Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Khammam507002

రైతులతో మంత్రి పొంగులేటి సమావేశమయ్యారు

Jul 29, 2024 05:00:56
Dhamsalapuram, Telangana

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. డివిజన్‌లో వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 37 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మార్గమధ్యంలో మంత్రి రైతు కూలీలను కలుసుకుని వారి కష్టాలు. ఎలాంటి ధాన్యం వేస్తున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ప్రజాపరిపాలనపై ఆరా తీశారు.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Mar 01, 2026 17:24:59
Kolkata, West Bengal:

Ind vs WI T20 World Cup 2026 Highlights: టీ20 ప్రపంచకప్‌లో చివరి సూపర్ 8 మ్యాచ్‌లో వెస్టిండీస్ పై భారత్ మరోసారి ఆధిపత్యం చలాయించింది. సెమీస్‌ చేరాలనుకుంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కరీబియన్లు పోరాడి ఓడి టోర్నీ నుంచి వైదొలగగా.. టీమిండియా సెమీస్‌లోకి దూసుకెళ్లింది. టీ 20 ప్రపంచకప్‌ గెలవడానికి సెమీ ఫైనల్‌లో చేరాల్సిన మ్యాచ్‌లో భారత్‌ అద్భుతంగా ఆడి విజయం సాధించింది. సంజూ శామ్ సన్ తుఫాను ఇన్నింగ్స్ తో ప్రత్యర్థి మెగా టోర్నీ నుంచి వైదొలిగింది. నాకౌట్‌లో ఓటమి లేకుండా ఆడిన భారత్‌.. సూపర్‌ 8లో మాత్రం ఒక ఓటమి, రెండు విజయాలతో టీ20 ప్రపంచకప్‌ సాధించడానికి రెండు అడుగుల దూరంలో నిలిచింది. 

AlsO Read: IND vs ZIM: చెపాక్‌లో భారత్ చేతిలో జింబాబ్వే చిత్తు.. టీ20 ప్రపంచకప్ సెమీస్‌ ఆశలు సజీవం

జింబాబ్వేను ఓడించి జోరు మీదున్న భారత జట్టు ఎలాగైనా ఓడించాలని కసితో ఆడింది. క్వార్టర్ ఫైనల్స్‌లాంటి ఈ మ్యాచ్‌ లో భారత్ అన్నింటా చక్కటి ప్రదర్శన కనబర్చింది. గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో లోపాలన్ని సరిదిద్దుకున్న టీమిండియా టీ20 ప్రపంచకప్‌లో గత రికార్డులను భయాన్ని తుడిచిపెట్టేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. 196 లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి భారత జట్టు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

Also Read: Schools Holiday: విద్యార్థులకు పండగ మీద పండుగ.. మార్చిలో మొత్తం 13 సెలవులు

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లకు విండీస్‌ 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. తొలి పది ఓవర్లు పొదుపుగా ఆడిన విండీస్‌ బ్యాటర్లు ఓవర్లు ముగుస్తున్న కొద్దీ భారీగా పరుగులు తీశారు. తొలి ఆరంభం భారత్‌ పైచేయి సాధించగా.. ద్వితీయార్థం విండీస్‌ బ్యాటర్లు దుమ్మురేపారు. ఇక పరుగులపరంగా చూస్తే.. కెప్టెన్‌ షాయ్‌ హోప్‌ 32 పరుగులతో పర్వాలేదనిపించగా.. రోస్టన్‌ చేజ్‌ చేసిన 40 పరుగులు విండీస్‌ బ్యాటర్‌లలో అత్యధిక స్కోర్‌. షిమ్రోన్‌ హెట్‌మెయిర్‌ 27 పరుగులతో కట్టుదిట్టంగా ఆడుతున్న సమయంలో బుమ్రా వికెట్‌ తీశాడు. రూథర్‌ ఫోర్డ్‌ తక్కువ స్కోర్‌ (14) చేయగా.. పావెల్‌ 34, జేసన్‌ హోల్డర్‌ 37 పరుగులతో రాణించారు.

భారత ఔలింగ్‌ మళ్లీ అదుపు తప్పిందని కనిపించింది. ప్రారంభ ఓవర్లు పొదుపుగా వేస్తూ వికెట్లు తీయకపోయినా పరుగులను కూడా నియంత్రించారు. కానీ ఇన్నింగ్స్‌ ముగిసే సమయానికి చేతులెత్తేయడంతో విండీస్‌ భారీ స్కోర్‌ చేసింది. కుదుకున్న బ్యాటర్లను బుమ్రా అద్భుతంగా బౌలింగ్‌ చేసి ఔట్‌ చేశాడు. ఒక ఓవర్‌లోనే రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్‌ పాండ్యా, వరుణ్‌ చక్రవర్తి తలా ఒక వికెట్‌ తీశారు.

భళా సంజూ శామ్‌సన్‌
టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ 8 చివరి మ్యాచ్‌లో సంజూ శామ్‌సన్‌ అద్భుతంగా ఆడాడు. ఈ మెగాటోర్నీలో సంజూకు ఇదే భారీ ఇన్నింగ్స్‌. వరుస వైఫల్యాల తర్వాత విండీస్‌ మ్యాచ్‌లో గొప్ప ప్రదర్శన చేశాడు. వన్‌ డౌన్‌ వచ్చిన సంజూ శామ్‌సన్‌ ఆఖరు వరకు నిలిచి జట్టును గెలిపించాడు. ఈ ప్రదర్శనతో జట్టులో తన స్థానం విలువ ఏమిటో సంజూ చూపించాడు.

విండీస్‌పై భారత్‌ ఆధిపత్యం
వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌ల్లో రెండు జట్లు తలపడగా.. విండీస్ మూడుసార్లు గెలుపొందగా.. భారత్ రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. చివరిసారి 2016 వరల్డ్ కప్ సెమీస్‌లో తలపడి వెస్టిండీస్ గెలుపొంది ఫైనల్‌కు చేరగా.. తాజాగా సూపర్‌ 8లో ఓడిపోయి ఇంటికి వెళ్లగా.. భారత జట్టు సెమీస్‌లోకి దూసుకెళ్లింది.

Also Read: B Naidu Videos: అశ్లీల వీడియోలు నావి కావు.. అవి ఫేక్‌ డీప్‌ వీడియోలు: టీటీడీ చైర్మన్‌ నాయుడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 01, 2026 15:01:49
Karimnagar, Telangana:

Karimnagar: తెలంగాణలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా పంచాయతీలను ఏకం చేస్తే తాను ప్రత్యేకంగా నిధులు ఇస్తానని చెప్పిన మాట ప్రకారం బండి సంజయ్‌ నిధులు ఇచ్చారు. తాను మాట నిలబెట్టుకున్నానని.. ఇక కాంగ్రెస్‌ను, రేవంత్ రెడ్డిని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులేవి? అని ప్రశ్నించారు. హామీలిచ్చి మోసం చేయడంలో రేవంత్ రెడ్డి రికార్డు సృష్టిస్తున్నాడని ఎద్దేవా చేశారు.

