రైతులతో మంత్రి పొంగులేటి సమావేశమయ్యారు
Dhamsalapuram, Telangana:ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. డివిజన్లో వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 37 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మార్గమధ్యంలో మంత్రి రైతు కూలీలను కలుసుకుని వారి కష్టాలు. ఎలాంటి ధాన్యం వేస్తున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ప్రజాపరిపాలనపై ఆరా తీశారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
మార్మోగిన గోవింద నామస్మరణ.. తిరుమలలో వైభవంగా ఏరువాక పౌర్ణమి 'గరుడ సేవ'
Tirupati Urban, Andhra Pradesh:Eruvaka Pournami: ప్రతి పౌర్ణమి సందర్భంగా తిరుమల ఆలయంలో నిర్వహించే గరుడ సేవ ఈసారి ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని అత్యంత వైభవంగా జరిగింది. తిరుమల శ్రీవారి సన్నిధిలో పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా.. భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరగ్గా.. పెద్ద ఎత్తున భక్తులు హాజరై తరించారు. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు తన దేవేరులతో కలిసి గరుడవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగి వేలాదిమంది భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు.
గరుడ వాహన సేవ సందర్భంగా వేద పండితుల వేదఘోషలు, మంగళవాయిద్యాలు 'గోవింద... గోవింద..' నామస్మరణలు మార్మోగాయి. గరుడసేవ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉట్టిపడేలా చేసింది. స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గరుడవాహనంపై ఉన్న మలయప్పస్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని.. సర్వదోషాలు తొలగి శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం.
ప్రతి నెల పౌర్ణమి గరుడసేవకు విశేష ప్రాధాన్యం ఉంది. ఈ క్రమంలో జూలైలో వచ్చిన ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని గరుడ సేవకు టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రత, తాగునీరు, వైద్యసేవలు, క్యూలైన్ల నిర్వహణ వంటి ఏర్పాట్లను సమర్థవంతంగా చేపట్టారు. ఉత్సవంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా టీటీడీ అధికారులు, వేలాదిమంది భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తులతో కిక్కిరిసిన తిరుమాడ వీధులు, విద్యుత్ దీపాలంకరణలు, భక్తి గీతాలు, గోవింద నామస్మరణలతో తిరుమల క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ వైభవమైన పౌర్ణమి గరుడసేవ మరోసారి భక్తులను ఆధ్యాత్మిక అనుభూతిలో ముంచెత్తింది.
భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి శిలాతోరణం వరకు లైన్లో భక్తులు వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 18-24 గంటల సమయం పడుతుంది. రూ.300 శీఘ్రదర్శనానికి 4-5 గంటల సమయం పడుతుండగా.. సర్వ దర్శనం టోకెన్ పొందిన భక్తులకు 5 నుంచి 7 గంటల సమయం పట్టింది. నిన్న స్వామివారిని 91,793 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,221 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా.. హుండీ ఆదాయం రూ.0 కోట్లు వచ్చింది.మొత్తం విక్రయించిన లడ్డూల సంఖ్య రూ.8 లక్షలు, అన్నప్రసాదాలు 3.13 లక్షల మంది భక్తులు స్వీకరించారు.
On the auspicious Pournami, Sri Malayappa Swamy, accompanied by Sridevi and Bhudevi, blessed devotees on the sacred Garuda Vahanam during Pournami Garuda Seva at Tirumala. Thousands witnessed the divine procession with devotion.#ttd #tirumala #garudaseva #malayappaswamy pic.twitter.com/h00l4hhGn8
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) June 29, 2026
దేశం గర్వించేలా అమరావతిని వేగంగా చేస్తాం: సీఎం చంద్రబాబు
Amaravathi, Andhra Pradesh:AP CM Chandrababu Review On Capital Amaravati And Key Orders To Officialsఉద్యోగుల ఫ్రెండ్లీగా ఏపీ ప్రభుత్వం.. సీఎం చంద్రబాబుతో ఉద్యోగ సంఘాలు భేటీ
Amaravathi, Andhra Pradesh:AP Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఇటీవల ఏపీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్ల వరకు పెంచడంతోపాటు కొన్ని శాఖల ఉద్యోగులకు సీపీఎస్ స్థానంలో పాత పింఛన్ విధానం అమలు తదితర నిర్ణయాలు తీసుకోవడంతో పలు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసి ధన్యవాదాలు చెప్పారు. కొద్దిసేపు సీఎం చంద్రబాబుతో చర్చించారు.
ఉద్యోగులకు మేలు చేసేలా ఇటీవల ఏపీ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. 2004 సెప్టెంబర్ ముందు వివిధ నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన ఉద్యోగులకు పాత పింఛన్ విధానం (ఓల్డ్ పెన్షన్ స్కీం) వర్తింపచేయడం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కార్పొరేషన్లకు చెందిన సంస్థలు, గురుకులాలకు చెందిన ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచడం వంటి నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.
గత మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నప్పటి నుంచి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలుస్తూనే ఉన్నారు. తాజాగా సోమవారం రాష్ట్ర సచివాలయంలో వివిధ ఉద్యోగ సంఘాలకు చెందిన ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ నేతృత్వంలో ఉద్యోగ సంఘాల నాయకులు సీఎం చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం చేసిన మేలును మరువలేమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు.
కూటమి ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటోందని.. తాము ఉద్యోగులకు సహకరించినట్టే... ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఏపీఆర్ఈఐ సొసైటీతోపాటు వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సంస్థల సొసైటీలు, డీఎస్సీ 2003 టీచర్ల ఫోరమ్కు చెందిన ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో గురుకులాల జేఏసీ నాయకులు దామచర్ల మధుసూదన రావు, ప్రభాకర్, రామ్మోహన్ రావు, రమేష్, డీఎస్సీ 2003 ఫోరం ప్రతినిధులు మోపిదేవి శివ శంకర్రావు, గురు బ్రహ్మం, రాజేష్ ఉన్నారు.
