Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Karimnagar505001

రాష్ట్ర ప్రజలకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు

Jul 17, 2024 11:48:46
Karimnagar, Telangana

రైతన్నలకు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రైతు రుణమాఫీ రేపటి నుండి అమలవుతుంది. 2 లక్షల రుణమాఫీ అమలవడం పెద్ద సాహసోపేత నిర్ణయం..ఈ రుణమాఫీ రైతన్నలకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు తొలగి భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉత్సాహంగా వ్యవసాయం చేయడానికి అవకాశం కలగాలని ప్రభుత్వం ఆలోచన ఈ సందర్భంగా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూన్నామని గుర్తించాలి. రైతులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Jan 29, 2026 06:45:58
Hyderabad, Telangana:

EPFO Wage Ceiling Hike 2026: ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే భారీ ఊరటనిచ్చే దిశగా అడుగులు వేస్తోంది. 2014 నుండి స్థిరంగా ఉన్న EPFO (ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) వేతన పరిమితిని పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మార్పు వల్ల కోట్లాది మంది ఉద్యోగుల సామాజిక భద్రత, పదవీ విరమణ నిధి గణనీయంగా పెరగనుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, ఉద్యోగుల పీఎఫ్ (PF), పెన్షన్ (EPS) లెక్కల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి.

వేతన పరిమితి పెంపు అంచనా
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. ఈపీఎఫ్ఓ వేతన సీలింగ్ నెలకు రూ.15,000 గా ఉంది. దీనిని ఇప్పుడు రూ.25,000 కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. చివరిసారిగా 2014 సెప్టెంబర్ 1న ఈ పరిమితిని రూ.6,500 నుండి రూ.15,000కి పెంచారు. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు సవరణకు మోక్షం కలగనుంది.

వేతన పరిమితి (Salary Ceiling) అంటే ఏమిటి?
వేతన పరిమితి అనేది ఈపీఎఫ్ఓ పథకంలో తప్పనిసరిగా చేరాల్సిన ఉద్యోగుల జీతపు స్థాయిని సూచిస్తుంది. ప్రస్తుత నియమం ప్రకారం.. నెలకు రూ.15,000 వరకు ప్రాథమిక వేతనం (Basic Pay) ఉన్న ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఈపీఎఫ్ఓలో సభ్యుడిగా ఉండాలి. ఆ పైన జీతం ఉన్నవారు స్వచ్ఛందంగా చేరవచ్చు.

ప్రస్తుత కాలంలో నగరాల్లో కనిష్ట వేతనాలు కూడా రూ.15,000 దాటుతున్నాయి. దీనివల్ల చాలా మంది కార్మికులు సామాజిక భద్రతా పథకాలకు దూరమవుతున్నారు. అందుకే ఈ పరిమితిని పెంచడం అనివార్యమైంది.

పెంపు వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు..
పెరగనున్న రిటైర్మెంట్ ఫండ్: వేతన పరిమితి పెరిగితే.. ఉద్యోగి, యజమాని చెల్లించే నెలవారీ విరాళాలు పెరుగుతాయి. చక్రవడ్డీ ప్రభావంతో పదవీ విరమణ సమయానికి చేతికి వచ్చే మొత్తం భారీగా ఉంటుంది.

విరాళం పెరగడం వల్ల ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) కింద వచ్చే నెలవారీ పెన్షన్ మొత్తం కూడా పెరుగుతుంది. ఇది వృద్ధాప్యంలో అధిక భద్రతను ఇస్తుంది. వేతన సీలింగ్ రూ.25,000కి పెంచడం వల్ల, అసంఘటిత రంగంలో పనిచేసే లక్షలాది మంది కొత్త కార్మికులు ఈపీఎఫ్ఓ పరిధిలోకి వస్తారు.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రభావం
గతంలో సుప్రీంకోర్టు కూడా వేతన పరిమితిని సమీక్షించాలని కార్మిక మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రతిపాదనను అత్యంత ప్రాధాన్యతతో పరిశీలిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఈపీఎఫ్ఓ వేతన పరిమితి పెంపు అనేది ప్రభుత్వానికి ఆర్థికంగా కొంత భారం కలిగించినప్పటికీ (సబ్సిడీల రూపంలో), ఉద్యోగుల దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఇది ఒక విప్లవాత్మక అడుగు. ఇది మధ్యతరగతి, తక్కువ వేతన జీవుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తుంది.

Also Read: Gold Price Collapse: బంగారం ప్రియులకు డేంజర్ బెల్..అమాంతం పడిపోయే అవకాశం ఉందా? ఇన్వెస్టర్లు జాగ్రత్త!

