రైతులతో మంత్రి పొంగులేటి సమావేశమయ్యారు
Dhamsalapuram, Telangana:ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. డివిజన్లో వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 37 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మార్గమధ్యంలో మంత్రి రైతు కూలీలను కలుసుకుని వారి కష్టాలు. ఎలాంటి ధాన్యం వేస్తున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ప్రజాపరిపాలనపై ఆరా తీశారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
ఉద్రిక్తతల వేళ మోదీ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ మూడు డిమాండ్లు.. అవి ఏమిటంటే?
New Delhi, Delhi:Dharmendra Pradhan Resign: నీట్ పరీక్ష పేపర్ లీక్పై పోరాటం చేస్తు0న్న విద్యార్థులపై పోలీసులు అమానుషంగా లాఠీఛార్జ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఖండించారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక దేశంలో 152 సార్లు పేపర్లు లీకేజ్లు జరిగాయని ప్రకటించారు. అన్ని సార్లు పేపర్ లీకేజీలు జరిగితే ఒక్కరికి కూడా శిక్ష పడలేదని చెప్పారు. నిరసనలు తప్ప విద్యార్థులు చేసిన నేరం ఏమిటని ప్రశ్నించారు. భారతదేశంలో విద్యా వ్యవస్థను మోదీ నాశనం చేశారని ఆరోపించారు. ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఎన్డీఏ సర్కారు పబ్లిక్ సెక్టార్లను ప్రైవేటీకరిస్తోందని చెప్పారు.
నీట్ విద్యార్థుల కోసం న్యూఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జంతర్ మంతర్లో చోటుచేసుకున్న ఉద్రిక్తత పరిస్థితులు, లాఠీచార్జ్లపై వీడియోలు చూపించి పోలీసుల దమనకాండను ఖండించారు. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా విద్యార్థులు న్యాయం, జవాబుదారీతనం కోరుతూ తమ గళాన్ని వినిపిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మూడు డిమాండ్లు చేశారు.
రాహుల్ మూడు డిమాండ్లు
1. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి.
2. విద్యార్థులపై దాడి చేసిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుని బాధ్యులను శిక్షించాలి.
3. విద్యార్థులకు జరిగిన అన్యాయంపై ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి.
మోదీ ప్రభుత్వం 152 ప్రశ్నపత్రాల లీకులు జరిగాయని.. వాటి వలన 7.5 కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమయ్యారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. అయితే వీటిలో ఒక్కరికి కూడా శిక్ష పడలేదని చెప్పారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని.. విద్యార్థులకు నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని రాహుల్ చెప్పారు.
We fully support the students' demands. The Opposition, as a whole, 100 percent supports these demands.
: LoP Shri @RahulGandhi pic.twitter.com/c0isuuVnll
— Congress (@INCIndia) July 22, 2026
ఒకప్పుడు ప్రపంచంలో అత్యుత్తమ విద్యా వ్యవస్థల్లో ఒకటిగా పేరొందిన భారత విద్యా వ్యవస్థ ఇప్పుడు అక్రమాలతో నిండిన వ్యవస్థగా మారిందని మోదీ పాలనపై లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తెలిపారు. పదేళ్లలో 152 ప్రశ్నాపత్రాల లీక్లు జరగ్గా.. నెలకు దాదాపు ఒకటి చొప్పున జరుగుతున్నట్టేనని పేర్కొన్నారు. లీక్ల ప్రభావంతో 7.5 కోట్ల మంది విద్యార్థులు, వారి కుటుంబాలపై పడిందని.. వారంతా మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందినవారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
పేద, మధ్య తరగతి ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తున్నారని.. వారి ఆశలను పూర్తిగా అవమానిస్తున్నారని మోదీ పాలనపై రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. 'కొందరు వ్యక్తులు లేదా ఒక వర్గం భారతదేశ విద్యా వ్యవస్థను, దేశంలో అత్యంత విలువైన సంపదైన విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏం చేసింది?' అని ప్రశ్నించారు. ఒక్క శిక్ష కూడా పడలేదని చెప్పారు. విద్యా వ్యవస్థ అక్రమాలతో నిండిపోయిందనేది ఒక్క విషయమే కాదని.. సామాన్య ప్రజలకు అందని స్థాయిలో ఖరీదుగా కూడా మారిందని తెలిపారు.
pic.twitter.com/qzDPYdNdoxThe Congress Party, the entire Opposition, and LoP Shri Rahul Gandhi stand firmly with the students and their demands.
— Congress (@INCIndia) July 22, 2026
చంద్రబాబు పాలనలో దళారులదే రాజ్యం.. పొగాకు రైతులకు అండగా ఉంటా: వైఎస్ జగన్
Tadepalli, Andhra Pradesh:YS Jagan With Farmers: 'చంద్రబాబు పాలనలో అంతా దళారులదే రాజ్యం. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఆక్వాది అదే స్థితి. వ్యాపారులంతా సిండికేట్. ఎక్కడికక్కడ దోపిడీ పర్వం. సీజన్ ముగుస్తున్నా పొగాకు కొనుగోళ్లు లేవు. ఇప్పటి వరకు కొన్నది కేవలం 16.5 శాతమే' అని మాజీ సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అత్యధికంగా కేజీ రూ.411. 2023–24లో సగటు ధర కేజీ రూ.289 పలికింది. అది అత్యుత్తమ ధర అని నాడు కేంద్రం రిపోర్ట్' అని వైఎస్ జగన్ గుర్తుచేశారు. పొగాకు రైతులకు అండగా, తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. పొగాకు రైతుల సమస్యలపై గట్టిగా పోరాడుతామని.. ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని.. పొగాకు రైతులెవరూ ధైర్యం కోల్పోవద్దని రైతులకు మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పొగాకు రైతులతో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. నెల్లూరు, ప్రకాశం, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో పొగాకు సాగు చేస్తున్న ముఖ్య రైతులు రైతుల అభిప్రాయాలు, వారి సమస్యలు తెలుసుకున్న అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక ప్రసంగం చేశారు. సమస్యలపై పోరాడతామని, అండగా, తోడుగా ఉంటామని ఆయన పొగాకు రైతులకు భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో ప్రభుత్వ తీరుతో పొగాకు రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని, వారికి తాము అండగా, తోడుగా నిలుస్తామని, వారి సమస్యలపై పోరాడుతామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆ దిశలోనే 10 రోజుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి.. పొగాకు రైతులను కలుసుకోనున్నట్లు తెలిపారు. సీజన్ ముగుస్తున్నా ఇప్పటికీ పొగాకు కొనుగోళ్లు లేవని ఇప్పటివరకు 20 శాతం కొనుగోళ్లు కూడా జరగలేదని చెప్పారు.
'అసలు టుబాకో బోర్డు ఎందుకు పెట్టారు? రైతులకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో వ్యాపారులను ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి.. ఆ ప్లాట్ఫామ్లో వివిధ రకాల వ్యాపారులు పార్టిసిపేట్ చేస్తే, ఒక పోటీ వాతావరణం ఏర్పడుతుందని, తద్వారా రైతులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో టుబాకో బోర్డు ఏర్పాటు జరిగింది' అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వెఎస్ జగన్ తెలిపారు. 'చంద్రబాబు అధికారంలోకి వస్తూనే సిండికేట్లో అందరికీ కొమ్ములు వస్తాయి. సిండికేట్ మొత్తం ఏకమై చంద్రబాబునాయుడు చెప్పేది చెబుతూ ఉంటాడు. మనం చేసేది మనం చేస్తుంటాం అన్న ధైర్యంతో ఉంటారు. ఈ ఒక్క పంటే కాదు. ఏ పంట పరిస్థితి అయినా అంతే. దళారీలే వ్యవస్థను నడుపుతున్నారు' అని వైఎస్ జగన్ వివరించారు.
వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో పొగాకు అమ్మకం సజావుగా జరిగేది. కానీ.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అమ్మకం మందగించడంతో పంట నాశనం అవుతోంది. కందుకూరులోని రెండు పొగాకు బోర్డుల్ని మీరు సందర్శిస్తే.. మాకు న్యాయం జరుగుతుంది జగనన్నా!
-వెంకటేశ్వర రెడ్డి గారు, కందుకూరు పొగాకు రైతు… pic.twitter.com/SfFMZlSIcC
— YSR Congress Party (@YSRCParty) July 22, 2026
చంద్రబాబు చెప్పిన తర్వాత కూడా రేట్లు ఇంత దారుణంగా ఉన్న పరిస్థితి ఏమిటి? అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. కంపెనీలపై చంద్రబాబు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? అని నిలదీశారు. ఇంతవరకు ఎన్ని కేసులు పెట్టారు? ఎన్ని లైసెన్సులు సస్పెండ్ చేశారు? ఎంత మందిని బ్లాక్లిస్టులో పెట్టారు? అంటే ఇంతవరకు లైసెన్సులు సస్పెండ్ చేసింది లేదు అని గుర్తుచేశారు. చంద్రబాబు ఏ రకమైన భయాన్ని కలిగించకుండా.. మార్క్ఫెడ్ను రంగంలోకి రానివ్వకుండా మొత్తం అడ్డుకుంటే రైతులకు ఏ రకంగా లాభం జరుగుతుంది? అని ప్రశ్నించారు.
'రైతులు ఎప్పుడు నష్టపోకూడదు. రైతు చల్లగా ఉంటేనే రాష్ట్రం బాగు పడుతుంది. రాష్ట్రం బాగుండాలి అంటే రైతు ముఖంలో చిరునవ్వు ఉండాలి అని చెప్పి.. రైతు పక్షపాత ప్రభుత్వంగా మనం వచ్చినప్పుడు మాత్రమే మార్పులు జరిగాయి' అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. రైతులకు ఆశలు పూర్తిగా సన్నగిల్లిపోయాయి. రైతులకు ఈ ప్రభుత్వం తోడుగా లేదనేది తెలియడంతో దళారీల వ్యవస్థ సిండికేట్గా మారి రైతులందరినీ పూర్తిగా నష్టపరుస్తోంది' అని వివరించారు.
'రైతులకు తోడుగా నిలుస్తాం. ప్రభుత్వాన్ని మేలుకొలిపే కార్యక్రమం చేయగలిగినంత చేస్తాం. రైతులకు నిజంగా మంచి జరగాలన్నా, శాశ్వత మంచి జరగాలన్నా, మనం ఏదైనా చేయాలంటే మూడేళ్లు ఓపిక పట్టాల్సిందే' అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. అన్ని రకాలుగా రైతులకు తోడుగా ఉండే కార్యక్రమం చేస్తామని.. ఏయే జిల్లాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారో.. అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా నిలబడుతుందని ప్రకటించారు. వారం, పది రోజుల్లో నా పర్యటన కూడా ఉంటుంది. ఈసారి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గోపాలపురంలో.. జంగారెడ్డిగూడెంలో పర్యటిస్తా' అని ప్రకటించారు. 'చంద్రబాబు ప్రభుత్వం నిద్ర నటిస్తోంది. నిద్రపోయే వాళ్లను లేపొచ్చు. కానీ నిద్ర నటించే వాళ్లను లేపడం కష్టం' అని వైఎస్ జగన్ తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ప్రయత్నిస్తామని హెచ్చరించారు.
Neet Paper Leak Protest: ఎల్లుండి రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు బంద్..నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో జాతీయ బంద్!
Hyderabad, Telangana:Neet paper leak National Bandh: దేశ రాజధాని ఢిల్లీని కాక్రోచ్ జనాతా పార్టీ చేపట్టిన నీట్ పేపర్ లీక్ నిరసనలు కుదిపేస్తున్నాయి. ఒకవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, మరోవైపు నీట్ పేపర్ లీక్ నిరసనలతో జంతర్ మంతర్ అట్టుడికిపోయింది. దేశ వ్యాప్తంగా నీట్ బాధితులు ఢిల్లీకి భారీగా చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఇండి కూటమి కాక్రోచ్ జనతా పార్టీకి, నీట్ అభ్యర్థులకు తమ మద్దతు తెలియజేశారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతే కాకుండా తరచుగా పలుచోట్ల వీరి నిరసనల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.Seediri Appalaraju Arrest: వైసీపీ నేత సీదిరి అప్పలరాజు అరెస్ట్! కొడుకు కోసం కటకటాల్లోకి మాజీ మంత్రి!
Hyderabad, Telangana:Seediri Appalaraju Arrested: వైఎస్సార్సీపీ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు. ఈ పరిణామంతో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని జీఎంఈ కాలనీలో ఉన్న ఆయన నివాసం వద్ద తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అరెస్ట్ ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఆయన ఇంటి వద్ద భారీగా బలగాలను మోహరించారు.
అరెస్ట్కు నేపథ్యం
ఇటీవల సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ వేగంగా బైక్తో ఢీకొట్టడంతో దానయ్య అనే గొర్రెల కాపరి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే, ఈ ప్రమాద కేసు నుంచి తన కుమారుడిని రక్షించేందుకు మాజీ మంత్రి అప్పలరాజు కుట్ర పన్నినట్లు ఆరోపణలు వచ్చాయి.
అప్పలరాజుపై ప్రధాన ఆరోపణలు..
నేరం కప్పిపుచ్చే ప్రయత్నించిన నేపథ్యంలో నిజమైన నిందితుడైన తన కుమారుడు ఆరవ్ వర్మకు బదులుగా 'సిద్ధార్థ త్యాడి' అనే వ్యక్తిని నిందితుడిగా చూపించి జైలుకు పంపేందుకు ప్రయత్నించడం జరిగిందని ఆధారాలతో పోలీసులు సిద్ధమయ్యారు.
అలాగే ప్రమాదానికి కారణమైన బైక్ను దాచిపెట్టి, కేసు సంబంధిత ఆధారాలను మాయం చేసేందుకు సీదిరి అప్పలరాజు వర్గం యత్నించినట్లు తేలింది.
ప్రమాదం జరిగిన తర్వాత మృతుడి కుటుంబాన్ని ఒత్తిడి చేయడం సహా ఘటనలో మరణించిన దానయ్య కుటుంబాన్ని ప్రలోభాలకు గురిచేయడం వంటివి చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు.
ఈ తీవ్ర ఆరోపణలపై విచారణ జరిపిన పోలీసులు, నిందితులను కాపాడేందుకు కుట్ర పన్నిన ఆధారాల ఆధారంగా సీదిరి అప్పలరాజుపై కేసు నమోదు చేసి, ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read: Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్!
Also REad: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. సోమవారం భారీ వర్ష సూచన..ఈజిల్లాల్లో భారీవర్షం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Dharmendra Pradhan Resign: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా? సోషల్ మీడియాలో రిజైన్ లెటర్ వైరల్!
