icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505001
SShankerreddyFollow17 Jul 2024, 11:48 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Indian Mangoes: జపాన్ తిరస్కరించింది..ఆ దేశం మాత్రం ఎగబడి కొంటోంది.. భారతీయ మామిడి పండ్లకు వింత పరిస్థితి..!!

BBhoomi5m ago
Lakshmapur, Telangana:

Indian Mangoes Singapore Demand: మామిడిపండ్లను మన దేశంలో పండ్ల రాజు అని పిలుస్తుంటారు. మామిడిని పండించడంలో, తినడంలో, అమ్మడంలో భారత్ అగ్రదేశాల్లో ఒకటిగా నిలిచింది. మనదేశం మామిడి పండ్లను అత్యధికంగా పండించడమే కాదు.. యూఏఈ, యూకే, నేపాల్,  యూఏఎస్, జపాన్, కువైట్ వంటి అనేక దేశాలకు ఎగుమతి చేస్తుంది. అయితే  ఇటీవల, జపాన్ ప్లాంట్ క్వారంటైన్ అధికారులు తనిఖీ సమయంలో ఫ్యూమిగేషన్,  సంబంధిత చర్యలలో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ.. భారతదేశం నుండి ప్రీమియం మామిడి రకాల దిగుమతిని నిషేధించారు. ఇప్పుడు ఆ మామిడి పండ్లు విరివిగా అమ్ముడవుతున్నాయి.

జపాన్ దిగుమతిని నిషేధించిన మామిడి పండ్లలో కేసర్, అల్ఫోన్సో, లంగ్రా,  బంగనపల్లి వంటి అగ్రశ్రేణి మామిడి రకాలు ఉన్నాయి. భారతదేశంలోని సింగపూర్ హైకమిషన్ ఎక్స్ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేస్తూ, ఈ భారతీయ మామిడి రకాలకు సింగపూర్‌లో అధిక డిమాండ్ ఉందని పేర్కొంది. సింగపూర్‌లో భారతీయ మామిడి పండ్లకు క్రేజ్ ఉందని రాసుకొచ్చారు. ఇక్కడి సూపర్‌మార్కెట్లలో వివిధ భారత రాష్ట్రాల మామిడి పండ్లు వేగంగా అమ్ముడుపోతున్నాయని తెలిపారు. 

భారతదేశం అనేక దేశాలకు మామిడి పండ్లను ఎగుమతి చేస్తుంది. భారతదేశపు ప్రీమియం మామిడి పండ్లకు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో భారీ డిమాండ్ ఉంది. APEDA గణాంకాల ప్రకారం.. 2024లో భారతదేశం 20 మిలియన్ డాలర్ల విలువైన 12,897 మెట్రిక్ టన్నులకు పైగా మామిడి పండ్లను యూఏఈకి ఎగుమతి చేసింది. అదేవిధంగా, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, ఖతార్ మరియు కువైట్ వంటి దేశాలలో మన మామిడి పండ్లకు ఎక్కువ డిమాండ్ ఉంది.

ప్రెస్ ఇన్ఫర్మెషన్ బ్యూరో తెలిపిన వివరాల ప్రకారం... 2024-25 సంవత్సరంలో మామిడి ఉత్పత్తి 228.37 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంటుందని అంచనా వేసింది. అయితే ఇది ప్రపంచంలోనే అత్యధికమని పేర్కొంది. భారతదేశపు ప్రత్యేక మామిడి రకాల గురించి మాట్లాడితే.. అల్ఫోన్సో, బాగన్‌బల్లి, కేసర్, తోతాపురి, నీలం, సింధూర, మల్లిక వంటి మామిడి పండ్లకు విదేశాల్లో మంచి ఆదరణ ఉంది. విదేశాలతో పాటు, భారతదేశంలో కూడా ఈ మామిడి పండ్లకు భారీ డిమాండ్ ఉంది.  వీటికి మంచి ధరలు కూడా లభిస్తాయి. దేశంలోని ప్రధాన మామిడి ఉత్పత్తి రాష్ట్రాలు  ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, గుజరాత్ మధ్యప్రదేశ్  లో మామిడితోటలను భారీగా సాగు చేస్తున్నాయి. 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

0
0
Report

Monsoon Rain Alert: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..మరో 12 రోజుల్లో వానలే వానలు!

Nunna, Vijayawada, Andhra Pradesh:Monsoon Rain Alert Update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారిపోతుంది. నిన్న, మొన్నటి వరకు తీవ్రమైన ఎండలు, వడగాలులతో సతమతమవ్వగా.. ఇప్పుడు వడగళ్లు, అకాల వర్షాలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాగల కొన్ని గంటల్లో తీవ్రమైన వాతావరణ మార్పులు సంభవించవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఓ ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఇప్పటికే లక్షద్వీప్‌లోకి వచ్చినట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. మరో 12 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలకరి జల్లు పలకరించే అవకాశాలు కనిపస్తున్నాయి.
0
0
Report

Anti Ageing Drinks: 40 ఏళ్ల వయసులోనూ చర్మం ముడతలు రాకుండా తళతళ మెరిసిపోవాలంటే చిట్కా ఇదే!

Hyderabad, Telangana:

Anti Ageing Collagen Drinks: 40 ఏళ్లు దాటిన తర్వాత కూడా చర్మం ముడతలు పడకుండా, సహజమైన కాంతితో యవ్వనంగా మెరవాలనే కోరిక అందరికీ ఉంటుంది. బాహ్య సౌందర్యం అనేది కేవలం పైపూతలతో వచ్చేది కాదు. మనం తీసుకునే ఆహారానికి అది ప్రతిబింబం. కెమికల్స్ ఉన్న కాస్మెటిక్స్ కంటే, మన వంటగదిలోనే లభించే సహజ సిద్ధమైన పదార్థాలతో ఇంట్లోనే 'నేచురల్ కొల్లాజెన్ డ్రింక్స్' తయారు చేసుకోవచ్చు. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మాన్ని నిత్య యవ్వనంగా ఉంచే 5 అద్భుతమైన డ్రింక్స్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

ఉసిరి, కలబంద జ్యూస్..
ఉసిరికాయలో కొల్లాజెన్ ఉత్పత్తికి అత్యంత కీలకమైన విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కలబంద చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్ చేస్తుంది. ఒక గ్లాస్ నీటిలో 2 స్పూన్ల ఉసిరి రసం, 1 స్పూన్ కలబంద గుజ్జు (అలోవెరా జెల్) బాగా కలపాలి. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగడం వల్ల ముఖంపై నల్లటి మచ్చలు తగ్గి, చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

బీట్‌రూట్, క్యారెట్ జ్యూస్..
దీనిని చర్మానికి ఒక 'మిరాకిల్ డ్రింక్' అని చెప్పవచ్చు. ఇందులో విటమిన్ ఎ, సి లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఒక చిన్న బీట్‌రూట్, ఒక క్యారెట్, చిన్న అల్లం ముక్క కలిపి మిక్సీ పట్టి రసం తీసుకోవాలి. రుచి కోసం కొద్దిగా నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇది రక్తాన్ని శుద్ధి చేసి, చర్మానికి గులాబీ రంగు ఆరోగ్యకరమైన మెరుపును ఇస్తుంది.

సిట్రస్ ఫ్రూట్ జ్యూస్..
నిమ్మ, నారింజ, బత్తాయి వంటి సిట్రస్ పండ్లలో ఉండే విటమిన్ సి.. కొల్లాజెన్ అణువులను బంధించడానికి, చర్మం సాగకుండా గట్టిగా ఉంచడానికి సహాయపడుతుంది. తాజా ఆరెంజ్ జ్యూస్ లేదా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, కొద్దిగా తేనె కలుపుకుని ఉదయాన్నే తాగాలి. ఇది చర్మంపై వయసు రీత్యా వచ్చే ముడతలు, సన్నని గీతలను నిరోధిస్తుంది.

గ్రీన్‌ టీ..
గ్రీన్‌ టీలో ఉండే ఈజీసీజీ అనే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, పాలీఫెనాల్స్ దెబ్బతిన్న చర్మ కణాలను పునరుద్ధరిస్తాయి. రోజుకు రెండు సార్లు చక్కెర లేకుండా వేడి గ్రీన్‌ టీ తాగడం అలవాటు చేసుకోవాలి. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. మొటిమలు, జిడ్డును తగ్గించడంతో పాటు సన్ ప్రొటెక్షన్‌లా పనిచేస్తుంది.