ALso Read: Shambhavi Pathak: అజిత్ పవార్ విమాన ప్రమాదం..కాక్‌పిట్‌లో పైలట్స్ చివరి మాటలు..అసలేం జరిగిందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 29, 2026 06:05:38
Hyderabad, Telangana:

Gold Price Collapse Forecast: ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సాధారణంగా డిమాండ్ పెరిగితే ధర పెరుగుతుంది, కానీ విచిత్రంగా కొనుగోళ్లు తగ్గుతున్నా బంగారం రేటు మాత్రం తగ్గడం లేదు. దీని వెనుక పెద్ద అంతర్జాతీయ సంస్థల మాయాజాలం ఉందా? సామాన్యులు 'బంగారం బుడగ' (Gold Bubble) లో చిక్కుకుంటున్నారా? అన్న కోణంలో ఆరోపణలు వస్తున్నాయి.

బంగారం ధరలు ప్రస్తుతం రికార్డు స్థాయిల్లో ఉన్నాయి. కానీ ఈ పెరుగుదల సహజమైనది కాదని, త్వరలోనే భారీగా కుదేలయ్యే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2025లోనూ ఇదే పరిస్థితి!
గత ఏడాది కాలంలో బంగారం ధర ఏకంగా 60 శాతం పెరగడం అసాధారణం. మార్కెట్ పరిభాషలో దీనిని 'బబుల్' (Bubble) అని పిలుస్తారు. అంటే వాస్తవ విలువ కంటే రేటు ఎక్కువగా ఉబ్బిపోవడం. ఈ బుడగ ఎప్పుడైనా పేలిపోయే అవకాశం ఉందని, అప్పుడు కొనుగోలుదారులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

విదేశీ సంస్థల 'రిపోర్ట్' మాయాజాలం
గోల్డ్‌మ్యాన్ సాక్స్, జేపీ మోర్గాన్ వంటి దిగ్గజ సంస్థలు మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు "ధర ఇంకా పెరుగుతుంది" అంటూ నివేదికలు ఇస్తుంటాయి. ఆ రిపోర్టులు నమ్మి సామాన్యులు ఎగబడి కొంటున్న సమయంలోనే, ఈ పెద్ద సంస్థలు తమ దగ్గరున్న బంగారాన్ని అమ్ముకుని లాభాలు పొందుతాయి. గతంలో జేపీ మోర్గాన్ బ్యాంక్ "స్పూఫింగ్" అనే టెక్నిక్ వాడి ధరలను కృత్రిమంగా పెంచినందుకు రూ.7,600 కోట్ల జరిమానా కూడా కట్టింది.

గత చరిత్ర ఏం చెబుతోంది?
బంగారం ధర పీక్స్‌కు వెళ్లి మళ్లీ కుప్పకూలడం కొత్తేమీ కాదు. 1980లో బంగారం ధర రికార్డు స్థాయికి చేరిన తర్వాత ఒక్కసారిగా 57% పడిపోయింది. ఆ నష్టం పూడటానికి 25 ఏళ్లు పట్టింది.

అలాగే 2011లోనూ మళ్లీ రేటు భారీగా పెరిగి, తర్వాత 45% క్రాష్ అయ్యింది. కోలుకోవడానికి 4 ఏళ్లు పట్టింది. 2026లోనూ ఇప్పుడు కూడా అదే తరహా 'ప్రైస్ క్రాష్' జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ధరలు పడిపోవడానికి కారణాలు..
లిక్విడిటీ క్రంచ్: స్టాక్ మార్కెట్లు పడిపోయినప్పుడు, ఇన్వెస్టర్లు నగదు కోసం తమ దగ్గరున్న గోల్డ్ ఈటీఎఫ్‌లను (ETFs) విక్రయిస్తారు. దీనివల్ల మార్కెట్లో బంగారం సప్లై పెరిగి ధర తగ్గుతుంది.

రిటైల్ డిమాండ్ క్షీణత: పెళ్లిళ్ల సీజన్ ఉన్నా సామాన్యులు బంగారం కొనడం తగ్గించేశారు. ఎప్పుడైతే డిమాండ్ కనిష్ట స్థాయికి చేరుతుందో, అప్పుడు ధరల్లో దిద్దుబాటు తప్పదు.

మధ్యతరగతికి దూరం: ఇప్పటికే పేదలకు అందని ద్రాక్షగా మారిన బంగారం, మధ్యతరగతి ప్రజలకు కూడా దూరమైతే మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింటుంది.

బంగారం ఎప్పుడూ సురక్షితమైన పెట్టుబడి అని భావిస్తాం. కానీ ప్రస్తుత ధరలు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎగబడి కొనడం కంటే, మార్కెట్ స్థిరీకరణ అయ్యే వరకు వేచి చూడటం ఉత్తమమని నిపుణుల సలహా.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికలు, నిపుణుల అభిప్రాయాల మేరకు పొందుపరిచినది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Telangana PRC: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్..పీఆర్సీ అమలుపై ఆశలు గల్లంతు..ఎప్పటికి వచ్చే?!