New Delhi, Delhi:Dharmendra Pradhan Resignation: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించి ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లేఖలో ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారని అందులో పేర్కొన్నారు. అయితే ఈ వాదన తప్పుదోవ పట్టించేదని.. ధర్మేంద్ర ప్రధాన్ ఇంకా తన పదవికి రాజీనామా చేయలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం, నీట్ పేపర్ లీక్ కేసు నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రతిపక్ష పార్టీలు ఆందోళనను ఉధృతం చేశాయి. నిరసనకారులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన సమయంలో ఆయన పేరుతో ఉన్న రాజీనామా లేఖగా భావిస్తున్న ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై సోషల్ మీడియాలో అనేక వాదనలు జరుగుతున్నాయి.
వైరల్ అవుతున్న లేఖపై 2026 జూలై 21 తేదీ ఉంది. అది ప్రధానమంత్రికి ఉద్దేశించినట్లుగా కనిపిస్తోంది. పదేపదే పేపర్ లీకేజీ ఘటనల కారణంగా విద్యార్థులు పరీక్షా విధానంపై విశ్వాసం కోల్పోయారని, అందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ వైఫల్యానికి ప్రభుత్వ నాయకత్వాన్ని కూడా ఆ లేఖ బాధ్యురాలిగా పేర్కొంది.
అయితే, ఈ లేఖ ఆధారంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రధానమంత్రి కార్యాలయం, రాష్ట్రపతి భవన్ లేదా కేంద్ర ప్రభుత్వం నుండి అటువంటి రాజీనామాను ధృవీకరించలేదు. తాను రాజీనామా చేసినట్లు ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు.
దీంతో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న లేఖ నకిలీదని లేదా తప్పుదోవ పట్టించేదని స్పష్టమవుతోంది. ఆందోళనల నేపథ్యంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నం జరుగుతుండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వైరల్ పోస్టులను నమ్మే ముందు, అధికారిక ప్రభుత్వ ప్రకటనలు లేదా విశ్వసనీయ వార్తా సంస్థల నుండి సమాచారాన్ని సరిచూసుకోవాలని పౌరులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read: ఉద్యోగులకు గుడ్న్యూస్..కనీస పెన్షన్ రూ.7,500కు పెంపు..పార్లమెంట్లో మంత్రి ప్రకటన!
Also Read: ఉద్యోగుల గ్రాట్యూటీ రూల్స్..5 ఏళ్లు పనిచేయకపోయినా గ్రాట్యుటీ ఎలా పొందవచ్చో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
'సర్'పై బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తం.. అర్హులైన ఓటరు తొలగిపోకూడదని పార్టీ నాయకత్వానికి కేటీఆర్ ఆదేశం
Hyderabad, Telangana:KT Rama Rao: అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకూడదని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. బూత్ స్థాయి వరకు సమన్వయంతో పనిచేయాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాల పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. నిజాయతీ కలిగిన ఓటర్లను లిస్ట్ నుంచి పోకుండా ఉండకూడదని పార్టీ సర్ కమిటీకి మాజీ మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ (SIR) కార్యక్రమాల పర్యవేక్షణ కమిటీతో బుధవారం హైదరాబాద్ నందినగర్లోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆధ్వర్యంలోని కమిటీ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాల పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను కేటీఆర్కు వివరించింది. ఈ సందర్భంగా సర్ కమిటీకి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ఆదేశాలు చేశారు.
రాష్ట్రంలో లక్షల మంది ఓటర్ల పూర్తి వివరాలు అందుబాటులో లేకపోవడంతో వారిలో చాలామందిని నోటీసులు జారీ చేసే విభాగంలో చేర్చారని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అలాంటి ఓటర్లకు నోటీసులు అందిన వెంటనే పార్టీ శ్రేణులు వారికి అవసరమైన మార్గనిర్దేశం చేసి.. అర్హులైన వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని పార్టీ నాయకత్వానికి సూచించారు. ఈ మొత్తం ప్రక్రియలో అర్హులైన ఒక్క ఓటరు కూడా మిస్ కాకూడదని.. అదే సమయంలో డూప్లికేట్ లేదా అనర్హ ఓటర్లు జాబితాలో ఉండకుండా చూడాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
ఆగస్టు 3వ తేదీ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో సర్ ప్రక్రియలో నిమగ్నం కావాలని మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. ఆగస్టు 10వ తేదీన డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదలైన తర్వాత అసలు పని ప్రారంభమవుతుందని తెలిపారు. డ్రాఫ్ట్ జాబితాలో పేర్లు ఉన్నవారు.. లేనివారిని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. డూప్లికేట్ ఓటర్ల తొలగింపు, అర్హులైన వారి పేర్ల నమోదు కోసం క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని పార్టీ నాయకత్వానికి మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు.
♦️ అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకూడదు
♦️ ఎస్ఐఆర్ కమిటీతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS సమీక్ష
♦️ బూత్ స్థాయి వరకు సమన్వయంతో పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచన
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ (SIR) కార్యక్రమాల పర్యవేక్షణ కమిటీతో బుధవారం… pic.twitter.com/3ZO48tcjbN
— BRS Party (@BRSparty) July 22, 2026
ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న జిల్లాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించగా.. సర్ ప్రక్రియను ఒక యజ్ఞంలా భావించి పార్టీ శ్రేణులంతా భాగస్వాములు కావాలని సూచించారు. నియోజకవర్గ ఇన్చార్జీలు, సభ్యత్వ ఇన్చార్జీలు, జనరల్ సెక్రటరీలు, కోఆర్డినేటర్లు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎన్నికల రోజున ఇబ్బందులు ఎదురుకాకుండా ఇప్పటి నుంచే ప్రతి అర్హ ఓటరును గుర్తించి నమోదు చేయించే బాధ్యతను నిర్వర్తించాలని మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాల పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బూత్ స్థాయి వరకు పార్టీ యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ప్రతి అర్హ ఓటరు పేరు జాబితాలో ఉండేలా.. అనర్హులు లేదా డూప్లికేట్ ఓటర్లు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారు.
David Warner Guilty: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్కు జైలు శిక్ష?! ఆ కేసులో అడ్డంగా బుక్కయ్యాడు..చివరికి!
David Warner Drink And Drive: ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ డేవిడ్ వార్నర్ సిడ్నీలో మధ్యస్థాయి మద్యం తాగి వాహనం నడిపిన నేరాన్ని అంగీకరించారు. దీంతో అతనికి తొమ్మిది నెలల వరకు జైలు శిక్ష, డ్రైవింగ్ నిషేధం విధించే అవకాశం ఉంది. ఈ విషయం సిడ్నీ థండర్ జట్టులో తన కెప్టెన్సీ నిలబడే దానిపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇకపై జట్టులో కెప్టెన్గా కొనసాగుతాడా? లేదా జట్టు నుంచి వైదొలగుతాడా? అని పలువురు క్రికెట్ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఏం జరిగింది?
