ఖమ్మంలో ఫ్రూట్ మార్కెట్ ను ఏర్పాటు చేయాలి
Khammam, Telangana:పండ్ల మార్కెట్ ఏర్పాటు చేయాలని పండ్ల వ్యాపారుల సంఘం ప్రతినిధులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. ఖమ్మంలో బొప్పాయి, జామ, దానిమ్మ తదితర పంటలు మార్కెట్ అవుతున్నాయని మంత్రికి తెలిపారు. రైతులు పండించిన పంటలను విక్రయించేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని, మార్కెట్ ఏర్పాటుతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్తో మంత్రి మాట్లాడారు. మార్కెట్ వ్యవస్థ సమస్యను పరిశీలించాలని కలెక్టర్కు సూచించారు. అనంతరం తమ్ముడి కుమారుడు యుగేంద్రను కలిసి సమస్యను వివరించాడు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
కళ్లముందే మునిగిపోయారు.. బోటు ప్రమాదంపై షాకింగ్ నిజాలు!
Hyderabad, Telangana:Boat Tragedy Telugu News Latest: ఆనందంగా సాగుతున్న విహారయాత్రలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. సరదాగా గడుపుదామని వెళ్లిన పర్యాటకులను మృత్యువు బోటు రూపంలో కబళించింది.. వియత్నాంలో శనివారం జరిగిన ఒక ఘోర స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయ పర్యాటకులు మరణించారు. ప్రమాద సమయంలో బోటులో మొత్తం 36 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.. నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయిన ఈ దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ప్రత్యక్ష సాక్షులు చెబుతుంది ఇదే..
ఈ ఘోర ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కొందరు పర్యాటకులు ఆ భయానక క్షణాలను గుర్తుచేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం... "మేమంతా ఎంతో ఉత్సాహంగా ఆ స్పీడ్ బోట్ ఎక్కాం.. మొత్తం 36 మంది ప్రయాణికులం ఉన్నాం.. అదొక క్లోజ్డ్ బోట్.. బోట్ ప్రయాణం ప్రారంభమైన కేవలం మూడు నిమిషాలకే ఒక్కసారిగా ఒక భారీ అల బోటును బలంగా ఢీకొట్టింది. అంతే.. చూస్తుండగానే బోటు ఒక్కసారిగా తలకిందులైపోయింది." అని ఆయన వివరించారు.
ముందు కూర్చున్న వారు సేఫ్..
బోటు తిరగబడిన సమయంలో లోపల ఉన్న పర్యాటకులు ప్రాణాల కోసం ఎలా కొట్టుమిట్టాడారో సాక్షులు వివరించారు. బోటు ముందు భాగంలో కూర్చున్న సుమారు 20 మంది పర్యాటకులు, ప్రమాదం జరగగానే అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారని.. అక్కడే ఉన్న విండోస్ గుండా ఎలాగోలా బయటకు దూకేసి ప్రాణాలు దక్కించుకున్నారన్నారు.
బోటు వెనుక భాగంలో కూర్చున్న వారు మాత్రం బయటకు రాలేకపోయారని.. బోటు క్లోజ్డ్ మోడల్ కావడంతో.. క్షణాల వ్యవధిలో నీరు లోపలికి చేరిపోయిందని.. వెనుక వైపు ఉన్నవారికి బయటకు రావడానికి ఎలాంటి దారి లేకపోవడంతో వారు లోపలే చిక్కుకుపోయి.. ఊపిరాడక నీట మునిగి ప్రాణాలు కోల్పోయారన్నారు. అలా 15 మంది భారతీయులు జలసమాధి అయ్యారన్నారని వారు వివరించారు.
Also Read: వియత్నాంలో బోటు బోల్తా.. భారతీయ పర్యాటకులపై విషాదం, 15 మంది దుర్మరణం
రెస్క్యూ ఆపరేషన్..
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు, రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. నదిలో మునిగిపోయిన వారి మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన మరికొందరిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విహారయాత్రకు వెళ్లిన తమ వారు శవాలై ఇంటికి వస్తుండటంతో బాధితుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు, మృతుల గుర్తింపు ప్రక్రియను వియత్నాం అధికారులు వేగవంతం చేశారు. భారత రాయబార కార్యాలయం కూడా స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ.. బాధితులకు అవసరమైన సాయాన్ని అందిస్తోంది.
Also Read: వియత్నాంలో బోటు బోల్తా.. భారతీయ పర్యాటకులపై విషాదం, 15 మంది దుర్మరణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
సువర్ణ త్రికోణ రాజయోగం ఎఫెక్ట్.. రాబోయే 6 నెలలు ఈ 4 రాశుల వారికి తిరుగులేదు..
Hyderabad, Telangana:Suvarna Trikona Rajayogam 2026 Effect: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల స్థితులతో పాటు వాటి కదలికలు మానవ జీవితంలో హెచ్చుతగ్గులకు దారి తీస్తాయని మనందరికీ తెలుసు.. ఈ 2026 సంవత్సరంలో రాబోయే 6 నెలలు అత్యంత కీలకం కాబోతోంది.. ఎందుకంటే కర్మఫల దాతగా భావించే.. శని దేవుడు, దేవగురువు అయిన బృహస్పతి ఒక ప్రత్యేకమైన కోణంలోకి రాబోతోంది. దీని వల్ల అరుదైన సువర్ణ త్రికోణ రాజయోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ రెండు శక్తివంతమైన గ్రహాల శుభ దృష్టి ప్రభావం వల్ల రాబోయే 6 నెలలు 4 రాశుల వారికి గేమ్ ఛేంజర్గా మారబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరి అదృష్టం పూర్తిగా మారిపోతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు..
శని-గురు గ్రహాల అద్భుతమైన యోగం..
జ్యోతిష్య శాస్త్రంలో శని భగవానుడిని కర్మఫల ప్రదాతగా.. న్యాయ దేవుడిగా చెప్పుకుంటారు. మరోవైపు దేవగురువు బృహస్పతి అదృష్టం, ఐశ్వర్యం, జ్ఞానానికి కారకుడిగా భావిస్తారు. ఈ రెండు గ్రహాలు ఒక నిర్దిష్ట కోణంలో ఒకదానికొకటి త్రికోణ సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు.. గోల్డెన్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. అంతేకాకుండా దీనిని రాజయోగంగా కూడా భావిస్తారు. దీని కారణంగా ఏర్పడిన ప్రభావం కొన్ని రాశులవారికి ప్రత్యక్ష, సానుకూల ప్రభావం ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి, ఆత్మవిశ్వాసంపై స్పష్టంగా కనిపిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
ఈ అదృష్ట యోగం వల్ల ఈ కింది రాశులవారికి బంపర్ లాభాలు..
సింహ రాశి (Leo)
సింహ రాశి వారిపై దేవగురువు బృహస్పతి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో రాబోయే 6 నెలలు అద్భుతంగా ఉండబోతోంది.. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ సమయంలో భారీ లాభాలు కలుగుతాయి. నూతన ఆదాయ మార్గాలు కూడా సులభంగా లభిస్తాయి.
వృషభ రాశి (Taurus)
వృషభ రాశిలో జన్మించిన వారికి ఈ సమయం కెరీర్ పరంగా అద్భుతం జరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొత్త ఆదాయ వనరులు కూడా ఎంతో సులభంగా లభిస్తాయి.. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు ఎలాంటి అడ్డంకులు లేకుండా సులువుగా పూర్తవుతాయి.
కుంభ రాశి (Aquarius)
ఈ సువర్ణ త్రికోణ రాజయోగం వల్ల కుంభ రాaశివారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది.. వీరి జీవితంలో పురోగతి కూడా లభిస్తుంది. కెరీర్ లేదా వ్యాపారంలో పెద్ద విజయాలు కూడా పొందుతారు. అంతేకాకుండా రాబోయే 6 నెలల ఈ అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
వృశ్చిక రాశి (Scorpio)
శనిదేవుని ఆశీస్సులతో ఈ రాశివారికి తప్పకుండా ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది.. ఆఫీసులో మీకుంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కూడా లభిస్తుంది. గతంలో మీరు తీసుకోవడానికి భయపడిన కఠినమైన చర్యాలు ఈ సమయంలో ధైర్యంగా తీసుకుంటారు.. అవి మీకు లాభదాయకంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Vastu Tips: సంపాదన నిలవడం లేదా? ఇంట్లో ఈ కుబేర దిశను శుభ్రంగా చేయండి చాలు..
Hyderabad, Telangana:North Direction Vastu Tips: ప్రస్తుత చాలా మంది ఎంత కష్టపడి సంపాదించినా.. చేతిలో రూపాయి నిలవడం లేదని.. అప్పుల బాధలు వెంటాడుతున్నాయని ఆందోళన చెందుతుంటారు. రాత్రింబవళ్లు కష్టపడి సంపాదన డబ్బు సులభంగా ఖర్చయిపోతుంటే.. దానికి ఇంట్లోని వాస్తు దోషాలే ప్రధాన కారణమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల ప్రకారం.. మనం నివసించే ఇంట్లోని ప్రతి దిశకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఇది మన జీవితంతో పాటు ఆర్థిక స్థితిని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని దూరం చేసి.. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి.. అప్పుల ఊబి నుంచి శాశ్వతంగా బయటపడటానికి వాస్తు శాస్త్రంలో కొన్ని అద్భుతమైన, సులువైన చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ దిశ కుబేరుడి స్థానం..
వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇంట్లోని ఉత్తర దిశ అత్యంత పవిత్రమైనది పరిగణిస్తారు.. దీనిని సంపదకు అధిపతి అయిన కుబేరుడి స్థానంగా భావిస్తారు. ఒకవేళ మీ ఇంట్లో ఉత్తర దిశలో పాత విరిగిపోయిన ఫర్నిచర్తో పాటు చెత్తాచెదారం లేదా పనికిరాని వస్తువులు పేరుకుపోయి ఉంటే.. అది మీ ఆర్థిక పురోగతిని పూర్తిగా అడ్డుకుంటుందని నిపుణులు తెలుపుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఉత్తర దిశను ఎల్లప్పుడూ శుభ్రంగా, ప్రశాంతంగా, కాస్త ఖాళీగా ఉంచాల్సి ఉంటుంది. ఈ ప్రదేశంలో బరువైన వస్తువులు లేదా పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను ఉంచడం వల్ల కుటుంబంపై అప్పుల భారం విపరీతంగా పెరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి, వెంటనే మీ ఇంటి ఉత్తర భాగాన్ని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని తీసుకురావడమే కాకుండా.. కుబేర దేవుని ఆశీస్సులతో ఆదాయానికి కొత్త మార్గాలు లభింస్తాయి..
అప్పుల విముక్తికి గోడల రంగులు కూడా కీలకం..
కేవలం శుభ్రత మాత్రమే కాదు.. అప్పుల బాధల నుంచి ఉపశమనం పొందడానికి ఉత్తర దిశలోని గోడల రంగులపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వాస్తు శాస్త్రం సూచిస్తోంది.. ఈ పవిత్రమైన మూలలోని ఉన్న గోడలకు లేత నీలం (Light Blue) లేదా ఆకుపచ్చ (Green) రంగులు వేయడం చాలా శుభప్రదమని శాస్త్రం సూచిస్తోంది.. ఈ రంగులు మనసుకు ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా.. సంపదను ఆకర్షించడానికి ఎంతగానో సహాయపడుతుంది..
దీంతో పాటు, ఉత్తర దిశలో ఒక గాజు పాత్రలో (Glass Bowl) స్వచ్ఛమైన నీటిని ఉంచడం లేదా గోడకు అందమైన జలపాతం (Water Fall) లాంటి పెయింటింగ్ లేదా చిత్రాన్ని తగిలించడం వల్ల అద్భుతమైన సానుకూలమైన ఫలితాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇంట్లో చేసే ఈ చిన్న చిన్న మార్పులు మీ వాస్తు దోషాలన్నింటినీ తొలగిస్తాయి. దీనివల్ల మీ పొదుపు పెరగడమే కాకుండా.. పాత అప్పులన్నీ చాలా సులభంగా తిరిపోతాయని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
కలలో బంగారం, తెలుపు వస్తువులు, దేవుడు కనిపిస్తే నిజంగానే అదృష్టమా?
Hyderabad, Telangana:Dream Astrology News: నిద్రపోతున్నప్పుడు కలలు రావడం అనేది ఒక సహజమైన ప్రక్రియ.. అయితే, ప్రతి కలకు ఒక నిర్దిష్ట అర్థం లేదా భవిష్యత్తుకు సంబంధించిన సంకేతం ఉంటుందని అనుకోవడం పొరపాటేనని జ్యోతిష్య నిపుణులు తెలుపుతున్నారు. చాలా కలలు మన ఆలోచనలు, కోరికలు, మనస్తత్వాన్ని సూచిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.. అయినప్పటికీ, స్వప్న శాస్త్రం ప్రకారం.. కొన్ని ప్రత్యేకమైన కలలు మన భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ముందుగానే సూచిస్తాయి. ఆయా కలల వెనుక ఉన్న అర్థంతో పాటు స్వభావాన్ని బట్టి శుభ, అశుభ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం.. వివిధ వస్తువులు కలల్లో కనిపిస్తే.. కలిగే ఫలితాలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
తెల్లని వస్తువులు లేదా దుస్తులు కనిపిస్తే..
కలలో తెల్లటి పక్షి లేదా తెల్లని దుస్తులు, ముత్యాలు కనిపించినా లేదా మీ చుట్టూ తెల్లటి వస్తువులు ఉన్నట్లు అనిపించినా అది అత్యంత శుభప్రదంగా స్వప్న శాస్త్రం పరిగణిస్తుంది.. ఈ కలలు మీ జీవితంలో సానుకూల మార్పులు రాబోతున్నాయని సూచిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలు లేదా మానసిక ఆందోళనల నుంచి త్వరలోనే విముక్తి లభిస్తుందని దీని అర్థాన్ని సూచిస్తుంది.. అంతేకాకుండా పెద్ద వివాదాలు తొలగిపోయి జీవితంలో ప్రశాంతత, ఆనందం విపరీతంగా లభిస్తుంది.
కలలో దేవుళ్లు కనిపిస్తే..
ఒక వ్యక్తి రోజులో తప్పకుండా కొన్ని సార్లైన భగవంతుడి నామస్మరణ చేస్తూ.. పూజలు లేదా జపాలు చేస్తూ ఉంటారు. కాబట్టి రాత్రి వేళల్లో దేవుడికి సంబంధించిన కలలు రావడం సర్వసాధారణం.. ఉదాహరణకు, శ్రీకృష్ణుడు లేదా దుర్గాదేవిని క్రమం తప్పకుండా ఆరాధించే వారికి కలలో ఆ దేవుళ్ల దర్శనం కలిగే అవకాశాలు కూడా లభిస్తాయి.. ఇది మన Subconscious mind ప్రతిచర్య మాత్రమేనని.. ప్రతిసారీ దీనిని దైవం సంకేతంగా లేదా భవిష్యత్తు సూచికగా భావించలేమని నిపుణులు సూచిస్తున్నారు.
బంగారం, వెండి, ఆభరణాలు..
రోజువారీ ఆలోచనల్లో ఆభరణాలు లేకపోయినప్పటికీ.. అకస్మాత్తుగా కలలో బంగారం, వెండి, నగలు లేదా డబ్బు కనిపిస్తే.. మాత్రం కాస్త జాగ్రత్త వహించల్సి ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. స్వప్న శాస్త్రం ప్రకారం.. ఇటువంటి కలలు భవిష్యత్తులో వస్తే.. ఆరోగ్య సమస్యలను లేదా ఉద్యోగ, వ్యాపార రంగాలలో వచ్చే సవాళ్లను సూచిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో మీ ఆరోగ్యం పట్ల.. అలాగే పని చేసే చోట అదనపు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
కలలో రకరకాల వంటకాలు, స్వీట్లు లేదా ఇతర ఆహార పదార్థాలు కనిపిస్తే.. అది స్థాన చలనాన్ని సూచిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. అంటే, భవిష్యత్తులో ఉద్యోగం, వ్యాపారం లేదా ఇతర కారణాల వల్ల మీరు.. తప్పకుండా ఒక ప్రస్తుతం నుంచి మరో ప్రాంతానికి మారాల్సి వస్తుంది. సాధారణంగా ఇల్లు వదిలి దూర ప్రాంతాలకు వెళ్లి పనిచేసే అవకాశం వచ్చే ముందు ఇటువంటి కలలు ఎక్కువగా వస్తాయని నమ్ముతారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
నో ఎంట్రీ.. అమెరికా జోక్యం ముగిసేవరకు హార్ముజ్ బంద్.. ఇరాన్ సంచలన ప్రకటన!
Hyderabad, Telangana:Iran Closes Strait of Hormuz: ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం మరింత తీవ్రతరంగా మారుతోంది. తాము పేర్కొన్న మార్గాల్లో కాకుండా వేరే దారిలో వెళ్తున్న నౌకను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని ఇరాన్ ఇటీవలే స్పష్టతనిచ్చింది. అంతేకాకుండా, హార్ముజ్ జలసంధిని తాము పూర్తిగా మూసివేసినట్లు ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ఘటన వల్ల అమెరికా తమపై దాడులు చేసే క్రమంలో పరిణామాలు అత్యంత తీవ్రంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై కూడా దాడులు చేస్తామని ఇరాన్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో అమెరికా సైనిక జోక్యం పూర్తిగా అంతమయ్యే వరకు హార్మజ్ జలసంధి మూసివేత కొనసాగుతుందని ఇరాన్ స్పష్టం చేసింది.
దాడులు పెంచిన అమెరికా..
మరోవైపు, ఇరాన్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో అమెరికా పర్యవసానంగా భీకర దాడులను ప్రారంభించింది. నౌకలపై దాడులు చేయడం మరియు జలసంధి మూసివేత నిర్ణయం నేపథ్యంలో ఇరాన్ పై అమెరికా సైనిక చర్యలు చేపట్టింది. ఈ వారంలోనే ఇది మూడవ దాడి అని యుఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఖేష్మ్ ఐలాండ్, బందర్ అబ్బాస్, సిర్కిక్ వంటి ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయని ఇరాన్ లోని స్థానిక వార్తా సంస్థలు కూడా సమాచారాన్ని అందించాయి. ఈ ఉద్రిక్తతల వల్ల ఇరాన్ గల్ఫ్ దేశాలపై కూడా దాడులు చేసే అవకాశం ఉందని కనిపిస్తోంది, ఇరు దేశాల మధ్య పరస్పర విమర్శలు తీవ్రమవుతున్నాయి.
ఇరాన్కు 24 గంటల గడువు..
ఈ ఉద్రిక్తతల మధ్య, నిన్న ఇరాన్కు అమెరికా 24 గంటల గడువు విధించిందని అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. నౌకలపై కాల్పులు ఆపేయాలని, తాము చేసిన తప్పులను బహిరంగంగా అంగీకరించాలని అమెరికా ఇరాన్కు అల్టిమేటం జారీ చేసింది. హార్ముజ్ జలసంధిని తక్షణమే తెరిచి ఉంచాలని, అక్కడ నౌకల రాకపోకలపై ఎటువంటి ఫీజులు వసూలు చేయబోమని ఇరాన్ ప్రకటించాలని అమెరికా కోరుతోంది. ఒకవేళ ఇరాన్ ఈ షరతులకు నిరాకరిస్తే, పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని హెచ్చరించింది.
హార్ముజ్ జలసంధిలో తాము సూచించిన మార్గాల ద్వారానే నౌకలు వెళ్లాలనడానికి ఇరాన్కు ఎలాంటి అధికారిక అనుమతి లేదని యుఎస్ సెంట్రల్ కమాండ్ తేల్చి చెప్పింది. హార్ముజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలో లేదని, మే నెల ప్రారంభం నుండి ఈ మార్గం ద్వారా దాదాపు 800కు పైగా వాణిజ్య నౌకలు, 380 రవాణా నౌకలు ప్రయాణించాయని, ఈ రవాణా ప్రక్రియలో అమెరికా దళాలు కూడా సహాయపడ్డాయని పేర్కొంది.
భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్..
యూఎస్, ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధం కారణంగా భారత్ కూడా ఇబ్బందుల్లో పడింది. హార్ముజ్ జలసంధిలోని ఒమన్ కారిడార్ మార్గం ద్వారా మన దేశానికి రావలసి ఉన్న క్రూడ్ ఆయిల్ నౌకను ఇరాన్ వెనక్కి పంపేసింది. అమెరికా సూచించిన మార్గాల ద్వారా కాకుండా, తాము నిర్దేశించిన మార్గాల్లోనే ప్రయాణించాలని ఇరాన్ హెచ్చరించింది. హార్ముజ్ ప్రాంతంపై ఆధిపత్యం కోసం అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ పోరు భారత్కు పెద్ద తలనొప్పిగా మారింది.
Also Read: అమెరికా క్షిపణి దాడులతో వణికిపోయిన ఇరాన్.. చాబహార్లో కరెంట్ కట్, బ్రిడ్జ్ క్లోజ్!
Also Read: అలీ ఖమేనీ పార్థివ దేహాన్ని ఇరాక్ ఎందుకు తీసుకెళ్తున్నారు? అంత్యక్రియలకు భారత్ నుంచి వెళ్లేది ఎవరంటే?
హార్ముజ్ జలసంధి మూతపడితే..
హార్ముజ్ జలసంధి పూర్తిగా మూతపడితే అంతర్జాతీయంగా ముప్పు ఏర్పడుతుంది. ఒకవేళ జలసంధి మూసివేత కొనసాగితే, అది భారతదేశంతో పాటు ఇతర సహ ఇతర దేశాలకు కూడా తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి మూతపడితే, క్రూడ్ ఆయిల్, ఎల్పీజీ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. గత ఐదు నెలల ఇబ్బందుల నుండి నెమ్మదిగా కోలుకుంటున్న భారత్కు ఇది పెద్ద దెబ్బ అవుతుంది. దీనివల్ల దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడమే కాకుండా, గృహ అవసరాలకు వాడే ఎల్పీజీ ధరలు కూడా ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది. ఇటీవలె రెండు నౌకలపై దాడులు జరిగిన నేపథ్యంలో, సీజ్ ఫైర్ గురించి ట్రంప్ మాట్లాడారు.. మాట్లాడటం సమయం వృథా చేయడమే అని ఆయన విమర్శించారు. ఆయన వ్యాఖ్యల వెంటనే అమెరికా ఇరాన్పై దాడులకు దిగింది. ఇరాన్ నాయకులు మోసగాళ్లు, అబద్ధాలకోరులని ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Vietnam Boat Accident: వియత్నాంలో ఘోర ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి..ఇద్దరు తెలుగోళ్లు!
Hyderabad, Telangana:Singer Janaki: భారతీయ సినీ పరిశ్రమలో విషాదం..లెజండరీ సింగర్ జానకమ్మ కన్నుమూత!
Hyderabad, Telangana:Singer Janaki Passed Away: భారతీయ సుప్రసిద్ధ గాయని ఎస్.జానకీ కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆమె మైసూరులో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జానకి మనవరాలు ఇన్ స్టా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో సంగీత ప్రపంచం అంతా ఒక్కసారిగా మూగబోయినట్లైంది. సింగర్ ఎస్ జానకీ అభిమానులు, సహచరులు తీవ్రదిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.S.Janaki Last Video: గాయని ఎస్.జానకి చివరి వీడియో..జానకమ్మ పాదాల చెంత సింగర్ సునీత..ఇరువురి మధుర స్మృతులు!
Hyderabad, Telangana:Singer S.Janaki Last Video: ఏడు దశాబ్దాల పాటు తన అమృత గాత్రంతో కోట్లాది మంది శ్రోతలను మైమరపించిన ప్రఖ్యాత గాయని, గానకోకిల ఎస్.జానకి (జానకమ్మ) భౌతికంగా మనకు దూరమయ్యారు. అయితే, ఆమె జీవిత చరమాంకంలోనూ సంగీతాన్ని ఎంతగానో ప్రేమించారనడానికి నిదర్శనంగా నిలిచిన ఒక అపురూపమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది.
జానకమ్మ పాదాల చెంత సునీత..
ఇటీవల చెన్నైలోని జానకమ్మ నివాసానికి ప్రముఖ గాయని సునీత వెళ్లారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ జానకమ్మ తనను చూడటానికి వచ్చిన సునీతను ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఆ సమయంలో సునీత.. జానకమ్మ పాదాల చెంత కూర్చొని ఎంతో మధురంగా పాటలు పాడారు.
సింగర్ సునీత పాడుతున్నంత సేపూ జానకమ్మ ముఖంలో ఒక తెలియని తృప్తి, ఆనందం కనిపించాయి. అనారోగ్యాన్ని సైతం మర్చిపోయి చిరునవ్వుతో చప్పట్లు కొడుతూ, సునీతను ఎంతో ఉత్సాహంగా అభినందించారు.
కన్నీరు పెట్టిస్తున్న దృశ్యాలు
సంగీత ప్రపంచంలోని ఇద్దరు అద్భుతమైన గాయనుల మధ్య జరిగిన ఈ భావోద్వేగ భరితమైన సంభాషణ, ఆత్మీయ కలయికకు సంబంధించిన విజువల్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. "చివరి క్షణం వరకు ఆమె పాటలతోనే బతికారు.. పాటలతోనే ప్రయాణం ముగించారు" అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ముగిసిన అమృత గాత్ర ప్రస్థానం
ఈ మధురమైన సంఘటన జరిగిన కొన్ని రోజులకే జానకమ్మ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. తమ గుండెల్లో నిలిచిపోయే వేలాది పాటలను అందించిన జానకమ్మ ఇకలేరనే వార్తను అభిమానులు, సంగీత కళాకారులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా.. సునీత పాడిన పాటను వింటూ ఆమె చప్పట్లు కొట్టిన ఆ 'చివరి వీడియో' మాత్రం అందరినీ కదిలిస్తోంది. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో జానకమ్మ వదిలివెళ్లిన శూన్యం ఎప్పటికీ పూడ్చలేనిది. ఆమె పాడిన పాటలు ఉన్నంత కాలం జానకమ్మ ప్రతి ఒక్కరి హృదయాలలో జీవించే ఉంటారు.
Also Read: రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ? ఫ్యాన్స్తో భారీ ప్లానింగ్..ముహూర్తం కూడా ఫిక
Also Read: 'మళ్లీ రావా' చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా? ఆ క్యూట్ పిల్ల కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్గా.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
YS Jagan On Amaravati: "అమరావతి పేరిట రైతులపై ప్రభుత్వ రాక్షసకాండ" కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం!
Vijayawada, Andhra Pradesh:YS Jagan On Amaravati Farmers: అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారు. ఇలాంటి బలవంతపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు జగన్ ఓ ప్రకటనలో తెలిపారు. తమ కుటుంబాలకు జీవనాధారమైన భూములను ఇచ్చేది లేదని రైతులు మొత్తుకుంటున్నా.. వారి అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసు బలగాలతో పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమని వైసీపీ ఆ ప్రకటనలో ఆరోపించారు.
పోలీసుల మోహరింపు!
సాగులో ఉన్న పంటల్లోకి బుల్డోజర్లతో దూసుకెళ్లి, రైతులను పొలాల నుంచి బలవంతంగా ఈడ్చిపారేస్తూ భయభ్రాంతులకు గురిచేయడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట అంటూ వైఎస్ జగన్ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.
బాధితులంతా సన్న, చిన్నకారు రైతులేనని.. ఆ కొద్దిపాటి భూమినే నమ్ముకుని, పంటలు పండిస్తూ కుటుంబాలను పోషించుకునే పేద రైతుల గొంతు నొక్కడం దారుణమని ప్రతిపక్ష నేత జగన్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. "రైతులు పెట్టిన పెట్టుబడి ఏమవ్వాలి? ధ్వంసమైన పంటలకు ఎవరు సమాధానం చెబుతారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారు?" అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రశ్నించారు.
తెరవెనుక ఎవరి ప్రయోజనాలు?
రాజధాని పేరిట గతంలోనే వేల ఎకరాలు సేకరించిన ప్రభుత్వం, మొదట భూములిచ్చిన రైతులకే ఇప్పటివరకు న్యాయం చేయలేకపోయిందని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటిది ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం రైతులను వేధించడం వెనుక ఉన్న మర్మమేంటని ఆ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు.
రైతుల అంగీకారం లేకుండా భూములపై ప్లాన్లు గీయడం.. అలాగే వివరాలు చెప్పకుండానే కాగితాల మీద 'అవార్డులు' ప్రకటించుకున్నామని ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం ముమ్మాటికీ అన్యాయమని అన్నారు.
విజయవాడకు కూతవేటు దూరంలో, జాతీయ రహదారికి సమీపంలో ఉండి.. మార్కెట్లో కోట్ల రూపాయల విలువ పలికే భూములకు ప్రభుత్వమే అరకొర ధరలు నిర్ణయించి లాక్కోవడం వెనుక అసలు లబ్ధిదారులు ఎవరు? రైతుల భూములను భవిష్యత్తులో చంద్రబాబు ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అని వైసీపీ అధినేత ఘాటుగా ప్రశ్నించారు.
వైఎస్సార్సీపీ ప్రధాన డిమాండ్లు..
రైతులను రోడ్డున పడేసే ఇలాంటి చర్యలను ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేస్తూ ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచింది.
> ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో జరుగుతున్న బలవంతపు భూసేకరణను తక్షణమే నిలిపివేయాలి.
> ధ్వంసం చేసిన పంటలకు రైతులకు తక్షణమే పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించాలి.
> రైతులు స్వచ్ఛందంగా ఇస్తేనే భూములు తీసుకోవాలి తప్ప, వారి సమ్మతి లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా లాక్కోకూడదు.
Also Read: వైసీపీ నేత కొడాలి నానికి బిగ్ షాక్! ప్రశ్న రావణ్కు మద్దతు..చిక్కుల్లో మాజీ మంత్రి!
Also Read: రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ? ఫ్యాన్స్తో భారీ ప్లానింగ్..ముహూర్తం కూడా ఫిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jr NTR Political Entry: రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ? ఫ్యాన్స్తో భారీ ప్లానింగ్..ముహూర్తం కూడా ఫిక్స్!
Hyderabad, Telangana:Jr NTR Political Entry News: టాలీవుడ్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తదుపరి అడుగులు ఎటువైపు పడబోతున్నాయి? ప్రస్తుతం సినీ, పొలిటికల్ సర్కిల్స్లో తారక్పై సరికొత్త చర్చ జోరందుకుంది. పొరుగు రాష్ట్రం తమిళనాడులో దళపతి విజయ్ పక్కా ప్లానింగ్తో రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ సాధించిన తీరును చూసిన తర్వాత.. ఇప్పుడు ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే జూలై 18న తారక్ ఒక కీలక ప్రకటన చేయనున్నారంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్చల్ చేస్తోంది.
జూలై 18న ఏం జరగబోతోంది?
ప్రస్తుతం వినిపిస్తున్న ప్రచారం ప్రకారం.. ఈ నెల 18న జూనియర్ ఎన్టీఆర్ తన అభిమాన సంఘాలను ఒకే తాటిపైకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమానులందరినీ సమన్వయం చేసుకుంటూ, భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు ప్రారంభించేందుకు తారక్ ఒక పక్కా కార్యాచరణను ప్రకటించనున్నట్లు టాక్.
ముందుగా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత దగ్గరై, ఆ తర్వాతే రాజకీయ అరంగేట్రం చేసేలా ఈ ప్లాన్ ఉందనేది పొలిటికల్ అనలిస్టుల అంచనా. అయితే, ఈ ప్రచారంపై ఇప్పటివరకు ఎన్టీఆర్ టీమ్ లేదా ఆయన క్యాంప్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
గత అనుభవాలు.. ప్రస్తుత మౌనం!
2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (మహాకూటమి) తరపున జూనియర్ ఎన్టీఆర్ సుడిగాలి పర్యటనలు చేశారు. తన వాగ్ధాటితో యువతను విపరీతంగా ఆకట్టుకున్నారు. అయితే, ఆ ప్రచార సమయంలోనే జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడిన తర్వాత.. తారక్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత టీడీపీ కార్యక్రమాల్లోనూ ఆయన ఎక్కడా కనిపించలేదు.
కొంతకాలం క్రితం హైదరాబాద్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ అయినప్పుడు కూడా దేశవ్యాప్తంగా రాజకీయ చర్చ నడిచింది. కానీ, తారక్ మాత్రం తాను పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యానని, పాన్ ఇండియా ప్రాజెక్టులపైనే తన ఫోకస్ అంతా ఉందని పదే పదే స్పష్టం చేస్తూ వచ్చారు.
18వ తేదీన సస్పెన్స్కు తెరపడుతుందా?
ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరం అని చెబుతున్నా.. మరోవైపు అభిమాన సంఘాల యాక్టివిటీస్ గురించిన వార్తలు రావడం ఆసక్తి రేపుతోంది. మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముంది? జూలై 18న తారక్ నిజంగానే ఏదైనా బిగ్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే!
Also Read: 'అయ్యగారే నంబర్ వన్' అఖిల్ ఫ్యాన్స్ ఊహించని సర్ప్రైజ్..ఏ హీరో ఇలా చేయడేమో!
ALso Read: 'మళ్లీ రావా' చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా? ఆ క్యూట్ పిల్ల కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్గా.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mojtaba Khamenei Revenge: "నా తండ్రి మరణానికి ప్రతికారం తీర్చుకుంటా"..ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ శపథం!
Haftador, Yazd Province:Mojtaba Khamenei Revenge News: ఇజ్రాయెల్ - అమెరికా, ఇరాన్ల మధ్య గత ఆరు నెలలుగా యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయెతుల్లా అలీ ఖమేనీ టార్గెట్ చేస్తూ చేసిన వైమానిక దాడిలో ఆయన మరణించారు. ఇదే దాడిలో ఆయన కుటుంబసభ్యులు కూడా మరణించారు. అయితే తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ శపథం చేశారు. ఇరాన్ ప్రజలు కూడా ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హతమార్చేందుకు ఇరాన్ సన్నద్ధమవుతుందని ఇటీవలే ఇజ్రాయెల్ గూడఛార సంస్థ యూఎస్కు చేరవేసింది. ఈ వార్తలపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. తనను హత్య చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తే, ఆ దేశాన్ని 'పూర్తిగా నాశనం' చేస్తానని హెచ్చరించారు.
"తండ్రి మృతికి ప్రతీకారం తీర్చుకుంటా"
ఇరాన్ సుప్రీం లీడర్గా తన తండ్రి, పూర్వాధిపతి అయిన అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా అమెరికా, ఇజ్రాయెల్లపై ప్రతీకారం తీర్చుకుంటానని మొజ్తబా ఖమేనీ శపథం చేశారు. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన సమయంలో, ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడిలో ఖమేనీ హత్యకు గురయ్యారు.
ప్రభుత్వ టెలివిజన్లో ప్రసారమైన, ఖమేనీ కుమారుడు మొజ్తబా రాసిన ఒక లిఖితపూర్వక ప్రకటన ప్రకారం.. "ప్రతీకారం అనేది దేశం డిమాండ్, దానిని ఖచ్చితంగా అమలు చేయాలి. నేరపూరితమైన, నీచమైన హంతకులపై, అమరుడైన నాయకుడితో పాటు ఈ రెండు యుద్ధాలలోని అమరవీరులందరి రక్తానికి మేము ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము" అని మొజ్తబా అన్నారు. ఇరాన్ యొక్క "ప్రతీకారం అనివార్యం" అని కూడా ఆయన జోడించారు.
హత్యకు గురైన సర్వోన్నత నాయకుడికి ఇరాన్ పలు రోజుల పాటు అంత్యక్రియలు నిర్వహిస్తున్న తరుణంలో, శనివారం నాడు మొజ్తబా ఖమేనీ ఈ ప్రకటన చేశారు. తన తండ్రిని బలిగొన్న దాడి జరిగినప్పటి నుండి మొజ్తబా బహిరంగంగా కనిపించలేదు. ఫిబ్రవరి చివర్లో జరిగిన ఆ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారని అమెరికా పేర్కొంది.
అయితే ఇటీవలే జరిగిన సంస్మరణ సభలోనూ అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా కనిపించకపోవడంపై పలు అనుమానాలు లేవనెత్తుతున్నారు. వైమానిక దాడిలో మొజ్తబా కూడా తీవ్రంగా గాయపడి చికిత్స తీసుకుంటున్నారని పుకార్లు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజముందో తెలియదు. ఒకవేళ అలీ ఖమేనీ అంత్యక్రియలకు మొజ్తబా హాజరైతే ప్రత్యర్థులైన ఇజ్రాయెల్, అమెరికా విరుచుకుపడే అవకాశం ఉందని ఇరాన్ అధికారులు చెబుతున్న నేపథ్యంలో.. ఆయన అంత్యక్రియలకు హాజరు కావడం లేదని చెబుతున్నారు.
Also REad: స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..30 ఏళ్ల నాటి జ్ఞాపకంతో కంటతడి!
Also Read: అమర్నాథ్లో శివలింగం అదృశ్యం..అయినా తగ్గని భక్తుల తాకిడి..1.71 లక్షల మంది దర్శనం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
England Vs India Preview: టీమ్ఇండియాకు మరో 'వైట్వాష్' గండం..ఇంగ్లాండ్తో చివరి మ్యాచ్లో అయినా గెలుస్తారా?
England:England Vs India 5th T20I Preview: ఐర్లాండ్లో ఇంగ్లండ్ చేతిలో టీ20 సిరీస్ను కోల్పోయిన తర్వాత టీమ్ఇండియా వరుసగా రెండో సారి సిరీస్ ఓడిపోయింది. ఇంగ్లాండ్ తో జరుగుతోన్న టీ20 సిరీస్ను ఇప్పటికే 3-0తో చేయిజార్చుకున్న భారత జట్టు చివరి మ్యాచ్లో గెలుపొంది క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకోవాలని చూస్తోంది. ఈ సిరీస్లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ గెలవని భారత జట్టు.. నేడు జరిగే ఆఖరి మ్యాచ్లో గెలవాలంటే ప్రతి అంశంలోనూ ఇంగ్లాండ్ జట్టును అధిగమించాల్సి ఉంటుంది.
భారత జట్టు యూకే పర్యటన ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్లో తేమ, గాలులతో కూడిన వాతావరణం భారత జట్టుకు ప్రతికూలంగా మారింది. ఉత్తర ఇంగ్లాండ్లోని డర్హామ్ తర్వాత ఇప్పుడు సౌతాంప్టన్లో చివరి టీ20 మ్యాచ్ ఆడనుండడం వల్ల వాతావరణ, పిచ్ పరిస్థితులను అంచనా వేయడంలో టీమ్ఇండియా కొద్దిగా వెనకబడినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు కలిసిరాని విషయం అనే చెప్పాలి.
కెప్టెన్ అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ ఇప్పటికీ తన మొదటి విజయం కోసం ఇంకా ఎదురుచూస్తున్నాడు. 2006లో భారత జట్టు తొలిసారిగా ఒక టీ20 అంతర్జాతీయ మ్యాచ్ గెలిచిన తర్వాత ఇదే మరో ఓటమి కావడం గమనార్హం. ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరిగిన రెండో మ్యాచ్ మినహా, భారత జట్టు ఆటలోని ప్రతి అంశంలోనూ పేలవంగా ఆడింది.
ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు గెలుపునకు దగ్గరైనా.. కేవలం రవి బిష్ణోయ్ వేసిన 17వ ఓవర్ భారత్కు విజయాన్ని దూరం చేసింది. నాటింగ్హామ్లో జరిగిన మూడో మ్యాచ్లో, భారత్ ఇప్పటివరకు తమ అత్యంత పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శనను నమోదు చేసి, 76 పరుగులకే ఆలౌట్ అయింది. బ్రిస్టల్లో జరిగిన నాలుగో మ్యాచ్లో జట్టు అన్ని విభాగాల్లోనూ విఫలమైంది. ఇప్పుడు భారత జట్టు తమ పరువును నిలబెట్టుకోవడానికి బరిలోకి దిగనుంది.
ఇంగ్లాండ్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ల ఫాస్ట్ బౌలింగ్ను తట్టుకోలేకపోవడంపై భారత జట్టు యాజమాన్యం నిస్సందేహంగా ఆందోళన చెందుతోంది. వీరిద్దరితో పాటు లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ సామ్ కర్రన్ కూడా భారత బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టాడు. గాయాల కారణంగా వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాలు జట్టుకు దూరమవ్వడం, అలాగే ఒక ఓవర్లో 29 పరుగులు ఇచ్చిన రవి బిష్ణోయ్ తిరిగి వచ్చే అవకాశాలు సన్నగిల్లడంతో బౌలింగ్ విభాగంలో భారత్కు చాలా తక్కువ ఎంపికలు ఉన్నాయి.
బ్యాటింగ్ విభాగంలో షార్ట్-పిచ్ బంతులను ఎదుర్కోవడంలో వైభవ్ సూర్యవంశీ పేలవంగా రాణిస్తున్నప్పటికీ, భారత జట్టు యాజమాన్యం అతనికి దీర్ఘకాలిక అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. తుది జట్టు జింబాబ్వే పర్యటన జట్టు నుంచి సంజు శాంసన్ను తొలగించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది భారత జట్టు ఫ్యాన్స్లో అసంతృప్తికి గురిచేసింది.
ఫామ్లో లేని తిలక్ వర్మను తొలగిస్తేనే అతనికి తుది జట్టులో చోటు దక్కుతుంది. దీనివల్ల ఇషాన్ కిషన్, అయ్యర్ ఇద్దరూ ఒక స్థానం కిందకు వెళ్లాల్సి వస్తుంది. కిషన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. అయితే ఇషాన్ కిషన్ను నాలుగో స్థానంలో బ్యాటింగ్కు పంపడం జట్టుకు కలిసిరాని విషయంగా పరిగణించవచ్చు.
భారత జట్టు:
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, సంజు శాంసన్, సూర్యాంశ్ షెడ్గే, రవి బిష్ణోయ్.
ఇంగ్లాండ్ జట్టు:
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, విల్ జాక్స్, సామ్ కర్రాన్, జోష్ టంగ్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, రెహాన్ అహ్మద్, లియామ్ డాసన్, ల్యూక్ వుడ్, సాకిబ్ మహమూద్, సన్నీ బేకర్, జోర్డాన్ కాక్స్, జేమ్స్ కోల్స్.
ALso Read: తప్పక గెలవాల్సిన మ్యాచ్..టీమ్ఇండియా గెలుస్తుందా? ఇంగ్లాండ్పై పట్టు సాధిస్తుందా?
Also Read: ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో ముగిసిన మరో శకం.. స్టార్ ఆటగాడు నెయ్మేర్ రిటైర్మెంట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Siddipet: హరీష్ రావు చేసిన సాయానికి రూ.6 లక్షల విరాళం!
Hyderabad, Telangana:Harish Rao Latest News: సహాయం పొంది మరిచిపోయే ఈ రోజుల్లో.. నా కష్టాన్ని గుర్తించి ఇంజనీరింగ్ సీటు ఇప్పించారు. అందుకే మీ ప్రజా సేవలో నేను కూడా భాగస్వామినవుతాను.. అంటూ రోహిత్ అనే యువకుడు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును కలిశారు. ఉన్నత చదువుల కోసం తాపత్రయపడిన హరీష్ రావు చేసిన సహాయాన్ని మరిచిపోకుండా.. తన మొదటి ఏడాది జీతంలో సగభాగాన్ని సిద్దిపేట సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చి.. రోహిత్ తన కృతజ్ఞతా భావాన్ని చాటుకున్నాడు.
సిద్దిపేట పట్టణానికి చెందిన శ్రీనివాస్, వనిత దంపతుల కుమారుడు రోహిత్.. గతంలో ఉన్నత చదువుల కోసం విఎన్ఆర్ (విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ) కళాశాలలో కంప్యూటర్ సైన్స్ సీటు కావాలని రోహిత్ కుటుంబం హరీష్ రావును ఆశ్రయించింది. ఆ రోజు వారి పరిస్థితిని అర్థం చేసుకున్న హరీష్ రావు.. కేవలం ఒకే ఒక్క ఫోన్ కాల్తో రోహిత్కు ఇంజనీరింగ్ సీటు వచ్చేలా సహాయం చేశారు.
మాజీ మంత్రి చేసిన ఆ సాయాన్ని గుండెల్లో పెట్టుకున్న రోహిత్.. ఎంతో కష్టపడి చదివి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం అమెరికా బహుళజాతి సంస్థ (MNC) అయిన రిగల్ రెక్స్నార్డ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించాడు. ఏడాదికి రూ.12 లక్షల భారీ ప్యాకేజీ రోహిత్ ఈ ఉద్యోగంలో స్థిరపడ్డాడు.
తన ఎదుగుదలకు కారణమైన హరీష్ రావుపై ఉన్న ప్రేమ, కృతజ్ఞతతో రోహిత్ శనివారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయనను కలిశారు. తాను సాధించిన ప్రగతిని వివరించి.. తన వార్షిక వేతనం రూ.12 లక్షల్లో సగభాగమైన రూ. 6 లక్షల రూపాయల చెక్కును హరీష్ రావుకు విరాళంగా అందజేశాడు.. హరీష్ రావు సిద్దిపేట ప్రజల కోసం నిరంతరం చేస్తున్న సామాజిక.. సేవా కార్యక్రమాలకు ఈ నిధులను ఉడుతాభక్తిగా వినియోగించుకోవాలని రోహిత్ విజ్ఞప్తి చేశాడు. తన సంపాదన సమాజ సేవకు ఉపయోగపడాలన్నదే తన ఆకాంక్ష అని ఈ సందర్భంగా యువకుడు పేర్కొన్నాడు.
కృతజ్ఞతతో రోహిత్ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయానికి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. సహాయం పొంది లబ్ధి పొందాక కూడా పాత రోజులను, చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకోవడం ఈ రోజుల్లో చాలా అరుదని కొనియాడారు. నేటి తరం ఉద్యోగులకు, యువతకు రోహిత్ ఒక గొప్ప ఆదర్శమని.. ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. రోహిత్ను శాలువాతో ఘనంగా సన్మానించి.. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హరీష్ రావు ఆశీర్వదించారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Akhil Meets Cult Fan: 'అయ్యగారే నంబర్ వన్' అఖిల్ ఫ్యాన్స్ ఊహించని సర్ప్రైజ్..ఇండస్ట్రీలో ఇలా ఏ హీరో చేయడేమో?
Hyderabad, Telangana:Akkineni Akhil Meets Cult Fan: సాధారణంగా ఏ హీరోకైనా అభిమానులు ఉంటారు.. కొందరికి డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. కానీ, అక్కినేని అఖిల్కు మాత్రం ఒక 'కల్ట్ ఫ్యాన్' ఉన్నాడు. ఇప్పటివరకు సరైన కమర్షియల్ సక్సెస్ లేకపోయినా.. అఖిల్ను దేవుడిలా ఆరాధిస్తూ, సినిమా రిలీజ్ అయినప్పుడల్లా థియేటర్ల వద్ద రచ్చ చేసే ఒక యువకుడు సోషల్ మీడియాలో ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. "అయ్యగారే నెంబర్ వన్.. ఎవరివల్లా కాదు.. అఖిలే కరెక్ట్!" అంటూ అతడు ఇచ్చిన స్లోగన్తోనే ఇప్పుడు అందరూ అఖిల్ను ప్రేమగా 'అయ్యగారు' అని పిలుస్తున్నారు.
ఇప్పుడు ఆ కల్ట్ ఫ్యాన్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాడు. దానికి కారణం.. అఖిల్ తాజాగా నటించిన 'లెనిన్' చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడమే!
మాట నిలబెట్టుకున్న అఖిల్!
గతంలో ఈ వీరాభిమాని చేసిన వీడియోలు అఖిల్ దృష్టికి వెళ్లాయి. అప్పట్లో అఖిల్ స్పందిస్తూ.. "కచ్చితంగా నా అభిమానిని కలుస్తాను.. కానీ ఒక భారీ హిట్ కొట్టిన తర్వాతే ఆ కలయిక ఉంటుంది" అని ప్రామిస్ చేశారు.
ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది! 'లెనిన్' మూవీతో అఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అందుకోవడంతో.. తన మాటను నిలబెట్టుకునేందుకు అఖిల్ సిద్ధమయ్యారు. తన 'నెంబర్ వన్' ఫ్యాన్ను స్వయంగా కలిసి ఒక ఊహించని గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఒక అభిమాని కోసం హీరోనే స్వయంగా వెళ్లడం టాలీవుడ్లో బహుశా ఇదే తొలిసారి కావచ్చు. దీనికి సంబంధించిన విజువల్స్ త్వరలోనే బయటకు రానున్నాయి.
థియేటర్లలో 'లెనిన్' ర్యాంపేజ్!
చాలా ఏళ్ల నిరీక్షణ తర్వాత అఖిల్ ఖాతాలో సాలిడ్ హిట్ పడటంతో అక్కినేని ఫ్యాన్స్ థియేటర్ల వద్ద పండగ చేసుకుంటున్నారు. అఖిల్ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా 'లెనిన్' రికార్డు సృష్టించింది. బుక్ మై షోలో టికెట్లు శరవేగంగా అమ్ముడవుతుండటంతో వీకెండ్ థియేటర్లన్నీ హౌస్ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి.
మున్ముందు ఈ సినిమా మరిన్ని కలెక్షన్ల రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. అటు సినిమా సక్సెస్, ఇటు ఫ్యాన్కు అఖిల్ ఇవ్వబోతున్న సర్ప్రైజ్ తో అక్కినేని క్యాంప్లో జోష్ మామూలుగా లేదు!
Also Read: 'మళ్లీ రావా' చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా? ఆ క్యూట్ పిల్ల కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్గా.
Also REad: "పెళ్లి అంటే భయం..కానీ, ఈ వ్యక్తితో బిడ్డను కనాలని ఉంది" హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరుసగా భర్తల హత్యలు!
Hyderabad, Telangana:Karimnagar Two Husbands Murdered News: పచ్చని సంసారాల్లో క్షణికావేశం చిచ్చు రేపుతోంది.. చిన్నపాటి మనస్పర్థలతో పాటు రోజువారీ గొడవలు చివరకు దారుణ హత్యలకు దారితీస్తుండటం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నూరేళ్ల బంధానికి ప్రతీకగా నిలవాల్సిన భార్యాభర్తల బంధం.. అనుమానాలు, కోపతాపాల వల్ల రక్తసిక్తమవుతోంది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు భర్తలు భార్యల చేతిలోనే ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
కోరుట్లలో రోకలిబండతో ఘాతుకం..
ఈ నెల 9వ తేదీన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఒక దారుణమైన ఘటన జరిగింది.. ఒక సాదాసీదా కుటుంబంలో రేగిన వివాదం చివరకు ప్రాణాలు తీసే వరకు వెళ్లింది.. భార్యాభర్తల మధ్య జరిగిన తీవ్రమైన వాగ్వాదం కాస్తా .. పెనుగులాటగా మారింది. కోపంతో ఊగిపోయిన భార్య.. ఇంట్లోనే ఉన్న రోకలిబండతో భర్త తలపై బలంగా బాదింది. తీవ్ర రక్తస్రావంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు..
సుల్తానాబాద్లో కుమారుడితో కలిసి..
కోరుట్ల ఘటన మరువక ముందే.. నిన్న పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తుర్క కాశీపల్లి గ్రామంలో మరో ఘోరం జరిగింది. ఇక్కడి కుటుంబంలో కూడా గత కొంతకాలంగా మనస్పర్థలు నడుస్తున్నట్లు సమాచారం. నిన్న రాత్రి జరిగిన గొడవ తీవ్రరూపం కావడంతో.. భార్య తన కుమారుడితో కలిసి భర్తపై దాడికి తెగబడింది. ఇద్దరూ కలిసి అత్యంత క్రూరంగా ఆ వ్యక్తి ప్రాణాలు తీశారు. కన్న తండ్రిని చంపేందుకు కుమారుడు కూడా తల్లికి సహాయడం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది..
పోలీసుల ప్రాథమిక విచారణ..
ఈ రెండు ఘటనల వెనుక ప్రధానంగా కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో పాటు ఒకరిపై ఒకరికి పెరిగిన అనుమానాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ వరుస హత్యల వల్ల కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే చనిపోలేదు.. వారి వెనుక ఉన్న కుటుంబాలు పూర్తిగా రోడ్డున పడ్డాయి.. భర్తలు ప్రాణాలు కోల్పోగా.. భార్యలు, వారికి సహకరించిన పిల్లలు జైలు పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ఆయా కుటుంబాల్లోని చిన్న పిల్లలు అనాథలుగా మారుతున్నారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
మనుషుల మధ్య సహనం నశించిపోవడం.. కోపాన్ని అదుపు చేసుకోలేకపోవడం వల్లే ఇలాంటి ఘాతుకాలు జరుగుతున్నాయని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చిన్న సమస్యలకే కౌన్సిలింగ్ తీసుకోకపోవడం.. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు చేసుకోకపోవడం వల్ల ఇవి హత్యల వరకు దారితీస్తున్నాయి.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