రేపే తెలంగాణ రైతు భరోసా.. రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ కానున్న డబ్బులు
Hyderabad, Telangana:Rythu Bharosa Amount: తెలంగాణ రైతులకు భారీ శుభవార్త. పంట పెట్టుబడి సహాయంగా అందించే రూ.6 వేలు రేపు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం రేపు రైతులకు డబ్బులు వేయనుంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతు ఆశీర్వాద సభ వేదిక మార్చివేసి హైదరాబాద్కు మార్చారు. రైతు భరోసా నిధుల విడుదల యథావిధిగా కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించారు. హైదరాబాద్లోని శిల్పాకళావేదిక నుంచి రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం జరగనుంది. మొదటి విడతలో రెండు ఎకరాల వరకు భూమి కలిగిన 41.37 లక్షల మంది రైతులకు రూ.2,482.02 కోట్లు జమ చేయనుంది.
మెగా రైతు మేళా రద్దు
రైతు భరోసా నిధుల విడుదలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభ వేదికను మార్చినట్లు తెలిపారు. రైతుల భద్రత, ప్రజాప్రతినిధుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని.. మధిరలో రైతుల కోసం భారీ ఎత్తున ఏర్పాటుచేయాలనుకున్న 'మెగా రైతు మేళా'ను కూడా నిర్వహించడం సాధ్యం కాలేదని మంత్రి వివరించారు.
రైతుల ఖాతాల్లో జమ
వర్షాలు విస్తరిస్తుండటంతో రైతులు విత్తనాలు వేసే అత్యంత కీలక సమయంలోనే రైతు భరోసా పెట్టుబడి సహాయం రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలంగాణ మంత్రి తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేకుండా రైతు భరోసా నిధులను రేపు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని శిల్పకళావేదికలో రైతు ఆశీర్వాద సభ నిర్వహించనున్నట్లు.. అక్కడ రైతు భరోసా నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుందని మంత్రి వెల్లడించారు.
రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు
'రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు అందాల్సిన పెట్టుబడి సహాయాన్ని అందించాలనే దృఢసంకల్పంతో రైతు భరోసా నిర్వహిస్తాం. రైతులు విత్తనాలు వేసే సమయంలోనే ఆర్థిక భరోసా అందించడం ద్వారా సాగు వ్యయభారాన్ని తగ్గించడంతో పాటు వ్యవసాయ కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది' అని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 73.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు దశలవారీగా జమ చేయనున్నారు. తొలి విడతలో రెండు ఎకరాల వరకు భూమి కలిగిన 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది.
కొత్తగా పాస్ పుస్తకాలు
తొలి విడతలో ఒక ఎకరం, మరో విడతగా రెండు ఎకరాలు కలిగిన రైతులకు డబ్బులు జమ చేయనుండగా.. తర్వాత మిగిలిన రైతులకు దశలవారీగా రైతు భరోసా నిధులు జమ చేయనున్నారు. కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు జూలై 5వ తేదీలోపు సమీప వ్యవసాయ విస్తరణాధికారిని కలిసి బ్యాంకు అకౌంట్ వివరాలు సమర్పిస్తే రైతు భరోసా పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
రైతు భరోసా వివరాలు
తొలి విడతలో ఒక ఎకరం వరకు భూమి కలిగిన 14.65 లక్షల మంది రైతుల కోసం రూ.878.94 కోట్లు
రెండు ఎకరాల వరకు భూమి కలిగిన 26.72 లక్షల మంది రైతుల కోసం రూ.1,603.08 కోట్లు
హైదరాబాద్ ప్లస్గా అమరావతి నిర్మాణం.. దేశం గర్వించేలా నిర్మిస్తాం: సీఎం చంద్రబాబు
Amaravathi, Andhra Pradesh:Capital Amaravati: దేశం గర్వించే రాజధాని నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని.. అమరావతి అంటే ఏపీతోపాటు దేశానికి గౌరవం సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాద్ ప్లస్గా అమరావతి నిర్మాణం జరగాలని.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి నగర నిర్మాణంలో కాంట్రాక్టు సంస్థలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అమరావతి నిర్మాణంలో పని చేశామన్న బ్రాండ్ను కాంట్రాక్టర్లు సంపాదించేలా పనులు చేపట్టాలని సూచించారు. రాజధాని నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
కాంట్రాక్టు సంస్థలతో సమీక్ష
అమరావతిలో నిర్మాణ పనుల పురోగతిపై సచివాలయంలో సోమవారం సీఎం చంద్రబాబు కాంట్రాక్టు సంస్థలతో సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత గడువు కంటే ముందే నిర్మాణ పనులు పూర్తి చేయాలని చెప్పారు. ప్రస్తుతం రూ.50,999 కోట్ల విలువైన పనులు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించామని.. హౌసింగ్, ట్రంక్ ఇన్ ఫ్రా, ఎల్పీఎస్ ఇన్ ఫ్రా, సహా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్ల లాంటి ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రాజెక్టులు వేగంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. పనులు వేగంగా చేసేందుకు అవసరమైన మానవ వనరులు, యంత్రాలు ఇతర సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించారు.
పనులు ఇలా
అమరావతి నిర్మాణ పనులపై మున్సిపల్, పట్టణ శాఖ మంత్రి నారాయణ స్పందిస్తూ సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చారు.ప్రస్తుతం 26,924 మంది కార్మికులు, 5,140కి పైగా భారీ యంత్రాలు అమరావతి నిర్మాణ పనుల్లో నిమగ్నమైనట్టు వివరించారు. నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహాలు సజావుగా సాగేందుకు వీలుగా వాటిని వెడల్పు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ ప్రాంతం పునీతం..