పసుపు కలిపిన పాలు..
ఆయుర్వేదంలో పసుపు పాలను సహజ యాంటీ బయోటిక్‌గా చెప్తారు. పసుపులో ఉండే 'కర్కుమిన్' చర్మ కణాల ఆక్సీకరణను అరికడుతుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో చిటికెడు ఆర్గానిక్ పసుపు కలిపి తాగాలి. ముఖంపై మచ్చలు తగ్గుతాయి. చర్మ అలర్జీలు నయమవడంతో పాటు మంచి నిద్ర పడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిట్కాలు..
చర్మం పొడిబారకుండా తేమగా ఉండాలంటే రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తాగాలి. కొల్లాజెన్ పెరగడానికి సోయా, గుడ్లు, పప్పు ధాన్యాలు వంటి ప్రోటీన్ ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలి. ఎండలోకి వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ వాడటం లేదా చర్మాన్ని కవర్ చేసుకోవడం మరువకూడదు.

(గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా అలర్జీలు ఉంటే, ఈ సహజ పానీయాలను మీ దినచర్యలో చేర్చుకునే ముందు ఒకసారి వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం మంచిది. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: మగాళ్లలో ఉత్సాహాన్ని తట్టిలేపే ఆయుధం..అంగట్లో దొరికే అసలు సిసలైన పండు రహస్యం తెలుసా?

Also Read: ప్రభుత్వ క్యాంటీన్‌లో రూ.5లకే చేపల కూరతో భోజనం..సీఎం కీలక నిర్ణయం వెనుక నిజమిదే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Hyderabad Real Estate: అక్కడ తవ్వితే బంగారం వస్తుందో లేదో కానీ.. ఎకరం భూమిని అమ్మితే రూ. 237 కోట్లు వచ్చింది.. ఇదేం రేటయ్యా సామీ..!!

BBhoomi1h ago
Lakshmapur, Telangana:

Hyderabad Real Estate: తెలంగాణ.. రియల్ ఎస్టేట్ కు అడ్డగా మారింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో హైదరాబాద్ దూసుకుపోతోంది. తాజాగా రాయదుర్గంలో ఎకరం భూమి ధర రూ. 237కోట్లు పలికింది. రాయదుర్గం పాన్ మక్తాలో సర్వే నెంబర్ 83/1లో 6 ఎకరాల 29 గుంటల భూమికి టీజీఐఐసీ  వేలం వేసింది. ఈ రికార్డు ధర పలుకుతూ కొత్త రికార్డును క్రియేట్ చేసింది. గత సంవత్సరం ఇదే ప్రాంతంలో ఎకరం భూమి ధరరూ. 177 కోట్లతో రికార్డు ధర పలికింది. 

రాయదుర్గంలోని నాలెడ్జీ సిటీ దగ్గరలో ఉన్న ఈ భూమి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైందని చెప్పాలి. ఎందుకంటే ఐటీ కంపెనీలు, హైరైజ్ టవర్లు, మెట్రో కనెక్టివిటీ ఉన్నాయి. దీంతో దేశీయ, అంతర్జాతీయ డెవలపర్లు ఈ వేలంలో పోటాపోటీగా పాల్గొన్నారు. టీజీఐఐసీ నిర్ణయించిన కనీస ధర రూ. 139కోట్లు ఉండగా.. వేలం ముగిసే సమయానికి అది దాదాపు 237కోట్లకు చేరింది. ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో అత్యంత ఖరీదైన ప్రాంతాలతో పోల్చితే.. హైదరాబాద్ లోని ఈ ధర ఇప్పుడు భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలోనే టాప్ రేంజ్ లో నిలిచిందని చెప్పవచ్చు. 

Also Read: పరిశ్రమల మధ్యలో ఉన్నా సరే తగ్గేదేలే.. జీడిమెట్లలో

ఇక రాయదుర్గం ప్రాంతానికి ఉన్న డిమాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడి భూమి బంగారం కంటే ఎక్కువ విలువైందని ఇన్వెస్టర్లు భావిస్తుంటారు. ప్రస్తుతం వేలం వేసిన 6 ఎకరాల స్థలం హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఓఆర్ఆర్ కు అత్యంత సమీపంలో ఉండటమే దీనికి ప్రధాన కారణమని చెప్పాలి. గతంలో కోకాపేట నియోపోలిస్ లో ఎకరం రూ. 100కోట్లు దాటినప్పుడు అందరు షాక్ అయ్యారు. కానీ ఇప్పుడు రాయదుర్గం ఆ రికార్డును మరో లెవల్ కు తీసుకెళ్లింది. ఈ ఒక్క వేలం పాట ద్వారా ప్రభుత్వ ఖజానాకు వేలకోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని చెప్పాలి. 

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్ అగ్రరాజ్యం అమెరికాతో పోటీ పడుతుందని ఇప్పుడు మార్కెట్లో చర్చ మొదలైంది. ఏది ఏమైనా ఈ రికార్డు ధర హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను మరోస్థాయికి తీసుకెళ్లిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

Also Read:  మే 28 నుంచి తెలంగాణలో పెరగనున్న భూముల ధరలు

 

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

 

0
0
Report

Fish Meals in Canteen: ప్రభుత్వ క్యాంటీన్‌లో రూ.5లకే చేపల కూరతో భోజనం..సీఎం కీలక నిర్ణయం వెనుక అస్సలు నిజమిదే!

Chhotobainan, West Bengal:

Fish Meals For 5 Rupees: పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా కొలువుదీరిన ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే రాజకీయంగానే కాకుండా పరిపాలనా పరంగా సీఎం సువేందు అధికారి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. తాజాగా దేశంలోనే ఎక్కడా లేని ఒక వినూత్న సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టారు. బెంగాలీల జీవితాల్లో విడదీయరాని భాగమైన చేపల భోజనాన్ని కేవలం రూ.5 లకే అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.

రూ.5కే చేప కర్రీతో భోజన పథకం వివరాలు..
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 400 కేంద్రాలలో ఈ ప్రత్యేక క్యాంటిన్లను ఏర్పాటు చేసి పేదలకు తక్కువ ధరలోనే నాన్-వెజ్ భోజనాన్ని అందిస్తారు. వారంలో రెండు రోజుల పాటు ఈ 'ఫిష్ మీల్స్' పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ క్యాంటిన్లకు సంబంధించి రెండు పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. త్వరలోనే పేరును ఖరారు చేయనున్నారు.

భారతదేశంలో పేదల ఆకలి తీర్చడం కోసం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సబ్సిడీ క్యాంటిన్ల వ్యవస్థ నడుస్తోంది. తమిళనాడులో 'అమ్మా క్యాంటిన్', ఆంధ్రప్రదేశ్‌లో 'అన్నా క్యాంటిన్', కర్ణాటకలో 'ఇందిరా క్యాంటిన్', రాజస్థాన్‌లో 'అన్నపూర్ణ రసోయి'..ఈ క్యాంటిన్లన్నింటిలోనూ కేవలం రూ.5 లేదా రూ.10 లకే శాకాహార అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాన్ని అందిస్తున్నారు. అయితే, ఒక ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ.5 లకే చేపల కూరతో నాన్-వెజ్ భోజనం ప్రకటించడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి.

అసలు 'టార్గెట్' ఏంటి?
సువేందు అధికారి తీసుకున్న ఈ సంచలన నిర్ణయం వెనుక బలమైన రాజకీయ వ్యూహం దాగి ఉందనే చర్చ నడుస్తోంది. దీనికి ప్రధాన కారణాలు అనేకం ఉన్నాయి.

టీఎంసీ ప్రచారానికి గట్టి కౌంటర్..
గత ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఒక బలమైన ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్లింది. "బెంగాల్‌లో ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే.. ఇక్కడి ప్రజల ఆహార అలవాట్లపై ఆంక్షలు విధిస్తుందని, చేపలు, మాంసాహారాన్ని నిషేధిస్తుందని" ప్రచారం చేసింది. ఇప్పుడు ఏకంగా రూ.5కే చేపల భోజనం పెడుతూ సువేందు ప్రభుత్వం ఆ ఆరోపణలకు గట్టి సమాధానం ఇచ్చింది.

బెంగాలీ సంస్కృతికి పెద్దపీట..
బెంగాలీల సంస్కృతి, జీవన విధానంలో 'చేపల భోజనం' ఒక ముఖ్య భాగం. తాము బెంగాలీల అలవాట్లను, వారి సంస్కృతిని గౌరవిస్తున్నామనే బలమైన సంకేతాన్ని ప్రజల్లోకి పంపడానికే సీఎం సువేందు అధికారి ఈ మాస్టర్ ప్లాన్ వేశారు.