ఈ ఏడాది ఏప్రిల్లో సిడ్నీలో యాదృచ్ఛికంగా రోడ్డు పక్కన నిర్వహించిన బ్రీత్ టెస్ట్లో మద్యం తాగి వాహనం నడిపిన నేరాన్ని అంగీకరించిన ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ డేవిడ్ వార్నర్కు తొమ్మిది నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈస్టర్ ఆదివారం నాటి సంఘటనకు సంబంధించి మధ్యస్థాయి మద్యం తాగి వాహనం నడిపిన నేరాన్ని వార్నర్ తరఫున అతని న్యాయవాది బాబీ హిల్ అంగీకరించినట్లు, ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ బుధవారం వేవర్లీ స్థానిక కోర్టు ముందు హాజరు కాలేదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
2026 ఏప్రిల్ 5న సిడ్నీ తూర్పు శివారు ప్రాంతాల్లో పోలీసులు వార్నర్ను ఆపి, రోడ్డు పక్కన నిర్వహించిన బ్రీత్ టెస్ట్లో మద్యం ఉన్నట్లు పాజిటివ్గా నిర్ధారించారు. అనంతరం తదుపరి పరీక్షల కోసం అతడిని మారుబ్రా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లగా, అతని రక్తంలో ఆల్కహాల్ గాఢత 0.104గా నమోదైంది. ఇది చట్టపరమైన పరిమితికి రెట్టింపు కంటే ఎక్కువ.
ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ డేవిడ్ వార్నర్కు ఈ కేసులో ఆగస్టు 18న శిక్ష విధించనున్నారు. ఈ శిక్షలో భాగంగా అతను కనీసం ఆరు నెలల పాటు డ్రైవింగ్ చేయకుండా అనర్హత, A$2,200 ($1,500) అంటే భారత కరెన్సీ ప్రకారం.. రూ.2.12 లక్షల వరకు జరిమానాతో పాటు తొమ్మిది నెలల వరకు జైలు శిక్షను ఎదుర్కోవచ్చు.
వార్నర్ నేర అంగీకారం..
ఇదే కేసుపై మే నెలలో మొదటిసారి కోర్టులో వాదనకు వచ్చినప్పుడు.. వార్నర్ తన నేరాన్ని అంగీకరించాడు. మద్యం తాగిన క్రమంలో ట్యాక్సీలో వెళ్లకుండా తన కారులో నిర్లక్ష్యపూరితమైన నిర్ణయమని వార్నర్ అంగీకరించినట్లు అతని తరఫు న్యాయవాది బాబీ హిల్ తెలిపారు.
కెప్టెన్సీపై ప్రభావం..
రాబోయే బిగ్బాష్ లీగ్లోని సిడ్నీ థండర్ జట్టు కెప్టెన్గా వార్నర్ స్థానం కూడా పరిశీలనకు గురైంది. మద్యం తాగి వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన పెంచే లక్ష్యంతో న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వం చేపట్టిన ఒక కార్యక్రమంలో సిడ్నీ థండర్, సిడ్నీ సిక్సర్స్, న్యూ సౌత్ వేల్స్ బ్లూస్ జట్లు భాగమయ్యాయి. అయితే ఈ క్రమంలో వార్నర్ను జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్ సూపర్ లీగ్ సందర్భంగా కరాచీ కింగ్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన వార్నర్, ఆ లీగ్ మధ్యలో ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ మద్యం తాగి పోలీసులకు పట్టుబడ్డాడు. గతంలోనూ దక్షిణాఫ్రికాలో జరిగిన ఆస్ట్రేలియా 2018 బాల్ ట్యాంపరింగ్ కుంభకోణంలో ప్రమేయం ఉన్నందుకు, వార్నర్పై కెప్టెన్సీ చేయకుండా గతంలో ఏడాది కాలం పాటు నిషేధం విధించారు. అయితే, 2024లో ఆ నిషేధాన్ని ఎత్తివేయడంతో ఆ వెంటనే వార్నర్ సిడ్నీ థండర్ కెప్టెన్గా నియమితులవడానికి మార్గం సుగమమైంది.
Also Read: కావ్యా పాప కొంపముంచిన పాకిస్థాన్ స్పిన్నర్..రూ.2.45 కోట్లు దండగ..గెలిచే మ్యాచ్ ఇలా..
Also REad; FIFA Prize Money: ఫిఫా విజేత స్పెయిన్కు రూ.481 కోట్ల ప్రైజ్మనీ..ఫుట్బాల్ చరిత్రలో ఇదే అత్యధికం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
పాపం.. చీర కొనివ్వలేదని కుక్కర్ మూతతో భర్తను చంపేసిన భార్య!
Hyderabad, Telangana:Maharashtra Saree Dispute Crime: పెళ్లిళ్లను స్వర్గంలో నిర్ణయిస్తారని చెబుతూ ఉంటారు మన పెద్దలు.. కానీ, ఆ తర్వాత జరిగే కొన్ని దారుణమైన గొడవలు జీవితాన్ని నరకంగా మారుస్తూ ఉంటాయి. సంతోషంగా, ఆనందంగా ఉండాల్సిన దంపతుల మధ్య చిన్నపాటి కారణాలే ప్రాణాలు తీసేంత తీవ్రరూపం దాల్చుతూ ఉంటాయి. తాజాగా మహారాష్ట్రలోని బడ్లాపూర్ పట్టణంలో చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. ఒక చీర విషయంలో మొదలైన చిన్నపాటి గొడవ.. చివరికి భర్త దారుణ హత్యకు దారితీసింది..
వివరాల్లోకి వెళ్తే..
బడ్లాపూర్ ప్రాంతానికి చెందిన హరేరామ్.. సునీతాదేవి భార్యాభర్తలు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.. కాగా.. కొంతకాలంగా భార్య సునీతాదేవి తనకోసం ఒక చీర కొనివ్వాలని భర్తను అడుగుతూ వస్తోంది.. అయితే, భర్త హరేరామ్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడమే కాకుండా.. చీర తేకపోవడంతో ఇంట్లో దంపతుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. మాటమాట పెరిగి ఆవేశంతో ఊగిపోయిన సునీతాదేవి.. విచక్షణ కోల్పోయి భర్తపై దాడికి తెగబడింది.
ఇంట్లో ఉన్న కుక్కర్ మూతతో భర్త హరేరామ్ తలపై బలంగా బాదింది.. దెబ్బకు అతడు విలవిలలాడుతుండగానే.. ఆయన గొంతు నులిమి అతి దారుణంగా హత్య చేసింది. భర్త ప్రాణాలు కోల్పోయాడని నిర్ధారించుకున్నాక... తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ భార్య అత్యంత తెలివిగా ఒక డ్రామాకు తెరలేపింది.
గుండెపోటు నాటకం..
భర్త మరణించిన అనంతరం ఆమె పొరుగువారికి, బంధువులకు ఫోన్ చేసి.. తన భర్తకు హఠాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. అతడికి సకాలంలో వైద్యం అందిద్దామనుకునే లోపే కన్నుమూశాడంటూ కన్నీరుమున్నీరుగా ఏడ్చింది.
అయితే, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.. భర్త మృతదేహంపై, ముఖ్యంగా తల, మెడ భాగంలో ఉన్న అనుమానాస్పద గాయాలను చూసి పోలీసులకు సందేహం వచ్చింది.. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం తమదైన శైలిలో భార్య సునీతాదేవిని విచారించగా.. ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పింది.
పోలీసుల గట్టి విచారణ ముందు ఆమె ఎక్కువ సేపు నిలబడలేకపోయింది.. చీర కొనివ్వలేదన్న కోపంతోనే భర్తను కుక్కర్ మూతతో కొట్టి.. గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
అనాథగా మారిన కుమారుడు..
