ఖమ్మంలో ఫ్రూట్ మార్కెట్ ను ఏర్పాటు చేయాలి
పండ్ల మార్కెట్ ఏర్పాటు చేయాలని పండ్ల వ్యాపారుల సంఘం ప్రతినిధులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. ఖమ్మంలో బొప్పాయి, జామ, దానిమ్మ తదితర పంటలు మార్కెట్ అవుతున్నాయని మంత్రికి తెలిపారు. రైతులు పండించిన పంటలను విక్రయించేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని, మార్కెట్ ఏర్పాటుతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్తో మంత్రి మాట్లాడారు. మార్కెట్ వ్యవస్థ సమస్యను పరిశీలించాలని కలెక్టర్కు సూచించారు. అనంతరం తమ్ముడి కుమారుడు యుగేంద్రను కలిసి సమస్యను వివరించాడు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Govt Employees Sankranti Gift: ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ వరాలు ప్రకటిస్తోంది. అంతేకాకుండా ఉద్యోగులతోపాటు కాంట్రాక్టర్లకు కూడా శుభవార్త ప్రకటించింది. ఇప్పటికే కొన్ని ప్రకటనలు చేయగా.. తాజాగా కొన్ని కీలక అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు సంబంధించిన అన్నీ బిల్లులను క్లియర్ చేసేసింది. కరువు భత్యం, డీఆర్తోపాటు అనేక పెండింగ్ బిల్లులు ప్రభుత్వం విడుదల చేసింది. ఇక కాంట్రాక్టర్లకు సంబంధించిన బిల్లులను కూడా విడుదల చేసి వారి కుటుంబాల్లో పండుగ ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Telangana Sankranti Gift: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వరాలు.. పండుగకు ఏం ప్రకటించిందో తెలుసా?
ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు ఏపీ ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా డీఏ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డీఏకు సంబంధించిన బకాయిలు ఉన్నాయి. డీఏ, డీఆర్ ఏరియర్స్ విడుదల చేయాల్సి ఉండగా కొన్ని నెలలుగా బకాయి పడ్డాయి. తాజాగా డీఏ, డీఆర్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించి రూ.1,100 కోట్ల నిధులను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారుల కుటుంబాల్లో పండుగ ఆనందం వచ్చేసింది. సంక్రాంతి కానుకగా వివిధ రకాల బిల్లులను ఆర్థిక శాఖ క్లియర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: Traffic Challan: ట్రాఫిక్ చలాన్లపై భారీ షాక్.. బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ పేమెంట్
ఇక ప్రభుత్వానికి సంబంధించిన వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు కూడా ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక ఇచ్చింది. కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపునకు సంబంధించిన బిల్లులకు రూ.2,653 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పోలీసులకు ఇవ్వాల్సిన సరెండర్ లీవులకు రూ.110 కోట్ల నిధులు కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. ఈఏపీ, నాబార్డ్, సాస్కీ, సీఆర్ఐఎఫ్ పనులకు రూ.1,243 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకంఉది. ప్రభుత్వంలో ఎవరిరెవరికి బకాయి పడిందో వారందరికీ ఏపీ ప్రభుత్వం చెల్లింపులు చేసేసి వారందరికీ పండుగ గిఫ్ట్ అందించింది. ఈ బిల్లుల చెల్లింపుతో ఏపీలో మొత్తం 5.7 లక్షల మందికి లబ్ధి చేకూరనుండడం విశేషం
Also Read: AP Sankranti Gift: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి శుభవార్త.. రూ.5 కోట్ల బకాయిల విడుదల
నిధుల మంజూరు ఇలా..
డీఏ, డీఆర్ ఎరియర్స్ కోసం రూ.1,100 కోట్లు
పోలీసులకు ఇవ్వాల్సిన సరెండర్ లీవులకు రూ.110 కోట్లు
ఈఏపీ, నాబార్డ్, సాస్కీ, సీఆర్ఐఎఫ్ పనులకు రూ.1,243 కోట్లు
కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులు రూ.2,653 కోట్లు
బిల్లుల చెల్లింపుతో లబ్ధి పొందే కుటుంబాలు: 5.7 లక్షల మంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Traffic Challan Auto Debit: ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు పేరుకుపోతుండడంతో ఇకపై వాటి పరిష్కారానికి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పెండింగ్ చలాన్లు ఇక ఉండకూడదని.. వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలోనే బ్యాంకు అకౌంట్కు లింక్ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి నిర్ణయించారు. చలాన్ పడితే ఆటోమేటిక్గా వాహన యజమాని బ్యాంకు ఖాతా నుంచి చెల్లింపులు జరగాలని అధికారులకు ఆదేశించారు. ఈ ప్రకటన వైరల్గా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Telangana Sankranti Gift: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వరాలు.. పండుగకు ఏం ప్రకటించిందో తెలుసా?