ఆపరేషన్ ఆకర్ష్..
ఒకవైపు ప్రజాకర్షక పథకాలను ప్రకటిస్తూనే, మరోవైపు టీఎంసీ బలహీనపడేలా ఆ పార్టీ ముఖ్య నేతలను తమ వైపు తిప్పుకునేందుకు 'ఆపరేషన్ ఆకర్ష్' కు కూడా సువేందు సర్కార్ సిద్ధమైంది.

మొత్తానికి, బెంగాల్‌ను రాజకీయంగా తమ కైవసం చేసుకోవడంతో పాటు, క్షేత్రస్థాయిలో పేద ప్రజలకు దగ్గర అవ్వడానికి ముఖ్యమంత్రి సువేందు అధికారి వేసిన ఈ 'ఫిష్ కర్రీ' వ్యూహం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: రాత్రికి రాత్రే అదృశ్యమైన మహేష్ హీరోయిన్..మాఫియా బెదిరింపులు, ఇప్పుడెలా ఉందంటే?

Also Read: విశాఖలో దారుణం.. చున్నీతో గొంతు నులిమి కిరాతకంగా భార్తను చంపేసిన భార్య

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Silver Rate: వెండి కొంటున్నారా.. కాస్త ఆగండి.. త్వరలోనే కుప్పకూలనున్న సిల్వర్ రేట్స్.. ఏకంగా 80,000..!!

BBhoomi6h ago
Lakshmapur, Telangana:

Silver Rate:  గ్లోబల్ మార్కెట్లో బంగారంతో పోటి పడి వెండి ధరలు దూసుకుపోతున్నాయి. కొన్ని నెలల క్రితం వరకు వెండి మార్కెట్లో అత్యంత ఖరీదైన లోహంగా నిలిచింది. బంగారమే కాదు.. వెండిది కూడా పైచేయి అవుతుందని సామాన్యులు ఆందోళన చెందారు. భారీగా ధరలు పెరగడంతో ఇన్వెస్టర్లు వేగంగా వెండిలో పెట్టుబడులు పెట్టారు. బంగారం కంటే వెండి ధర భారీగా పెరుగుతుందని సోషల్ మీడియా కూడా హోరెత్తించింది. అయితే తాజాగా నివేదికలు మాత్రం త్వరలోనే వెండి ధరలు కుప్పకూలనున్నట్లు 

2025లో వెండి ధరలు దాదాపు 140శాతం మేర పెరిగాయి. 2026 జనవరిలో వెండి ధర ఔన్సుకు 120 డాలర్లు దాటింది. దీంతో దేశంలో కిలో వెండి ధర 4లక్షలకు పైగానే పలికింది. ఈ తరుణంలో ఒక కొత్త వెండి సూపర్ సైకిల్ ప్రారంభమైందంటూ  మార్కెట్లో సందడి నెలకొంది. సాధారణంగా ధరలు పెరిగినప్పుడు ఆ ధరల గురించి ప్రతీ ఒక్కరూ చర్చిస్తుంటారు. వెండి, బంగారం విషయంలోనూ అదే జరిగింది. భవిష్యత్తులో బంగారం, వెండి కొనగలమా అనే భయం మొదలైంది. 

ఇప్పుడు అదే భయం వెండి మార్కెట్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వెండి ధరల పతనం ఇంకా ముగియలేదని విదేశీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కానీ మన దేశంలో మాత్రం వెండి డిమాండ్ భారీగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో వెండి ధరలు కిలోకు రూ. 2.75లక్షలు నుంచి రూ.2లక్షలకు పడిపోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. అంటే కిలో వెండి ధర రూ. 70,000 నుంచి రూ. 80,000కు పడిపోయే అవకాశం ఉందని చెబుతున్నాయి. వెండి ఎందుకు కుప్పకూలనుంది?  భారత్ లో వెండికి డిమాండ్ ఎందుకు తగ్గుతోంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

వెండి ధరలు ఎందుకు కుప్పకూలనున్నాయి? 
వెండి కథ .. బంగారం కథకు కొద్దిగా భిన్నంగా ఉంటుంది. బంగారాన్ని ప్రజలు ఒక సురక్షిత పెట్టుబడిగా భావిస్తుంటారు. సంక్షోభం వచ్చినప్పుడు, ఆపద సమయంలో బంగారం ఆసరాగా నిలుస్తుందని వారి  నమ్మకం. అందుకే బంగారాన్ని కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. కానీ వెండి కేవలం పెట్టుబడి లోహం మాత్రమే కాదు.. ఇదొక పారిశ్రామిక లోహం కూడా. మీరు వాడే మొబైల్ ఫోన్ల నుంచి కంప్యూటర్లు, సోలార్ ప్యానెల్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఏఐ మౌలిక సదుపాయాలు, ఎలక్ట్రానిక్స్ వరకు అన్నింటిలోనూ వెండిని ఉపయోగిస్తుంటారు. మరింత అర్థమయ్యేలా చెప్పాలంటే వెండి ధర కేవలం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పై మాత్రమే ఆధారపడి ఉండదు. దాని అసలైన బలం పరిశ్రమ డిమాండ్ లో ఉంటుంది.  ఈ డిమాండ్ రానున్న రోజుల్లో తగ్గిపోతుందని యూబీఎస్ తన నివేదికలో పేర్కొంది. 
 
ఇది వినడానికి చిన్న ప్రశ్న వలే కనిపించినా.. మార్కెట్లో దీని పరిణామాలు భారీగానే ఉన్నాయి. వెండి ధర భారీగా పెరిగిపోతుండటంతో పరిశ్రమలు దాని వాడకాన్ని తగ్గిస్తున్నాయి.  భారీ ధరకు వెండిని కొనుగోలు చేయడం లాభదాయకమేనా అని కంపెనీలు ఆలోచిస్తున్నాయి. ధరలు భారీగా పెరిగినంత కాలం డిమాండ్ క్షీణించడం లేదంటే బలహీనమైన డిమాండ్ కొనసాగే అవకాశం ఉందని యూబీఎస్ స్పష్టం చేసింది. అంటే పరిశ్రమలు వెండిని కొనుగోళు చేయడం తగ్గిస్తే ఆటోమెటిగ్గా ధరలు పతనం అవుతాయన్నమాట. 

పెరుగుట, విరుగుటకే :
పెరుగుట, విరుగుటకే అనే సామేత వలే..  వెండి ఎంత వేగంగా పెరిగిందో.. పతనం కూడా అంతే వేగంగా కొనసాగింది. ఒక ఔన్సుకు 120 డాలర్ల గరిష్ట స్థాయికి చేరుకున్న వెండి ధర.. అంతే వినాశనంతో ఒక్క రోజులోనే దాదాపు 30శాతం మేర పడిపోయింది. మార్చి 2026 నాటికి వెండి ఔన్సుకు 67.60 డాలర్లకు చేరుకుంది. అంటే దాదాపు రెండున్నర లక్షలు తగ్గింది.  అక్కడి నుంచి కొద్దిగా కోలుకున్నప్పటికీ మార్కెట్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం వెండి ధర ఔన్సుకు 75 నుంచి 78డాలర్ల మధ్య కొనసాగుతోంది. ఆ తర్వాత అమ్మకాలు భారీగా పడిపోవడంతో ఔన్సుకు సుమారు 72 డాలర్లకు పతనం అయ్యింది. ఈ పతనం మరింత కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. 

భారత్ లో వెండి ధర ఎంత పడిపోయే అవకాశం ఉంది? 
అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్సుకు 60 డాలర్లకు చేరుకుంటే డాలర్ మారకం సుమారు 95గా ఉంటే భారత్ లో వెండి ధర కిలోకు సుమారు రూ. 2.15లక్షల నుంచి రూ. 2.30లక్షలకు పడిపోయే అవకాశం ఉంది. ఒకవేళ వెండి ధర 55 డాలర్లు దాటితే దేశంలో దాని ధర కిలోకు రూ. 1.95 లక్షల నుంచి 2.10లక్షల వరకు పడిపోయే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత కిలో రూ. 2.75 లక్షల నుంచి రూ. 70,000 నుంచి రూ. 80,000 వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ వార్త విన్న తర్వాత ఇన్వెస్టర్లు ఆందోళన చెందడం సహజమే. కానీ వెండి పతనానికి చాలా కారణాలు ఉన్నాయి. 

