రైతులతో మంత్రి పొంగులేటి సమావేశమయ్యారు
Dhamsalapuram, Telangana:ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. డివిజన్లో వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 37 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మార్గమధ్యంలో మంత్రి రైతు కూలీలను కలుసుకుని వారి కష్టాలు. ఎలాంటి ధాన్యం వేస్తున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ప్రజాపరిపాలనపై ఆరా తీశారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Telangana: జైళ్ల సంస్కరణల్లో తెలంగాణ నంబర్ 1.. దేశంలోనే టాప్ ర్యాంక్ సాధించిన మన రాష్ట్రం..!!
Secunderabad, Telangana:Telangana: 2024 సంవత్సరానికి సంబంధించిన ఎన్సిఆర్బి జైలు గణాంకాలు, జైలు సంస్కరణలు, ఖైదీల పునరావాసం, జైలు పరిశ్రమ అభివృద్ధిలో తెలంగాణను అగ్రశ్రేణి పనితీరు కనబరిచిన రాష్ట్రాల సరసన నిలిపాయి. దిద్దుబాటు పరిపాలనకు సంబంధించిన అనేక జాతీయ విభాగాలలో రాష్ట్రం కనబరిచిన బలమైన పనితీరును ఈ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. ఎన్సిఆర్బి నివేదిక ప్రకారం.. జైలు ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల అమ్మకాలలో తెలంగాణ భారతదేశంలో మూడవ స్థానాన్ని పొందింది. 2024లో ఈ రాష్ట్రం రూ. 43.65 కోట్ల విలువైన జైలు ఉత్పత్తుల అమ్మకాలను నమోదు చేసి, కేరళ.. తమిళనాడుల తర్వాతి స్థానంలో నిలిచింది.
తెలంగాణలోని జైలు పరిశ్రమలు ఏళ్లుగా గణనీయంగా విస్తరించాయని.. ఇవి ఖైదీలకు వృత్తి నైపుణ్యాలు నేర్చుకోవడానికి, విడుదలయ్యాక పునరావాస అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రతి ఖైదీకి రూ. 64,356 ఉత్పత్తి అవుతూ.. సగటు ఉత్పత్తి విలువలో తెలంగాణ జాతీయంగా రెండవ స్థానంలో ఉందని కూడా ఆ నివేదిక పేర్కొంది.ఖైదీల విద్యా కార్యక్రమాలలో కూడా రాష్ట్రం అద్భుతమైన పనితీరును కనబరిచింది. ఈ సంవత్సరంలో సుమారు 3,338 మంది ఖైదీలు ప్రాథమిక విద్యను అభ్యసించి, ఖైదీల విద్యా కార్యక్రమాలలో తెలంగాణ దేశంలో నాల్గవ స్థానంలో నిలిచింది. పునరావాస చర్యలలో, తెలంగాణ తమిళనాడు తర్వాత రెండవ స్థానాన్ని దక్కించుకుంది. శిక్షాకాలం పూర్తి చేసుకున్న ఖైదీలు సమాజంలో తిరిగి కలిసిపోయేందుకు సహాయపడే ప్రయత్నాలలో భాగంగా, అధికారులు 2024 సంవత్సరంలో 244 మంది ఖైదీలకు పునరావాస సహాయాన్ని అందించారు.
ఇక శిక్షాకాలం పూర్తి చేసుకుని విడుదలైన ఖైదీల సంఖ్యలో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉందని ఎన్సిఆర్బి డేటా వెల్లడించింది. ఈ ఏడాది మొత్తం 9,956 మంది ఖైదీలు విడుదలయ్యారు. అదే సమయంలో, ఈ నివేదిక కొన్ని ఆందోళనకరమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది. నేరాన్ని వృత్తిగా స్వీకరించినట్లు నివేదించిన శిక్షపడిన ఖైదీల శాతం అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. ఈ శాతం 4.4 శాతంతో ఇది జాతీయంగా మూడవ స్థానంలో నిలిచింది.
Also Read: 22నిమిషాల్లో మునీర్ తుస్సుమన్నది.. రఫేల్, బ్రహ్మోస్ దెబ్బకు పాక్ సుస్సుపోసుకుంది
శిక్ష పడిన ఖైదీలలో జీవిత ఖైదు అనుభవిస్తున్న వారి శాతంలో తెలంగాణ రెండవ స్థానంలో ఉందని.. ఇక్కడ 71.8 శాతం మంది దోషులు జీవిత ఖైదు అనుభవిస్తున్నారని కూడా ఈ నివేదిక వెల్లడించింది. మహిళా జైళ్లలో, 107 మంది శిక్ష పడిన మహిళా ఖైదీలతో ఈ రాష్ట్రం జాతీయ స్థాయిలో నాల్గవ స్థానంలో నిలిచింది. కేవలం శిక్షా కేంద్రాలుగా కాకుండా, జైళ్లను విద్య, సామాజిక పునరేకీకరణ కేంద్రాలుగా మార్చే లక్ష్యంతో, తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు సంస్కరణలు, నైపుణ్యాభివృద్ధి.. పునరావాస కార్యక్రమాలపై పెరుగుతున్న దృష్టిని ఈ తాజా ర్యాంకింగ్లు ప్రతిబింబిస్తున్నాయని అధికారులు, జైలు సంస్కరణల నిపుణులు తెలిపారు.
Also Read: పసిడి ధరలు 20శాతం డౌన్.. నేడు మే 8వ తేదీ ధరలివే..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
NTR Dragon Movie Update: ఎన్టీఆర్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్..ప్రశాంత్ నీల్ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్..
Hyderabad, Telangana:NTR Dragon Movie Glimpse: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న 'డ్రాగన్' చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కాబోతున్న గ్లింప్స్ కోసం చిత్ర బృందం అహర్నిశలు శ్రమిస్తోంది. ఈ వీడియో గ్లింప్స్ను అనుకున్న టైమ్కు ఫ్యాన్స్కు అందించాలని టీమ్ ఎంతోగానో కృషి చేస్తోంది.
మ్యూజిక్పై రవి బస్రూర్ ఫోకస్
ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్లకు సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో 'కేజీఎఫ్', 'సలార్' చిత్రాలతోనే రుజువైంది. ఇప్పుడు 'డ్రాగన్' గ్లింప్స్ కోసం ఆయన గత మూడు రోజులుగా ఏకధాటిగా వర్క్ చేస్తున్నారు. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్కు తగ్గట్టుగా, వినేటప్పుడు వెన్నులో వణుకు పుట్టించేలా ఒక పవర్ఫుల్ అండ్ యూనిక్ సౌండ్ ట్రాక్ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిన్న గ్లింప్స్ను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన గత చిత్రాల టీజర్ల రికార్డులను తిరగరాసేలా దీనిని రూపొందించారట. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, సినిమా బ్యాక్ డ్రాప్ను పరిచయం చేస్తూనే ఎన్టీఆర్ లుక్ను వెరీ పవర్ఫుల్గా ప్రెజెంట్ చేయబోతున్నారని సమాచారం.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో Jr.ఎన్టీఆర్ ప్రధానపాత్ర పోషిస్తుండగా.. రుక్మిణి వసంత హీరోయిన్గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ గ్లింప్స్ ను ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20వ తేదీన విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే #Dragon అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ను ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.