హైదరాబాద్లో జరిగిన అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. 'నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్ల చెల్లింపులు ఆటోమేటిక్గా వాహనదారుడి బ్యాంకు ఖాతా నుంచి చెల్లింపులు అయ్యేలా చర్యలు తీసుకోవాలి' అని రేవంత్ రెడ్డి తెలిపారు. 'ట్రాఫిక్ వ్యవస్థ ఆరో వేలుగా తయారైంది.. ఈ విధానాన్ని మార్చాలీ . సాంకేతిక నైపుణ్యం ఉపయోగించుకుని ట్రాఫిక్ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి' అని సూచించారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్, హత్యల కంటే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు అతి పెద్ద సమస్యగా మారాయని చెప్పారు. సిగ్నల్, ట్రాఫిక్ వ్యవస్థపై అవగాహన కల్పించి ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.
Also Read: AP Sankranti Gift: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి శుభవార్త.. రూ.5 కోట్ల బకాయిల విడుదల
ట్రాఫిక్ నియంత్రణను టాప్ ప్రయారిటీగా తీసుకుని బలోపేతం చేస్తామని తెలంగాణ సీఎం చెప్పారు. 'దేశంలో ప్రతీ నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతోంది. విద్యార్థి దశలోనే రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలి. సమాజంలో నేరాల విషయంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసుకుంటున్నాం. ఆధునిక సమాజంలో సైబర్ క్రైమ్ పెరిగిపోయింది. అందుకే సైబర్ క్రైమ్ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం' అని సీఎం వివరించారు.
Also Read: Pension Hike: ప్రైవేటు ఉద్యోగులకు భారీ జాక్పాట్.. ఐదు రెట్లు కనీస పింఛన్ పెంపు
'డ్రగ్స్ మహమ్మారి ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి ఈగల్ ఫోర్స్ను ఏర్పాటు చేసుకున్నాం. డ్రగ్స్, గంజాయిని నియంత్రణలో తెలంగాణ పోలీసులకు గుర్తింపు దక్కింది. చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణకు హైడ్రా ను ఏర్పాటు చేసుకున్నాం. చెరువులను పునరుద్ధరించుకుని పతంగుల పండుగ జరుపుకుంటున్నాం' అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలను తీవ్రమైన సమస్యగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తోందని పేర్కొన్నారు. యుద్ధంలో సైనికుల కంటే ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రముఖులు కూడా బిడ్డలను కోల్పోయి దుఃఖంలో మునిగిపోతున్నారు' అని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
School Holiday Tomorrow: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, మకర సంక్రాంతి సందర్భంగా జనవరి 15, 2026న ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఇది రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తిస్తుంది.
గతంలో ఈ పండుగను జనవరి 14న జరుపుకుంటారా లేక 15న జరుపుకుంటారా అనే దానిపై గందరగోళం నెలకొంది. కానీ కొత్త ఉత్తర్వు ఇప్పుడు తేదీని ధృవీకరించింది. ఈ ప్రకటనతో, రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు జనవరి 15న మూసివేత కానున్నాయి.
గత కొన్నేళ్లుగా ఉత్తరప్రదేశ్లో మకర సంక్రాంతిని ఆప్షనల్ హాలీడేగా పరిగణించేవారు. అంటే ఉద్యోగులు ఆ రోజు సెలవు తీసుకోవాలా వద్దా అని ఎంచుకోవచ్చు. ఇప్పుడు, దీనిని ప్రభుత్వ సెలవుదినంగా మార్పు చేశారు. ఇది ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, బ్యాంకు ఉద్యోగులకు పూర్తి విశ్రాంతి దినాన్ని అందిస్తుంది.
సచివాలయం, కలెక్టరేట్, విద్యా సంస్థల వంటి ప్రభుత్వ విభాగాలకు కూడా సెలవు ఉండనుంది. తద్వారా ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలతో కలిసి పండుగను జరుపుకోవడానికి అవకాశం లభిస్తుంది.
పండుగలో భాగంగా, ప్రయాగ్రాజ్, వారణాసి, కాన్పూర్, మీరట్, ఉన్నావ్, బిజ్నోర్ వంటి ప్రధాన నగరాల్లోని గంగా ఘాట్లను పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తారని భావిస్తున్నారు. ప్రజలు గంగా, సరయూ వంటి నదులలో పవిత్ర స్నానాలు చేసి, దానధర్మాలు, ప్రార్థనలు చేస్తారు. రిషికేశ్, హరిద్వార్లలో కూడా ఇలాంటి జనసమూహం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడ ప్రజలు పవిత్ర జలాల్లో స్నానం చేసి ఆశీస్సులు పొందుతారు.
