Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Khammam507002

రైతులతో మంత్రి పొంగులేటి సమావేశమయ్యారు

Jul 29, 2024 05:00:56
Dhamsalapuram, Telangana

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. డివిజన్‌లో వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 37 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మార్గమధ్యంలో మంత్రి రైతు కూలీలను కలుసుకుని వారి కష్టాలు. ఎలాంటి ధాన్యం వేస్తున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ప్రజాపరిపాలనపై ఆరా తీశారు.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Feb 02, 2026 16:48:29
Mangalagiri, Andhra Pradesh:

Arava Sridhar Affairs Issue: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ రాసలీలల వ్యవహారం తీవ్ర సంచలనం రేపింది. ఈ వ్యవహారంపై రాజకీయంగా తీవ్ర వివాదం రాజుకోగా.. జనసేన పార్టీపై విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు జనసేన పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తొలిసారి స్పందించారు. గతంలో మీడియా ముందు ఈ వ్యవహారం రాగా.. సమాధానం చెప్పలేక పారిపోయిన పవన్‌ కల్యాణ్‌ తాజాగా పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే రాసలీలల వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. ఈ పరిణామం జనసేన పార్టీలో కలకలం రేపింది.

Also Read: Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో 10 భారీ ప్రకటనలు.. ప్రజల డబ్బులు భారీ సేఫ్‌

జనసేన పార్టీ నాయకులపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో నిర్వహించిన జనసేన కార్యవర్గ సమావేశంలో పవన్‌ మాట్లాడుతూ రాష్ట్ర పరిణామాలపై స్పందించారు. ఈ సందర్భంగా తిరమల కల్తీ లడ్డూ వ్యవహారంపై ఎందుకు మాట్లాడటం లేదని జనసేన పార్టీ నాయకులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు గగ్గోలు పెడితే పార్టీ నుంచి స్పందన లేదని మండిపడ్డారు. 'అందరి చిట్టా నా దగ్గర ఉంది. ఏం చేస్తారు.. రిపోర్ట్ ఇవ్వాలి' అని నాదెండ్ల మనోహర్‌కి చెప్పి పవన్ కల్యాణ్  వెళ్లిపోయారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులకు ఫుల్ క్లాస్ పీకారు.

Also Read: Revanth Reddy: తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఎలా అవుతాడు?: రేవంత్ రెడ్డి

'లడ్డూ వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదు? అన్నింటికీ నేనే మాట్లాడితే ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నది ఎందుకు?' అని సమావేశంలో నాయకులపై పవన్‌ కల్యాణ్‌ చిందులు తొక్కారు. వైఎస్సార్‌సీపీ నాయకుల ట్రాప్‌లో చిక్కుకోవద్దని సూచించారు. 'మీపై, మీ కుటుంబసభ్యులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. జాగ్రత్త!' అని హెచ్చరించారు.  జనసేన నాయకులు మాత్రం సిద్ధాంతపరంగా.. సబ్జెక్ట్‌ పరంగానే మాట్లాడాలని చెప్పారు. మహిళల విషయంలో పార్టీ శ్రేణులు మరింత జాగ్రత్తగా ఉండాలని.. అరవ శ్రీధర్‌ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ సూచించారు. మహిళలకు మీ చేయి తగిలినా రేప్‌ చేశారని వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రచారం చేస్తారని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. 'వ్యక్తిగత వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. మీ వల్ల పార్టీకి నష్టం కలుగుతోంది' అని అసహనం వ్యక్తం చేశారు.

Also Read: Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో 10 భారీ ప్రకటనలు.. ప్రజల డబ్బులు భారీ సేఫ్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
Feb 02, 2026 16:18:36
Gollet, Telangana:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగపూర్ లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతర సోమవారం సాయంత్రం తో ముగిసింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి రెండు వరకు సాగిన ఈ జాతరలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. జాతర ప్రారంభమైన మొదటి రోజు స్వామివారి కళ్యాణం, రెండవ రోజు పల్లకి సేవ, రథోత్సవం కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరిగాయి. అయితే ట్రాఫిక్ నియంత్రణలో అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేసినా ఊహించని విధంగా అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆదివారం సుమారు 10 గంటల పాటు ట్రాఫిక్ సమస్యలు భక్తులను వెంటాడాయి. ఇటీవల జరిగిన సమ్మక్క సారక్క జాతర లను దృష్టిలో పెట్టుకొని అంతగా భక్తులు రారనే ఉద్దేశంతో అధికార యంత్రాంగం అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేయగా ఎవరు ఊహించని విధంగా లక్షలాది మంది భక్తులు పోటెత్తడంతో ట్రాఫిక్ నియంత్రించడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు వన్ వే పద్ధతి ప్రవేశపెట్టినా అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఎక్కడ స్థలం సరిపోక రోడ్డు పక్కన ఉన్న పంట పొలాల్లోకి భక్తులు వెళ్లడంతో పంట పొలాలు సైతం దెబ్బతిన్న పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి పై నమ్మకంతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొనడం అటు అధికార వర్గంలో ఇటు పాలకవర్గంలోనూ సంతోషాన్ని కలిగించింది.
0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 02, 2026 14:04:05
Kothagudem, Telangana:

Tablet Sheet Wedding Card: సాధారణంగా పెళ్లి పత్రికలు అంటే దేవుళ్ల బొమ్మలు, రంగురంగుల డిజైన్లు, పట్టు వస్త్రాల అలంకరణలతోపాటు వధూవరుల ఫొటోలతో కనిపిస్తుంటాయి. శుభలేఖ విషయంలో వినూత్నంగా ఆలోచనలు చేస్తున్న యువత ఈ క్రమంలో సరికొత్తగా.. ఆసక్తికరంగా ఓ జంట రూపొందించింది. తమ వృత్తికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించేలా పెళ్లి పత్రిను రూపొందించారు. తమ వైద్య వృత్తిలో కనిపించే ట్యాబ్లెట్ల షీట్‌ రూపంలో తమ పెళ్లి పత్రికను ప్రత్యేకంగా తయారు చేయించారు. ఆ పత్రికకు సంబంధించిన వీడియో వైరల్‌గా ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో 10 భారీ ప్రకటనలు.. ప్రజల డబ్బులు భారీ సేఫ్‌

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన యువకుడు కిన్నెర నవీన్ ఎంబీఏ పూర్తి చేసి మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నాడు. అతడికి వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన శిరీషతో వివాహం నిశ్చయమైంది. ఆమె ఎం ఫార్మసీ పూర్తి చేసి విజయవాడలోని పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్‌లో ఫార్మసిస్ట్‌గా పని చేస్తోంది. వధూవరులిద్దరూ మెడికల్ రంగానికి చెందిన వారు కావడంతో తమ వివాహ ఆహ్వానాన్ని కూడా అదే శైలిలో ఉండాలని భావించారు.