Also Read: TVK Vijay Oath: సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారంపై వీడని సందిగ్ధత..కుర్చీలాటలో గెలుపు ఎవరిది?
Also Read: విజయ్ టీవీకే పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది? రాజ్యాంగం ఏంచెప్తుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Giant Python Video: భారీ కొండచిలువపై పిల్లల సవారీ.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే! వీడియో..
Hyderabad, Telangana:Giant Python Viral Video Watch: సాధారణంగా పాము కనిపిస్తేనే ఆమడ దూరం పరుగులు తీస్తూ ఉంటారు. అలాంటిది తొమ్మిది గజాల భారీ కొండచిలువ కనిపిస్తే.. గుండె ఆగిపోయినంత పనవుతుంది. కానీ కొందరు పిల్లలు మాత్రం ఆ రాకాసి కొండచిలువ పామును బొమ్మల భావించి.. దాని వీపుపై కూర్చుని ఆడుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ భయంకరమైన దృశ్యాలు చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ వీడియోలో.. ఒక భారీ పరిమాణంలో ఉన్న కొండచిలువ జనాభాసాల మధ్య చాలా నిమ్మలంగా పాక్కుంటూ వెళ్తోంది.. అది ఎంతటి ప్రమాదమైనదో తెలియని చిన్నారులు.. దాన్ని ఒక ఆట వస్తువుగా భావించారు.. ఆ కొండచిలువపై ముగ్గురు నుంచి నలుగురు పిల్లలు ఒకరి వెనక ఒకరు కూర్చొని రైలు బండి ఆట ఆడుతున్నారు. ఆ పాము కదులుతుంటే.. తమ ప్రయాణం చేస్తున్నామన్న ఆనందం వారి ముఖాల్లో కనిపిస్తోంది.. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలే ఊహించని స్థాయిలో వైరల్ అవుతున్నాయి.
ఆ కొండచిలువ తల ఎత్తితే ఒక దెబ్బకు మనిషిని మింగేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అది ఏ క్షణమైనా తిరగబడే అవకాశం ఉన్నప్పటికీ.. పిల్లలు ఏమాత్రం భయం లేకుండా దానితో ఆడుకోవడం చూస్తుంటే సోషల్ మీడియా వినియోగదారులు ఊపిరి దిగబట్టుకుంటున్నారు. చుట్టుపక్కల ఉన్న పెద్దలు కూడా వారిని ఆపకుండా వీడియో తీయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా అక్కడున్న ఒక పెద్దాయన ఆ పిల్లలను ప్రోత్సహిస్తూ ఉండడం కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
ఈ వీడియో చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇది ధైర్యం కాదు.. నిర్లక్ష్యం.. ఒక్క సెకను తేడా జరిగిన ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి.. అని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ వీడియోను ఎక్కడ చిత్రీకరించారో స్పష్టంగా తెలియనప్పటికీ.. ప్రస్తుతం ఇది అన్ని సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇక ఇది చూసిన మరి కొంతమంది వన్యప్రాణులతో ఇలాంటి ప్రయోగాలు ప్రాణాపాయమని హెచ్చరిస్తూ వస్తున్నారు. ఏది ఏమైనా ఆ భారీ కొండచిలువ పిల్లలకు ఎలాంటి హాని తల పెట్టకపోవడంతో అందరూ ఊపిరిపించుకున్నారు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Vemulawada: పాడి కౌశిక్ రెడ్డిపై దాడికి నిరసనగా.. వేములవాడ BRS భారీ ధర్నా!
Nampalli, Vemulawada, Telangana:Brs Protest Vemulawada Telugu News: తెలంగాణ రాష్ట్రంలోని BRS నాయకుల పై వరసగా జరుగుతున్న దాడులను నిరసిస్తూ గులాబీ శ్రేణులు ప్రత్యేకమైన ముట్టడి కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగర్ లోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై జరిగిన దాడిని ఖండిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని టిఆర్ఎస్ నాయకులతో పాటు కార్యకర్తలు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో BRS నాయకులపై జరుగుతున్న దాడులను ఖండించారు.
వేములవాడలోని ప్రధాన కూడలి అయిన తెలంగాణ చౌకు వద్ద BRS ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి గుండాల్లారా ఖబర్దార్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం తెలంగాణ చౌక్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంలో పాడి కౌశిక్ రెడ్డి పై జరిగిన దాడిని వారు తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం దాడి మాత్రమే కాదని ఆయనను చంపేందుకు జరిగిన కుట్ర అని నేతలు ఆరోపించారు..
ఈ సందర్భంగా BRS నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని విమర్శించారు. ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడికి రక్షణ లేకపోతే.. సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ బిజెపిలో కుమ్మక్కై బీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.. కేంద్రమంత్రి, స్థానిక ఎంపీ బండి సంజయ్ పై BRS నేతలతో పాటు కార్యకర్తలు తీవ్ర విమర్శలు చేశారు. కరీంనగర్ నడిబొడ్డున గంతో దొంగతనాలు జరుగుతున్న కేంద్రమంత్రి పట్టించుకోవడంలేదని.. పైగా రౌడి రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ చర్చలు అభివృద్ధిపై జరగాలి తప్ప.. భౌతిక దాడులకు దిగడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని హెచ్చరించారు..
Also Read: BRS వర్సెస్ BJP.. కరీంనగర్లో భారీగా పోలీసుల మోహరింపు!
అంతేకాకుండా పాడి కౌశిక్ రెడ్డి వాహనంతో పాటు క్యాంపు కార్యాలయం పై జరిగిన దాడికి బాధ్యులు బహిరంగ క్షమాపణలు చెప్పాలని.. BRS నాయకురాలు పావని గౌడ్ పై దాడికి ప్రయత్నించిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని.. ప్రతిపక్ష నాయకులకు రక్షణ కల్పించడంలో వైఫల్యానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.. శాంతియుత తెలంగాణలో హింసకు తావు లేదని.. దాడులు కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని వేములవాడ BRS శ్రేణులు హెచ్చరించారు.
Also Read: BRS వర్సెస్ BJP.. కరీంనగర్లో భారీగా పోలీసుల మోహరింపు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
TVK MLA Resign: విజయ్ టీవీకే పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది? భారత రాజ్యాంగం ఏం చెబుతోంది?
Nagalapuram, Tamil Nadu:TVK MLA Resignation: తమిళనాడు రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక అపూర్వమైన రాజ్యాంగ సంక్షోభానికి తెరలేపాయి. నటుడు విజయ్ని తమిళగ వెట్రి కజగం (TVK) 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించడానికి, స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో రాష్ట్రంలో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో TVK ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామా హెచ్చరికలు, డీఎంకే-అన్నాడీఎంకే పొత్తు వార్తలు చర్చనీయాంశంగా మారాయి.
