icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
507001
Kotha YakeshKotha YakeshFollow23 Jul 2024, 01:07 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

T Fiber: ప్రైవేటు నెట్ కు బంద్... అన్నీ ప్రభుత్వ కార్యాలయాలకు 'టీ-ఫైబర్' ఇంటర్నెట్

PPINEWZ1h ago
Hyderabad, Telangana:

T Fiber: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించే ఇంటర్నెట్ విషయమై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రైవేటు ఇంటర్నెట్ వినియోగం ఇక చేయరాదని.. ప్రభుత్వానికి సంబంధించిన నెట్ వర్క్ టీ ఫైబర్ అన్నీ కార్యాలయాల్లో వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన చేశారు. ‘సెప్టెంబర్ ఒకటి తర్వాత ప్రైవేట్ ఆపరేటర్లకు  బిల్లులు చెల్లించొద్దు. ఇంటింటికి ఇంటర్నెట్ అందించే ప్రక్రియను మరింత వేగవంతం చేయండి‘ అని మంత్రి ఆదేశించారు. 

హైదరాబాద్ లోని డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ‘టీ – ఫైబర్’పై అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. 'టీ - ఫైబర్' సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. ‘రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ ఒకటి నుంచి కేవలం ‘టీ-ఫైబర్’ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలి‘ అని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆ గడువు దాటిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సేవల నిమిత్తం ప్రైవేట్ ఆపరేటర్లకు బిల్లులు చెల్లించొద్దని మంత్రి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... టీ-ఫైబర్ నెట్‌వర్క్ వినియోగం ద్వారా ఏటా ప్రభుత్వానికి సుమారు రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇంట్రానెట్ బేసిస్‌లో సెక్యూర్డ్ ఇంటర్నెట్ యాక్సెస్ కల్పించడంతో రాష్ట్ర డేటా సెంటర్‌కు అనుసంధానం ఏర్పడి పూర్తి స్థాయి డేటా సెక్యూరిటీ చేకూరుతుందని వెల్లడించారు. ఆరు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 4,487 ప్రభుత్వ కార్యాలయాలకు ‘టీ – ఫైబర్’ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ప్రభుత్వ ఖజానాకు ఇప్పటికే సుమారు రూ.13 కోట్లు ఆదా అయ్యిందని.. ప్రభుత్వ కార్యాలయాలకు ఈ సేవలను విస్తరించేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

ఈ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో తలెత్తే లోపాలను ఎప్పటికప్పుడు సరిచేస్తూనే.. రాబోయే రోజుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ వైడ్ ఏరియా నెట్‌వర్క్(టీ – స్వాన్)ను నెల రోజుల్లోపు పూర్తిస్థాయిలో టీ-ఫైబర్‌కు బదిలీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’కి పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ‘టీ-ఫైబర్’కు సూచించారు. ఇంటింటికి ఇంటర్నెట్ అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని, దీనికోసం ప్రిన్సిపుల్ మానిటైజేషన్ పార్టనర్‌ను ఎంపిక చేసేందుకు టెండర్లు పిలవాలని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

0
0
Report

BRS Party: బీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ బూస్ట్‌.. గులాబీ తీర్ధం పుచ్చుకున్న బీజేపీ సర్పంచ్‌లు

Huzurabad, Telangana:

BRS Party Joinings: తెలంగాణ రాజకీయాలు సమూలంగా మారుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ రోజురోజుకు బలం పెంచుకుంటోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవంతో.. రేవంత్‌ రెడ్డి అడ్డగోలు పరిపాలనతో బీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతానికి కారణంగా నిలుస్తోంది. తాజాగా బీజేపీ నుంచి భారీగా వలసలు జరిగాయి. ముఖ్యంగా ఎంపీ ఈటల రాజేందర్‌ సొంత నియోజకవర్గంలో కాషాయ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు బీఆర్‌ఎస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ నందినగర్ నివాసంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో సిరిసేడు సర్పంచ్ కుమార్ -శ్యామల, వంతడువుల సర్పంచ్ రాజేష్ -మాధవి, టేకుర్తి సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

బీఆర్ఎస్‌ పార్టీలో చేరిన సందర్భంగా సర్పంచ్‌లు మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి, సంక్షేమం ప్రజల మనసుల్లో ఇప్పటికీ చెక్కుచెదరలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బీజేపీ కూడా ప్రజా సమస్యలను పట్టించుకోకుండా రాజకీయాలకే పరిమితమైందని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్, బీజేపీ పాలనలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని.. గ్రామస్థాయిలో ఆ రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారని బీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ సర్పంచ్‌లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత మంది నాయకులు, ప్రజాప్రతినిధులు బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. కేసీఆర్ మళ్లీ తెలంగాణకు నాయకత్వం వహించాలని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా సర్పంచ్‌లు వెల్లడించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల పక్షాన నిలుస్తున్నారని ప్రకటించారు. ఆయన నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. కార్యక్రమం లో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, నాయకులు వెంకటేష్ పాల్గొన్నారు.

0
0
Report

T Fiber: ప్రైవేటు నెట్ కు బంద్... అన్నీ ప్రభుత్వ కార్యాలయాలకు 'టీ-ఫైబర్' ఇంటర్నెట్

PPINEWZ1h ago
Hyderabad, Telangana:

T Fiber: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించే ఇంటర్నెట్ విషయమై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రైవేటు ఇంటర్నెట్ వినియోగం ఇక చేయరాదని.. ప్రభుత్వానికి సంబంధించిన నెట్ వర్క్ టీ ఫైబర్ అన్నీ కార్యాలయాల్లో వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన చేశారు. ‘సెప్టెంబర్ ఒకటి తర్వాత ప్రైవేట్ ఆపరేటర్లకు  బిల్లులు చెల్లించొద్దు. ఇంటింటికి ఇంటర్నెట్ అందించే ప్రక్రియను మరింత వేగవంతం చేయండి‘ అని మంత్రి ఆదేశించారు. 