Also Read: Ministers Salaries: కేంద్ర మంత్రుల జీతాలు డబుల్‌.. బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు

వీరిద్దరి వివాహం ఫిబ్రవరి 4వ తేదీన కందుకూరు గ్రామంలో జరగనుంది. ఈ సందర్భంగా తమ పెళ్లికి సంబంధించిన శుభలేఖను ప్రత్యేకంగా ఉండేలా రూపొందించారు. తమ వృత్తిపై ఉన్న మమకారాన్ని చాటుకోవడమే కాకుండా ప్రత్యేకంగా ఉండేలా ఏదైనా చేయాలని నవీన్ ఆలోచించారు. తన పెళ్లి పత్రికను ఒక టాబ్లెట్ స్ట్రిప్పు (ట్యాబ్లెట్‌ షీట్‌) ఆకారంలో డిజైన్ చేయించాడు. పత్రిక ముందటి భాగంలో సాధారణంగా టాబ్లెట్ షీట్‌పై ఉండే వివరాల తరహాలోనే పెళ్లి తేదీ, సమయం, వేదిక, వధూవరుల డిగ్రీల ముద్రించారు.

Also Read: AP Govt Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. సీపీఎస్ ఉద్యోగులకు అదిరిపోయే వార్త

పెళ్లి పత్రిక వెనుక భాగంలో టాబ్లెట్లు ఉండే ఖాళీలను చూపిస్తూ ఇది ఒక మెడికల్ స్ట్రిప్పు అనే అనుభూతిని కలిగించేలా నవీన్‌ తమ పెళ్లి పత్రికను రూపొందించారు. ఈ కార్డులో వాడిన పదాలు కూడా మెడికల్‌ టెర్మినల్‌లో ఉన్నాయి. ప్రియమైన స్నేహితులు మా వివాహాన్ని అస్సలు మిస్స్‌ కాకండి అంటూ సరదాగా హెచ్చరిస్తూ పత్రికలో రాయించి తమ వివాహానికి ఆహ్వానం పలికారు. ఫిబ్రవరి 4వ తేదీన జరగనున్న ఈ వివాహానికి సంబంధించిన ఈ వెరైటీ వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. తమ వృత్తి పట్ల ఉన్న అంకితభావాన్ని, ప్రత్యేకతను చాటుకున్న ఈ జంటను స్థానికులు, సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అభినందిస్తున్నారు. తన పెళ్లి పత్రికను అత్యంత వినూత్నంగా, తాను చేస్తున్న వృత్తికి అద్దం పట్టేలా రూపొందించి ఆ జంట అందరినీ ఆశ్చర్యపరిచారు. అది పెళ్లి పత్రికా లేక టాబ్లెట్ షీటా అని భ్రమపడేలా ఉన్న ఆ వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల కీలక డిమాండ్‌.. రూ.700 కోట్ల నుంచి రూ.1500 కోట్లకు పెంపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Feb 02, 2026 12:51:08
Hyderabad, Telangana:

PF New Rules For Employee: 2026 కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగుల భవిష్య నిధి నిబంధనలకు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక మార్పులను ప్రతిపాదించారు. ముఖ్యంగా పీఎఫ్ అర్హతకు ఉండాల్సిన కనీస వేతన పరిమితిని పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నిర్ణయం మీ నెలవారీ ఖర్చులు, చేతికి వచ్చే జీతం, దీర్ఘకాలిక పొదుపుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ప్రస్తుత నిబంధనల ప్రకారం.. నెలకు రూ. 15,000 కనీస ప్రాథమిక వేతనం ఉన్న వారు తప్పనిసరిగా పీఎఫ్ ఖాతా కలిగి ఉండాలి. గత 11 ఏళ్లుగా ఈ పరిమితిలో మార్పు లేదు. అయితే సుప్రీంకోర్టు సూచనల మేరకు, దీనిని రూ.25,000 కు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది.

పీఎఫ్ లెక్కింపు ఎలా మారుతుంది?
సాధారణంగా మీ ప్రాథమిక వేతనంలో 12% పీఎఫ్ ఖాతాకు మళ్లిస్తారు. యాజమాన్యం కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తుంది. అయితే ప్రస్తుతం మీ జీతం రూ.30,000 అయినా, పీఎఫ్ కటింగ్ కేవలం రూ.15,000 ప్రాథమిక వేతన పరిమితిపైనే (అంటే రూ.1,800) జరుగుతుంది. భవిష్యత్తులో వేతన పరిమితిని రూ.25,000 కు పెంచితే, రూ. 3,000 (25,000లో 12%) నేరుగా పీఎఫ్ ఖాతాకు వెళ్తుంది.

మీ టేక్-హోమ్ జీతంపై ప్రభావం
వేతన పరిమితి పెరిగితే, ప్రతి నెలా మీ జీతం నుండి కట్ అయ్యే మొత్తం పెరుగుతుంది. దీనివల్ల మీ చేతికి వచ్చే నగదు తగ్గుతుంది. ఇది మీ నెలవారీ ఖర్చులపై ప్రభావం చూపవచ్చు. మీ పీఎఫ్ ఖాతాలో నిల్వ పెరగడం వల్ల పదవీ విరమణ సమయంలో భారీ మొత్తం అందుతుంది. అలాగే, పెన్షన్ మరియు బీమా ప్రయోజనాలు కూడా మెరుగుపడతాయి.

బడ్జెట్‌లో పీఎఫ్ ట్రస్టులకు సంబంధించి పాత, కఠినమైన నిబంధనలను ప్రభుత్వం తొలగించింది. సెక్షన్ 17 మార్పుల్లో భాగంగా యజమాని జమ చేసే చందాలపై పన్ను మినహాయింపులను సులభతరం చేశారు. కంపెనీలు తమ విరాళాలను అందించే ప్రక్రియను సరళీకరించడం ద్వారా వ్యవస్థీకృత రంగంలో మరిన్ని ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.

పీఎఫ్ విత్‌డ్రా రూల్స్..
డబ్బును విత్‌డ్రా చేసుకునే విషయంలో పాత నిబంధనలే కొనసాగుతున్నప్పటికీ, కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. 5 ఏళ్ల సర్వీసు తర్వాత తీసుకునే పీఎఫ్ సొమ్ముపై పన్ను ఉండదు.  ఇల్లు కొనడం, పిల్లల చదువు, పెళ్లి లేదా అనారోగ్యం వంటి సందర్భాల్లో పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. పదవీ విరమణకు ముందే పీఎఫ్ మొత్తాన్ని మరింత సులభంగా ఉపసంహరించుకునే కొత్త వ్యవస్థపై ఈపీఎఫ్‌వో (EPFO) పని చేస్తోంది.

వేతన పరిమితి పెంపు వల్ల తక్షణమే చేతిలో డబ్బు తగ్గినట్లు అనిపించినా, సామాజిక భద్రత, భవిష్యత్తు పొదుపు రీత్యా ఇది ఉద్యోగులకు లాభదాయకం. అయితే, ఇది కంపెనీలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపే అవకాశం ఉండటంతో కొత్త నియామకాలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది.

Also REad: Allu Arjun Tweet: మెగా కాంపౌండ్‌కు ఐకాన్ స్టార్..చరణ్-ఉపాసనలకు బన్నీ విషెస్..సెలబ్రేషన్స్ షురూ!