ప్రస్తుత బలాలు - మ్యాజిక్ ఫిగర్
తమిళనాడు అసెంబ్లీలో మొత్తం స్థానాలు 234 ఉండగా.. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన మ్యాజిక్ మార్క్ 118 స్థానాల్లో అధికారం చేయాల్సిన పార్టీ నెగ్గాల్సి ఉంది. అయితే విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి 107 స్థానాల్లో గెలుపు వరించింది. కానీ, అధికారానికి మరో 11 సీట్ల మద్దతు కావాల్సి ఉంది.
మరోవైవు డీఎంకే కూటమికి 73 సీట్లు రాగా.. అన్నాడీఎంకే కూటమి 53 స్థానాల్లో గెలుపొందింది. ఒకవేళ బద్ధశత్రువులైన డీఎంకే, అన్నాడీఎంకే కలిస్తే వారి బలం 126కి చేరుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ టీవీకేకి మద్దతు ఇస్తున్న క్రమంలో కాంగ్రెస్కు దక్కిన 5 సీట్లను మినహాయిస్తే.. ఆ కూటమి మెజారిటీ 121కి చేరుతుంది. ఒకవేళ డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. విజయ్ TVK పార్టీ ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి ఉంది.
టీవీకే 'రాజీనామా' అస్త్రం..
గవర్నర్ తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోతే 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని టీవీకే వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే పరిణామాలు ఇలా ఉండవచ్చు. 107 మంది ఒకేసారి రాజీనామా చేస్తే, అసెంబ్లీలో సభ్యుల సంఖ్య భారీగా తగ్గుతుంది. ఇది సంక్షోభానికి (రాజ్యాంగ విచ్ఛిన్నం) దారి తీస్తుంది.
ఆర్టికల్ 356 (రాష్ట్రపతి పాలన)
ఏ పార్టీ కూడా స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పక్షంలో, గవర్నర్ నివేదిక ప్రకారం రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ టీవీకే పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే, సభను రద్దు చేసి ఆరు నెలల లోపు ఎన్నికలకు మళ్లీ వెళ్లడమే ఏకైక మార్గం. గతంలో కర్ణాటకలోనూ ఇలాంటి పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. మెజారిటీని రాజ్భవన్లో కాకుండా అసెంబ్లీలోనే (ఫ్లోర్ టెస్ట్) నిరూపించుకోవాలి. కాబట్టి గవర్నర్ ముందుగా అతిపెద్ద పార్టీని ఆహ్వానించే అవకాశం ఉంటుంది.
మరోవైపు డీఎంకే అధినేత ఎం.కే.స్టాలిన్ అనూహ్యంగా విజయ్కు అవకాశం ఇచ్చే సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది. అదేవిధంగా అన్నాడీఎంకేకు చెందిన సుమారు 25 మంది ఎమ్మెల్యేలు విజయ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇది జరిగితే టీవీకే సులభంగా మెజారిటీ సాధిస్తుంది. అలాగే కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖులు విజయ్కు మద్దతు తెలపడం TVK నైతిక బలాన్ని పెంచింది.
చివరిగా ఒక్క ముక్కలో చెప్పాలంటే.. రాజ్యాంగం ప్రకారం అతిపెద్ద పార్టీగా ఉన్న విజయ్ టీవీకే పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించి, సభలో మెజారిటీ నిరూపించుకోమని కోరే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ తెరవెనుక రాజకీయాలతో డీఎంకే-అన్నాడీఎంకే జట్టు కడితే మాత్రం, తమిళనాడు మరోసారి మధ్యంతర ఎన్నికల దిశగా వెళ్లే ప్రమాదం ఉంది. 2026 మే నాటికి అందుతున్న సమాచారం ప్రకారం.. రాజీనామా హెచ్చరికలు కేవలం రాజకీయ ఒత్తిడి పెంచడానికే అని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతిమంగా ప్రజా తీర్పును గౌరవిస్తూ స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలని తమిళ ప్రజలు కోరుకుంటున్నారు.
Also REad: TVK Vijay Oath: సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారంపై వీడని సందిగ్ధత..కుర్చీలాటలో గెలుపు ఎవరిది?
Also Read: టీమ్ఇండియా కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ తొలగింపు!! కొత్త కెప్టెన్ అతనే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Python Video: మెడలో కొండచిలువతో బైక్ రైడ్.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!
Hyderabad, Telangana:Python Bike Ride Viral Video Watch: నేటి కాలంలో సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే పిచ్చి యువతను ప్రమాదకరమైన దారుల వైపు నడిపిస్తూ వస్తోంది. లైకులతో పాటు షేర్ల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు వెనకాడడం లేదు.. తాజాగా ఒక యువకుడు చేసిన పని చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక తప్పదు.. అత్యంత ప్రమాదకరమైన కొండచిలువ ను మోడలో వేసుకొని.. దర్జాగా బైక్ నడుపుతూ రోడ్డుపై వెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి..
సాధారణంగా పాము కనిపిస్తేనే ఆమడ దూరం పరిగెత్తే.. ఈరోజుల్లో ఒక యువకుడు మాత్రం ఏకంగా ఒక కొండచిలువ పిల్లను తన మెడలో ఒక గొలుసులాగా వేసుకున్నాడు. అలా వేసుకోవడమే కాకుండా రద్దీగా ఉన్న రహదారిపై మోటార్ సైకిల్ ను వేగంగా నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఆ పాము అతని మెడ చుట్టూ కదులుతున్న.. ఏమాత్రం భయం లేకుండా స్వేచ్ఛగా బైకు నడపడం చూసి అటు వెళ్తున్న ప్రయాణికులు సైతం షాక్ అయిపోవడం మీరు చూడొచ్చు..
అదే సమయంలో కారులో వెళుతున్న కొందరు వ్యక్తులు ఈ వింత దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే తమ స్మార్ట్ఫోన్స్ను తీసి ఆ యువకుడి సాహసాన్ని వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్దీ సేపటికే వైరల్ అవ్వడం ప్రారంభమైంది. అంతేకాకుండా లక్షలాది వ్యూస్తో ట్రెండింగ్లోకి వచ్చింది. పోస్ట్ చేసిన కొద్ది రోజులకు ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతూ వచ్చింది. అయితే ఈ వీడియోను చూసి సోషల్ మీడియా వినియోగదారులు సైతం తీవ్రంగా స్పందిస్తూ వస్తున్నారు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
ఇది సాహసం కాదు.. ఆత్మహత్యతో సమానం.. ఒకవేళ ఆ పాము ఒక్కసారిగా బిగిస్తే పరిస్థితి ఏంటి? అని ఒకరు కామెంట్ చేయగా.. ఇలాంటి వారి వల్ల రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులకు కూడా ప్రమాదమే అని మరికొందరు మండిపడుతున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కొండచిలువలను పట్టుకోవడంతోపాటు వాటిని వేధించడం, ప్రదర్శించడం కూడా చాలా నేరం.. అడవిలో ఉండాల్సిన మూగజీవాలను ఇలా రోడ్లపైకి తీసుకురావడం అటు పాముకు.. ఇటు ప్రజలకు ప్రమాదకరమని జంతువు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా ఈ వీడియోను ఆధారంగా తీసుకొని సదరు యువకుడి పై కేసు నమోదు చేయాలని సోషల్ మీడియా వినియోగదారులు సైతం అంటున్నారు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Team India T20 Captain: టీమ్ఇండియా కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ తొలగింపు!! కొత్త కెప్టెన్ అతనే!