భవిష్యత్ నగరంగా నిర్మిస్తున్న అమరావతి నిర్మాణంలో పని చేశామన్న బ్రాండ్ను కాంట్రాక్టర్లు సంపాదించేలా పనులు చేపట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. కొందరు వ్యక్తులు కావాలని లిటిగెంట్లుగా మారి రాజధాని పనుల్ని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని .. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్లాలని చెప్పారు. కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల నివాసాలు, రహదారులు, మౌలిక సదుపాయాలతో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్ల నిర్మాణాలపై ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. దేశవ్యాప్తంగా వివిధ పుణ్య క్షేత్రాలు, నదుల నుంచి పవిత్రమైన మట్టి, నీళ్లు తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశామని.. గత పాలకులు ఐదేళ్ల పాటు రాజధాని నిర్మాణాన్ని ఆపేశారని సీఎం చెప్పారు.
మళ్లీ గాడిలో..
గడిచిన రెండేళ్లుగా అమరావతి నిర్మాణాన్ని మళ్లీ గాడిలో పెట్టామని.. అత్యుత్తమ నివాసయోగ్య నగరంగా నిర్మాణం చేస్తున్న అమరావతిలో భాగస్వాములం అయ్యామన్న ఆలోచనతో కాంట్రాక్టు సంస్థలు పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. పనులు పూర్తి అయ్యాక రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తామని సీఎం తెలిపారు. నిర్మాణ పనుల వేగంతో పాటు నాణ్యత పై కూడా ఎక్కడా రాజీ లేకుండా చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
అమరావతికి పేరు తెచ్చేలా..
అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ భవనాలు ఐకానిక్ నిర్మాణాలుగా ఉండాలని.. అమరావతికి పేరు తెచ్చేలా ఈ భవనాలను నిర్మించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అమరావతి రాజధాని నిర్మాణంలో చిన్న ఇబ్బందులు కూడా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ప్రతీ రెండు నెలలకు ఒకసారి నిర్మాణాల పురోగతిపై సమీక్షిస్తానని తెలిపారు. ఎల్ అండ్ టీ, షాపూర్ జీ పల్లోంజి, మెగా ఇంజినీరింగ్, ఎన్సీసీ, బీఎస్ఆర్, కేఎంవీ సహా వేర్వేరు కాంట్రాక్టు సంస్థలు చేపట్టిన పనులకు సంబంధించిన అంశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా సంస్థల ప్రతినిధులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. రూ.30 వేల కోట్ల కోసం ఏపీ ప్రభుత్వానికి ఆల్టిమేటం
Nuzendla, Andhra Pradesh:Govt Employees Big Decision: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోకపోవడంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా రూ.30 వేల కోట్ల మేర పేరుకుపోయిన పెండింగ్ బిల్లులపై ఉద్యోగులు పోరాటానికి సిద్ధమయ్యారు. చెల్లించాల్సిన బకాయిల పై ఉద్యమానికి సన్నద్ధం అవుతున్నట్లు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఏదైనా జరిగితే తాము బాధ్యులం కాదని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు.
కలెక్టర్కు వినతి
తమ పెండింగ్ బిల్లుల విడుదల కోసం ఉద్యోగ సంఘాలు రాష్ట్రవ్యాప్త కార్యాచరణ ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా సోమవారం రాజమండ్రి కలెక్టరేట్లో రెవెన్యూ ఉద్యోగులతో కలిసి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. జూలై 12వ తేదీన మొట్టమొదటి ఉద్యమ సన్నద్ధ సభను శ్రీకాకుళంలో నిర్వహిస్తామని ప్రకటించారు.
ఎంతో ఆశ పడ్డాం
'వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సుమారుగా రూ.30 వేల కోట్ల పైచిలుకు బకాయిలు ఉన్నాయి. ఎన్నికల్లో కూటమి నాయకులు తాము అధికారంలోకి వచ్చాక బకాయిలు చెల్లిస్తామని మాట ఇచ్చారు. ఎప్పటికప్పుడు డీఏలు చెల్లిస్తాం.. మంచి పీఆర్సీ ఇస్తాం.. పీఆర్సీ ఆలస్యమైతే ఈలోపు ఐఆర్ చెల్లిస్తాం, సరెండర్ లీవ్స్, ఎర్న్ లీవ్స్, జీతభత్యాలు ఆలస్యం లేకుండా ఉంటాయని చెప్పారు. దీంతో ఎంతో ఆశ పడ్డాం' అని రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వివరించారు.
ఉద్యమానికి సిద్ధం
'గత ప్రభుత్వ హయాంలో ఇవ్వాల్సిన రూ.30 వేల కోట్ల బకాయిలు ఎవరికి ఎంతెంత రావాలో కనీసం లెక్కలు కూడా కూడా వేయలేదు. ఆర్థికంగా ఉద్యోగులు చితికిపోతా ఉంటే కూటమి ప్రభుత్వం కనీసం చర్చించలేదు. మేము ఉద్యమ కార్యాచరణ ప్రకటించినా ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాలు, శాఖాపరమైన సంఘాలందరం కూడా ఉమ్మడిగా నిర్ణయం తీసుకొని ఇప్పటికే ఉద్యమానికి సిద్ధమవుతున్నాం' అని బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు.
సన్నద్ధ సభలు
'ఉద్యమ కార్యాచరణలో భాగంగా జూలై 12వ తేదీన తొలి సన్నద్ధ సభను శ్రీకాకుళంలో నిర్వహించబోతున్నాం. 21వ తేదీన అనంతపురంలో మరో సభ నిర్వహించనున్నాం. అనంతరం ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా సన్నద్ధ సభలు నిర్వహిస్తాం' అని బొప్పరాజు వెంకటేశ్వర్లు కార్యాచరణ ప్రకటించారు. 'పెండింగ్ బిల్లుల కోసం ఉద్యోగులు ఆలోచించే సమయం దాటిపోయింది. తీవ్రమైన పని ఒత్తిడిలో నెట్టివేశారు. ఇది చాలా బాధాకరమైన విషయం' అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఐక్య ఉద్యమాలు
'ఉద్యోగులు అందరికీ అవగాహన కల్పించి ఉద్యమం చేసేందుకు ఏపీ జేఏసీ అమరావతి సిద్ధమవుతుంది. కలిసి వచ్చే సంఘాలన్నీ జేఏసీలో కలుపుకొని ముందుకువెళ్తాం. ఐక్య ఉద్యమాలకు కూడా ఏపీ జేఏసీ అమరావతి పక్షాన సిద్ధంగా ఉంటాం' అని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఉద్యోగులకు రావాల్సిన ఆర్థికపరమైన అంశాల్లో చంద్రబాబు ప్రభుత్వం స్పందించాలని కోరారు. తాము చేపట్టే ఉద్యమంతో ప్రజలకు ఏదైనా అసౌకర్యం కలిగినా.. ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు.
