icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505001
SShankerreddyFollow17 Jul 2024, 11:48 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Virat Kohli IPL Salary: ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లీ సంపాదన ఎంతో తెలుసా? రూ.12 లక్షల నుండి రూ.230 కోట్లకు ఎదిగిన ఏకైక ఆటగాడు!

Hyderabad, Telangana:

Virat Kohli IPL Salary 2026: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ క్రీడా పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL). 2008లో ప్రారంభమైన ఈ క్యాష్ రిచ్ లీగ్, ప్రస్తుతం 19వ సీజన్‌ను (ఐపీఎల్ 2026) విజయవంతంగా జరుపుకుంటోంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఐపీఎల్ ద్వారా అత్యధిక పారితోషికం అందుకున్న ఆటగాడిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్, 'రన్ మెషీన్' విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

'ఫ్యానాటిక్ స్పోర్ట్స్', 'హురున్' సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. కోహ్లీ తన ఐపీఎల్ కెరీర్‌లో కేవలం ఫ్రాంచైజీ పారితోషికం రూపంలోనే ఏకంగా రూ.230.2 కోట్లు ఆర్జించాడు.

కోహ్లీ ఐపీఎల్ ప్రయాణం!
2008లో కేవలం 19 ఏళ్ల వయసులో అండర్-19 వరల్డ్ కప్ గెలిచి వచ్చిన కోహ్లీని ఆర్‌సీబీ తొలి వేలంలో కేవలం రూ.12 లక్షల బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసింది. 18 ఏళ్లుగా ఒకే ఒక్క ఫ్రాంచైజీకి ఆడుతూ, అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఆటగాడిగా కోహ్లీ ఎదిగిన తీరు అద్భుతం. ఆయన ఐపీఎల్‌లో సంపాదన ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం.

2008 - 2010: ఏడాదికి రూ.12 లక్షల చొప్పున.. ఆ మూడేళ్లకు గానూ మొత్తం రూ.36 లక్షలు

2011 - 2013: ఏడాదికి రూ.8.28 కోట్ల చొప్పున.. మొత్తం రూ.24.84 కోట్లు

2014 - 2017: ఏడాదికి రూ.12.5 కోట్ల చొప్పున.. మొత్తం రూ.50 కోట్లు

2018 - 2021: ఏడాదికి రూ.17 కోట్ల చొప్పున.. మొత్తం రూ.68 కోట్లు

2022 - 2024: ఏడాదికి రూ.15 కోట్ల చొప్పున.. మొత్తం రూ.45 కోట్లు

2025 - 2026: ఏడాదికి రూ.21 కోట్ల చొప్పున.. మొత్తం రూ.42 కోట్లు

ఈ క్రమంలో విరాట్ కోహ్లీ మొత్తం ఐపీఎల్ సంపాదన రూ.230.2 కోట్లుగా లెక్క తేలింది. అయితే ఈ డబ్బు ఆయన కేవలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ద్వారానే సంపాదించడం విశేషం. 

టాప్-3లో రోహిత్, ధోనీ!
ఐపీఎల్‌లో అత్యధికంగా సంపాదించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ తర్వాత భారత సీనియర్ ఆటగాళ్లే ఆధిపత్యం చలాయిస్తున్నారు.

విరాట్ కోహ్లీ (RCB): రూ.230.2 కోట్లు

రోహిత్ శర్మ (MI): రూ.227.2 కోట్లు

ఎంఎస్ ధోనీ (CSK): రూ.200 కోట్లు

రూ.1.63 లక్షల కోట్లకు ఐపీఎల్ బ్రాండ్!
ఈ నివేదిక కేవలం ఆటగాళ్ల సంపాదననే కాదు, ఐపీఎల్ జట్ల మార్కెట్ విలువను కూడా వెల్లడించింది. ప్రస్తుతం ఐపీఎల్‌లోని 10 ఫ్రాంచైజీల మొత్తం బ్రాండ్ విలువ అక్షరాలా రూ.1.63 లక్షల కోట్లకు చేరుకుంది.

అత్యంత విలువైన జట్లు ఇవే..
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR): బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు చెందిన కేకేఆర్ రూ.19,200 కోట్లకు పైగా మార్కెట్ విలువతో నెం.1 స్థానంలో నిలిచింది.

ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK): ఈ రెండు జట్లు చెరో రూ.18,400 కోట్ల విలువతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి.

Also Read: కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు నేడు చావో రేవో మ్యాచ్..కేకేఆర్ ఆశలు ముంబై గల్లంతు చేస్తుందా

ALso Read: రేపే ధోనీ చివరి మ్యాచ్..చెపాక్‌లో ఫ్యాన్స్ మధ్య వీడ్కోలు పలకనున్న దిగ్గజం?!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Cars In Delhi: మధ్యతరగతి వారికి గుడ్ న్యూస్.. కేవలం రూ.2 లక్షలకే హ్యుందాయ్, టాటా టాప్ మోడల్ కార్లు!

Hyderabad, Telangana:

Cheapest Second Hand Cars In Delhi: ఎప్పటి నుంచో సొంత కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? కానీ ధరల కారణంగా కొనుగోలు చేయాలేకపోతున్నారా? మధ్యతరగతి ప్రజలకు డిల్లీలోని రోహిణి సెక్టార్-16లో ఉన్న సెకండ్‌ హ్యండ్‌ కార్ల షోరూమ్స్‌ అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌తో మంచి మంచి కార్లను విక్రయిస్తూ వస్తున్నాయి. మార్కెట్ ధరల కంటే అత్యంత తక్కువ ధరలకే, లక్షల రూపాయల వరకు డిస్కౌంట్‌లను అందిస్తూ మంచి మంచి కార్లను విక్రయిస్తున్నారు. అయితే, ఇక్కడున్న మార్కెట్‌లో ఏయే కార్లు ఎంతెంత ధరల్లో అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ సెకండ్‌ హ్యాండ్‌ షోరూమ్‌లో మూడేళ్ల పాటు తిరిగిన హ్యుందాయ్ i10 కార్లు కేవలం రూ.1,29,000 లకే అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా 2014 మోడల్ కేవలం 26,000 కిలోమీటర్లు మాత్రమే వినియోగించిన సింగిల్ ఓనర్ హ్యుందాయ్ గ్రాండ్ i10 మ్యాగ్నా కారు ఇప్పుడే కొనుగోలు చేసేవారికి రూ.1,99,000కే అందుబాటులో ఉంది. అలాగే టాప్ ఎండ్ పెట్రోల్ మోడల్ టాటా జెస్ట్ కేవలం రూ.1,69,000 లకే లభిస్తున్నాయి. ఇవే కాకుండా చాలా బ్రాండ్‌లకు సంబంధించిన కార్లు అత్యంత చీప్‌ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. 

విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్ ధరల భారం నుంచి ఉపశమనం పొందేందుకు ఆన్-పేపర్ సిఎన్‌జి సదుపాయం కలిగిన ఎన్నో కార్లను ఇక్కడ విక్రయిస్తూ వస్తున్నారు. 2020 మోడల్ టాటా టియాగో ఆన్-పేపర్ సిఎన్‌జి కారును మార్కెట్ ధర రూ.3.5 లక్షలు కాగా.. ఇక్కడ కేవలం రూ.2,69,000 లకే అందిస్తున్నారు. అంతేకాకుండా 2016 టాప్ మోడల్  ఫోర్డ్ ఎకోస్పోర్ట్ (Ford EcoSport) ఆటోమేటిక్, పుష్-బటన్ స్టార్ట్ కలిగిన అద్భుతమన కారును రూ.2,89,000 ధరకే ఇక్కడ విక్రయిస్తున్నారు. అలాగే 7-సీటర్ కారును కొనుగోలు చేయాలనుకునేవారి కోసం రెనాల్ట్ ట్రైబర్ (Triber) టాప్ మోడల్, పుష్ బటన్, అలాయ్ వీల్స్‌తో పాటు సిఎన్‌జి సపోర్ట్‌ కలిగి కారు కేవలం రూ.2,99,000 లకే అందుబాటులో ఉంది. అలాగే హోండా సిటీతో పాటు హోండా అమేజ్, మహీంద్రా KUV, రెనాల్ట్ క్విడ్ వంటి కార్లు కూడా రూ.1.39 లక్షల నుండి రూ.1.99 లక్షల లోపు అందుబాటులో ఉండడం విశేషం..

Also Read: సెకండ్ హ్యాండ్ ధరకే కొత్త కార్లు.. అన్‌రిజిస్టర్డ్ డెమో వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!