Also REad: Bharat Gas Lite Cylinder: సామాన్యులకు గుడ్‌న్యూస్..కేవలం రూ.300లకే గ్యాస్ సిలిండర్..మీ పాత సిలిండర్ తీసుకెళ్లండి చాలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 02, 2026 12:07:19
New Delhi, Delhi:

Union Budget 2026 Highlights: కేంద్ర బడ్జెట్ 2026 27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టగా.. ఈ బడ్జెట్‌పై అందరూ లెక్కలు వేసుకుంటున్నారు. ఎంత లెక్కలు వేస్తున్నా తమకు ఎలాంటి ప్రయోజనం లభించలేదని సామాన్య ప్రజలు భావిస్తున్నారు. ఈ బడ్జెట్‌ విధాన ప్రకటనలకే పరిమితమైందని చర్చ జరుగుతుండగా.. కానీ కొన్ని ప్రకటనలతో ప్రజలపై నేరుగా ప్రభావం చూపిస్తోంది. ఈ పది కీలక నిర్ణయాలు ప్రజల డబ్బులను కొంత కాపాడుతోంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Ministers Salaries: కేంద్ర మంత్రుల జీతాలు డబుల్‌.. బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు

కేంద్ర బడ్జెట్‌లో సామాన్యుల జేబుపై ప్రత్యక్ష ప్రభావం చూపే కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. రైతుల ఆదాయం పెంచడం, కొత్త ఉద్యోగాల కల్పన, నైపుణ్య అవకాశాలు, సరసమైన మెరుగైన చికిత్స, సులభమైన రుణాలు, చిన్న వ్యాపారాలకు ఉపశమనం, మహిళల ఆదాయానికి కొత్త మార్గాలు, వేగవంతమైన ప్రయాణం వంటి అంశాలపై కేంద్ర బడ్జెట్‌ కొన్ని నిర్ణయాలు ప్రకటించింది. ఖర్చులు తగ్గించడం, ఆదాయాన్ని పెంచడంపై ఈ బడ్జెట్‌ దృష్టి పెడుతుంది.

Also Read: AP Govt Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. సీపీఎస్ ఉద్యోగులకు అదిరిపోయే వార్త

ఆదాయం పెంచడం
బడ్జెట్‌ 2026లో గ్రామీణ శాఖకు ప్రాధాన్యం ఇచ్చింది. 500 జలాశయాలు, అమృత సరోవర్‌ సమగ్ర అభివృద్ధికి ప్రోత్సాహం కల్పిస్తోంది. దీంతోపాటు మత్స్య సంపదను ప్రోత్సహిస్తుంది. పశుపోషణలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడంతో గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన ఉద్యోగాలు లభిస్తాయి. కొబ్బరి, జీడిపప్పు, కోకో వంటి తోటల పంటలకు ప్రత్యేక పథకాలు సుమారు 30 మిలియన్ల మందికి ప్రయోజనం లభించనుంది. గంధపు పరిశ్రమను పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో కలిసి పనిచేస్తుంది.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల కీలక డిమాండ్‌.. రూ.700 కోట్ల నుంచి రూ.1500 కోట్లకు పెంపు

డిజిటల్ వ్యవసాయం
వ్యవసాయానికి ప్రోత్సాహం కల్పించేలా బడ్జెట్‌లో ఒక నిర్ణయం ఉంది. రైతుల కోసం ఏఐ ప్లాట్‌ఫామ్ భారత్-విస్తార్ ప్రారంభించనుంది. ఈ ప్లాట్‌ఫామ్ వ్యవసాయ నష్టాలను తగ్గించడానికి, మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. ఇది ఉత్పాదకతను పెంచడంతోపాటు ఖర్చులను తగ్గించనుంది. ఈ డిజిటల్ సలహా వ్యవస్థ చిన్న రైతులకు గేమ్-ఛేంజర్‌గా పనిచేయనుంది.

మహిళల కోసం షీ-మార్ట్‌లు
గ్రామీణ మహిళల కోసం కేంద్ర బడ్జెట్‌లో ఓ కానుక ఉంది. మహిళల కోసం షీ-మార్ట్‌లను తీసుకురానుంది. మహిళలు నడిపించే సంస్థలకు మార్కెట్‌ను అనుసంధానిస్తారు. లఖ్‌పతి దీదీ పథకం విజయంపై ఆధారపడి మహిళలు వ్యాపారస్తులుగా చేయడానికి షీ మార్ట్‌ దోహదం చేయనుంది.

Also Read: YS Jagan: ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వైఖరి అత్యంత ప్రమాదకరం: వైఎస్‌ జగన్‌

కొత్త సంస్థలు
విద్యా వ్యవస్థపై బడ్జెట్‌లో కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. పారిశ్రామిక కారిడార్లకు సమీపంలో ఐదు విశ్వవిద్యాలయ టౌన్‌షిప్‌లు నిర్మించనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. ప్రతి జిల్లాలో స్టెమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ల కోసం బాలికల హాస్టళ్లు, ఖగోళ శాస్త్రానికి కొత్త టెలిస్కోప్ సౌకర్యాలు కూడా చేర్చారు.

ఎంఎస్‌ఎంఈలకు భారీ మద్దతు
సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను బలోపేతం చేయడానికి కేంద్ర బడ్జెట్‌ భారీ ప్రకటన చేసింది. రూ.10,000 కోట్ల ఎస్‌ఎంఈ గ్రోత్ ఫండ్ ప్రారంభిస్తారు. ట్రెడ్స్‌ ద్వారా రూ.7 లక్షల కోట్ల విలువైన లిక్విడిటీ అందుబాటులోకి వస్తుంది. టైర్-2, టైర్-3 నగరాల్లో కార్పొరేట్ ఫ్రెండ్స్‌కు సహకారం అందించనుంది.

ఆరోగ్య సంరక్షణ
రానున్న ఐదు సంవత్సరాలలో 100,000 అనుబంధ ఆరోగ్య నిపుణులు, 150,000 మంది సంరక్షకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావించారు. మూడు కొత్త ఆయుర్వేద ఎయిమ్స్, జిల్లా ఆసుపత్రులు సామర్థ్యాన్ని 50 శాతం విస్తరించాలని ప్రతిపాదించారు. దీంతో ప్రజలకు వైద్య ఖర్చులు తగ్గనున్నాయి.

బ్యాంకింగ్, ఆర్థిక సంస్కరణలు
బ్యాంకింగ్ రంగాన్ని సమీక్షించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించింది. మున్సిపల్ బాండ్లను జారీ చేసే నగరాలకు రూ.100 కోట్ల ప్రోత్సాహకం లభిస్తుంది. పెట్టుబడి పరిమితులు కూడా పెంచనున్నారు.

ఐటీ రంగానికి ఊరట
ఐటీ సేవలను సేఫ్ హార్బర్ మార్జిన్‌ను 15.5 శాతంగా నిర్ణయించారు. రూ.300 కోట్ల నుంచి రూ.2,000 కోట్లకు పరిమితిని పెంచడంతో మధ్య తరహా ఐటీ కంపెనీలకు ఉపశమనం లభించనుంది.

హై-స్పీడ్ రైలు కారిడార్
దేశంలో ఏడు హై-స్పీడ్ రైలు కారిడార్లను బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టులు ప్రజల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయి. హైదరాబాద్‌తోపాటు పట్టణ అభివృద్ధి, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను పెంచుతాయి.