ప్రపంచ ఆర్థిక మందగమనం గురించిన భయం:
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనపడితే, కర్మాగారాలు నెమ్మదిస్తాయి. టెక్నాలజీ రంగం నుంచి వెండికి డిమాండ్ తగ్గుతుంది. దీనివల్ల వెండి వినియోగం కూడా తగ్గుతుంది. 

యూఎస్ ఫెడరల్ రిజర్వ్: 
యూఎస్‌లో వడ్డీ రేట్లు మళ్లీ పెరిగితే, బంగారం, వెండి వంటి లోహాలపై ఒత్తిడి పెరగవచ్చని మాక్వారీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు, పెట్టుబడిదారులు స్థిర ఆదాయం, డాలర్ ఆస్తుల వైపు మొగ్గు చూపుతారు. 

బలమైన డాలర్:
డాలర్ ఎంత బలంగా ఉంటే, విలువైన లోహాలపై ఒత్తిడి అంత ఎక్కువగా ఉంటుంది. 

మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు:
ఇరాన్ యుద్ధం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల సమయంలో, వెండి సురక్షిత పెట్టుబడిగా కొనుగోళ్లను ఆకర్షించింది. కానీ ఉద్రిక్తతలు తగ్గితే, ఆ మద్దతు బలహీనపడవచ్చు. ప్రస్తుతం వెండి ప్రాథమికంగా అధిక విలువ కలిగి ఉందని హెచ్‌ఎస్‌బిసి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. వాస్తవ డిమాండ్, ఆర్థిక పరిస్థితులతో పోలిస్తే ధరలు విపరీతంగా పెరిగాయి. భవిష్యత్తులో బంగారం,వెండి వేర్వేరు మార్గాల్లో పయనించవచ్చని ఆ బ్యాంకు భావిస్తోంది. బంగారం భారీగా పెరిగే అవకాశం ఉండవచ్చు. కానీ వెండిపై ఒత్తిడి పెరుగుతుందని తెలిపింది.  అయితే మార్కెట్ పూర్తిగా బేరిష్‌గా మారలేదు.

వాస్తవానికి, వెండి అతిపెద్ద బలం దాని భవిష్యత్తులోనే ఉంది. గ్రీన్ ఎనర్జీ, సోలార్ ప్యానెళ్లు, ఈవీలు, ఏఐ మౌలిక సదుపాయాలు, ఎలక్ట్రానిక్స్ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రంగాలన్నింటిలోనూ వెండి అవసరం అవుతుంది. దీర్ఘకాలంలో వెండి డిమాండ్ మళ్లీ పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. డాలర్ బలహీనపడితే , భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ పెరిగితే, లేదా పారిశ్రామిక డిమాండ్ బలంగా పుంజుకుంటే, వెండి తిరిగి పుంజుకునే ఛాన్స్ ఉంటుంది. 

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Motorola Edge: 50MP కెమెరా, డైమెన్సిటీ 8500 ప్రొసెసర్‌తో Motorola కొత్త ప్రీమియం ఫోన్.. వివరాలు ఇవే!

Hyderabad, Telangana:

Motorola Edge 70 Pro Plus Launch Date: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సమస్త మోటార్ల భారత మార్కెట్‌లోకి మరో ప్రీమియం మొబైల్ ను విడుదల చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.. దీనిని కంపెనీ ఎడ్జ్ సిరీస్ లోనే అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇది మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ (Motorola Edge 70 Pro Plus) పేరుతో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా మార్కెట్లోకి అడుగుపెట్టడానికి ముందే ఈ మొబైల్ ప్రముఖ బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్ గీక్‌బెంచ్ (Geekbench) లిస్టింగ్‌లో  ప్రత్యక్షమవడం విశేషం. దీనివల్ల ఫోన్ కు సంబంధించిన వివిధ రకాల కీలకమైన ఫీచర్లతో పాటు ప్రాసెసర్ వివరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. జూన్ మొదటి వారంలోని ఈ మొబైల్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది..

గీక్‌బెంచ్ ద్వారా లీక్ అయిన వివరాల ప్రకారం.. మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 8500 (MediaTek Dimensity 8500) ప్రొసెసర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది 4 నానోమీటర్ (4nm) ఆర్కిటెక్చర్‌పై తయారుచేసిన అప్పర్ మిడ్-రేంజ్ చిప్‌సెట్ గా సమాచారం. అంటే దాదాపు ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫ్లాగ్‌షిప్ స్థాయి పనితీరును అందించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే గీక్ బెంచ్ టెస్టింగ్‌లో భాగంగా సింగిల్ స్కోర్ 1,722 పాయింట్లుగా, మల్టీ-కోర్ స్కోరు 5,623 పాయింట్లుగా నమోదైనట్లు కూడా సమాచారం. 

ఇక ఈ మొబైల్ కు సంబంధించిన ర్యామ్ వివరాలు లోకి వెళ్తే.. దీనిని మోటరోలా కంపెనీ బేస్ వేరియంట్ ను 12gb ర్యామ్ సపోర్ట్‌తో అందుబాటులోకి తీసుకురాబోతోంది. అయితే, వినియోగదారుల అవసరాల కోసం కంపెనీ ఇందులో 16 జీబీ ర్యామ్ వేరియంట్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఇందులో కంపెనీ Android 16 ఆపరేటింగ్ సిస్టంతో.. క్లీన్ యూజర్ ఇంటర్ఫేస్‌తో అందుబాటులోకి తీసుకురాబోతోంది.. అదేవిధంగా మరెన్నో కొత్త ఫీచర్లను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఫోటోగ్రఫీ ప్రియులను దృష్టిలో పెట్టుకొని మోటరోలా కంపెనీ ఈ మోడల్‌లో అద్భుతమైన టాప్ ఎండ్ కెమెరా సెటప్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులోని వెనక భాగంలో అద్భుతమైన 50 మెగాపిక్సెల్ (50MP) ప్రధాన కెమెరాను కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. దీనితోపాటు అదనంగా మరో 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంటుంది. ఇవే కాకుండా ఇందులో ప్రత్యేకంగా ప్రధాన కెమెరా సోనీ సెన్సార్‌తో అందుబాటులోకి రావడం విశేషం. అలాగే ఇది చాలా ప్రత్యేకమైన ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో పాటు 50x డిజిటల్ జూమ్ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. దీనివల్ల ఫోటో నాణ్యత మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయట..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ఇక ఈ మొబైల్‌లో కంపెనీ చాలా శక్తివంతమైన బ్యాటరీని అందుబాటులోకి తీసుకురాబోతోంది.  ఇందులో  6500mAh బ్యాటరీ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. భారత మార్కెట్లో బేస్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.45 వేల నుంచి ప్రారంభమవుతుంది. ఇక హై ఎండ్ వేరియంట్ ధర రూ.49 వేలు ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే మార్కెట్లోకి ఈ స్మార్ట్‌ఫోన్‌ విడుదలయితే మొదటగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మొబైల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను జూన్ మొదటి వారంలో జరిగే అధికారిక లాంచ్ ఈవెంట్ లో భాగంగా వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Karimnagar: యాసంగి వడ్లు అమ్ముడుపోలే.. కొత్త పంటకు పెట్టుబడి ఎల్లా? రైతుల ఆవేదన..

Hyderabad, Telangana:

Karimnagar Latest News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరి పండించిన అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఒకవైపు వానకాలం సీజన్ సమయం ప్రారంభమై రోహిణి కార్తె ప్రవేశించినప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో దాన్యం కొనుగోలు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. కొత్త పంట సాగుకు నారు పోసే సమయం వచ్చినప్పటికీ.. పాత పంట అమ్ముడుపోక జిల్లాలోని రైతాంగం ఆందోళన చెందుతోంది. నెలలో తరబడి ధాన్యపు కుప్పల ముందే కాపలా కాస్తూ.. కొనుగోలు కేంద్రాల్లోనే అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు.

ఉమ్మడి జ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఐకెపితో పాటు సహకార సంఘాల కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తెచ్చి వారాలు గడుస్తున్నప్పటికీ అధికారులు, మిల్లు యజమానులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తూకాలు వేయడంలో జాప్యంతో పాటు గైడ్లైన్స్ పేరుతో తరుగు తీయడం, బార్‌కోడ్ తదితర సాంకేతిక కారణాలవల్ల కొనుగోళ్ల ప్రక్రియ తీవ్రంగా ఆలస్యం అవుతోంది. దీనికి తోడు అకాల వర్షాలు కురుస్తుండడంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న దాన్యం తడిసి ముద్దవుతోంది.. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు..

ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభమైంది. జూన్ మొదటి వారంలోనే విత్తనాలు వేసి.. నారుమడులు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.. కానీ గత యాసంగి పంట ఇంకా అమ్ముడుపోకపోవడంతో రైతుల చేతుల్లో చిల్లి గవ్వలేని పరిస్థితి నెలకొంది.. ధాన్యం అమ్ముడైతేనే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతాయి.. ఆ డబ్బులతోనే విత్తనాలతో పాటు ఎరువులు కొనుగోలు చేసి కొత్త పంటకు పెట్టుబడి పెట్టాలని రైతులు భావిస్తారు. అయితే కొనుగోలు సాగకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు అప్పులు ఇచ్చేందుకు కూడా ముందుకు రాకపోవడం రైతులను ఇరకాటంలో పడేసింది..

Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..

జిల్లా యంత్రాంగంతో పాటు మార్కెటింగ్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి కొనుగోలు కేంద్రాల్లో మిల్లుల కేటాయింపు సమస్యలను పరిష్కరించాలని.. తూకాలను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. వర్షాల ముప్పు పొంచి ఉన్నందున యుద్ద ప్రాతిపదికన ధాన్యాన్ని మిల్లులకు తరలించి.. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని పల్లెల్లో డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ప్రభుత్వం స్పందించి ఆదుకోకపోతే ఈ ఏడాది వానాకాలం సాగు ఆలస్యం అయ్యే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు సైతం హెచ్చరిస్తూ వస్తున్నారు..

Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Vaibhav Suryavanshi: భారీగా పెరిగిన వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ..15 ఏళ్ల వయసులో కోట్లు సంపాదిస్తున్నాడు!

Hyderabad, Telangana:

Vaibhav Suryavanshi Net Worth: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ప్రస్తుతం ఓ కుర్రాడి పేరు మారుమోగిపోతుంది. అదే వైభవ్ సూర్యవంశీ. వయసు చిన్నదే అయినా, బ్యాటింగ్‌కు వస్తే చాలు ప్రత్యర్థి బౌలర్ ఎవరనేది చూడకుండా బౌండరీలే లక్ష్యంగా చెలరేగిపోయే ఈ యువ సంచలనం, యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. కేవలం ఆటలోనే కాదు, సంపాదనలోనూ ఈ 15 ఏళ్ల కుర్రాడు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా ఈ సెన్సేషనల్ ప్లేయర్ నెట్ వర్త్ (ఆస్తుల విలువ) గురించిన ఆసక్తికర విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఐపీఎల్‌లో రూ.1.1 కోట్ల ప్రయాణం!
బిహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ, 2025లో కేవలం 14 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున ఐపీఎల్ బరిలోకి దిగాడు. ఆ ఏడాది మెగా వేలంలో రాజస్థాన్ ఫ్రాంచైజీ ఏకంగా రూ.1.1 కోట్లు పెట్టి ఈ కుర్రాడిని కొనుగోలు చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ, తాను ఆడిన మూడో మ్యాచ్‌లోనే కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది, తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక ఇటీవల జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి సృష్టించిన విధ్వంసం క్రికెట్ అభిమానులకు పూనకాలు తెప్పించింది.

వైభవ్ సూర్యవంశీ ఆస్తుల వివరాలు..
ప్రస్తుతం వైభవ్ నెట్ వర్త్ సుమారు రూ.7 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఒకవేళ బ్రాండ్ స్పాన్సర్‌షిప్ ఒప్పందాలను కూడా కలిపితే ఈ మొత్తం రూ.10 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. అతడి ఆదాయ వనరుల వివరాలు ఇలా ఉన్నాయి. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ నుండి ప్రతి సీజన్‌కు రూ.1.1 కోట్ల శాలరీ లభిస్తుంది. అలాగే ఐపీఎల్‌లో ఒక్కో మ్యాచ్‌కు రూ.7.5 లక్షల చొప్పున లభిస్తుంది. ఇప్పటివరకు 22 మ్యాచ్‌లు ఆడిన వైభవ్, మ్యాచ్ ఫీజుల రూపంలోనే దాదాపు రూ. 1.65 కోట్లు సంపాదించాడు.

అలాగే వైభవ్ సూర్యవంశీకి ముంబైలో రూ.3 కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్‌మెంట్, అలాగే బిహార్‌లోని స్వస్థలంలో రూ.60 లక్షల విలువైన సొంత ఇల్లు ఉన్నాయి. వీటితో పాటు మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనల ద్వారా వచ్చిన బహుమతులు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ క్యాష్ ప్రైజ్‌లు అదనం.

అమాంతం పెరిగిన బ్రాండ్ వాల్యూ!
వైభవ్ సూర్యవంశీ మైదానంలో చూపిస్తున్న అగ్రెసివ్ బ్యాటింగ్ శైలి కార్పొరేట్ కంపెనీలను ఎంతగానో ఆకర్షిస్తోంది. దీంతో అతడి బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, స్పాన్సర్‌షిప్ డీల్స్ విలువ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఉన్న క్రేజ్ దృష్ట్యా మున్ముందు ఈ యువ ఆటగాడి బ్రాండ్ వాల్యూ మరిన్ని కోట్లకు చేరడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

మొత్తానికి 15 ఏళ్ల వయసులోనే అటు ఆటతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను, ఇటు సంపాదనతో కోట్ల రూపాయలను గెలుచుకుంటూ వైభవ్ సూర్యవంశీ ఇండియన్ క్రికెట్‌లో మోస్ట్ వాంటెడ్ యంగ్ స్టార్‌గా దూసుకుపోతున్నాడు.

Also Read: హైదరాబాద్ Vs రాజస్థాన్ ఎలిమినేటర్ పోరు..ఈ మ్యాచ్‌లో ఓడితే ఇంటికే! గెలుపు ఎవరిది?

Also Read: హేమమాలిని చేతికి ధర్మేంద్ర 'పద్మవిభూషణ్' అవార్డు..వెక్కివెక్కి ఏడ్చిన కుటుంబం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

8th Pay Commission latest update: ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లేనా.. 8వ వేతన సంఘంలో భారీ జీతాల పెంపు కష్టమేనా? కేంద్రం ప్లాన్ ఇదే..!!

BBhoomi7h ago
Lakshmapur, Telangana:

8th Pay Commission latest update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, అలవెన్సుల పెంపునకు సంబంధించి ఉద్యోగల సంఘాలకు, వేతన సంఘం సభ్యులకు మధ్య సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పెంపు అమలు జీతాల మార్పులపై స్పష్టత కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తుండగా ఈ వరుస సమావేశాలు వారి ఊహాగానాలకు ఆజ్యం పోసినట్లయ్యిందని చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఉద్యోగ సంఘాలు చేస్తున్న డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించకపోవచ్చన్న వార్తలు వస్తుండటంతో.. ఈ సారి భారీ వేతన పెంపుపై వారి ఆశలు సన్నగిల్లుతున్నాయి. 

8వ వేతన సంఘం కోసం కార్మిక సంఘాలు లేవనెత్తిన ప్రధాన డిమాండ్లలో ఒకటి ఫిట్ మెంట్ ఫ్యాక్టర్. దీన్ని 3.83కి పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ద్రవ్యోల్బణం, పెరుగుతున్న జీవన వ్యయాల కారణంగా ప్రజల కొనుగోలు శక్తి నిరంతరం క్షీణిస్తుంది. దాన్ని భర్తీ చేసేందుకు ఈ మార్పులు అవసరమని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నారు. అయితే ఈ ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ అమలు అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే 7వ వేతన సంఘం 2.57 ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ను అమలు చేసింది. ఈ సారి భారీ పెరుగుదల అవకాశం లేనట్లే అని తెలుస్తోంది. అందువల్ల భారీ వేతన పెంపును ఆశిస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశే ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? 
ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఒక ఉద్యోగి వేతనాన్ని సవరించడానికి ముందున్న బేసిక్ పే ను కొత్తగా సవరించిన మూల వేతన నిర్మాణంలోకి మార్చడానికి కేంద్ర వేతన సంఘం ఉపయోగించే ఒక గుణకం. దీనికి ఉపయోగించే ప్రధాన సూత్రం.. ప్రస్తుత ప్రాథమిక వేతనం x ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ = కొత్త ప్రాథమిక వేతనం ఇది. ఉదాహరణకు 7వ కేంద్ర వేతన సంఘం 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అమలు చేసింది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస మూల వేతనం 6వ వేతన సంఘం కింద ఉన్న రూ. 7,000 నుండి రూ. 18,000కు పెరిగింది.

