icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505001
SShankerreddyFollow17 Jul 2024, 11:48 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

S.Janaki Last Video: గాయని ఎస్.జానకి చివరి వీడియో..జానకమ్మ పాదాల చెంత సింగర్ సునీత..ఇరువురి మధుర స్మృతులు!

Hyderabad, Telangana:

Singer S.Janaki Last Video: ఏడు దశాబ్దాల పాటు తన అమృత గాత్రంతో కోట్లాది మంది శ్రోతలను మైమరపించిన ప్రఖ్యాత గాయని, గానకోకిల ఎస్.జానకి (జానకమ్మ) భౌతికంగా మనకు దూరమయ్యారు. అయితే, ఆమె జీవిత చరమాంకంలోనూ సంగీతాన్ని ఎంతగానో ప్రేమించారనడానికి నిదర్శనంగా నిలిచిన ఒక అపురూపమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

జానకమ్మ పాదాల చెంత సునీత..
ఇటీవల చెన్నైలోని జానకమ్మ నివాసానికి ప్రముఖ గాయని సునీత వెళ్లారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ జానకమ్మ తనను చూడటానికి వచ్చిన సునీతను ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఆ సమయంలో సునీత.. జానకమ్మ పాదాల చెంత కూర్చొని ఎంతో మధురంగా పాటలు పాడారు.

సింగర్ సునీత పాడుతున్నంత సేపూ జానకమ్మ ముఖంలో ఒక తెలియని తృప్తి, ఆనందం కనిపించాయి. అనారోగ్యాన్ని సైతం మర్చిపోయి చిరునవ్వుతో చప్పట్లు కొడుతూ, సునీతను ఎంతో ఉత్సాహంగా అభినందించారు.

కన్నీరు పెట్టిస్తున్న దృశ్యాలు 
సంగీత ప్రపంచంలోని ఇద్దరు అద్భుతమైన గాయనుల మధ్య జరిగిన ఈ భావోద్వేగ భరితమైన సంభాషణ, ఆత్మీయ కలయికకు సంబంధించిన విజువల్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. "చివరి క్షణం వరకు ఆమె పాటలతోనే బతికారు.. పాటలతోనే ప్రయాణం ముగించారు" అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ముగిసిన అమృత గాత్ర ప్రస్థానం
ఈ మధురమైన సంఘటన జరిగిన కొన్ని రోజులకే జానకమ్మ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. తమ గుండెల్లో నిలిచిపోయే వేలాది పాటలను అందించిన జానకమ్మ ఇకలేరనే వార్తను అభిమానులు, సంగీత కళాకారులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా.. సునీత పాడిన పాటను వింటూ ఆమె చప్పట్లు కొట్టిన ఆ 'చివరి వీడియో' మాత్రం అందరినీ కదిలిస్తోంది. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో జానకమ్మ వదిలివెళ్లిన శూన్యం ఎప్పటికీ పూడ్చలేనిది. ఆమె పాడిన పాటలు ఉన్నంత కాలం జానకమ్మ ప్రతి ఒక్కరి హృదయాలలో జీవించే ఉంటారు.

Also Read: రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ? ఫ్యాన్స్‌తో భారీ ప్లానింగ్..ముహూర్తం కూడా ఫిక

Also Read: 'మళ్లీ రావా' చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా? ఆ క్యూట్‌ పిల్ల కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్‌గా.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

YS Jagan On Amaravati: "అమరావతి పేరిట రైతులపై ప్రభుత్వ రాక్షసకాండ" కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం!

Vijayawada, Andhra Pradesh:

YS Jagan On Amaravati Farmers: అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారు. ఇలాంటి బలవంతపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు జగన్ ఓ ప్రకటనలో తెలిపారు. తమ కుటుంబాలకు జీవనాధారమైన భూములను ఇచ్చేది లేదని రైతులు మొత్తుకుంటున్నా.. వారి అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసు బలగాలతో పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమని వైసీపీ ఆ ప్రకటనలో ఆరోపించారు.

పోలీసుల మోహరింపు!
సాగులో ఉన్న పంటల్లోకి బుల్డోజర్లతో దూసుకెళ్లి, రైతులను పొలాల నుంచి బలవంతంగా ఈడ్చిపారేస్తూ భయభ్రాంతులకు గురిచేయడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట అంటూ వైఎస్ జగన్ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.