Also Read: Shambhavi Pathak: అజిత్ పవార్ విమాన ప్రమాదం..కాక్‌పిట్‌లో పైలట్స్ చివరి మాటలు..అసలేం జరిగిందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 29, 2026 04:31:43
Hyderabad, Telangana:

Jupiter Favorite Zodiac Signs Telugu: బృహస్పతిని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సంపద, జ్ఞానం, విద్య, ఆనందం, శ్రేయస్సుకు కారకుడిగా పరిగణిస్తూ ఉంటారు.. అందుకే ఈ గ్రహాన్ని అన్ని గ్రహాల్లోకెల్లా అత్యంత శుభగ్రహంగా భావిస్తారు. ఈ గ్రహం చాలా శుభాలు కలిగించేదిగా చెప్పుకుంటారు. అందుకే జాతకంలో ఇది శుభ స్థానంలో ఉన్న రాశుల వారందరికీ ఎంతో మేలు జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా అదృష్టం విపరీతంగా పెరిగి ఎల్లప్పుడు ఎన్నో రకాల అద్భుతమైన లాభాలను అందిస్తుంది. అయితే, అప్పుడప్పుడు ఈ గ్రహం దుష్ట గ్రహాల చేత కూడా ప్రభావితం అవుతుంది దీని కారణంగా ఆయారాశుల వారి జీవితాల్లో అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.

అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహాన్ని 9 గ్రహాలకు దేవతల గురువుగా భావిస్తారు. అందుకే ఈ గ్రహ శుభ ప్రభావం ఉన్న వ్యక్తులకి ఎంతో మేలు జరుగుతూ ఉంటుంది. అయితే, కొన్ని రాశుల వారికి ఎల్లప్పుడూ ఈ దేవ గురువు బృహస్పతి అనుగ్రహం ఉంటుంది. కొన్ని రాశుల వారిపై ఎల్లప్పుడూ ఈ గ్రహం ప్రేమ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆయా రాశుల వారికి వైవాహికంగా ఎంతో మేలు జరుగుతుంది. అలాగే వారికి తెలివితేటలు ఊహించని స్థాయిలో పెరిగి ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా ఊహించని ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అయితే, బృహస్పతి గ్రహానికి అత్యంత ఇష్టమైన రాశులేవో.? ఏరాశుల వారికి ఎక్కువగా మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులవారికి బంపర్‌ జాక్‌పాట్:
సింహరాశి 
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఎల్లప్పుడూ బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది. వీరికి ఊహించని స్థాయిలో ధైర్యం కూడా పెరిగి.. సృజనాత్మకత విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి సూర్యుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. కాబట్టి.. వీరికి ఎల్లప్పుడూ నాయకత్వ లక్షణాలు విపరీతంగా పెరుగుతూ వస్తాయి. అలాగే కీర్తి, ప్రతిష్టలు కూడా విపరీతంగా పెరుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. వృత్తి, విద్యాపరంగా గణనీయమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు ఎన్నో రకాల అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యుడు తెలుపుతున్నారు. 

కర్కాటక రాశి 
బృహస్పతికి ఎంతో ఇష్టమైన రాశుల్లో కర్కాటక రాశి కూడా ఒకటి. ఈ రాశి వారికి ఎల్లప్పుడూ చంద్రుడి అనుగ్రహం కూడా ఉంటుంది. కాబట్టి వీరికి ఎల్లప్పుడూ అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా క్లిష్టతరమైన సమస్యల నుంచి కూడా ఎంతో సులభంగా పరిష్కారం పొందగలుగుతారు. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు మంచి ప్రమోషన్స్ కూడా కలుగుతాయి. కొత్త బాధ్యతలు సులభంగా లభించడమే కాకుండా.. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారికి మంచి ప్రమోషన్స్ కూడా కలుగుతాయి. అలాగే ఆర్థిక రంగాల్లో కాస్త మెరుగుదల కూడా కనిపిస్తుంది. ఎల్లప్పుడు వీరు ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటారు..

ధనస్సు రాశి 
ధనస్సు రాశి వారికి కూడా ఎల్లప్పుడూ బృహస్పతి అద్భుతమైన ధన లాభాలను అందిస్తూనే ఉంటాడు. వీరు ఈ సమయంలో విదేశాలకు కూడా ఎంతో సులభంగా వెళ్లగలుగుతారు. అక్కడ ఉద్యోగాలు కూడా సంపాదించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఆస్తి సంబంధిత విషయాల్లో కూడా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఎప్పటినుంచో ఇబ్బందులతో బాధపడుతున్న ఈ వ్యక్తులకు బృహస్పతి అద్భుతమైన పరిష్కారం చూపబోతున్నాడు. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం ఒకచోటు నుంచి మరొక చోటికి కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా అనుకున్న పనుల్లో అఖండ విజయాలు సాధించగలుగుతారు.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 29, 2026 04:19:45
Hyderabad, Telangana:

Shani Dev Effect On Zodiac 2026 Telugu: శని గ్రహాన్ని కర్మలకు ఫలితాలను ప్రసాదించే గ్రహంగా పరిగణిస్తారు. అందుకే అన్ని గ్రహాలతో పోలిస్తే, ఈ గ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే శని దేవుడిని కొంతమంది న్యాయదేవతగా కూడా పిలుస్తారు ప్రతి వ్యక్తి వారి కర్మల ప్రకారం, ఈ దేవుడు మంచి చెడు ఫలితాలను అందిస్తాడు. జీవితంలో పదిమందికి మంచి చేస్తే శని తప్పకుండా ఎప్పుడో ఒకరోజు అదృష్టాన్ని ప్రసాదిస్తాడు.. అదే ఇతరులకు కీడు చేస్తే, అనేక సమస్యలు తప్పవని జ్యోతిష్యులు చెబుతూ ఉంటారు. అందుకే ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతున్న వ్యక్తులకు కొంతమంది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఇతరులకు మంచి చేయాలని సూచిస్తూ ఉంటారు. ముఖ్యంగా శని జాతకంలో అశుభ స్థానంలో ఉంటే వ్యక్తులు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 

అలాగే శని దేవుడు క్రమబద్ధత బాధ్యత న్యాయం తో సంబంధం కలిగి ఉంటాడు. కాబట్టి ఇవి జీవితంలో ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ఇదిలా ఉంటే మార్చి 13వ తేదీన సాయంత్రం ఏడు గంటల సమయంలో మీన రాశిలో శని గ్రహం అస్తమించబోతోంది. దీని కారణంగా ఆయారాశుల వారిపై తీవ్ర ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. తిరోగమన ప్రభావంతో కొన్ని రాశుల వారికి కీడు జరిగితే.. మరికొన్ని రాశుల వారికి చాలా మేలు జరుగుతుందని వారు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందబోయే రాశులేవో తెలుసుకోండి. 

ఈ రాశులవారికి జాక్‌పాట్:
ధనస్సు రాశి 
ధనస్సు రాశి వారికి శని ప్రభావంతో భౌతిక ఆనందం విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో సౌకర్యాలు కూడా ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలు పొందాలని అనుకుంటున్న వ్యక్తులకు అద్భుతమైన అవకాశాలు కూడా లభిస్తాయి. అలాగే ఆర్థికంగా కూడా చాలావరకు లాభాలు పొందగలుగుతారు. కొన్ని రకాల కీలకమైన నిర్ణయాలు తీసుకొని ఈ సమయంలో భారీ మొత్తంలో డబ్బులు పొందుతారు. అలాగే తల్లిదండ్రులతో గతంలో కంటే ఇప్పుడు సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కుంభరాశి 
కుంభరాశిలో ఇదే సమయంలో పంచగ్రహి రాజయోగం కూడా ఏర్పడబోతుంది. శని అస్తమించే ప్రభావంతో కుంభరాశి వారికి అన్ని రకాల సానుకూలమైన ఫలితాలు రావడం ప్రారంభమవుతాయి. వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా ఆరంభమవుతాయి. ముఖ్యంగా మీడియా రంగాల్లో ఉన్న వ్యక్తులు ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు. మార్కెటింగ్ ఇతర రంగాల్లో ఉన్న వ్యక్తులకు అద్భుతమైన ధన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరి మాటల ప్రభావం ఊహించని స్థాయిలో పెరిగి ఇతరులను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి.

మీన రాశి 
మీన రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా శని గ్రహ ప్రభావంతో ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. అలాగే వీరికి ఈ సమయంలో ఊహించని స్థాయిలో ఇమేజ్ పెరుగుతుంది. ముఖ్యంగా సామాజిక ప్రతిష్టలు కూడా పెరిగి జీవితంలో అద్భుతమైన లాభాలు పొందుతారు. వైవాహిక జీవితంతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఇక వ్యాపారాల్లో భాగస్వాములతో విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. ఈ సమయంలో అనుకుంటున్న పనులు ఎంతో సులభంగా చేయగలిగి భారీ మొత్తంలో డబ్బులు కూడా పొందగలుగుతారు. ముఖ్యంగా కొన్ని రకాల పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RGRenuka Godugu
Jan 28, 2026 14:49:33
Hyderabad, Telangana:

Papaya Leaves Benefits: డెంగీ ,మలేరియా వ్యాధి బారిన పడినప్పుడు ఈ గుమ్మడి ఆకులను వినియోగిస్తారు. ఇది ప్లేట్ లెట్ సంఖ్యను పెంచుతుంది. కాలేయ పనితీరును కూడా మెరుగు చేస్తుంది. గుమ్మడి ఆకుల్లో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. ఇందులో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. చర్మ ప్రయోజనాలు అంతేకాదు హెయిర్ కేర్ లో కూడా ఈ గుమ్మడి ఆకులను వినియోగిస్తారు. ప్రధానంగా డయాబెటిస్, హైపర్ టెన్షన్ సమస్యతో బాధపడుతున్న వారు కూడా తీసుకోవచ్చు. గుమ్మడి ఆకులు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

 ప్లేట్ లెట్స్ పెంచుతుంది..
 గుమ్మడి ఆకులు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ప్లేట్ లెట్స్ సంఖ్యను పెంచుతుంది. ప్రధానంగా మలేరియా డెంగీ, చికెన్ గున్యా ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు ఈ ఆకులను జ్యూస్ రూపంలో తీసుకుంటారు. అంతే కాదు ఇది బోన్ మ్యారో ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. 

 పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్లు..
 గుమ్మడి ఆకుల్లో ఇలాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఫ్రీ రాడికల్ బారిన పడకుండా కాపాడుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ నివారిస్తుంది. అంతేకాదు వయస్సురీత్యా వచ్చే వృద్ధాప్య సమస్యలను కూడా ఆలస్యం చేస్తుంది.

 జీర్ణ ఆరోగ్యం..
 గుమ్మడి ఆకుల్లో పప్పెయిన్‌, కైమోపప్పెయిన్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి సహాయపడతాయి. దీర్ఘకాలిక మలబద్ధక సమస్య కూడా మంచి రెమిడీ. అంతేకాదు గుమ్మడి ఆకులు తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్, అజీర్తిని తగ్గిస్తుంది. యాసిడ్ రీప్లెక్స్ నుంచి కూడా కాపాడుతుంది.

 యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు..
 గుమ్మడి ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. తద్వారా ఆస్తమా, ఆర్థరైటిస్ బాధపడుతున్న వారికి మంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు ఈ గుణాల వల్ల ఆరోగ్యకరమైన పేగు కదలికలకు కూడా తోడ్పడుతుంది.

 షుగర్ కంట్రోల్..
 గుమ్మడి ఆకులు ఇన్సూలిన్‌ సెన్సిటివిటీని కూడా మెరుగు చేస్తుంది. రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఇది డయాబెటిస్ వారికి కూడా మంచిది. అంతే కాదు కాలేయాన్ని డిటాక్సీఫై చేసే గుణాలు ఇందులో ఉన్నాయి. గుమ్మడి ఆకులతో తయారు చేసిన జ్యూస్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్, కామెర్ల సమస్యలు కూడా రావు.

 ఇమ్యూనిటీ బూస్ట్ కావాలంటే గుమ్మడి ఆకుల రసం తాగాల్సిందే. ఇందులో విటమిన్ ఏ, సీ, సీ ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరిచే గుణాలు కలిగి ఉంటుంది. సీజనల్ జబ్బుల బారిన కాపాడుతుంది. ఇది చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పిగ్మెంటేషన్, ఎగ్జిమా సమస్య నుంచి కాపాడుతుంది. ఇందులో యాంటీ మైక్రోబియన్ గుణాలు ఉంటాయి. గాయాలను నయం చేసే గుణం కూడా ఇందులో ఉంది.

Also Read: సహజంగా పింక్ గ్లో కావాలంటే స్ట్రాబెర్రీలు తప్పనిసరి! ఈ కారణాలు చూడండి..

Also Read: బద్రీనాథ్.. కేదార్‌నాథ్ మాత్రమే కాదు ఈ 48 ఆలయాలపై సంచలన నిర్ణయం.. నాన్‌ హిందువులకు నో ఎంట్రీ..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook.

0
comment0
Report
HDHarish Darla
Jan 28, 2026 14:06:52
Hyderabad, Telangana:

Flying Snake Facts: ప్రకృతి ఒడిలో ఎన్నో వింతలు, విశేషాలు ఉంటాయి. అందులో ఒకటి 'ఎగిరే పాము' (Flying Snake). పాములకు రెక్కలు ఉండవు కదా.. మరి ఇవి ఎలా ఎగురుతాయి? ఇవి నిజంగా విషపూరితమైనవా? అనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా పాములు నేలపై పాకడం లేదా నీళ్లలో ఈదడం చూస్తుంటాం. కానీ దక్షిణ, ఆగ్నేయాసియాలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో గాలిలో ప్రయాణించే పాములు కనిపిస్తాయి.

ఇవి నిజంగా ఎగురుతాయా?
వాస్తవానికి ఈ పాములకు పక్షుల్లా రెక్కలు ఉండవు. ఇవి ఒక చెట్టు పైనుంచి మరో చెట్టుకు గాలిలో 'గ్లైడ్' (Glide) అవుతాయి. అంటే గాలిలో తేలుతూ దూకుతాయి కాబట్టి వీటిని ఎగిరే పాములు అని పిలుస్తారు.

ఎగిరే టెక్నిక్ ఏంటి?
ఈ పాములు గాలిలో ప్రయాణించే విధానం శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరుస్తుంది. చెట్టు కొమ్మ చివరకు రాగానే, ఇవి తమ పక్కటెముకలను వెడల్పుగా చేసి శరీరాన్ని చదునుగా మార్చుకుంటాయి. దూకడానికి ముందు శరీరాన్ని 'J' ఆకారంలో వంచి, ఒక్కసారిగా విల్లులా ముందుకు ఉరుకుతాయి.