HYDRAA: కబ్జా చెర నుంచి ప్రభుత్వ భూమికి విముక్తి.. రూ.750 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా..
Secunderabad, Telangana:HYDRAA Operation: జలాశయాల పరిరక్షణ, ప్రభుత్వ భూములను కాపాడడం ప్రాధాన్యంగా తీసుకున్న హైడ్రా మరోసారి అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది. కబ్జా కోరల్లో చిక్కుకున్న ప్రభుత్వ భూమిని పరిరక్షించి ప్రజాధనాన్ని హైడ్రా కాపాడింది. అయితే పేదల ఇళ్లను కూల్చారని.. పేదలను నిరాశ్రయులను చేశారని కొందరు చేస్తున్న ప్రకటనలను హైడ్రా ఖండించింది. హైదరాబాద్లోని హస్మత్పేటలో కబ్జాకు గురయిన భూమిని కాపాడినట్లు హైడ్రా ప్రకటించింది.
వాస్తవం ఇదే
హస్మత్పేటలో పేదల ఇళ్లను కూల్చేసిందంటూ కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం, రాజకీయ ప్రేరేపితం అని హైడ్రా ప్రకటన చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించి.. భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం తప్ప దీనిలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టతనిచ్చింది. విమర్శలు చేసే ముందు అసలు అక్కడ ఏం జరిగిందో.. వాస్తవాలు ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని హైడ్రా గుర్తుచేసింది. ఈ సందర్భంగా పూర్తి వివరాలను హైడ్రా వెల్లడించింది.
అసలు ఏం జరిగిందంటే?
హస్మత్పేట సర్వే నంబర్-1లో మొత్తం 108 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి దశాబ్దాలుగా కబ్జాకోరల్లో చిక్కుకుపోయింద. ఆక్రమణల కారణంగా ఇప్పటికే ఆ భూమిలో 98 ఎకరాలు కబ్జాకోరుల పాలైంది. కబ్జాకు గురయిన భూమి కాకుండా ప్రభుత్వానికి 10 ఎకరాలు మాత్రమే మిగిలింది. ఈ పది ఎకరాలను కాపాడి.. భవిష్యత్ తరాల ప్రజా అవసరాలకు ఉపయోగించాలనే ఉద్దేశంతోనే హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది.
రెవెన్యూ శాఖ లేఖ ఆధారంగా
ఆ భూమి పరిరక్షణ కోసం హైడ్రా ఇప్పటికే ప్రజలు నివసిస్తున్న ఏ ఒక్క శాశ్వత ఇంటి జోలికి కూడా వెళ్లలేదు. జీవో నెం.58, 59 కింద క్రమబద్ధీకరణ (రెగ్యులరైజ్) అయిన ఇళ్లను కూల్చేశారని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. రెవెన్యూ శాఖ అధికారుల లేఖ ఆధారంగా.. వారి సమక్షంలోనే భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆపరేషన్ నిర్వహించి ప్రభుత్వ భూమిని పరిరక్షించినట్లు హైడ్రా వెల్లడించింది. ప్రభుత్వ భూమిపై కొత్తగా వేసిన ప్రీకాస్ట్ గోడలు, తాత్కాలిక షెడ్లు, అక్రమ కంచెలు, ప్లాట్లుగా విభజించేందుకు చేసిన ఏర్పాట్లను మాత్రమే తొలగించినట్లు హైడ్రా వివరించింది.
ఎలాంటి రాజకీయ కోణం లేదు
ఈ ఆపరేషన్ హైడ్రా స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయం కాదని.. రెవెన్యూ శాఖ అధికారుల లిఖితపూర్వక విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న భూమిని రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్ అని హైడ్రా తెలిపింది. తాము చేసిన ఆపరేషన్ చట్టబద్ధమైన పరిపాలనా చర్య మాత్రమేనని.. దీనిలో ఎలాంటి రాజకీయ కోణం లేదని హైడ్రా స్పష్టం చేసింది. కబ్జా చెర నుంచి విడిపించిన పదెకరాల ప్రభుత్వ భూమి విలువ బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ.750 కోట్లు ఉంటుందని హైడ్రా తెలిపింది.
స్వార్థ రాజకీయ ప్రచారాలు
ఇంత విలువైన ప్రభుత్వ ఆస్తి కూడా కబ్జాకు గురైతే.. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, పార్కులు, రోడ్ల వంటి ప్రజా అవసరాల కోసం భూమి ఎక్కడి నుంచి వస్తాయని హైడ్రా ప్రశ్నిస్తోంది. ప్రజల ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని హైడ్రా వివరణ ఇచ్చింది. ఆ బాధ్యతను నిర్వర్తిస్తే దానిని రాజకీయ కోణంలో చూడటం ఎంతవరకు సమంజసం? అని తప్పుడు ప్రచారం చేస్తున్న వారి తీరును ఖండించింది. ప్రభుత్వ భూములు అంటే అవి ప్రతి పౌరుడి ఆస్తి అని గుర్తుచేసింది. హస్మత్పేటలో జరిగింది పేదల ఇళ్ల కూల్చివేత కాదు.. దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ కబ్జాలకు చెక్ పెడుతూ రూ.750 కోట్ల విలువైన ప్రజా ఆస్తిని రక్షించిన సాహసోపేతమైన చర్య అని హైడ్రా వెల్లడించింది. దీనిపై కొందరి స్వార్థ రాజకీయ ప్రచారాలు ప్రజలెవరూ కూడా నమ్మకుండా, వాస్తవాలను గ్రహించాలని హైడ్రా సూచించింది.