కాబట్టి లెక్క ప్రకారం - రూ. 7,000x2.57= రూ. 18,000

Also Read: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్అలర్ట్.. Pension డబ్బులు రావాలంటే Form 10C తప్పనిసరి

6వ, 7వ వేతన సంఘాల సమయంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అంతకుముందు వేతన సంఘాలు వేతన హేతుబద్ధీకరణ, డిఏ విలీనాలు, అవసరాల ఆధారిత వేతన గణనలతో సహా జీతాలను సవరించడానికి మరింత సంక్లిష్టమైన విధానాలను అనుసరించాయి. ఎందుకంటే జీతాలలో ఏదైనా ఆకస్మిక పెరుగుదల రాష్ట్ర ప్రభుత్వాలను కూడా వేతన స్కేళ్లను సవరించడానికి పురికొల్పే అవకాశం ఉంటుంది.  ఇది దీర్ఘకాలంలో పెన్షన్, పదవీ విరమణ సంబంధిత ఖర్చులలో భారీ పెరుగుదలకు దారి తీస్తుంది. అందువల్ల..ప్రభుత్వం భారీ పెంపును ఆమోదించడానికి బదులుగా చివరికి సమతుల్య లేదా మితమైన సూత్రాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

కాగా ఇప్పటి వరకు మన దేశంలో 7 వేతన సంఘాలు ఏర్పాటు అయ్యాయి. 1946 జనవరిలో ప్రభుత్వం మొదటి వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ప్రతి 10ఏళ్లకోసారి ఒక కొత్త వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తోంది. తాజాగా 8వ వేతన సంఘాన్ని నవంబర్ 3, 2025న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

Also Read: పీఎం యశస్వి యోజన అంటే ఏంటి? అర్హులెవరు? 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

AP Rain Alert: ఏపీలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. ఉరుములు, పిడుగులతో అంతా అల్లకల్లోలం!

Vijayawada, Andhra Pradesh:

AP Rain Alert Update: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం వేగంగా మారుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాగల కొన్ని గంటల్లో తీవ్రమైన వాతావరణ మార్పులు సంభవించవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఓ ప్రకటనలో వెల్లడించింది. ముఖ్యంగా కోస్తాంధ్రాలోని నాలుగు ప్రధాన జిల్లాల్లో రాబోయే 3 గంటల వ్యవధిలో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తలు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ప్రఖర్ జైన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. వాతావరణ తీవ్రతను పరిగణనలోకి తీసుకుని సదరు జిల్లాలకు అధికారులు 'ఆరెంజ్ అలెర్ట్' ప్రకటించారు.

ప్రస్తుత వాతావరణ ఉపగ్రహాల సమాచారం ప్రకారం.. గోదావరి తీర ప్రాంతాలు మరియు పరిసర జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి..ఈ నాలుగు జిల్లాల్లోని ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ, తీర ప్రాంతాల ప్రజలు రాబోయే కొన్ని గంటల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నారు.

వాతావరణ శాఖ నివేదికల ప్రకారం.. వర్షం పడే సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. సాధారణ వర్షపాతంతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఈ వేగంతో వీచే గాలుల వల్ల బలహీనంగా ఉన్న ఇళ్ల కప్పులు, పాత గోడలు కూలిపోయే ప్రమాదం ఉంది. అలాగే రోడ్ల పక్కన ఉండే తాత్కాలిక షెడ్లు, ప్రకటనల బోర్డులు (హోర్డింగ్స్) ఊడిపడే అవకాశం ఉన్నందున ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలి.

ఈ వాతావరణ మార్పుల్లో అత్యంత ప్రమాదకరమైన అంశం 'పిడుగుపాటు'. ఇటీవలి కాలంలో పిడుగుల వల్ల ప్రాణనష్టం పెరుగుతున్న నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.

1) వర్షం ప్రారంభం కాగానే చాలామంది తలదాచుకోవడానికి చెట్ల కిందకు వెళ్తుంటారు. పిడుగులు ఎత్తైన చెట్లపై పడే అవకాశం 90% ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వర్షం, ఉరుములు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద నిలబడడం మంచిది కాదు.

2) విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండడం మేలు. ఈదురు గాలుల వల్ల విద్యుత్ తీగలు తెగిపడే ప్రమాదం ఉంది. అలాగే లోహపు స్తంభాలు పిడుగులను త్వరగా ఆకర్షిస్తాయి. కాబట్టి విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద అస్సలు నిలబడకూడదు.

3) వ్యవసాయ పనుల్లో ఉండే రైతులు, కూలీలు, అలాగే పశువుల కాపరులు ఉరుముల శబ్దం వినబడగానే బహిరంగ ప్రదేశాలు, చెరువు గట్లు, పొలాల్లో ఉండకుండా వెంటనే సురక్షితమైన కాంక్రీట్ భవనాల్లోకి వెళ్లాలి.

సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విజ్ఞప్తి..
విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ గారు మాట్లాడుతూ.. ప్రాణనష్టాన్ని నివారించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యతని పేర్కొన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రాకూడదని, టీవీలు, రేడియోలు లేదా అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వాతావరణ అప్‌డేట్లను గమనిస్తూ ఉండాలని కోరారు. స్థానిక యంత్రాంగం, విపత్తు సహాయక బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగి పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.

Also Read: 'మహానాడు'లో విందు అదిరిపోయే విందు..వెజ్ నుంచి నాన్‌వెజ్ వరకు ఎన్ని వెరైటీలంటే!

Also Read; తెలంగాణలో 'పెద్ది' రిలీజ్‌కు లైన్ క్లియర్..ఒకే మాటపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Lava Bold N2 5g: చైనా ఫోన్లకు చెక్.. రూ.13 వేలకే Lava Bold N2 5G లాంచ్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!

Hyderabad, Telangana:

Lava Bold N2 5g Teased In India: భారతదేశ ప్రముఖ దేశీ మొబైల్ బ్రాండ్ లావా మార్కెట్‌లోకి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. చైనాకు చెందిన వివోతో పాటు షియోమి, గ్లోబల్ బ్రాండ్ సాంసంగ్‌ కంపెనీల బడ్జెట్ ఫోన్లకు గట్టి పోటీనిస్తూ.. లావతన బోల్డ్ ఎన్2 5G (Lava Bold N2 5G) ఫోన్‌ను త్వరలో దేశీ మార్కెట్‌లోకి లాంచ్ చేయబోతోంది. ఎందుకు సంబంధించిన అధికారిక టీజర్ను కంపెనీ ఇటీవలే విడుదల చేసింది. ఈ టీజర్‌ను బట్టి చూస్తే.. మొబైల్ అద్భుతమైన ఫీచర్లతో, దిమ్మ తిరిగే డిజైన్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది..

ఈ Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రధాన ఆకర్షణ దీని డిజైన్.. ఇది గత మోడల్స్ కంటే ఎంతో ప్రత్యేకమైన డిజైన్‌తో మార్కెట్లోకి విడుదల కాబోతోంది. అంతేకాకుండా అద్భుతమైన కెమెరా ఫీచర్లతో విడుదలవ్వడం విశేషం. దీని వెనక భాగంలో స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో పాటు అద్భుతమైన ఎల్ఈడీ ఫ్లాష్ లైట్‌ను కూడా అందిస్తున్నారు. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో రాబోయే సెకండరీ కెమెరా కూడా కొన్ని రకాల ప్రత్యేకమైన ఫీచర్స్ ను కలిగి ఉండబోతున్నట్లు సమాచారం..