గాలిలో ఉన్నప్పుడు ఇవి ఈత కొట్టినట్లుగా అటు ఇటు ఊగుతూ (S-shape లో) దిశను మార్చుకుంటాయి. ఇలా ఇవి ఏకంగా 100 అడుగుల (30 మీటర్లు) దూరం వరకు ప్రయాణించగలవు.

ఇవి విషపూరితమైనవా?
చాలామంది ఈ పాములను చూసి భయపడతారు. కానీ నిజానికి మనుషులకు ప్రమాదం లేదు. ఈ పాములు విషపూరితమైనవి కావు. ఇవి చాలా ప్రశాంతమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి చిన్న బల్లులు, కప్పలు, పక్షులను వేటాడుతాయి.

ఎక్కడ కనిపిస్తాయి?
ఇవి ఎక్కువగా చెట్లపైనే నివసిస్తాయి. అరుదుగా మాత్రమే నేలపైకి వస్తాయి. ఇవి ఎగిరే ఉడుతల కంటే చాలా నేర్పుగా గాలిలో ప్రయాణించగలవని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఎగిరే పాములు ప్రకృతి సృష్టించిన ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ అద్భుతం. ఇవి మనుషులకు హాని చేయవు కాబట్టి వీటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు.

Also Read: Telangana PRC: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్..పీఆర్సీ అమలుపై ఆశలు గల్లంతు..ఎప్పటికి వచ్చే?!

Also Read: Shambhavi Pathak: అజిత్ పవార్ విమాన ప్రమాదం..కాక్‌పిట్‌లో పైలట్స్ చివరి మాటలు..అసలేం జరిగిందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 28, 2026 13:06:00
Hyderabad, Telangana:

Liquor Scam: రాష్ట్రంలో మరో అవినీతి బయట పెట్టామని మాజీ మంత్రి హరీష్‌ రావు అన్నారు. అబ్కారీ శాఖలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో మైక్రో బ్రూవరీస్ 110 అప్లికేషన్లు వచ్చాయని.. ఇందులో 25 ఇవ్వాలని నిర్ణయించుకున్నారని అన్నారు. వీటిలో మంత్రి కోట 4, ముఖ్య నేత కోట 21 సెలెక్ట్ చేసుకున్నారని పేర్కొన్నారు. "ఈ మధ్య ముఖ్య నేతకు తోడై, నీడై, ఇంట్లోనే ఉంటాడు ఆ  నాయకుడు. ఈ మధ్య వార్తల్లో ఉన్నారు. నేరుగా కారు ముఖ్య నేత ఇంట్లోకి వెళ్తుంది. ఈ మధ్య ఆ ముఖ్య నేత తిరుపతి వెళ్తే కూడా నీడగా ఉన్నాడు.. వెంటే ఉన్నాడు. ఒక్కొక్క బ్రివరికి ఒక్క కోటి 80 లక్షల ధర నిర్ణయించారు. ఒక్కటిన్నర ముఖ్యనేతకు.. మిగతా 30 లక్షలు తోడు నీడకు.

21 తోడు నీడ ఫైనల్ చేసుకున్నారు. 4 మంత్రి ఫైనల్ చేసుకున్నారు. 110 అప్లికేషన్లు వచ్చాయి అంటున్నారు కదా.. వైన్స్‌లకు లాటరీ తీసినట్టు ఎందుకు లాటరీ తీయడం లేదు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేనివిధంగా లిక్కర్ సరఫరా చేసే సంస్థలకు 4500 కోట్లు బకాయిలు పడ్డారు. కొన్ని బకాయిలు 16 నెలలకు పైబడి బకాయిలు ఉన్నాయి. చరిత్రలో ఎన్నడు కూడా ఈ విధంగా లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 15 రోజుల్లో చెల్లింపులు చేసేవాళ్లం. దీని వలన బ్రీజర్ సరఫరా ఆగిపోయింది. రాష్ట్రంలో చాలా షాపులలో సరుకు లేదు.

ఇతర మల్టీ నేషనల్ కంపెనీలు కూడా సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించారు. లేఖలు కూడా రాశారు. వాటాలు పంపకాల్లో తేడాతోనే బకాయిలు నిలిచిపోయాయి. రానున్న రోజుల్లో మరికొన్ని బ్రాండ్స్ నిలిపివేసే పరిస్థితి ఉన్నది. దీనితో ప్రభుత్వం ఆదాయం పడిపోతోంది. ఇప్పటికే హాలోగ్రామ్ టెండర్లు విషయంలో ముఖ్య నేత అల్లుడుకి, మంత్రి కొడుక్కి కావాలని పట్టుపట్టడంలో ఈ ప్రభుత్వం బీర్ కంపెనీలకు ఇచ్చిన ప్రాధాన్యత రైతులకు ఇవ్వడం లేదు. మీకు బీర్ల కంపెనీలు ముఖ్యమా.. రైతులు ముఖ్యమా.. అంటే బీరు కంపెనీలు ముఖ్యం అంటున్నారు.