హైదరాబాద్ లోని డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ‘టీ – ఫైబర్’పై అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. 'టీ - ఫైబర్' సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. ‘రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ ఒకటి నుంచి కేవలం ‘టీ-ఫైబర్’ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలి‘ అని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆ గడువు దాటిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సేవల నిమిత్తం ప్రైవేట్ ఆపరేటర్లకు బిల్లులు చెల్లించొద్దని మంత్రి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... టీ-ఫైబర్ నెట్‌వర్క్ వినియోగం ద్వారా ఏటా ప్రభుత్వానికి సుమారు రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇంట్రానెట్ బేసిస్‌లో సెక్యూర్డ్ ఇంటర్నెట్ యాక్సెస్ కల్పించడంతో రాష్ట్ర డేటా సెంటర్‌కు అనుసంధానం ఏర్పడి పూర్తి స్థాయి డేటా సెక్యూరిటీ చేకూరుతుందని వెల్లడించారు. ఆరు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 4,487 ప్రభుత్వ కార్యాలయాలకు ‘టీ – ఫైబర్’ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ప్రభుత్వ ఖజానాకు ఇప్పటికే సుమారు రూ.13 కోట్లు ఆదా అయ్యిందని.. ప్రభుత్వ కార్యాలయాలకు ఈ సేవలను విస్తరించేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

ఈ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో తలెత్తే లోపాలను ఎప్పటికప్పుడు సరిచేస్తూనే.. రాబోయే రోజుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ వైడ్ ఏరియా నెట్‌వర్క్(టీ – స్వాన్)ను నెల రోజుల్లోపు పూర్తిస్థాయిలో టీ-ఫైబర్‌కు బదిలీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’కి పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ‘టీ-ఫైబర్’కు సూచించారు. ఇంటింటికి ఇంటర్నెట్ అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని, దీనికోసం ప్రిన్సిపుల్ మానిటైజేషన్ పార్టనర్‌ను ఎంపిక చేసేందుకు టెండర్లు పిలవాలని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

0
0
Report
Advertisement

T Fiber: ప్రైవేటు నెట్ కు బంద్... అన్నీ ప్రభుత్వ కార్యాలయాలకు 'టీ-ఫైబర్' ఇంటర్నెట్

PPINEWZ1h ago
Hyderabad, Telangana:

T Fiber: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించే ఇంటర్నెట్ విషయమై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రైవేటు ఇంటర్నెట్ వినియోగం ఇక చేయరాదని.. ప్రభుత్వానికి సంబంధించిన నెట్ వర్క్ టీ ఫైబర్ అన్నీ కార్యాలయాల్లో వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన చేశారు. ‘సెప్టెంబర్ ఒకటి తర్వాత ప్రైవేట్ ఆపరేటర్లకు  బిల్లులు చెల్లించొద్దు. ఇంటింటికి ఇంటర్నెట్ అందించే ప్రక్రియను మరింత వేగవంతం చేయండి‘ అని మంత్రి ఆదేశించారు. 

హైదరాబాద్ లోని డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ‘టీ – ఫైబర్’పై అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. 'టీ - ఫైబర్' సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. ‘రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ ఒకటి నుంచి కేవలం ‘టీ-ఫైబర్’ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలి‘ అని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆ గడువు దాటిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సేవల నిమిత్తం ప్రైవేట్ ఆపరేటర్లకు బిల్లులు చెల్లించొద్దని మంత్రి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... టీ-ఫైబర్ నెట్‌వర్క్ వినియోగం ద్వారా ఏటా ప్రభుత్వానికి సుమారు రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇంట్రానెట్ బేసిస్‌లో సెక్యూర్డ్ ఇంటర్నెట్ యాక్సెస్ కల్పించడంతో రాష్ట్ర డేటా సెంటర్‌కు అనుసంధానం ఏర్పడి పూర్తి స్థాయి డేటా సెక్యూరిటీ చేకూరుతుందని వెల్లడించారు. ఆరు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 4,487 ప్రభుత్వ కార్యాలయాలకు ‘టీ – ఫైబర్’ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ప్రభుత్వ ఖజానాకు ఇప్పటికే సుమారు రూ.13 కోట్లు ఆదా అయ్యిందని.. ప్రభుత్వ కార్యాలయాలకు ఈ సేవలను విస్తరించేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

ఈ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో తలెత్తే లోపాలను ఎప్పటికప్పుడు సరిచేస్తూనే.. రాబోయే రోజుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ వైడ్ ఏరియా నెట్‌వర్క్(టీ – స్వాన్)ను నెల రోజుల్లోపు పూర్తిస్థాయిలో టీ-ఫైబర్‌కు బదిలీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’కి పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ‘టీ-ఫైబర్’కు సూచించారు. ఇంటింటికి ఇంటర్నెట్ అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని, దీనికోసం ప్రిన్సిపుల్ మానిటైజేషన్ పార్టనర్‌ను ఎంపిక చేసేందుకు టెండర్లు పిలవాలని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

0
0
Report

ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ ..కారణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!!

BBhoomi7h ago
Secunderabad, Telangana:

Piles Cases in  Employees: గంటల తరబడి కూర్చోవడం, జంక్ ఫుడ్ తినడం, ఒత్తిడి, టార్గెట్లు ఇవన్నీ కూడా  ఉద్యోగుల జీవితంలో భాగమైపోయాయి. ప్రముఖ ఫిట్‌నెస్ కోచ్ విశ్వ భరత్, హెమరాయిడ్స్ రావడానికి ఇవే కారణాలని వివరించారు. ఈ రోజుల్లో బరువు పెరగడం, డయాబెటిస్ కంటే ఉద్యోగులలో హెమరాయిడ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆయన అన్నారు.  18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు వారిలో హెమరాయిడ్స్ వేగంగా పెరుగుతున్నాయి. అయినప్పటికీ, వారు ఈ సమస్య గురించి మాట్లాడలేక, సిగ్గుతో దాన్ని దాచిపెడుతున్నారు. అయితే, ఈ సమస్యను గుర్తించి చికిత్స చేయకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని  అంటున్నారు. హెమరాయిడ్స్ అంటే ఏమిటి? దాని కారణాలు,  తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

పైల్స్:
పైల్స్ అంటే మూత్ర నాళం లోపల లేదా వెలుపల ఉన్న సిరలలో వచ్చే వాపులు. ఇవి నొప్పి, దురద,  రక్తస్రావానికి కారణమవుతాయి. ఈ సమస్య వస్తే, కూర్చోవడం, పడుకోవడం, చివరికి మూత్ర విసర్జన చేయడం కూడా కష్టంగా మారుతుంది.

 ఉద్యోగులలో ఈ సమస్య ఎందుకు ఎక్కువగా వస్తుంది?