Hyderabad, Telangana:Shreyas Iyer T20 Captain: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జాతీయ టీ20 జట్టులో కీలక నాయకత్వ మార్పుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో 2026 టీ20 ప్రపంచకప్ టైటిల్ టీమ్ఇండియా గెలిచినా.. తాజాగా ఐపీఎల్లో తాను ఫామ్ కోల్పోవడం వల్ల అతడ్ని ఆ బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సీనియర్ ఆటగాడు ఇటీవల బ్యాటింగ్లో విఫలమవుతుండటంతో సెలక్షన్ కమిటీ ఆందోళన చెందుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
జాతీయ మీడియా నివేదిక ప్రకారం.. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, సూర్యకుమార్ ఇటీవల పరుగులు చేయకపోవడంతో అతడ్ని పక్కకి పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అతడి స్థానంలో టీ20 జట్టుకు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 తర్వాత జరిగే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు అతడిని కెప్టెన్గా చేసే అవకాశం కూడా ఉంది.
మరోవైపు సూర్యకుమార్ యాదవ్కు కెప్టెన్గా అద్భుతమైన రికార్డు ఉన్నప్పటికీ.. వ్యక్తిగత ప్రదర్శన క్షీణించింది. ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున పది మ్యాచ్లలో అతను కేవలం 195 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అదే విధంగా ఈ టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ మణికట్టు సమస్యతో బాధపడుతున్నట్లు.. అసౌకర్యంగా బ్యాటింగ్ చేస్తున్నట్లు నివేదికలు తెలిపాయి.
ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ ఫామ్లో ఉండడం సహా కెప్టెన్గానూ రాణిస్తుండడం వల్ల అతడ్ని టీ20 జట్టులోకి తీసుకొనే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పంజాబ్ కింగ్స్ ఆడిన తొలి ఏడు మ్యాచ్లలో ఆరు విజయాలు సాధించడంలో జట్టుకు నాయకత్వం వహించి, తొమ్మిది ఇన్నింగ్స్లలో 333 పరుగులు సాధించాడు.
అయితే ఈసారి టీ20 జట్టులోకి కొత్తదనాన్ని తీసుకురావాలని సెలెక్టర్లు చూస్తున్న తరుణంలో, అయ్యర్ నాయకత్వ లక్షణాలు, ఇటీవలి నిలకడ అతడిని ఆ పదవికి ప్రధాన పోటీదారుగా నిలిపాయని సమాచారం. కానీ, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి టీమ్ఇండియా ఒక్క టీ20ఐ సిరీస్లో కూడా ఓడిపోకపోవడం ఒక ఆసక్తికరమైన పరిస్థితిగా మిగిలిపోయింది. అయితే, ఇప్పుడు కేవలం బ్యాటర్గా అతని స్థానమే పరిశీలనలో ఉంది.
మరోవైపు, శ్రేయస్ అయ్యర్ డిసెంబర్ 2023 నుండి ఏ T20I మ్యాచ్లోనూ ఆడలేదు. ఈ భారీ మార్పు రాబోయే 2028 ఒలింపిక్ క్రీడలపై ప్రభావం ఉంటుందని బీసీసీఐ సెలెక్షన్ టీమ్ భావిస్తుంది.
Also Read: మమతా బెనర్జీకి గవర్నర్ షాక్..సీఎంగా రాజీనామా చేయలేదని ప్రభుత్వాన్ని రద్దు చేశారు!
Also Read: వాహనదారులకు గట్టిదెబ్బ..పెండింగ్ చలాన్లు 45 రోజుల్లో చెల్లించకపోతే లైసెన్స్ రద్దు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Lakshmi Narayana Rajayoga: వ్యాపారం, ఉద్యోగాల్లో కాసుల వర్షం.. లక్ష్మీ నారాయణ రాజయోగంతో ఈ రాశుల వారికి పండగే!
Hyderabad, Telangana:Lakshmi Narayana Rajayoga May 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు అవేలికలు మానవ జీవితాలపై ఊహించని ప్రభావాలను చూపుతాయని మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో 2026 సంవత్సరం మే నెలలో అత్యంత శక్తివంతమైన గ్రహాల కదలికల కారణంగా ఎంతో ప్రత్యేకమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడబోతోంది. మే 14వ తేదీన శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశించగా.. మే 29వ తేదీన బుధుడు కూడా అదే రాశిలోకి చేరుకోబోతున్నాడు. దీని కారణంగా ఈ రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక జరుగుతుంది.
ఏవైనా రెండు గ్రహాల కలయిక జరిగితే తప్పకుండా ఏదో ఒక రాజయోగం ఏర్పడుతుంది. అయితే మే 29వ తేదీన జరిగే శుక్ర, బుధ గ్రహాల కలయిక కారణంగా ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో నాలుగు రాశుల వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా జీవితంలో ఎప్పుడు పొందలేని డబ్బు పొందే అవకాశాలున్నాయి.
ఈ రాశులవారికి బంపర్ బెనిఫిట్స్:
మిథున రాశి
ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడడం కారణంగా మిథున రాశి వారికి అత్యధిక ప్రయోజనాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా వీరికి చేపట్టిన ప్రతి పని అదృష్టం తోడై విజయవంతం అవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా పెండింగ్లో ఉన్న ప్రతి పని ఎంతో సులభంగా పూర్తవుతాయి. అలాగే తండ్రి నుంచి వచ్చి ఆస్తులు కూడా భారీ మొత్తంలో పొందే అవకాశాలున్నాయి. దీంతోపాటు కొత్త ఒప్పందాలు కలిసి వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
కన్యారాశి
కన్యారాశిలో జన్మించిన వ్యక్తులకు పదవ స్థానంలో ఈ రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల కార్యాలయాల్లో పనికి తగ్గ ప్రశంసలు లభిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే కష్టానికి తగిన ప్రతిఫలం కూడా ఎంతో సులభంగా లభించబోతోంది. సామాజికంగా గౌరవ మర్యాదలు కూడా విపరీతంగా పెరుగుతాయి. రాజకీయ రంగాల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు కూడా లభించబోతోంది. ఉన్నత అధికారుల సపోర్టుతో కీలకమైన బాధ్యతను స్వీకరిస్తారు.