Also Read: Schools Holiday: విద్యార్థులకు పండగ మీద పండుగ.. మార్చిలో మొత్తం 13 సెలవులు

ఏకగ్రీవంగా ఎన్నుకునే గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల ప్రోత్సహకాన్ని ఇస్తానంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏకగ్రీవమైన పీచుపల్లి, విజయనగర్ కాలనీ గ్రామ పంచాయతీలకు తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.10 లక్షల చొప్పున ప్రోత్సహక నిధులు విడుదల చేశారు. గ్రామస్తుల సమక్షంలో నిధులకు సంబంధించి ప్రతులను సర్పంచ్‌లకు అందజేశారు.

Also Read: Sharadha Peetham Lands: శారద పీఠం భూముల వివాదంపై తెలంగాణ మంత్రి వివరణ ఇదే!

అనంతరం విజయనగర్ కాలనీ గ్రామంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక ప్రసంగం చేశారు. భవిష్యత్తులో గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తానని ప్రకటించారు. గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని.. వీటితోపాటు ప్రజల కోసం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహక నగదు ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవమైన 1,203 గ్రామ పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.120.30 కోట్లు ఇవ్వాలని కోరారు. పంచాయతీ ఎన్నికలు ముగిసినా రేవంత్‌ రెడ్డి ఇంతవరకు నయాపైసా ఇయ్యలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ మండిపడ్డారు.

Also Read: TTD: బీఆర్ నాయుడు కాదు కామనాయుడు.. వెంటనే రాజీనామా చేయాలి: టీటీడీ మాజీ చైర్మన్‌

హామీలిచ్చి మోసం చేయడంలో రేవంత్ రెడ్డి అందరినీ మించిపోయాడని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. ప్రోత్సాహక నిధులు ఎందుకు ఇవ్వడం లేదనే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి రేవంత్‌ రెడ్డి చిల్లీగవ్వ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్‌లు చేసిన పనులకు బిల్లులివ్వాలని తిరిగి తిరిగి ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు

మాజీ సర్పంచుల బిల్లులతోపాటు గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. కేంద్రం ఇప్పటి వరకు పంచాయతీల అభివృద్ధి కోసం దశల వారీగా దాదాపు రూ.వెయ్యి కోట్లకుపైగా నిధులు మంజూరు చేసిందని వెల్లడించా. ఆ నిధులతో కాస్తో కూస్తో అభివృద్ధి పనులు జరుగుతున్నాయే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడ్డారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Mar 01, 2026 11:49:17
Nunna, Vijayawada, Andhra Pradesh:

AP SSC Digital Automation 2026: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. పరీక్షల ప్రక్రియలో అత్యంత పారదర్శకతను పెంచేందుకు, పేపర్ లీకేజీలను అరికట్టేందుకు ఈ ఏడాది 'డిజిటల్ ఆటోమేషన్' విధానాన్ని ప్రవేశపెట్టింది. 

మార్చి 16, 2026 నుండి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల కోసం విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండేందుకు అధికారుల కేటాయింపులో మానవ ప్రమేయం లేకుండా సాఫ్ట్‌వేర్ ఆధారిత ఆటోమేషన్ విధానాన్ని అమలు చేస్తోంది.

డిజిటల్ కేటాయింపులు 
చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు (DO), ఇన్విజిలేటర్ల నియామకాలను కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ద్వారా యాదృచ్ఛికంగా చేపట్టింది. ఎంపికైన అధికారుల నియామక ఉత్తర్వులను నేరుగా వారి వ్యక్తిగత ఈ-మెయిల్స్‌కు పంపారు. ఒకసారి విధులకు ఎంపికైన వారు తప్పనిసరిగా హాజరు కావాలని, అత్యవసరమైతే తప్ప ఎవరికీ మినహాయింపు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఆటోమేషన్ విధానం వల్ల కొందరు ఉపాధ్యాయులకు 100 కిలోమీటర్ల దూరంలో కూడా విధులు పడ్డాయి. ఉదాహరణకు పొదిలి ఉపాధ్యాయులకు గిద్దలూరులో విధులు కేటాయించడంతో సర్దుబాటు కోసం వారు డీఈవో (DEO) కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

వీరికి మినహాయింపు..
మానవీయ కోణంలో పరీక్షల పవిత్రతను కాపాడే ఉద్దేశంతో విద్యాశాఖ కింది వారికి విధుల నుండి మినహాయింపు ఇచ్చింది. కుటుంబ, వ్యక్తిగత కారణాలు.. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు.. పదో తరగతి పరీక్ష రాస్తున్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు (ఉపాధ్యాయులు).. గతంలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన వారు లేదా క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న వారు.. ప్రైవేట్ ట్యూషన్లు చెబుతున్న వారికి మినహాయింపులు ఇచ్చారు.

ఆరోగ్య కారణాలు..
వీటితో పాటు క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, కిడ్నీ మార్పిడి, మేజర్ న్యూరోసర్జరీ చేయించుకున్న వారు.. టీబీ (TB), వెన్నెముక సమస్యలు.. 70-90 శాతం వినికిడి లోపం.. 75 శాతం వైకల్యం ఉన్న పిల్లలు లేదా మానసిక వైకల్యం ఉన్న స్పౌజ్ (భార్య/భర్త) కలిగిన వారికి కూడా ఈ డ్యూటీ నుంచి మినహాయింపుని ఇచ్చారు. ఇక్కడ పేర్కొన్న మినహాయింపు పరిధిలోకి వచ్చేవారు పొరపాటున విధులకు ఎంపికైతే, తగిన వైద్య ధృవీకరణ పత్రాలతో డీఈవోను కలిసి మినహాయింపు పొందవచ్చు.

పేపర్ లీకేజీలకు కళ్లెం పడుతుందా?
డిజిటల్ ఆటోమేషన్ వల్ల ఏ అధికారి ఏ సెంటర్‌కు వెళ్తారో చివరి నిమిషం వరకు తెలియదు. దీనివల్ల స్థానిక ప్రభావం తగ్గి, పారదర్శకత పెరుగుతుందని విద్యాశాఖ భావిస్తోంది. అలాగే అత్యవసర పరిస్థితుల కోసం ప్రతి మండలానికి ఇద్దరు అధికారులను రిజర్వ్‌లో ఉంచారు.

Also Read: Burj Khalifa Drone Attack: దుబాయ్ బుర్జ్ ఖలీఫాపై డ్రోన్ దాడి? సోషల్ మీడియాలో వైరల్ వీడియో..వాస్తవం ఏంటి?