అలాగే ఇక్కడ అనేక బ్రాండ్‌లకు సంబంధించిన కార్లు అత్యంత చీప్‌ ధరల్లో అందుబాటులో ఉండడం విశేషం.. ఇక్కడ కొనుగోలు చేసే కస్టమర్స్‌కి ఢిల్లీ, హర్యానా, యూపీ వంటి ఏ ప్రాంత వాహనాలకైనా ఓనర్ షిప్ ట్రాన్స్‌ఫర్, ఎన్‌ఓసి (NOC)తో పాటు వివిధ రకాల సర్టీఫికేషన్ ఈ షోరూమ్స్‌కి సంబంధించిన నిర్వాహకులే చూసుకుంటామని హామి కూడా ఇస్తున్నారు. అంతేకాకుండా భారతదేశంలో ఏ నగరంలో ఉన్నవారికైనా డోర్-టు-డోర్ ట్రాన్స్‌పోర్ట్ సదుపాయాన్ని కూడా అందిస్తూ వస్తున్నారు.  

Also Read: సెకండ్ హ్యాండ్ ధరకే కొత్త కార్లు.. అన్‌రిజిస్టర్డ్ డెమో వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

KKR vs MI Prediction: కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు నేడు చావో రేవో మ్యాచ్..కేకేఆర్ ఆశలను ముంబై గల్లంతు చేస్తుందా?

Kolkata, West Bengal:

KKR vs MI Match Prediction: ఐపీఎల్ 2026లో బుధవారం ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా అత్యంత ఉత్కంఠభరితమైన పోరు జరగనుంది. మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ఇప్పటికే టోర్నమెంట్ నుండి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్ (MI)తో తలపడనుంది. కేకేఆర్ ప్లేఆఫ్ ఆశలు దాదాపు సన్నగిల్లన నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఓడితే డైరెక్ట్‌గా ఎలిమినేట్ అవుతుంది. 

అజింక్య రహానే సారథ్యంలోని కేకేఆర్‌కు ఈ మ్యాచ్‌ 'చావో రేవో' లాంటిది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో గతంలో టైటిల్ గెలిచిన కేకేఆర్, 2025లో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో ఓడిపోతే, వరుసగా రెండో సీజన్‌లోనూ ప్లేఆఫ్ చేరకుండానే నిష్క్రమిస్తుంది. చివరి వరకు ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే కేకేఆర్ ఈ మ్యాచ్‌లో తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. అయితే కేకేఆర్ ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా ఉపయోగం లేదు. ఇతర జట్లు ప్రదర్శన బట్టి ప్లేఆఫ్ అవకాశాలు ఉంటాయి. ఈ వారం చివర్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) చేతిలో పంజాబ్ కింగ్స్ (PBKS) ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడే కేకేఆర్ ఆశలు సజీవంగా ఉంటాయి. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ప్లేఆఫ్ బెర్త్‌లను ఖరారు చేసుకోగా.. మిగిలిన ఏకైక స్థానం కోసం పంజాబ్, రాజస్థాన్, చెన్నై, ఢిల్లీలతో పాటు కేకేఆర్ రేసులో పోటీ పడుతున్నాయి.

కేకేఆర్ బలాలు - బలహీనతలు
సీజన్ ఆరంభంలో వరుస ఓటములతో వెనుకబడిన కేకేఆర్, చివరి ఆరు మ్యాచ్‌లలో ఐదింటిలో గెలిచి ఆలస్యంగా పుంజుకుంది. ఓపెనర్ ఫిన్ అలెన్ (గత 3 ఇన్నింగ్స్‌ల్లో ఒక సెంచరీ, 35 బంతుల్లో 93 పరుగులు), అంగక్రిష్ రఘువంశీ, రూ.25.20 కోట్ల ఆటగాడు కామెరాన్ గ్రీన్, ఫినిషర్ రింకు సింగ్, మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ జట్టుకు పెద్ద బలంగా మారారు. 

కెప్టెన్ రహానే ఫామ్ లేమితో ఇబ్బంది పడుతుండటం, వరుణ్ చక్రవర్తి (కాలికి హెయిర్‌లైన్ ఫ్రాక్చర్), మతీషా పతిరానా (కండరాల గాయం) గాయాలతో సతమతమవ్వడం జట్టును కలవరపెడుతోంది. మతీషా పతిరానా గాయం నుంచి కోలుకోకపోతే, బ్లెస్సింగ్ ముజరబాని తుది జట్టులోకి వస్తాడని అంచనా వేస్తున్నారు.

ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్ ఘోర నిరాశను మిగిల్చింది. అయితే, కేకేఆర్ ప్లేఆఫ్ ఆశలను దెబ్బతీసి, టోర్నీని బలంగా ముగించాలని ముంబై భావిస్తోంది. గాయం కారణంగా గత మూడు మ్యాచ్‌లకు దూరమైన కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వ్యక్తిగత కారణాలతో దూరమైన సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌తో తిరిగి జట్టులోకి రానున్నారు.

ఈ సీజన్‌లో హార్దిక్ (సగటు 20.85, ఎకానమీ 12), సూర్యకుమార్ యాదవ్ (11 ఇన్నింగ్స్‌ల్లో 195 పరుగులు, హాఫ్ సెంచరీ లేదు), రోహిత్ శర్మ, తిలక్ వర్మలు నిలకడ లేమితో ఇబ్బంది పడ్డారు. బుమ్రాకు మిగిలిన బౌలర్ల నుంచి సరైన మద్దతు లభించలేదు. ర్యాన్ రికెల్టన్, షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, అల్లా గజన్‌ఫర్‌లతో ముంబై ఇప్పటికీ బలంగానే ఉంది.

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఏకపక్ష పోరు ఏదైనా ఉందంటే అది కేకేఆర్ వర్సెస్ ఎంఐ మ్యాచ్‌లే. వీరిద్దరి మధ్య ఐపీఎల్ చరిత్రలో 36 మ్యాచ్‌లు జరగ్గా.. అందులో ముంబై 25 సార్లు గెలిచి ఆధిపత్యం చలాయిస్తుండగా.. కోల్‌కతా జట్టు కేవలం 11 విజయాలతో సరిపెట్టుకుంది. అయితే ఈ సీజన్ ఆరంభంలో వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లోనూ కేకేఆర్‌పై ముంబై విజయం సాధించింది.

ఈడెన్ గార్డెన్స్ పిచ్, వాతావరణం
ఈ మ్యాచ్ 'పిచ్ నెం. 4' పై జరగనుంది. ఈ సీజన్‌లో దీనిపై ఒకే ఒక్క మ్యాచ్ జరగ్గా.. అందులో రాజస్థాన్ రాయల్స్‌పై కేకేఆర్ సునాయాసంగా ఛేజింగ్ చేసింది. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్లు, ఛేజింగ్ చేసిన జట్లు సమానంగా గెలిచాయి. అయితే బుధవారం సాయంత్రం మ్యాచ్ జరిగే సమయంలో కోల్‌కతాలో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉంది.

కోల్‌కతా నైట్‌రైడర్స్ తుది జట్టు అంచనా..
అజింక్య రహానే (కెప్టెన్), ఫిన్ అలెన్, అంగక్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, మనీష్ పాండే, రింకు సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, సౌరభ్ దూబే, కార్తీక్ త్యాగి, బ్లెస్సింగ్ ముజరబాని.

ముంబై ఇండియన్స్ తుది జట్టు అంచనా..
ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విల్ జాక్స్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, రఘు శర్మ, ఏఎం ఘజన్‌ఫర్.

Also Read: రేపే ధోనీ చివరి మ్యాచ్..చెపాక్‌లో ఫ్యాన్స్ మధ్య వీడ్కోలు పలకనున్న దిగ్గజం?!

Also Read: చెన్నై Vs హైదరాబాద్.. ఐపీఎల్‌లో నేడు చావో రేవో మ్యాచ్..ధోనీ ఆడతాడా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Lenovo: మార్కెట్లోకి లెనోవో పవర్‌ఫుల్ రీ-ఎంట్రీ.. అరాచకమైన ఫీచర్లు, తక్కువ ధరకే Lenovo Legion Y70!

