రైతులతో మంత్రి పొంగులేటి సమావేశమయ్యారు
Dhamsalapuram, Telangana:ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. డివిజన్లో వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 37 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మార్గమధ్యంలో మంత్రి రైతు కూలీలను కలుసుకుని వారి కష్టాలు. ఎలాంటి ధాన్యం వేస్తున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ప్రజాపరిపాలనపై ఆరా తీశారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
RCB Vs LSG Preview: బెంగళూరు Vs లక్నో మ్యాచ్లో గెలిచేది వీళ్లే! ముందే తెలిసిపోతుందా? సాక్ష్యం ఇదే..ప్లేయింగ్ 11 ఇదే!
Bengaluru, Karnataka:RCB Vs LSG Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నేడు మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో ఆతిథ్య జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఈ క్రమంలో ఇరు జట్ల బలాబలాలు, విజయ పరంపర, పిచ్ రిపోర్ట్, బెంగళూరు వాతావరణ సూచనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్లో నేడు జరగనున్న 23వ లీగ్ మ్యాచ్లో లక్నోతో బెంగళూరు జట్టు ఆడనుంది. ఈ మ్యాచ్తో మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ఇరుజట్లు ప్లాన్ చేస్తున్నాయి. పాయింట్ల పట్టిక ఆధారంగా ఆడిన 4 మ్యాచ్ల్లో 3 గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మూడోస్థానంలో ఉంది. అలాగే లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఆడిన 4 మ్యాచ్ల్లో 2 గెలుపొంది టేబుల్లో 7వ స్థానంలో కొనసాగుతోంది.
ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్పై గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ మంచి ఊపు మీద ఉంది. వరుసగా మరో గెలుపుతో పాయింట్ల పట్టికలో ఎగబాకాలని ప్లాన్ చేస్తోంది. మరోవైపు, లక్నో జట్టు కూడా ఇటీవలే తమ హోమ్ గ్రౌండ్లో గుజరాత్ టైటాన్స్ జట్టుపై పరాజయం పాలయ్యి.. ఇప్పుడు విజయం కోసం పోరాడుతోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Vs లక్నో సూపర్ జెయింట్స్ తుదిజట్లు అంచనా..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, సుయాష్ శర్మ (ఇంపాక్ట్ ప్లేయర్).
లక్నో సూపర్ జెయింట్స్: ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, ఎం. సిద్ధార్థ్, ఆవేశ్ ఖాన్, మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్.
ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు మొత్తంగా 6 సార్లు తలపడ్డారు. అందులో ఆర్సీబీ 4 మ్యాచ్ల్లో గెలుపొందగా.. లక్నో జట్టు 2 సార్లు విజయం సాధించింది. దీన్ని బట్టి చూస్తే లక్నో జట్టుపై ఆర్సీబీ తీవ్రంగా పైచేయి సాధించింది.
చిన్నస్వామి స్టేడియం పిచ్ రిపోర్ట్..
బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో చిన్న బౌండరీలు మంచి బౌన్స్తో మరోసారి బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్ను అందిస్తుందని అంచనా. అది స్ట్రోక్ప్లేకి చాలా అనువైనదిగా ఉండబోతుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. బంతిని సరైన టైమింగ్తో కొట్టే బ్యాటర్లు మరోసారి ఆధిపత్యం చెలాయిస్తారని అంచనా వేస్తున్నారు.
ఈ మైదానంలో ఆడిన గత ఐదు మ్యాచ్లలో ఫాస్ట్ బౌలర్లు 43 వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్లు కేవలం 15 వికెట్లు మాత్రమే తీయగలిగారు. ఈ వేదిక క్రమం తప్పకుండా అధిక స్కోరింగ్కు వేదికగా మారింది. దీనికి నిదర్శనం తొలి ఇన్నింగ్స్లో నమోదయ్యే భారీ సగటు స్కోరు 206 ఉండనుందని తెలుస్తోంది.
వాతావరణం ఎలా ఉందంటే?
బెంగళూరులో వాతావరణం ప్రస్తుతం సాధారణంగానే ఉంది. ఆకాశం నిర్మలంగా.. తక్కువ తేమతో క్రికెట్కు అనుకూలంగా ఉంది. అయితే వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. వర్షం వచ్చే అవకాశాలు లేవు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
OPPO K13 Turbo 5G: ఫ్లిప్కార్ట్ ధమాకా ఆఫర్.. రూ.8,149కే OPPO K13 Turbo 5G.. ఈ డీల్ వదలకండి!
Hyderabad, Telangana:OPPO K13 Turbo 5G Price Cut: భారత మార్కెట్లో OPPO K13 Turbo 5G స్మార్ట్ఫోన్కి మంచి గుర్తింపు ఉంది. ప్రీమియం ఫీచర్స్తో అతి తక్కువ ధరలో అందుబాటులోకి రావడం వల్ల చాలా మంది ఎంతో ఇష్టంగా కొనుగోలు చేశారు. ముఖ్యంగా దీనిని కంపెనీ గేమింగ్ లవర్స్ కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, దీని పెర్ఫార్మెన్స్తో పాటు ఫీచర్స్ అద్భుతంగా ఉండడం వల్ల యువత బాగా కొనుగోలు చేస్తున్నారు. అయితే, మీరు కూడా కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అది కూడా అత్యంత చీప్ ధరలో ఇది మీ కోసమే..
ఈ OPPO K13 Turbo 5G ఫోన్ 6.79 - 6.8 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా Flexible AMOLED, 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో అందుబాటులోకి వచ్చింది. అలాగే MediaTek Dimensity 8450 శక్తివంతమైన ఆక్టా-కోర్ ప్రాసెసర్తో లాంచ్ అయ్యింది. దీంతో పాటు 8 GB RAMతో మార్కెట్లో వివిధ స్టోరేజ్ ఆప్షన్స్లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ఫోన్ ఎంతో శక్తివంతమైన 7000 mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతో పాటు 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ను కూడా కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ఫోన్ వెనక భాగంలో అద్భుతమైన కెమెరా సపోర్ట్ను కూడా కలిగి ఉంటుంది. ఇది వెనక భాగంలో 50 MP మెయిన్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు అదనంగా 2 MP (Depth) డ్యూయల్ కెమెరా సెటప్ను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఫ్రంట్ భాగంలో 16 MP ఫ్రంట్ కెమెరా లభిస్తోంది. అంతేకాకుండా Android 15 ఆధారిత ColorOS 15 ఆపరేటింగ్ సిస్టమ్ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో స్పెషల్గా కూలింగ్ టెక్నాలజీ కూడా లభిస్తోంది. గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండటానికి ఇందులో అడ్వాన్స్డ్ ఎయిర్-కూలింగ్ టెక్నాలజీ, వేపర్ ఛాంబర్ కూడా లభిస్తోంది..
ఇవే కాకుండా ఈ స్మార్ట్ఫోన్ చాలా ప్రత్యేకమైన IP66/68/69 రేటింగ్తో అందుబాటులో ఉంది. ఫోటోలలో అనవసరమైన వాటిని తొలగించడానికి AI Eraser 2.0 వంటి ఫీచర్స్ కూడా లభిస్తోంది. దీంతో పాటు 128GB స్టోరేజ్ వేరియంట్ మొబైల్ ధర MRP రూ.33,999తో అందుబాటులో ఉంది. అయితే, ఇప్పుడే దీనిని కొనుగోలు చేస్తే 18 శాతం వరకు స్పెషల్ తగ్గింపుతో కేవలం రూ.27,999కే పొందవచ్చు. ఇవే కాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.1,400 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇవేకాకుండా అదనంగా ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ను వినియోగిస్తే దాదాపు రూ.19,850 వరకు బోనస్ లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్ఫోన్ రూ.8,149కే పొందవచ్చు.