ఈ Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్‌ లావా కంపెనీ నో నాన్సెన్స్ ఫోన్ అనే ట్యాగ్ లైన్‌తో ప్రమోట్ చేస్తూ వస్తోంది. అంటే ఎలాంటి అనవసరమైన యాప్లు, విసిగించే ప్రకటనలు లేకుండా వినియోగదారులకు అద్భుతమైన క్లీన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం అనుభూతిని అందిస్తుంది. అదేవిధంగా ఈ మొబైల్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ 6.75 ఇంచుల హెచ్‌డీ ప్లస్ (HD+) ఎల్‌సీడీ డిస్‌ప్లేతో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇది 90Hz రీఫ్రెష్ రేట్‌తో స్మూత్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. అలాగే ఈ మొబైల్ రోజంతా బ్యాటరీ లైఫ్ ని అందించేందుకు ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన 5,000mAh బ్యాటరీతో అందుబాటులోకి తీసుకురాబోతోంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

అదేవిధంగా ఇందులో కంపెనీ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పాటు 4GB ర్యామ్, వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు సెక్యూరిటీ కోసం ఫోన్ సైడ్ ప్యానల్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్  ఇవ్వబోతున్నట్లు సమాచారం. దీంతోపాటు దుమ్ము, నీటి తుంపరల  నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. ఈ లావా బోల్డ్ ఎన్2 5G (Lava Bold N2 5G) స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ బడ్జెట్ ధరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ బేస్ వేరియంట్‌ను కేవలం రూ.13 వేలతో అందుబాటులోకి తీసుకురాబోతోంది. అలాగే ఇది మార్కెట్లోకి విడుదల అయితే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వినియోగదారుల నమ్మకాన్ని పెంచేందుకు లావా కంపెనీ ఈ ఫోన్‌తో పాటు ఉచిత హోం సర్వీసింగ్ కూడా అందిస్తుంది. దీనివల్ల ఇంటి వద్దకే వచ్చి ఉచితంగా మొబైల్ రిపేర్ చేసే సదుపాయం లభిస్తుంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Mahabubnagar: సినిమా ఫక్కీలో ATM దోపిడీ.. గ్యాస్ కట్టర్‌తో కోసి.. రూ.2.30 లక్షలతో పరార్!

Hyderabad, Telangana:

Mahabubnagar ATM Theft Latest News: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సినిమా ఫక్కీలో ఒక భారీ చోరీ జరిగింది.. అర్ధరాత్రి వేళ ప్రధాన రోడ్డు పక్కనే ఉన్న ఒక ATM సెంటర్లోకి చొరబడిన దుండగులు.. ఏకంగా ఏటీఎం మిషన్‌నే పెగిలించుకొని వాహనంలో ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో దాన్ని గ్యాస్ కట్టర్ తో ముక్కలు చేసి అందులో ఉన్న రూ.2.30 లక్షల నగదుతో అక్కడి నుంచి వారి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకాలం రేపుతోంది..

పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని అత్యంత రద్దీగా ఉండే తెలంగాణ చౌరస్తా వద్ద ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM సెంటర్ ను దుండగులు టార్గెట్ చేశారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఒక బొలెరో వాహనంలో నలుగురు నుంచి ఐదుగురు దొంగలు ఇక్కడికి చేరుకున్నారు.. లోపలికి ప్రవేశించగానే ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మొదటగా ఏటీఎం సెంటర్లో ఉన్న పవర్ సప్లై తో పాటు ఇతర కనెక్షన్స్ అన్నిటిని కట్ చేశారు. అనంతరం తాము దొరికిపోకుండా ఉండేందుకు అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ తర్వాత క్షణాల వ్యవధిలోనే భారీ ATM మిషన్‌ను పెకిలించుకొని.. తమ వెంట తెచ్చుకున్న బొలెరో వాహనంలో వేసుకొని అక్కడి నుంచి మెరుపు వేగంతో పరారయ్యారు..

ఏటీఎం మిషన్తో పారిపోయిన దుండగులు.. జిల్లా పరిధిలోని బోయినపల్లి శివారు పొలాల వద్దకు చేరుకున్నారు.. అక్కడ వాహనాన్ని ఆపి.. నిందితులు తమ వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎం మిషన్ ను అతి దారుణంగా రెండు భాగాలుగా కట్ చేశారు.. మిషన్ లోపల ఉన్న నగదు పెట్టేను సులభంగా బయటకు తీశారు. అందులో ఉన్న రూ.2.30 లక్షల నగదును తీసుకొని.. మిగిలిన మిషన్ భాగాలను అక్కడే పడేసి అక్కడి నుంచి పరారయ్యారు..

Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..

ఉదయం  విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు వెంటనే సమాచారం అందించారు.. ఎస్బిఐ బ్యాంక్ అధికారులు ఏటీఎంలో సుమారు 2.30 లక్షల నగదు ఉన్నట్లు ప్రాథమికంగా ధ్రువీకరించారు. ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీంతో పాటు డాగ్స్ స్క్వాడ్ కీలక ఆధారాలు సేకరించాయి.. గతంలో దేశవ్యాప్తంగా జరిగిన ఇలాంటి తరహా ఏటీఎం చోరీల శైలిని పరిశీలించిన పోలీసులు.. ఇది అంతరాష్ట్ర దొంగల ముఠా పనిగా అనుమానిస్తున్నారు.. ముఖ్యంగా రాజస్థాన్ లేదా హర్యానా రాష్ట్రాలకు చెందిన మేవాట్ ముఠా ఈ దోపిడీకి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. నిందితుల కోసం జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేకమైన తనిఖీలను చేపడుతున్నట్లు కూడా తెలుస్తోంది..

Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

EPFO Pension: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్అలర్ట్.. Pension డబ్బులు రావాలంటే Form 10C తప్పనిసరి.. ఎలా అప్లై చేయాలో తెలుసా?

BBhoomi8h ago
Lakshmapur, Telangana:

EPFO Pension: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగుల పదవీ విరమణ పొదుపును నిర్వహించే భారత ప్రభుత్వ పథకం. ఈ స్కీములో ఉద్యోగి, యజమాని ఇద్దరూ డబ్బును జమ చేస్తారు. ఉద్యోగి తన జీతంలో నుంచి 12శాతం జమ చేస్తే.. అందులో 8.33శాతం యజమాని జమ చేస్తారు. ఇందులోనుంచి కొంత డబ్బు ఈపీఎస్ స్కీములోకి వెళ్తుంది. మిగిలిన డబ్బు పీఎఫ్ అకౌంట్లో జమ అవుతుంది. అయితే ఒక ఉద్యోగి ఎక్కువ కాలం అంటే 10ఏళ్ల కంటే ఎక్కువ పనిచేస్తున్నట్లయితే.. రిటర్మైంట్ తర్వాత నెలలవారీ పెన్షన్ కు అర్హులు అవుతారు. ఈ పెన్షన్ వారి సర్వీసు కాలం, జీతం ఆధారంగా నిర్ణయిస్తారు. 

ఈపీఎస్ 1995 పెన్షన్ ఎలా నిర్ణయిస్తారు? 
ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ 1995 ప్రకారం పెన్షన్ ఒక సులభమైన సూత్రాన్ని ఉపయోగించి లెక్కిస్తారు. పెన్షన్ కు అర్హత గల జీతం × సర్వీసు కాలం ÷ 70 ఈ సూత్రాన్ని ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి జీతం రూ. 25,000 ఉందనుకుందాం. అతను 35 సంవత్సరాలు ఉద్యోగం చేసినట్లయితే.. అతని నెలలవారీ పెన్షన్ రూ. 25,000 × 35 ÷ 70 = నెలకు రూ. 12,500 పెన్షన్ అందుకుంటారు. ఒకవేళ సర్వీసు కాలం ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కువ పెన్షన్ అందుకునే అవకాశం ఉంటుంది. 

రిటైర్మెంట్ వాయిదా వేసుకునే ఛాన్స్: 
ఈపీఎఫ్ రూల్స్ ప్రకారం మీరు పెన్షన్ వెంటనే తీసుకునే బదులుగా మీరు 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు దానిని వాయిదా వేసుకోవచ్చు. అయితే దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒక మీరు చెల్లింపును నిలిపివేసి.. ఆ డబ్బుపై 4శాతం వార్షిక వడ్డీ వచ్చేలా కొంత కాలం పాటు ఉంచవచ్చు. అంటే మీకు 60ఏళ్లు వచ్చేంత వరకు.  లేదంటే మరో రెండు సంవత్సరాలు పనిచేస్తూ చెల్లింపును కొనసాగించవచ్చు. దీనివల్ల మీ పెన్షన్ మొత్తం పెరిగే అవకాశం ఉంటుంది. ఫలితంగా మీకు అధిక పదవీ విరమణ పెన్షన్ లభించే ఛాన్స్ ఉంటుంది. 

ఫారం 10సీ అంటే ఏమిటి? ఎందుకంత ముఖ్యం? 

ఫారం 10C అనేది వివిధ రకాల పెన్షన్ సంబంధిత ప్రయోజనాల కోసం ఉపయోగించే ఒక ముఖ్యమైన ఈపీఎఫ్ఓ ​​ఫారం. దీనిని నింపడం ద్వారా మీరు మీ పెన్షన్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.అంతేకాదు స్కీమ్ సర్టిఫికేట్ పొందవచ్చు. ఉద్యోగం మానేసినా కూడా ఈపీఎఫ్ సభ్యత్వాన్ని కొనసాగించే ఛాన్స్ ఉంటుంది. మీరు 10 సంవత్సరాల సర్వీస్ పూర్తికాకముందే ఉద్యోగం మానేసినా లేదా ప్రత్యేక పరిస్థితుల్లో పెన్షన్ ప్రయోజనాలను పొందాలనుకున్నా ఫారం 10C అవసరం ఉంటుంది. 

