా మారింది. నీటిలో ఈత కొడుతున్న ఆ వ్యక్తిపై ఒక ఆక్టోపస్ (Giant Octopus) ఒక్కసారిగా విరుచుకుపడింది. ఏమాత్రం సమయం ఇవ్వకుండా.. ఆ జీవి తన అత్యంత బలమైన చేతులతో (Tentacles) అతడి వీపు భాగాన్ని గట్టిగా చుట్టేసింది. సాధారణంగా ఇవి నీటిలో చాలా బలాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని విడిపించుకోవడం చాలా కష్టం..
ఆ ఆక్టోపస్ పట్టు ఎంత దారుణంగా ఉందంటే.. దాని ఒత్తిడికి ఆ వ్యక్తి ఊపిరి ఆడటమే కష్టంగా మారింది. ప్రాణాలు పోతాయేమోనన్న భయంతో ఆ వ్యక్తి విలవిలలాడిపోయాడు. మృత్యువు తన రాక్షస పంజాతో బిగించి.. పట్టుకున్న సమయంలో ఆ వ్యక్తి ప్రాణ భయంతో ధైర్యంగా ఉండి.. దానిని విడిపించుకోవడానికి ప్రయత్నించడం మీరు చూడొచ్చు. తన శక్తినంతా వినియోగించి.. ఆక్టోపస్ పట్టు నుంచి విడిపించుకోవడానికి ఒడ్డు బయట ఎంతగానో ప్రయత్నించడం మీరు కూడా క్లియర్గా చూడొచ్చు.
Moment an octopus got clipped to a man’s back while swimming https://t.co/KuxlwqsmoO
— Instablog9ja (@instablog9ja) July 31, 2026
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
చివరకు అద్భుత రీతిలో ఆ రాక్షస జీవి పట్టు నుంచి బయటపడి.. ప్రాణాలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.. అయితే, నీటి పైకి వచ్చాక అతడి వీపుపై పడిన భయంకరమైన ఎర్రటి గుండ్రటి గాయాలు చూసి అక్కడున్న వారందరూ షాక్ అయిన్నట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలన్నీ కెమెరాలో రికార్డు రికార్డ్ చేసి.. సోషల్ మీడియాల్లో అప్లోడ్ చేయగానే.. క్షణాల్లో వైరల్గా మారాయి. మిలియన్ల మంది నెటిజన్లు ఈ వీడియోను చూసి ఆశ్చర్యపోయారు. సముద్రం ఎంత అందమైనదో.. అంతకంటే వెయ్యి రెట్లు ప్రమాదకరమైనది అనడానికి ఈ వీడియో ఒక నిదర్శనం.. అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Pawan Kalyan Speech Bhogapuram: ప్రధాని మోదీపై బూతులు.. విమానాశ్రయం ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ ఎమోషనల్!
Gudepuvalasa, Andhra Pradesh:Pawan Kalyan Speech At Bhogapuram Airport Inauguration: అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేదికపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని, దేశం కోసం ఆయన పడుతున్న శ్రమను కొనియాడుతూ పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
ఒకప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టే దుస్థితిలో ఉన్న దేశాన్ని, ప్రధాని మోదీ తనదైన పాలనతో ప్రపంచంలోనే గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టారని పవన్ ప్రశంసించారు. 144 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా మోదీ అంకితభావంతో పనిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు.
భోగాపురం ఎయిర్పోర్ట్కు వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ఉత్తరాంధ్ర ప్రజలకు ఎంతో గర్వకారణమని, ఆయన ఆశయాలను ఇది భావితరాలకు చాటుతుందని అన్నారు. ఉత్తరాంధ్రకే చెందిన జీఎమ్మార్ సంస్థ ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయడం సంతోషకరమని పేర్కొన్నారు.
భావోద్వేగ వ్యాఖ్యలు..