ఈ విషాద ఘటనతో వారి ఒక్కగానొక్క కుమారుడు అనాథగా మిగిలిపోయాడు.. తండ్రి శాశ్వతంగా నూరేళ్లూ నిండి కన్నుమూయడం.. కన్నతల్లే హంతకురాలై జైలుపాలవ్వడంతో ఆ బాలుడి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. క్షణికావేశంలో ఒక చీర కోసం భార్య చేసిన ఈ దారుణమైన పని.. కుటుంబంలో కోలుకోలేని విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read: NEET Re-Exam: నీట్ విద్యార్థులకు గుడ్న్యూస్.. చరిత్రలోనే తొలిసారి.. రంగంలోకి ప్రధాని మోదీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Cockroach Repellent: బొద్దింకల పాలిట యమరాజు..నాలుగో చిట్కా ఎంతో పవర్ఫుల్ అండ్ డేంజరస్!
Hyderabad, Telangana:Cockroach Repellent Tips: రాత్రిపూట లైట్ వేయగానే గది మూలల నుంచో లేదా వంటగది సింక్ నుంచో బొద్దింకలు బయటకు రావడం చూస్తే ఎవరికైనా చిరాకు పుడుతుంది. ఇల్లు ఎంత శుభ్రం చేసినా, మార్కెట్లో దొరికే కెమికల్ స్ప్రేలు చల్లినా ఇవి పూర్తిగా నిర్మూలన కావు. పైగా ఆ రసాయనాల ఘాటైన వాసన ఇంట్లోని పిల్లలకు, వృద్ధులకు ఆరోగ్యం పరంగా ఇబ్బంది కలిగిస్తుంది. రసాయనాల అవసరం లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని 4 ఇంట్లోనే తయారు చేసుకునే సురక్షితమైన చిట్కాలతో బొద్దింకలను ఇంట్లోంచి పూర్తిగా తరిమికొట్టవచ్చు.
అసలు బొద్దింకలు ఎందుకు వస్తాయి?
బొద్దింకలు ముఖ్యంగా చెత్త, మురికి, తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాల వైపు ఆకర్షించబడతాయి. మూసివున్న, వెచ్చని, తేమగా ఉండే గది మూలలు ఇవి సంతానోత్పత్తి చేయడానికి అనువుగా ఉంటాయి. పగటిపూట ఇవి బాత్రూమ్ లేదా సింక్ డ్రెయిన్లలో దాక్కుని, రాత్రి వేళల్లో మాత్రమే బయటకు వస్తుంటాయి.
బొద్దింకలను తరిమేసే 4 అద్భుతమైన ఇంటి చిట్కాలు
1) వెనిగర్, బేకింగ్ సోడా స్ప్రే
డ్రెయిన్లు, డ్రైనేజీ రంధ్రాల నుండి వచ్చే బొద్దింకలను నివారించడానికి ఇది ఉత్తమమైన మార్గం. ఒక కప్పు వెనిగర్లో రెండు టీస్పూన్ల బేకింగ్ సోడా, కొద్దిగా నీరు కలిపి స్ప్రే బాటిల్లో నింపండి. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు వంటగది సింక్, బాత్రూమ్ డ్రెయిన్ల లోపల, చుట్టుపక్కల చల్లండి. వెనిగర్ యొక్క తీవ్రమైన వాసనకు బొద్దింకలు ఆ ప్రాంతం వైపు రావు.
2) ఉల్లిపాయ, బేకింగ్ పౌడర్ మిశ్రమం
హోమ్ రెమిడీ నిపుణురాలు పూనమ్ దేవనాని సూచించిన ఈ విధానం బొద్దింకలపై వేగంగా పనిచేస్తుంది. ఒక ఉల్లిపాయను పేస్ట్లా రుబ్బి, రసాన్ని వడకట్టండి. ఆ ఉల్లిపాయ రసంలో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, కొద్దిగా నీరు కలిపి స్ప్రేలా తయారు చేయండి. బొద్దింకలు దాక్కునే మూలల్లో దీనిని చల్లండి.
గమనిక: ఈ స్ప్రేని తక్కువ మోతాదులో తయారు చేసుకుని 1-2 రోజుల్లోనే ఉపయోగించాలి. నిల్వ ఉంచితే దీని ప్రభావం తగ్గుతుంది.
3) పిండి, బోరిక్ పౌడర్ ఉండలు
వార్డ్రోబ్లు, కప్బోర్డ్లు, కిచెన్ డ్రాయర్ల మూలల్లో దాక్కునే బొద్దింకలకు ఇది సరైన పరిష్కారం. దీని తయారీకి 4 టీస్పూన్ల గోధుమ పిండి, 2 టీస్పూన్ల బేకింగ్ సోడా, 1 టీస్పూన్ పంచదార, కొద్దిగా బోరిక్ పౌడర్ (మార్కెట్లో సులభంగా దొరుకుతుంది) కలిపి పిండిలా కలపండి. చిన్న చిన్న ఉండలుగా చేసి కప్బోర్డులు, డ్రాయర్లు, పెట్టెల వెనుక ఉంచడం వల్ల అవి పంచదార వాసనకు ఆకర్షించబడి ఇవి తినడం వల్ల బొద్దింకలు నశిస్తాయి.
4) బేకింగ్ పౌడర్, చక్కెర పొడి (మ్యాజిక్ పౌడర్)
లిక్విడ్ స్ప్రే లేదా పిండి ఉండలు పెట్టడానికి వీలులేని ప్రదేశాలలో ఈ పొడిని ఉపయోగించవచ్చు. దీని తయారీ 2 టీస్పూన్ల పొడి చేసిన చక్కెరను 4 టీస్పూన్ల బేకింగ్ పౌడర్తో బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని వంటగది సామగ్రి ఉంచే షెల్ఫుల మూలల్లో ఈ పొడిని చల్లండి. రసాయనాలు లేకపోవడం వల్ల ఆహార పాత్రల దగ్గర కూడా దీనిని సురక్షితంగా వాడవచ్చు.
మార్కెట్ లభించే ఘాటైన రసాయనాల కంటే ఈ సహజ సిద్ధమైన చిట్కాలు సురక్షితమైనవి, అత్యంత ప్రభావవంతమైనవి. క్రమం తప్పకుండా 3-4 రోజులు పాటించడం వల్ల మీ ఇల్లు బొద్దింకల బెడద నుంచి పూర్తిగా విముక్తి పొందుతుంది.
(గమనిక: ఇక్కడ పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read; Raw Garlic Benefits: ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటే ఏం జరుగుతుంది?
Also Read: Milk Benefits: నిద్రపోయే ముందు పాలు తాగితే పరిస్థితి ఇంతే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
కిలో రూ.9 కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ పౌడర్..
Hyderabad, Telangana:Most Expensive Tea Powder Latest News: సాధారణంగా మన దేశంలో కిలో టీ పొడి ధర రూ.300 నుంచి రూ.1,000 వరకు ఉంటుంది. కానీ.. కేవలం ఒక కప్పు టీ తాగాలంటే లక్షల రూపాయలు బిల్ కట్టాల్సిందే.. అవును నిజం.. కిలో టీ పొడి ధర ఏకంగా రూ.9 కోట్లు అని తెలిస్తే.. ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.. ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ఖరీదైన దా-హాంగ్ పావో (Da Hong Pao) టీకి అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న విలువ ఇది.. చైనాలోని పురాతన పర్వత ప్రాంతాలలో మాత్రమే లభించే.. ఈ అరుదైన టీ పొడిపై చైనా ప్రభుత్వం ప్రస్తుతం పూర్తి నిషేధం విధించింది.
ఏంటీ దా-హాంగ్ పావో?