Also Read: POCO C85x: కేవలం రూ.3,049కే POCO C85x ఫోన్.. ఫ్లిప్కార్ట్లో అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Akshaya Tritiya: అక్షయ తృతీయ వేళ ఈ రాశులవారికి జాక్పాట్.. పెరగనున్న బ్యాంక్ బ్యాలెన్స్!
Hyderabad, Telangana:Venus Transit In Taurus Effect On Zodiac 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్ర గ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు త్వరలో తన సొంత రాశి వృషభంలోకి ప్రవేశించబోతున్నాడు. ఏప్రిల్ 19న జరిగే ఈ శుక్ర సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చి పెట్టబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా జీవితాల్లో కూడా ఊహించని సానుకూల మార్పులు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి చాలా అనుకూలంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏప్రిల్ 19న జరిగే ఈ శుక్ర సంచారం అక్షయ తృతీయ సమయంలో జరగబోతోంది. దీని కారణంగా శుక్రుడి రెట్టింపు ప్రభావం అన్ని రాశులవారిపై పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా అద్భుతమైన మార్పులు వస్తాయి. అంతేకాకుండా నాలుగు రాశులవారికి ఈ సమరంలో ఆర్థికంగా అద్బుతంగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.
ఈ రాశులవారికి బంగారు భవిష్యత్:
మీన రాశి:
అక్షయ తృతీయ సందర్భంగా జరిగే ఈ రాశి సంచారం కారణంగా మీన రాశివారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కెరీర్ పరంగా కూడా కొత్త కొత్త మలుపులు తిరుగుతాయి. దీంతో పాటు కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఆఫీసుల్లో ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు కూడా పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
వృషభ రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వృషభ రాశిని శుక్రుడి సొంత రాశిగా భావిస్తారు. అయితే, శుక్రుడి సంచారంతో ఈ సొంత రాశివారికి ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే ఆకర్షణ కూడా విపరీతంగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు గణనీయంగా పెరుగుతాయి. ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. విలాసవంతమైన వస్తువులు, కొత్త వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా కొత్త పనులు ప్రారంభించడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు.
కన్యా రాశి:
ఈ శుక్రుడి ప్రభావంతో కన్యా రాశివారికి కూడా అదృష్టం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా కెరీర్ పరంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అలాగే ఉన్నత విద్య కోసం విదేశాలకు కూడా ఎంతో సులభంగా వెళ్లగలుగుతారు. దీంతో పాటు కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం కూడా నెలకొంటుంది. అలాగే వ్యాపారస్తులకు భారీ లాభాలు రావడం ప్రారంభమవుతాయి. దీంతో పాటు దీర్ఘకాలిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
కుంభ రాశి:
శుక్రుడి ప్రభావంతో కుంభ రాశివారికి వాహన యోగం కూడా కలుగుతుంది. పెట్టబడులు పెట్టాలనుకునేవారికి ఈ సమయంలో అద్భుతమైన లాభాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు అదృష్టం కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే భవిష్యత్లో కూడా అద్బుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు పెట్టుబడులపై దృష్టి పెట్టడం వల్ల జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది. జీవితంలో సుఖసంతోషాలు రావడం ప్రారంభమవుతాయి. అలాగే సౌకర్యాలు కూడా విపరీంగా పెరుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jagtial: కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు: రేవంత్ రెడ్డి
Hyderabad, Telangana:Jeevan Reddy Into BRS Party: బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై వ్యవహారంపై రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని ఆయన కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టాడని మండిపడ్డారు. ఆయనకు ఎంతో గౌరవం ఇచ్చామని.. పార్టీ ఎన్నో అవకాశాలు కల్పించిందని తెలిపారు. రాజకీయ భవిష్యత్కు హామీ ఇచ్చినా వినలేదు.. మొండిపట్టుతో కాంగ్రెస్ పార్టీని జీవన్ రెడ్డి వీడారు అని రేవంత్ రెడ్డి వివరించారు.
Also Read: AP Inter Results: రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు 2026.. వాట్సప్ ద్వారా తెలుసుకోవడం ఇలా..!
మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడం.. బీఆర్ఎస్ పార్టీలో చేరుతుండడంతో జగిత్యాల రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన రేవంత్ రెడ్డి జగిత్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులతో హైదరాబాద్లో సమావేశమయ్యారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జగిత్యాల నాయకులకు కొన్ని సూచనలు చేశారు.
Also Read: Bike Stunts: నిబంధనలు బేఖాతర్.. ఔటర్ రింగురోడ్డుపై ప్రేమజంటల హల్చల్
'రాష్ట్రంలో పరిస్థితులను పంచుకోవాలనే మీతో సమావేశమయ్యా. మేం ఎప్పుడూ జీవన్ రెడ్డిని తక్కువ చేసి చూడలేదు. ఆయన మర్యాదను తగ్గించేలా మాట్లాడలేదు. ఆయన గౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించలేదు. 2023 ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం అంతా కష్టపడ్డాం. పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనను కరీంనగర్ నుంచి పోటీ చేయాలని సూచించాం. కానీ ఆయన నిజామాబాద్ నుంచి పోటీ చేస్తానని కోరడంతో పార్టీ టికెట్ ఇచ్చింది. దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయారు' అని రేవంత్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి సూచించిన వారికే టికెట్లు ఇచ్చాం. భవిష్యత్లో ఆయనకు, ఆయన కుటుంబసభ్యుల రాజకీయ భవిష్యత్కు హామీ ఇచ్చినా వినలేదు. మొండి పట్టుతో జీవన్ రెడ్డి పార్టీ వీడారు' అని రేవంత్ రెడ్డి చెప్పారు.
Also Read: Nari Shakti Vandan: నారీ శక్తి వందనంపై జగన్, షర్మిలతో సహా అన్నీ పార్టీ అధ్యక్షులకు చంద్రబాబు లేఖ!
'40 ఏండ్లు ఆయన కోసం పనిచేసిన కార్యకర్తలను మోసం చేసి దుర్మార్గుడైన కేసీఆర్తో జతకట్టారు. జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి కేసీఆర్ దగ్గర చేతులు కట్టుకుని నిలబడటం అత్యంత బాధాకరం. జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని జీవన్ రెడ్డి, కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు. ఆయన వయసుకు.. అనుభవానికి ఇది తగదు. ఈనాటికీ నేను ఆయన గౌరవానికి భంగం కలిగేలా ఒక్క మాట మాట్లాడలేదు. కుట్రలను తిప్పి కొట్టాలని మనం ప్రయత్నం చేస్తుంటే ఆయన వెళ్లి అక్కడ చేరారు' అని జీవన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
'ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామంటే నిలబెట్టడం తప్పా నేను చేస్తుంది మంచో చెడో మీరే ఆలోచించండి. ఎవరు ఏమిటి అనేది కాలమే నిర్ణయిస్తుంది' అని రేవంత్ రెడ్డి తెలిపారు. 'అండగా నిలబడండి మళ్లీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తీసుకొద్దాం. ధైర్యంగా ఉండండి' అని భరోసా ఇచ్చారు. 'త్వరలోనే కార్యకర్తలను కలిసేందుకు జగిత్యాలకు వస్తా. అంతా కలిసికట్టుగా జగిత్యాలను అభివృద్ధి చేసుకుందాం' అని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Samrat Choudhary: బీహార్లో బీజేపీ ట్రంప్ కార్డ్.. సాధారణ కార్యకర్త నుండి డిప్యూటీ సీఎం వరకు.. సామ్రాట్ చౌదరి పవర్ ఫుల్ పొలిటికల్ జర్నీ ఇదే..!!