దేశం కోసం నిరంతరం కష్టపడుతున్న ప్రధానిని జంతర్మంతర్ వద్ద కొందరు విమర్శించడం చూసి తనకు కన్నీళ్లొచ్చాయని పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. "పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు" తగులుతాయని, దేశ రక్షణ కోసం శ్రమిస్తున్న మోదీకి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రధానిని ఎదుర్కొనే నాయకుడు లేడని, ఆయన విశాల హృదయానికి అందరూ నమస్కరించాల్సిందేనని అన్నారు.
భోగాపురం విమానాశ్రయం రాష్ట్రాభివృద్ధికి, మౌలిక వసతుల విస్తరణకు బలమైన పునాదిగా మారుతుందని, దీనిద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని పవన్ ధీమా వ్యక్తం చేశారు.
Also Read: టీడీపీ Vs వైసీపీ..భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం వేళ క్రెడిట్ రాజకీయాలు..ఎవరు చేశారు
Also Read: భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా సర్వీసులు ప్రారంభం..పూర్తి షెడ్యూల్ ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ఆర్థిక వ్యవస్థ దూకుడు.. ఏకంగా 14 నెలల రికార్డును తిరగరాసిన GST వసూళ్లు..!!
Lakshmapur, Telangana:GST Collection July 2026: దేశ ఆర్థిక రంగంలో కొన్ని చాలా సానుకూల వార్తలు ఉన్నాయి. జూలై 2026లో భారతదేశ స్థూల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 15.4 శాతం పెరిగి, రూ. 2.11 లక్షల కోట్ల చారిత్రాత్మక సంఖ్యను బ్రేక్ చేశాయి. శనివారం ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం.. దేశీయ లావాదేవీలలో గణనీయమైన పెరుగుదల.. దిగుమతులపై అధిక పన్ను వసూళ్ల కారణంగా జీఎస్టీ రాబడిలో ఈ గణనీయమైన పెరుగుదల నమోదైంది.
2026-27 ఆర్థిక సంవత్సరంలో నెలవారీ జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది రెండోసారి. పెరిగిన దేశీయ వినియోగం, వ్యాపార కార్యకలాపాలు పుంజుకోవడమే ఈ వృద్ధికి ప్రధాన కారణాలని ప్రభుత్వం పేర్కొంది. గత ఏడాది జూలైలో రూ.1.83 లక్షల కోట్లుగా ఉన్న స్థూల జీఎస్టీ వసూళ్లు, ఈ ఏడాది రూ.2.11 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
దేశీయ జీఎస్టీ రాబడులు కూడా 10.1 శాతం పెరిగాయి. గత ఏడాది జూలైలో రూ.1.31 లక్షల కోట్లుగా ఉన్న ఈ వసూళ్లు, ఈ ఏడాది రూ.1.45 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దిగుమతులపై జీఎస్టీ వసూళ్లు మరింత వేగంగా పెరిగాయి. 28.8 శాతం వృద్ధితో ఇది రూ.1.45 లక్షల కోట్లకు (₹66,511 కోట్లు) చేరుకుంది. అదనంగా, మొత్తం స్థూల జీఎస్టీ వసూళ్లలో దిగుమతుల వాటా గణనీయంగా పెరిగింది.