Hyderabad, Telangana:

Lenovo Legion Y70 Price: గతంలో లెనోవో స్మార్ట్‌ఫోన్స్‌కి అద్భుతమైన డిమాండ్‌ ఉండేది. కానీ పోను పోను మార్కెట్‌లోకి కొత్త బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్స్‌ లాంచ్‌ కావడంతో వీటి డిమాండ్‌ తగ్గిపోతూ వచ్చింది. అయితే, మళ్లీ మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది లెనోవో లెజియన్ Y70 స్మార్ట్‌ఫోన్‌ పేరుతో మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ మొదట చైనా మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. ఇది వెనక భాగంలోని ఎంతో శక్తివంతమైన కెమెరాతో పాటు అద్భుతమైన డిజైన్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో కంపెనీ చాలా ప్రత్యేకమైన  50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 8-మెగాపిక్సెల్ ఆటోఫోకస్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాను అందిస్తూ వస్తోంది. ఇవే కాకుండా ఇందులో  ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో పాటు ఎన్నో రకాల కొత్త కొత్త ఫీచర్స్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

లెనోవో లెజియన్ Y70 ధర వివరాలు..
లెనోవో లెజియన్ Y70 2026 స్మార్ట్‌ఫోన్‌ చాలా ప్రత్యేకమైన స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇందులోని మొదటి స్టోరేజ్‌ వేరియంట్‌ 12GB ర్యామ్‌, 256GB స్టోరేజ్‌ కలిగిన వేరియంట్‌  రూ.36,895తో ప్రారంభమవుతుంది. అంతేకాకుండా 12GB+512GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.45,410 నుంచి లభిస్తోంది. ఇక మరో వేరియంట్‌  16GB ర్యామ్‌తో పాటు 512GB స్టోరేజ్ కలిగినది రూ.51,090తో అందుబాటులో ఉంది. ఇక ఇందులోని చివరి వేరియంట్ 16GB+1TB స్టోరేజ్ ధర రూ. 62,455తో అందుబాటులో ఉంది. ఇప్పటికే చైనా మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు కూడా చైనాలో ప్రారంభమయ్యాయి. ఈ మొబైల్స్‌కి సంబంధించిన సేల్స్‌ జూన్ 9 నుంచి ప్రారంభం కాబోతోంది. 

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..
ఈ లెనోవో లెజియన్ Y70 స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులో ఉన్నాయి.. ఇందులో కంపెనీ చాలా ప్రత్యేకమైన 6.82-అంగుళాల 2K AMOLED LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 144Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 7000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌తో లభిస్తోంది. అంతేకాకుండా ఇది డాల్బీ విజన్‌కు సపోర్ట్‌తో పని చేయడం విశేషం.. ఇవే కాకుండా ఇందులో కంపెనీ GPUతో కూడిన ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. కాబట్టి ఎంత పెద్ద గేమ్స్‌ అయిన ఎంతో సులభంగా ఆడొచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.

Also Read:  Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!

ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కెమెరా సెటప్‌ వివరాల్లోకి వెళితే..  OIS సపోర్ట్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 8-మెగాపిక్సెల్ ఆటోఫోకస్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఇందులో కంపెనీ సెల్ఫీలతో పాటు వీడియో కాల్స్ కోసం..32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. అలాగే సెక్యూరుటీని దృష్టిలో పెట్టుకుని ఇందులో కంపెనీ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అందిస్తోంది. ఇందులో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 7, బ్లూటూత్ 6.0, GPS, NFC కనెక్టివిటీ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన 8000mAh బ్యాటరీతో పాటు 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ కూడా లభిస్తోంది.

Also Read:  Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Swapna Dutt NTR: "ఎన్టీఆర్ వల్లే నా పెళ్లి జరిగింది.." టాలీవుడ్ లేడీ ప్రొడ్యూసర్ ఎమోషనల్!

Hyderabad, Telangana:

Swapna Dutt Marriage NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో అంతర్జాతీయంగా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న తారక్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' అనే భారీ పాన్-ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. 

తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ క్రమంలో తారక్ గతంలో చేసిన కొన్ని అరుదైన సాయం గురించి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ప్రముఖ నిర్మాత అశ్వినిదత్ కుమార్తె, స్టార్ ప్రొడ్యూసర్ స్వప్నా దత్ పంచుకున్న ఆసక్తికర విషయాల గురించి అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. 

షూటింగ్ ఆపేసి.. నాన్నతో మాట్లాడారు!
టాలీవుడ్ నిర్మాత స్వప్నా దత్ 2010లో ప్రసాద్ వర్మను ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, వీరిద్దరి పెళ్లి వెనుక హీరోయిన్ జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారనే విషయం చాలామందికి తెలియదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్వప్న ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

"నేను ప్రేమలో ఉన్న సమయంలో ఆ విషయాన్ని మొదట తారక్‌కు (హీరో జూనియర్ ఎన్టీఆర్) చెప్పాను. దాంతో ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఇంట్లో మాట్లాడమన్నారు. కానీ, మా ఇంట్లో అప్పట్లో ప్రేమ వివాహానికి ఒప్పుకునే పరిస్థితి లేదని తారక్‌తో అన్నాను. దాంతో ఆయన స్పందిస్తూ.. 'ఇలాంటి విషయాల్లో అస్సలు లేట్ చేయకూడదు, మీ నాన్నగారితో నేనే స్వయంగా మాట్లాడతాను' అని ధైర్యం చెప్పారు" అని స్వప్నా దత్ చెప్పుకొచ్చారు.
Swapna marriage NTR

స్వప్నా దత్ అన్నట్లుగానే ఎన్టీఆర్ ఆ సమయంలో జరుగుతున్న తన సినిమా షూటింగ్‌ను కాసేపు పక్కన పెట్టి, నేరుగా అశ్వినిదత్ గారి ఇంటికి వెళ్లి స్వప్న ప్రేమ విషయం గురించి మాట్లాడారట. అశ్వినిదత్ కుటుంబానికి, నందమూరి కుటుంబానికి దశాబ్దాలుగా ఉన్న అనుబంధం వల్ల తారక్ మాటను ఆయన కాదనలేకపోయారు. అలా ఎన్టీఆర్ చొరవతోనే తమ పెళ్లి జరిగిందని, ఆ సాయాన్ని జీవితంలో మర్చిపోలేనని స్వప్నా దత్ ఎమోషనల్ అయ్యారు.

కెరీర్ పరంగా దూసుకుపోతున్న స్వప్న..నాడు ఎన్టీఆర్ సాయంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన స్వప్నా దత్, నేడు టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్నారు. 'వైజయంతీ మూవీస్', 'స్వప్న సినిమాస్' బ్యానర్లపై వైవిధ్యమైన, భారీ చిత్రాలను నిర్మిస్తూ నిర్మాతగా తనదైన ముద్ర వేస్తున్నారు.

Also Read: ఏకంగా 10 కిలోల బరువు తగ్గిన కీర్తి సురేష్..స్టార్ నటి అస్సలు నిజం బయటపెట్టింది!

Also Read; 'పెద్ది' ట్రైలర్ వచ్చేసింది! క్రికెట్-కుస్తీలో రఫ్ఫాడించిన చరణ్..పక్కా బ్లాక్‌బస్టర్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Realme 15 Pro: అమెజాన్ ధమాకా ఆఫర్.. కేవలం రూ.1,999కే Realme 15 Pro 5G స్మార్ట్‌ఫోన్.. ఎలా పొందాలో చూడండి!

Hyderabad, Telangana:

Realme 15 Pro 5g Huge Offer On Amazon: ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. ముఖ్యంగా అత్యంత తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్సతో లభించే మొబైల్స్‌కి మంచి డిమాండ్‌ ఉంది. అయితే, మీరు కూడా ఇలాంటి కోవాలోకి వచ్చే స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి అవకాశంగా భావింవచ్చు. రియల్‌మీ కంపెనీ గతంలో విడుదల చేసిన realme 15 Pro 5G మొబైల్‌ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తోంది. ముఖ్యంగా దీనిని అమెజాన్‌లో కొనుగోలు చేసేవారికి బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్‌ బోనస్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

realme 15 Pro 5G మొబైల్‌ ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌తో విడుదలైంది. ఇది 6.8 ఇంచుల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా  144Hz హైపర్‌గ్లో 4D కర్వ్డ్ డిస్‌ప్లే (HyperGlow 4D Curve+) చూడటానికి ఎంతో ప్రీమియంగా ఉంటుంది. ఇందులో కంపెనీ 6500 నిట్స్ (Peak Brightness) గరిష్ట బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. దీని వల్ల ఎండలో కూడా ఎంతో అద్భుతంగా ఈ డిస్ల్పే కనిపిస్తుంది. అలాగే ఇందులో కంపెనీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రోటక్షన్‌తో పాటు కంటిపై ఒత్తిడి పడకుండా 4608Hz PWM డిమ్మింగ్ సపోర్ట్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. 