డెస్క్ వర్కర్లు, ఐటీ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల్లో ఈ సమస్యకు అనేక కారణాలు ఉన్నాయి. ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల కటి ప్రాంతంలో రక్త ప్రసరణ తగ్గుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్‌లో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం వస్తుంది. పని ఒత్తిడి అనేది జీర్ణక్రియపై ప్రభావం చూపుతాయి. అంతేకాకుండా, ఫోన్ వాడకం వల్ల 10 నిమిషాల కంటే ఎక్కువ సేపు టాయిలెట్‌లో కూర్చోవడం వల్ల హెమరాయిడ్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

హెమరాయిడ్స్ లక్షణాలు ఏమిటి?
మూత్రంలో రక్తస్రావం, దురద, నొప్పి.. వాపు అనేవి హెమరాయిడ్స్ ప్రధాన లక్షణాలు. కొన్నిసార్లు, ఇవి వాటంతట అవే తగ్గిపోతాయి. అయితే, లక్షణాలు తీవ్రంగా ఉంటే, వైద్య సహాయం అవసరం. చికిత్స తర్వాత కూడా, అవి 4 నుండి 5 వారాల పాటు గణనీయమైన అసౌకర్యాన్ని కలిగిస్తాయి. మీరు వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే, శస్త్రచికిత్స చేయించుకోవలసి రావచ్చు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మొలలను నివారించడంలో పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందువల్ల, పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పప్పులను క్రమం తప్పకుండా తినండి. పుష్కలంగా నీరు త్రాగండి. అలాగే, ప్రతి గంటకు లేచి కొద్దిసేపు నడవండి. మెత్తటి దిండును ఉపయోగించడం ఉత్తమం. టాయిలెట్‌లో ఉన్నప్పుడు ఫోన్ వాడటం మానుకోండి. క్రమం తప్పని వ్యాయామం.. పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారం కూడా మలబద్ధకాన్ని తగ్గించి, మొలలను నివారించడంలో సహాయపడతాయి.

ఇంటి వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
డాక్టర్ ప్రిస్కప్షన్ లేకుండా  దొరికే క్రీములు, ఆయింట్‌మెంట్లు తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తాయి. అయితే, లక్షణాలు తగ్గకపోతే, మీరు వైద్యుడిని సంప్రదించాలి. చికిత్సను ఆలస్యం చేయడం వల్ల పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. అందువల్ల, మీకు ఈ సమస్య లేదా దాని లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. మీరు ఇబ్బందిపడి వాటిని చెప్పకపోతే, పరిస్థితి మరింత తీవ్రం కావచ్చు.

Also Read: ఉద్యోగులకు డాక్టర్ల సూచన.. ఆఫీస్ టైమ్‌లో తినాల్సిన 7 హెల్తీ స్నాక్స్..ఇవే..!!

Also Read: ఆ బడుల్లో ఒకే టీచర్.. దేశంలో ఇలాంటి పాఠశాలలు ల

Also Read: స్విగ్గీ, జొమాటోకు పోటీగా ఫ్లిప్‌కార్ట్.. ఆగస్టు 15 నుంచి ఫుడ్ డెలివరీ..!!

Also Read: వారందరికీ పింఛన్లు రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

0
0
Report

Kodali Nani: ఆటలు ఆడలేని వారికి పేకాట పేరుతో డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చేశారు: కొడాలి నాని

Gudivada, Andhra Pradesh:

AP DSC Recruitment: 'రాష్ట్ర నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది. డీఎస్సీలో స్పోర్ట్స్ 3 శాతం కోటాలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. అర్హత, సర్టిఫికెట్లు లేకపోయినా... పరీక్ష రాయని వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చారు. లోకేష్ నాయకత్వంలో జరిగిన డీఎస్సీలో అక్రమాలకు అడ్డూ అదుపు లేదు. ఆటలు ఆడడం రాని వారికి పేకాట పేరుతో ఉద్యోగాలు ఇచ్చేశారు' అని కొడాలి నాని తీవ్ర ఆరోపణలు చేశారు. 2029లో వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారని ప్రకటించారు.

గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ సమావేశం నిర్వహించగా మాజీ మంత్రి కొడాలి నాని కీలక ప్రసంగం చేశారు. 'ఉద్యోగం వచ్చిన తర్వాత బీఎడ్‌ పూర్తి చేసేలా అవకాశం కల్పించే పరిస్థితి కూడా ఉంది. ఎమ్మెల్యేని ముందు నియమించి 5 ఏళ్ల తర్వాత ఎన్నికలకు వెళ్లినట్లు డీఎస్సీ చేశారు. పంజాబ్‌లో టీచర్ పోస్టులు విక్రయించిన కేసులో ముఖ్యమంత్రి అరెస్టు అయ్యి, జైలు శిక్ష పడింది. అక్కడి కంటే ఏపీలో అక్రమాలు పెద్ద స్థాయిలో జరిగి దొరికిపోయారు' అని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. డీఎస్సీ అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపడుతున్నామని తెలిపారు.

'అబద్ధాలు, మోసాలతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. జరిగిన అక్రమాన్ని బయటపెడితే మీడియా కానీ మీడియాతో జగన్‌ను తిట్టిస్తున్నారు. బీహార్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడి 60 వేల మెజార్టీ సీటులో బీజేపీ 20 తేడాతో ఊడిపోయింది. ప్రజల తీర్పు స్పష్టం రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి వస్తుంది' అని మాజీ మంత్రి కొడాలి నాని జోష్యం చెప్పారు. నీట్ పేపర్ లీకేజ్‌లో 21 మంది విద్యార్థులు చనిపోయారని.. వారికి న్యాయం చేయమని కాక్రోచ్ పేరుతో ఉద్యమిస్తే ఉగ్రవాదులు, పక్క దేశం వారు ఉద్యమం చేస్తున్నారంటూ తిట్టించారని గుర్తుచేశారు. చివరకు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి ప్రభుత్వం తలవంచిందని.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ అదే వస్తుందని ప్రకటించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. అక్రమాలపై పోరాటం కొనసాగుతుంది' అని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు కొడాలి నాని స్పష్టం చేశారు.

ఆగస్టులో రైతులకు సాగునీరు దిక్కులేకపోయి ఉంటే సీఎం చంద్రబాబు మాత్రం ఎప్పుడో రావాల్సిన ఎండకాలంపై ఇప్పుడు సమీక్ష చేయడాన్ని కొడాలి నాని తప్పుబట్టారు. ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అధికార పార్టీ వేధింపులు, కుట్రలన్నింటిని ఎదుర్కొందామని.. వాటికి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. 2029లో వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారని.. ఇప్పుడు ఎవరెవరు ఏమీ చేస్తున్నారో అప్పుడు పదింతలు అనుభవిస్తారని హెచ్చరించారు. జగన్‌ మోహన్‌ రెడ్డిని ఎవరూ ఏమీ చేయలేరని.. కుక్క మూతి ముఖాలు ఏం చేయలేరని ప్రకటించారు. జగన్‌కు వారికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని వివరించారు.