ఫారం 10C ఎవరు అర్హులు?
10 సంవత్సరాల కంటే తక్కువ కాలం సేవ చేసి రిటైర్మెంట్ చేస్తున్నవారు. 58 సంవత్సరాల వయస్సు రాకముందే ఉద్యోగం విడిచిపెట్టినవారు. 10 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి, 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు. 50 నుండి 58 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి, తమ పెన్షన్‌ను విత్ డ్రా చేసుకోవాలనుకుంటున్నవారు. ఒక సభ్యుడు మరణించిన తర్వాత, కుటుంబ సభ్యుడు లేదా నామినీ ద్వారా దరఖాస్తు చేసుకునేవారు. వీళ్లంతా ఫారం 10సీకి అర్హులు అవుతారు. 

Also Read: పీఎం యశస్వి యోజన అంటే ఏంటి? అర్హులెవరు?

అవసరమైన పత్రాలు ఏమిటి?
ఫారం 10C నింపేటప్పుడు.. మీరు కొన్ని పత్రాలను అందించాల్సి ఉంటుంది. UAN, ఆధార్, పాన్ నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలు, క్యాన్సిల్ చెక్ , పుట్టిన తేదీ, రిటైర్మెంట్ తేదీ, తండ్రి/భర్త పేరు, అడ్రస్, అవసరమైతే డెత్ సర్టిఫికేట్  లేదా వారసత్వ ధృవీకరణ పత్రం, పథకం ధృవీకరణ పత్రం కోసం పిల్లల జనన ధృవీకరణ పత్రాలు, 1 రూపాయి రెవెన్యూ స్టాంప్ అవసరం ఉంటుంది.

పన్ను, వడ్డీ ప్రయోజనాలు:
ఈపీఎఫ్ ప్రస్తుతం 8.25శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ స్కీమ్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఒక ఉద్యోగి చేసే రూ. 1.5 లక్షల వరకు వార్షిక వాటా, సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపుకు అర్హత ఉంటుంది. కార్పొరేట్ వాటాలు కూడా పన్ను రహితంగా ఉంటాయి. రూ. 2.5 లక్షల వరకు వాటాలపై వచ్చే వడ్డీ పన్ను రహితంగా ఉంటుంది.

ఈపీఎఫ్ఓ పెన్షన్ స్కీమ్ రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. ఈ ప్రక్రియలో ఫారం 10సీ ఒక ముఖ్యమైన భాగమని చెప్పాలి. ఇది మీకు పెన్షన్ లేదా స్కీమ్ సర్టిఫికేట్ పొందేందుకు వీలు కల్పిస్తుంది. భవిష్యత్తులో పెన్షన్ కు సంబంధించిన సమస్యలు రాకుండా.. సరైన సమాచారం పత్రాలతో దీన్ని పూర్తి చేయడం చాలా కీలకమని చెప్పాలి. 

Also Read: హైకోర్టు సంచలన తీర్పు.. ఆ ఉద్యోగులకు భారీ పెన్షన్

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Maruti Suzuki WagonR: చిరుద్యోగులు, చిన్న వ్యాపారులు ఎక్కువగా ఈ కారే కొంటున్నారు.. రూ.4.99 లక్షల బడ్జెట్, అదిరిపోయే మైలేజ్..!!

BBhoomi10h ago
Lakshmapur, Telangana:

Maruti Suzuki WagonR: ఇండియన్ ఆటోమొబైల్ రంగంలో ప్రతి ఏడాది  కొత్త కొత్త మోడళ్లు మార్కెట్లోకి లాంచ్ అవుతూనే ఉంటాయి. ఫీచర్లు, ధర, డిజైన్, టెక్నాలజీ పరంగా అన్నీ మారుతూనే ఉంటాయి. కానీ కొన్ని కార్లు మాత్రం కాలానికి తగ్గట్లుగా మారుతూ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. దశాబ్దాల పాటు తమ స్థానాన్ని పదిలపర్చుకుంటున్నాయి. అలాంటి కార్లలో ఒకటి మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్. 1999లో భారత ఆటోరంగంలోకి అడుగుపెట్టిన ఈ కారు.. ప్రారంభం నుంచి మంచి ఆదరణ సంపాదించుకుంది. మార్కెట్లో పోటీ పెరిగినా.. తన స్థానం మాత్రం కోల్పోలేదు. అంతేకాదు మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే ధర, తక్కువ మెయింటనెన్స్ ఖర్చు ఈ కారు ప్రధాన బలమని చెప్పాలి. సర్వీస్ నెట్వర్క్, స్పేర్ పార్ట్స్ కూడా అందుబాటులో ఉండటంతో మరింత ప్రజాదరణ పొందుతోంది. 

అయితే ఈ కారును చిన్న వ్యాపారులు, చిరుద్యోగులు, వైద్యులు, ఇంజనీర్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు ఈ కారు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఫ్యామిలీ వినియోగానికి కూడా సౌకర్యంగా ఉండటం ఈ కారుకు ఉన్న పెద్ద ప్లాయింట్ అని చెప్పాలి.  కాలం మారుతున్నా.. ట్రెండ్ మారుతున్న వ్యాగన్ ఆర్ మాత్రం భారత ఆటో మొబైల్ మార్కెట్లో తన ప్రత్యేక స్థానాన్ని అలాగే పదిలంగా నిలబెట్టుకుంటోంది. 

ఈ కారు డిజైన్ సాధారణ హ్యాచ్ బ్యాక్ లతో పోలిస్తే ఎత్తుగా.. బాక్సీ షేప్ లో ఉండటం వల్ల బయటకు చిన్న కారులా కనిపించినా లోపల మాత్రం విశాలంగా ఉంటుంది. ఈ డిజైన్ ప్రదాన ఉద్దేశ్యం కూడా అదే ఎక్కువ స్పేస్ ను తక్కువ పొడవులో అందించడం. ఫ్రంట్ సైడ్ సింపుల్ గా కనిపించినా ప్రాక్టికల్ లుక్ ను ఇచ్చే గ్రిల్, పెద్ద హెడ్ ల్యాంప్స్ తో కలిసి ఒక సాఫ్ట్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ ఫేస్ ఇస్తుంది. 

Also Read:  కళ్లు చెదిరే డిస్కౌంట్.. సేఫ్‌ కారు.. ఫ్యామిలికి బెస్ట్.. రేటింగ్‌ కూడా ఎవర్‌గ్రీన్.

పవర్..స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. మారుతి సుజుకి వాగన్ఆర్ 998cc, BS6-కంప్లైంట్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 68 PS పవర్, 90 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్ పరంగా, మారుతి సుజుకి వాగన్ఆర్ 21.79 km/l మైలేజీని అందిస్తుంది. ఈ ఇంజన్ వాగన్ఆర్ Lxi, Vxi ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది.కొలతల పరంగా, మారుతి సుజుకి వాగన్ఆర్ 3655 మిమీ పొడవు, 1620 మిమీ వెడల్పు, 16750 మిమీ ఎత్తు, 2435 మిమీ వీల్‌బేస్, 4.7 మీటర్ల టర్నింగ్ రేడియస్, 1340 కిలోల మొత్తం బరువు, 32 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

Also Read: లైసెన్స్, రిజిస్ట్రేషన్.. పెట్రోల్ ఖర్చే లేదు.. రూ. 30వేల బడ్జెట్లోనే

బ్రేకింగ్ విధులను ముందువైపు డిస్క్ బ్రేకులు, వెనుకవైపు డ్రమ్ బ్రేకులు నిర్వహిస్తాయి. సస్పెన్షన్ విధులను ముందువైపు కాయిల్ స్ప్రింగ్‌లతో కూడిన మాక్‌ఫెర్సన్ స్ట్రీట్,  వెనుకవైపు కాయిల్ స్ప్రింగ్‌లతో కూడిన టార్షన్ బీమ్ నిర్వహిస్తాయి. మైలేజీ విషయానికి వస్తే లీటర్ కు 25కిలోమీటర్ల వరకు ఇస్తుంది. సీఎన్జీ అయితే కిలో గ్రామ్ కు 33 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. ప్రస్తుతం ఈ కారు 4.98 లక్షల నుంచి 6.38 వరకు అందుబాటులో ఉంది. 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top