తులారాశి
ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగ ప్రభావంతో తులారాశి వారికి మే చివరి వారం నుంచి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా ఉన్న మానసిక ఒత్తిడి నుంచి సులభంగా ఉపశమనం కలగబోతోంది. పూర్వికులు ఆస్తులు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారి విద్యార్థుల కల నెరవేరబోతోంది. అంతేకాకుండా ఉన్నత విద్య కోసం లోన్లు తీసుకునే వారికి ఈ సమయంలో మంచి లాభాలు కలిగే అవకాశాలున్నాయి. అలాగే తీర్థయాత్రల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగంతో ఈ సమయం ఎంతో అద్భుతంగా కలిసి రాబోతోంది. వైవాహికంగా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు జీవిత భాగస్వామితో ఉన్న మనస్పార్దాలు కూడా ఎంతో సులభంగా పరిష్కారం కాబోతున్నాయి. దీని కారణంగా బంధం మరింత మెరుగుపడే అవకాశాలున్నాయి. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమాజంలో పరపతి తో పాటు గౌరవం కూడా విపరీతంగా పెరుగుతుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Operation Sindoor: శత్రువుల స్థావరాల్లోకి దూరి కొడతాం.. ఆపరేషన్ సింధూర్ వార్షికోత్సవంలో లెఫ్టినెంట్ జనరల్..
Hyderabad, Telangana:Operation Sindoor Latest Telugu News: గతేడాది సరిహద్దుల అవతల ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి పాకిస్థాన్ ప్రచారం చేస్తున్న అబద్ధాలపై మాజీ డిజిఎంఓ (DGMO) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ మొదట వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాక్ ఆరోపణలను ఆధారాలతో తిప్పి కొట్టారు. అంతేకాకుండా ఆయన వివిధ అంశాలపై మీడియాతో మాట్లాడారు..
ఆపరేషన్ సమయంలో భారత్ ఏమాత్రం నష్టపోలేదని.. పాకిస్తాన్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నిరాధారమైన వీడియోలతో పాటు కథనాలను సృష్టించిందని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ ముగిసిన వెంటనే ఆధారాలను మీడియాకు అందజేశామని.. పాకిస్తాన్ వద్ద నిజంగా ఏదైనా సాక్ష్యం ఉంటే ప్రపంచానికి ఎందుకు చూపించలేక పోయిందని?..ఘాయ్ ప్రశ్నించారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం పాకిస్తాన్ కు అలవాటుగా మారిందని ఆయన అన్నారు..
ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాదని.. ఉగ్రవాదంపై భారత్ ఉక్కు పాదం మోపడానికి వచ్చిన పెను మార్పుని లెఫ్టినెంట్ జనరల్ పేర్కొన్నారు. భారత వాయుసేన ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్లోని 11 ఎయిర్ ఫీల్డ్లను, 9 ప్రధాన ఉగ్రవాద శిబిరాలను విజయవంతంగా ధ్వంసం చేసిందని ఆయన వివరించారు. ఈ దాడుల్లో వందమందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారని.. భారత సైనిక ఆస్తులకు ఎలాంటి నష్టం జరగలేదని ఆయన వెల్లడించారు.
Also Read: Bengal Governor: మమతకు బిగ్ షాక్.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్..
కవి దుష్యంత్ కుమార్ కవితలను గుర్తు చేసుకుంటూ.. కేవలం కలకలం రేపడం నా ఉద్దేశం కాదు.. ఈ పరిస్థితిని మార్చడమే నా ప్రయత్నం.. అని ఆయన అన్నారు. ఆపరేషన్ సింధూర్ అనేది ఒక ముగింపు కాదని... ఉగ్రవాదంపై భారత్ పోరాటంలో ఇది ఒక ఆరంభం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. స్వదేశీ రక్షణ వ్యవస్థలను వినియోగం ఈ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించిందని.. ఇది సైన్యం శక్తి రెట్టింపు చేసిందని ఆయన అన్నారు.
భారత సార్వభౌమాధికారంతోపాటు భద్రతను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఘాయ్ హెచ్చరించారు.. ఉగ్రవాదులకు ఇకపై ఎక్కడ సురక్షిత స్థావరాలు ఉండవని.. అవసరమైతే శత్రువుల స్థావరాల్లోకి చొరబడి దాడులు చేయడానికి భారతీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అంతేకాకుండా మీడియాతో ఆయన ఎన్నో అంశాలను కూడా మాట్లాడినట్లు సమాచారం..
Also Read: Bengal Governor: మమతకు బిగ్ షాక్.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
LSG vs RCB: హ్యాట్రిక్ ఓటముల నుంచి లక్నోకు భారీ ఊరట.. కీలక మ్యాచ్లో బెంగళూరు బోల్తా
Lucknow, Uttar Pradesh:LSG vs RCB Highlights: ఓటముల్లో రికార్డులు నమోదు చేసిన లక్నో సూపర్ జియాంట్స్ అద్భుతం చేసింది. టాప్లో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్ ఇచ్చింది. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన పంత్ సేన మ్యాచ్ను సొంతం చేసుకుని వరుస ఓటములకు బ్రేక్ ఇచ్చింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో బెంగళూరు తీవ్రంగా శ్రమించినా ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. 9 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించి హ్యాట్రిక్ ఓటముల నుంచి ఊరట పొందింది.
Also Read: Telangana Rains: తెలంగాణ జిల్లాల్లో వర్ష బీభత్సం.. పంట నష్టంతో రైతుల కన్నీటిపర్యంతం
పలుమార్లు వర్షం అంతరాయంతో ఆలస్యంగా జరిగిన ఈ మ్యాచ్ను 19 ఓవర్లకు కుదించగా.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జియాంట్స్ 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ అద్భుతమైన సెంచరీతో అద్భుతం చేయగా.. అర్షిన్ కులకర్ణి 17 పరుగులు నమోదు చేశాడు. వర్షం పడినా.. పిచ్ ఎలా మారినా కూడా మార్ష్ మాత్రం చెలరేగి ఆడాడు. 56 బంతుల్లో 111 పరుగులు చేసి దుమ్మురేపగా.. వాటిలో 9 బౌండరీలు, 9 సిక్సర్లు బాదాడు. నికోలస్ పూరన్ 38, కెప్టెన్ రిషబ్ పంత్ 32 పరుగులతో రాణించి ప్రత్యర్థికి భారీ స్కోర్ను లక్ష్యం విధించారు. లక్నో స్కోర్ను కట్టడి చేయడంలో బెంగళూరు బౌలర్లు కొంత తడబడ్డారు. జోష్ హేజిల్వుడ్, కృనాల్ పాండ్యా, రసీక్ సలామ్ తలా ఒక్కో వికెట్ తీయగా.. మిగతా బౌలర్లు వికెట్ పడగొట్టడంలో విఫలమయ్యారు.