0
0
Report
Advertisement

Retired Employees: పెండింగ్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం మాజీ ఉద్యోగుల భారీ ఆందోళన

Hyderabad, Telangana:

RTC Employees Protest: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వంలోని ఉద్యోగుల సమస్యలే పరిష్కారం కాకపోవడంతో రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పట్టింపులేదు. తమ రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రాకపోవడం.. పెండింగ్‌ బకాయిలు చెల్లించపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇన్నాళ్లు విశేష సేవలు అందించిన తర్వాత కూడా తమకు ప్రభుత్వం చెల్లింపులు చేయకపోవడంతో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌ భవన్‌ వద్ద మాజీ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేశారు. పెండింగ్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇతర డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో బస్ భవన్‌కు చేరుకొని తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ మేనేజ్‌మెంట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.

ఈ సందర్భంగా పలువురు రిటైర్డ్  ఆర్టీసీ ఉద్యోగులు మాట్లాడుతూ.. రిటైర్మెంట్ కార్మికులకు రావాల్సిన 2017, 2021 సంవత్సరాల బకాయిలు త్వరగా చెల్లించాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్‌లో రిటైర్డ్ ఉద్యోగులకు 2 నెలలకు సరిపడా మందులు అందించాలని కోరారు. మరణించిన ఉద్యోగి భార్యాభర్తలకు సూపర్ లగ్జరీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. వితంతు ఉద్యోగులకు పీఎఫ్‌, గ్రాట్యుటీ, పెన్షన్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు.

0
0
Report

ఏపీ, తెలంగాణ కస్టమర్లకు జియో గుడ్ న్యూస్.. రూ.400 నుంచే కొత్త వైఫై, టీవీ, OTT ప్లాన్లు

Hyderabad, Telangana:

Jio Launches New 3 in 1 Home Pack: ప్రైవేటు దిగ్గజ కంపెనీ అయిన జియో ఇప్పటికే బడ్జెట్ ఫ్రెండ్లీలో అనేక రీఛార్జ్‌ ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. అయితే, కేవలం మొబైల్‌ రీఛార్జ్‌ సేవలకు మాత్రమే పరిమితం కాకుండా, బ్రాడ్‌బ్యాండ్ రంగంలో కూడా దూసుకుపోతోంది. రిలయన్స్ జియో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ కొత్త జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఇందులో హై స్పీడ్ వైఫైతో పాటు వెయ్యికి పైగా లైవ్ టీవీ ఛానల్స్, ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లను ఒకే ప్యాకేజీలో కేవలం రూ.400 ప్రారంభ ధరతో అందిస్తోంది.

జియో హోమ్ ప్యాక్ కింద మూడు రకాల సెలెక్టెడ్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. మొదటిది 'టీవీ ఓన్లీ ప్యాకేజీ', దీని ద్వారా 1000 పైగా లైవ్ ఛానల్స్‌ను పొందవచ్చు. రెండవది 'వైఫై ఓన్లీ ప్యాకేజీ', ఇందులో 30 Mbps లేదా 100 Mbps హై స్పీడ్ ఇంటర్నెట్ డేటాతో పాటు రెండు యాప్స్ 12 నెలల పాటు ఉచితంగా లభిస్తాయి. ఇక మూడవ ప్యాకేజీలో టీవీ, హై స్పీడ్ ఇంటర్నెట్ డేటాతో పాటు 12 ఓటీటీ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాకేజీలలో మీకు నచ్చిన దానిని ఎంచుకోవచ్చు. కస్టమర్లు బ్రాడ్‌బ్యాండ్, టెలివిజన్, స్ట్రీమింగ్ వినోదాన్ని ఒకే కనెక్షన్‌లో పొందవచ్చు. కేవలం టీవీ మాత్రమే చూసేవారికి, అలాగే హై స్పీడ్ లైవ్ టీవీతో పాటు ఓటిటి ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి ఇది ఒక బంపర్ గిఫ్ట్ లాంటిది.

జియో హోమ్ ఓటీటీ విషయానికి వస్తే, ఏపీ, తెలంగాణలో ఎక్కువగా వీక్షించే ఆహా, జియో సినిమా, హాట్‌స్టార్, జీ5, సోనీ లివ్ వంటి 12 ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లను ఆస్వాదించవచ్చు. వీటితో పాటు యూట్యూబ్ సదుపాయం, జియో సర్వీస్ ఇంజనీర్ల ద్వారా ఉచిత ఇన్‌స్టాలేషన్, మెయింటెనెన్స్,  లైవ్ టీవీని ప్లే, పాజ్ లేదా రివైండ్ చేసే ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
సాధారణంగా భారీ వర్షాల వల్ల డిటీహెచ్ (DTH) సేవలు నిలిచిపోతుంటాయి, కానీ ఈ వైఫై ద్వారా మీరు లైవ్ టీవీని నిరంతరాయంగా చూడవచ్చు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సీరియల్స్, లైవ్ స్పోర్ట్స్, న్యూస్ ప్రోగ్రామ్స్‌ను మిస్ కాకుండా వీక్షించవచ్చు.

టీవీ ఓన్లీ ప్యాక్ నెలకు రూ.400 లభిస్తుంది. ఇందులో 200కు పైగా హెచ్‌డీ ఛానల్స్‌తో కలిపి వెయ్యికి పైగా లైవ్ టీవీ ఛానల్స్ ఉంటాయి. అలాగే 12 ఓటీటీ యాప్స్, లైవ్ టీవీ కోసం ప్లే, పాజ్, రివైండ్ ఫీచర్లు, యూట్యూబ్ సదుపాయం కూడా ఉన్నాయి. దీని ధరలు రెండు నెలలకు రూ.1000 లేదా ఐదు నెలలకు రూ.2000 ఉన్నాయి. వెల్కమ్ ఆఫర్ కింద 12 ఓటీటీ యాప్స్‌ను ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. ఇప్పటికే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఉన్నవారు కూడా దీనిని పొందవచ్చు.