Hyderabad Twin Reservoirs: భారీ వర్షాల నడుమ నిండు కుండలా మారిన హైదరాబాద్ జంట రిజర్వాయర్లు..
Hyderabad, Telangana:Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..పెట్టుబడికి ఇదే సరైన సమయం?!
Hyderabad, Telangana:Gold Price Today News: గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్లతో నేడు మరోసారి పతనమయ్యాయి. గడిచిన ఏడు నెలల కాలంలోనే అత్యల్ప స్థాయికి ఇరు లోహాల ధరలు పడిపోవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. అయితే నేడు అనగా జూన్ 29న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.Mumbai Hotel Raid: ముగ్గురు హీరోయిన్లతో హైటెక్ లెవల్ వ్యభిచారం..ముంబైలో చీకటి దందా బట్టబయలు
Mumbai, Maharashtra:Mumbai Hotel Raid Actress Rescued: ముంబైలోని గిర్గావ్ ప్రాంతంలో నడుస్తున్న ఒక హై-ప్రొఫైల్ వ్యభిచార ముఠాను ముంబై పోలీసులు ఛేదించారు. ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్న హోటల్పై పోలీసులు దాడి చేసి ముగ్గురు హీరోయిన్లను రక్షించారు. ఈ ఘటన వినోద పరిశ్రమలో పెద్ద కలకలం రేపుతూ, తీవ్ర చర్చకు దారితీసింది.
దక్షిణ ముంబైలోని గిర్గావ్ ప్రాంతంలో ఒక హై-ప్రొఫైల్ వ్యభిచార ముఠాను ముంబై పోలీసులు గుట్టు రట్టు చేశారు. అక్రమ కార్యకలాపాలు జరుగుతున్న హోటల్పై పోలీసులు దాడి చేసి ముగ్గురు హీరోయిన్లను రక్షించగా.. వీరిలో ఒక మరాఠీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి కాగా.. మరొకరు బెంగాలీ సినీ ఇండస్ట్రీకి చెందిన వారిగా గుర్తించారు. అలాగే మూడో వ్యక్తి బాలీవుడ్ చిత్రాల్లో అతిథి పాత్రలు పోషించే నటిగా పోలీసులు గుర్తించారు. ఇప్పుడీ వార్త చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చగా మారింది.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. ముంబైలోని గిర్గావ్లో ఒక హోటల్లో ఉన్నత స్థాయి వ్యభిచార ముఠా పనిచేస్తోందని పోలీసులకు నిఘా సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీసులు సదరు హౌటల్పై దాడి చేశారు. ఈ సీక్రెట్ ఆపరేషన్లో ఇద్దరు హీరోయిన్లను మొదటగా గుర్తించగా.. ఆ తర్వాత మరో హీరోయిన్ ఉందని గుర్తించారు. ఆ తర్వాత దాడిలో పట్టుబడ్డ మహిళలను, ఇతర వ్యక్తులను ఇప్పుడు ముంబై పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా ప్రమేయం ఉన్నారా అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
జనవరిలో ఓసారి దొరికారు..
ఈ ఏడాది జనవరిలో నవీ ముంబైలోని తుర్బే నాకా ప్రాంతంలో మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (AHTU) ఒక భారీ ఆపరేషన్ నిర్వహించింది. తుర్బే నాకాలోని ఒక లాడ్జ్లో నడుస్తున్న వ్యభిచార ముఠాపై దాడి చేసి ఏడుగురు మహిళలను రక్షించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
పోలీసులకు అందిన సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. సమాచారాన్ని ధృవీకరించుకోవడానికి, పోలీసులు ఒక నకిలీ కస్టమర్ను లాడ్జ్కు పంపారు. అక్కడ వ్యభిచారం జరుగుతోందని నిర్ధారించుకున్న తర్వాత, బృందం వెంటనే దాడి చేసింది. ఈ దాడిలో, ఏడుగురు మహిళలను వ్యభిచారం కోసం లాడ్జ్లోని వేర్వేరు గదుల్లో ఉంచినట్లు కనుగొన్నారు. గిర్గావ్లో జరిగిన ఈ ఆపరేషన్ అనంతరం ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి హై-ప్రొఫైల్ వ్యభిచార ముఠాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read: మరోసారి తండ్రి కాబోతున్న ‘కల్కి’ డైరెక్టర్ నాగ్అశ్విన్..సోషల్ మీడియాలో క్రేజీ పోస్ట్
Also REad: సినిమా ప్రారంభం అవ్వకముందే 'ఓజీ 2' స్టోరీ లీక్..నేతాజీ చుట్టూ అసలు కథ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bank Holiday July: జూలైలో భారీగా సెలవులు..ఏకంగా 12 రోజులు మూతపడనున్న బ్యాంకులు..ఎందుకంటే?
Hyderabad, Telangana:Bank Holiday July 2026: ఎల్లుండి నుంచి కొత్త నెల జూలై ప్రారంభం కాబోతుంది. అయితే ఎప్పటిలాగే ఒకటో తారీఖు వస్తే అనేక మార్పులు వస్తుంటాయి. ఈ క్రమంలో మనకు ప్రతినెలా తప్పక అవసరం ఉండే బ్యాంకుల సమాచారం తెలుసుకోవడమూ ముఖ్యమే. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే జూలై నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు మూతపడనున్నాయనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమాచారం ముందే తెలుసుకోవడం వల్ల సకాలంలో మన బ్యాంకు పనులను పూర్తి చేయగలుగుతాం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల జాబితా ప్రకారం.. జూలైలో మొత్తం 12 బ్యాంకులకు సెలవులు రానున్నాయి. వివిధ నగరాలు, రాష్ట్రాలలో సెలవులు ఎప్పుడు ఉన్నాయో మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. బ్యాంకులు 12 రోజుల పాటు ఎందుకు మూసివేయబడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జూలైలో బ్యాంకులు ఎప్పుడు మూతపడతాయి?