Lakshmapur, Telangana:Samrat Choudhary: బీహార్ గడ్డపై బీజేపీ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. దశాబ్దాలుగా పొత్తుల మీదే ఆధారపడిన కమలపార్టీ.. ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతోంది. ఏప్రిల్ 15న బీహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేయబోతన్నట్లు వస్తున్న సమాచారంతో దేశవ్యాప్తంగా రాజకీయ చర్చ షురూ అయ్యింది. ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర అత్యున్నత పదవి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఎందరికో ఆశ్చర్యం కలిగిస్తే.. మరేందరికో ఆదర్శంగా నిలిచింది. అసలీ సామ్రాట్ చౌదరి ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
బీహార్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా పూర్తిగా మారిపోతోంది. దశాబ్దాలుగా జేడీయూ-ఆర్జేడీల చుట్టూ తిరిగిన అధికారం.. ఇప్పుడు కమలం గూటికి చేరుతోంది. ఈ చారిత్రాత్మక మార్పుకు కేంద్ర బిందువుగా మారారు సామ్రాట్ చౌదరి.
మూడు దశాబ్దాల రాజకీయ పోరాటం:
సామ్రాట్ చౌదరి.. 1968లో ముంగేర్ జిల్లాలోని ఒక రాజకీయ కుటుంబంలో జన్మించారు. వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ..తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన ప్రస్థానం రాష్ట్రీయ జనతాదళ్ తో షురూ అయ్యింది. రబ్రీ దేవి హయాంలో అతిచిన్న వయస్సులోనే మంత్రిగా పనిచేసిన అనుభవం సామ్రాట్ కు ఉంది. అయితే..రాజకీయాలు ఎప్పుడూ ఒకలా ఉండవు కదా. 2018లో ఆయన ఆర్జేడీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. బీజేపీలో చౌదరి ఎదుగుదల చాలా వేగంగా జరిగింది. ఆయన 2019లో రాష్ట్ర అధ్యక్షుడు నిత్యానంద్ రాయ్కి డిప్యూటీగా పనిచేశారు. శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2023లో బీజేపీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
శపథం చేసిన చోటే సింహాసనం:
సామ్రాట్ చౌదరికి ఒక పట్టుదల ఉన్న నేతగా మంచి పేరుంది. గతంలో నితీశ్ కుమార్ మహాఘటబంధన్ ప్రభుత్వంలో ఉన్న సమయంలో సామ్రాట్ చౌదరి ఒక సంచలన శపథం చేశారు. నితీష్ కుమార్ సీఎం పీఠం నుంచి దించిన వెంటనే నా తలపాగా తీస్తాను.. అని ప్రకటించారు. రాజకీయ సమీకరణాలు వల్ల మళ్లీ నితీశ్ కుమార్ తో పనిచేసినప్పటికీ.. నేడు అదే నితీశ్ స్థానంలో సీఎంగా పగ్గాలు చేపట్టబోతుండటం విశేషమనే చెప్పాలి.
కులానికీ.. బలానికీ ప్రాధాన్యత:
బీహార్ అంటేనే కుల రాజకీయాలకు పెట్టింది పేరు. అలాంటి రాష్ట్రంలో సామ్రాట్ చౌదరి ఎంపిక వెనక బీజేపీ భారీ స్కెచే ఉంది. ఆయన కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన నేత. బీహార్ లో అత్యంత బలమైన లవ్ కుష్ ఓటు బ్యాంకును తమ వైపు తీప్పుకోవడానికి ఆయన సరైన నాయకుడని కమల పార్టీ అధిష్టానం భావించింది. నితీశ్ కుమార్ సామాజిక వర్గానికి పోటీగా మరో బలమైన బీసీ నేతను నిలబెడితే.. బీజేపీ అక్కడ తన పునాదులను పటిష్టం చేసుకోవాలన్న మాస్టర్ ప్లాన్ వేసింది.
మొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా రికార్డు:
అయితే బీహార్లో బీజేపీ ఎప్పుడూ ఒక జూనియర్ పార్టనర్గానే ఉంటూ వచ్చింది. కానీ మొదటిసారిగా ఒక బీజేపీ నేత సీఎం కావడం అనేది ఆ పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పాలి. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా.. ఉప ముఖ్యమంత్రిగా ఆయన చూపిన తెగువ నేడు ఆయనను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు కారణమైందని చెప్పాలి.
సామ్రాట్ చౌదరి ఆస్తులు:
సామ్రాట్ చౌదరి నికర ఆస్తి మొత్తం రూ. 11 కోట్లకు పైగా ఉంది. ఇందులో నగదు, బంగారం, సెక్యూరిటీలు , ఆస్తులు ఉన్నాయి. తారాపూర్ నుండి నామినేషన్ కోసం తన పేరును సమర్పించేటప్పుడు, సామ్రాట్ చౌదరి తన రూ. 11 కోట్ల నికర ఆస్తి వివరాలను ఎన్నికల సంఘంతో పంచుకున్నారు.
వివాదాలు, విమర్శలు ఎన్ని ఉన్నా.. పదునైన వ్యూహాలతో, కంచుకోట లాంటి ప్రత్యర్థులను ఎదిరించి నిలబడటం సామ్రాట్ చౌదరి శైలి అని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. ఏప్రిల్ 15 నుంచి బీహార్ రాజకీయాల్లో సామ్రాట్ యుగం మొదలుకాబోతోందని బీజేపీ కార్యకర్తలు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
AP Inter Results: రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు 2026.. వాట్సప్ ద్వారా తెలుసుకోవడం ఇలా..!
Nuzendla, Andhra Pradesh:Tomorrow AP Inter Results 2026: పరీక్షలు ముగిసిపోవడంతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త ఇది. ఇప్పటికే తెలంగాణలో పరీక్ష ఫలితాలు విడుదల కాగా.. రేపు ఆంధ్రప్రదేశ్లో విడుదల కానున్నాయి. ఫలితాల విడుదలకు సంబంధించి ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. రేపు ఉదయం పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని ఎక్స్ వేదికగా ప్రకటించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు విడుదల చేయనుండడంతో ఫలితాలు ఎలా తెలుసుకోవాలో చూద్దాం.
Also Read: Bike Stunts: నిబంధనలు బేఖాతర్.. ఔటర్ రింగురోడ్డుపై ప్రేమజంటల హల్చల్
ఆంధ్రప్రదేశ్ రేపు ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాలు విడుదల కానున్నాయి. రేపు (ఏప్రిల్ 15) ఉదయం 10.31 గంటలకు మొదటి, రెండో సంవత్సర పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి లోకేష్ 'ఎక్స్'లో పోస్టు చేశారు. మన మిత్ర వాట్సాప్ నుంచి ఇంటర్ ఫలితాలు తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ముందుగానే మంత్రి శుభాకాంక్షలు చెప్పారు.
ఫలితాలు తెలుసుకోవడం ఇలా
ఏపీలో ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 23 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఫలితాలను అధికారికంగా ఇంటర్మీడియట్ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. అది కాకుండా మన మిత్ర వాట్సప్ ద్వారా కూడా ఫలితాలు పొందవచ్చు.