వైకల్యం, క్రీడలు
వైద్య, వారసత్వ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. దివ్యాంగుల కోసం నైపుణ్యం, మద్దతు పథకాలు, క్రీడల కోసం ఖేలో ఇండియా మిషన్ ప్రారంభించనున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 02, 2026 10:22:28
New Delhi, Delhi:

Salaries And Allowances: జాతీయ బడ్జెట్‌ ప్రవేశపెట్టడంతో దేశవ్యాప్తంగా లెక్కలు బేరీజు వేసుకుంటున్నారు. ఎవరికి ఎంత వచ్చాయి? ఏయే శాఖలు కేటాయింపులు ఎంత జరిగాయని తీరిగ్గా లెక్కించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కొందరికి మాత్రం భారీగా కేటాయింపులు జరిగాయి. ఈ కేటాయింపులతో కొందరి జీతాలు భారీగా పెరగనున్నాయి. ఎవరి జీతాలు పెరుగుతున్నాయో.. దీనికి సంబంధించిన వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

Also Read: AP Govt Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. సీపీఎస్ ఉద్యోగులకు అదిరిపోయే వార్త

పార్లమెంట్‌లో నిన్న నిర్మల సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ను చదివి వినిపించిన విషయం తెలిసిందే. కేంద్ర బడ్జెట్‌ సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ప్రత్యక్షంగా ఎలాంటి ప్రయోజనం చేకూరేటట్టు లేదు. కానీ పరోక్షంగా.. దేశ అభివృద్ధికి మార్గనిర్దేశకత్వంగా ఈ బడ్జెట్‌ ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్‌ కేటాయింపుల్లో కొన్ని వర్గాలకు తీవ్ర అన్యాయం చేయగా.. మరికొన్ని వర్గాలకు భారీ ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయాలు ఉన్నాయి. వాటిలో కేంద్ర మంత్రులు, అతిథుల ఖర్చులకు సంబంధించి నిర్మల సీతారామన్‌ తన పద్దులో కేటాయింపులు చేశారు.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల కీలక డిమాండ్‌.. రూ.700 కోట్ల నుంచి రూ.1500 కోట్లకు పెంపు

కేంద్ర మంత్రిమండలి, కేబినెట్‌ సచివాలయంతోపాటు ప్రధానమంత్రి కార్యాలయం, విదేశీ అతిథుల మర్యాదలకు సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో రూ.1,102 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయింపులు రూ.978.20 కోట్లు ఉన్నాయి. గతేడాది కన్నా ఈ ఏడాది అధిక కేటాయింపులు చేశారు. మంత్రిమండలికి సంబంధించి ఖర్చులకు రూ.620 కోట్లు కేటాయించగా.. 2025-26లో రూ.483.54 కోట్లుగా కేటాయింపులు ఉన్నాయి. ఈ కేటాయింపుల్లో కేంద్ర మంత్రుల జీతభత్యాలకు చెల్లించడంతోపాటు మాజీ ప్రధానమంత్రుల జీతభత్యాలు, ప్రయాణాలకు సంబంధించి ఈ బడ్జెట్‌ను ఖర్చు చేయనున్నారు. ఈ కేటాయింపుల్లోనే వీవీఐపీల ప్రత్యేక విమాన ఖర్చులు కూడా ఉన్నాయి. కేటాయింపులు పెంచడంతో మంత్రుల జీతాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. 

Also Read: YS Jagan: ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వైఖరి అత్యంత ప్రమాదకరం: వైఎస్‌ జగన్‌

కేంద్ర మంత్రుల జీతాలకు సంబంధించి భారీగా కేటాయింపులు చేయడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి ఉపశమనం లేదని.. కానీ బడ్జెట్‌లో మాత్రం కేంద్ర మంత్రులు తమకు భారీగా కేటాయింపులు చేసుకోవడం విమర్శలకు దారి తీస్తోంది. సాధారణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు ఇవ్వకుండా వారికి వేతనాల కోసం కేటాయింపులు పెంచడం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Feb 02, 2026 10:20:47
Hyderabad, Telangana:

Allu Arjun Congratulates Ram Charan Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల ఇంట్లో సంబరాలు అంబరాన్నంటాయి. క్లిన్ కారా రాకతో ఇప్పటికే సందడిగా ఉన్న మెగా ఇంట, ఇప్పుడు మరో ఇద్దరు బుజ్జీ అతిథులు అడుగుపెట్టారు. ఈ క్రేజీ అప్‌డేట్‌పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శనివారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో ఉపాసన కవలలకు (ఒక బాబు, ఒక పాప) జన్మనిచ్చారు. ఈ వార్తతో కొణిదెల, కామినేని కుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొంది.

అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్
మెగా వారసులు అడుగుపెట్టిన శుభ సందర్భాన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు.

"మరోసారి తల్లిదండ్రులైన నా ప్రియమిత్రుడు రామ్ చరణ్, ఉపాసనలకు హృదయపూర్వక అభినందనలు. ఈ వార్త విన్నప్పుడు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. చిరంజీవి గారి ముఖంలోనూ, చిన్నారి క్లిన్ కారా కళ్లలోనూ కనిపిస్తున్న ఆ గర్వం, సంతోషం చూడముచ్చటగా ఉన్నాయి. మెగా ఫ్యామిలీ అంతా ఇలా నవ్వుతూ ఉండటం నాకు చాలా హ్యాపీగా ఉంది" అని బన్నీ ట్వీట్ చేశారు.

సోషల్ మీడియాలో 'మెగా' ట్రెండింగ్
ఈ వార్త బయటకు వచ్చిన నిమిషాల్లోనే నెట్టింట #MegaCelebrations అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అల్లు అర్జున్ చేసిన పోస్ట్ చూసి ఇటు మెగా ఫ్యాన్స్, అటు అల్లు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. చరణ్-బన్నీ మధ్య ఉన్న బలమైన అనుబంధం ఈ విషెస్‌తో మరోసారి స్పష్టమైందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

క్లిన్ కారాతో పాటు ఇప్పుడు మరో ఇద్దరు తోడవ్వడంతో మెగాస్టార్ చిరంజీవి ఇల్లు సందడిగా మారిపోయింది. చిరు ఇప్పుడు 'ట్రిపుల్ గ్రాండ్‌పా' అంటూ అభిమానులు జోకులు వేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' షూటింగ్ ముగించుకుని ఈ సంతోషకరమైన సమయంలో తన కుటుంబంతో గడుపుతున్నారు. త్వరలోనే ఈ ఇద్దరు చిన్నారి వారసుల పేర్లు, ఇతర వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Also Read: Bharat Gas Lite Cylinder: సామాన్యులకు గుడ్‌న్యూస్..కేవలం రూ.300లకే గ్యాస్ సిలిండర్..మీ పాత సిలిండర్ తీసుకెళ్లండి చాలు!

Also Read: EPF Changes In Budget: పీఎఫ్ నిబంధనల్లో కీలక మార్పులు..కంపెనీలకు, ఉద్యోగులకు భారీ ఊరట!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 02, 2026 07:07:13
Hyderabad, Telangana:

Bharat Gas Lite Cylinder Price: గ్యాస్ సిలిండర్ల వాడకంలో సరికొత్త విప్లవం మొదలైంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) అత్యంత తేలికైన, సురక్షితమైన ప్లాస్టిక్ సిలిండర్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పాత ఇనుప సిలిండర్ల బరువుతో ఇబ్బంది పడే గృహిణులకు ఇది గొప్ప ఊరట. మీరు కేవలం రూ.300 కే ఈ సరికొత్త 'భారత్ గ్యాస్ లైట్' సిలిండర్లను ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటివరకు ఎరుపు రంగు ఇనుప సిలిండర్లనే చూసిన మనకు, ఇకపై ఆకర్షణీయమైన రంగుల్లో ప్లాస్టిక్ సిలిండర్లు కనిపించనున్నాయి.