మండరిన్ భాషలో దా-హాంగ్ పావో అంటే పెద్ద ఎర్రటి వస్త్రం అని అర్థం.. చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్లోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన వుయి పర్వతాల రాతి కొండచరియలపై ఈ టీ పండుతుంది. చైనా జానపద కథల ప్రకారం.. మింగ్ రాజవంశం కాలంలో తీవ్ర అనారోగ్యానికి గురైన రాణి.. ఈ పర్వత ఆకుల టీ తాగడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారట.. దానికి కృతజ్ఞతగా చక్రవర్తి తన ఎర్రటి రాజవస్త్రాన్ని ఆ టీ మొక్కలకు కప్పించి గౌరవించారట.. అప్పటి నుంచి దీనిని దా-హాంగ్ పావో అనే వస్త్రంగా పిలవడం అలవాటు అయ్యిందని సమాచారం..
కేవలం 6 మొక్కలు మాత్రమే..
ఈ టీ అత్యంత అరుదైనదిగా మారడానికి ప్రధాన కారణం.. పర్వత లోయలలో శతాబ్దాల నాటి కేవలం 6 మొక్కలు మాత్రమే మిగిలి ఉండటం.. వీటి నుంచి లభించే ఆకుల పరిమాణం అత్యంత తక్కువ.. గతంలో జరిగిన వేలంలో కేవలం 20 గ్రాముల దా-హాంగ్ పావో టీ పొడి సుమారు రూ.1.23 లక్షల నుంచి రూ.26 లక్షల వరకు ధర పలికి ప్రపంచ రికార్డు సృష్టించింది.
జాతీయ సంపదగా గుర్తింపు..
ఈ పురాతన మదర్ ట్రీస్ను చైనా ప్రభుత్వం తమ జాతీయ సంపదగా ప్రకటించింది.. ఈ చెట్లకు హాని కలగకుండా కాపాడేందుకు 2006 నుంచి ఆకులను కోయడంపై సంపూర్ణ నిషేధం విధించింది.. చెట్ల రక్షణ కోసం ప్రత్యేక సెక్యూరుటీ గార్డులను కూడా ఉంచింది.. మార్కెట్లో అసలైన మదర్ ట్రీస్ ఆకులు లభించకపోవడంతో.. ప్రస్తుతం ఉన్న పాత స్టాక్ విలువ బంగారం, వజ్రాల కంటే ఎక్కువగా మారింది.
ప్రత్యేకమైన రుచి, సువాసన..
ఇది గ్రీన్ టీ, బ్లాక్ టీల కలయికగా ఉండే ప్రత్యేకమైన ఓలాంగ్ టీ రకానికి చెందినదిగా భావిస్తారు.. పర్వతాల రాతి పగుళ్లలోని ఖనిజాలను పీల్చుకోవడం వల్ల దీనికి విశిష్టమైన మట్టి వాసన.. ఆర్కిడ్ పూల పరిమళం, పండ్ల స్వల్ప రుచితో కూడిన సహజమైన తీపి లభిస్తుంది. దీనిని ఆస్వాదించిన తర్వాత ఆ సువాసన గొంతులో చాలా సేపు ఉంటుందని టీ తాగిన వారు చెబుతున్నారు.
Also Read; Onion Juice Benefits: ఉల్లిపాయ జ్యూస్ ఎప్పుడైనా తాగారా? తాగితే ఏం జరుగుతుంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
ఆర్టీసీ బస్సు దొంగతనం కేసులో బిగ్ ట్విస్ట్.. ఎందుకు దొంగతనం చేశాడో తెలుసా?
Korutla, Telangana:RTC Bus Theft: ఆర్టీసీ బస్సు దొంగతనం కేసు తెలంగాణలో తీవ్ర సంచలనం రేపుతోంది. పట్టపగలు ఆర్టీసీ బస్టాండ్లో నిలిపి ఉంచిన బస్సును ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు. తర్వాత బస్సు కోసం వచ్చిన డ్రైవర్, కండక్టర్ బస్సు కనిపించకపోవడంతో నివ్వెరపోయారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు బస్సు కోసం గాలించగా ఓ మార్గంలో దుండగుడు అత్యంత వేగంగా తీసుకెళ్తున్నాడు. అయితే ఇంతకీ బస్సు ఎందుకు ఎత్తుకెళ్లాడో అనే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
జగిత్యాల జిల్లా కోరుట్ల ఆర్టీసీ బస్టాండ్లో మంగళవారం ఆగి ఉన్న బస్సును ఓ వ్యక్తి ఎత్తుకెళ్లాడు. పోలీసులు నడిరోడ్డుపై నిలబడి అడ్డుకున్నా ఆగకుండా అతడు రయ్మని తీసుకెళ్లాడు. అతడి స్పీడ్కు భయపడిన పోలీసులు వెంటనే మూడు పోలీస్ కాన్వాయ్లతో వెంటపడ్డారు. సినిమా రేంజ్లో మించిన ఈ ఛేజింగ్లో పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాడు. అయితే రోడ్డుపై ఏర్పడిన ఒక గుంత కారణంగా బస్సు ఆగిపోవడంతో ఆ దుండగుడు దొరికాడు. లేకపోయి ఉంటే అతడు ఎంత బీభత్సం.. విధ్వంసం సృష్టించేవాడోనని అందరూ ఆందోళన చెందుతున్నారు.
కోరుట్ల బస్టాండ్లో డ్రైవర్ ప్రవీణ్ బస్సును నిలిపి టీ తాగుదామని కండక్టర్తో కలిసి వెళ్లగా.. ధర్మపురి మండలం నాగారం గ్రామానికి చెందిన సాంబయ్య (40) బస్టాండ్కు వచ్చాడు. బస్టాండ్ నుంచి బస్సును తీసి సుమారు 15 కి.మీ. మేర హైవేపై బీభత్సం.. భయానక వాతావరణం సృష్టించాడు. అతికష్టంగా పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నారు. అయితే సాంబయ్య బస్సు ఎందుకు ఎత్తుకెళ్లాడని విచారణ చేయగా.. అతడు తాగిన మత్తులో అలా చేశాడని తెలిసింది.
సినిమాను మించిన ఛేజింగ్
టీ తాగి వచ్చిన బస్సు డ్రైవర్ ప్రవీణ్ తన బస్సు ఇన్గేట్ నుంచి బస్సును హైవేపైకి మళ్లించాడని గ్రహించాడు. వెంటనే బస్సు డ్రైవర్ ప్రవీణ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు రెండు, మూడు చోట్ల బస్సును ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే సాంబయ్య ఎంతకు బస్సు ఆపకుండా అత్యంత వేగంగా నడపడంతో పోలీసులు భయపడ్డారు. వెంటనే కోరుట్ల, కథలాపూర్ పోలీసులు అప్రమత్తమై బస్సును వెంబడించారు. మెట్పల్లికి వెళ్లేలోపు సాంబయ్యను పట్టుకోవాలని ప్రయత్నం చేశారు. అయితే పట్టుకునే క్రమంలో సాంబయ్య బస్సుతో కోరుట్ల శివారులో ఓ బైక్ను, ఆరపేట వద్ద మరో బైక్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
కోరుట్ల బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సును దొంగిలించిన దుండగుడు
వేగంగా వెళ్తూ పోలీస్ వాహనాన్ని, పలు వాహనాలను ఢీకొట్టి.. పలువురికి గాయాలు
నిజామాబాద్ వైపు వెళ్తుండగా హనుమాన్ దేవాలయం వద్ద గుంతలో దిగి ఆగిపోయిన బస్సు
బస్సు దిగి పారిపోతున్న దుండగుడిని పట్టుకున్న పోలీసులు.. మెట్పల్లి… pic.twitter.com/eNzDx0aSKh
— Telugu Scribe (@TeluguScribe) July 21, 2026
అనంతరం సాంబయ్య తాను నడుపుతున్న బస్సుతో కథలాపూర్ పోలీసుల వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ బస్సును ఎలాగైనా ఆపాలని పోలీసులు నిర్ణయం తీసుకుని గండిహనుమాన్ చెక్ పోస్టు సమీపంలో లారీ, ట్రాక్టర్లను రోడ్డుపై అడ్డంగా ఉంచారు. రోడ్డుకు అడ్డంగా వాహనాలు ఉండడంతో వెంటనే సాంబయ్య బస్సును పక్కకు మళ్లించాడు. అయితే బస్సు రోడ్డు దిగి ఆగిపోయింది. బస్సు ఆగడంతో వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పారిపోయే ప్రయత్నం చేస్తున్న సాంబయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
pic.twitter.com/iutbdkIauO https://t.co/9C5mdMjAx8బస్సు దిగి పారిపోతున్న దుండగుడిని పట్టుకున్న పోలీసులు.. మెట్పల్లి…
నిజామాబాద్ వైపు వెళ్తుండగా హనుమాన్ దేవాలయం వద్ద గుంతలో దిగి ఆగిపోయిన బస్సు
వేగంగా వెళ్తూ పోలీస్ వాహనాన్ని, పలు వాహనాలను ఢీకొట్టి.. పలువురికి గాయాలు
కోరుట్ల బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సును దొంగిలించిన దుండగుడు
— Telugu Scribe (@TeluguScribe) July 22, 2026
గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వబోతున్న రెడ్మీ నోట్ 17.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే!