బాధితులంతా సన్న, చిన్నకారు రైతులేనని.. ఆ కొద్దిపాటి భూమినే నమ్ముకుని, పంటలు పండిస్తూ కుటుంబాలను పోషించుకునే పేద రైతుల గొంతు నొక్కడం దారుణమని ప్రతిపక్ష నేత జగన్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. "రైతులు పెట్టిన పెట్టుబడి ఏమవ్వాలి? ధ్వంసమైన పంటలకు ఎవరు సమాధానం చెబుతారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారు?" అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రశ్నించారు.

తెరవెనుక ఎవరి ప్రయోజనాలు?
రాజధాని పేరిట గతంలోనే వేల ఎకరాలు సేకరించిన ప్రభుత్వం, మొదట భూములిచ్చిన రైతులకే ఇప్పటివరకు న్యాయం చేయలేకపోయిందని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటిది ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం రైతులను వేధించడం వెనుక ఉన్న మర్మమేంటని ఆ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు.

రైతుల అంగీకారం లేకుండా భూములపై ప్లాన్లు గీయడం.. అలాగే వివరాలు చెప్పకుండానే కాగితాల మీద 'అవార్డులు' ప్రకటించుకున్నామని ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం ముమ్మాటికీ అన్యాయమని అన్నారు.

విజయవాడకు కూతవేటు దూరంలో, జాతీయ రహదారికి సమీపంలో ఉండి.. మార్కెట్లో కోట్ల రూపాయల విలువ పలికే భూములకు ప్రభుత్వమే అరకొర ధరలు నిర్ణయించి లాక్కోవడం వెనుక అసలు లబ్ధిదారులు ఎవరు? రైతుల భూములను భవిష్యత్తులో చంద్రబాబు ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అని వైసీపీ అధినేత ఘాటుగా ప్రశ్నించారు.

వైఎస్సార్‌సీపీ ప్రధాన డిమాండ్లు..
రైతులను రోడ్డున పడేసే ఇలాంటి చర్యలను ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేస్తూ ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచింది.
> ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో జరుగుతున్న బలవంతపు భూసేకరణను తక్షణమే నిలిపివేయాలి.

> ధ్వంసం చేసిన పంటలకు రైతులకు తక్షణమే పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించాలి.

> రైతులు స్వచ్ఛందంగా ఇస్తేనే భూములు తీసుకోవాలి తప్ప, వారి సమ్మతి లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా లాక్కోకూడదు.

Also Read: వైసీపీ నేత కొడాలి నానికి బిగ్ షాక్! ప్రశ్న రావణ్‌కు మద్దతు..చిక్కుల్లో మాజీ మంత్రి!

Also Read: రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ? ఫ్యాన్స్‌తో భారీ ప్లానింగ్..ముహూర్తం కూడా ఫిక

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Jr NTR Political Entry: రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ? ఫ్యాన్స్‌తో భారీ ప్లానింగ్..ముహూర్తం కూడా ఫిక్స్!

Hyderabad, Telangana:

Jr NTR Political Entry News: టాలీవుడ్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తదుపరి అడుగులు ఎటువైపు పడబోతున్నాయి? ప్రస్తుతం సినీ, పొలిటికల్ సర్కిల్స్‌లో తారక్‌పై సరికొత్త చర్చ జోరందుకుంది. పొరుగు రాష్ట్రం తమిళనాడులో దళపతి విజయ్ పక్కా ప్లానింగ్‌తో రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ సాధించిన తీరును చూసిన తర్వాత.. ఇప్పుడు ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే జూలై 18న తారక్ ఒక కీలక ప్రకటన చేయనున్నారంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్‌చల్ చేస్తోంది.

జూలై 18న ఏం జరగబోతోంది?
ప్రస్తుతం వినిపిస్తున్న ప్రచారం ప్రకారం.. ఈ నెల 18న జూనియర్ ఎన్టీఆర్ తన అభిమాన సంఘాలను ఒకే తాటిపైకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమానులందరినీ సమన్వయం చేసుకుంటూ, భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు ప్రారంభించేందుకు తారక్ ఒక పక్కా కార్యాచరణను ప్రకటించనున్నట్లు టాక్. 