Also Read: Telangana Rains: తెలంగాణ జిల్లాల్లో వర్ష బీభత్సం.. పంట నష్టంతో రైతుల కన్నీటిపర్యంతం
టాపార్డర్ చేతులెత్తేసిన వేళ మిడిలార్డర్ గొప్పగా పోరాడంతో 19 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయిన బెంగళూరు 7 పరుగుల స్వల్ప తేడాతో మ్యాచ్ను చేజార్చుకుంది. జాకోబ్ బెతెల్ 4 పరుగులకు ఔటవగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డకౌట్ అవడంతో బెంగళూరు కష్టాల్లో పడింది. ఓపెనర్లు వెనుదిరిగిన వేళ దేవదత్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటిదార్ అద్భుతంగా ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. పడిక్కల్ 34 పరుగులతో రాణించగా.. రజత్ 31 బంతుల్లో 61 స్కోర్ చేసి సత్తా చాటాడు. జితేశ్ శర్మ ఒక్క పరుగు మాత్రమే చేయగా.. టిమ్ డేవిడ్ గొప్పగా పోరాడి 40 పరుగులు తీశాడు. విజయం కోసం కృనాల్ పాండ్యా (28*), రొమారియో షెఫర్డ్ (23*) ఆఖరి బంతి వరకు పోరాటం చేశారు. ఒక దశలో గెలిచేస్తారనుకున్న సమయంలో బౌలర్లు కట్టడి చేయడంతో పరుగులు రాలేకపోయాయి. ఫలితంగా బెంగళూరు మ్యాచ్ను కోల్పోవాల్సి వచ్చింది. లక్నో బౌలర్లు ప్రారంభంలో అద్భుతంగా బౌలింగ్ చేయగా.. తర్వాత దాన్ని కొనసాగించలేకపోయారు.యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్ అద్బుతంగా బంతులు వేసి కీలకమైన మూడు వికెట్లు తీశాడు. షాబాజ్ అహ్మద్ రెండు వికెట్లతో సత్తా చాటగా.. సీనియర్ బౌలర్ షమీ ఒక వికెట్ తీశాడు. వరుస వికెట్లు తీసిన అనంతరం మిగతా వికెట్లు తీయడంలో తడబడడమే కాకుండా స్కోర్ను కూడా నియంత్రించలేకపోయారు. ఫలితంగా ఓవర్లన్నీ ముగిసేవరకు మ్యాచ్ ఫలితం దోబుచులాడింది. కానీ ఆఖరి బంతికి ఊరటనిచ్చేలా మ్యాచ్ జరిగింది.
డబుల్ హ్యాట్రిక్ ఓటముల తర్వాత లక్నో సూపర్ జియాంట్స్ కీలక మ్యాచ్లో విజయం సాధించింది. పది మ్యాచ్లు ఆడిన లక్నో మూడు విజయాలు, 7 ఓటములు చవిచూసింది. బెంగళూరుతో మ్యాచ్లో గెలిచి రెండు పాయింట్లు ఖాతాలో వేసుకున్నా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలోనే లక్నో కొనసాగుతోంది. ఇక బెంగళూరు జట్టు వరుసగా రెండో ఓటమి సాధించగా.. ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడి ఆరు విజయాలు, నాలుగు ఓడిపోయింది. ఓడిపోయినా కూడా పాయింట్ల పట్టికలో టాప్ 3లోనే బెంగళూరు కొనసాగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్కు ఏడాది.. ఉదయం 1.05 గంటకు ఏం జరిగిందో తెలుసా?
Wadgaon, Maharashtra:Operation Sindoor Anniversary: భారత సైనికులను బలిగొన్న ప్రత్యర్థి పాకిస్థాన్కు బుద్ధి చెప్పడానికి అర్ధరాత్రి భారత సైన్యం భారీ వ్యూహం రచించింది. ప్రపంచం మొత్తం నిద్రపోతున్న వేళ భారత సైనిక దళాలు ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాయి. 7 మే 2025న ఆ రాత్రి శత్రు దేశానికి కాళరాత్రి.. మన దేశానికి శివరాత్రిగా మారింది. దేశ భద్రతకు సవాలు ఎదురైన సమయంలో సైన్యం సరిహద్దులో దాడులు చేసింది. ప్రత్యర్థి దేశానికి బుద్ధి చెప్పేందుకు విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ ఒక పదం కాదు పాకిస్తాన్కు ఊపిరి ఆడకుండా చేసిన ఒక దెబ్బ.
Also Read: AP Govt Jobs: నిరుద్యోగులకు భారీ గుడ్న్యూస్.. 3,220 ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటన
ఆపరేషన్ సింధూర్ వార్షికోత్సవం
ఏడాది కిందట భారత సైన్యం చేపట్టిన సైనిక చర్యకు ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేశారు. సరిహద్దుకు అవతలి వైపున ఉన్న ఉగ్రవాదులనే కాకుండా.. ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్న పాకిస్తానీ వ్యవస్థను కూడా కుదిపేసింది. అత్యంత కచ్చితమైన, పరిమితమైన సైనిక చర్య ద్వారా భారతదేశం పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దేశంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న ఉగ్రవాద స్థావరాలను కూల్చేసింది. ఆపరేషన్ సింధూర్ దెబ్బ ఎలా ఉందంటే పాకిస్థాన్ ఇప్పటివరకు కోలుకోలేకపోయింది. జాతీయ భద్రతకు భంగం కలిగితే సరిహద్దుకు అవతలి వైపు నుంచి కూడా దెబ్బతీయవచ్చని భారత సైన్యం ప్రపంచానికి చాటి చెప్పింది.
ఆపరేషన్ సింధూర్ ముఖ్యమైన అంశం ఏమిటంటే ఉగ్రవాద నెట్వర్క్ను, దానికి మద్దతు పలుకుతున్న వారి స్థావరాలను కూడా ప్రపంచం ముందు బహిర్గతం చేసింది. భారత సైన్యం చేపట్టిన ఈ వ్యూహాత్మక చర్యతో ఉగ్రవాదులకు, పాకిస్తాన్కు పెద్ద ఎదురుదెబ్బ. ఇది ఒక సైనిక చర్య మాత్రమే కాదు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం నూతన విధానానికి, మారిన వైఖరికి స్పష్టమైన సమాధానం.
Also Read: SRH Vs PBKS Highlights: పంజాబ్ హ్యాట్రిక్ ఓటమి.. అద్భుత విజయంతో టాప్లోకి సన్రైజర్స్
మే 7వ తేదీ రాత్రి ఉదయం.. 1.05 గంటలకు
భారతదేశ సరిహద్దు వెంబడి మే 7వ తేదీ రాత్రి 1:05 గంటలకు అకస్మాత్తుగా ఆందోళన మొదలైంది. తెల్లవారేసరికి శత్రు దేశంలో అలజడి మొదలైంది. అంతటా నిశ్శబ్దం ఆవరించిన సమయంలో శత్రు స్థావరాలలో భారతదేశ సైన్యం ప్రకంపనలు సృష్టించింది. ఆ రాత్రి ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో భద్రతా దళాలు, సైన్యం మాత్రం శత్రు దేశానికి బుద్ధి చెప్పే పనిలో నిమగ్నమైంది. తెల్లవారుజామున 1:05 గంటలకు ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది.
India’s resolute response calibrated and precise.