మకర సంక్రాంతి ప్రాముఖ్యత
మకర సంక్రాంతి ఒక ముఖ్యమైన హిందూ పండుగ, ఇది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని సూచిస్తుంది. ఉత్తరాయణం అని పిలువబడే ఈ మార్పు, పగటి సమయం ఎక్కువ ఉండే, ప్రకాశవంతమైన రోజుల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ పండుగ ఖర్మాసాల ముగింపును కూడా సూచిస్తుంది. ఆ తర్వాత వివాహాలు, కొత్త వ్యాపారాలు వంటి శుభ కార్యాలు ప్రారంభమవుతాయి.
ప్రజలు పవిత్ర నదులలో స్నానం చేయడం, పూజలు చేయడం, దానధర్మాలు చేయడం, స్వచ్ఛత మరియు మంచి ఆరోగ్యానికి ప్రతీకలైన నువ్వులు, బెల్లం వంటకాలను తినడం ద్వారా ఈ పండుగను జరుపుకుంటారు.
ఉత్తర భారతదేశంలో ఈ పండుగను మకర సంక్రాంతి అని పిలిచినప్పటికీ, ఇతర రాష్ట్రాలలో దీనికి వేర్వేరు పేర్లు ఉన్నాయి. తమిళనాడులో దీనిని పొంగల్ గా, పంజాబ్లో లోహ్రీగా, అస్సాంలో మాఘ్ బిహుగా జరుపుకుంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Washington Sundar Ruled Out Of ODI Series: న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో అద్భుత విజయంతో బోణీ కొట్టిన భారత జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా మిగిలిన వన్డే సిరీస్ నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సోమవారం అధికారికంగా ధృవీకరించింది.
అసలేం జరిగింది?
వడోదర వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో బౌలింగ్ చేస్తున్న సమయంలో వాషింగ్టన్ సుందర్ ఎడమ పక్కటెముకల భాగంలో తీవ్రమైన నొప్పితో అసౌకర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారు. త్వరలో మరిన్ని స్కాన్లు నిర్వహించి నిపుణుల సలహా తీసుకోనున్నారు.
జట్టులోకి కొత్త కుర్రాడు..
వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఐపీఎల్లో తన మెరుపు బ్యాటింగ్తో ఆకట్టుకున్న ఆయుష్ బదోనీకి తొలిసారిగా భారత వన్డే జట్టులో చోటు లభించింది. బుధవారం రాజ్కోట్లో జరగనున్న రెండో వన్డే నాటికి బదోనీ జట్టుతో చేరనున్నారు. యువ రక్తాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
తొలి వన్డేలో భారత్ ఘనవిజయం
న్యూజిలాండ్తో జరిగిన హోరాహోరీ పోరులో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 301 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమ్ఇండియా టాప్ ఆర్డర్ తడబడినా.. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన కింగ్ కోహ్లీ కేవలం 91 బంతుల్లో 93 పరుగులు చేసి భారత్ను విజయతీరాలకు చేర్చారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ 56 పరుగులతో సంయమనంతో కూడిన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు గట్టి పునాది వేశారు.
కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పందన
మ్యాచ్ అనంతరం కెప్టెన్ గిల్ బ్యాటర్ల ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు. "ముఖ్యంగా ఛేజింగ్లో జట్టుకు సహకారం అందించడం గొప్పగా అనిపిస్తుంది. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే చాలా సులభంగా అనిపిస్తుంది. కానీ ఈ పిచ్పై బ్యాటింగ్ ప్రారంభించడం కొంచెం కష్టమే. కోహ్లీ ఇలాగే పరుగులు సాధిస్తూ ఉండాలని ఆశిస్తున్నాను" అని టీమ్ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ అన్నారు.
వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ వంటి కీలక టోర్నీలు ఉన్న నేపథ్యంలో, ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూనే అందరికీ అవకాశం కల్పించేందుకు జట్టులో మార్పులు (రొటేషన్) చేస్తున్నామని గిల్ స్పష్టం చేశారు. అందుకే సిరాజ్, అర్ష్దీప్ వంటి బౌలర్లను మారుస్తూ ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
EPFO 3.0 PF ATM Withdrawal: ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించనుంది. ఇకపై మీ పీఎఫ్ (EPF) ఖాతాలోని డబ్బును తీసుకోవడానికి రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. కేవలం ఒక బటన్ నొక్కితే చాలు.. ఏటీఎం (ATM) నుండి నగదు తీసుకోవడమే కాకుండా, యూపీఐ (UPI) ద్వారా కూడా పేమెంట్స్ చేసే వెసులుబాటు రాబోతోంది.