కంపోజిట్ ప్లాస్టిక్ సిలిండర్ ప్రత్యేకతలు
ఈ సిలిండర్లు హై డెన్సిటీ పాలిథిలిన్ (HDPE) అనే అత్యాధునిక మెటీరియల్‌తో తయారయ్యాయి. ఇనుప సిలిండర్ గ్యాస్ నింపితే దాదాపు 30 కిలోల బరువు ఉంటుంది. కానీ, ఈ కొత్త సిలిండర్ గ్యాస్‌తో కలిపి కేవలం 15.9 కిలోలు మాత్రమే ఉంటుంది. అంటే బరువు సగానికి సగం తగ్గుతుంది.

ఇందులో గ్యాస్ ఎంత మిగిలి ఉందో చూసుకోవడానికి ఒక ట్రాన్స్‌లూసెంట్ (కిటికీ వంటి) భాగం ఉంటుంది. దీనివల్ల గ్యాస్ అయిపోయే సమయాన్ని ముందే తెలుసుకోవచ్చు. ఇవి ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారవ్వడం వల్ల తుప్పు పట్టవు, నేలపై మరకలు పడవు.

అద్భుతమైన సెక్యూరిటీ ఫీచర్లు
ఈ మోడరన్ సిలిండర్లు అధిక పీడనాన్ని తట్టుకుంటాయి. పాత సిలిండర్లు 80 కిలోల ప్రెజర్ తట్టుకుంటే, ఈ కొత్తవి 120 కిలోల ప్రెజర్ వరకు తట్టుకోగలవు.

అలాగే దీనికి లీకేజీ భయం లేదు. పొరపాటున అగ్ని ప్రమాదం జరిగినా, ఇవి పేలిపోకుండా గ్యాస్‌ను నెమ్మదిగా విడుదల చేస్తాయి. దీనివల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశం చాలా తక్కువ.

రూ.300కే పొందే విధానం
ఈ కొత్త సిలిండర్ అసలు సెక్యూరిటీ డిపాజిట్ ధర సుమారు రూ.3,350 ఉంటుంది. అయితే వినియోగదారులకు BPCL ఒక బంపర్ ఆఫర్ ఇస్తోంది.

మీ దగ్గర ఉన్న పాత ఇనుప సిలిండర్‌ను వెనక్కి ఇచ్చేసి, దానికి బదులుగా ఈ కొత్త ప్లాస్టిక్ సిలిండర్‌ను తీసుకోవాలనుకుంటే, కేవలం రూ.300 అదనంగా చెల్లిస్తే సరిపోతుంది.

ప్రస్తుతం బీపీసీఎల్ ఈ సేవలను గోవాలో ప్రారంభించింది. త్వరలోనే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలతో పాటు దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది.

Also Read: EPF Changes In Budget: పీఎఫ్ నిబంధనల్లో కీలక మార్పులు..కంపెనీలకు, ఉద్యోగులకు భారీ ఊరట!

Also REad: Pakistan Boycott India Match: భారత్‌తో మ్యాచ్‌కు పాక్ 'నో'..టీ20 ప్రపంచకప్‌లో ఇండియాతో మ్యాచ్ బహిష్కరణ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 02, 2026 06:34:45
Hyderabad, Telangana:

EPF Changes In Budget 2026: ఉద్యోగుల భవిష్య నిధి (EPF) నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. బడ్జెట్ 2026 ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పీఎఫ్ ట్రస్టులు, విత్‌డ్రా సదుపాయాలపై కీలక ప్రకటనలు చేశారు. ఈ మార్పులు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల ఉద్యోగులకు, కంపెనీలకు కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

పీఎఫ్ ట్రస్టుల నిబంధనల రద్దు
సొంతంగా పీఎఫ్ ట్రస్టులను నిర్వహించే కంపెనీలకు ప్రభుత్వం భారీ ఉపశమనం కలిగించింది. ఇప్పటివరకు యాజమాన్యాలు చెల్లించే వాటా, పర్సెంటేజీపై ఉన్న కఠినమైన నిబంధనలను కేంద్రం రద్దు చేసింది. దీనివల్ల కంపెనీలకు వ్యాపార నిర్వహణ సులభతరం కానుంది.

ప్రస్తుతం పీఎఫ్ ట్రస్టులపై ఆదాయపు పన్ను శాఖ, ఈపీఎఫ్‌వో (EPFO) రెండింటి పర్యవేక్షణ ఉంది. అయితే, గందరగోళాన్ని తగ్గించేందుకు ఇకపై వీటిని ఒకే సంస్థ నియంత్రణలోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే, సెక్షన్ 17 కింద యజమాని చెల్లించే పీఎఫ్ చందాలపై పన్ను మినహాయింపులను కూడా ప్రకటించారు.

ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా!
ఉద్యోగుల కోసం ప్రభుత్వం 'పీఎఫ్ 3.0' వెర్షన్‌ను తీసుకువస్తోంది. దీని ద్వారా ఏప్రిల్ 1 నుంచి సరికొత్త సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. అత్యవసర సమయాల్లో పీఎఫ్ సొమ్మును ఏటీఎంలు లేదా యూపీఐ (UPI) ద్వారా సులభంగా విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు.

ఉద్యోగుల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేందుకు ఒక అత్యాధునిక ఏఐ టూల్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది తెలుగు సహా అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

పీఎఫ్ ప్రక్రియలో ఉన్న సంక్లిష్టతలను తొలగించి, సాంకేతికతను జోడించడం ద్వారా అటు కంపెనీలకు, ఇటు సామాన్య ఉద్యోగులకు మేలు చేయడమే ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశ్యం. ఏప్రిల్ 1 నుంచి పీఎఫ్ ఖాతాదారులు సరికొత్త డిజిటల్ అనుభవాన్ని పొందనున్నారు.

Also Read: Pakistan Boycott India Match: భారత్‌తో మ్యాచ్‌కు పాక్ 'నో'..టీ20 ప్రపంచకప్‌లో ఇండియాతో మ్యాచ్ బహిష్కరణ!

Also Read: Tirupati Laddu Case: శ్రీవారితో పెట్టుకుంటే శిక్ష తప్పదు..తిరుమల అపచారంపై సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 01, 2026 18:30:54
Hyderabad, Telangana:

Union Budget: 'కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026–27 తెలంగాణపై కొనసాగుతున్న నిర్లక్ష్యానికి మరో స్పష్టమైన నిదర్శనం. దేశ ఆర్థిక వృద్ధికి కీలకంగా దోహదపడుతున్న తెలంగాణకు ఈ బడ్జెట్‌లోనూ న్యాయం జరగకపోవడం శోచనీయం. ఏళ్లు గడుస్తున్నాయి.. బడ్జెట్లు మారుతున్నాయి తప్ప తెలంగాణకు నిధుల కేటాయింపులో చూపుతున్న కేంద్రం వివక్షలో ఎలాంటి మార్పు లేదు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల కీలక డిమాండ్‌.. రూ.700 కోట్ల నుంచి రూ.1500 కోట్లకు పెంపు

కేంద్ర బడ్జెట్‌పై ఎక్స్‌ వేదికగా మాజీ మంత్రి హరీశ్‌ రావు స్పందిస్తూ కీలక ప్రకటన విడుదల చేశారు. 'తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు గడిచినా విభజన చట్టం హామీలు అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో విస్తరణ, రైల్వే ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు లేకపోవడం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం. తెలంగాణకు ఐఐఎం, నవోదయ, కేంద్రీయ విద్యాలయాల ఊసు లేదు. ఒక్క ప్రాజెక్టుకు ఆర్థిక సాయం లేదు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు వివరించారు. తెలంగాణపై కేంద్రం ప్రదర్శిస్తున్న స్పష్టమైన ఆర్థిక అన్యాయం ఇది అని ప్రకటించారు.