Also Read: Karachi Protest: ఖమేనీ మరణంతో రగులుతున్న పాకిస్థాన్.. అమెరికా కాన్సులేట్‌పై దాడి..20 మందికి పైగా దుర్మరణం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 01, 2026 11:09:25
Hyderabad, Telangana:

Sharadha Peetham Lands Issue: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శారదా పీఠానికి ఇచ్చిన భూములను మరో శాఖకు అప్పగించి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తీవ్ర దుమారానికి తెరలేపింది. ఈ విషయం రాజకీయంగా వివాదాస్పదమవడంతో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. శారదా పీఠం భూముల అంశంపై ప్రభుత్వం వెనక్కి తిరిగి పాత నిర్ణయమే అమలవుతుందని ప్రకటించింది. ఇంతలా వివాదాస్పదం కావడానికి గల కారణాలను మంత్రి శ్రీధర్‌ బాబు వివరించారు. సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం తలెత్తిందని వివరణ ఇచ్చారు.

Also Read: TTD: బీఆర్ నాయుడు కాదు కామనాయుడు.. వెంటనే రాజీనామా చేయాలి: టీటీడీ మాజీ చైర్మన్‌

'పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు. మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం. పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అండగా ప్రభుత్వం ఉంటుంది' అని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హైదరాబాద్‌ శివారు కోకాపేట్‌లోని నియో పోలీస్‌ ప్రాంతంలో జరుగుతున్న శారదా పీఠం నిర్మాణాలను పరిశీలించారు. శారదా పీఠాన్ని సందర్శించి అక్కడి రాజ శ్యామల అమ్మవారి ఆలయం, ఇతర నిర్మాణాలను చూశారు. అనంతరం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామీజీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూమి లాక్కుంటామని ప్రకటించిన అధికారుల తరఫున మంత్రి శ్రీధర్‌ బాబు శారద పీఠం నిర్వాహకులతో మాట్లాడారు.

Also Read: B Naidu Videos: అశ్లీల వీడియోలు నావి కావు.. అవి ఫేక్‌ డీప్‌ వీడియోలు: టీటీడీ చైర్మన్‌ నాయుడు

కోకాపేట్‌లోని శారదా పీఠం భూముల వ్యవహారంలో సమాచార లోపంతోనే గందరగోళం తలెత్తిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. ఆ భూములు పీఠానికే చెందుతాయని.. ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తోందని తెలిపారు. తమ ప్రభుత్వానికి భేషజాలు లేవని, తప్పులు దొర్లితే ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

అసలు విషయం తెలిసిన వెంటనే శారదా పీఠం భూముల విషయంలో జరిగిన పొరపాటును వెంటనే సరిదిద్దుకున్నామని శ్రీధర్‌ బాబు వివరించారు. రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మతాన్ని అడ్డు పెట్టుకొని కొందరు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తమ రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వంపై  దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాది బుల్డోజర్ సంస్కృతి కాదని... కబ్జాకోరుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడటం చూసి ఓర్వలేకే కొందరు తమపై కావాలనే బురద చల్లుతున్నారని విమర్శించారు. బాపుఘాట్ అభివృద్ధి విషయంలో ప్రజాభీష్టం మేరకే ముందుకెళ్తామని.. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 01, 2026 09:51:59
Tadepalli, Andhra Pradesh:

BR Naidu Resignation: 'టీటీడీ చైర్మన్  బీఆర్ నాయుడు మహా ఘోరాతిఘోరం చేశారు. 94 సంవత్సరాల పాలకమండళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనంతగా అనైతిక చర్యలకు బీఆర్ నాయుడు పాల్పడ్డారు. అలాంటి వ్యక్తిని టీటీడీకి చైర్మన్‌గా నియమించారు. ఆయన కామక్రీడలు సోషల్ మీడియాలో ప్రపంచమంతా తెలిసిపోయింది. ఆ వీడియోలు చూసి హిందూ భక్తులు మండి పడుతున్నారు' అని టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. 'వెంకటేశ్వర స్వామి పూజలు చేశాకే దినచర్య ప్రారంభిస్తానన్న చంద్రబాబు నియమించిన వ్యక్తి అనైతిక వీడియోలు వచ్చాయి. ప్రపంచమంతటా ఉన్న హిందూ భక్తుల మనోభావాలు దెబ్బ తిన్నాయి' అని చెప్పారు.

Also Read: B Naidu Videos: అశ్లీల వీడియోలు నావి కావు.. అవి ఫేక్‌ డీప్‌ వీడియోలు: టీటీడీ చైర్మన్‌ నాయుడు

టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అశ్లీల వీడియోలు బయటకు రావడంతో తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం భూమన కరుణాకర్‌ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్‌ నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారు. 'వాత్సాయనుడికి వారసుడుగా బీఆర్ నాయుడు తయారయ్యారు. ఆయన బీఆర్ నాయుడు కాదు కామనాయుడుగా మారాడు. ఆ వీడియోలు ఏఐ అని బీఆర్ నాయుడు చెప్తున్నమాట అబద్దం. నేను కొందరు ఏఐ నిపుణులతో మాట్లాడా. ఆ వీడియోలు కరెక్టేనని చెప్పారు. బీఆర్ నాయుడుకి సిగ్గు ఉంటే మౌనంగా రాజీనామా చేసి పక్కకు వెళ్లాలి' అని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సవల్‌ చేశారు. అలా చేయకపోగా తన వర్గపు మీడియా ద్వారా ఎదురుదాడి చేయటం సిగ్గుచేటు అని మండిపడ్డారు.

Also Read: Gold Fruad: మేడమ్‌ పేరిట బంగారు కడ్డీలతో మోసం.. కిలో బంగారంతో ఉడాయింపు

'తివారి ఫొటోలు బయటకు వస్తే రాజీనామా చేసి వెళ్లారు. ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ గురించి ఆడియో బయటకు రాగానే జగన్ అతడితో రాజీనామా చేయించారు. ఇప్పుడు చంద్రబాబు కూడా బీఆర్ నాయుడితో రాజీనామా చేయించాలి' అని భూమన కరుణాకరరెడ్డి కోరారు. 'సిర్రిఅప్పన్ అనే అర్చకుడు అనైతిక కార్యకలాపాలు చేస్తే వధించారు. ఆ శాశనం తిరుమలలో ఉంది. అలాంటి ఆలయానికి ఛైర్మన్ గా ఉన్న బీఆర్ నాయుడి వీడియోలు బయటకు వస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?' అని కూటమి ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు.

'వైఎస్‌ జగన్ కుటుంబసభ్యులను దూషించినందుకు ఆ స్వామే బీఆర్ నాయుడుకి శిక్ష విధించింది. ఆ వ్యక్తిని పదవి నుంచి తొలగించకపోగా వైఎస్సార్ సీపీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. అరెస్టులకు పురిగొల్పటం సిగ్గుచేటు. ఇవేకాదు ఇంకా చాలా వీడియోలు బయటకు వస్తాయి' అని భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. 'డీప్ ఫేక్ వీడియోలు అంటూ తప్పించుకోవాలనుకుంటే కుదరదు. పోలీసులకు కూడా అనైతిక బురదను అంటించే ప్రయత్నం చేస్తున్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'టీటీడీ ఛైర్మన్ ఆఫీసులో కూడా ఇలాంటి కామ క్రీడలు చేస్తున్నారా? అనే అనుమానం కలుగుతోంది' అని టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి సంచలన ఆరోపణ చేశారు.