Also Read: Nari Shakti Vandan: నారీ శక్తి వందనంపై జగన్, షర్మిలతో సహా అన్నీ పార్టీ అధ్యక్షులకు చంద్రబాబు లేఖ!
ఆన్లైన్లో ఫలితం ఇలా..
మొబైల్ లేదా కంప్యూటర్లో ఇంటర్మీడియట్ అధికారిక వెబ్సైట్ resultsbie.ap.gov.in ను తెరవాలి. అక్కడ రిజల్ట్స్పై క్లిక్ చేయాలి. అనంతరం అక్కడ హాల్ టికెట్ నంబర్ పొందుపర్చాలి. సబ్మిట్ క్లిక్ చేస్తే ఫలితాలు వస్తాయి. అనంతరం మార్క్స్ మెమోను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మన మిత్ర ద్వారా ఇలా..
మన మిత్ర వాట్సాప్ ద్వారా ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు పొందవచ్చు.
మన మిత్ర నంబర్కు 9552300009 వాట్సప్ ద్వారా “Hi” అని పంపాలి. అక్కడ సర్వీస్ అని వస్తుంది. అక్కడ ఎడ్యుకేషన్ సర్వీసెస్ క్లిక్ చేయాలి.
అనంతరం ఇంటర్మీడియట్ ఫలితాలు అని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ఫలితాలు వస్తాయి. అక్కడ హాల్ టికెట్ నంబర్ పొందుపరిస్తే మీ ఫలితం వచ్చేస్తుంది.
హెచ్చరిక
ఇంటర్మీడియట్ విద్య అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది. కానీ అదే జీవితం కాదు. విడుదలైన తర్వాత పరీక్ష ఫలితాలు ఎలా వచ్చినా కూడా స్వీకరించాలి. ఫలితాలు అనుకూలంగా రాకపోయినా కూడా కలత చెందరాదు. పరీక్షల్లో ఫెయిలైనా కూడా తర్వాత సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి. కానీ ఒకసారి జీవితం కోల్పోతే సప్లిమెంట్ జీవితం ఏమీ ఉండదు. అందుకే రిజల్ట్స్ను రిజల్ట్ లాగా చూడాలి.
Also Read: Sanju Samson Century: సంజూ శామ్ సన్ రికార్డు సెంచరీ.. IPL 2026లో చెన్నై బోణి కొట్టిందోచ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Bengal News: జై శ్రీరామ్ అంటే చాలు.. ఫీజులో రూ.500 కట్! కోల్కతా డాక్టర్ కీలక నిర్ణయం..
Hyderabad, Telangana:Kolkata Doctor Latest News: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఒక వైద్యుడు తన పేషంట్స్ కోసం ప్రకటించిన వినూత్న డిస్కౌంట్ స్కీం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది. సాధారణంగా ఆసుపత్రిలో పండగ ఆఫర్లతో పాటు హెల్త్ క్యాంపు ల సమయంలో రాయితీలు చూడడం సర్వసాధారణం.. కానీ ఈయన మాత్రం తన రాజకీయ అభిమానాన్ని, భక్తిని కలిపి సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. తన వద్దకు వచ్చే పేషెంట్లు జైశ్రీరామ్ అని పలికితే చాలు.. కన్సల్టేషన్ ఫీజులో ఏకంగా రూ.500 తగ్గిస్తామని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశారు..
కోల్కతాకు చెందిన వైద్యుడు డాక్టర్ పీకే హిజ్రా ఈ సరికొత్త ఆఫర్ ను ప్రకటించారు. నగరంలోని పేరు ఉన్న కార్డియాలజిస్ట్లలో ఒకరైన ఆయన.. గత కొంతకాలంగా తన ఫీజు విషయంలో మార్పులు చేస్తూ వస్తున్నారు. ఒకప్పుడు తన కన్సల్టేషన్ కోసం దాదాపు రూ 2 వేల రూపాయలు వసూలు చేసేవారని.. అయితే, ఎన్నికల వాతావరణ నేపథ్యంలో దానిని రూ 1500 తగ్గించినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు ఆ ఫీజును మరింత సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో జైశ్రీరామ్ డిస్కౌంట్ తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది.
డాక్టర్ హిజ్రా తన నిర్ణయం పై స్పందిస్తూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు.. తాను భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యాడని.. ఆ పార్టీకి తన వంతు సపోర్టు తెలపడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. ఫీజు తగ్గడం వల్ల పేద రోగులకు మేలు జరుగుతుందని.. అదే సమయంలో ఆధ్యాత్మిక భావనను పెంపొందించవచ్చని ఆయన పడ్డారు. కేవలం నినాదం పలికినంత మాత్రాన రూ.500 తగ్గించడం ద్వారా మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరట లభిస్తుందని ఆయన పేర్కొన్నారు..
Also Read: Jagtial News: జగిత్యాల కాంగ్రెస్లో సెగలు.. హైదరాబాద్కు 71 మంది కీలక నేతలు.. అసలేం జరుగుతోంది?
ఈ వార్త బయటకు వచ్చినప్పటికీ నుంచి బెంగాల్ రాజకీయాల్లో చర్చలు మొదలయ్యాయి. ఒక వర్గం ప్రజలు డాక్టర్ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే.. మరికొందరు వైద్య సేవలను రాజకీయాలతో ముడి పెట్టడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.. ఏది ఏమైనా ఒక వైద్యుడు బహిరంగంగా తన రాజకీయ పక్షపాతాన్ని ఇలా డిస్కౌంట్ రూపంలో ప్రకటించడం దేశవ్యాప్తంగా చర్చనీ అంశానికి దారితీస్తోంది. ప్రస్తుతం కోల్కతా వీధుల్లో డాక్టర్ హిజ్రా క్లినిక్ ముందు రోగుల రద్దీ పెరిగినట్లు తెలుస్తోంది. జై శ్రీరామ్ అంటే కేవలం రూ.1000 కే స్పెషలిస్ట్ డాక్టర్ సలహాలు లభించడంతో చాలామంది ఈ క్లినిక్ వెళ్లేందుకు ఎంతగానో ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
Also Read: Jagtial News: జగిత్యాల కాంగ్రెస్లో సెగలు.. హైదరాబాద్కు 71 మంది కీలక నేతలు.. అసలేం జరుగుతోంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jagtial News: జగిత్యాల కాంగ్రెస్లో సెగలు.. హైదరాబాద్కు 71 మంది కీలక నేతలు.. అసలేం జరుగుతోంది?
Jagtial, Telangana:Jagtial Telugu News: ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. జగిత్యాల నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు తమ ఉనికిని చాటుకునేందుకు.. నామినేటెడ్ పదవుల కోసం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం జగిత్యాల నుంచి దాదాపు 71 మంది ముఖ్య నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఎందుకు హైదరాబాద్ కు తరలి వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు పెద్ద చర్చనీ అంశంగా మారింది.
నిజానికి ఈ భేటీ సోమవారమే జరగాల్సి ఉంది.. కానీ ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సమావేశం వాయిదా పడిందట.. దీంతో నాయకులంతా హైదరాబాదులోనే బస చేసి.. మంగళవారం సాయంత్రం బేటి కావాలని నిర్ణయించుకున్నారు. మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలవబోతోంది. అంతేకాకుండా అందరి సమక్షంలోనే సీఎంతో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది..