మెదక్ జిల్లా సింగూరు డ్యాం రిపేర్ పేరు మీద రైతులకు క్రాఫ్ హాలిడే ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టు కింద 40 వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించారు. మెదక్ జిల్లా ఘనపూర్ ఆయకట్ట కింద 30 వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించారు. కానీ సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఎలాంటి ఆటంకం లేకుండా బీరు కంపెనీలకు నీటి పంపిణీ చేస్తుంది. ఇది మద్యం తయార్ దారు ప్రభుత్వమా.. రైతు ప్రభుత్వమా.. అబ్కారీ శాఖ స్పెషల్ సిఎస్ సంగారెడ్డి జిల్లాకు వెళ్లి నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం అయి రైతులకు నీరు సప్లై ఆపేయండి. బీరు కంపెనీ లకు నీటి కొరత రాకుండా చూడండని ఆదేశాలు ఇచ్చారు.." అని హరీష్ రావు అన్నారు.

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 28, 2026 11:16:25
Amaravati, Andhra Pradesh:

Big Gift To Employees: దసరా పండుగ నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం వరాలు కురిపిస్తోంది. ఉద్యోగులు, పింఛన్‌దారులకు సంబంధించిన సమస్యలు, డిమాండ్లు పరిష్కరిస్తోంది. దసరా సమయంలో కరువు భత్యం (డీఏ) ప్రకటించిన ప్రభుత్వం అనంతరం దీపావళి, సంక్రాంతి పండుగకు కూడా గుడ్‌న్యూస్‌ ప్రకటించింది. తాజాగా మరో వరం ప్రకటించింది. ఉద్యోగులు, పింఛన్‌దారులకు సంబంధించి ప్రకటన చేసింది. ప్రభుత్వం ప్రకటించిన తీపి కబురుతో ఉద్యోగ వర్గాలకు భారీ ప్రయోజనం లభించనుంది.

Also Read: School Holiday: విద్యార్థులకు పండుగే.. స్కూళ్లకు నాలుగు రోజులు సెలవు?

​ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బిల్లుల చెల్లింపుల్లో పురోగతి లభించింది. వివిధ రకాల బిల్లులు భారీగా పెండింగ్‌లో ఉండడంతో తాజాగా కొంత ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. విడుదల చేసిన బిల్లుల్లో టీఏ, టీటీఏ బిల్లులు ఉన్నాయి. 1 ఏప్రిల్ 25 నుంచి ఉద్యోగులకు సంబంధించిన టీఏ, టీటీఏ బకాయిల కోసం సుమారు రూ.150 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీజీఎల్‌ఐ బిల్లులకు సంబంధించి మెచ్యూర్ అయిన పాలసీలు, లోన్ పేమెంట్లకు సంబంధించిన బిల్లులు ప్రభుత్వం క్లియర్‌ చేసింది. ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన జీపీఎఫ్‌ బకాయిలు కూడా ప్రభుత్వం చెల్లించింది. ఇక రిటైర్డ్ ఉద్యోగుల సరెండర్ లీవ్ చెల్లింపుల ప్రక్రియ కూడా చేయగా.. వాటికి సంబంధించి బిల్లులు ప్రభుత్వం విడుదల చేసింది. వీటి చెల్లింపులతో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు భారీ ప్రయోజనం లభించనుంది.

Also Read: HIV Injection: బ్రేకప్‌ చెప్పాడని మాజీ ప్రియుడి భార్యకు HIV ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రియురాలు

 

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్‌.. ఇవి ఉల్లంఘిస్తే ఉద్యోగం ఊస్ట్‌!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 28, 2026 11:03:20
Peddapur, Achampet, Telangana:

Love Story Tragedy: అప్పుడప్పుడే సమాజం గురించే తెలుసుకునే వయసు.. ఈ వయసులో కలిగే ఆకర్షణను ప్రేమ అనుకున్న మైనర్లు తమ నిండు జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఆరు నెలల పరిచయాన్ని ప్రేమగా భావించి.. అంతటితో ఆగకుండా పెళ్లి వయసు రాకముందే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ పెళ్లి పెద్దలు చేయరని భావించి ఇంట్లో నుంచి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు బెదిరింపులకు పాల్పడడంతో ఇంటికి వచ్చి ఆ పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషాద సంఘటన తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

Also Read: School Holiday: విద్యార్థులకు పండుగే.. స్కూళ్లకు నాలుగు రోజులు సెలవు?