ఎప్పటి నుండి అందుబాటులోకి వస్తుంది?
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈ కొత్త డిజిటల్ వ్యవస్థను ఏప్రిల్ 2026 నాటికి ప్రారంభించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన EPFO 3.0 వెర్షన్ ట్రయల్స్ ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా సాఫ్ట్వేర్ను పూర్తిస్థాయిలో అప్గ్రేడ్ చేసే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు.
కొత్త వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
ఈ కొత్త విధానం అమలులోకి వస్తే, పీఎఫ్ నగదు విత్డ్రా ప్రక్రియ పూర్తిగా మారిపోతుంది. బ్యాంక్ కార్డు మాదిరిగానే మీ పీఎఫ్ ఖాతాకు అనుసంధానించబడిన డెబిట్ కార్డును ప్రభుత్వం జారీ చేయవచ్చు. దీని ద్వారా నేరుగా ఏటీఎంల నుండి డబ్బు తీసుకోవచ్చు.
ఫోన్ పే, గూగుల్ పే మాదిరిగానే పీఎఫ్ బ్యాలెన్స్ను కూడా యూపీఐ ద్వారా ఇతరులకు బదిలీ చేయవచ్చు లేదా షాపింగ్ పేమెంట్స్ కోసం వాడవచ్చు. అత్యవసర సమయాల్లో ఒక నిర్ణీత పరిమితి వరకు నగదు తీసుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
విత్డ్రా పరిమితులు ఎంత?
ప్రస్తుతానికి సభ్యులు తమ పీఎఫ్ బ్యాలెన్స్లో 75% వరకు తీసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఏటీఎం, యూపీఐ ద్వారా రోజువారీగా లేదా నెలవారీగా ఎంత విత్డ్రా చేసుకోవచ్చనే దానిపై ప్రభుత్వం ఇంకా అధికారిక స్పష్టత ఇవ్వలేదు. ఇది దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఒక నిర్ణీత పరిమితిని (Limit) విధించనున్నట్లు తెలుస్తోంది.
ఎందుకు ఈ మార్పు?
ప్రస్తుతం పీఎఫ్ డబ్బు తీసుకోవాలంటే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత కనీసం 3 నుండి 15 రోజుల సమయం పడుతోంది. అత్యవసర వైద్య చికిత్సలు లేదా ఇతర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగులకు తక్షణమే డబ్బు అందాలనే లక్ష్యంతో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఈ సదుపాయాన్ని తీసుకువస్తోంది.
డిజిటల్ ఇండియాలో భాగంగా రాబోతున్న ఈ మార్పుతో లక్షలాది మంది ఈపీఎఫ్ సభ్యుల కష్టాలు తీరనున్నాయి. అయితే, పీఎఫ్ డబ్బును విచ్చలవిడిగా వాడటం వల్ల భవిష్యత్తులో వచ్చే వడ్డీ ప్రయోజనం తగ్గుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
BSNL 1 Rupee Plan: టెలికాం రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ (BSNL) సంచలనం సృష్టిస్తోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు కేవలం రూ.1 కే నెల రోజుల పాటు అపరిమిత సేవలను అందించే "ఫ్రీడమ్ ప్లాన్"ను ప్రకటించింది. ప్రైవేట్ టెలికాం సంస్థలు రీఛార్జ్ ధరలను పెంచుతున్న తరుణంలో, సామాన్యులకు ఇది పెద్ద ఊరటనిచ్చే వార్త. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఆఫర్ వివరాలు ఏమిటి?
ఈ ప్రత్యేక ఆఫర్ కింద రూ.1 చెల్లిస్తే మీకు కొత్త సిమ్ కార్డ్ లభించడమే కాకుండా, 30 రోజుల పాటు ఈ క్రింది ప్రయోజనాలు అందుతాయి. దేశవ్యాప్తంగా ఏ నెట్వర్క్కైనా నెల మొత్తం ఉచితంగా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 2GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ప్రతిరోజూ 100 SMSలు ఉచితంగా పంపుకోవచ్చు. ఈ ప్లాన్ మొత్తం 30 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.
ఎవరికి ఈ ఆఫర్ వర్తిస్తుంది?