ముందుగా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత దగ్గరై, ఆ తర్వాతే రాజకీయ అరంగేట్రం చేసేలా ఈ ప్లాన్ ఉందనేది పొలిటికల్ అనలిస్టుల అంచనా. అయితే, ఈ ప్రచారంపై ఇప్పటివరకు ఎన్టీఆర్ టీమ్ లేదా ఆయన క్యాంప్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

గత అనుభవాలు.. ప్రస్తుత మౌనం!
2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (మహాకూటమి) తరపున జూనియర్ ఎన్టీఆర్ సుడిగాలి పర్యటనలు చేశారు. తన వాగ్ధాటితో యువతను విపరీతంగా ఆకట్టుకున్నారు. అయితే, ఆ ప్రచార సమయంలోనే జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడిన తర్వాత.. తారక్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత టీడీపీ కార్యక్రమాల్లోనూ ఆయన ఎక్కడా కనిపించలేదు.

కొంతకాలం క్రితం హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ అయినప్పుడు కూడా దేశవ్యాప్తంగా రాజకీయ చర్చ నడిచింది. కానీ, తారక్ మాత్రం తాను పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యానని, పాన్ ఇండియా ప్రాజెక్టులపైనే తన ఫోకస్ అంతా ఉందని పదే పదే స్పష్టం చేస్తూ వచ్చారు.

18వ తేదీన సస్పెన్స్‌కు తెరపడుతుందా?
ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరం అని చెబుతున్నా.. మరోవైపు అభిమాన సంఘాల యాక్టివిటీస్ గురించిన వార్తలు రావడం ఆసక్తి రేపుతోంది. మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముంది? జూలై 18న తారక్ నిజంగానే ఏదైనా బిగ్ అనౌన్స్‌మెంట్ చేయబోతున్నారా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే!

Also Read:  'అయ్యగారే నంబర్ వన్' అఖిల్ ఫ్యాన్స్ ఊహించని సర్‌ప్రైజ్..ఏ హీరో ఇలా చేయడేమో!

ALso Read: 'మళ్లీ రావా' చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా? ఆ క్యూట్‌ పిల్ల కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్‌గా.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Mojtaba Khamenei Revenge: "నా తండ్రి మరణానికి ప్రతికారం తీర్చుకుంటా"..ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ శపథం!

Haftador, Yazd Province:

Mojtaba Khamenei Revenge News: ఇజ్రాయెల్ - అమెరికా, ఇరాన్‌ల మధ్య గత ఆరు నెలలుగా యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయెతుల్లా అలీ ఖమేనీ టార్గెట్ చేస్తూ చేసిన వైమానిక దాడిలో ఆయన మరణించారు. ఇదే దాడిలో ఆయన కుటుంబసభ్యులు కూడా మరణించారు. అయితే తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ శపథం చేశారు. ఇరాన్ ప్రజలు కూడా ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హతమార్చేందుకు ఇరాన్ సన్నద్ధమవుతుందని ఇటీవలే ఇజ్రాయెల్ గూడఛార సంస్థ యూఎస్‌కు చేరవేసింది. ఈ వార్తలపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. తనను హత్య చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తే, ఆ దేశాన్ని 'పూర్తిగా నాశనం' చేస్తానని హెచ్చరించారు. 

"తండ్రి మృతికి ప్రతీకారం తీర్చుకుంటా"
ఇరాన్ సుప్రీం లీడర్‌గా తన తండ్రి, పూర్వాధిపతి అయిన అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా అమెరికా, ఇజ్రాయెల్‌లపై ప్రతీకారం తీర్చుకుంటానని మొజ్తబా ఖమేనీ శపథం చేశారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన సమయంలో, ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడిలో ఖమేనీ హత్యకు గురయ్యారు.

ప్రభుత్వ టెలివిజన్‌లో ప్రసారమైన, ఖమేనీ కుమారుడు మొజ్తబా రాసిన ఒక లిఖితపూర్వక ప్రకటన ప్రకారం.. "ప్రతీకారం అనేది దేశం డిమాండ్, దానిని ఖచ్చితంగా అమలు చేయాలి. నేరపూరితమైన, నీచమైన హంతకులపై, అమరుడైన నాయకుడితో పాటు ఈ రెండు యుద్ధాలలోని అమరవీరులందరి రక్తానికి మేము ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము" అని మొజ్తబా అన్నారు. ఇరాన్ యొక్క "ప్రతీకారం అనివార్యం" అని కూడా ఆయన జోడించారు.