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బొమ్మనపల్లి గ్రామానికి దాసరి ప్రసాద్ (18)కు చిట్లకుంట గ్రామానికి చెందిన అమ్మాయి  (16 ఏళ్లు) మధ్య పరిచయమైంది. తమ ఆరు నెలల పరిచయాన్ని వారు ప్రేమగా భావించారు. తరచూ వీరిద్దరూ కలుసుకుంటూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని వారిద్దరూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారం రోజుల కిందట ఇంట్లో నుంచి పారిపోయారు. వారం నుంచి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: HIV Injection: బ్రేకప్‌ చెప్పాడని మాజీ ప్రియుడి భార్యకు HIV ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రియురాలు

పారిపోయిన విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబసభ్యులు ఫోన్‌లో బెదిరించారు. వారి బెదిరింపులతో భయపడిన ప్రసాద్‌, అమ్మాయి మంగళశారం తన సొంత గ్రామం బొమ్మన్‌పల్లికి గ్రామానికి చేరుకున్నారు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకుంటలేరని నిర్ధారించుకొని ఇంట్లో ఎవరు లేని సమయంలో అమ్మాయి, అబ్బాయి ఒకే చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. నిద్రపోయిన కుటుంబసభ్యులు తెల్లవారు లేచి చూసేసరికి తలుపు గడియ పెట్టి ఉంది. ఫోన్‌ చేసినా.. పిలిచినా పలకకపోవడంతో తలుపు పగులగొట్టారు.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్‌.. ఇవి ఉల్లంఘిస్తే ఉద్యోగం ఊస్ట్‌!

లోపలికి వెళ్లి చూడగా వారిద్దరూ ఒకే చీరకు ఉరేసుకుని విగతజీవులుగా మారిపోయారు. ఉన్న ఒక కొడుకు చనిపోవడంతో ప్రసాద్‌ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన చేరుకొని పరిశీలించారు. అబ్బాయి, అమ్మాయి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తమ అబ్బాయి చావు కారణమైన వారిని.. అమ్మాయి మేనమామ ఈదయ్యను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Jan 28, 2026 10:37:54
Hyderabad, Telangana:

Telangana PRC News: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రెండో వేతన సవరణ (PRC) ప్రక్రియ మరింత జాప్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పీఆర్సీ కమిటీ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించే యోచనలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది.

రాష్ట్రంలో పీఆర్సీ గడువు ఈ ఏడాది మార్చితో ముగియనుంది. అయితే, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ప్రభుత్వం నాలుగోసారి కూడా కమిటీ కాలపరిమితిని పెంచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

నివేదిక సిద్ధం..కానీ!
పీఆర్సీ కమిటీ తన నివేదికను ఇప్పటికే సిద్ధం చేసిందని, ప్రభుత్వం పిలిస్తే వెంటనే అందజేయడానికి సిద్ధంగా ఉన్నారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అయితే, ప్రభుత్వం నివేదికను స్వీకరించడానికి వెనుకాడుతోందని, కావాలనే ఆలస్యం చేస్తోందని సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

కమిటీ నేపథ్యం - కాలక్రమం..
నియామకం: 2023 అక్టోబర్ 2న (శివశంకర్ చైర్మన్‌గా).
తొలి గడువు: 2024 ఏప్రిల్ 2.
పొడిగింపులు: ఇప్పటివరకు మూడుసార్లు గడువు పొడిగించారు. ఇప్పుడు నాలుగోసారి పొడిగింపు దిశగా చర్చలు సాగుతున్నాయి.

ఫిట్‌మెంట్ లెక్కలు..
ఉద్యోగ సంఘాలు 51 శాతం ఫిట్‌మెంట్ కావాలని కోరుతుండగా, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం ఇలా ఉండవచ్చు.

ఫిట్‌మెంట్ శాతం అంచనా వ్యయం (వార్షికంగా)
30% (ప్రభుత్వ అంచనా) సుమారు ₹7,500 కోట్లు
51% (సంఘాల డిమాండ్) సుమారు ₹12,750 కోట్లు

నోట్: ఒక్క శాతం ఫిట్‌మెంట్ పెంచితే నెలకు ₹250–300 కోట్ల అదనపు భారం పడుతుంది.

ఆర్థిక పరిస్థితే అడ్డంకా?
రాష్ట్ర ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉండటం, ఇటీవల రెండు డీఏల (DA) ప్రకటించిన నేపథ్యంలో.. పీఆర్సీ అమలు ఆర్థికంగా పెను సవాలుగా మారింది. బడ్జెట్‌లో దీనిపై స్పష్టత రాకపోతే, ఉద్యోగుల నిరీక్షణ మరో ఆరు నెలలు తప్పదని తెలుస్తోంది.

వాస్తవానికి రెండో పీఆర్సీ 2023 జూలై 1 నుంచే అమలులోకి రావాలి. గడువులను పదేపదే పొడిగించడం వల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నామని ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనైనా దీనిపై కీలక ప్రకటన చేస్తుందో లేదో వేచి చూడాలి.

Also Read: Shambhavi Pathak: అజిత్ పవార్ విమాన ప్రమాదం..కాక్‌పిట్‌లో పైలట్స్ చివరి మాటలు..అసలేం జరిగిందంటే?

Also Read: Pakistan Boycott World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ టీమ్ బహిష్కరిస్తే..గ్రూప్-ఏ నుంచి సెమీస్‌కు వెళ్లే జట్లు ఇవే?!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top