దీంతో పాటు ఇందులో కంపెనీ శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 (Snapdragon 7 Gen 4) 4nm ప్రాసెసర్‌ను కూడా అందిస్తోంది. ఇది మల్టీటాస్కింగ్‌తో పాటు గేమింగ్‌కు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ realme 15 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ UI 6.0 సాఫ్ట్‌వేర్‌పై రన్‌ అవుతుంది. అలాగే గేమింగ్‌ చేసే క్రమంలో ఫోన్‌ వేడి కాకుండా వేపర్ ఛాంబర్ (VC) కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందిస్తున్నారు. ఇందులో కంపెనీ వెనక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కూడా అందిస్తున్నారు. ఇందులోని ప్రధాన కెమెరా Sony IMX896 సెన్సార్, OIS సపోర్ట్‌తో 50MPతో లభిస్తోంది.

అదేవిధంగా ఇందులో కంపెనీ అదనంగా 50MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను కూడా అందిస్తోంది. ఇందులో AI మ్యాజిక్ గ్లో ఫ్లాష్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. ఇవే కాకుండా ఫ్రంట్‌ భాగంలో 50MP సెల్ఫీ కెమెరా లభిస్తోంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఫ్రంట్‌తో పాటు బ్యాక్ కెమెరాలతో 4K 60FPS హై-క్వాలిటీ వీడియోలను రికార్డ్ చేయవచ్చు. AI పార్టీ మోడ్ వంటి కెమెరా ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి.. ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన భారీ 7000mAh బ్యాటరీతో పాటు 80W సూపర్‌వూక్ (SUPERVOOC) ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.

ఇక ఈ realme 15 Pro 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. ఇది మార్కెట్‌లో MRP ధర రూ.39,999తో అందుబాటులో ఉండగా.. దీనిని ఇప్పుడే ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో కొనుగోలు చేసేవారికి 10 శాతం వరకు తగ్గింపుతో కేవలం రూ.35,999 లోపే సొంతం చేసుకోవచ్చు. ఇవే కాకుండా అదనంగా బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. Amazon Pay బ్యాలెన్స్‌ వినియోగించి పేమెంట్ చేసేవారికి రూ.1,079 తగ్గింపుతో పొందవచ్చు. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేకంగా నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ కూడా లభిస్తోంది. అదేవిధంగా ఏదైన స్మార్ట్‌ఫోన్‌ ఎక్చేంజ్‌ చేస్తే రూ.34,000 బోనస్ లభిస్తుంది. దీంతో ఈ కొత్త మొబైల్‌ కేవలం రూ.1,999కే సొంతం చేసుకోవచ్చ. ఇవే కాకుండా దీనిపై ఎన్నో రకాల ప్రత్యేకమైన ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.  

Also Read:  Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌ అప్‌డేట్‌.. భారీగా జీతాల పెంపు అప్పుడే!

Wadgaon, Maharashtra:

Govt Employees Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 8వ వేతన సంఘం నుంచి బిగ్‌ అప్‌డేట్‌ వచ్చిందని తెలుస్తోంది. వేతన సంఘం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగులు, పింఛన్‌దారులు ఇంకాస్త ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉందని స్పష్టమవుతోంది. జీతాల పెంపు, పింఛన్‌ సవరణ అనేది ఇప్పట్లో ఉండకపోవచ్చని.. 2027 నుంచే అమలవుతుందని వార్తలు వస్తున్నాయి. 8వ వేతన సంఘం జీతాల సవరణ తక్షణమే అమలులోకి వచ్చే అవకాశం లేదని సమాచారం.

Also Read: Hyderabad Police: పోలీసుల మెరుపు వేగం.. గంటల్లోనే రూ.లక్షా 20 వేల నగదు బ్యాగు సీజ్

8వ వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కమిటీ ప్రకటించి.. ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు, వారి వినతులు స్వీకరించింది. త్వరలో వేతన సంఘం అమలవుతుందని కొండత ఆశల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు భారీ షాక్‌ ఇచ్చే వార్త ఇది. కొత్త వేతన విధానం 2026 జనవరి 1 నుంచే అమల్లోకి రానున్నప్పటికీ.. సవరించిన జీతాలు 2027లో మాత్రమే అమలులోకి రావచ్చని ఓ నివేదిక సూచిస్తోంది.

Also Read: AP Govt Gift: ఉచిత విద్యుత్‌కు ఎలా దరఖాస్తు ఎలా? ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త!

జనవరి 2026 నుంచి 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చినా కూడా దాని ప్రయోజనాలు అంటే సవరించిన జీతాలు, పింఛన్‌ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 2027 వరకు వేచి ఉండాల్సి రావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వేతన సవరణ సంఘం అమలులో జాప్యం జరిగితే బకాయిలు పెరిగే అవకాశం ఉంది. వేతన చెల్లింపు, భత్యాలు, పింఛన్లపై వేతన సంఘం అధ్యయనం చేసి.. కేంద్రానికి తన తుది సిఫార్సులను సమర్పించడానికి మరికాస్త సమయం పట్టే అవకాశం ఉండడంతో ఇది అమలయ్యే సమయం పెరిగే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Also Read: Tirumala VIPs Darshan: వేసవి సెలవుల ఎఫెక్ట్‌.. తిరుమల ఆలయానికి వీవీఐపీల రద్దీ

8వ వేతన సంఘం వివరాలు
కేంద్ర మంత్రివర్గం 2025 జనవరిలో 8వ వేతన సంఘానికి ఆమోదం తెలిపింది. అనంతరం ఈ కమిటీకి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. గత వేతన సంఘాల మాదిరిగానే సంప్రదింపులు పూర్తి చేసి.. నివేదికను సిద్ధం చేయడానికి ప్రభుత్వం ఈ సంస్థకు సుమారు 18 నెలల సమయం ఇచ్చింది. వస్తున్న సమాచారం ప్రకారం వేతన సంఘం సిఫార్సులు 2027 మధ్యలో సమర్పించే అవకాశం ఉంది. సమర్పించిన నివేదికను ప్రభుత్వం సమీక్ష చేసి.. సవరించిన జీతాలు, పెన్షన్ల తుది అమలును ప్రకటించనుంది. దీనికి సమయం పట్టేలా ఉంది.

వేతన సంఘం అమలులో ఏ మాత్రం ఆలస్యమైనా.. అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు పెరిగే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం చర్చలలో ఫిట్‌మెంట్ అంశం కీలక సమస్యగా మారింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనాన్ని సవరించడానికి ఈ సూత్రాన్ని ఉపయోగిస్తారు. 7వ వేతన సంఘం కింద ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57గా నిర్ణయించగా.. కనీస మూల వేతనం రూ.18,000కు పెరిగింది. ఈసారి ఉద్యోగ సంఘాలు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.68 నుంచి 3.83 మధ్య ఉంచాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఆమోదం లభిస్తే కనీస ప్రాథమిక వేతనం రూ.51,000 నుంచి రూ.69,000 మధ్య గణనీయంగా పెరగవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటివరకు దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.

8వ వేతన సంఘం సమీక్షించే అంశాలు ఇవే..
కరువు భత్యం (డీఏ)
ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ)
రవాణా భత్యం (టీఏ)
పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ సవరణలు

0
0
Report

Petrol Price Hike: వైఎస్‌ జగన్, చంద్రబాబు కలిసి ఏపీని భ్రష్టు పట్టించారు: వైఎస్‌ షర్మిల

Vijayawada, Andhra Pradesh:

Petrol And Diesel Price Hike: 'ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ పరువు దిగజార్చారు. మోదీ పిలక ట్రంప్ చేతికి చిక్కింది. అమెరికా ఎదుట ఇందిరాగాంధీకి ఉన్న తెగువ .. మోదీకి లేదు' అని కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్‌పై వ్యాట్ భారాన్ని మోపిన వారు ధర్నాలు చేయడానికి సిగ్గుండాలని పరోక్షంగా వైఎస్సార్‌సీపీని విమర్శించారు. భారతదేశాన్ని మళ్లీ నిలబెట్టాలి అంటే రాహుల్ గాంధీతోనే సాధ్యమని షర్మిల ప్రకటించారు.

Also Read: LSG vs RR Highlights: ప్లేఆఫ్స్ రేసులో రాజస్థాన్ రాయల్స్‌ ముందడుగు.. లక్నోపై విజయం

విజయవాడలో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ సమావేశంలో వైఎస్‌ షర్మిల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి కాంగ్రెస్ అవసరం ఉందని తెలిపారు. ⁠నేడు దేశం దారుణ స్థితిలో ఉందనని.. ⁠పెట్రోల్ వాడొద్దు అంటున్నారు, బయట తిరగొద్దు అని అంటున్నారు. ⁠బంగారం కొనొద్దు అంటున్నారు. ⁠దీనికి కారణం ప్రధాని మోదీ' అని వైఎస్‌ షర్మిల ఆరోపించారు.