ఇప్పటికైనా బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని భూమన కరుణాకరరెడ్డి డిమాండ్‌ చేశారు. లడ్డూ కల్తీ అయ్యాయని గుడిమెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం మాట్లాడతారు? అని ప్రశ్నించారు. బీఆర్ నాయుడు అనైతిక చర్యలను సమర్ధిస్తారా? అని నిలదీశారు. లడ్డూ ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాపం ఊరికే పోదని పేర్కొన్నారు. 'బీఆర్ నాయుడు హిందూధర్మం అనే ఛానల్ కూడా నడుపుతున్నారు. వీఐపీలకు దేవుడి దర్శనం చేయించి వారితో తమ ఖాతాలో డబ్బులు వేయించుకుంటున్నారనే అనుమానం కలుగుతోంది' అని టీటీడీ మాజీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 01, 2026 09:21:26
Tirupati, Andhra Pradesh:

TTD Chairman Videos With Women: 'నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగతంగా నన్ను అప్రతిష్ట పాలు చేసేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారు. ఏఐ సాంకేతికతను వాడుకుని నా రూపం అనుకరించేలా వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారు. ఈ కంటెంట్ మొత్తం అసత్యమైనది, వక్రీకరించినది. ఇది టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పన్నిన పథకం' అని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని.. వైసీపీకి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై నేను చట్ట ప్రకారం ముందుకెళ్తానని ప్రకటించారు.

Also Read: Free Bus Scheme: ఫ్రీ బస్సుపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన.. ఉత్తర్వులు జారీ!

అనూహ్యంగా తెరపైకి వచ్చిన అతడి రాసలీలల వీడియోలపై టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 'నాపై సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్రను తేల్చాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశా. నా వ్యక్తిత్వాన్ని  హననం చేస్తూ టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులను, దుష్ట శక్తులను వదిలేది లేదు' అని హెచ్చరించారు. 'పని పాట లేకుండా పరంబోకుల వ్యవహరించారు. హిందూ ధర్మం చానల్‌కి డబ్బులు మళ్లించానని నా మీద ఆరోపణలు. అన్ని రికార్డులు పెడతాం. మొత్తం మార్ఫింగ్ కాదు కొన్ని దగ్గర మార్ఫింగ్ చేశారు' అని బీఆర్‌ నాయుడు తెలిపారు.

'వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తూ ఘోరాతి ఘోరంగా నా మీద దాడి చేస్తున్నారు. మొదటి రోజు నుంచే నన్ను రాజీనామా చేయి అని కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎందుకంటే టీటీడీ చైర్మన్‌గా ఉన్నన్ని రోజులు కుంభకోణాలు చేశాడు. అవి ఎక్కడ బయట పెడతానో అని ఇలా మార్ఫింగ్ చేసి బెదిరిస్తున్నాడు' అని టీటీడీ చైర్మన్‌ బిఆర్‌ నాయుడు ఆరోపించారు. కరుణాకర్ చేసిన అవినీతిని తాను బయట పెడతానిని భయపడుతూ నన్ను రాజీనామా చేయాలని ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. 'ఐదు సంవత్సరాలుగా వేల టికెట్స్ అమ్ముకున్నారు ప్రూఫ్ ఉంది. నేను భయపడేవాడిని కాదు గుర్తుపెట్టుకో' అని భూమన కరుణాకర్‌ రెడ్డికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు.

'టీటీడీ హిందూ ధర్మం కించపరచడం ఇష్టం లేక చంద్రబాబు చెప్పడంతో నిశ్శబ్దంగా ఉన్నా. కొన్ని వందల కుంభకోణాలు ఉన్నాయి. అన్ని రికార్డ్స్ ఉన్నాయి' అని బీఆర్‌ నాయుడు తెలిపారు. ఫేక్ డీప్ వీడియోలు ఎలా పెడతారు? అని మండిపడ్డారు. 'రాజకీయంగా ఇరు కుటుంబాలు 30 సంవత్సరాలుగా ఉన్నాం. మరి ఎలా చేస్తారు? అని నిలదీశారు. వైఎస్‌ జరరిఐలతైతౌఐతైఐతైటగన్‌ను ప్రశ్నించా. సతీసమేతంగా తిరుమలకు రారని ప్రశ్నించాను. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి కూడా ఇలానే చేశారు. అందుకే నామీద ఎలాంటి నీచపు పని చేస్తున్నారు' అని బీఆర్‌ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ఈ విషయంపై మా కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఇవ్వాలి. వీళ్లకి ఏమి మా మీద పడి ఏడుస్తున్నారు. వీళ్లకి ఏమి పని లేదా? కరుణాకర్ రెడ్డి మద్రాస్‌లో ఏం చేశావో అన్నీ నాకు తెలుసు. నిన్ను, వైవీ సుబ్బారెడ్డిని వదలను' అని బీఆర్‌ నాయుడు హెచ్చరించారు. టీటీడీలో అన్ని అక్రమాలు చేశారు బయట పెడతా. వారికి మంచిది కాదని హితవు పలికారు.

'రేపు వన్ మ్యాన్ కమిటీ వస్తుండడంతో డైవర్ట్ పొలిటికల్ ట్రిక్స్ ఇవన్నీ. మార్ఫింగ్ వీడియోలు చేసి నన్ను భయపెట్టడం అనేది నా దగ్గర పని చేయవు' అని బీఆర్‌ నాయుడు తెలిపారు. కొత్తగా కరుణాకర్ రెడ్డి, వైఎస్‌ జగన్ మీద ఆరోపణలు చేయాల్సిన పనిలేదు. అందరికి తెలుసు రూ.లక్షల కోట్లు అవినీతి చేశారు. నాకు ఎన్నో అవకాశాలు ఉన్న టీటీడీలో సేవలు అందించాలని వచ్చా' అని బీఆర్‌ నాయుడు తెలిపారు. భగవద్గీత ప్రింట్‌లలో 50 కోట్లు అవినీతి చేసి వాటిని ఎవరికి ఇవ్వకుండా లక్ష యాభై వేలు కాపీలు గోడౌన్‌లో పెట్టేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి' అని బీఆర్ నాయుడు వెల్లడించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Mar 01, 2026 09:10:49
Karachi, Sindh:

Karachi Protest America Consulate: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం, ఆ దేశంపై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల ప్రభావం పొరుగు దేశమైన పాకిస్థాన్‌పై తీవ్రంగా పడింది. ప్రస్తుతం పాక్ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ప్రధాన నగరాలన్నీ యుద్ధ భూమిని తలపిస్తున్నాయి. 