Committed to safeguarding sovereignty and its people.#JusticeServedJai Hind. pic.twitter.com/fegLXxMJjm
— ADG PI - INDIAN ARMY (@adgpi) May 7, 2026
సరిహద్దు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు ప్రతిధ్వనించాయి. శత్రువుకు అప్రమత్తమై ప్రతి దాడి చేసే సమయంలో కూడా భారత సైన్యం ఇవ్వలేదు. లక్ష్య నిర్ధారణ ఎంత కచ్చితంగా అంటే నిమిషాల వ్యవధిలోనే ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి. ఆఖరి క్షణం వరకు ఎవరికీ తెలియకుండా ఈ మొత్తం ఆపరేషన్ను అత్యంత రహస్యంగా జరిగింది. ఆ రాత్రి క్షిపణులు, ఆయుధాలు పూర్తి స్థాయిలో విజయవంతంగా పనిచేశాయి. శత్రు దేశం ప్రతిస్పందించేలోపు మొత్తం శత్రుమూకల స్థావరాలు నేలమట్టమయ్యాయి.
శత్రు దేశానికి కాళరాత్రి
మే 7వ తేదీ రాత్రి ఒక తేదీ మాత్రమే కాదు దేశ భద్రతకు సవాలు ఎదురైతే ఎలా బదులిస్తామో స్పష్టంగా ప్రపంచానికి చాటిచెప్పింది. శత్రు దేశాలకు ఒక స్పష్టమైన సందేశాన్ని పంపింది. ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగిన దాడి పాకిస్తాన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. యుద్ధం చేయకుండానే శత్రు దేశానికి తనదైన శైలిలో భారతదేశం బుద్ధి చెప్పింది. పహల్గామ్ దాడికి భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది.
88 గంటల పాటు బీభత్సం
నిశీధిలో భారత క్షిపణులు పాకిస్తాన్ ఆకాశాన్ని చీల్చుకుంటూ వెళ్లి ఉగ్రవాదుల స్థావరాలను విధ్వంసం చేశాయి. ఈ దాడులతో ఉగ్రవాదానికి శాశ్వత సమాధి భారత సైన్యం చేసింది. ఆపరేషన్ సింధూర్తో భారతదేశ శౌర్యగాథ స్వర్ణాక్షరాలతో లిఖించవచ్చు. ఆపరేషన్ సింధూర్ 88 గంటల పాటు కొనసాగింది. ఇజ్రాయెల్, రష్యా దేశాలు నెలల తరబడి యుద్ధాలు చేసినా కూడా కలిగించలేని నష్టాన్ని భారతదేశం పాకిస్థాన్కు 88 గంటల్లో చేసి చూపించిది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 కీలకమైన ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. జైష్-ఎ-మొహమ్మద్, లష్కర్-ఎ-తైబా ప్రధాన స్థావరాలు నేలమట్టమయ్యాయి. ఈ దాడిలో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం. పాకిస్థాన్లో కీలకమైన నూర్ ఖాన్, భోలారి వైమానిక స్థావరాలతో సహా 11 వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి.
కూలిన పాకిస్తానీ యుద్ధ విమానాలు
భారత దాడిలో కమాండ్ కంట్రోల్ సెంటర్లతో పాటు ఒక సీ30 హెర్క్యులస్ రవాణా విమానం, ఒక అత్యంత విలువైన అవాక్స్ (AWACS) విమానం ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్ గొప్పగా చెప్పుకునే షాహీన్, బాబర్ క్షిపణులను తన సుదర్శన్ చక్రతో కూల్చేసింది. ఒకవైపు ఉగ్రవాద స్థావరాలు తగలబడిపోతే.. మరోవైపు పాకిస్తాన్ సైనిక వైమానిక స్థావరాలు నేలమట్టమయ్యాయి. మౌలానా మసూద్ అజార్ మదర్సాలో నాలుగు పేలుళ్లు జరిగాయి.
మే 7న భారత్ పాకిస్థాన్లోని తొమ్మిది ప్రాంతాల్లో దాడులు
==> జైష్ ప్రధాన కార్యాలయం బహవల్పూర్లో ఉంది. లష్కర్ ప్రధాన కార్యాలయం మురిద్కేలో ఉంది.
==> సర్జల్లో జైష్ ప్రయోగ వేదిక
==> మెహమూనా జోయా, హిజ్బుల్ ముజాహిదీన్ శిక్షణా కేంద్రం
==> భిబర్లో లష్కర్ శిక్షణా శిబిరం
==> కోట్లిలోని జైష్ కేంద్రం
==> కోట్లిలోని హిజ్బుల్ శిక్షణా కేంద్రం
==> ముజఫరాబాద్లో లష్కరే శిబిరం, మర్కజ్
ఈ 7 ఉగ్రవాద స్థావరాల నుంచే భారతదేశంపై ఉగ్ర దాడులకు ప్రణాళికలు రచించారు. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి ఆ స్థావరాల నుంచే ఉగ్రవాదులు భారతదేశంపై దాడి చేయడానికి వచ్చారని భారత సైన్యం గుర్తించింది. ఆపరేషన్ సింధూర్తో వాటిపై యుద్ధం చేసింది. పహల్గామ్ దాడికి ఇది ప్రతీకార చర్య. ఆపరేషన్ సిందూర్ ప్రభావంతో మసూద్ స్థావరం కూలిపోయింది. ఉగ్రవాదులు ఎక్కడ పుట్టారో అక్కడే మరణించారు. ఆపరేషన్ సింధూర్ మసూద్ కుటుంబాన్నే తుదముట్టించింది. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడమే కాకుండా.. ఉగ్రవాద నెట్వర్క్ను కూల్చేసింది.
In moments that test a nation, courage is not spoken, it is demonstrated. A year since #OperationSindoor, and India stands united in strength, resolve and it's commitment to protect the nation and its citizens.
The operation reflects the courage of our forces, the preparedness… pic.twitter.com/OUkVUEeOma
— G Kishan Reddy (@kishanreddybjp) May 7, 2026
భారత సైన్యం శౌర్య గాథ
ఆపరేషన్ సింధూర్లో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియల ఊరేగింపులు జరిగినప్పుడు పాకిస్తాన్ సైన్యం స్వయంగా పాల్గొని పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఎలా ఆశ్రయం కల్పిస్తుందో.. మద్దతు నిలుస్తుందో స్పష్టమైంది. ఆపరేషన్ సింధూర్ జరిగి ఏడాది పూర్తయినా దాని ప్రభావం మాత్రం ఇప్పటికీ పాకిస్థాన్పై ఉంది. భారత దెబ్బకు పాకిస్తాన్ సైన్యం ఇప్పటికీ తన వైమానిక స్థావరాలను బాగు చేసుకోలేకపోతున్నది. ఇది భారత సైన్యం శౌర్యగాథ. ఆపరేషన్ సింధూర్ గురించి ఎప్పుడు చెప్పుకున్నా భారత సైన్యం సాహసాలకు ప్రతీకగా నిలుస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Bengal Assembly Dissolved: మమతా బెనర్జీకి గవర్నర్ బిగ్ షాక్..సీఎంగా రాజీనామా చేయలేదని ప్రభుత్వాన్ని రద్దు చేశారు!
Chhotobainan, West Bengal:West Bengal Assembly Dissolved: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా నిరాకరించిన మమత బెనర్జీకి గవర్నర్ ఆర్.ఎన్.రవి గట్టి షాక్ ఇచ్చారు. రాజ్యాంగబద్ధమైన తన విచక్షణాధికారాలను ఉపయోగించి, ప్రస్తుత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గవర్నర్ బర్తరఫ్ చేశారు.