పర్యటన వెనక ప్రధానంగా నామినేట్ పదవుల అంశం ఉన్నట్లు సమాచారం. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు.. సుదీర్ఘకాలంగా జెండా మోసిన తమకు తగిన గుర్తింపు లభించడం లేదని సీనియర్లు అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.. ముఖ్యంగా పార్టీ అభివృద్ధి కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని.. రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ పదవులతో పాటు జిల్లా స్థాయిలో కీలక పదవులను జగిత్యాల నేతలకు కేటాయించాలని వీరు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: CBSE 10th Results 2026 LIVE: CBSE 10th ఫలితాల అప్డేట్స్.. రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే..!
అంతేకాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలతో పాటు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేందుకు వీలుగా పదవుల పంపిణీ జరగాలని బార్ కోరుతున్నారు.. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో.. జగిత్యాల నేతలు ఈ చలో హైదరాబాద్ కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుందని భావించవచ్చు. మంత్రి అడ్డూరి లక్ష్మణ్ ఈ విషయంలో మధ్యవర్తిత్వం వహించడం. ముఖ్యమంత్రి నుంచి సానుకూల హామీ లభిస్తుందని నేతలు ఆశాభావంతో ఉన్నట్లు సమాచారం..
Also Read: CBSE 10th Results 2026 LIVE: CBSE 10th ఫలితాల అప్డేట్స్.. రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nari Shakti Vandan: నారీ శక్తి వందనంపై జగన్, షర్మిలతో సహా అన్నీ పార్టీ అధ్యక్షులకు చంద్రబాబు లేఖ!
Nuzendla, Andhra Pradesh:Chandrababu Letter To YS Jagan: మహిళా రిజర్వేషన్ ‘నారీ శక్తి వందన్’ బిల్లుకు పార్లమెంట్లో మద్దతుపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులు, రాజ్యసభ, లోక్సభ ఎంపీలకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, వైఎస్ షర్మిలా రెడ్డితోపాటు సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు ఈశ్వరయ్య, శ్రీనివాస రావుకు ముఖ్యమంత్రి లేఖలు రాశారు. 2029 ఎన్నికల నుంచే మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు చేసేలా తీసుకువస్తున్న ‘నారీ శక్తి వందన్’ చట్ట సవరణ బిల్లుకు మద్దతు పలకాలని లేఖలో కోరారు.
మహిళలకు పార్లమెంట్, విధాన సభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పాన్ని బలపరుద్దామని లేఖలో చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు ప్రవేశపెట్టే ఈ నెల 16వ తేదీ భారత ప్రజాస్వామ్యంలో చారిత్రక ఘట్టమని తెలిపారు. ‘నారీ శక్తీ వందన్ అధినియం’ మహిళా సాధికారతతో పాటు దేశ ఉన్నతికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంలో, పరిపాలనలో, చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యం అవుతుందని తాను నమ్ముతానని లేఖలో పేర్కొన్నారు. భరతమాతను పూజించే దేశంగా నారీ శక్తికి వందనం పలుకుదాం ఆయా పార్టీల అధ్యక్షులకు సీఎం చంద్రబాబు కోరారు.
'భారత ప్రజాస్వామ్యంలో ఏప్రిల్ 16, 2026 ఒక చారిత్రాత్మక, ఆనందకరమైన రోజుగా నిలుస్తుంది. మహిళా రిజర్వేషన్ అమలుకు బాటలువేసే నారీ శక్తి వందన్ అధినియం సవరణ బిల్లు పార్లమెంట్ ముందుకు రానుండడంతో దశాబ్దాల కల నిజమవుతోంది. భారత ప్రజాస్వామ్యంలో శాశ్వతంగా నిలిచేలా, సమానత్వం సాధించేందుకు ఇది గొప్ప ముందడుగు' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 'ఎక్కడ మహిళలను గౌరవిస్తారో.. అక్కడ దేవతలు కొలువై ఉంటారని మన భారతీయ ధర్మం చెబుతోంది. దీనికి నిదర్శనమే నారీ శక్తి వందన్ అధినియం. చట్టసభల్లో ఆడబిడ్డలకు 33 శాతం రిజర్వేషన్లు 2029 నుంచే అమల్లోకి వచ్చేలా చట్ట సవరణకు కేంద్రం సంకల్పించింది' అని చంద్రబాబు లేఖలో వివరించారు.
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం ఒక గొప్ప ఆలోచనగా తాను భావిస్తున్నానని.. చట్టసభల్లో మహిళలకు మూడోవంతు సీట్లు కేటాయించడం ప్రతీ భారతీయుడు గర్వించే సందర్భం అని చంద్రబాబు పేర్కొన్నారు. 'నేటి నిర్ణయం రేపటి నూతన రాజకీయ పంథాకు, సాధికారతకు నాంది పలుకుతోంది. ప్రభుత్వంలో, పరిపాలనలో, చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యం అవుతుందని మొదటి నుంచీ నేను బలంగా నమ్ముతా. మహిళలకు సముచిత స్థానంతోనే సమాజ అభివృద్ధి. రాష్ట్ర, దేశ పురోగతిలో మహిళలు కీలక పాత్ర పోషించాలన్నది నా అభిప్రాయం' అని లేఖలో చంద్రబాబు వివరించారు.
కఠోర శ్రమ, కర్తవ్య దీక్షతో నేడు ప్రతీ రంగంలోనూ మహిళలు తమ ప్రతిభ నిరూపించుకుంటున్నారని చంద్రబాబు గుర్తుచేశారు. 2029లో జరిగే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లు అమలు కావాలనే ప్రధాని ఆకాంక్షకు అందరం మద్దతు పలుకుదామని పార్టీల అధ్యక్షులకు సూచించారు. మహిళా రిజర్వేషన్పై అంతా ఒకే స్వరం వినిపించాలని ఆడబిడ్డల తరఫున బాధ్యతతో ఈ లేఖ రాస్తున్నట్లు చెప్పారు. భరతమాతను పూజించే దేశంగా నారీ శక్తికి వందనం పలికే గొప్ప క్షణాలకు 140 కోట్ల మంది భారతీయులు సిద్దంగా ఉండాలని.. ఈ చట్టం రాజకీయాలకు అతీతం.. ఇది దేశ గౌరవానికి సంబంధించిన విషయం అని వివరించారు. నారీ శక్తీ వందన్ అధినియం మహిళా సాధికారతతో పాటు దేశ ఉన్నతికి దోహదపడుతుందని.. ఈ చారిత్రాత్మక విజయాన్ని చేకూర్చడంలో ప్రతీ ఒక్కరూ సహకరించాలని వైఎస్ జగన్, షర్మిల, పవన్ కల్యాణ్ తదితరులను చంద్రబాబు కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Oppo A6s Pro Launched: 7000mAh భారీ బ్యాటరీతో Oppo A6s Pro లాంచ్!
Hyderabad, Telangana:Oppo A6s Pro Launched Latest News Telugu: ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం ఒప్పో మార్కెట్లోకి అద్భుతమైన మిడిల్ క్లాస్ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. దీనిని కంపెనీ అద్భుతమైన డిజైన్తో పాటు ప్రీమియం ఫీచర్స్తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. చైనా మార్కెట్లో అత్యంత శక్తివంతమైన Oppo A6s Pro స్మార్ట్ఫోన్ను కంపెనీ లాంచ్ చేసింది. ఇది చాలా ప్రీమియం లుక్లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Oppo A6s Pro ఫీచర్స్, బ్యాటరీ వివరాలు..