ఇరాన్ పాలకుడు ఖమేనీ హత్యకు గురయ్యారనే వార్త పాకిస్థాన్‌లోని షియా సామాజిక వర్గంతో పాటు సాధారణ ప్రజల్లోనూ ఆగ్రహాన్ని నింపింది. రాజధాని ఇస్లామాబాద్‌తో పాటు కరాచీ, లాహోర్, రావల్పిండి వంటి నగరాల్లో నిరసనకారులు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి విధ్వంసానికి దిగారు. ఈ ఘటనలో 20 మందికి పైగా మరణించినట్లు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. అందులో పాకిస్తానీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

కరాచీలో ఉద్రిక్తత, కాన్సులేట్ ధ్వంసం
అందరికంటే ఎక్కువగా కరాచీలో నిరసనల తీవ్రత పెచ్చుమీరింది. ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు కరాచీలోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయంపై దాడి చేశారు. భద్రతా వలయాన్ని ఛేదించుకుని లోపలికి ప్రవేశించిన ఆందోళనకారులు కార్యాలయం అద్దాలను పగలగొట్టి, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. కార్యాలయంలోని కొన్ని భాగాలకు నిప్పు పెట్టడంతో దట్టమైన పొగ అలుముకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఈ హత్యకు ప్రధాన కారకుడిగా భావిస్తూ, ఆయన దిష్టిబొమ్మలను నిరసనకారులు తగులబెట్టారు. కేవలం పాకిస్థాన్‌లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఈ వేడి కనిపిస్తోంది. ఇరాక్ బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వెలుపల వేలాది మంది ప్రజలు చేరి అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మధ్యప్రాచ్యంలో అస్థిరతకు అమెరికానే కారణమని వారు ఆరోపించారు.

మరోవైపు భారతదేశంలోని కాశ్మీర్‌లో రాంబన్ ప్రాంతంలో షియా ముస్లింలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఖమేనీ మరణం తమ వర్గానికి తీరని లోటని, అమెరికా-ఇజ్రాయెల్ కుట్రపూరితంగా ఈ హత్యకు పాల్పడ్డాయని షియా నాయకుడు సయ్యద్ సమర్ కాజ్మీ మండిపడ్డారు.

పాకిస్థాన్‌లోని పలు నగరాల్లో స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. విదేశీ రాయబార కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న ఈ సైనిక ఘర్షణలు సాధారణ ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి.

ఖమేనీ మరణానంతరం చెలరేగిన ఈ హింస ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. పాకిస్థాన్ ప్రభుత్వం ఈ ఆందోళనలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ప్రజల్లో ఉన్న ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.

Also Read: Burj Khalifa Drone Attack: దుబాయ్ బుర్జ్ ఖలీఫాపై డ్రోన్ దాడి? సోషల్ మీడియాలో వైరల్ వీడియో..వాస్తవం ఏంటి?

ALso Read: PAK Vs SL Match Fixing: పాకిస్థాన్‌తో శ్రీలంక మ్యాచ్‌ ఫిక్సింగ్? టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ ఆరోపణలు..సోషల్ మీడియాలో ట్రెండ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Mar 01, 2026 07:44:11
دبي, دبي:

Burj Khalifa Drone Attack News: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ, సోషల్ మీడియాలో ఒక భయానక వీడియో ప్రపంచాన్ని వణికిస్తోంది. దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత కట్టడం బుర్జ్ ఖలీఫా లక్ష్యంగా ఇరాన్ డ్రోన్లు దాడికి దిగాయంటూ సాగుతున్న ఈ ప్రచారం జరుగుతోంది.

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడుల అనంతరం, ఇరాన్ తన ప్రతీకారాన్ని పది దేశాలపై క్షిపణుల రూపంలో ప్రదర్శించింది. ఈ క్రమంలోనే దుబాయ్‌లోని ఐకానిక్ టవర్ బుర్జ్ ఖలీఫా సమీపంలో డ్రోన్లు సంచరించినట్లు వార్తలు వస్తున్నాయి.

వైరల్ వీడియోలో ఏముంది?
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో.. బుర్జ్ ఖలీఫా భవనానికి అత్యంత సమీపంలో ఒక డ్రోన్ వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. భవనం పరిసరాల్లో నల్లటి పొగ దట్టంగా అలుముకున్నట్లు వీడియోలో చిత్రీకరించారు. డ్రోన్ బుర్జ్ ఖలీఫాను ఢీకొట్టిందని, తద్వారా భారీ నష్టం సంభవించిందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వీడియో వైరల్ అయినప్పటికీ, దుబాయ్ ప్రభుత్వం లేదా ఐక్య అరబ్ ఎమిరేట్స్ (UAE) భద్రతా దళాలు బుర్జ్ ఖలీఫాపై దాడి జరిగినట్లు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. ఇరాన్ ప్రయోగించిన కొన్ని డ్రోన్లు దుబాయ్ గగనతలంలోకి ప్రవేశించిన మాట వాస్తవమే అయినప్పటికీ, అవి బుర్జ్ ఖలీఫాను ఢీకొట్టాయనే వార్తలకు ఇంకా సరైన ఆధారాలు లేవు. భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటికే దుబాయ్‌లోని పలు కీలక ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయించారు.

ఒకవేళ దాడి జరిగితే?
ఒకవేళ ఇలాంటి దాడులు జరిగితే సంభవించే ఆర్థిక నష్టం ఊహాతీతం. 828 మీటర్ల ఎత్తుతో దుబాయ్ గర్వకారణంగా ఉన్న ఈ భవనం విలువ సుమారు 1.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.12,500 కోట్లు). ఈ భవనాన్ని డెవలపర్ 'ఎమ్మార్ ప్రాపర్టీస్' దాదాపు 1.5 బిలియన్ డాలర్లకు బీమా చేయించింది. ఏదైనా విపత్తు సంభవించినా లేదా దాడి జరిగినా ఈ ఇన్సూరెన్స్ రక్షణ కవచంలా నిలుస్తుంది.

దుబాయ్ అప్రమత్తం
ప్రస్తుత ఉద్రిక్తతల దృష్ట్యా యూఏఈ వైమానిక దళం హై అలర్ట్‌లో ఉంది. పౌరులెవరూ భయాందోళనలకు గురికావద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రభుత్వం కోరుతోంది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఈ సమయంలో ఇలాంటి సున్నితమైన కట్టడాల రక్షణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Also Read: Khamenei Death: "ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీ చనిపోయారు!" అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!