జూలైలో జీఎస్టీ రీఫండ్లు కూడా 13.1 శాతం పెరిగి రూ.29,968 కోట్లకు చేరాయి. రీఫండ్లను తీసివేసిన తర్వాత, నికర జీఎస్టీ వసూళ్లు రూ.1.81 లక్షల కోట్లుగా (రూ.1.81 లక్షల కోట్లు) ఉన్నాయి, ఇది గత ఏడాదితో పోలిస్తే 15.8 శాతం పెరుగుదల. దేశీయ నికర వసూళ్లు 10.5 శాతం పెరిగి రూ.1.27 లక్షల కోట్లకు చేరగా, కస్టమ్స్ జీఎస్టీ నుంచి నికర వసూళ్లు 30.3 శాతం పెరిగి రూ.54,223 కోట్లకు (రూ.54,223 కోట్లు) చేరాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.8.43 లక్షల కోట్లకు (రూ.8.43 లక్షల కోట్లు) చేరుకున్నాయి. గత సంవత్సరం ఇదే సమయానికి, ఇది రూ.7.66 లక్షల కోట్లుగా (రూ.7.66 లక్షల కోట్లు) ఉంది. ఇది 10.1 శాతం వృద్ధి. ఎస్బిఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం, జిఎస్టితో పాటు ప్రాథమిక ఎక్సైజ్ సుంకంలో రాష్ట్రాల వాటాను పరిగణనలోకి తీసుకుంటే, గత సంవత్సరంతో పోలిస్తే 2026-27లో రాష్ట్రాలు అదనంగా రూ. 1.43 లక్షల కోట్లు ఆర్జించే అవకాశం ఉంది.
Also Read: మీ సమస్యలు నాకు వదిలేయండి.. ముందు పిల్లల భవిష్యత్తుపై పోరాడండి
Also Read: ఒక్కో విద్యార్థిపై రూ. 1.08 లక్షల ఖర్చు.. అయినా ప్రైవేట్ వైపేనా
Also Read: ఆ పరిచయమే కొంపముంచిందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
రోడ్డుపై మోకాళ్ల లోతు నీళ్లు.. థర్మాకోల్ షీట్పై హాయిగా శికారు.. వీడియో ఇదే..
Hyderabad, Telangana:Man Rides Thermocol Sheet Video Watch: దేశవ్యాప్తంగా వర్షాకాలం జోరుగా కొనసాగుతోంది.. గత కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా అనేక నగరాలతో పాటు పట్టణాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులతో పాటు వీధులు వర్షపు నీటితో నిండిపోయి చెరువులను తలపిస్తున్నాయి. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో పాటు ఇళ్లలోకి నీరు చేరడం వంటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కొందరు తమ వెరైటీ స్కిల్స్, అద్భుతమైన ఆలోచనలు అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే..
తీవ్ర వర్షపాతం కారణంగా ఒక వీధిలో మోకాలు లోతు కంటే ఎక్కువగానే నీరు నిలిచిపోయింది.. వాహనాల రాకపోకలు నిలిచిపోయి.. జనాలు ఇళ్లకే పరిమితమైన ఆ సమయంలో ఒక వ్యక్తి చేసిన విన్యాసం అందరి దృష్టినీ ఆకర్షించింది. రోడ్డుపై నిలిచిన నీటిని చూసి విసుక్కోకుండా.. అతడు ఒక వినూత్న ఆలోచన చేశాడు. ఇంట్లో ఉన్న థర్మాకోల్ షీట్ను బయటకు తీసి.. దాన్నే ఒక బోట్ మార్చుకున్నాడు.
ఆ ఫోమ్ షీట్పై హాయిగా కూర్చొని.. వర్షపు నీటిలో తేలుతూ.. తన చేతులతో నీటిని వెనక్కి నెట్టుకుంటూ హాయిగా పడవ ప్రయాణం చేశాడు. ఆ వీధిల్లో అతను అలా నవ్వుతూ తేలిపోతుంటే.. చుట్టుపక్కల ఉన్నవారు తమ ఫోన్లలో ఆ ఘటన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
నెట్టింట కామెంట్ల వర్షం..
ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది. లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించడమే కాకుండా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. భారతీయుల టెక్నిక్కు ప్రపంచంలో ఎవరూ సాటి రారు.. అని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతుండగా.. మున్సిపల్ అధికారులు వాటర్ పార్క్ సౌకర్యం ఉచితంగా కల్పించారని, బోటింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉందని.. మరికొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
మనుషులకే కాదు.. గేదెలకీ మేకప్.. హర్యానాలో బఫెలో బ్యూటీ పార్లర్.. వీడియో!