ఈ Oppo A6s Pro స్మార్ట్ఫోన్ను కంపెనీ ఎంతో శక్తివంతమైన బ్యాటరీతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనిని కంపెనీ పెద్ద బ్యాటరీతో అతి తక్కువ ధరలో లభించే స్మార్ట్ఫోన్స్ను కొనుగోలు చేసేవారిని దృష్టిలో పెట్టుకుని దీనిని అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. ఇది ఏకంగా 7000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు మూడు రోజుల పాటు బ్యాటరీ లైఫ్ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఇందులో అదనంగా 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంను కూడా అందిస్తోంది.
Oppo A6s Pro కెమెరా, డిస్ప్లే..
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం కంపెనీ ఈ స్మార్ట్ఫోన్లో అద్భుతమైన కెమెరాను కూడా అందిస్తోంది. ఇందులో 50MP మెయిన్ కెమెరాతో పాటు మరో సెకండరీ లెన్స్ కెమెరాలను కూడా అందించారు. అంతేకాకుండా ఇందులో అద్భుతమైన సెల్పీ కెమెరాను కూడా అందించిన్నట్లు తెలుస్తోంది. ఇది 50MP ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే దీని ద్వారా హై-క్వాలిటీ వీడియో కాల్స్తో పాటు సోషల్ మీడియా రీల్స్ చేసేవారికి అద్భుతంగా పని చేస్తుంది. ఇందులో కంపెనీ 6.57 ఇంచుల AMOLED డిస్ల్పేను కూడా అందిస్తోంది. ఇది చాలా ప్రత్యేకమైన 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో అందుబాటులో ఉంది.
దీని ప్రాసెసర్ ఏంటీ?
ఇక ఈ స్మార్ట్ఫోన్ స్మార్ట్ఫోన్ MediaTek Helio G100 Max ప్రాసెసర్తో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ఫోన్ వినియోగించి మల్టీ టాస్కింగ్ను ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది 8GB ర్యామ్తో విడుదలైన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వివిధ రకాల స్టోరేజ్ వేరియంట్స్లో అందుబాటులోకి వచ్చింది. ఇది IP69 రేటింగ్ సపోర్ట్తో లభిస్తోంది. ఇంత చీప్ ధరలో ఎన్నో రకాల ప్రత్యేకమైన ఫీచర్స్తో లభించడం విశేషం..
Also Read: POCO C85x: కేవలం రూ.3,049కే POCO C85x ఫోన్.. ఫ్లిప్కార్ట్లో అదిరిపోయే ఆఫర్!
ధర వివరాలు ఇవే..
చైనాలో దీని ప్రారంభ ధరను సుమారు 1,399 యువాన్లుగా విక్రయించబోతున్నట్లు కంపెనీ ఇప్పటికే అధికారంగా వెల్లడించింది.. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.16,500 నుంచి రూ.18,000 మధ్య ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం చైనాలో మాత్రమే ఈ స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉంది. త్వరలోనే భారత మార్కెట్లోకి కూడా ప్రవేశించే అవకాశం ఉందని సోషల్ మీడియాల్లో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.
Also Read: POCO C85x: కేవలం రూ.3,049కే POCO C85x ఫోన్.. ఫ్లిప్కార్ట్లో అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Noida Violence: నోయిడా అల్లర్ల వెనుక పాక్ హస్తం? 350 మంది అరెస్ట్.. భారీ కుట్ర కోణం వెలుగులోకి!
Hyderabad, Telangana:Noida Workers Violence Planned Conspiracy: నోయిడాలో సోమవారం కార్మికులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ఇది కాస్త చేతి దాటడంతో అక్కడ కసేపు తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నిరసనకారులు పోలీసుల వాహనం కూడా ధ్వంసం చేశారు. ప్రధానంగా జీతాల పెంపు కోరుతూ 42 వేల మంది కార్మికులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. అంతేకాదు 50 పైగా వాహనాలను కూడా వాళ్ళు దగ్ధం చేశారు. ఇక మొత్తానికి పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించాల్సిన దుస్థితి ఏర్పడింది. మొత్తంగా 350 మంది వరకు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సమాచారం. నోయిడా మీరట్లో ఇటీవల నలుగురు ఉగ్ర అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ అల్లర్లకు కుట్ర పన్నినట్లు అనుమానం వ్యక్తం చేస్తుంది. అక్కడి ప్రభుత్వం ఇప్పటివరకు 300 మందికి పైగా పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.
మొత్తంగా నిరసన కారులు 80 కి పైగా ప్రదేశాలలో విధ్వంసం సృష్టించారు. అంతే కాదు స్థానికంగా ఉన్న వాహనాలకు నిప్పు పెట్టడం, రాళ్ల దాడి చేయడం వంటి కేసులు నమోదయ్యాయి. ఫ్యాక్టరీ వాహనాలు కూడా పూర్తిస్థాయిలో దగ్ధం చేశారు. ఒక ఫ్యాక్టరీ నుంచి ప్రారంభమైన ఈ నిరసనలు ఇతర కంపెనీలకు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో పలు కంపెనీల వర్కర్లు కూడా గుంపులుగా గుమిగూడారు. పరిస్థితి అదుపుతప్పింది. కొంతమంది దుండగులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఇక పరిస్థితిని అదుపు చేయడానికి ఆర్ఏఎఫ్ దళాలు కూడా మోహరించాయి. సున్నితమైన ప్రాంతంలో అదనపు బలగాలు పెంచారు.
మొత్తం వాట్సాప్ గ్రూపుల ద్వారా వదంతులు సృష్టిస్తున్నట్లు సమాచారం. రెచ్చగొట్టే కంటెంట్ ను వ్యాప్తి చేస్తూ సోషల్ మీడియాకు ఖాతాలో హల్చల్ చేస్తున్నారు. దీంతో వాటిపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ కేసులో నమోదు చేశారు. ఉద్రిక్త వాతావరణం సృష్టించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అసలు వర్కర్స్ డిమాండ్స్ ఏంటి?
వాళ్లంతా నోయిడాలోని అహుజా ఫ్యాక్టరీ కార్మికులు. కంపెనీ యాజమాన్యం అంగీకరించడం లేదని నిరసన చేపట్టారు. అంతేకాదు నైపుణ్యం లేని కార్మికులకు ఒక విధమైన అలవెన్సులు ఇస్తున్నారు. నైపుణ్యం ఉన్న కార్మికులను పట్టించుకోవడంలేదని పెద్ద ఎత్తున నిరసన చేశారు. సమయంలో గంటకు 90 అలవెన్స్ ఇస్తారు. కానీ ఆ తర్వాత 50కి తగ్గిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా కూడా ఈ నిరసనలకు కారణమైన వారిని పోలీసులు చెక్ చేస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం నోయిడాలో శాంతియుత పరిస్థితులే ఉన్న పోలీసుల భద్రత మొహరింపు చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
IPL 2026: ఉప్పల్లో ఆరెంజ్ ఆర్మీ ఊచకోత.. రాజస్థాన్ను చిత్తు చేసిన సన్రైజర్స్.. హైదరాబాద్ ఖాతాలో గ్రాండ్ విక్టరీ..!!