జూలై నెలలో 5, 12, 19, 26వ తేదీల్లో ఆదివారాలు కావడం వల్ల ఆ నాలుగు రోజులు తప్పనిసరిగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సెలవు దినంగా పరిగణిస్తారు. అయితే ఆ తర్వాత కొన్ని ముఖ్యమైన ప్రాంతీయ పండుగలు, ఇతర ఉత్సవాల వల్ల బ్యాంకులకు సెలవులు రానున్నాయి. జూలై 6వ తేదీ MHIP దినోత్సవం కారణంగా మిజోరాంలోని ఐజ్వాల్ సెలవు రానుంది. జూలై 9వ తేదీ బెహ్దియెన్ఖ్లామ్ సందర్భంగా షిల్లాంగ్లో సెలవు రానుంది. జూలై 11 తేదీన రెండో శనివారం.. అలాగే జూలై 25న నాలుగో శనివారం కావడం వల్ల దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు ఉండనుంది.
ఆ తర్వాత ఒడిశాలో ఘనంగా నిర్వహించే జగన్నాథ రథయాత్ర సందర్భంగా జూలై 16న ఆ రాష్ట్రంలో సెలవుగా ప్రకటించగా.. అదే రోజున కాంగ్, హరేలా ఉత్సవాల కారణంగా డెహ్రాడూన్, మణిపూర్ ప్రాంతాల్లో సెలవు ఉండనుంది. జూలై 17వ తేదీన తీరోత్ సింగ్ వర్ధంతి కారణంగా మేఘాలయలోని షిల్లాంగ్, జూలై 18వ తేదీ ద్రుక్పా త్షే జీ ఉత్సవం కారణంగా సిక్కింలోని గాంగ్టక్.. అలాగే జూలై 22న ఖర్చీ పూజ సందర్భంగా త్రిపురలో బ్యాంకులు మూతపడనున్నాయి.
అయితే మీ నగరంలో బ్యాంకులు మూసివేసినా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్యాంకు శాఖలు మూసివేసినప్పటికీ, డిజిటల్ బ్యాంకింగ్ యథావిధిగా పనిచేస్తూనే ఉంటుంది. మీరు UPI, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, బ్యాంకింగ్ యాప్ల ద్వారా ఆన్లైన్ చెల్లింపులు చేయవచ్చు.
నగదు జమ చేయాల్సి వస్తే ఏమి చేయాలి?
బ్యాంకు మూసి ఉన్నప్పుడు మీరు మీ ఖాతాలో నగదు జమ చేయవలసి వస్తే, మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవు. అటువంటి పరిస్థితిలో, మీరు బ్యాంకు బయట ఉన్న నగదు డిపాజిట్ మెషీన్ను ఉపయోగించవచ్చు. దీని ద్వారా మీ ఖాతాలోకి నగదును సులభంగా బదిలీ చేసుకోవచ్చు.
Also Read: ఉద్యోగులకు సూపర్ గుడ్న్యూస్..మరో 3 శాతం పెరగనున్న డీఏ..అకౌంట్లోకి అప్పటి నుండే?
ALso REad: రాష్ట్ర చరిత్రలో అరుదైన రికార్డు..జూలైలో అత్యధికంగా 27 రోజులు స్కూల్ వర్కింగ్ డేస్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Idupu Kayitham Controversy: "హైదరాబాద్లో ఆంధ్రావాళ్లు ఉండొద్దంటే ఆ పని చేయండి".. జబర్దస్త్ నటుడు సంచలన వ్యాఖ్యలు!
Hyderabad, Telangana:Mahidhar Idupu Kayitham Controversy: సోషల్ మీడియాలో ఆంధ్ర-తెలంగాణ మధ్య కొత్తగా మరో వివాదం రాజుకుంది. 'ఇడుపు కాయితం' అనే సినిమా టైటిల్ తో మొదలైన ఈ రచ్చ, ప్రస్తుతం పీక్స్కి చేరింది. ఈ నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్, జబర్దస్త్ ఫేమ్ మహిధర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
"హైదరాబాదులో ఆంధ్ర వాళ్ళు తమ ఆస్తులు అమ్మేస్తే తెలంగాణ వాళ్లు కొనగలరా?" అంటూ మహీధర్ మాట్లాడిన ఒక పాత వీడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్ కావడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వివాదంపై స్పందించిన యూట్యూబర్ మహిధర్.. తాజాగా మరో వీడియో విడుదల చేసి, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
తన మాటలు తెలంగాణ ప్రజలందరినీ ఉద్దేశించినవి కావని.. ఆంధ్ర తెలంగాణ గొడవలు జరిగినప్పుడు ఆంధ్ర వాళ్ళు వెళ్లిపోవాలి అంటూ కామెంట్లు చేసే కొందరిని మాత్రమే ఉద్దేశించి అన్నానని ఆయన స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు తప్పేనని ఒప్పుకుంటూ క్షమాపణలు చెప్పారు.
ఒకవేళ హైదరాబాద్లో తెలంగాణ వాళ్లు మాత్రమే ఉండాలి.. ఆంధ్ర వాళ్ళు ఉండకూడదు అనే గట్టిగా భావిస్తే.. సోషల్ మీడియాలో రచ్చ చేయడం మానేసి, తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి నోటీసులు తెచ్చుకోవాలంటే ఆయన సూచించారు. కొందరి తప్పులను మొత్తం రాష్ట్రానికి ఆపాదించడం సరికాదని, ఇలాంటి వివాదాలు వల్ల రెండు రాష్ట్రాల మధ్య దూరం పెరుగుతుందని మహిధర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత మహీధర్ తన వివాదాస్పద వీడియోను ప్రైవేట్ చేసినప్పటికీ.. దానికి సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. భావద్వేగాలకు లోనవ్వకుండా సమయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
నటుడు నరేష్ స్పందన..