Also Read: YS Jagan: ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వైఖరి అత్యంత ప్రమాదకరం: వైఎస్‌ జగన్‌

'తెలంగాణ నుంచి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న 16 మంది ఎంపీలతో రాష్ట్రానికి ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా రాలేదు. పార్లమెంట్‌లో తెలంగాణ గొంతు వినిపించడంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ ఘోరంగా విఫలమయ్యాయి' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు రాబట్టలేక పోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. కేంద్ర మంత్రివర్గంలో ఉండి కూడా నిధులు తీసుకురాలేకపోవడం వారి అసమర్థతను చూపుతోందని తెలిపారు. రేవంత్ రెడ్డి 60కిపైగా సార్లు ఢిల్లీ వెళ్లినా వాటి ఫలితం మాత్రం శూన్యం అని హరీశ్ రావు విమర్శించారు.

Also Read: IND beat NZ: టీ20 ప్రపంచకప్‌ ముందు భారత్‌ అద్భుతం.. న్యూజిలాండ్‌తో 4-1తో సిరీస్‌ సొంతం

'డిల్లీ పర్యటనలు రాజకీయ ప్రదర్శనలకే పరిమితమయ్యాయి తప్ప, తెలంగాణకు ఎలాంటి లాభం లేదు. రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టడం వల్లే బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు కనీస ప్రాధాన్యం లేకుండా పోయింది' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీతో తెలంగాణకు జరిగేది నష్టమే తప్ప లాభం కాదని మరోసారి స్పష్టమైందని చెప్పారు.

'కేంద్ర బడ్జెట్ పూర్తిగా తెలంగాణకు వ్యతిరేకం.. ప్రజలకు వ్యతిరేకం.. రైతులకు కూడా వ్యతిరేకం' అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రకటించారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య రంగాలకు ఈ బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యం లేదని తెలిపారు. 'రాష్ట్రాలకు రావాల్సిన పన్ను వాటాను క్రమంగా తగ్గిస్తూ ఆర్థిక సమాఖ్య స్ఫూర్తిని తీవ్రంగా దెబ్బతీశారు. కేంద్రం మాటల్లో సహకార సమాఖ్య అంటూ ఆచరణలో రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం ప్రజాస్వామ్య విరుద్ధం' అని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.

'మధ్యతరగతి ప్రజలను పన్ను ఊరట లేదు, ద్రవ్యోల్బణ భారం పట్టించుకోలేదు, ఉద్యోగ కల్పన కాగితాలకే తప్ప వాస్తవ రూపం దాల్చడం లేదు. దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లయిన నిరుద్యోగం, తయారీ రంగం పతనం, రైతుల సంక్షోభం గురించి బడ్జెట్‌లో కనీస ప్రస్తావన లేదు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు వివరించారు. దేశ భవిష్యత్తుపై ఎటువంటి స్పష్టత లేని బడ్జెట్ ఇది.. బడ్జెట్ అనంతరం స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగియటం తీవ్ర నిరాశకు నిదర్శనం అని తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 01, 2026 18:04:52
Hyderabad, Telangana:

KCR SIT Investigation: 'రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి మూడు ముక్కల్లో చెప్పాలి అంటే డైవర్షన్, సబ్వర్షన్, పర్వర్షన్డ. అటెన్షన్ డైవర్ట్ చేయడం, తమ చేతకానితనాన్ని సబ్వర్ట్ చేయడం, పర్వర్ట్ రాజకీయాలు చేయడం. రాష్ట్రంలో రెండేళ్లుగా కాంగ్రెస్ పరిపాలన తీరు ఇలానే ఉంది' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. 'సిట్ చట్టాన్ని గౌరవించలేదు.. బీఎన్‌ఎస్‌ చట్టాన్ని.. అందులో పొందుపరిచిన నిబంధనలు కూడా గౌరవించలేదు' అని ఆరోపించారు. కానీ తాము ఒక బాధ్యత కలిగిన పార్టీగా.. తెలంగాణ ప్రజల గొంతుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధిగా పెద్దలు కేసీఆర్ విచారణకు హాజరయ్యారని కేటీఆర్‌ తెలిపారు. సిట్ చట్టాన్ని గౌరవించకపోయినా.. రేవంత్‌ రెడ్డి ఆడించినట్టు ఆడుతున్నా.. కేసీఆర్ మాత్రం చట్టం, న్యాయం మీద గౌరవంతో విచారణకు సహకరించారని వివరించారు.

Also Read: KTR Condemns: కేంద్ర మంత్రులు, రేవంత్‌ రెడ్డి వైఫల్యంతో బడ్జెట్‌లో తెలంగాణకు ఘోర అన్యాయం

హైదరాబాద్‌ నందినగర్‌లో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ విచారణ అనంతరం మాజీ మంత్రి కేటీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. 'కేసీఆర్‌తోపాటు తాము ఏ తప్పు చేయకపోవడంతోనే నిజాయితీగా కేసీఆర్‌ సిట్‌కు సంపూర్ణంగా సహకరించారు. సిట్‌ అడిగిన ప్రతి ప్రశ్నకి స్పష్టంగా.. కుండబద్దలు కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 'ఏ తప్పు జరగలేదు, ఏ తప్పు ఎక్కడా కూడా బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వం ఎన్నడూ చేయలేదు. ఎన్నో పుకార్లు, ఎన్నో నీలాపనిందలు, ఎన్నో రకాల కథనాలు, ఎన్నో రకాల అపోహలను ప్రజల్లో సృష్టించేలా రెండేళ్లుగా లీకుల రూపంలో ఇస్తూ కాంగ్రెస్ పార్టీ పైశాచిక ఆనందం పొందుతుందో నేటితో ఫుల్ స్టాప్ పెడతుందని ఆశిస్తున్నాం' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రతిసారి విచారణ అనంతరం పంపే లీకులను విశ్వసించరాదు అని మీడియాకు విజ్ఞప్తి చేశారు. లీకుల మీద ఆధారపడి ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా నడుపుతా ఉన్నారంటేనే ఈ కేసులోని డొల్లతనం బయటపడుతుందని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Also Read: TTD EO: తిరుమల లడ్డూ వివాదంలో కొత్త మలుపు.. టీటీడీ ఈఓ అనిల్‌ సింఘాల్‌ బదిలీ

'తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై బురద చల్లాలి అనుకుంటే అది సూర్యుడి మీద ఉమ్మెయ్యడమే అవుతుంది. అది తిరిగి వచ్చి రేవంత్ రెడ్డి మొహం మీదే పడుతుంది. చెత్త రాజకీయం.. లీకులు, పనికిమాలిన విచారణలు రెండేళ్లు కాలక్షేపం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడికక్కడ పోరాటం చేస్తుంటే ఏకాగ్రతను దెబ్బతీయడానికి, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మళ్లీ కేసీఆర్‌ విచారణ పేరిట ఏదో చేస్తున్నారు అంటూ కథనాలు వండి వారిస్తున్నారు' అని కేటీఆర్‌ మండిపడ్డారు. 'సిట్‌ విచారణ ఎవరి ఆధీనంలో జరుగుతుందో అర్థం కావట్లేదు. మహేష్ గౌడ్ నాయకత్వంలో సిట్ ఉందా లేక అధికారుల ఆధీనంలో ఉందా మాకైతే అర్థం కావట్లేదు. విచారణ చేసేది సిట్టా లేక పీసీసీనా? లేక బీజేపీనా? అది కూడా మాకు అర్థం కావట్లేదు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 

Also Read: AP Govt Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. సీపీఎస్ ఉద్యోగులకు అదిరిపోయే వార్త

'రెండు సార్లు తెలంగాణ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక పాపులర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఇవాళ తెలంగాణలో ఉన్నామంటే ఆ తెలంగాణ సాధనకు ప్రధాన బాధ్యుడు, ప్రధాన నాయకుడు, ఉద్యమ నాయకుడు, ఉద్యమ సూర్యుడు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ మీద చేస్తున్న చిల్లర ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారు. అన్నీ గుండెల్లో పెట్టుకుంటారు. సరైన సందర్భంలో కాళోజీ చెప్పినట్టు ఉప్పు పాతర వేసే బాధ్యత కూడా ప్రజలు తీసుకుంటారు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు.

'గులాబీ అధినేత ఇచ్చిన సమాధానాలతో సిట్‌కు అన్ని విషయాలు కూడా అర్థమై ఉంటాయి. తేటతెల్లమై ఉంటాయి. స్పష్టంగా ఏ తప్పు జరగలేదు, ఇదంతా కాలక్షేపం అని చెప్పి సిట్ అధికారులకు కూడా కళ్లు తెరుచుకొని ఉంటాయి. నాకు తెలిసినంత వరకు కేసీఆర్‌ని అడిగింది స్పష్టం ఒక్కటే! ట్యాపింగ్ జరిగిందా అని అడిగారు. అలాంటిది ఏదీ జరగలేదు, అంతా బోగస్ సృష్టి అని చెప్పి ఉంటారు. ఎందుకంటే మమ్మల్ని అదే అడిగారు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
Feb 01, 2026 17:46:28
Gollet, Telangana:ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి పల్లకి సేవ, రథోత్సవం ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. వేలాదిమంది భక్తుల సమక్షంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి ఉత్సవ విగ్రహాలతో పల్లకి సేవ నిర్వహించగా భక్తులు తరించిపోయారు. అదేవిధంగా లక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రథోత్సవం గురించి ఉదయం నుండి వేచి ఉన్న వేలాదిమంది భక్తులు ఆ కార్యక్రమాన్ని తిలకించి పులకించిపోయారు. రథోత్సవం వేళ గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగి పోయింది. ట్రాఫిక్ ఇబ్బందులు, తదితర కారణాలతో గర్భగుడిలోని స్వామిని దర్శించుకోని భక్తులు కూడా రథోత్సవం వేళ స్వామి వారిని ప్రత్యక్షంగా తిలకించి తరించిపోయారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ స్వామివారిని దర్శించుకుని పులకించిపోయారు.
0
comment0
Report
Feb 01, 2026 17:17:11
Gollet, Telangana:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతరకు లక్షలాదిమంది భక్తులు పోటెత్తడంతో సరియైన ఏర్పాట్లు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క సారక్క జాతరను దృష్టిలో పెట్టుకొని గంగాపూర్ జాతరకు అధిక సంఖ్యలో భక్తులు హాజరుకారనే ఉద్దేశంతో అధికారులు సాధారణ ఏర్పాట్లు చేయగా ఊహించని విధంగా భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఏర్పాట్లు సరిపోక పలు విధాలుగా ఇబ్బందులు పడ్డారు. వేలాది సంఖ్యలో వాహనాలు జాతరకు రాగా సుదూరంలో ఉన్న పార్కింగ్ ప్రాంతానికి వెళ్లలేక పలు వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కున్నాయి. ట్రాఫిక్ క్లియర్ చేయలేక అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. రెబ్బెన నుండి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగాపూర్ దేవాలయానికి వెళ్లాల్సిన భక్తులు ట్రాఫిక్ ఇబ్బందులతో వాహనాలను రైల్వే గేట్ అవతల నిలిపివేసి కాలినడకన దేవాలయానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా రోడ్డుకిరువైపులా పంటచేన్లు ఉండటంతో వాహనాల పార్కింగ్కు సరైన ఏర్పాట్లు చేయడంలో ఇబ్బంది ఎదురైనట్లు తెలుస్తోంది. ఉదయం సుమారు 10 గంటలకు ప్రారంభమైన ట్రాఫిక్ ఇబ్బందులు రాత్రి 7,8 గంటల వరకు కూడా కొనసాగాయి. ఇక ఎండోమెంట్ అధికారులు కూడా ఏర్పాట్లలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. టికెట్లు కొనుగోలు చేసి దర్శనానికి వెళ్లే మెట్లపై షామియానా కర్రలు అడ్డంగా అమర్చడం, షామియానా తాళ్లు ఊడిపోయినా పట్టించుకున్న దాఖలాలు లేవు. దేవాదాయ శాఖ అధికారులు మంచినీటి సౌకర్యం గురించి కూడా అంతగా పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. భక్తులకు కొంగుబంగారమైన గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతరకు లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చినా అందుకు తగ్గట్టు ఏర్పాట్లు లేవనే విమర్శలు వస్తున్నాయి.
0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 01, 2026 17:05:33
Hyderabad, Telangana:

Union Budget 2026 -27: కేంద్ర బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా.. తెలంగాణ బీజేపీ ఎంపీలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు కేంద్ర బడ్జెట్‌లో రూపాయి దక్కకపోయినా హర్షం వ్యక్తం చేస్తూ కీలక ప్రకటనలు చేశారు. న్యూఢిల్లీలో పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ స్పందిస్తూ కేంద్ర బడ్జెట్‌ను స్వాగతించారు. 'భారతదేశంలో సుస్థిరమైన ప్రభుత్వ నడుస్తోంది. దూరదృష్టితో దీర్ఘకాలిక నిర్ణయాలతో భారత జీడీపీ ఏడు శాతం పెరిగింది. గతేడాది రూ.50 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే ఈ ఏడాది రూ.53 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు' అని వివరించారు. 

Also Read: TTD EO: తిరుమల లడ్డూ వివాదంలో కొత్త మలుపు.. టీటీడీ ఈఓ అనిల్‌ సింఘాల్‌ బదిలీ

'కేంద్ర బడ్జెట్‌లో అనేక ప్రజారంజక విషయాల మీద దృష్టి పెట్టారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి గత బడ్జెట్‌లో మాదిరిగా ఈ ఏడాది రూ.4 లక్షల కోట్లు పెట్టారు. మేకిన్ ఇండియా మేడిన్ ఇండియా అనుగుణంగా యువశక్తి దేశ పురోగమనంలో భాగస్వాములు చేయాలని లక్ష్యంతో బడ్జెట్ పెట్టారు' అని ఈటల రాజేందర్‌ తెలిపారు. 'అనేక మందుల మీద దిగుమతి సుంకం తగ్గించారు. క్యాన్సర్‌తో పాటు 17 రకాల మందుల మీద పన్ను రాయితీ ఇచ్చి పేద రోగులకు ఉపశమనం కల్పించారు. ప్రతి జిల్లా కేంద్రంలో ట్రామా కేర్ సెంటర్ పెట్టాలని నిర్ణయించారు' అని బీజేపీ ఎంపీ రాజేందర్ వెల్లడించారు.

Also Read: KCR Live Updates: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ సిట్‌ విచారణ.. క్షణ క్షణం లైవ్‌ అప్‌డేట్స్‌ ఇవే!

'మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకానికి పేరు మారిస్తే ఆ పథకమే తీసేస్తున్నట్లుగా ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేశాయి. కానీ గత బడ్జెట్‌లో రూ.81 వేల కోట్లు బడ్జెట్ పెడితే ఈసారి రూ.లక్షా యాభైవేల కోట్ల పై చిలుకు బడ్జెట్ పెట్టారు. గ్రామీణ పేదలకు మరింత ఉపాధి కల్పిస్తుంది' అని మల్కాజిగిరి ఎంపీ రాజేందర్‌ తెలిపారు. 'లక్షలాదిమంది ఆధారపడి ఉన్న చేనేత రంగానికి ప్రోత్సాహం ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న డైరీ, పౌల్ట్రీ, వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు పెద్దపీట వేసింది అనడానికి బడ్జెట్ స్పీచ్ సాక్ష్యం' అని చెప్పారు.

Also Read: KTR Condemns: కేంద్ర మంత్రులు, రేవంత్‌ రెడ్డి వైఫల్యంతో బడ్జెట్‌లో తెలంగాణకు ఘోర అన్యాయం

'ఇతర దేశాల నుంచి దిగుమతులు తగ్గించి స్వదేశీ ఉత్పత్తులు పెంచడం కోసం అనేక పథకాలను ఈ బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. వికసిత భారత్ 2047 వైపు ప్రయాణించడానికి ఈ బడ్జెట్ స్పష్టమైన మార్గ నిర్దేశం చేసింది. సేవారంగం మీద మొట్టమొదటిసారిగా దృష్టి పెట్టి ప్రోత్సహించే ప్రయత్నం చేసింది. ఒరిస్సా- ఆంధ్రప్రదేశ్-తమిళనాడు-కేరళ రాష్ట్రాలకు మినరల్ హబ్‌గా తయారు చేయడం కోసం ప్రత్యేక కారిడార్ ప్రకటించారు' అని ఎంపీ ఈటల రాజేందర్‌ వివరించారు. 'ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను ఈ బడ్జెట్ ఇచ్చింది. బ్యాంకింగ్ రంగం నుంచి అప్పులు ఎక్కువగా ఇచ్చేందుకు ఏం చేయాలి అనే దానిమీద చాలా సునిశితమైన దృష్టితో ఈ బడ్జెట్ ప్రతిపాదన చేశారు' అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ వెల్లడించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 01, 2026 16:38:17
Hyderabad, Telangana:

KTR On Union Budget: పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో మరోసారి తెలంగాణకు ఘోర అన్యాయం జరిగిందని ప్రకటించారు. కేంద్ర మంత్రులు, రేవంత్ రెడ్డి ఘోర వైఫల్యంతోనే కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు దక్కింది గుండు సున్నా అని.. మిగిలింది మొండి చెయ్యి మాత్రమేనని మండిపడ్డారు. పుష్కరకాలంగా బీజేపీ తెలంగాణకు ఒక్క రూపాయి, ఒక్క ప్రాజెక్టు కేటాయించలేదని విమర్శించారు. తనపై ఉన్న కేసులను, అవినీతి ఆరోపణల నుంచి ఢిల్లీలో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకోవడం తప్పించ 60 సార్లు ఢిల్లీకి వెళ్లి రేవంత్ రెడ్డి సాధించింది ఏమిటి? అని ప్రశ్నించారు.

Also Read: Chandrababu: కేంద్ర బడ్జెట్‌పై చంద్రబాబు హర్షం.. ఇది ఫార్వార్డ్ లుకింగ్ బడ్జెట్

కేంద్ర బడ్జెట్‌పై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో కాంగ్రెస్, బీజేపీల వైఖరిని, రాష్ట్రానికి నిధులు తేలేని నిస్సహాయతను ప్రశ్నించారు. తెలంగాణ నుంచి గెలిచిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి అన్యాయం జరిగిందని ఆవేదన చెందారు.

Also Read: KCR Live Updates: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ సిట్‌ విచారణ.. క్షణ క్షణం లైవ్‌ అప్‌డేట్స్‌ ఇవే!

తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులు, విభజన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం పుష్కరకాలంగా వివక్షపూరిత వైఖరి కొనసాగిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. రేవంత్ రెడ్డి 60 సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చినప్పటికీ తెలంగాణకు ఒక్క రూపాయి ప్రయోజనం కూడా దక్కలేదని విమర్శించారు. ఢిల్లీలోని బీజేపీ పెద్దల చుట్టూ చేసిన ప్రదక్షిణతో కలిగిన ప్రయోజనంపై రేవంత్‌ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Also Read: TTD EO: తిరుమల లడ్డూ వివాదంలో కొత్త మలుపు.. టీటీడీ ఈఓ అనిల్‌ సింఘాల్‌ బదిలీ

బడాబాయ్‌తో దోస్తీ చేసి తెలంగాణకు నిధుల వరద పారిస్తానని ప్రగల్బాలు పలికిన చోటాబాయ్ మాటలు అన్ని బూటకమేనని కేంద్ర బడ్జెట్ సాక్షిగా తేలిపోయిందని కేటీఆర్‌ ప్రకటించారు. బడే భాయ్ – చోటే భాయ్ అనుబంధంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రాష్ట్రానికి ఏమి సాధించిందో వెల్లడించాలని ప్రశ్నించారు. తనపై ఉన్న కేసులు, అవినీతి ఆరోపణల నుంచి కాపాడాలని బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకోవడానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు చేశారని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. 60 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టినా ఆరు చిల్లర పైసలు కూడా తేలేని చేతగాని రేవంత్ రెడ్డి ఉండడం దౌర్భాగ్యం అని అసహనం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చేపట్టిన ఢిల్లీ టూర్లన్నీ రాహుల్ గాంధీకి మూటలు మూసేందుకు, తన సొంత ప్రయోజనాల కోసం, రాజకీయాల కోసం, తాను చేసిన కుంభకోణాలపై విచారణ చేయకుండా బీజేపీ నేతల వద్దకు వెళ్లడమే తప్ప తెలంగాణ హక్కుల కోసం గట్టి పోరాటం చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. 

తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించని కేంద్ర బడ్జెట్‌పై బీజేపీ నాయకులు కూడా ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్‌ కోరారు. ఇద్దరు కేంద్ర మంత్రులున్నా తెలంగాణ పక్షాన కనీసం గొంతెత్తి అడగకపోవడంతోనే చిల్లిగవ్వ కూడా కేంద్ర బడ్జెట్లో దక్కలేదని కేటీఆర్‌ వాపోయారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని వివక్షతో చూస్తోందని గుర్తుచేశారు. తెలంగాణ నుంచి గెలిచిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం, ఈ బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
Advertisement
Back to top