Hyderabad, Telangana:Redmi Note 17 India Launch: ప్రముఖ ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ రెడ్మీ (Redmi) తన పాపులర్ నోట్ సిరీస్లో సరికొత్త మోడల్ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది.. ఇటీవలే చైనాలో విడుదలైన రెడ్మీ నోట్ 17 (Redmi Note 17) స్మార్ట్ఫోన్ త్వరలోనే భారతదేశంలో విడుదల చేయబోతున్నట్లు ప్రముఖ టెక్ టిప్స్టర్లు వెల్లడించారు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన రెడ్మీ నోట్ 15 స్థానంలో ఈ కొత్త ఫోన్ గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రముఖ టిప్స్టర్ యోగేష్ బ్రార్ తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్మీ నోట్ 17 ఇండియా వర్షన్ ధరతో పాటు దాని ప్రధాన ఫీచర్లు లీక్ అయ్యాయి. తాజాగా వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. రెడ్మీ నోట్ 17 స్మార్ట్ఫోన్ భారత్లో ఆగస్టు 6న అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉందని లీక్ అయిన వివరాలు చెబుతన్నాయి. అనంతరం ఆగస్టు 11 నుంచి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్స్తో పాటు రిటైల్ స్టోర్లలో విక్రయాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..
ధర విషయానికొస్తే..
6 GB ర్యామ్తో పాటు 128 GB స్టోరేజ్ కలిగిన బేస్ వేరియంట్ ధర భారత మార్కెట్లో రూ.30,000 కంటే కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉందని టిప్స్టర్ అంచనా వేస్తున్నారు. అలాగే ఈ ఫోన్కు 4 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ OS అప్డేట్లతో పాటు 5 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్లను కంపెనీ అందించే ఛాన్స్లు ఉన్నట్లు లీక్ అయిన వివరాలు తెలుపుతున్నాయి..
ప్రధాన ఫీచర్లతో పాటు స్పెసిఫికేషన్లు..
ఈ స్మార్ట్ఫోన్ 7-అంగుళాల ఫుల్ HD+ (1,080 x 2,396 పిక్సెల్స్) OLED డిస్ప్లేతో అందుబాటులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్కు సపోర్ట్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది.. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ప్రింట్ స్కానర్ను కూడా అందిస్తోంది.. ఈ ఫోన్లో ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 4 జెన్ 4 (Snapdragon 4 Gen 4) చిప్సెట్తో పాటు అడ్రెనో GPUని వినియోగించిన్నట్లు తెలుస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆధారిత HyperOS 3 పై పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
పవర్ఫుల్ బ్యాటరీ..
ఈ ఫోన్ మోస్ట్ పవర్ఫుల్ 8,000 mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది.. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్కు సపోర్ట్ను అందిస్తుంది. దీనివల్ల ఇతర డివైజ్లను కూడా ఈ ఫోన్ ద్వారా ఛార్జ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వెనుకవైపు Square-shaped కెమెరా మాడ్యూల్లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. చాలా ప్రత్యేకమైన LED ఫ్లాష్ కూడా అందుబాటులో ఉంది.. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందిస్తోంది. కనెక్టివిటీ కోసం ఇందులో 5G, 4G LTE, డ్యూయల్ సిమ్తో పాటు వై-ఫై, బ్లూటూత్, GPS, USB టైప్-సి పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Joha Rice Benefits: ఈ స్పెషల్ రైస్ రోజూ తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది! ఇది ఎంత తిన్నా మధుమేహం దరిచేరదు!
Hyderabad, Telangana:Joha Rice Benefits Diabetes: మధుమేహం ఉన్నవారు అన్నం తినవచ్చా? సాధారణంగా డాక్టర్లు మధుమేహ వ్యాధిగ్రస్తులను తెల్ల అన్నానికి దూరంగా ఉండమని సూచిస్తారు. తెల్ల బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI), పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్లు) ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. అయితే, భారతీయ ఆహారంలో భాగమైన అన్నాన్ని పూర్తిగా మానేయడం అందరికీ సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో అస్సాంలో పండే ఒక ప్రత్యేక రకం బియ్యం మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి సహాయపడుతుందని పరిశోధనలు తెలుపుతున్నాయి.
మధుమేహం అనేది జీవక్రియకు సంబంధించిన సమస్య. ఆహారం ద్వారా దీనిని సమర్థవంతంగా నియంత్రించవచ్చు తప్ప, ఏ బియ్యం తిన్నా ఇది 'మూలాల నుండి నయమైపోతుంది' అనడం సరికాదు.
ఏమిటీ 'జోహా' బియ్యం?
అస్సాంలోని గారో కొండల ప్రాంతంలో పండించే 'జోహా బియ్యం' (Joha Rice) దాని విశిష్టమైన సువాసన, రుచికి ప్రసిద్ధి చెందింది. ఇది బాస్మతి బియ్యం తరహాలోనే ప్రత్యేక గుర్తింపు పొంది, భౌగోళిక గుర్తింపు కూడా దక్కించుకుంది. ఇటీవల 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ' చేపట్టిన అధ్యయనంలో ఈ బియ్యం రక్తంలో చక్కెర స్థాయిలను త్వరితగతిన పెంచదని తేలింది.
జోహా రైస్ ఆరోగ్య ప్రయోజనాలు..
1) బ్లడ్ షుగర్ నియంత్రణ: ఈ బియ్యంలో ఉండే పోషక గుణాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సడన్ గా పెరగకుండా చూస్తాయి.
2) ఒమేగా కొవ్వు ఆమ్లాలు: జోహా బియ్యంలో శరీరానికి మేలు చేసే ఒమేగా-3, ఒమేగా-6 వంటి అన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
3) హృద్రోగాల నివారణ: శీతాకాలంలో ఈ బియ్యాన్ని క్రమం తప్పకుండా వినియోగించే అస్సాం ప్రాంత ప్రజలలో మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
4) మొక్కల ఆధారిత ప్రోటీన్: ఇది శాకాహారులకు మంచి ప్రోటీన్ మూలంగా పనిచేస్తుంది. ఈ బియ్యం పొట్టు (Rice Bran) నుండి ఆరోగ్యకరమైన నూనెను కూడా తయారు చేస్తారు.
మధుమేహంతో బాధపడేవారు బియ్యం ఎంపికలో జాగ్రత్తలు పాటిస్తూ, సరైన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. జోహా బియ్యం పోషకాల పరంగా మెరుగైన ప్రత్యామ్నాయం అయినప్పటికీ, మీ ఆహారంలో ఏవైనా పెద్ద మార్పులు చేసే ముందు మీ వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం మంచిది.
(గమనిక: ఇక్కడ పొందుపరిచిన సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: Snake Plants: ఈ మొక్కలు పెంచితే ఇంట్లోకి పాములు వస్తాయి..వెంటనే బయటపడేయండి!
Also REad: Milk Benefits: నిద్రపోయే ముందు పాలు తాగితే పరిస్థితి ఇంతే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
మల్లారెడ్డి వైఖరిపై BRS కార్యకర్త ఆగ్రహం.. సొంత రక్తంతో బహిరంగ లేఖ!
Hyderabad, Telangana:Brs Malla Reddy: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రవర్తన ప్రస్తుతం బీఆర్ఎస్ (BRS) వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలవాల్సింది పోయి.. కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ప్రత్యర్థుల వేదికలపై దర్శనమివ్వడంపై స్థానిక నాయకులు, శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ BRS కార్యకర్త తీవ్ర మనస్తాపానికి గురై.. తన సొంత రక్తంతో మల్లారెడ్డికి బహిరంగ లేఖ రాయడం నియోజకవర్గంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రక్తంతో రాసిన లేఖ..
తన కోసం, పార్టీ విజయం కోసం పగలు, రాత్రి తేడా లేకుండా BRS జెండాను భుజాన మోసిన లక్షలాది మంది కార్యకర్తల విశ్వాసాన్ని మల్లారెడ్డి దెబ్బతీస్తున్నారని సదరు కార్యకర్త ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు నిమిషం తీరిక లేకుండా పరుగులు తీసి.. పదుల సంఖ్యలో కార్యక్రమాలు చేపట్టిన మల్లారెడ్డి.. నేడు పార్టీకి అత్యంత అవసరమైన సమయంలో ఎందుకు దూరంగా ఉంటున్నారని నిలదీశారు.



కార్యకర్తలను తన విద్యాసంస్థల్లో పనిచేసే ఉద్యోగులుగా భావిస్తున్నారని.. ధనాహంకారంతో ప్రవర్తిస్తూ.. పార్టీ పునాదులను బలహీనపరుస్తున్నారని లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. BRS పార్టీ అనేది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని.. అలాంటి పార్టీ సిద్ధాంతాలను, కార్యకర్తల త్యాగాలను తుంగలో తొక్కి.. ఆత్మగౌరవాన్ని అవమానించడం దారుణమని లేఖలో తెలిపారు.
కార్యకర్తల చెమటతో పాటు కష్టాన్ని మరచిపోయి.. స్వార్థ రాజకీయాలు చేసే ఏ నాయకుడైనా చరిత్రహీనుడిగా కాలగర్భంలో కలసిపోవడం ఖాయమని తీవ్ర హెచ్చరిక చేశారు. ఒక వైపు నాయకులు మారుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకున్న కార్యకర్త ఆవేదనకు ఈ రక్తంతో రాసిన లేక నిదర్శనంగా నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
EPS-95 Pension Hike: ఉద్యోగులకు గుడ్న్యూస్..కనీస పెన్షన్ రూ.7,500కు పెంపు..పార్లమెంట్లో మంత్రి ప్రకటన!
Hyderabad, Telangana:EPS-95 Pension Hike 2026: ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) కింద కనీస పింఛను మొత్తాన్ని ప్రస్తుతమున్న రూ.1,000 నుండి రూ. 7,500కు పెంచాలంటూ దేశవ్యాప్తంగా ఉద్యోగుల సంఘాలు సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఈ పెంపుదలపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో స్పష్టతనిచ్చింది.
ప్రస్తుతం కనీస పింఛను పెంపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, దానికి సంబంధించి ఎలాంటి కాలపరిమితి కూడా లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు లోక్సభలో ఎంపీ భాసాహెబ్ రాజారామ్ వాక్చౌరే అడిగిన ప్రశ్నకు కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
లోక్సభలో కేంద్ర మంత్రి వివరణ
కనీస పింఛను రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ఇస్తున్నారని, ఇది వృద్ధులకు సరిపోదని ఎంపీ లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. "పింఛను నిధి సుస్థిరత, భవిష్యత్తు బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని EPFO సభ్యులకు బలమైన సామాజిక భద్రత కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. EPFOకి అందించే 1.16% బడ్జెట్ మద్దతుకు అదనంగా, EPS-1995 కింద పెన్షనర్లకు నెలకు కనీసం రూ.1,000 లభించేలా బడ్జెట్ ద్వారా ప్రభుత్వం సహాయం అందిస్తోంది" అని పేర్కొన్నారు.
పింఛను నిధికి నిధులు ఎలా సమకూరుతాయంటే?
యజమాని వాటాగా ఉద్యోగి వేతనంలో 8.33% వంతు ఉండగా.. కేంద్ర ప్రభుత్వ వాటా నెలకు రూ. 15,000 వరకు ఉన్న వేతనంపై 1.16% బడ్జెట్ మద్దతు ఇస్తుంది. ఈ నిధి ఆధారంగానే పింఛను చెల్లింపులు జరుగుతాయని, ఏటా నిధి విలువను లెక్కిస్తారని ప్రభుత్వం తెలిపింది.
'EPS 2026' కీలకమైన మార్పులివే!
ప్రభుత్వం పాత 'EPS 1995', 'ఎంప్లాయీస్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ 1971' స్థానంలో 'కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, 2020' కింద నూతన 'ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) 2026'ను నోటిఫై చేసింది.
ఈ కొత్త పథకంలో ప్రవేశపెట్టిన ప్రధాన మార్పులు..
1) వేగవంతమైన పరిష్కారం అనగా..పెన్షన్ క్లెయిమ్లను గరిష్టంగా 20 రోజుల్లోపు పరిష్కరించాలి.
2) ఆలస్యమైతే వడ్డీ.. క్లెయిమ్ ఆలస్యమైతే లబ్ధిదారునికి 12% వడ్డీ చెల్లిస్తారు.
3) డిజిటల్ విధానం.. యాజమాన్యాల (Employers) కోసం డిజిటల్ వర్తింపు నిబంధనలను నిర్బంధం చేశారు.
4) అధిక పెన్షన్.. అధిక పెన్షన్కు సంబంధించిన స్పష్టమైన నిబంధనలను ఇందులో పొందుపరిచారు.
గమనిక: ఉద్యోగి నిష్క్రమించే ముందు చివరి 60 నెలల సగటు జీతాన్నే పెన్షన్కు అర్హత ఉన్న జీతంగా పరిగణిస్తారు.
Also Read: ఉద్యోగుల గ్రాట్యూటీ రూల్స్..5 ఏళ్లు పనిచేయకపోయినా గ్రాట్యుటీ ఎలా పొందవచ్చో తెలుసా?
Also Read: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. సోమవారం భారీ వర్ష సూచన..ఈజిల్లాల్లో భారీవర్షం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