ఈ ఆఫర్ అందరికీ అందుబాటులో ఉండదు, కేవలం కొందరికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. కొత్తగా BSNL సిమ్ తీసుకోవాలనుకునే వారు ఈ ఆఫర్కు అర్హులు. అలాగే ఇతర నెట్వర్క్ల (Jio, Airtel, VI) నుండి తమ నంబర్ను BSNLకి మార్చుకునే (Port) వారికి కూడా ఇది మంచి అవకాశం. గమనిక: ఇప్పటికే BSNL వాడుతున్న పాత కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తించదు.
ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది?
BSNL తన అధికారిక 'X' (గతంలో Twitter) ఖాతాలో వెల్లడించిన ప్రకారం.. ఈ సంక్రాంతి ఆఫర్ జనవరి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు తమ సమీపంలోని BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా గుర్తింపు పొందిన BSNL రిటైలర్ను సంప్రదించి, అవసరమైన గుర్తింపు పత్రాలు (Aadhaar Card) సమర్పించి కేవలం రూ.1కే ఈ సేవలను పొందవచ్చు.
ప్రైవేట్ సంస్థలకు గట్టి పోటీ
జియో, ఎయిర్టెల్ వంటి సంస్థలు తమ ప్లాన్ల ధరలను భారీగా పెంచడంతో, చాలా మంది వినియోగదారులు తక్కువ ధరలో మెరుగైన సేవల కోసం BSNL వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం BSNL దేశవ్యాప్తంగా తన 4G/5G నెట్వర్క్ను వేగంగా విస్తరిస్తుండటం కూడా కస్టమర్ల సంఖ్య పెరగడానికి ఒక కారణం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bengaluru Techie Sharmila Case: బెంగళూరులోని రామమూర్తి నగర్లో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ షర్మిల (35) కేసులో పోలీసులు షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఇది ప్రమాదకర అగ్నిప్రమాదం కాదని.. పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా నిర్ధారించారు. ఈ కేసులో కేరళకు చెందిన 18 ఏళ్ల పీయూసీ (PUC) విద్యార్థి కల్నల్ కురైని పోలీసులు అరెస్ట్ చేశారు.
అసలేం జరిగింది?
మంగళూరుకు చెందిన షర్మిల.. రామమూర్తి నగర్లోని ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్లో తన స్నేహితురాలు షబరీన్తో కలిసి నివసిస్తోంది. షబరీన్ పని నిమిత్తం ఢిల్లీకి వెళ్లడంతో గత 15 రోజులుగా షర్మిల ఫ్లాట్లో ఒంటరిగా ఉంది. దీనిని ఆసరాగా చేసుకున్న పొరుగింటి విద్యార్థి కల్నల్ కురై జనవరి 3వ తేదీ రాత్రి బాల్కనీ గుండా ఆమె ఫ్లాట్లోకి అక్రమంగా ప్రవేశించాడు.
ఒన్సైడ్ లవ్..దాడి..హత్య
నిందితుడు కురైకి షర్మిల అంటే ఒన్సైడ్ లవ్ ఉందని, ఆ రాత్రి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు. షర్మిల దీనిని తీవ్రంగా వ్యతిరేకించి ప్రతిఘటించడంతో, ఆగ్రహానికి గురైన నిందితుడు ఆమెపై భౌతిక దాడి చేసి హతమార్చాడు.
సాక్ష్యాల ధ్వంసం కోసం అగ్నిప్రమాదం సృష్టి
హత్య చేసిన తర్వాత ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు నిందితుడు కిరాతక ప్లాన్ వేశాడు. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నాయని నమ్మించడానికి.. స్నేహితురాలు షబరీన్ ఉన్న బెడ్రూమ్కు నిప్పు పెట్టాడు. దీంతో ఇల్లంతా దట్టమైన పొగ కమ్ముకుంది. కానీ, షర్మిల మృతదేహం వంటగదిలో లభించింది. ఆమె శరీరంపై ఎలాంటి కాలిన గాయాలు లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.
పోలీసుల దర్యాప్తులో తేలిన నిజాలు
మొదట అగ్నిప్రమాదంగా భావించినప్పటికీ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించినప్పుడు పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేవలం ఒక బెడ్రూమ్ మాత్రమే తగలబడటం, హాల్, కిచెన్ సురక్షితంగా ఉండటం. మద్యం బాటిల్ ఉన్నప్పటికీ పార్టీ జరిగిన ఆనవాళ్లు లేకపోవడం. పోస్ట్మార్టం రిపోర్ట్, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు.
నిందితుడు కల్నల్ కురైని అదుపులోకి తీసుకున్న రామమూర్తి నగర్ పోలీసులు, కోర్టు అనుమతితో అతడిని మూడు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటన స్థానిక అపార్ట్మెంట్ వాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook