Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Karimnagar505001

రాష్ట్ర ప్రజలకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు

Jul 17, 2024 11:48:46
Karimnagar, Telangana

రైతన్నలకు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రైతు రుణమాఫీ రేపటి నుండి అమలవుతుంది. 2 లక్షల రుణమాఫీ అమలవడం పెద్ద సాహసోపేత నిర్ణయం..ఈ రుణమాఫీ రైతన్నలకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు తొలగి భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉత్సాహంగా వ్యవసాయం చేయడానికి అవకాశం కలగాలని ప్రభుత్వం ఆలోచన ఈ సందర్భంగా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూన్నామని గుర్తించాలి. రైతులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
BBhoomi
Jan 02, 2026 13:53:38
Secunderabad, Telangana:

Gold Investment: 2025 సంవత్సరం కమోడిటీ పెట్టుబడిదారులకు ఎప్పటికీ మర్చిపోలేని ఏడాదిగా నిలిచింది. బంగారం, వెండి, రాగి వంటి లోహాలు ఇన్వెస్టర్లకు ఊహించని స్థాయిలో లాభాలను అందించాయి. ముఖ్యంగా బంగారం విషయానికి వస్తే.. దాదాపు 70 శాతం వరకు పెరిగి.. అనేక ప్రముఖ స్టాక్ మార్కెట్ షేర్లను కూడా వెనక్కి నెట్టింది. ఈ నేపథ్యంలో సహజంగానే పెట్టుబడిదారులందరి దృష్టి ఇప్పుడు ఒక్క ప్రశ్నపై కేంద్రీకృతమైంది. ఈ బంగారం ర్యాలీ 2026లో కూడా కొనసాగుతుందా? లేక ఇక్కడితో ఆగిపోతుందా?

2025లో వచ్చినట్లుగా భారీ రాబడులు మళ్లీ రావడం అంత సులువు కాదని అంచనా వేస్తున్నారు మార్కెట్ విశ్లేషకులు. అయినప్పటికీ.. 2026లో బంగారం పెట్టుబడిదారులకు 12 నుంచి 15 శాతం వరకు స్థిరమైన లాభాలను ఇవ్వగల అవకాశాలు ఉన్నాయని  భావిస్తున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్‌లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ.1,35,000పలుకుతోంది. అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. 2026 చివరి నాటికి ఈ ధర రూ.1.50 లక్షల నుంచి రూ.1.70 లక్షల మధ్యకు చేరవచ్చని అంచనాలు వేస్తున్నారు. 

అయితే.. ఈ ప్రయాణం పూర్తిగా నేరుగా ఉండదని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత ఏడాది భారీగా లాభాలు వచ్చిన నేపథ్యంలో.. కొందరు ఇన్వెస్టర్లు లాభాల బుకింగ్‌కు దిగే అవకాశం ఉంది. అలా జరిగితే మధ్యలో బంగారం ధర 10 గ్రాములకు రూ.1.18 లక్షల వరకూ దిగివచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ ఈ స్థాయి పతనం దీర్ఘకాలికంగా ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: VB-G RAM G scheme latest Update:  కార్మికులకు ప్రతినెలా వేతనాలు.. ఆలస్యం అయితే.. వడ్డీతో సహా చెల్లిస్తాం.. కేంద్ర మంత్రి  ప్రామీస్‌..!!  

పెట్టుబడిదారులు వాస్తవంగా ఎంత లాభం పొందవచ్చనే అంశాన్ని ఒక ఉదాహరణతో చూస్తే స్పష్టత వస్తుంది. రాజు అనే ఒక వ్యక్తి  జనవరి 2026లో బంగారంలో రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టాడని అనుకుందాం. ఏడాది చివరికి 13 నుంచి 15 శాతం రాబడి వస్తే, ఆ పెట్టుబడి విలువ డిసెంబర్ 2026 నాటికి దాదాపు రూ.3.36 లక్షల నుంచి రూ.3.45 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది బ్యాంక్ డిపాజిట్లతో పోలిస్తే మెరుగైన రాబడిగా చెప్పవచ్చు.

బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు అనేకం ఉన్నాయి. అంతర్జాతీయంగా డాలర్ బలపడితే లేదా రూపాయి బలహీనపడితే, భారత్‌లో బంగారం ధరలు పెరుగుతాయి. అదే విధంగా దిగుమతి సుంకాలు, జీఎస్టీ, ఇతర పన్నులు కూడా దేశీయ ధరలపై ప్రభావం చూపుతాయి. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక మాంద్య భయాలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత ఆశ్రయంగా చూస్తారు.

కేంద్ర బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేయడం కూడా ధరలకు బలాన్నిస్తుంది. ఇటీవల అనేక దేశాల కేంద్ర బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటాను పెంచుతున్నాయి. ఇది బంగారం డిమాండ్‌ను మరింత పెంచుతోంది. భారతదేశంలో బంగారం ధరలను ప్రభావితం చేసే మరో కీలక అంశం దాని సాంస్కృతిక ప్రాముఖ్యత. వివాహాలు, పండుగలు, శుభకార్యాల సమయంలో బంగారం కొనుగోళ్లు భారీగా పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరిగిన వేళ, విలువను కాపాడుకునే సాధనంగా బంగారాన్ని భారతీయులు విశ్వసిస్తారు.మొత్తానికి.. 2026లో బంగారం గత ఏడాది లాంటి అద్భుత ర్యాలీ ఇవ్వకపోయినా, స్థిరమైన, నమ్మదగిన పెట్టుబడిగా తన స్థానాన్ని నిలుపుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. దీర్ఘకాల దృష్టితో పెట్టుబడి పెట్టే వారికి బంగారం ఇప్పటికీ ఆకర్షణీయమైన ఎంపికగానే కొనసాగనుంది.

Also Read: Most Stolen Items: బంగారం కాదు.. డబ్బు అంతకన్నా కాదు.. ప్రపంచంలో ఎక్కువగా చోరీకి గురయ్యేది ఇదే..!!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

 

0
comment0
Report
HDHarish Darla
Jan 02, 2026 12:35:26
Mumbai, Maharashtra:

Private Part Cut in Mumbai: న్యూఇయర్ వేడుకల వేళ ముంబైలో ఒక భయంకరమైన ఘటన వెలుగుచూసింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తూ, మాట వినలేదన్న కోపంతో ఒక వివాహిత తన ప్రియుడిపై కత్తితో దాడి చేసి, అతని ప్రైవేట్ భాగాలను కోసేసింది. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుండగా, నిందితురాలు పరారీలో ఉంది.

వివాహేతర సంబంధం
పోలీసుల దర్యాప్తులో ఈ కేసు గురించి షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. పోలీసుల కథనం ప్రకారం.. బాధితుడు (44), నిందితురాలు (25) మధ్య బంధుత్వం ఉంది. ఆమె బాధితుడి సోదరి మరదలు. వీరిద్దరి మధ్య గత ఆరు నుండి ఏడు సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగుతోందని చెబుతున్నారు. తన భర్తను విడిచిపెడతానని.. తనను పెళ్లి చేసుకోవాలని ఆ మహిళ బాధితుడిపై నిరంతరం ఒత్తిడి తెచ్చేదట. ఈ విషయంలో వారి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవని స్థానికులు అంటున్నారు.

పక్కా ప్లాన్‌తో పిలిపించి..
ఈ వేధింపులు తట్టుకోలేక బాధితుడు నవంబర్ 2025లో ముంబై వదిలి బీహార్‌కు వెళ్లిపోయాడు. అయినప్పటికీ ఆమె ఫోన్ ద్వారా బెదిరిస్తూనే ఉంది. డిసెంబర్ 19న బాధితుడు తిరిగి ముంబైకి వచ్చాడు. కానీ ఆమెకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాడు. 

అయితే ఈ క్రమంలో డిసెంబర్ 31 తెల్లవారుజామున, నూతన సంవత్సర స్వీట్లు ఇస్తానని నమ్మించి ఆమె అతడిని తన ఇంటికి పిలిచింది. ఆ సమయంలో ఇంట్లో ఆమె పిల్లలు నిద్రపోతున్నారు. మాటల మధ్యలో వివాదం తలెత్తడంతో, ఆమె అకస్మాత్తుగా కత్తితో అతనిపై దాడి చేసింది. అతని ప్రైవేట్ భాగాలను కోసి తీవ్రంగా గాయపరిచింది.

తీవ్ర రక్తస్రావం అవుతున్నా, బాధితుడు ఎలాగోలా తన ఇంటికి చేరుకున్నాడు. అతని కుమారులు, స్నేహితులు వెంటనే అతడిని తొలుత విఎన్ దేశాయ్ ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం సియోన్ ఆసుపత్రికి తరలించారు. గాయాలు చాలా లోతుగా ఉన్నాయని, అత్యవసర శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తెలిపారు.

పరారీలో నిందితురాలు
ఘటన జరిగినప్పటి నుండి నిందితురాలైన మహిళ పరారీలో ఉందని పోలీసులు చెప్పారు. శాంతాక్రూజ్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఆమె కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. వివాహేతర సంబంధం ఇంతటి హింసాత్మక ఘటనకు దారితీయడం స్థానికంగా సంచలనం సృష్టించింది.

Also Read: Dhoni IPL Retirement: సీఎస్‌కే అభిమానులకు బ్యాడ్‌న్యూస్..ధోనీ రిటైర్మెంట్‌పై క్లారిటీ..ఇక ఐపీఎల్‌కు 'తలా' సెలవు!

Also Read: ATMs Closing Down: దేశంలో భారీగా మూతపడుతోన్న ATMలు..భవిష్యత్తులో మొత్తం నిల్..ఆర్బీఐ కీలక ప్రకటన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
GSG Shekhar
Jan 02, 2026 12:31:18
Nalgonda, Telangana:

Nalgonda Politics: నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు చల్లారడం లేదు. జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతకు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గం మరోసారి షాక్ ఇచ్చింది. నల్గొండ జిల్లా చండూర్ మండలం అంగడి పేటలోని BRC గార్డెన్ లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన డీసీసీ జిల్లా అధ్యక్షుడు పున్న కైలాష్ నేతకు మంత్రి అనుచరులు ఘోరంగా అవమానించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్ది స్టేజి పైకి వస్తున్నారు. నువ్వు తర్వాత రా అంటూ స్టేజి పైకి రానివ్వకుండా పున్నా కైలాష్ నేతను పోలీసులు బయటకు పంపించారు. జిల్లా అధ్యక్షుడికే ఈ తరహాలో అవమానం జరగడం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 
 
ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్గొండలో కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. మొదట నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. అయితే గుమ్మల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. కానీ ఇదే కార్యక్రమంలో ఉన్న డీసీసీ అధ్యక్షుడిని మంత్రి అస్సలు పట్టించుకోలేదు. అంతేకాదు.. ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీలలో కూడా కైలాష్ నేత ఫోటో వేయకపోవడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే డీసీసీ అధ్యక్షుడిగా కైలాష్ నేత నియమాకాన్ని మంత్రి వెంకట్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. 

ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు పున్న కైలాష్ వ్యవహారమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గతంలో పున్నా కైలాష్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి పరుష పదజాలంలో తీవ్రంగా దూషించారు. అయితే తనను పచ్చి బూతులు తిట్టిన కైలాష్ కు డీసీసీ అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని మంత్రి ప్రశ్నించారు. అంతేకాదు కైలాష్ నేతను డీసీసీ పదవి నుంచి తప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి, నల్గొండ ఎస్పీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన లేఖ సైతం రాశారు. అప్పటినుంచి మంత్రి వెంకట్ రెడ్డి పున్నా కైలాష్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారు. అంతేకాకుండా తాను వచ్చే కార్యక్రమాలకు పున్నా కైలాష్ రాకుండా చూసుకుంటున్నారు. అయితే డీసీసీ అధ్యక్షుడికే ఇలాంటి అవమానం జరిగితే.. తమ పరిస్తితి ఏంటని కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు పున్నా కైలాష్ నేతకు డీసీసీ పదవి ఇవ్వడాన్ని జిల్లా కాంగ్రెస్ నేతల్లో కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నల్గొండలో రేవంత్ రెడ్డి మనుషులకే పదవులు వస్తున్నాయని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. తాను కోమటిరెడ్డి అనుచరుడు కావడంతోనే నల్గొండ డీసీసీ అధ్యక్ష పదవి రాకుండా చేశారంటూ గుమ్ముల మోహన్ రెడ్డి ఆరోపించడం సంచలనం రేపింది. అందుకే గుమ్ముల మోహన్ రెడ్డి సైతం డీసీసీ ప్రెసిడెంట్ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు గుమ్ముల మోహన్ రెడ్డికి డీసీసీ అధ్యక్ష పదవి రాకుండా మంత్రి వెంకట్ రెడ్డినే అడ్డుకున్నారంటూ జిల్లాలో కొందరు నేతలు చెవులు కొరుక్కుంటున్నారు..
 
మొత్తంమీద నల్గొండ కాంగ్రెస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. డీసీసీ ప్రెసిడెంట్ వర్సెస్ మంత్రి వెంకట్ రెడ్డి అన్నట్టుగా సీన్ మారింది. ప్రస్తుతం ఈ వివాదాన్ని సద్దుమణించకపోతే మాత్రం.. ఈ లొల్లి మరింత తీవ్రమయ్యే పరిస్థితి ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే మంత్రి వెంకట్ రెడ్డిని పిలిచి వివాదాన్ని ఎవరు కూల్ చేస్తారనేది సస్పెన్స్‌గా మారింది. అయితే మంత్రి ఈ స్థాయిలో డీసీసీని వ్యతిరేకిస్తున్నప్పుడు ఆయన్ను తప్పించినా గొడవ సద్దుమణుగుతుంది. కానీ పున్నా కైలాష్ నేత సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు కావడంతో.. ఈ వివాదం ఎంతదూరం వెళ్తుందో అన్న చర్చ అయితే జిల్లా కాంగ్రెస్ వర్గాలకు అంతుచిక్కడం లేదు.. 

Also Read: Telangana Panchayats: తలరాత మారునున్న తెలంగాణ పంచాయితీలు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..

Also Read: Kavitha Challan: ఎమ్మెల్సీ కవిత భారీగా ట్రాఫిక్‌ చలాన్లు.. రూ.17 వేల చలాన్లు పెండింగ్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Jan 02, 2026 09:03:50
Chennai, Tamil Nadu:

MS Dhoni Last IPL: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు షాకింగ్ న్యూస్. మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్థానం ఐపీఎల్‌లో ముగింపు దశకు చేరుకున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. రాబోయే ఐపీఎల్ 2026 సీజన్ ధోనీకి చివరిది కానుందని ఫ్రాంచైజీ వర్గాలతో పాటు మాజీ ఆటగాళ్లు కూడా స్పష్టం చేస్తున్నారు.

"ఇదే ధోనీకి చివరి సీజన్"
సీఎస్కే మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప ఇటీవలే జియోహాట్‌స్టార్‌తో మాట్లాడుతూ ధోనీ రిటైర్మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. "పరిస్థితి చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతోంది. ధోనీకి ఇదే చివరి సీజన్ కాబోతోంది. ఇకపై అతను ఆడతాడా లేదా అనే ఊహాగానాలకు తావు లేదు. ఈ ఏడాది తర్వాత అతను పూర్తిగా ఆట నుండి తప్పుకుంటాడు" అని ఉతప్ప పేర్కొన్నారు. వచ్చే సీజన్‌లో ధోనీ 'ప్లేయర్-మెంటార్' పాత్రలో కనిపించి, ఆ తర్వాత పూర్తిస్థాయి మెంటార్‌గా మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

మరోవైపు సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా జట్టులో జరుగుతున్న మార్పులను "వారసత్వ ప్రణాళిక"గా అభివర్ణించారు. "ఏదో ఒక సమయంలో ధోనీ తప్పుకుంటాడనే నిజాన్ని మేము పరిగణనలోకి తీసుకున్నాము. కేవలం రెండేళ్ల కోసమే కాకుండా, వచ్చే ఆరేళ్ల తర్వాత చెన్నై జట్టు ఎలా ఉండాలో ఇప్పుడే పునాదులు వేస్తున్నాం" అని అబుదాబి వేలంలో ఆయన వెల్లడించారు.

కీలక మార్పులు..
ధోనీ వారసుడిని సిద్ధం చేసే క్రమంలో సీఎస్కే యాజమాన్యం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌లో రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను వదులుకుని రాజస్థాన్ రాయల్స్ నుండి స్టార్ వికెట్ కీపర్ సంజు శాంసన్‌ను జట్టులోకి తీసుకుంది. ధోనీ ఖాళీ చేయబోయే వికెట్ కీపింగ్ స్థానాన్ని భర్తీ చేయడానికే సంజును తెచ్చినట్లు ఫ్లెమింగ్ ధృవీకరించారు. అదే విధంగా వేలంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్లు అయిన కార్తీక్ శర్మ (19 ఏళ్లు), ప్రశాంత్ వీర్ (20 ఏళ్లు) లపై ఏకంగా రూ. 28.4 కోట్లు వెచ్చించింది. ఇది ఆ జట్టు మొత్తం పర్స్‌లో 60 శాతానికి సమానం.

గత సీజన్ ప్రభావం?
ఐపీఎల్ 2025లో సీఎస్కే తన చరిత్రలోనే అత్యంత దారుణంగా చివరి స్థానంలో నిలిచింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 మాత్రమే గెలిచింది. వయస్సు పైబడటం, మోకాలి సమస్యలు వేధిస్తుండటంతో ధోనీ కూడా భవిష్యత్తుపై స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. ఐదు టైటిళ్లను అందించిన కెప్టెన్‌కు ఘనమైన వీడ్కోలు పలికేందుకు సీఎస్కే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: ATMs Closing Down: దేశంలో భారీగా మూతపడుతోన్న ATMలు..భవిష్యత్తులో మొత్తం నిల్..ఆర్బీఐ కీలక ప్రకటన!

Also REad: NPS Scheme: ఉద్యోగులకు, సామాన్యులకు గుడ్‌న్యూస్..పెన్షన్ స్కీమ్‌లో గొప్ప సంస్కరణలు..భారీగా పెరగనున్న ప్రయోజనాలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Jan 02, 2026 08:50:19
Secunderabad, Telangana:

VB-G RAM G scheme latest update: గ్రామీణ ఉపాధి వ్యవస్థలో కేంద్రంలో మోదీ ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో VBJI రామ్ జీ చట్టం–2025 పేరుతో కొత్త ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ  పథకం ద్వారా గ్రామీణ కార్మికులకు మరింత భద్రత, పారదర్శకత, సమయపాలన కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా బుద్రుక్ గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో  మాజీ సీఎం.. కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం,  రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ స్కీమ్ గురించి ముఖ్యమైన విషయాలను వెల్లుడించారు. VBJI రామ్ జీ పథకం కింద పనిచేసే ప్రతి కార్మికుడికి వారం రోజుల్లోపు వేతనం చెల్లించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఒకవేళ వేతన చెల్లింపులో 15 రోజులు దాటినా ఆలస్యం జరిగితే..  ఆ కార్మికుడికి రోజుకు 0.05 శాతం వడ్డీతో పాటు బకాయి వేతనం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

ఈ కొత్త చట్టం కింద ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి 125 రోజుల ఉపాధికి చట్టపరమైన హామీ ఇస్తుంది. ఇది గతంతో పోలిస్తే ఉపాధి అవకాశాలను మరింత విస్తరించనుంది. ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడే కుటుంబాలకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. కాగా ఈ స్కీమ్ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. VBJI రామ్ జీ పథకంలో కనీసం 33 శాతం ఉద్యోగాలను మహిళలకు రిజర్వ్ చేశారు. దీంతో గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబన పెరగనుంది. మహిళలు ఇంటి పనులతో పాటు ఉపాధి అవకాశాలను కూడా పొందేలా ఈ విధానం రూపకల్పన చేసింది. 

Also Read: Business Ideas: సర్కార్ సబ్సిడీతో.. ఎకరం భూమిలో ఈ పంటలు పండిస్తే.. 10ఏళ్లపాటు ప్రతినెలా రూ. 1లక్ష సంపాదించే అద్భుత అవకాశం..!!  

ఇక ఈ పథకం మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. గ్రామసభలకు ఎక్కువ అధికారాలు కల్పించింది. గ్రామంలోని అవసరాల ఆధారంగా ఏ పనులు చేపట్టాలనే నిర్ణయం గ్రామసభలే తీసుకుంటాయి. నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, జీవనోపాధి కార్యకలాపాలు, ప్రకృతి విపత్తుల సమయంలో ఉపశమన పనులు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. పంటకాలంలో కార్మికుల అవసరం ఎక్కువగా ఉంటుందని గుర్తించిన ప్రభుత్వం, పీక్ సీజన్లలో 60 రోజుల వరకు అదనపు వ్యవసాయ కార్మికులను నియమించుకునే అధికారాన్ని రాష్ట్రాలకు ఇచ్చింది. దీని వల్ల రైతులకు పనివాళ్ల కొరత సమస్య తగ్గే అవకాశం ఉంది.

పథకం అమలు సులభంగా సాగేందుకు పరిపాలనా ఖర్చుల పరిమితిని 6 శాతం నుంచి 9 శాతానికి పెంచారు. దీని వల్ల సాంకేతిక వ్యవస్థలు, మానిటరింగ్, వేగవంతమైన వేతన చెల్లింపులు సాధ్యమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికి.. VBJI రామ్ జీ చట్టం–2025 గ్రామీణ కార్మికుల జీవితాల్లో కీలక మార్పు తీసుకురావచ్చే అవకాశం ఉంది.  వారం లోపే వేతనాలు..ఆలస్యం అయితే వడ్డీ, మహిళలకు రిజర్వేషన్, గ్రామసభల పాత్ర పెంపు వంటి అంశాలు ఈ పథకాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. గ్రామీణ భారతానికి ఇది ఒక కొత్త దిశగా చెప్పవచ్చు.

Also Read: Business Ideas: తమ్ముడు.. ఇది రాసిపెట్టుకో... ఈ ఒక్క బిజినెస్ ఐడియాతో ఎవరి సపోర్టు లేకుండానే.. కోట్లకు పడగలెత్తొచ్చు..!!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

 

0
comment0
Report
HDHarish Darla
Jan 02, 2026 08:26:37
Hyderabad, Telangana:

ATMs Closing Down 2025: ఒకప్పుడు నగదు కోసం ఏటీఎం (ATM) సెంటర్ల ముందు క్యూ కట్టేవారం. కానీ కాలం మారింది.. ఇప్పుడు జేబులో రూపాయి లేకపోయినా స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఈ డిజిటల్ విప్లవమే ఇప్పుడు ఏటీఎంల మనుగడను ప్రశ్నార్థకంగా మారింది. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఏటీఎంలు మూతపడుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా వెల్లడించిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

గత ఏడాది కాలంలో ఏటీఎంల సంఖ్యలో స్పష్టమైన తగ్గుదల కనిపిస్తోంది. RBI నివేదిక ప్రకారం.. 2024 మార్చి నాటికి దేశంలో మొత్తం 2,53,417 ఏటీఎంలు ఉండేవి. 2025 మార్చి నాటికి ఈ సంఖ్య 2,51,057 కు పడిపోయినట్లు ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. కేవలం ఒక్క ఏడాదిలోనే బ్యాంకులు దేశవ్యాప్తంగా 2,360 ఏటీఎంలను శాశ్వతంగా తొలగించినట్లు తెలుస్తోంది.

ఏటీఎంలు మూతపడటానికి ప్రధాన కారణం?
బ్యాంకింగ్ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. దీనికి ప్రధాన కారణం UPI (Unified Payments Interface). డిజిటల్ చెల్లింపుల్లో జోరు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. టీ కొట్టు నుంచి మాల్స్ వరకు ప్రతిచోటా స్కాన్ చేసి పేమెంట్స్ చేస్తుండటంతో నగదు అవసరం భారీగా తగ్గింది. ఏటీఎం సెంటర్ల అద్దె, విద్యుత్ బిల్లులు, సెక్యూరిటీ గార్డుల జీతాలు, నగదు నింపే వాహనాల ఖర్చు బ్యాంకులకు భారంగా మారుతోంది. డిజిటల్ లావాదేవీల వల్ల ఏటీఎంల వద్ద రద్దీ తగ్గడంతో, లాభసాటిగా లేని మిషన్లను బ్యాంకులు ఎత్తివేస్తున్నాయి.

బ్యాంకులకు చెందిన ఏటీఎంలు తగ్గుతున్నప్పటికీ, ప్రైవేట్ సంస్థలు నిర్వహించే వైట్ లేబుల్ ఏటీఎంలు మాత్రం పెరిగాయి. ఏడాది కాలంలో ఇవి 34,602 నుండి 36,216 కి చేరాయి. అంటే కొత్తగా 1,614 వైట్ లేబుల్ ఏటీఎంలు ఏర్పాటయ్యాయి. ఇవి ప్రధానంగా ఏటీఎం సదుపాయం తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్నాయి.

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. దేశంలో బ్యాంకు శాఖల సంఖ్య గత ఏడాదిలో 2.8 శాతం పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1.64 లక్షల బ్యాంకు శాఖలు ఉన్నాయి. సాధారణంగా బ్రాంచీలు పెరిగితే ఏటీఎంలు కూడా పెరగాలి. కానీ, బ్యాంకులు ఇప్పుడు ఫిజికల్ ఏటీఎంల కంటే మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్ యాప్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది.

చివరిగా.. చెప్పాలంటే నగదు రహిత లావాదేవీలు పెరగడం ఆర్థిక వ్యవస్థకు మంచిదే అయినా, అత్యవసర సమయాల్లో నగదు కోసం ఏటీఎంలపై ఆధారపడే సామాన్యులకు ఈ మూసివేత కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.

Also REad: NPS Scheme: ఉద్యోగులకు, సామాన్యులకు గుడ్‌న్యూస్..పెన్షన్ స్కీమ్‌లో గొప్ప సంస్కరణలు..భారీగా పెరగనున్న ప్రయోజనాలు!

Also Read: Indian Currency Value: ఇక్కడి నుంచి రూ.1,00,000 తీసుకెళ్తే..అక్కడ కోటీశ్వరులు అవుతారు..200 రెట్లు డబ్బు రెట్టింపు అవుతుంది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 02, 2026 07:05:04
Hyderabad, Telangana:

NPS Scheme Interest Rate: భారతీయ పౌరుల పదవీ విరమణ జీవితాన్ని మరింత ఆర్థిక భద్రతతో నింపేందుకు పెన్షన్ నియంత్రణ, అభివృద్ధి అథారిటీ (PFRDA) విప్లవాత్మక మార్పులను ప్రకటించింది. తక్కువ మెయింటెనెన్స్ ఫీజు, పారదర్శకమైన పాలన, సులభతరమైన బ్యాంకింగ్ సేవలే లక్ష్యంగా ఈ సంస్కరణలు రూపుదిద్దుకున్నాయి.

బ్యాంకులకు కొత్త బాధ్యతలు..
ఇప్పటివరకు పెన్షన్ నిధుల నిర్వహణలో ఉన్న సంక్లిష్ట నిబంధనలను ప్రభుత్వం సరళీకరించింది. ప్రముఖ వాణిజ్య బ్యాంకులు ఇకపై తమ సొంత పేరుతో పెన్షన్ ఫండ్ కంపెనీలను నడపవచ్చు. బ్యాంకుల మధ్య పోటీ పెరగడం వల్ల కస్టమర్లకు అధిక రాబడి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఆర్థికంగా బలంగా ఉన్న బ్యాంకులు మాత్రమే దీనికి అనుమతి ఉంది.

NPS పరిపాలనను మరింత పారదర్శకంగా మార్చేందుకు ఇప్పుడు నిపుణులను నియమించారు. SBI మాజీ ఛైర్మన్ దినేష్ కుమార్ కారా NPS ట్రస్ట్ బోర్డు కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. వీరితో పాటు ఆర్థిక నిపుణురాలు స్వాతి అనిల్ కులకర్ణి, డిజిటల్ ఇండియా ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ అరవింద్ గుప్తా సభ్యులుగా చేరారు.

పెట్టుబడిదారులకు మెరుగైన మెచ్యూరిటీ సొమ్ము అందించే లక్ష్యంతో, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ ఫీజు (IMF)ను తగ్గించారు. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వస్తాయి. పెట్టుబడి మొత్తం,కొత్త నిర్వహణ రుసుము (IMF) రూ. 25,000 కోట్ల వరకు 0.12% ఉండగా.. రూ. 1.5 లక్షల కోట్లు దాటితే,కేవలం 0.04% గా నిర్ణయించారు. పెట్టుబడి పెరిగేకొద్దీ రుసుము తగ్గేలా ఈ విధానాన్ని రూపొందించారు. దీనివల్ల ప్రైవేట్ ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందే వారికి ఎక్కువ లాభం చేకూరుతుంది.

NPS ఖాతాను తెరవడం ఎలా?
18 నుండి 70 సంవత్సరాల లోపు ఉన్న భారతీయులు లేదా NRIలు ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చు.

1. ఆన్‌లైన్ విధానం (e-NPS)
enps.nsdl.com లేదా enps.kfintech.com వెబ్‌సైట్‌ను సందర్శించండి.
ఆధార్/పాన్ కార్డ్ వివరాలు ఇచ్చి, మొబైల్‌కు వచ్చే OTP ద్వారా ధృవీకరించుకోండి.
ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి, కనీసం రూ. 500 తో ఖాతా ప్రారంభించవచ్చు.
ప్రక్రియ ముగిశాక మీకు PRAN (Permanent Retirement Account Number) కేటాయిస్తారు.

2. ఆఫ్‌లైన్ విధానం (Bank/Post Office)
సమీపంలోని బ్యాంకు లేదా పోస్టాఫీసులో NPS ఫారమ్ నింపి, KYC పత్రాలు సమర్పించడం ద్వారా మీ ఖాతాను ప్రారంభించవచ్చు.

ముఖ్యమైన విషయాలు
ఇది తప్పనిసరి పదవీ విరమణ ఖాతా. దీనికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C, 80CCD(1B) కింద రూ. 2 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇది ఒక సేవింగ్స్ ఖాతా లాంటిది. పన్ను ప్రయోజనం ఉండదు కానీ, ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు తీసుకోవచ్చు. మీరు చెల్లించే డబ్బును ఈక్విటీ (స్టాక్ మార్కెట్), ప్రభుత్వ బాండ్లు లేదా కార్పొరేట్ బాండ్లలో మీ ఇష్టానుసారం పెట్టుబడి పెట్టవచ్చు.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Indian Currency Value: ఇక్కడి నుంచి రూ.1,00,000 తీసుకెళ్తే..అక్కడ కోటీశ్వరులు అవుతారు..200 రెట్లు డబ్బు రెట్టింపు అవుతుంది!

Also Read: Vande Bharat Sleeper: రైలు ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్..'వందే భారత్ స్లీపర్' వచ్చేస్తోంది..తొలి రైలు నడిచేది అక్కడే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Jan 02, 2026 07:00:25
Secunderabad, Telangana:

Pandiri Farming Subsidy Business Ideas: వ్యవసాయం అనగానే.  ఆదాయం తక్కువ.. నష్టం ఎక్కువ అనే భావన చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులు, మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా రైతులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్న ఘటనలు ఇందుకు కారణమని చెప్పాలి.  ఈ కారణాలతోనే యువత సహా చాలా మంది వ్యవసాయ రంగానికి దూరంగా ఉంటున్నారు. అయితే వ్యవసాయ నిపుణులు చెబుతున్న మాట ఒక్కటే.. సరైన పద్ధతిలో ప్రభుత్వ పథకాలు.. సబ్సిడీలను వినియోగించుకుంటే వ్యవసాయం ద్వారానే ఉన్న ఊరిలోనే మంచి ఆదాయం సంపాదించవచ్చని చెబుతున్నారు.

ప్రస్తుతం అలాంటి లాభదాయకమైన విధానాల్లో ఒకటిగా పందిరి వ్యవసాయం నిలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ సహకారంతో శాశ్వత పందిరి నిర్మాణం చేపట్టి కూరగాయలు లేదా పండ్ల సాగు చేస్తే దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా రైతులు వెదురు బొంగులు లేదా చెక్క స్తంభాలతో తాత్కాలికంగా పందిరులు వేసి దొండ తీగ, బీరకాయ, సొరకాయ, ఆనపకాయ, కాకరకాయ, పొట్లకాయ వంటి పంటలను సాగు చేస్తుంటారు. అయితే గాలివానలు, భారీ వర్షాలు, తుఫాన్లు వచ్చినప్పుడు ఈ తాత్కాలిక పందిళ్లు కూలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల పంటతో పాటు పెట్టుబడీ నష్టపోయే అవకాశం ఉంటుంది.

ఈ సమస్యకు పరిష్కారంగా రాళ్లు లేదా కాంక్రీట్ స్తంభాలతో శాశ్వత పందిరి ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకసారి సరైన విధంగా నిర్మించిన పందిరి 10 నుంచి 15 సంవత్సరాల వరకు నిలబడే సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఈ రాతి పందిళ్లు తట్టుకుని నిలబడతాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పందిరి వ్యవసాయం కోసం హార్టికల్చర్ శాఖ ద్వారా సబ్సిడీ అందుబాటులో ఉంది. సాధారణంగా ఒక ఎకరానికి రాతి పందిరి ఏర్పాటు చేయడానికి రూ.2 లక్షలకుపైగా ఖర్చవుతుంది. 

అయితే..  ఎస్సీ, ఎస్టీ రైతులకు 75 శాతం వరకు సబ్సిడీ అందిస్తుంది ప్రభుత్వం. ఇతర రైతులకు 40 నుంచి 50 శాతం వరకు సబ్సిడీ లభించే అవకాశం ఉంది. ఈ సబ్సిడీ పొందాలంటే రైతులు తమ జిల్లాలోని హార్టికల్చర్ శాఖ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. సరైన మార్గదర్శకంతో ఈ పథకాన్ని వినియోగించుకుంటే పెట్టుబడి భారం గణనీయంగా తగ్గుతుంది.

Also Read: Future Metal: బంగారం, వెండి, ప్లాటినం, రాగి కాదు.. భవిష్యత్ అంతా ఈ లోహానిదే..లాభాలే లాభాలు..!!

పందిరి సాగులో ప్రధాన ప్రయోజనం ఏమిటంటే, పంట ఒకేసారి కాకుండా ప్రతిరోజూ కోతకు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో రైతులకు రోజువారీ నగదు ఆదాయం లభిస్తుంది. వచ్చిన కూరగాయలను నేరుగా స్థానిక మార్కెట్లు, రైతు బజార్లు లేదా హోల్‌సేల్ మార్కెట్లలో విక్రయించుకోవచ్చు. ఒకే పందిరి వ్యవస్థను ఉపయోగించి 8 రకాల వరకు కూరగాయ పంటలు మార్పిడి పద్ధతిలో సాగు చేయవచ్చు. అంతేకాకుండా ద్రాక్ష, బొప్పాయి వంటి కొన్ని పండ్ల సాగుకూ ఈ పందిరి విధానం అనుకూలంగా ఉంటుంది.

శాశ్వత పందిరి వ్యవసాయం వల్ల ప్రకృతి విపత్తుల వల్ల నష్టం జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. పెట్టుబడి ఒక్కసారి పెట్టినా, దీర్ఘకాలం లాభాలు పొందవచ్చు. మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉండే కూరగాయలను ఎంచుకుని సాగు చేస్తే, సీజన్‌లో మంచి లాభాలు సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. aసంప్రదాయ పద్ధతులకే పరిమితం కాకుండా, ఆధునిక సాగు విధానాలను అవలంబిస్తే వ్యవసాయం కూడా లాభదాయకమైన వ్యాపారంగా మారుతుందన్నది నిజం. సరైన సమాచారం, ప్రభుత్వ మద్దతు, కాస్త ముందస్తు ప్రణాళిక ఉంటే రైతులు తమ భవిష్యత్తును బలంగా నిర్మించుకోవచ్చు.

Also Read:  Pension Scheme: ఈ స్కీములో ఒకసారి పెట్టుబడి పెడితే.. జీవితాంతం రూ. లక్ష పెన్షన్ పొందవచ్చు.. !!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

 

0
comment0
Report
HDHarish Darla
Jan 02, 2026 06:35:26
Central Kalimantan:

Indian Currency to Indonesian Rupiah: మన దేశంలో ఒక లక్ష రూపాయలు అంటే మధ్యతరగతి వారికి ఒక మంచి సేవింగ్స్. కానీ, అదే సొమ్మును పట్టుకుని మీరు ఇండోనేషియా వెళ్తే, అక్కడ మీరు కోటీశ్వరులే! భారత కరెన్సీకి అక్కడ విపరీతమైన విలువ ఉండటమే దీనికి కారణం. ప్రకృతి అందాలకు, సాంస్కృతిక వైవిధ్యానికి నెలవైన ఈ దేశం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కరెన్సీ లెక్కలు..
భారత రూపాయి (INR) తో పోలిస్తే ఇండోనేషియా కరెన్సీ అయిన రుపియా (IDR) విలువ చాలా తక్కువ. ప్రస్తుతం ఒక భారత రూపాయి విలువ ఇండోనేషియాలో సుమారు 186 రుపియాలు. ఒక భారతీయుడు తన వద్ద ఉన్న రూ. 1,00,000 మార్పిడి చేస్తే, అక్కడ సుమారు 1,86,00,000 (1.8 కోట్లు) ఇండోనేషియా రుపియాలు లభిస్తాయి. అందుకే భారతీయులకు ఇండోనేషియాలో తక్కువ ఖర్చుతో విలాసవంతమైన హోటళ్లు, రుచికరమైన ఆహారం, పర్యాటక ప్రాంతాలు అందుబాటులో ఉంటాయి.

ముస్లిం దేశం..కానీ నోట్లపై 'వినాయకుడు'!
ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశం ఇండోనేషియా. అయినప్పటికీ, ఈ దేశం భారతీయ సంస్కృతిని, హిందూ వారసత్వాన్ని ఎంతో గౌరవిస్తుంది. ఇండోనేషియాలోని 20,000 రుపియా నోటుపై వినాయకుడి చిత్రం ఉండటం విశేషం. విజ్ఞానానికి, అదృష్టానికి చిహ్నంగా వారు గణపతిని భావిస్తారు. అంతేకాకుండా అక్కడి విద్యా మంత్రిత్వ శాఖ లోగోపై కూడా సరస్వతీ దేవి చిత్రం కనిపిస్తుంది. ఇది ఆ దేశానికి సంబంధించిన మత సామరస్యానికి, సంస్కృతి పట్ల ఉన్న మక్కువకు నిదర్శనం.

పర్యాటక స్వర్గం
ఇండోనేషియా కేవలం కరెన్సీ పరంగానే కాదు, పర్యాటక పరంగా కూడా అద్భుతమైన దేశం. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బీచ్‌లు, హిందూ దేవాలయాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. దట్టమైన అడవులు, అగ్నిపర్వతాలు, అందమైన ద్వీపాలతో ఈ దేశం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది.

ఒక దేశం యొక్క కరెన్సీ విలువ తక్కువగా ఉన్నంత మాత్రాన ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనమని అర్థం కాదు. కరెన్సీ విలువ అనేది ఆ దేశ ద్రవ్య విధానాలు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ వాణిజ్యంపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ, తక్కువ ఖర్చుతో విదేశీ పర్యటన చేయాలనుకునే భారతీయులకు ఇండోనేషియా ఎప్పటికీ బెస్ట్ ఛాయిస్!

Also Read: Vande Bharat Sleeper: రైలు ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్..'వందే భారత్ స్లీపర్' వచ్చేస్తోంది..తొలి రైలు నడిచేది అక్కడే!

Also Read: Prabhas Dating Rumours: 'రాజా సాబ్' హీరోయిన్‌తో ప్రభాస్ డేటింగ్? ఆ స్పెషల్ గిఫ్టే అసలు కారణమా..అసలు కథ ఏంటంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Jan 02, 2026 03:51:48
0
comment0
Report
IPInamdar Paresh
Jan 01, 2026 13:58:41
Hyderabad, Telangana:

Two Snakes mating each other video: చాలా మంది పాములంటేనే వెన్నులో భయంతో వణికిపోతారు. కానీ కొంత మంది  మాత్రం కోబ్రాలతో డెంజర్  స్టంట్ లు చేస్తారు. పొరపాటు పాములు దారి తప్పి ఇంట్లోకి ప్రవేశిస్తే స్నేక్ క్యాచర్ లకు చెప్పాలంటారు. అయితే.. పాములు జనాలు ఉన్న చోట ఉండవంట. మనం భూమి మీద నడుస్తున్నప్పుడు తరంగాలు వాటిని చేరుతాయి. వాటిని కోబ్రాలు గుర్తిస్తాయి. అందుకే అవి జన సంచారం చోట ఉండవంట. కానీ అడవులు, చెరువులు ఉన్న చోట మాత్రం ఉంటాయి. ఈ ఆవాసాలకు దగ్గరగా ఉండే ఇళ్లలో ఎలుకలు ఉంటాయి. వీటిని తినేందుకు పాములు వస్తాయి. కోబ్రాలకు ఎలుకలు, కప్పలు అంటే చాలా ఇష్టం. అందుకే వీటిని వేటలో  భాగంగా అవి జనావాసాల్లో వస్తాయి.

 

పాములు కూడా మనుషుల్లా రొమాన్స్ లకు దిగుతాయంట. అవి తమ శరీరంనుంచి ఒక రకమైన రసాయనాలు వదిలి ఆడపాములను ఆకర్శించడానికి ప్రయత్నిస్తాయంట. అదే విధంగా ఆడపాముతో సంభోగంకు అనేక పాములు పోటిపడతాయంట. అందుకే కోబ్రాలు సంభోగం సమయంలో చాలా కోపంగా ఉంటాయం.

ఇప్పుడు రెండు పాములు సంభోగంకు చెందిన వీడియో వైరల్గా మారింది. దీనిలో రెండు పాములు ఇటుకల మీద ఎక్కి రొమాన్స్ లకు దిగాయి. అవి రెండు కూడా ఒకదానికి మరోకటి పెనవేసుకుని మరీ సంభోగం చేసుకుంటున్నాయి.

Read more: Hyderabad drunk drive Video: వదుల్తొరా.. నెత్తిగొడకు కొట్టుకోనా..?.. నడి రోడ్డు మీద మందుబాబు రచ్చ రంబోలా.. వీడియో ..

ఈ ఘటనను ఎవరో సీక్రెట్ గా వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్త వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. బాబోయ్... ఎంత డెంజర్ గా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

0
comment0
Report
Advertisement
Back to top