 

 

వైఫై టీవీ ప్లస్ ఓటీటీ ప్యాకేజీ నెలకు రూ.555 అందుబాటులో ఉంది. ఇందులో 30 Mbps అన్‌లిమిటెడ్ వైఫై, వెయ్యికి పైగా లైవ్ టీవీ ఛానల్స్,12 ఓటిటి యాప్స్ లభిస్తాయి. ఒకవేళ మీరు మూడు నెలలకు ఒకేసారి రీఛార్జ్ చేసుకుంటే ఒక నెల ఉచితంగా పొందే అవకాశం ఉంది. అదే 100 Mbps స్పీడ్ కావాలనుకునే వారికి రూ.707 ప్యాక్ అందుబాటులో ఉంది. ఇందులో 100 Mbps హై స్పీడ్ ఇంటర్నెట్, వెయ్యి లైవ్ టీవీ ఛానల్స్, 12 ఓటిటి యాప్స్ ఉంటాయి. ఇందులో కూడా రూ.2122 రీఛార్జ్ చేసుకుంటే ఒక నెల ఉచితంగా లభిస్తుంది. హెచ్‌డీ స్ట్రీమింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఇది చాలా అనువైనది.

ఒకవేళ మీరు వైఫై ఓన్లీ ప్యాక్ కోరుకుంటే, అది నెలకు రూ.450 కే లభిస్తుంది. ఇందులో 30 Mbps అన్‌లిమిటెడ్ హై స్పీడ్ వైఫై ఉంటుంది. దీనికి రెండు నెలలకు రూ.1100 లేదా ఐదు నెలలకు రూ. 2200 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే కేబుల్ లేదా డిటీహెచ్ వాడుతున్న వారికి ఇది కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక 100 Mbps వైఫై నెలకు రూ.600 లభిస్తుంది. దీనికి సంబంధించి రెండు నెలలకు రూ.1500 లేదా ఐదు నెలలకు రూ.3000 ధర నిర్ణయించారు.

Also Read: ఎయిర్‌టెల్ యూజర్లకు అదిరిపోయే వార్త.. రూ.1,849 కే సంవత్సరం అంతా ఉచిత కాలింగ్!

Also Read:  ఆధార్ వినియోగదారులకు బిగ్‌ అలెర్ట్‌.. ప్లాస్టిక్ PVC కార్డ్ ధర భారీగా పెంపు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
0
Report

NIMS Hospital: నిమ్స్‌లో 100 రోబోటిక్ సర్జరీలు.. వైద్య బృందానికి తెలంగాణ సీఎం ప్రశంసలు

Hyderabad, Telangana:

Robotic Surgeries In NIMs: పేదల ఆస్పత్రిగా పేరుగాంచిన నిమ్స్ ఆస్పత్రి అరుదైన ఘనత సాధించింది. నిమ్స్‌లో రెండున్నరేళ్లలో వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తయ్యాయి. అత్యంత ఖరీదైన ఈ సర్జరీలు పూర్తి చేసుకోవడంతో వైద్య సిబ్బందిపై ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ వెయ్యి శస్త్రచికిత్సలు పూర్తి చేసిన వైద్య సిబ్బందికి తెలంగాణ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. వైద్య నిపుణులు, వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత సాధించినందుకు నిమ్స్​ డైరెక్టర్​ రాహుల్​ దేవరాజ్​తో పాటు వైద్య బృందం,  నర్సింగ్ సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ బృందానికి అభినందనలు తెలిపారు. 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనేతమ ప్రభుత్వ సంకల్పం నెరవేరిందని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు. నిమ్స్​ లో ఇప్పటివరకు నిర్వహించిన రొబోటిక్ సర్జరీల్లో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా నిర్వహించడం ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయమని సీఎం పేర్కొన్నారు.  ఇటీవలే రెండు వేల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను పూర్తి చేసిన నిమ్స్, ఇప్పుడు వెయ్యి రొబోటిక్ సర్జరీల మైలురాయిని చేరుకోవటం ద్వారా కొత్త రికార్డు నెలకొల్పిందని తెలిపారు. వైద్య రంగంలో నిమ్స్ మరిన్ని మైలురాళ్లు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

నిమ్స్ ఆస్పత్రి అరుదైన ఘనతపై సంబంధిత శాఖ మంత్రి దామోదర రాజానర్సింహా స్పందించారు. ‘ప్రభుత్వ వైద్యరంగంలో నిమ్స్ మరో ఘనత సాధించింది. నిమ్స్‌లో 1,000 రొబోటిక్ సర్జరీలు పూర్తయ్యాయి. రెండున్నరేళ్లలోనే వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సల మైలురాయి‘ అని చెప్పిన మంత్రి దామోదర్ రాజనర్సింహ నిమ్స్ వైద్య బృందాన్ని అభినందించారు. ‘90% రొబోటిక్ సర్జరీలు ఆరోగ్యశ్రీ, CMRF ద్వారా ఉచితం. యూరాలజీలో అత్యధికంగా 590 రొబోటిక్ సర్జరీలు. గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో 248 శస్త్రచికిత్సలు. సర్జికల్ ఆంకాలజీలో 162 రొబోటిక్ సర్జరీలు‘ అని మంత్రి వెల్లడించారు. దక్షిణ భారత ప్రభుత్వ రంగంలో తొలి రొబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేసింది నిమ్స్ ఆస్పత్రి అని ప్రకటించారు. నిమ్స్ తర్వాత ఎంఎన్‌జేలోనూ విజయవంతంగా రొబోటిక్ సర్జరీలు జరిగాయని వివరించారు. ‘గాంధీ, కొత్త ఉస్మానియా, కొత్త టిమ్స్ ఆస్పత్రుల్లో రొబోటిక్ ఓటీలు. ప్రపంచ స్థాయి వైద్య సేవలను ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందించడమే లక్ష్యం‘ అని మంత్రి రాజనర్సింహ ప్రకటించారు. అత్యాధునిక వైద్య సేవల విస్తరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

0
0
Report
Advertisement

తాగునీటి ఎద్దడి సమస్యపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశం

Amaravathi, Andhra Pradesh:

Drinking Water Problem: తాగునీటి సమస్యపై అధికార యంత్రాంగానికి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎల్‌నినో పరిస్థితుల కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి సమస్యపై దృష్టిపెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులను, రిజర్వాయర్లలో, నీటి వనరుల్లో నీటి లభ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. 

అమరావతిలోని సచివాలయంలో ఉన్న ఆర్టీజీఎస్ సెంటర్‌లో సోమవారం వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎగువన వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు వివరించారు. కృష్ణానదిలో కొద్ది రోజులుగా ప్రవాహాలు మొదలవడంతో ఆ నీటి వినియోగంపై ఆదేశాలు ఇచ్చారు. గోదావరిలో వరద పరిస్థితిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. 