'⁠ఆనాడు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే జనాల మీద పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ⁠ఒక భారం ప్రభుత్వం , ఒక భారం ఆయిల్ కంపెనీలు, మూడో భారం మాత్రమే ప్రజల మీద వేశారు. ⁠నేడు భారం అని చెప్పి మొత్తం ప్రజల నెత్తిన వేస్తున్నారు' అని ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు. '⁠క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు లాభం పొందారు. ఇప్పుడు ధరలు పెరిగితే జనాల మీద రుద్దుతున్నారు' అని మండిపడ్డారు.

Also Read: YS Sharmila: వైఎస్‌ జగన్, చంద్రబాబు కలిసి ఏపీని భ్రష్టు పట్టించారు: వైఎస్‌ షర్మిల

'⁠ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ చార్జీలు దారుణం. ⁠దేశంలో ఎక్కడ లేని ఛార్జీలు మనదగ్గర ఉన్నాయి. ⁠వ్యాట్ అని సెస్ అని జనాలను దోచేస్తున్నారు. ⁠పెట్రోల్ ధరలు ఏపీలో ఎక్కువగా ఉన్నాయని ధర్నాలు చేయడం సిగ్గుచేటు. ⁠మీ హయాంలో లీటర్ ధరపై 4 రూపాయల వ్యాట్ ఎందుకు వసూలు చేశారు? ⁠వ్యాట్ తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు మాట మార్చారు. ⁠మ్యానిఫెస్టోలో పెట్టి మోసం చేశారు' అని జగన్‌, చంద్రబాబు లక్ష్యంగా వైఎస్‌ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.

'ప్రధానమంత్రి మోదీ దేశ పరువు దిగజార్చారు. ⁠ఆనాడు ఇందిర హయాంలో ఒక మహిళగా అమెరికాను ఎదుర్కొన్నారు. ⁠మా దేశంపై మీ జోక్యం అనవసరం అని ధైర్యంగా చెప్పారు' అని వైఎస్‌ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. '⁠నేడు మోదీ ట్రాంప్ దగ్గర సాగిలపడ్డాడు. ⁠మోదీ పిలక ట్రాంప్ చేతికి చిక్కింది. ⁠అదానీ కోసం ట్రంప్ కి మోదీ బానిస అయ్యాడు. ⁠భారతీయులను సంకెళ్లు వేసి అమెరికా దేశానికి పంపితే కళ్ళప్పగించి చూశాం' అని వైఎస్‌ షర్మిల గుర్తుచేశారు. 'ప్రస్తుతం పాకిస్తాన్, చైనా మళ్లీ అమెరికాకు దగ్గర అవుతున్నాయి. ⁠దేశ గౌరవాన్ని మోదీ దారుణంగా దిగజార్చారు. ⁠దేశాన్ని మళ్లీ నిలబెట్టాలి అంటే రాహుల్ తోనే సాధ్యం. ⁠రాహుల్ దాచుకున్నది ఏమీ లేదు . దోచుకున్నది ఏమీ లేదు' అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు.

Also Read: 8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌ అప్‌డేట్‌.. భారీగా జీతాల పెంపు అప్పుడే

0
0
Report

YS Sharmila: వైఎస్‌ జగన్, చంద్రబాబు కలిసి ఏపీని భ్రష్టు పట్టించారు: వైఎస్‌ షర్మిల

Vijayawada, Andhra Pradesh:

YS Sharmila vs YS Jagan: '⁠విభజన హామీలకు అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు , జగన్ ఒక్క మాట కూడా బీజేపీని అడగలేదు. ⁠చంద్రబాబు, జగన్ ఇద్దరు కలిసి అభివృద్ధిని ఖూనీ చేశారు. ⁠11 ఏళ్లు దాటుతున్న రాజధాని లేని రాష్ట్రం అంటే అది ఏపీనే. రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు' అని కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. '⁠బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తే బాబు, జగన్, పవన్ కల్యాణ్‌ ముగ్గురు మోదీకి ఊడిగం చేస్తున్నారు. ⁠పోటీలు పడి మద్దతు ఇస్తున్నారు. ⁠బీజేపీ బిల్లులకు గొర్రెల్లా మద్దతు ఇస్తున్నారు. ⁠జగన్ నవరత్నాలు, ⁠చంద్రబాబు సూపర్ సిక్స్‌లు మోసాలే' అని వైఎస్‌ షర్మిల విమర్శించారు. పదేళ్లలో ఉద్యోగాలు లేవని.. ⁠జలయజ్ఞం కింద పెండింగ్ ప్రాజెక్టులని పూర్తి చేయలేదని.. ⁠బీజేపీ అంటే రాష్ట్రంలో బాబు, జగన్, పవన్ అని వైఎస్‌ షర్మిల అభివర్ణించారు.

Also Read: AP Govt Gift: ఉచిత విద్యుత్‌కు ఎలా దరఖాస్తు ఎలా? ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త!

విజయవాడలో కాంగ్రెస్‌ పార్టీలోకి వివిధ పార్టీల నాయకులు చేరడంతో వారికి ఆహ్వానం పలికిన అనంతరం షర్మిల కీలక ప్రసంగం చేశారు. వైఎస్‌ జగన్‌, చంద్రబాబుతోపాటు కేంద్ర సర్కార్‌పై నిప్పులు చెరిగారు. 'పాదయాత్రలు చేసినంత మాత్రాన వైఎస్సార్ వారసులు కారు. వైఎస్సార్‌ పేరు చెప్పి అధికారంలోకొచ్చి మెడలు, మిద్దెలు కట్టుకున్నారు. ⁠ఇంట్లో కూర్చొని బటన్ నొక్కడం కాదు వైఎస్సార్ వారసత్వం. ⁠ప్యాలెస్‌లో బతికితే కాదు వైఎస్సార్ వారసత్వం. వైఎస్సార్‌ ఆశయాలు, ఐడియాలజీ పాటించే వారే నిజమైన వారసులు. ⁠కాంగ్రెస్ పార్టీని బలపరచడం అంటే ఆయన ఆశయాలను నిలబెట్టడం' అని వైఎస్‌ షర్మిల తెలిపారు.

Also Read: 8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌ అప్‌డేట్‌.. భారీగా జీతాల పెంపు అప్పుడే

తన తండ్రి వైఎస్సార్‌ సులువుగా ముఖ్యమంత్రి కాలేదని.. ⁠ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఎంతో కష్టపడ్డాడని షర్మిల చెప్పారు. ⁠ప్రజల కోసం వెళ్లి చనిపోయాడని గుర్తుచేసుకున్నారు. ⁠ఈ మధ్య నాయకులు ఒకసారి ముఖ్యమంత్రి అయితే ప్రజలకు అందుబాటులో లేరు. ⁠సొంత పార్టీ నాయకులకు కూడా కనపడలేదు. ⁠మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా కలవడానికి వీలు లేదు' అని తన సోదరుడు వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి షర్మిల వ్యాఖ్యానించారు.

ప్రజానాయకుడు వైఎస్సార్‌ అని.. ⁠ఇలాంటి నాయకుడు మళ్లీ పుట్టడు. ⁠ముఖ్యమంత్రి అయ్యాక కూడా రచ్చబండ పెట్టాడు. వైఎస్సార్‌ ప్రవేశ పెట్టిన పథకాలు ప్రతిదీ అద్భుతం. ⁠ఇతర పార్టీల ఐడియాలజీకి , కాంగ్రెస్ ఐడియాలజీకి చాలా భిన్నం. ⁠రాష్ట్ర ప్రజలు మళ్లీ కాంగ్రెస్ ఐడియాలజీ కోరుకుంటున్నారు' అని వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. '⁠దేశంలో, రాష్ట్రంలో రాజ్యాంగం బతికి ఉండాలి అంటే మళ్లీ కాంగ్రెస్ అధికారంలో రావాలి. ⁠దేశంలో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవ్వాలి' అని ఆకాంక్షించారు. 'వైఎస్సార్‌ రాహుల్‌ను ప్రధాని చేయాలని కోరుకున్నారు. వైఎస్సార్‌ కలను నిజం చేయడానికి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా' అని వివరించారు.

Also Read: India Squad: అఫ్ఘానిస్తాన్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. హిట్‌మ్యాన్‌ రీఎంట్రీ

'⁠విభజన తర్వాత ఆంధ్రరాష్ట్రం చితికి పోయింది. ⁠మళ్లీ రాష్ట్రం బాగుపడాలి అంటే కాంగ్రెస్ రావాలి. ⁠తెలంగాణ ఉద్యమంలో ఎక్కువమంది చనిపోవద్దని రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించింది. ⁠ఆంధ్రకు అన్యాయం చేయాలని విభజన చేయలేదు. విభజిత రాష్ట్రాన్ని నిలబెట్టాలని ఎన్నో హామీలు చట్టంలో పెట్టారు. విభజించిన తర్వాత రాష్ట్రం వెంటనే బాగుపడేలా హామీలు ఇచ్చారు. ⁠ప్రత్యేక హోదా కాంగ్రెస్ చట్టంలో పెట్టింది. ⁠హోదా వచ్చి ఉంటే పన్నుల రాయితీ ఉండేది. ⁠వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చేవి. ⁠పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. ⁠కేంద్రమే నిర్మించి 35 లక్షల ఎకరాలను సస్యశామలం చేయాలని అనుకున్నారు. ⁠రాజధాని నిర్మాణం కేంద్రమే అని హామీ ఇచ్చారు. ⁠కడప స్టీల్ , దుగరాజపట్నం, మెట్రో రైల్, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇలా ఎన్ని హామీలు. ⁠ఆనాడే కేంద్రం ఇచ్చిన హామీల విలువ అక్షరాల రూ.5 లక్షల కోట్లు' అని వైఎస్‌ షర్మిల చిట్టా విప్పారు.

కానీ విభజన తర్వాత ఒక్క హామీ నేటికి నెరవేరలేదని.. ⁠కాంగ్రెస్ అధికారంలో వచ్చి ఉంటే ఇచ్చిన ప్రతి హామీ నెరవేరి ఉండేదని వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. ⁠బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కి 11 ఏళ్లుగా వెన్నుపోటు పొడుస్తుంది. ⁠అధికారంలో వచ్చిన టీడీపీ, వైఎస్సార్‌సీపీలు స్వార్థ రాజకీయాలు చేసుకున్నాయి. హోదా మీద ఇద్దరు మాట్లాడలేదు. ⁠పోలవరానికి అన్యాయం జరుగుతుంటే నోరు విప్పలేదు' అని జగన్‌, చంద్రబాబుపై మండిపడ్డారు.

0
0
Report
Advertisement

LSG vs RR Highlights: ప్లేఆఫ్స్ రేసులో రాజస్థాన్ రాయల్స్‌ ముందడుగు.. లక్నోపై విజయం

Jaipur, Rajasthan:

RR Won By 7 Wickets: ఐపీఎల్‌ 2026 ప్లేఆఫ్స్‌ రేసు రసవత్తరంగా సాగుతున్న సమయంలో రాజస్థాన్‌ రాయల్స్‌ ముందడుగు వేసింది. రేసులో కొనసాగాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ అద్భుతంగా ఆడి లక్నో సూపర్‌ జియాంట్స్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో ప్లేఆఫ్స్‌ రేసులో ఇంకా తానున్నానని రాజస్థాన్‌ ప్రకటించగా.. 9వ ఓటమితో లక్నో పాయింట్ల పట్టికలో తన అట్టడుగు స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. వైభవ్‌ సూర్యవంశీ భారీ ఇన్నింగ్స్‌తో రాజస్థాన్‌ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

లక్నో విధించిన 221 లక్ష్యాన్ని 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ ఛేదించింది. కెప్టెన్‌ యశస్వి జైస్వాల్‌ 23 బంతుల్లో 43 పరుగులు చేసి సత్తా చాటగా.. బాల క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ చెలరేగి ఆడాడు.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన లక్నో సూపర్‌ జియాంట్స్‌ నిర్ణీత 20 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలనే కసితో మిచెల్‌ మార్ష్‌ అద్భుతంగా ఆడి విధ్వంసం సృష్టించాడు. 57 బంతుల్లో 96 పరుగులు చేసి కొద్దిలో సెంచరీని మిస్సయ్యాడు. 11 ఫోర్లు, ఐదు సిక్సర్లతో దుమ్మురేపాడు. ఏమాత్రం బెరుకు లేకుండా పవర్‌ప్లే నుంచే దూకుడు ప్రారంభించగా.. అతడికి జోష్‌ ఇంగ్లిష్‌ జత కలిశాడు. 29 బంతుల్లో ఇంగ్లిష్‌ 60 పరుగులు చేసి సత్తా చాటాడు. ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో దూకుడుగా ఆడి భారీ స్కోర్‌కు బాటలు వేశారు. నికోలస్‌ పూరన్‌ (16) తక్కువ స్కోర్‌ చేయగా.. కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ 32 బంతుల్లో 35 పరుగులతో రాణించాడు. రాజస్థాన్‌ బౌలింగ్‌ మెరుగవ్వాలని బౌలర్ల ప్రదర్శన చూస్తే చెప్పవచ్చు. యశ్‌ పూజా రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.

పాయింట్ల పట్టికలో ఆఖరున ఉన్న లక్నో సూపర్‌ జియాంట్స్‌ ఆ స్థానాన్ని తాజా ఓటమితో మరింత పదిలం చేసుకుంది. మొత్తం 13 మ్యాచ్‌లు ఆడి 4 విజయాలు, 9 ఓటములను చవిచూసి ఈ సీజన్‌లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. రాజస్థాన్‌ రాయల్స్‌ ఆడిన 13 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు, 6 పరాజయలు పొంది ఇంకా ప్లేఆఫ్స్‌ రేసులో కొనసాగుతోంది. 23వ తేదీన లక్నో ఆఖరి మ్యాచ్‌ పంజాబ్‌తో ఆడనుండగా.. రాజస్థాన్‌ 24వ తేదీన ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టనుంది. లక్నోకు జయాపజయాలతో సంబంధం లేకపోయినా.. రాజస్థాన్‌కు మాత్రం భారీ ప్రయోజనం దాగి ఉంది. గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెడుతుంది.. లేదంటే వెనక్కి జరుగుతుంది.

0
0
Report

Bandi bhagirath: కీలక ఆధారాలతో ఆ రోజు వస్తా.!. సిట్ పోలీసులకు బండి భగీరథ్ సంచలన లేఖ..

Hyderabad, Telangana:

Bandi Bhagirath responds to Hyderabad police sit notices: కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండీ భగీరథ్ పోక్సో కేసు వివాదం తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతుంది. ఇప్పటికే దీనిపై బీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శనాస్త్రాలను సంధిస్తుంది. మే 8న కేసు నమోదైతే ఇప్పటి వరకు అరెస్ట్ చేయక పోవడం ఏంటని నేతలు మండిపడుతున్నారు. మంత్రుల కొడుకులకు ఒక న్యాయం, ప్రజలకు మరో న్యాయమా అంటూ ఫైర్ అవుతున్నారు. మరోవైపు బండి సంజయ్ దేశం వదిలి పారిపోయాడా అంటూ పలు చోట్ల పోస్టర్ లు వెలిశాయి. ఈ క్రమంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసును విచారిస్తోంది. తమ ఎదుట విచారణకు రావాల్సిందిగా భగీరథ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు పోలీసుల ముందు విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. అయితే సమయం గడిచినప్పటికీ భగీరథ్.. పోలీసుల విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలో తాజాగా.. బండి భగీరథ్ సిట్ పోలీసులకు మెయిల్ చేయడం సంచలనంగా మారింది.

ఈ క్రమంలో తాను మే 15న సిట్ పోలీసుల ఎదుట హజరవుతానని ఆ లేఖలో పేర్కొన్నాడు.  కీలక సాక్షాలతో విచారణకు హాజరవుతానంటూ  బండి భగీరథ పేర్కొన్నాడు. తనకు రెండు రోజుల సమయం కావాలని గడువు కోరాడు. అంతే కాకుండా SIT దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని కూడా భగీరత్‌ తన లేఖలో పేర్కొన్నాడు. వ్యక్తిగత కారణాలతో ఈ రోజు రాలేకపోయానని లేఖలో పేర్కొన్నాడు.   ఈ లేఖ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ మారింది.

బండి  భగీరథ్ పై పోలీసులు BNS 74,75 తో పాటు సెక్షన్ 5 (i) రెడ్ విత్ 6 కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలి నుంచి రెండో సారి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. తాజాగా నిందితుడిపై తీవ్రమైన లైంగిక దాడి, ముందుగా ప్లాన్ చేసి లైంగిక చర్యలకు పాల్పడినట్లు సెక్షన్ 5 (i)ను కూడా పోలీసులు జతపరిచారు.

Read more: Kalva kuntla Kavitha: మైనర్ అమ్మాయికే ఎక్కువ నష్టం..!.. బండి భగీరథ్

మరోవైపు ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో బండి భగీరథ్ పిటిషన్‌ వేశారు. ఇక తెలంగాణ హైకోర్టులో బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పై రేపు విచారణ జరగనుంది. హైకోర్టు ఏవిధంగా తీర్పునిస్తుంది.. బండి సంజయ్ కొడుకు ఏవిధమైన ఆధారాలను సిట్ ముందు ఉంచుతారో అన్నదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

India Squad: అఫ్ఘానిస్తాన్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. హిట్‌మ్యాన్‌ రీఎంట్రీ, నలుగురికి తొలి ఛాన్స్‌

Wadgaon, Maharashtra:

India Squad For Afghanistan Series: ఐపీఎల్‌ 2026 సీజన్‌ ముగింపు చేరుకోవడంతో భారత జట్టు తదుపరి టోర్నీలపై దృష్టి సారించింది. మెగా టోర్నీ ముగిసిన వారానికే టీమిండియా అఫ్ఘానిస్థాన్‌తో తలపడనుంది. ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్‌ కోసం అఫ్ఘానిస్థాన్‌ భారత పర్యటనకు రానుంది. ఐపీఎల్‌లో వేర్వేరు జట్ల‌లో ఆడుతున్న టీమిండియా ఆట‌గాళ్లు మ‌ళ్లీ భారత జట్టుగా కనిపించనున్నారు. జూన్‌ 6వ తేదీ నుంచి ఏకైక టెస్టు, 14, 17, 20 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌ కోసం సమావేశమైన బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌కు శుభమన్‌ గిల్‌ సారథ్యం వహించనుండగా.. ఐపీఎల్‌లో సత్తా చాటుతున్న ఆటగాళ్లందరికీ అవకాశం లభించింది.

Also Read: SRH Qualified: చెన్నైకి తీవ్ర నిరాశ.. ఐపీఎల్‌ 2026 ప్లేఆఫ్స్‌లోకి హైదరాబాద్

అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ టెస్టు, వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టు జాబితాను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు స్థానం లభిస్తుందా? లేదా అనే ఉత్కంఠ కొనసాగుతుండగా.. కమిటీ సీనియర్‌ ఆటగాడికి చోటు కల్పించింది. అతడితోపాటు హార్దిక్‌ పాండ్యాకు కూడా స్థానం దక్కింది. ఇక ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న రిషబ్‌ పంత్‌ను వన్డేలకు ఎంపిక చేయకపోగా టెస్టుకు ఎంపిక చేయడం గమనార్హం. స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, సీనియర్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు చోటు దక్కలేదు. వీరిద్దరూ ఐపీఎల్‌లో సత్తా చాటలేకపోయారు. బుమ్రా అయితే ఒకటి రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో అతడికి జట్టులో స్థానం లభించలేదు.

Also Read: AP Govt Gift: ఉచిత విద్యుత్‌కు ఎలా దరఖాస్తు ఎలా? ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త!

నలుగురికి ఛాన్స్
ఏకైక టెస్టు మ్యాచ్‌కు గిల్‌ సారథ్యం వహిస్తుండగా.. కేఎల్ రాహుల్ వైస్‌ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. మ‌రోవైపు వ‌న్డేల‌కు శ్రేయ‌స్ అయ్య‌ర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికవగా.. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ర‌ఫున నిల‌క‌డ‌గా రాణిస్తున్న ప్రిన్స్ యాద‌వ్‌తోపాటు హర్ష్‌ దూబే, గుర్నూర్‌ బ్రార్‌, మానవ్‌ సుతార్‌కు జాతీయ జట్టులో తొలిసారి స్థానం లభించింది. అక్షర్‌ పటేల్‌, ఆకాశ్‌ దీప్‌లకు చోటు లభించకపోగా.. సీనియ్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ ఎంపికపై సెలక్షన్‌ కమిటీ చర్చించలేదని చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ ప్రకటించారు.

Also Read: Tirumala VIPs Darshan: వేసవి సెలవుల ఎఫెక్ట్‌.. తిరుమల ఆలయానికి వీవీఐపీల రద్దీ

భారత వన్డే జట్టు
శుభమన్ గిల్ (కెప్టెన్‌), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీశ్‌ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే,

భారత టెస్ట్ జట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్‌ కెప్టెన్‌), సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ దువ్రేల్, గుర్నూర్ దువ్రార్ జురేల్,

మ్యాచ్‌ల వివరాలు
ఏకైక టెస్టు: జూన్‌ 6-10 తేదీల్లో చండీగడ్‌, ముల్లాన్‌పూర్‌
తొలి వన్డే: జూన్‌ 14, ధర్మశాల (హిమాచల్‌ప్రదేశ్‌)
రెండో వన్డే: జూన్‌ 17, లక్నో (ఉత్తరప్రదేశ్‌)
మూడో వన్డే: జూన్‌ 20, చెన్నై (తమిళనాడు)

0
0
Report
Advertisement

Hyderabad Police: పోలీసుల మెరుపు వేగం.. గంటల్లోనే రూ.లక్షా 20 వేల నగదు బ్యాగు స్వాధీనం

Secunderabad, Telangana:

Ramgopalpet Police: హైదరాబాద్‌ పోలీసులు మెరుపు వేగంతో స్పందించి ఒక యువకుడికి సహాయం చేశారు. అతడు పోగొట్టుకున్న డబ్బు ఉన్న బ్యాగ్‌ను సురక్షితంగా అందించారు. ఫిర్యాదు అందిన కొన్ని నిమిషాల్లోనే అతడి బ్యాగును తిరిగి తీసుకువచ్చి ఇచ్చారు. ఈ సంఘటన హైదరాబాద్‌లో జరిగింది. ప్రజలకు హైదరాబాద్‌ ప్రజలు ఎల్లప్పుడూ అండగా.. రక్షణగా నిలుస్తారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇంతకీ అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Also Read: Uppal X Road: ఉప్పల్ క్రాస్ రోడ్డు మూసివేత.. వాహనాల దారి మళ్లింపులు ఇవే!

హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో తన తండ్రికి శస్త్రచికిత్స చేస్తుండడంతో ఖర్చుల కోసం సాయి కుమార్ అనే యువకుడు రూ.1,20,000 నగదుతో ఈనెల 18వ తేదీన నగరానికి వచ్చాడు. తన తండ్రికి ఎలా ఉందోననే కంగారు.. ఆందోళనలో ఉన్న యువకుడు ఆటోలో నగదు బ్యాగుతో వచ్చాడు. అయితే ఆస్పత్రిలోకి కంగారు కంగారుగా వెళ్లిపోవడంతో ఆటోలోనే నగదు బ్యాగ్‌ మరచిపోయాడు. లోపలికి వెళ్లాక నగదు బ్యాగ్‌ గుర్తురావడంతో ఆందోళన చెందాడు. చుట్టుపక్కల ఆటో కోసం వెతికితే ఎలాంటి ప్రయోజనం లేకపోలేదు. దీంతో సాయికుమార్‌ వెంటనే సమీపంలోని రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Also Read: AP Govt Gift: ఉచిత విద్యుత్‌కు ఎలా దరఖాస్తు ఎలా? ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త!

తన తండ్రి ఆపరేషన్ కోసం ఆసుపత్రికి నగదు బ్యాగుతో చేరుకుంటే.. కంగారులో చికిత్స కోసం ఉంచిన రూ.1,20,000 నగదు ఉన్న తన బ్యాగును ఆటోలోనే మర్చిపోయినట్లు ఫిర్యాదుదారుడు సాయికుమార్‌ వివరించాడు. వెంటనే స్పందించిన రాంగోపాల్‌పేట పోలీసులు విచారణ చేపట్టారు. ఆటో కోసం వెతకడం ప్రారంభించి సీసీ ఫుటేజీలు పరిశీలించారు. నగదు కలిగిన బ్యాగును అతి తక్కువ సమయంలోనే సురక్షితంగా రికవరీ చేసి బాధితుడికి అందజేశారు.

Also Read: Tirumala VIPs Darshan: వేసవి సెలవుల ఎఫెక్ట్‌.. తిరుమల ఆలయానికి వీవీఐపీల రద్దీ

ఫిర్యాదు అందిన వెంటనే రాంగోపాల్‌పేట ఎస్‌హెచ్‌ఓ (ఎస్‌హెచ్‌ఓ) బి. సురేష్ కుమార్ తక్షణమే స్పందించి కానిస్టేబుళ్లు జి.సురేష్, ఎస్. ప్రమోద్ కుమార్, బి. నరసింహలతో కూడిన ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. ఈ బృందం ఆసుపత్రి పరిసరాల్లోని.. మార్గంలోని (సీసీటీవీ) ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించి ఆటో నంబర్‌ను గుర్తించారు. ఆ ఆటో డ్రైవర్‌ను విజయవంతంగా కనిపెట్టి ఆటోలో ఉన్న నగదు బ్యాగ్‌ను తీసుకున్నారు.