మే 7 (నేడు) అర్ధరాత్రితో బెంగాల్ అసెంబ్లీ ఐదేళ్ల కాలపరిమితి ముగుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పటికీ, మమతా బెనర్జీ రాజీనామాకు సమ్మతించలేదు. దీంతో గవర్నర్ అసెంబ్లీని రద్దు చేస్తూ.. మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనితో బెంగాల్పై దీదీకి ఉన్న 15 ఏళ్ల పట్టు సడలింది.
ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం
ఇటీవలే బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలల్లో ఊహించని ఫలితాలు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ 207 స్థానాల్లో ఘనవిజయం సాధించి స్పష్టమైన మెజారిటీని సొంతం చేసుకుంది. మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కేవలం 80 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదాకు పడిపోయింది. స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు.
మరోవైపు ఓటమిని అంగీకరించని మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర బలగాలు, ఎన్నికల సంఘం అండతో బీజేపీ అక్రమంగా గెలిచిందని, సుమారు 100 స్థానాల్లో తారుమారు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ గెలుపు అనైతికమని వాదిస్తూ, పదవి నుంచి వైదొలగడానికి ఆమె నిరాకరించారు.
అయితే గవర్నర్ ప్రస్తుత ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మే 8న బీజేపీ తన శాసనసభా పక్ష నేతను (ముఖ్యమంత్రి అభ్యర్థిని) ఎన్నుకోనుంది. మే 9న పశ్చిమ బెంగాల్ చరిత్రలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం అధికారికంగా కొలువుదీరనుంది. గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయం బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కొత్త ప్రభుత్వానికి బాధ్యతలు అప్పగించే గవర్నర్ తీసుకున్న ఈ చర్య రాజ్యాంగపరంగా అత్యంత కీలకంగా మారింది.
ALso Read: వాహనదారులకు గట్టిదెబ్బ..పెండింగ్ చలాన్లు 45 రోజుల్లో చెల్లించకపోతే లైసెన్స్ రద్దు!
Also Read: భారత క్రికెట్లో విషాదం..విరాట్ కోహ్లీ టీమ్మేట్ అమన్ప్రీత్ గిల్ మృతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
TVK Vijay Oath: సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారంపై వీడని సందిగ్ధత..కుర్చీలాటలో గెలుపు ఎవరిది?
Eragudi North, Tamil Nadu:TVK Vijay Oath Ceremony: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ నేడు రాజ్భవన్లో గవర్నర్ రాజేంద్రను మరోసారి కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా అభ్యర్థించారు. ఈ క్రమంలో టీవీకే విజయ్ను గవర్నర్ కొన్ని ప్రశ్నలను సంధించినట్లు సమాచారం.Suvendu Adhikari PA: బెంగాల్ కాబోయే ముఖ్యమంత్రి పీఏ హత్య..చివరి వీడియో వైరల్..
Hyderabad, Telangana:Suvendu Adhikari PA Chandra Shot Dead: ఇటీవలే జరిగిన పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా పరిగణిస్తున్న సువేందు అధికారి వ్యక్తిగత సిబ్బందిలోని చంద్రనాథ్ రథ్ హత్యకు గురయ్యాడు. అందుకు సంబంధించిన ఆయన చివరి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.Pending Challan News: వాహనదారులకు గట్టిదెబ్బ..పెండింగ్ చలాన్లు 45 రోజుల్లో చెల్లించకపోతే లైసెన్స్ రద్దు!
New Delhi, Delhi:Delhi Pending Challan News: ఢిల్లీలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి రేఖా గుప్తా ప్రభుత్వం అత్యంత కఠినమైన, పారదర్శకమైన డిజిటల్ చలాన్ వ్యవస్థను అమలులోకి తెచ్చింది. వాహనదారుల్లో క్రమశిక్షణ పెంచడం, రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఏర్పాటు ఈ మార్పులను తీసుకొచ్చారు.
ఈ కొత్త నిబంధనల పూర్తి వివరాలు ఇవే..
చలాన్ జారీ అయినప్పటి నుండి వాహనదారులకు 45 రోజుల సమయం ఉంటుంది. ఈ లోపు వారు జరిమానా చెల్లించాలి. లేదా చలాన్ను సవాలు చేస్తూ డిజిటల్ పోర్టల్లో అభ్యర్థన పెట్టుకోవాలి. ఒకవేళ 45 రోజుల్లో ఎలాంటి స్పందన లేకపోతే, సదరు వ్యక్తి నేరాన్ని అంగీకరించినట్లుగా భావించి తదుపరి చర్యలు తీసుకుంటారు.
మరోవైపు గతంలో లాగా నేరుగా కోర్టును ఆశ్రయించడం ఇక కుదరదు. ముందుగా ఆన్లైన్ ఫిర్యాదుల పోర్టల్లో సమస్యను విన్నవించుకోవాలి. ఒకవేళ కోర్టులో చలాన్ను సవాలు చేయాలనుకుంటే, మొత్తంలో 50% ముందుగానే డిపాజిట్ చేయాలి. దీనివల్ల అనవసరమైన కేసులు తగ్గి, విచారణ వేగవంతమవుతుంది.
నిబంధనలు అతిక్రమిస్తే 'బ్లాక్ లిస్ట్'
నిర్ణీత గడువులో చెల్లుబాటు కాకుండా వారిపై కఠినమైన ఆంక్షలు విధించనున్నారు. వాహన నియామకం, ట్యాక్స్ పేమెంట్లు, డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ వంటి సేవలను నిలిపివేస్తారు. బకాయిలు ఎక్కువగా ఉంటే వాహనాన్ని అమ్మకాన్ని నిలిపేసే విధంగా.. ఫ్లాగ్ రైజ్ చేయడంతో పాటు, అధికారులు వాహనాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.
పదేపదే తప్పు చేస్తే లైసెన్స్ రద్దు
ఏడాదిలో 5 లేదా అంతకంటే ఎక్కువ సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే, వారిని తీవ్రమైన నేరస్థులుగా పరిగణిస్తారు. అలాంటి వారికి డ్రైవింగ్ లైసెన్స్ను శాశ్వతంగా రద్దు చేసే అధికారం ఉంటుంది. ఇకపై అంతా ఆటోమేటెడ్ వ్యవస్థే. కెమెరాల ద్వారా రికార్డైన ఉల్లంఘనలకు 3 రోజుల్లో ఈ-చలాన్, 15 రోజుల్లో ఫిజికల్గా నోటీసులు అందుతాయి. మిస్ కాకుండా ఉండాలంటే మొబైల్ నంబర్ నోటీసు, అడ్రస్ అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
Also Read: గుడ్న్యూస్ చెప్పిన సూర్యకుమార్ యాదవ్..టీమ్ఇండియా కెప్టెన్కు తండ్రిగా ప్రమోషన్!
Also Read: పవర్స్టార్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్..పవన్ కోసం నాని సినిమా పక్కనపెట్టిన సుదీప్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