కృష్ణా బేసిన్‌లో ఎగువ నుంచి వచ్చే వరదను సద్వినియోగం చేసుకునేలా నీటి నిర్వహణ చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వర్షాభావంతో రానున్న రోజుల్లో పశుగ్రాసం కొరత వచ్చే అవకాశం ఉందని.. దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. మున్సిపాల్టీలు, గ్రామీణ ప్రాంతాల్లో తరుచూ తాగునీటి పరీక్షలు చేయాలని.. ల్యాబ్ టెస్టుల నివేదికలను విడుదల చేయాలని సూచించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

రవాణా శాఖలో పూర్తి స్థాయి టెక్నాలజీ వినియోగం, అనవసర నిబంధనల తొలగింపు వంటి అంశాలకు తీసుకుంటున్న చర్యలను సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. 24 గంటల్లో డీమ్డ్ రిజిస్ట్రేషన్ విధానం, ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్స్, ఫారం-5B వంటి పరీక్షలను తొలగించడం వంటి చర్యల ద్వారా అవినీతిని తగ్గించడం, సులభతర సేవలను అందించే అవకాశం కలుగుతుందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. దశలవారీగా రవాణా శాఖలో ఈ సంస్కరణలు చేపట్టేలా తాము ప్రణాళికను సిద్దం చేశామని తెలిపారు. వీలైనంత మేరకు అనవసర నిబంధనలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.

0
0
Report

Bigg Boss 10: తెలుగు బిగ్‌బాస్‌లోకి స్టార్ హీరో లవర్‌ బాయ్..టీఆర్పీ రేటింగ్ రికార్డు బ్రేక్ చేయడం ఖాయం!

Hyderabad, Telangana:

Bigg Boss 10 Telugu Actor Abbas: తెలుగు బుల్లితెరపై అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంచింగ్‌కు రంగం సిద్ధమవుతోంది. ఇది ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో షో నిర్వహకులు భారీ మార్పులు, సరికొత్త నిబంధనలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్ల ఎంపికపై సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వైరల్ అవుతున్నాయి.

వినిపిస్తున్న సెలబ్రిటీల పేర్లు..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో పల్లవి గౌడ, ఎక్స్‌ప్రెస్ హరి, తేజస్విని గౌడ, జబర్దస్త్ నూకరాజు, ఆట సందీప్ సతీమణి జ్యోతి, రాకింగ్ రాకేష్, ఇన్‌ఫ్లుయెన్సర్ నందు, శివ్, రాయల్ ఎంసీ రమణ, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, పవిత్ర, వర్ష, వర్షిణీ తదితరుల పేర్లు కంటెస్టెంట్ల జాబితాలో వినిపిస్తున్నాయి. అయితే వీటన్నింటికంటే ముఖ్యంగా ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరో పేరు తెరపైకి రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

బిగ్‌బాస్‌లోకి 'ప్రేమ దేశం' హీరో అబ్బాస్?
ఒకప్పుడు 'ప్రేమ దేశం' సినిమాతో యూత్ ఫేవరెట్ హీరోగా ఓ వెలుగు వెలిగిన హ్యాండ్సమ్ హీరో అబ్బాస్ ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగు, తమిళ భాషల్లో సుమారు 50కి పైగా చిత్రాల్లో నటించిన అబ్బాస్, సినిమాలకు దూరమై విదేశాల్లో స్థిరపడ్డారు. ఇటీవల సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆయన, కొన్ని ప్రాజెక్ట్‌లతో మళ్లీ కెరీర్‌పై దృష్టి పెట్టారు.

ఈ నేపథ్యంలో అబ్బాస్ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఆయన్ని బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకువచ్చేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ నిజంగానే అబ్బాస్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇస్తే మాత్రం షో రేంజ్ మారిపోవడంతో పాటు టీఆర్పీ రికార్డులు బద్దలవడం ఖాయమని టెలివిజన్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది తెలియాలంటే బిగ్‌బాస్ గ్రాండ్ లాంచ్ వరకు వేచి చూడాల్సిందే!

Also Read: భర్తపై కేసు పెట్టిన ఉదయ్ కిరణ్ హీరోయిన్..అత్తమామలు చావకొడుతున్నారని పోలీసు ఫిర్యాదు

Also Read: "ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఇష్టమొచ్చింది పోస్ట్ చేస్తా" మూవీ ఈవెంట్‌లో అనుపమ షాకింగ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Aditi Sharma Harassment: భర్తపై కేసు పెట్టిన ఉదయ్ కిరణ్ హీరోయిన్..అత్తమామలు చావకొడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు!

Mumbai, Maharashtra:

Aditi Sharma Husband Harassment: దివంగత నటుడు ఉదయ్ కిరణ్ సరసన 'గుండె ఝల్లుమంది' సినిమాలో హీరోయిన్‌గా నటించిన అదితి శర్మ గుర్తుందా? చాలా ఏళ్ల తర్వాత ఈ నటి మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి ఏ సినిమా ప్రమోషనో అయితే కాదు. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలతో పాటు బుల్లితెర సీరయల్స్‌లో నటిగా మంచి గుర్తింపు పొందిన అదితి శర్మ తాజాగా తన భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులపై గృహహింస ఫిర్యాదు చేసి ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ముంబై పోలీసులు ప్రస్తుతం ఈ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు.

ఏం జరిగింది?
నటి అదితి శర్మ తన భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులపై గృహహింస కేసును నమోదు చేయించింది. ఆమె ఫిర్యాదు చేసిన వివరాల ప్రకారం.. జూలై 31న గోరేగావ్ పోలీస్ స్టేషన్‌లో ఆమె భర్త అభినిత్ విద్యానంద్ కౌశిక్, అత్త ఊర్మిళా కౌశిక్ (65), ఆడపడుచు కీర్తి కౌశిక్ (29)లపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదైంది. పోలీసులు ఈ ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించారు. శారీరక, మానసిక వేధింపులు, గృహహింస, దాడి, దూషించడం, తన శీలతను ప్రశ్నించడం, తన 'స్త్రీధనం' (వివాహ సమయంలో లభించిన ఆభరణాలు) దుర్వినియోగం చేయడం వంటి ఆరోపణలను అదితి వారిపై చేశారు.