పోలీసు బృందం ఆటోను గుర్తించిన వెంటనే ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదుదారుడికి సంబంధించిన బ్యాగును, అందులోని రూ.1,20,000 డబ్బును పైసా కూడా తగ్గకుండా పోలీస్ అధికారుల సమక్షంలో భద్రంగా అప్పగించారు. కష్ట సమయంలో మెరుపు వేగంతో స్పందించి తన తండ్రి వైద్యానికి అవసరమైన నగదును తిరిగి ఇప్పించిన రాంగోపాల్‌పేట పోలీసులకు ఫిర్యాదుదారుడు సాయి కుమార్ ధన్యవాదాలు తెలిపాడు. ఆటో డ్రైవర్ నిజాయితీని రాంగోపాల్‌పేట ఎస్‌హెచ్‌ఓ సురేష్ కుమార్ అభినందించి శాలువాతో సత్కరించారు. 

0
0
Report

Petrol Diesel Price Hike: ముడి చమురు ఎఫెక్ట్.. దేశంలో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్.. కొత్త ధరలివే..!!

BBhoomi1d ago
Secunderabad, Telangana:

Petrol Diesel Price Hike:  :పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల  ప్రభావం భారత దేశంపై కూడా కనిపిస్తోంది. పెరుగుతున్న చమురు ధరల కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మంగళవారం నాడు చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. ఈసారి పెట్రోల్ ధరను లీటరుకు 87 పైసలు, డీజిల్ ధరను లీటరుకు 91 పైసలు పెంచాయి. కొత్త ధరల అమలు నేపథ్యంలో... రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 98.64కు చేరగా, డీజిల్ ధర లీటరుకు రూ. 91.58గా ఉంది. చమురు కంపెనీలు సోమవారం అర్ధరాత్రి పెట్రోల్ పంప్ ఆపరేటర్లకు కొత్త ధరల సమాచారాన్ని పంపగా.. మంగళవారం ఉదయం ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. నిరంతరం పెరుగుతున్న ధరలు ప్రజల్లో ఆందోళనను పెంచాయి.

4 రోజుల క్రితం కూడా ధరలు పెరిగాయి:

అంతకుముందు నాలుగు రోజుల క్రితం పెట్రోల్, డీజిల్ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ఆ రోజు.. పెట్రోల్ ధర లీటరుకు రూ. 3.14 పెరిగి లీటరుకు రూ. 97.77కు చేరింది. డీజిల్ ధరలు కూడా రూ. 3.11 పెరిగి లీటరుకు రూ. 90.67కు చేరుకున్నాయి. ఇప్పుడు కేవలం కొద్ది రోజుల్లోనే ఇది రెండవ సారి ధరల పెంపు అని చెప్పాలి. ఈ ధరల పెంపు ప్రభావం ప్రజలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపింది.

Also Read: ప్రభుత్వ రంగ బ్యాంకు సంచలనం.. FDలపై వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం.. కొత్త రేట్లు ఇవే

సామాన్య ప్రజల జేబులపై ప్రభావం:
పెట్రోల్, డీజిల్ ధరల నిరంతర పెరుగుదల సాధారణ ప్రజలను నేరుగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా రోజూ వాహనాల్లో ప్రయాణించేవారు, రవాణా వ్యాపారంలో ఉన్నవారు, చిన్న వ్యాపారాలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు.  ఇంధన ధరల పెరుగుదల బస్సు, టాక్సీ, రవాణా ఖర్చులను పెంచుతుంది. ఇది ఇతర నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటే, రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగవచ్చని నిపుణులు అంటున్నారు. దీనివల్ల ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉందని  చెబుతున్నారు. 

Also Read: మిడిల్ క్లాస్ నచ్చిన Top 5 Electric Scooters ఇవే.. 

 

యుద్ధం.. ప్రపంచ మార్కెట్ కారణం: 
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ ప్రపంచ ముడి చమురు సరఫరాలను ప్రభావితం చేస్తోంది. దీనివల్ల అంతర్జాతీయ చమురు ధరలలో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. భారతదేశం తన చమురు అవసరాలలో గణనీయమైన భాగాన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి ప్రపంచ మార్కెట్‌లోని మార్పులు దేశంలోని ఇంధన ధరలను నేరుగా ప్రభావితం చేస్తాయి.

ప్రభుత్వం, చమురు కంపెనీలు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి. కానీ ప్రస్తుతానికి, అధిక పెట్రోల్, డీజిల్ ధరల నుండి ఉపశమనం లభించే ఆశ తక్కువగా కనిపిస్తోంది. పెరుగుతున్న ధరలు గృహ బడ్జెట్‌లపై మరింత భారం మోపుతున్నాయి. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న కాలంలో మరిన్ని చెడు రోజులను ఎదుర్కొవల్సిన పరిస్థితి ఉందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

0
0
Report

SRH Qualified: చెన్నైకి తీవ్ర నిరాశ.. ఐపీఎల్‌ 2026 ప్లేఆఫ్స్‌లోకి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

Chennai, Tamil Nadu:

SRH Qualified To Playoffs: ఐపీఎల్‌ 2026 ప్లేఆఫ్స్‌లోకి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు దూసుకెళ్లింది. చెన్నై జట్టుపై ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చిన హైదరాబాద్‌ అద్భుత విజయం సాధించి ముందడుగు వేసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నైను చిత్తు చేసింది. టాప్‌ జట్టుగా ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ సీజన్‌లోనూ ప్లేఆఫ్స్‌ అవకాశాలను చేజార్చుకుంది. మొదట తడబడి.. తర్వాత పుంజుకుని అనంతరం మళ్లీ వెనకబడడంతో ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు ఓడిపోయింది.

ప్రత్యర్థి విధించిన 181 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 6 వికెట్ల తేడాతో ఛేదించింది. పవర్‌ప్లేలో తడబడినా.. తర్వాత బ్యాటర్లు పుంజుకోవడంతో మ్యాచ్‌ను సులువుగా హైదరాబాద్‌ సొంతం చేసుకుంది. ముందడుగు వేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ట్రావిస్‌ హెడ్‌ మరోసారి నిరాశపర్చగా.. అభిషేక్‌ శర్మ (26) తక్కువ పరుగులకు ఔటయ్యాడు. ప్లేఆఫ్స్‌ లక్ష్యంగా ఇషాన్‌ కిషన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌ ఆడారు. 26 బంతుల్లో 47 పరుగులు చేసిన క్లాసెన్‌.. ఆరు బౌండరీలు, రెండు సిక్సర్లు బాదాడు. ఇషాన్‌ కిషన్‌ 47 బంతుల్లో 70 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. నితీశ్‌ కుమార్‌ రెడ్డి 7 బంతుల్లో 11 స్కోర్‌ చేశాడు. సలీల్ అరోరా విన్నింగ్ షాట్లు ఆడాడు.

అంతకుముందు టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్‌లలో 7 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (15), ఊర్విల్‌ పటేల్‌ (13) తక్కువ పరుగులకు ఔటయ్యారు. స్టార్‌ ఆటగాడు సంజూ శామ్‌సన్‌ 27 పరుగులు చేయగా.. కార్తీక్‌ శర్మ 32 స్కోర్‌ చేసి సత్తా చాటారు. డెవాల్డ్‌ బ్రేవిస్‌ 27 బంతుల్లో 44 పరుగులు జోడించాడు. శివమ్‌ దూబే (26), ప్రశాంత్‌ వీర్‌ (11) తలా కొంత స్కోర్‌ చేశారు. ప్రత్యర్థి సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పదునైన బౌలింగ్‌ వేసింది. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ మూడు వికెట్లు తీయగా.. షకీబ్‌ హుస్సే రెండు వికెట్లు తీశాడు. ప్రఫుల్‌ హింగే, ఈషాన్‌ మలింగ ఒక్కో వికెట్‌ తీశారు.

ఐపీఎల్‌ 2026లో 13 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 8 విజయాలతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకుని ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. చెన్నై 13 మ్యాచ్‌లు ఆడి 6 విజయాలు, ఏడు ఓటములతో ప్లేఆఫ్స్‌కు దూరమైంది. కానీ ఈ సీజన్‌లో చెన్నై ప్రదర్శన గొప్పగా ఉంది. మొదట పడిపోవడం.. అనంతరం గొప్పగా పుంజుకుని ప్లేఆఫ్స్‌ రేసులోకి ప్రత్యర్థులను భయపెట్టింది.

0
0
Report
Advertisement
Advertisement
Back to top