అదేవిధంగా టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ కూడా వివాదం పై స్పందించారు. తెలుగు మాండలికాలను గౌరవించాలని, అందరం తెలుగు వాళ్ళమేనని గొడవ సద్దుమణిగేలా చేయడానికి ప్రయత్నించినప్పటికీ.. రాజకీయ నాయకుల ప్రమేయంతో వివాదం మరింత పెద్దదయిందని నరేష్ అన్నారు.
Also Read: సినిమా ప్రారంభం అవ్వకముందే 'ఓజీ 2' స్టోరీ లీక్..నేతాజీ చుట్టూ అసలు కథ!
Also Read: 'వారణాసి' సినిమా స్టోరీ లీక్ చేసిన రాజమౌళి..రూ.3,000 కోట్లు పక్కా అంటున్న ఫ్యాన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hair Fall Solution: వర్షాకాలంలో విపరీతంగా జుట్టు రాలుతుందా? హెయిర్ ఆయిల్ కండిషనర్ లో ఏది బెస్ట్!
Hyderabad, Telangana:Monsoon Hair Fall Solution: వర్షాకాలం రాగానే ప్రకృతి పచ్చదనంతో మెరిసిపోతుంది. కానీ, మన జుట్టు మాత్రం పొడిబారి, జీవం కోల్పోయినట్లు తయారవుతుంది. ఉదయం లేవగానే దిండు మీద తల దువ్వుకునేటప్పుడు చుట్టూ చూసి చాలా మంది బాధపడుతుంటారు. గాల్లో ఉండే తేమ, దుమ్ము, ధూళి వల్ల జుట్టు జిడ్డుగా మారి హెయిర్ ఫాల్ దారి తీస్తుంది.
ఇలాంటి సమయంలో జుట్టును కాపాడుకునేందుకు మార్కెట్లో దొరికే అనేక రకాల ఉత్పత్తులను ఏది వాడాలో తెలియక చాలామంది గందరగోళానికి గురవుతారు. ముఖ్యంగా ఎప్పటినుంచో వస్తున్న కొబ్బరి నూనె జుట్టుకు మేలు చేస్తుందా? లేదా మోడరన్ హెయిర్ కండిషన్ జుట్టు కాపాడుతుందా? అనే అయోమయానికి చాలామంది గురవుతున్నారు. అయితే ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనే విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.
వర్షాకాలంలో జుట్టు ఎందుకు ఎక్కువ రాలుతుంది?
1) ఈ మాన్సూన్ సీజన్లో గాల్లో ఫేమస్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల స్కాల్ప్ ఎప్పుడు జిడ్డుగా మారి, జుట్టు కుదుళ్ళను బలహీన పరుస్తుంది.
2) తేమతో కూడిన వాతావరణం వల్ల తలలో ఫంగల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, చుండ్రు వేగంగా విస్తరిస్తాయి.
3) వాతావరణంలోని కాలుష్యం, కెమికల్స్ వర్షపు నీటితో కలిసి ఉంటాయి. ఈ నీటిలో జుట్టు తడవడం వల్ల అది కాంతిహీనంగా మారి త్వరగా చిట్లిపోతుంది.
హెయిర్ ఆయిల్ Vs కండిషనర్
హెయిర్ ఆయిల్, కండిషనర్ అనే ఉత్పత్తులు దేని ప్రయోజనాలు దానికి ఉన్నాయి. అయితే వర్షాకాలంలో వీటిని వాడే పద్ధతి మార్చుకోవాలి.
హెయిర్ కండిషనర్
వర్షాకాలంలో గాలిలోని తేమను జుట్టు పీల్చుకోవడం వల్ల అది ఉబ్బిపోయి, చిక్కుబడి గడ్డిలా మారుతుంది. కండిషనర్ జుట్టుపై పొరను మృదువుగా చేసి తేమను లాక్ చేస్తుంది. జుట్టు చుట్టూ ఒక రక్షణ పొరను ఏర్పరిచి బాహ్య వాతావరణం వల్ల జుట్టు పాడవకుండా కాపాడుతుందని అధ్యయనం పేర్కొంది. కాబట్టి ఈ సీజన్ లో జుట్టు చిక్కబడకుండా, చిట్లిపోకుండా ఉండాలంటే కండిషనర్ వాడటం చాలా ముఖ్యం.
హెయిర్ ఆయిల్
హెయిర్ ఆయిల్ జుట్టుకు మేలు చేస్తుందని మన తరాల నుంచి చెబుతున్న విషయం. అయితే వర్షాకాలంలో నూనె రాసి పద్ధతి మార్చుకోవాలి. తలకు నూనె రాసి గంటలు తరబడి లేదా రోజంతా అలానే వదిలేయకూడదు. అలా చేస్తే బయట ఉండే దుమ్ము, దూళి తలకు అంటుకుని చుండ్రు, ఇన్ఫెక్షన్లు ఎక్కువవుతాయి. తలస్నానం చేయటానికి ఒకటి లేదా రెండు గంటలు ముందు గోరువెచ్చటి నూనెతో కుదుళ్ళను మసాజ్ చేసుకొని.. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి.
వర్షాకాలంలో జుట్టు రాలకుండా పాటించాల్సిన చిట్కాలు..
1) వర్షంలో తడిసి ఇంటికి వచ్చిన వెంటనే మంచి నీటితో తల స్నానం చేసి, జుట్టును పూర్తిగా ఆరబెట్టుకోవాలి.
2) వర్షాకాలంలో తడి చుట్టూ చాలా సున్నితంగా ఉంటుంది. ఈ సమయంలో దువ్వెనతో దువ్వితే జుట్టు విపరీతంగా ఊడిపోతుంది.
3) తలలో చెమట, తేమ లేకుండా ఎప్పటికప్పుడు పొడిగా ఉంచుకోవడమే ఈ రెయినీ సీజన్లో కాపాడుకునే అసలైన సీక్రెట్.
గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, నిపుణుల సూచన ఆధారంగా ఇది అందించాము. దీన్ని పాటించే ముందు మీ జుట్టు తత్వాన్ని బట్టి మీ వ్యక్తిగత నిర్ణయం తీసుకోవడం మంచిది. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.
Also Read: రోజు 10 నిమిషాల యోగా చేయడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
Also REad: రోజూ యోగా చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP New Pension: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్..జూలై 1 నుంచి కొత్త పింఛన్లు పంపిణీ..
Vijayawada, Andhra Pradesh:AP New Pension Release Date 2026: ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. జులై 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లు పంపిణీకి సర్కార్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ క్రమంలో అర్హులైన పాత లబ్ధిదారులతో పాటు కొత్తగా స్పౌజ్ కేటగిరీ కింద ఎంపికైన వారికి కూడా జులై ఒకటో తేదీనే పింఛన్లు అందించనున్నట్లు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
ఒకే రోజు రూ.2,711 కోట్లు పంపిణీ..
వచ్చేనెల ఒకటవ తేదీన అందించే పెన్షన్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.2,711 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 62,19,648 మంది పెన్షన్ దారులకు లబ్ధి చేకూరనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు కేవలం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసమే రికార్డు స్థాయిలో రూ.68,598.44 కోట్లను ఖర్చు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
స్పౌజ్ పింఛన్ అంటే ఏమిటి?
ప్రభుత్వ నుంచి ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారుడు (భర్త) ఒకవేళ మరణిస్తే ఆ కుటుంబానికి పెద్దదిక్కు కోల్పోయి బాధ మిగలకుండా ఆసరా నిలిచేందుకు ఈ పింఛన్లు ప్రవేశపెట్టారు. భర్త మరణం తర్వాత పింఛన్ ను అతని భార్యకు బదిలీ చేస్తారు. స్పౌజ్ కేటగిరీ కింద ఎంపికైన లబ్ధిదారులకు నెలకు రూ.4,000 చొప్పున ఆర్థికసాయం అందుతుంది. ఈనెల కొత్తగా 7,792 మందికి స్పౌస్ పెన్షన్లు మంజూరు అయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.3.12 కోట్లను విడుదల చేసింది.
త్వరలోనే వితంతు పెన్షన్లు..
కొత్తగా వితంతు పెన్షన్ మంజూరు కోసం కూడా ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కేటగిరీ కింద సుమారు 2.20 లక్షల మంది అర్హులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరో రెండు నెలల వ్యవధిలోని వీరందరికీ కూడా కొత్త వితంతు పెన్షన్లు అందేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట..ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్పై గడువు పొడిగింపు..
ALso REad: రాష్ట్ర చరిత్రలో అరుదైన రికార్డు..జూలైలో అత్యధికంగా 27 రోజులు స్కూల్ వర్కింగ్ డేస్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Plane Crash Today: బిగ్ బ్రేకింగ్.. మరో ఘోర విమాన ప్రమాదం.. 11 మంది దుర్మరణం..
La Celle-sous-Gouzon, Nouvelle-Aquitaine:France Plane Crash: ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మన దేశంలో గతేడాది అహ్మదాబాద్ విమాన ప్రమాదం మరువక ముందు ఎన్నో అనేక దేశాల్లో ఘోర విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఫ్రాన్స్లోని ఓ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న 11 మంది దుర్మరణం పాలైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. తూర్పు ఫ్రాన్స్కు చెందిన ఈ పౌర విమానం కొందరు స్కై డైవర్లతో ప్రయాణం చేస్తుండగా ఈ దుర్ఘటన జరగడం గమనార్హం.
ఈ విమానం తూర్పు ఫ్రాన్స్లోని ఒక పారాచూటిస్ట్ (స్కై డైవింగ్ స్కూల్) పాఠశాలకు చెందినదిగా అధికారులు గుర్తించారు. ఈ విమాన ప్రమాదంలో పైలట్తో పాటు విమానంలోని 10 మంది ప్రయాణికులు - ఐదుగురు విద్యార్థులు, ఐదుగురు శిక్షకులు మరణించినట్లు సమాచారం అందుతోంది.
స్థానిక కాలమానం (ఫ్రాన్స్) ప్రకారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నాన్సీ నగరానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని, స్థానికంగా ఉండే విలేకర్లు తెలియజేశారు. దీంతో అత్యవసర సేవల సిబ్బంది వెంటనే స్పందించారని, అధికారులు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను సేకరిస్తున్నారని వార్తా సంగ్రాహకులు చెప్పారు.
అయితే మరణించిన వారిలో ఐదుగురు స్కై డైవింగ్ ట్రైనర్స్తో పాటు ఐదుగురు స్టూడెంట్స్.. ఒక పైలట్ ఉన్నారని స్పష్టం అయ్యింది. అయితే ఈ ప్రమాదంలో లేదా మృతుల్లో సాధారణ ప్రయాణికులు ఎవరూ లేరని అధికారులు స్పష్టం చేశారు.
ఈ ఘటనకు గల కారణం వెంటనే స్పష్టంగా తెలియరాలేదు. విమానాశ్రయం వద్ద ఉన్న బాధితుల బంధువుల సంరక్షణ కోసం వైద్య, మానసిక బృందాలను మోహరించారు. ఒక సాంకేతిక దర్యాప్తును ప్రారంభించినట్లు నాన్సీ నగర డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమౌరీ లాకోట్ తెలిపారు.
అత్యవసర సేవల రాకపోకలకు వీలు కల్పించేందుకు, విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతానికి పోలీసులు ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. అలాగే ప్రమాదం వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టారు. ఫ్రెంచ్ అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నునెజ్, మధ్యాహ్నం తర్వాత ప్రమాద స్థలాన్ని సందర్శించనున్నారని ఆయన సిబ్బంది తెలిపారు.
Also REad: ఉద్యోగులకు సూపర్ గుడ్న్యూస్..మరో 3 శాతం పెరగనున్న డీఏ..అకౌంట్లోకి అప్పటి నుండే?
Also Read: 2005 ముందు నాటి కరెన్సీ నోట్లు పనిచేయవా? షాకింగ్ న్యూస్ చెప్పిన నేషనల్ బ్యాంక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