అదితి జూన్ 2021లో ఒక ఆన్‌లైన్ యాక్టింగ్ క్లాస్ సమయంలో అభినిత్‌ను మొదటిసారి కలిశారు. స్నేహితులుగా మారిన తర్వాత, వారు ప్రేమలో పడ్డారు. 2025 జనవరి 1న జరిగిన ఒక సంఘటనను కూడా ఈ ఫిర్యాదులో ప్రస్తావించారు. కాఫీ విషయంలో జరిగిన వాదన దూషణలకు దారితీసిందని అందులో పేర్కొన్నారు. అదితి శర్మ ఫిర్యాదు మేరకు.. గోరేగావ్ పోలీసులు ఆమె భర్త, అత్త, ఆడపడుచుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మోడలింగ్‌లో ప్రయత్నాలు చేసిన తర్వాత ఆమె తన మూవీ కెరీర్‌ను ప్రారంభించింది. అదితి తన పాఠశాల విద్యను ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలో ఉన్న హన్స్‌రాజ్ మోడల్ స్కూల్‌లో పూర్తి చేశారు. ఆమె మొదట 2017లో గురు రంధవాతో కలిసి 'తారే' అనే మ్యూజిక్ వీడియోలో కనిపించారు.

అదితి శర్మ ఎవరు?
నటి అదితి శర్మ 2006లోనే బుల్లితెరపై తన నటనా ప్రయాణాన్ని మొదలుపెట్టిన అదితి.. 2007లో సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తెలుగులో ఉదయ్ కిరణ్ హీరోగా తెరకెక్కిన 'గుండె ఝల్లుమంది' సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత నిఖిల్ సిద్ధార్థ్, నవ్‌దీప్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన 'ఓం శాంతి' సినిమాలోనూ ఓ హీరోయిన్‌గా అలరించింది. చివరిగా 2011లో విడుదలైన 'బబ్లూ' ఈమె నటించిన చివరి తెలుగు చిత్రం కావడం గమనార్హం. అయితే ఈమె కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, పంజాబీ చిత్రాల్లో నటించింది.

Also Read: బాలీవుడ్ హీరోయిన్ల బాడీ పార్ట్స్‌పై సీక్రెట్ టాటూలు..వాటిలో అర్థం అంత ఉందా?

Also Read: సీక్రెట్‌గా టాలీవుడ్ నటి నిశ్చితార్థం! 'గద్దలకొండ గణేష్' హీరోయిన్ కాబోయే భర్త ఇతనే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Sravana Masam Snakes: శ్రావణ మాసంలో పాములు ఎక్కువగా ఎందుకు కనిపిస్తాయి? అసలు కారణాలు ఇవే!

Hyderabad, Telangana:

Sravana Masam Snakes Rituals: హిందూ మాసాలలో శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ పవిత్ర మాసంలో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తారు. అయితే, శ్రావణ మాసం అనగానే అందరికీ శివారాధనతో పాటు మరో విషయం కూడా గుర్తుకు వస్తుంది. అదే.. ఈ కాలంలో పాములు ఎక్కువగా కనిపించడం! మనం చిన్నప్పటి నుంచి ఈ మాట వింటూనే ఉంటాము. అసలు శ్రావణ మాసంలోనే పాములు బయటకు రావడానికి గల శాస్త్రీయ, మతపరమైన కారణాలు ఏమిటో తెలుసుకుందాం.

శాస్త్రీయ కారణాలు..
శ్రావణ మాసంలో అనగా ఆగస్టులో (వర్షాకాలంలో) వానా కాలం తీవ్రస్థాయిలో ఉంటుంది. విపరీతమైన వర్షాల కారణంగా పాములు ఎక్కువగా కనిపించడం వెనుక కొన్ని బలమైన ప్రాకృతిక కారణాలు ఉన్నాయి.

1) శ్రావణ మాసంలో విస్తృతంగా కురిసే వర్షాల కారణంగా, పాములు నివసించే పుట్టలు, బొరియలలోకి నీరు చేరుతుంది. దీనివల్ల వాటికి శ్వాస తీసుకోవడం కష్టమై, సురక్షితమైన పొడి ప్రదేశాల కోసం అవి బయటకు వస్తాయి.

2) వర్షాకాలం కప్పలకు సంతానోత్పత్తి కాలం కావడంతో, కప్పలు విపరీతంగా తిరుగుతుంటాయి. పాములకు కప్పలు ప్రధాన ఆహారం కాబట్టి, వాటిని వెతుక్కుంటూ పాములు జనావాసాల వైపు వస్తుంటాయి.

3) శాస్త్రీయంగా జూలై, ఆగస్టు నెలలను పాముల సంతానోత్పత్తి కాలంగా పరిగణిస్తారు. జత కోసం, ఆహారం కోసం అవి ఒక చోటు నుంచి మరో చోటుకి ఎక్కువగా సంచరిస్తుంటాయి.

హిందూ మతపరమైన నమ్మకాలు..
శివుడితో అనుబంధం: శ్రావణ మాసం మహాశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. శివుని ఆభరణంగా భావించే సర్పాలను ఈ మాసంలో భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు.

నాగపంచమి వేడుకలు: ఈ మాసంలోనే ప్రఖ్యాత 'నాగపంచమి' పండుగను జరుపుకొంటారు. సర్పదేవుడిని పూజించి పాలు పోసే సంప్రదాయం మన దేశంలో ఉంది. ఈ ఆధ్యాత్మిక వాతావరణం కారణంగా కూడా ఈ మాసంలో పాముల గురించి చర్చ ఎక్కువగా జరుగుతుంది.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం శాస్త్రీయ కారణాలు, మన సంప్రదాయాల్లోని నమ్మకాల ఆధారంగా అందించబడింది. వర్షాకాలంలో పాములు బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, పరిసరాల పట్ల అప్రమత్తంగా ఉండటం మంచిది.

Also Read: శ్రావణ మాసం బరువు తగ్గడానికి ఒకే ఒక్కదారి! 10 రకాల శాకాహారంతో కొవ్వు కరిగిపోతుంది!