Lakshmapur, Telangana:SRH vs RR: ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో చెలరేగిపోతున్న రాజస్థాన్ రాయల్స్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ గట్టిషాకిచ్చింది. సోమవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచులో రాజస్థాన్ 57 పరుగుల తేడాతో మట్టికరిపించి ఓటమి రుచి చూపించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది. డొనావన్ ఫెరీరా 69 బాల్స్ లో 7 ఫోర్లు 3 సిక్సులు తీయగా.. రవీంద్రా జడేజా 45 బంతుల్లో 5 ఫోర్లతో పోరాటం చేశారు. ప్రఫుల్ హింగే 4 వికెట్లు తీసుకుని 34 పరుగులు ఇచ్చాడు. సకీబ్ హుస్సేన్ 4 వికెట్ల కు 24 పరుగులు ఇచ్చాడు. ఈ విధంగా రాజస్థాన్ ఓటమి రాసారు.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం సాక్షిగా సోమవారం ఆరెంజ్ ఆర్మీ శివాలెత్తిపోయింది. బౌండరీల మోత.. వికెట్ల వేటతో రాజస్థాన్ రాయల్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ మట్టికరిపించింది. వేలాది మంది అభిమానులు ఆరేంజ్ కేరింతల మధ్య హైదరాబాద్ జట్టు పాత రాజస్థాన్ ను గుర్తు చేస్తూ రాయల్స్ గాలి తీసింది. ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన హైదరాబాద్ నవాబులు.. ఈ విజయంతో పాయింట్ల పట్టికతో తమ సత్తా ఏంటో మరోసారి చాటిచెప్పారు.
మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్ కెప్టెన్ నిర్ణయం 100 శాతం కరెక్ట్ అని ప్రఫుల్ హింగే నిరూపించాడు. రూ. 30 లక్షల బేస్ ప్రైస్ కుర్రాడు.. ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో అరంగేట్రం ఓవర్లోనే మూడు వికెట్లు తీసి రాజస్థాన్ వెన్నుముక విరిచేశాడు. తొలి ఓవర్ ముగిసేసరికి రాజస్థాన్ స్కోరు 1/3 అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ధ్రువ్ జురెల్ వంటి స్టార్ ప్లేయర్ క్లీన్ బౌల్డ్ అవ్వడం ఈ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది.
ప్రఫుల్ వేసిన దెబ్బ నుంచి రాజస్థాన్ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. మిడిల్ ఓవర్లలో కమిన్స్ తన వ్యూహాలతో బ్యాటర్లను కట్టడి చేయగా.. స్పిన్నర్లు పరుగుల వేగాన్ని అడ్డుకున్నారు. రాజస్థాన్ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా ఎస్ఆర్హెచ్ బౌలర్లు వికెట్లు తీస్తూనే ఉన్నారు. నిర్ణీత ఓవర్లలో రాజస్థాన్ ఒక గౌరవప్రదమైన స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది.
లక్ష్యం పెద్దది కాకపోయినా.. అభిషేక్ శర్మ తొలి బంతికే డకౌట్ అవ్వడం ఫ్యాన్స్ను కాస్త టెన్షన్ పెట్టింది. కానీ.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు క్లాస్ ఇన్నింగ్స్తో మ్యాచ్ను వన్ సైడ్ చేసేశారు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు రాజస్థాన్ బౌలర్లను ఉతికి ఆరేశారు. ట్రెంట్ బౌల్ట్, ఆర్చర్ వంటి దిగ్గజ బౌలర్లను కూడా లెక్కచేయకుండా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ప్రతి బంతిని బౌండరీకి పంపుతూ రన్ రేట్ను ఎక్కడా తగ్గనివ్వలేదు.
మ్యాచ్ క్లైమాక్స్కు వచ్చేసరికి ఉప్పల్ స్టేడియం ఒక పండుగలా మారిపోయింది. గెలుపుకు చేరువవుతున్న కొద్దీ అభిమానుల నినాదాలతో గ్రౌండ్ దద్దరిల్లిపోయింది. చివరకు మరో కొన్ని ఓవర్లు మిగిలి ఉండగానే హైదరాబాద్ ఘన విజయం సాధించింది.
ఈ విజయం సన్రైజర్స్ హైదరాబాద్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. అటు బౌలింగ్లో ప్రఫుల్ హింగే సంచలనం, ఇటు బ్యాటింగ్లో సమిష్టి కృషి హైదరాబాద్ను విజయతీరాలకు చేర్చాయి. రాజస్థాన్ రాయల్స్కు ఇది ఒక పీడకల లాంటి మ్యాచ్ అయితే, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కు మాత్రం ఇది కన్నుల పండుగగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kcr Mega public Meeting: కేసీఆర్ జగిత్యాల బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు.. ఇన్ చార్జీల ప్రకటించిన బీఆర్ఎస్..
Hyderabad, Telangana:Huge arrangements for jagtial kcr mega public meeting: తెలంగాణ రాజకీయాల్లో జీవన్ రెడ్డి అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి చేరుతానని ప్రకటించినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. జీవన్ రెడ్డి సైతం కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు వెళ్లి కలిసిన తర్వాత మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై తన ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఈ క్రమంలో..జీవన్ రెడ్డి లాంటి నిజాయితీ, నిబద్దత గల నాయకులు పార్టీలో ఉంటే మరింత పట్టుదలతో ముందుకు వెళ్లవచ్చని బీఆర్ఎస్ యోచిస్తుంది. మరోవైపు ఉత్తర తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పట్టు బిగించే విధంగా నేతలు పావులు కదుపుతున్నారు.
ఇప్పటికే ఏప్రిల్ 20న బీఆర్ఎస్ బహిరంగ సభకు బీఆర్ఎస్ నాయకులతో పాటు, జీవన్ రెడ్డి కూడా బహిరంగ సభఎక్కడ నిర్వహించాలో పలు ప్రదేశాలను సందర్శించారు . ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ జగిత్యాలలో మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ఇన్ చార్జీలను ప్రకటించింది.
ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇన్చార్జీలను ప్రకటించారు. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ, సభ విజయవంతం కోసం సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించింది.
ముఖ్యంగా జగిత్యాల జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేక ఇన్చార్జీలను కేటీఆర్ ఖరారు చేశారు.
నియోజకవర్గాల వారీగా ఇన్చార్జీలు:
జగిత్యాల: పల్లా రాజేశ్వర్ రెడ్డి (ఎమ్మెల్యే, జనగామ)
కోరుట్ల: ప్రశాంత్ రెడ్డి (ఎమ్మెల్యే, బాల్కొండ)
ధర్మపురి: ఎల్. రవీందర్ రావు (ఎంఎల్సీ)
వేములవాడ: బాల్క సుమన్ (మాజీ ఎమ్మెల్యే)
చొప్పదండి: పెద్ది సుదర్శన్ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
సభకు వచ్చే జన సమీకరణ, ప్రాంగణ ఏర్పాట్లు, నిర్వహణ బాధ్యతలను పార్టీ సీనియర్ నేతలు గాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించనున్నారు. వీరు క్షేత్రస్థాయిలో ఉండి సభ ముగిసే వరకు అన్ని ఏర్పాట్లను సమన్వయం చేస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి జగిత్యాల సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ క్రమంలో జగిత్యాలలో నిర్వహించబోయే సభపై తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఇదే సభ వేదికగా బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా ప్రకటిస్తారని తెలంగాణ రాజకీయాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
RTC Strike: ఆర్టీసీలో సమ్మె సైరన్! ఏప్రిల్ 22 నుంచి బస్సులు బంద్? పోరాట గంట మోగించిన జేఏసీ చైర్మన్ వెంకన్న..!!
Lakshmapur, Telangana:RTC Strike Alert: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఆర్టీసీ సమ్మె సెగ రాజుకుంటోంది. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటానికి ఆర్టీసీ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సిద్ధమైంది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సమస్యలు విన్నవిస్తున్నా... పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఏప్రిల్ 21 అర్ధరాత్రి నుంచే సమ్మెలోకి వెళ్తున్నట్లు జేఏసీ చైర్మన్ వెంకన్న స్పష్టం చేశారు.