Also Read: Iran Israel Defense Comparison: రణరంగంగా మారిన పశ్చిమాసియా..అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ సైనిక బలాబలాలు ఎంతంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Mar 01, 2026 06:14:28
Hyderabad, Telangana:

Ayatollah Ali Khamenei Net Worth: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం మధ్యప్రాచ్య రాజకీయాల్లోనే కాకుండా, అంతర్జాతీయ ఆర్థిక వర్గాల్లోనూ పెద్ద చర్చకు దారితీసింది. సాధారణ ఆధ్యాత్మికవేత్తగా కనిపించే ఖమేనీ వెనుక ఉన్న అపారమైన ఆర్థిక సామ్రాజ్యం గురించి ఇప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఇరాన్‌ను మూడు దశాబ్దాలకు పైగా నిరంకుశంగా పాలించిన ఖమేనీ మరణవార్తను అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీడియా ధృవీకరించాయి. ఈ క్రమంలో ఆయన నియంత్రణలో ఉన్న భారీ సంపదపై ప్రపంచ దేశాల దృష్టి పడింది.

ఖమేనీ నికర విలువ
ఖమేనీ వ్యక్తిగతంగా నిరాడంబర జీవితం గడుపుతున్నట్లు ప్రచారం ఉన్నప్పటికీ, ఆయన గుప్పిట్లో ఉన్న సంస్థల విలువ కళ్లు చెదిరేలా ఉంది. 'ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇమామ్ ఖొమేనీస్ ఆర్డర్' అనే శక్తివంతమైన ఆర్థిక సంస్థ ద్వారా ఆయన ఇరాన్ ఆర్థిక వ్యవస్థను శాసించారు. జప్తు చేసిన ఆస్తులు, భారీ రియల్ ఎస్టేట్, ప్రభుత్వ రంగ సంస్థలపై ఈ సంస్థకు గుత్తాధిపత్యం ఉంది.

వివిధ అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఖమేనీ నియంత్రణలో ఉన్న సంపద విలువ సుమారు 95 బిలియన్ డాలర్ల నుండి 200 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.16 లక్షల కోట్లు) వరకు ఉంటుందని అంచనా. 1989 నుంచి సుప్రీం లీడర్‌గా ఉన్న ఆయన అణు కార్యక్రమాలకు, ప్రాంతీయ యుద్ధాలకు అవసరమైన నిధులను తన స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థల నుండే మళ్లించేవారని సమాచారం.

ప్రపంచంలోని అత్యంత సంపన్న రాజకీయ నేతలతో పోల్చి చూస్తే ఖమేనీ సంపద ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ ఆస్తుల విలువ సుమారు 95 - 200 బిలియన్ డాలర్ల (రూ.18.22 లక్షల కోట్లు) ఉంటుందని అంచనా. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆస్తి మాత్రం రూ.66 వేల కోట్లు ఉండగా.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంపద సుమారు రూ.118 కోట్ల విలువ ఉంటుందని సమాచారం.

ఈ గణాంకాలను గమనిస్తే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆస్తులను కలిపినా ఖమేనీ సంపదలో కనీసం 10 శాతం కూడా ఉండవని విశ్లేషకులు చెబుతున్నారు.

యుద్ధం, అంక్షలు, అంతర్గత కల్లోలాల మధ్య కూడా దేశ ఆర్థిక వనరులను తన కనుసన్నల్లో ఉంచుకున్న ఖమేనీ మరణం, ఇరాన్ భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టింది. ఆయన తర్వాత ఈ భారీ ఆర్థిక సామ్రాజ్యాన్ని ఎవరు నిర్వహిస్తారు? అది ప్రజల సంక్షేమానికి అందుతుందా లేదా మరో యుద్ధానికి ఇంధనంగా మారుతుందా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

గమనిక: ఖమేనీ సంపద వివరాలు అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు, మీడియా నివేదికల అంచనాలపై ఆధారపడి ఉన్నాయి. ఇరాన్ అధికారికంగా వీటిని ఎప్పుడూ ధృవీకరించలేదు.

Also Read: Iran Israel Defense Comparison: రణరంగంగా మారిన పశ్చిమాసియా..అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ సైనిక బలాబలాలు ఎంతంటే?

Also Read: PAK Vs SL Match Fixing: పాకిస్థాన్‌తో శ్రీలంక మ్యాచ్‌ ఫిక్సింగ్? టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ ఆరోపణలు..సోషల్ మీడియాలో ట్రెండ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Mar 01, 2026 05:44:22
Hyderabad, Telangana:

Pakistan Vs Sri Lanka Match Fixing: 2026 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన సూపర్ స్టేజ్ మ్యాచ్ ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని దృశ్యాలు, మ్యాచ్‌లో జరిగిన నాటకీయ పరిణామాలు చూస్తుంటే ఇది ఖచ్చితంగా 'మ్యాచ్ ఫిక్సింగ్' అని నెటిజన్లు మండిపడుతున్నారు. 

పాకిస్థాన్ సెమీఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో కనీసం 65 పరుగుల భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో శ్రీలంక ఆటగాళ్లు ప్రదర్శించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది.

వివాదానికి కారణమైన ప్రధాన అంశాలు..
11వ ఓవర్‌లో మహేష్ తీక్షణ వేసిన బంతి పాక్ ఓపెనర్ ఫఖర్ జమాన్ బ్యాట్‌కు తగిలి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. స్నికోమీటర్‌లో స్పష్టమైన 'స్పైక్' కనిపించినప్పటికీ, శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక రివ్యూ తీసుకోకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

పాక్ ఓపెనర్లు ఫఖర్ జమాన్, సాహిబ్జాదా ఫర్హాన్ ఇచ్చిన అత్యంత సులభమైన క్యాచ్‌లను దునిత్ వెల్లలాగే, చరిత్ అసలంక వంటి మేటి ఫీల్డర్లు వదిలేశారు. ఇది కావాలని చేసిన తప్పిదంలా ఉందని అభిమానులు ఆరోపిస్తున్నారు. శ్రీలంక బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వడంతో పాక్ ఓపెనర్లు మొదటి వికెట్‌కు 170 పరుగులు జోడించారు. ఇది టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే పాకిస్థాన్ తరపున అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం గమనార్హం.

ఒక దశలో పాకిస్థాన్ 250 పైచిలుకు పరుగులు చేస్తుందని భావించినప్పటికీ, చివరి 5 ఓవర్లలో శ్రీలంక బౌలర్లు అనూహ్యంగా పుంజుకున్నారు. కేవలం 34 పరుగులకే 8 వికెట్లు పడగొట్టడంతో పాక్ 20 ఓవర్లలో 212/8 పరుగులకే పరిమితమైంది. సాహిబ్జాదా ఫర్హాన్ సెంచరీ బాదడమే కాకుండా, ఒకే ప్రపంచకప్ ఎడిషన్‌లో రెండు సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

నెటిజన్ల డిమాండ్..
శ్రీలంక ఆటగాళ్లు పాకిస్థాన్‌ను గెలిపించేందుకే ఆడుతున్నట్లుగా ఉందని, ఐసీసీ (ICC) వెంటనే దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఆదాయం, హోస్టింగ్ హక్కుల కోసమే శ్రీలంక ఇలా చేసిందని కొందరు ఆరోపిస్తుండగా, మరికొందరు దీనిని క్రికెట్ చరిత్రలో ఒక చీకటి రోజుగా అభివర్ణిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిచినప్పటికీ, సెమీఫైనల్ రేసు నుండి నిష్క్రమించింది. అయితే, శ్రీలంక ఆటగాళ్ల వైఖరి మాత్రం ఈ టోర్నీలో పెద్ద మచ్చగా మిగిలిపోయింది. ఈ ఆరోపణలపై శ్రీలంక క్రికెట్ బోర్డు లేదా ఐసీసీ ఇంకా స్పందించాల్సి ఉంది.

Also Read: Iran Israel Defense Comparison: రణరంగంగా మారిన పశ్చిమాసియా..అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ సైనిక బలాబలాలు ఎంతంటే?

Also Read: Baba Vanga World War 3: బాబా వంగా చెప్పినట్టే జరుగుతోందా? 2026 'మూడో ప్రపంచ యుద్ధం' మొదలైనట్టేనా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
comment0
Report
BBhoomi
Mar 01, 2026 05:10:15
Lakshmapur, Telangana:

US Iran Tensions Indias Economy Trouble: ఇరాన్‌లోని కీలక లక్ష్యాలపై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడులు పశ్చిమాసియాలో భద్రతా ఆందోళనలను తీవ్రతరం చేశాయి. ఈ పరిణామాలు ప్రాంతీయంగా మాత్రమే కాకుండా ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఇంధన దిగుమతులపై భారీగా ఆధారపడే భారత్‌కు ఇది ఆర్థికంగా కీలకమైన దశగా మారింది.

హార్ముజ్ జలసంధి.. ప్రపంచ చమురు గుండెపోటు:
ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20 శాతం వాటా కలిగిన Strait of Hormuz జలసంధి ప్రస్తుత ఉద్రిక్తతల కేంద్రబిందువుగా మారింది. ఇరాన్‌ను ఒమన్, యూఏఈల నుంచి వేరు చేసే ఈ మార్గం ద్వారా భారత్ తన ముడి చమురు దిగుమతుల్లో సగానికి పైగా తెచ్చుకుంటోంది. ప్రస్తుతం రోజుకు సుమారు 26 లక్షల బ్యారెళ్ల ముడి చమురును ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ నుంచి ఈ మార్గంలోనే దిగుమతి చేస్తోంది. అంతేకాదు, రోజుకు దాదాపు 74 వేల బ్యారెళ్ల శుద్ధి చేసిన ఉత్పత్తులను కూడా ఇదే మార్గం ద్వారా ఎగుమతి చేస్తోంది. ఇక్కడ ఏ చిన్న ఆటంకం వచ్చినా రవాణా ఖర్చులు పెరిగి, దేశ ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం పడే ప్రమాదం ఉంది.

చమురు ధరల ఎగిసే ప్రమాదం:
అమెరికా బలగాల మోహరింపుతోనే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇప్పటికే పెరుగుదల దిశగా కదులుతున్నాయి. విశ్లేషణల ప్రకారం, ఇరాన్ ఉత్పత్తిలో అంతరాయం కలిగితే బ్యారెల్ ధర గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. హార్ముజ్ జలసంధిలో రవాణా అంతరాయం మరింత తీవ్రమైతే, ధరలు మరింత ఎగసే ముప్పు ఉంది. ఇది భారత్ వంటి దిగుమతి ఆధారిత దేశాలకు ప్రతికూల పరిణామమే అని చెబుతున్నారు.

భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం:
భారత్ వినియోగించే చమురులో సుమారు 85 శాతం దిగుమతులే. అంతర్జాతీయ ధరలు పెరిగితే దిగుమతి బిల్లు పెరుగుతుంది. దీంతో కరెంట్ అకౌంట్ లోటు మరింత విస్తరించే ప్రమాదం ఉంది. చమురు కొనుగోళ్లకు డాలర్లలో చెల్లింపులు చేయాల్సి ఉండటంతో డాలర్ డిమాండ్ పెరిగి, రూపాయి విలువపై ఒత్తిడి పడుతుంది. రూపాయి బలహీనత మరోవైపు దిగుమతులను మరింత ఖరీదుగా మారుస్తుంది.

పెట్రోల్, డీజిల్ ధరలు: 
దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగితే రవాణా వ్యయాలు అధికమవుతాయి. ఎర్ర సముద్రం వంటి మార్గాల్లో భద్రతా సమస్యలు తలెత్తితే నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరగాల్సి రావచ్చు. దీంతో సరుకు రవాణా సమయం 15–20 రోజులు, ఖర్చులు 40–50 శాతం పెరిగే అవకాశముంది. ఈ ప్రభావం చివరకు వినియోగదారుడి జేబుపై పడుతుంది. గగనతలాల పరిమితులతో విమానయాన సంస్థలు మార్గమార్పులు చేపడితే టికెట్ ధరలు కూడా పెరగవచ్చు.

Also Read: Gold Price: భారీగా పెరగనున్న బంగారం ధర.. ఇరాన్‌ సంక్షోభంతో పెట్రోల్‌ మంట కూడా తప్పదా?  

ఎగుమతులు, స్టాక్ మార్కెట్, బులియన్ మార్కెట్:
ఇరాన్‌కు భారత్ నుంచి వెళ్లే బాస్మతి బియ్యం, ఔషధాలు, టీ, సుగంధ ద్రవ్యాల ఎగుమతులపై కూడా ప్రభావం ఉండొచ్చు. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్లు అనిశ్చితి ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉద్రిక్తతలు ఎంతకాలం కొనసాగితే అంతకాలం మార్కెట్ల అస్థిరత పెరిగే ప్రమాదం ఉంది.

బంగారం, వెండి ధరలు: 
సురక్షిత పెట్టుబడుల వైపు మదుపర్లు మొగ్గు చూపడంతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ అంచనా ప్రకారం, ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ.1.70 లక్షల వరకు, కిలో వెండి రూ.3 లక్షల వరకు చేరే అవకాశముంది. మొత్తంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత్‌కు ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం, మార్కెట్ విశ్వాసం ఇవన్నీకూడా మూడు రంగాల్లో సవాళ్లను సృష్టించే పరిస్థితి ఏర్పడింది. యుద్ధ మేఘాలు త్వరగా వీడితేనే మార్కెట్లకు ఊరట లభించే అవకాశం ఉంది.

Also Read:  EPFO CBT Meeting: హోలీకి ముందు గుడ్‌న్యూస్.. 31కోట్ల మందికి ప్రయోజనం.. EPFO కీలక నిర్ణయం..!!  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

0
comment0
Report
BBhoomi
Mar 01, 2026 03:37:52
Lakshmapur, Telangana:

UP Free Cylinder: హోలీ పండుగకు ముందుగా ఉత్తరప్రదేశ్ ప్రజలకు యోగి ప్రభుత్వం  శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి  ఆదిత్యనాథ్ , ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులైన ప్రతి కుటుంబానికి ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తామని ప్రకటించారు. ఈ సౌకర్యాన్ని హోలీతో పాటు దీపావళి పండుగల సందర్భాల్లో కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

లక్నోలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తొమ్మిది సిలిండర్లకు సబ్సిడీ అందించే విధానాన్ని అమలు చేస్తోందని తెలిపారు. సిలిండర్ రీఫిల్ చేసినప్పుడు సుమారు రూ. 335.40 మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా పారదర్శకతను పెంచుతున్నామని చెప్పారు. ఈ విధానం దుర్వినియోగాన్ని అరికట్టడమే కాకుండా.. పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గించడంలో సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.

ఇది కేవలం పండుగ కానుక మాత్రమే కాదని, గౌరవప్రదమైన జీవన విధానానికి ప్రభుత్వ నిబద్ధత అని సీఎం స్పష్టం చేశారు. హోలీ, దీపావళి వంటి సందర్భాల్లో ఇంధన అవసరాలు పెరుగుతాయని, ఆ సమయంలో కుటుంబాలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. మహిళల భద్రత, ఆరోగ్యం అంశాలపై కూడా సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో మహిళల స్వావలంబన, గౌరవం, రక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి బజ్రేష్ పతాక్ ఆధ్వర్యంలో 14 ఏళ్ల బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నిరోధక టీకా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. సాధారణంగా రూ. 2100 విలువ చేసే ఈ టీకాను కేవలం రూ. 300కే అందుబాటులో ఉంచడమే కాకుండా, అవసరమైతే ఉచితంగా అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.  మా కుమార్తె సురక్షితంగా ఉంటేనే కుటుంబం సురక్షితంగా ఉంటుంది  అని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read: Gold Rate Today: అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు.. భారీగా పెరిగిన పసిడి ధర.. మార్చి 1వ తేదీ ఆదివారం ధరలు ఇవే..!!  

ఈ సందర్భంగా గత ప్రభుత్వాలపై కూడా సీఎం యోగి ఆదిత్య నాథ్  విమర్శలు గుప్పించారు. గతంలో పాలన కుటుంబ కేంద్రంగా మారిందని, అభివృద్ధి కొద్దిమందికే పరిమితమైందని అన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రంలోని 25 కోట్ల ప్రజలను ఒక కుటుంబంగా భావిస్తోందని, వారి భద్రత, గౌరవం, సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.

Also Read:  China Currency Explainer: ప్రపంచ కరెన్సీ మార్కెట్లో ప్రకంపనలు.. చైనా చేసిన పనితో కంగుతిన్న అగ్రరాజ్యం..!!   

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

0
comment0
Report
HDHarish Darla
Mar 01, 2026 02:44:20
:

Israel Vs Iran Military Power Comparison: పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇరాన్ ఒకవైపు, అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మరోవైపు నిలిచి తమ సైనిక శక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఈ మూడు దేశాల మధ్య ఉన్న సైనిక సామర్థ్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధ సంపత్తి కలిగిన అమెరికా, సంఖ్యాపరంగా బలమైన ఇరాన్, సాంకేతికతలో మేటి అయిన ఇజ్రాయెల్ మధ్య పోరు ఆసక్తికరంగా మారింది.

అమెరికా
అమెరికా తన ప్రయోజనాల కోసం పశ్చిమాసియాలో సుమారు 40,000 మంది సైనికులను, అత్యాధునిక యుద్ధనౌకలను మోహరించింది. యూఎస్‌ఎస్‌ జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్, యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్ వంటి భారీ విమానవాహక నౌకలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. వీటిలో ఎఫ్-35 స్టెల్త్ యుద్ధ విమానాలు సిద్ధంగా ఉన్నాయి.

ముఖ్య స్థావరాలు..
బహ్రెయిన్‌లో అమెరికా నేవీ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. ఖతార్ (అల్ ఉదైద్)లో సెంట్రల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్, 10 వేల మంది సైనికులు ఉండగా.. యూఏఈ & కువైట్‌లో డ్రోన్లు, నిఘా విమానాలకు కీలకంగా ఉన్నాయి. దీంతో పాటు థాడ్, పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ శత్రు క్షిపణులను అడ్డుకోవడానికి మోహరించారు.

ఇరాన్
దీర్ఘకాలిక ఆంక్షలు ఉన్నప్పటికీ, ఇరాన్ స్వదేశీ సాంకేతికతతో భారీ క్షిపణి వ్యవస్థను నిర్మించుకుంది. 6.1 లక్షల మంది క్రియాశీల సైనికులు, 2 లక్షల మంది సుశిక్షిత ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ దళం దీని ప్రధాన బలంగా మారింది. ఇరాన్‌లో 2,000 కిలోమీటర్ల పరిధితో 3,000కు పైగా బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. ఇరాన్ వద్ద వేల సంఖ్యలో ఆత్మాహుతి డ్రోన్లు ఉన్నాయి. దాదాపు 6,000 నౌకాదళ మందుపాతరలతో హోర్ముజ్ జలసంధిని మూసివేసే సత్తా ఇరాన్‌కు ఉంది.

ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ సంఖ్యాబలం కంటే నాణ్యత, వేగంపై ఆధారపడుతుంది. ఎఫ్-35, ఎఫ్-16 వంటి 600కు పైగా అధునాతన యుద్ధ విమానాలు ఉన్నాయి. కచ్చితమైన లక్ష్యాలను ఛేదించడంలో ఇవి ప్రపంచంలోనే మేటి. క్షిపణి రక్షణ, ఐరన్ డోమ్ స్వల్ప శ్రేణి రాకెట్లను అడ్డుకుంటుంది. డేవిడ్ స్లింగ్, యారోలు మధ్యంతర, సుదూర క్షిపణులను గగనతలంలోనే ధ్వంసం చేస్తాయి. అణ్వాస్త్రాలు గురించి అధికారికంగా ప్రకటించకపోయినా, ఇజ్రాయెల్ వద్ద 90కి పైగా అణ్వాస్త్రాలు, 6,500 కి.మీ పరిధి గల జెరికో-3 క్షిపణులు ఉన్నాయి.

అమెరికా-ఇజ్రాయెల్ కూటమికి సాంకేతికత, వైమానిక శక్తి కలిసొచ్చే అంశం అయితే, ఇరాన్‌కు దాని క్షిపణి సంపత్తి, భౌగోళిక వ్యూహం (హోర్ముజ్ జలసంధి) ప్రధాన ఆయుధాలుగా ఉన్నాయి. ఈ ఘర్షణ పెరిగితే అది ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

Also Read: Khamenei Death: "ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీ చనిపోయారు!" అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!

Also Read: Baba Vanga World War 3: బాబా వంగా చెప్పినట్టే జరుగుతోందా? 2026 'మూడో ప్రపంచ యుద్ధం' మొదలైనట్టేనా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
sidebar-img
Advertisement
Back to top