Also Read: నీచరాశిలోకి శుక్ర సంచారం..ఆగస్టు 1 నుంచి ఈ రాశులకు కష్టాలే కష్టాలు..పరిహారం ఇదే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

8000mAh భారీ బ్యాటరీతో రేపే Poco M8 Power 5G గ్రాండ్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

Hyderabad, Telangana:

Poco M8 Power 5G Price: చాలా మంది రోజు చార్జింగ్ అయిపోతుందని భయపడుతూ.. పవర్ బ్యాంక్‌లు పట్టుకుని తిరిగే స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఇది నిజంగానే అతిపెద్ద ఊరటనిచ్చే వార్తగా భావించవచ్చు.. మొబైల్ మార్కెట్ చరిత్రలోనే పోకో (Poco) ఒక అద్భుతం సృష్టించేందుకు రెడీ అయిన్నట్లు తెలుస్తోంది. రేపే (ఆగస్టు 4న) భారత మార్కెట్లో Poco M8 Power 5G స్మార్ట్‌ఫోన్ అధికారికంగా విడుదల చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా అతిపెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఫోన్ కేవలం ఒక డివైజ్ మాత్రమే కాదు.. ఛార్జింగ్ సమస్యలతో సతమతమయ్యే కోట్లాది మంది యూజర్ల ఆవేదనకు ప్రత్యక్ష సమాధానంగా మారబోతోందని నిపుణులు చెబుతున్నారు. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం.. ఇందులో ఎంతో శక్తివంతమైన 8,000mAh భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీని కలిగి ఉంటుందని తెలిపింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. ఏకంగా మూడు రోజుల పాటు ఛార్జింగ్‌తో సంబంధం లేకుండా గేమ్స్ ఆడుకోవచ్చు.. అంతేకాకుండా వీడియోలు చూడవచ్చని.. మీ పనులను నిరంతరాయంగా పూర్తి చేసుకోవచ్చని వెల్లడించింది.

ఈ ఫోన్ కేవలం బ్యాటరీలోనే కాదు.. విజ్యువల్స్ అనుభూతిలోనూ సరికొత్త డిస్ల్పేతో విడుదల కాబోతోంది. ఇందులో 6.9 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందించారని కంపెనీ తెలిపింది. దీనివల్ల బ్రైట్‌నెస్‌ ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే డిస్‌ప్లేలోనే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండటం దీని మరొక ప్రత్యేకతగా ఉంటుందని సమాచారం.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ఇక ప్రాసెస్‌ విషయానికి వస్తే.. ఇది శక్తివంతమైన Qualcomm Snapdragon 4 Gen 4 ప్రాసెసర్‌తో పాటు 8GB ర్యామ్‌తో పాటు virtual RAM సపోర్ట్‌ను కూడా అందించారు.. హెవీ గేమింగ్ ఆడే సమయంలో ఫోన్ వేడెక్కకుండా 10,416 చదరపు మిమీ గ్రాఫైట్ కూలింగ్ సిస్టమ్‌ను అందించిన్నట్లు తెలుస్తోంది.. ఫోటోగ్రఫీ ప్రేమికుల కోసం 50 మెగాపిక్సెల్ AI ప్రధాన కెమెరాను అందించారు. అంతేకాకుండా ఈ 8000mAh బ్యాటరీని వేగంగా ఛార్జింగ్‌ నింపేందుకు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు, ఇతర ఫోన్‌లకు ఛార్జింగ్ ఇచ్చేందుకు 22.5W రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) వేదికగా ఈ ఫోన్ విడుదల కాబోతోంది. మైక్రోసైట్ ఆధారంగా బడ్జెట్ ధరకు దగ్గరగా రూ.15,000 నుంచి రూ.20,000 పరిధిలో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

NIMS సరికొత్త చరిత్ర.. 3 ఏళ్లలో 1000 రోబోటిక్ సర్జరీలు!

Hyderabad, Telangana:

NIMS Creates History: తెలుగు రాష్ట్రాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందిస్తున్న నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) మరొక అరుదైన, చారిత్రాత్మక ఘనతను సాధించింది. అత్యంత సంక్లిష్టమైన, అత్యాధునికమైన రోబోటిక్ శస్త్రచికిత్సలలో నిమ్స్ రికార్డు కొట్టింది. అందుబాటులోకి వచ్చిన కేవలం మూడేళ్ల వ్యవధిలోనే ఏకంగా 1,000 రోబోటిక్ సర్జరీలను అత్యంత విజయవంతంగా పూర్తి చేసి, ప్రభుత్వ వైద్యరంగంలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించింది.

ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయల ఖర్చు అయ్యే.. ఈ రోబోటిక్ సర్జరీలను, నిమ్స్ నిరుపేదలకు సైతం సులభంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మొత్తం 1,000 ఆపరేషన్లలో 90 శాతానికి పైగా శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా బాధితులకు పూర్తిగా ఉచితంగా అందిస్తోంది.

ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకోవడంలో నిమ్స్‌లోని వివిధ వైద్య విభాగాలు కీలక పాత్ర పోషించాయి. యూరాలజీ విభాగం అత్యధికంగా 590 రోబోటిక్ శస్త్రచికిత్సలతో అగ్రస్థానంలో నిలిచింది. అలాగే సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ అత్యంత క్లిష్టమైన 248 ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించింది. ఇక సర్జికల్ ఆంకాలజీ క్యాన్సర్ చికిత్సల్లో భాగంగా 162 సర్జరీలను పూర్తి చేసిన్నట్లు అధికారులు తెలిపారు.

సాధారణ కోతలతో పనిలేకుండా.. తక్కువ రక్తస్రావంతో, రోగులు త్వరగా కోలుకునేలా ఈ రోబోటిక్ పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడింది. నిమ్స్ వైద్య బృందం ఈ సాంకేతికత ద్వారా పలు సంక్లిష్టమైన ప్రాణాంతక చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసింది. ముఖ్యంగా ప్రోస్టేట్, మూత్రాశయంతో పాటు కిడ్నీ మార్పిడి (Kidney Transplant) శస్త్రచికిత్సలు చేసిన్నట్లు వెల్లడించారు. అలాగే కాలేయం (Liver), ప్యాంక్రియాస్ (Pancreas) పేగులకు సంబంధించిన కష్టమైన శస్త్రచికిత్సలు కూడా అందించారని అధికారులు వెల్లడించారు.

Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!

ఈ అద్భుతమైన ఘనతపై నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి స్థాయిలో 1,000 రోబోటిక్ సర్జరీలు పూర్తి చేయడం సాధారణ విషయం కాదని.. ఇది తమ ఆసుపత్రి వైద్యుల పనితీరుకు నిదర్శనమని కొనియాడారు. ఈ సందర్భంగా శస్త్రచికిత్సలు నిర్వహించిన స్పెషలిస్ట్ వైద్యులు, నిరంతరం శ్రమించిన నర్సింగ్ సిబ్బంది, అనస్థీషియా నిపుణులు, ఆపరేషన్ థియేటర్ (OT) సాంకేతిక బృందానికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులోనూ పేద రోగులకు మరిన్ని అత్యాధునిక సాంకేతిక సేవలు అందిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top