కార్మికుల సమస్యలపై మార్చి 13నే సమ్మె నోటీసు ఇచ్చామని.. నెల గడువు ముగుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేదని జేఏసీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల సమస్యలను తీర్చాల్సింది పోయి.. బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం అనుసరిస్తున్న మొండి వైఖరి మమ్మల్ని సమ్మె చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు ఉందని వెంకన్న అసహనం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ విలీనం, యూనియన్లకు ఎన్నికల నిర్వహణపై కమిటీ వేశామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెబుతున్న మాటలపై జేఏసీ నేతలు నిలదీశారు. ఆ కమిటీకి చైర్మన్ ఎవరు? ఆ కమిటీకి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను వెంటనే బహిర్గతం చేయండి అని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే తాము అడుగుతున్నామని, కొత్తవేమీ కోరడం లేదని వారు గుర్తు చేశారు.
సమ్మెకు మద్దతుగా దాదాపు 40 వేల మంది కార్మికులు జేఏసీ అడుగుజాడల్లో నడవడానికి సిద్ధంగా ఉన్నారని నేతలు ప్రకటించారు.
ఏప్రిల్ 22 నుంచి: రాష్ట్రవ్యాప్తంగా భారీ ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నాం.
డిమాండ్లు: ఖాళీగా ఉన్న అన్ని కేటగిరీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి.
బదిలీలు: ఎక్కడి కార్మికులు అక్కడే ఉండాలని, అస్తవ్యస్త బదిలీలు ఆపాలని డిమాండ్ చేశారు.
21 అర్ధరాత్రి నుంచే బస్సులు నిలిపివేత:
ఏప్రిల్ 21 అర్ధరాత్రి మొదటి డ్యూటీ నుంచే మా సమ్మె ప్రారంభం అవుతుంది. జేఏసీ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం వేరే ఆలోచనలు చేస్తే ఊరుకోం అని జేఏసీ చైర్మన్ వెంకన్న హెచ్చరించారు. ఈ సమ్మె ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులపై పడే అవకాశం ఉండటంతో, ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందో లేదో వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Viral News: "జీతం ఎంతిస్తే.. పనంతే చేస్తా".. ఆఫీసులో 5 గంటలు కునుకు తీసిన ఉద్యోగి.. నెట్టింట రచ్చ రేపుతున్న పోస్ట్..!!
Lakshmapur, Telangana:Low salary sleep at work viral: సాధారణంగా ఆఫీసుల్లో జీతం పెంచలేదని.. లేదంటే తక్కువ జీతం ఉందని ఏం చేస్తారు? బాస్ ను రిక్వెస్ట్ చేస్తారు.. లేదంటే.. గొడవపడుతుంటారు. లేదంటే ఇంక్రిమెంట్ అది కూడా కాదంటే రిజైన్ చేసి వేరే కంపెనీకి మారుతుంటారు. కానీ చైనాలోని హెనాన్ ప్రాంప్తం, షాంగ్ క్యూ నగరానికి చెందిన ఓ మహిళ ఉద్యోగిని మాత్రం చాలా వెరైటీగా ఆలోచించింది. "నువ్వు నాకు ఇచ్చే జీతానికి.. నేను చేసే పనంతే" అంటూ ఏకంగా ఆఫీసులోనే తన డెస్కులో కుర్చీలో 5గంటల పాటు మాంచిగా గుర్రు పెట్టి నిద్రపోయింది. ఆ తర్వాత జరిగిన డ్రామా చూస్తే మీరు నవ్వు ఆపుకోలేరు.
సదరు మహిళా ఉద్యోగి నిద్రపోయిన విషయాన్ని గమనించిన బాస్.. ఏంటీ రోజంతా ఆఫీసులోనే నిద్రపోయావా? అని నిలదీశారు. ఆ అమ్మడు ఏమాత్రం తగ్గలేదు..పైగా ఓ కన్నీటి వీడియో పోస్ట్ చేస్తూ.."నువ్వు ఎంతిస్తే పనంతే చేస్తా (You get what you pay for)" అంటూ కొత్త లాజిక్ తీసింది. రోజుకు 8 గంటల డ్యూటీలో 5 గంటలు నిద్రపోతే.. ఇక లంచ్ బ్రేక్.. టీ బ్రేక్ పోను ఆమె పనిచేసేది కేవలం గంటన్నర మాత్రమేనని నెటిజన్లు లెక్కలు వేసి మరీ ట్రోల్ చేస్తున్నారు.
అయితే ఆమె నిరసన నిద్రతో అక్కడికే.. ఆగిపోయి ఉంటే బాగుండేది. కానీ.. 5 గంటల నిద్ర తర్వాత లేవగానే మన ఆవిడకు ఆకలి వేసింది. పక్కనే బాస్ టేబుల్ మీద ఉన్న ఒక చాక్లెట్ కనిపిస్తే టక్కున నోట్లో వేసుకుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ బాస్ పాపం గ్లూకోజ్ ఇంటోలరెన్స్ తో బాధపడుతూ, షుగర్ లెవల్స్ పడిపోయినప్పుడు ప్రాణం నిలబెట్టుకోవడానికి ఆ చాక్లెట్లను దగ్గర పెట్టుకున్నాడు. తీరా టైమ్కు చాక్లెట్ లేకపోయేసరికి ఆయన నీరసించి దాదాపు కుప్పకూలిపోయారు.
దీంతో బాస్ సీరియస్ అయ్యి వార్నింగ్ ఇస్తూ.. "నన్ను చంపేయాలనుకున్నావా అని బాస్ అరుస్తున్నాడు.. నన్ను ఆఫీసులో నుంచి తీసేస్తానని బెదిరిస్తున్నాడు" అంటూ ఆ మహిళ వీడియోలో రచ్చ రచ్చ చేసింది.
ఈ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్ అవ్వడంతో.. మన నెటిజన్లు ఊరుకుంటారు. ఎవరికి నచ్చిన విధంగా వారు పంచ్ లతో సెటైర్లతో ఉతికారేశారు.
"అలారం పెట్టుకోమ్మా..!"
సాధారణంగా సోషల్ మీడియాలో అందరూ బాస్లనే తిడుతుంటారు. కానీ ఈసారి మాత్రం నెటిజన్లు కూడా బాస్కే సపోర్ట్ చేస్తున్నారు.
"ఏ బాస్ అయినా ఇలాంటి ఉద్యోగిని భరిస్తాడా?" అని ఒకరు..
"ఓరి దేవుడో.. నా జీవితంలో ఒక బాస్కు సపోర్ట్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు" అని మరొకరు సెటైర్లు వేశారు.
ఇంకో నెటిజన్ అయితే.. "అమ్మా.. వచ్చేసారి నిద్రపోయే ముందు అలారం పెట్టుకో.. లేదంటే ఆఫీసు టైమ్ అయిపోయినా అక్కడే నిద్రపోతావు" అంటూ చురకలు వేశాడు.
మొత్తానికి "తక్కువ జీతం ఇస్తే ఆఫీసులోనే నిద్రపోతా" అన్న ఈమె నిరసన ఇప్పుడు ఇంటర్నెట్ను ఊపేస్తోంది. కార్పొరేట్ లోకంలో నిద్ర కూడా ఒక నిరసన ఆయుధం అని ఈ చైనా వనిత నిరూపించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