Hyderabad, Telangana:Buffalo Beauty Parlour Video Watch: మనుషుల అందచందాల కోసం వాడకొక బ్యూటీ పార్లర్, హెయిర్ సెలూన్ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. కానీ, మనకు పాలనిస్తూ.. నిత్యం సేవలందించే మూగజీవాలైన గేదెలకు, ఎద్దులకు కూడా ఒక బ్యూటీ పార్లర్ ఉందంటే నమ్మగలరా? వినడానికి కాస్త వింతగా, ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది అక్షరాలా నిజం.. హర్యానాలోని కైథల్ జిల్లాకు చెందిన సందీప్ జాఖోలీ అనే పశుప్రేమికుడు ప్రారంభించిన ఈ వినూత్న గేదెల బ్యూటీ పార్లర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగానూ చర్చనీయాశమైంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా నగరాల్లో పెంచుకునే కుక్కలు, పిల్లల ఆరోగ్యం, అందం కోసం పెంపుడు జంతువుల యజమానులు ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు జీవనాధారమైన పాడి పశువుల శారీరక శుభ్రతను అంతగా పట్టించుకోరు.. ఈ ఆలోచనే సందీప్ మనసును కదిలించింది.. పశువులకు కూడా ఆహ్లాదకరమైన వాతావరణం, శుభ్రత, అందం అవసరమని నమ్మిన సందీప్.. పశువుల కోసం ప్రత్యేకంగా ఈ గ్రూమింగ్ సెంటర్ను ప్రారంభించారు. ప్రస్తుతం చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు తమ పశువులను ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి తీసుకొచ్చి వాటిని ముస్తాబు చేయిస్తున్నారు.
కొమ్ముల పాలిష్ నుంచి హెయిర్ కటింగ్ వరకు..
ఈ పార్లర్లో లభించే ఫీచర్స్ చూస్తే.. ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.. పశువుల కొమ్ములను ప్రత్యేక పరికరాలతో శుభ్రం చేసి, బాగా మెరిసేలా పాలిష్ చేస్తారు. అవసరాన్ని బట్టి కొమ్ములకు ఆకర్షణీయమైన ఆకారాన్ని ఇస్తూ ఉంటారు.. అలాగే పశువులకు శారీరక వేడి తగ్గేలా.. క్రిమి కీటకాలు చేరకుండా ఉండేందుకు వీలుగా అందమైన హెయిర్ కటింగ్ చేస్తారు. ముఖ్యంగా పశువుల అందాల పోటీలకు తీసుకెళ్లేముందు రైతులు తమ జీవాలకు ఇక్కడ ప్రత్యేకమైన మేకోవర్ చేయిస్తున్నారని షాప్ యాజమాని తెలుపుతున్నారు.
నకిలీ కొమ్ములు కూడా..
ఈ పార్లర్ కేవలం పై అందానికే పరిమితం కాకుండా.. పశువుల ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యతనిస్తుంది. సిబ్బంది పశువుల కాళ్లను శుభ్రం చేసి ట్రిమ్ చేస్తారు. దీనివల్ల పశువులు నడవడానికి ఇబ్బంది పడకుండా ఉండటమే కాక ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటాయి. ప్రమాదవశాత్తు ఏదైనా పశువు కొమ్ము విరిగిపోతే.. ఆ స్థానంలో నిజమైన కొమ్ములా కనిపించే ఆర్టిఫిషియల్ హార్న్ కూడా పెడుతున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
సందీప్ చేస్తున్న ఈ వినూత్న ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.. ఇన్స్టాగ్రామ్లో @official_sandeep_jaakholi అనే ఖాతా నుంచి ఆయన షేర్ చేసే గేదెల మేకోవర్, సింగ్ పాలిషింగ్ వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. మూగజీవుల పట్ల సందీప్ చూపుతున్న అద్భుతమైన ప్రేమ, ఆయన ఆలోచనా విధానంపై సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