హత్యకు గురైన సర్వోన్నత నాయకుడికి ఇరాన్ పలు రోజుల పాటు అంత్యక్రియలు నిర్వహిస్తున్న తరుణంలో, శనివారం నాడు మొజ్తబా ఖమేనీ ఈ ప్రకటన చేశారు. తన తండ్రిని బలిగొన్న దాడి జరిగినప్పటి నుండి మొజ్తబా బహిరంగంగా కనిపించలేదు. ఫిబ్రవరి చివర్లో జరిగిన ఆ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారని అమెరికా పేర్కొంది. 

అయితే ఇటీవలే జరిగిన సంస్మరణ సభలోనూ అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా కనిపించకపోవడంపై పలు అనుమానాలు లేవనెత్తుతున్నారు. వైమానిక దాడిలో మొజ్తబా కూడా తీవ్రంగా గాయపడి చికిత్స తీసుకుంటున్నారని పుకార్లు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజముందో తెలియదు. ఒకవేళ అలీ ఖమేనీ అంత్యక్రియలకు మొజ్తబా హాజరైతే ప్రత్యర్థులైన ఇజ్రాయెల్, అమెరికా విరుచుకుపడే అవకాశం ఉందని ఇరాన్ అధికారులు చెబుతున్న నేపథ్యంలో.. ఆయన అంత్యక్రియలకు హాజరు కావడం లేదని చెబుతున్నారు. 

Also REad: స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..30 ఏళ్ల నాటి జ్ఞాపకంతో కంటతడి!

Also Read: అమర్‌నాథ్‌లో శివలింగం అదృశ్యం..అయినా తగ్గని భక్తుల తాకిడి..1.71 లక్షల మంది దర్శనం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

England Vs India Preview: టీమ్ఇండియాకు మరో 'వైట్‌వాష్' గండం..ఇంగ్లాండ్‌తో చివరి మ్యాచ్‌లో అయినా గెలుస్తారా?

England:

England Vs India 5th T20I Preview: ఐర్లాండ్‌లో ఇంగ్లండ్ చేతిలో టీ20 సిరీస్‌ను కోల్పోయిన తర్వాత టీమ్ఇండియా వరుసగా రెండో సారి సిరీస్ ఓడిపోయింది. ఇంగ్లాండ్ తో జరుగుతోన్న టీ20 సిరీస్‌ను ఇప్పటికే 3-0తో చేయిజార్చుకున్న భారత జట్టు చివరి మ్యాచ్‌లో గెలుపొంది క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకోవాలని చూస్తోంది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ గెలవని భారత జట్టు.. నేడు జరిగే ఆఖరి మ్యాచ్‌లో గెలవాలంటే ప్రతి అంశంలోనూ ఇంగ్లాండ్ జట్టును అధిగమించాల్సి ఉంటుంది. 

భారత జట్టు యూకే పర్యటన ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్‌లో తేమ, గాలులతో కూడిన వాతావరణం భారత జట్టుకు ప్రతికూలంగా మారింది. ఉత్తర ఇంగ్లాండ్‌లోని డర్హామ్ తర్వాత ఇప్పుడు సౌతాంప్టన్‌లో చివరి టీ20 మ్యాచ్ ఆడనుండడం వల్ల వాతావరణ, పిచ్ పరిస్థితులను అంచనా వేయడంలో టీమ్ఇండియా కొద్దిగా వెనకబడినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు కలిసిరాని విషయం అనే చెప్పాలి.

కెప్టెన్ అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ ఇప్పటికీ తన మొదటి విజయం కోసం ఇంకా ఎదురుచూస్తున్నాడు. 2006లో భారత జట్టు తొలిసారిగా ఒక టీ20 అంతర్జాతీయ మ్యాచ్ గెలిచిన తర్వాత ఇదే మరో ఓటమి కావడం గమనార్హం. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన రెండో మ్యాచ్ మినహా, భారత జట్టు ఆటలోని ప్రతి అంశంలోనూ పేలవంగా ఆడింది.

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20‌లో భారత జట్టు గెలుపునకు దగ్గరైనా.. కేవలం రవి బిష్ణోయ్ వేసిన 17వ ఓవర్ భారత్‌కు విజయాన్ని దూరం చేసింది. నాటింగ్‌హామ్‌లో జరిగిన మూడో మ్యాచ్‌లో, భారత్ ఇప్పటివరకు తమ అత్యంత పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శనను నమోదు చేసి, 76 పరుగులకే ఆలౌట్ అయింది. బ్రిస్టల్‌లో జరిగిన నాలుగో మ్యాచ్‌లో జట్టు అన్ని విభాగాల్లోనూ విఫలమైంది. ఇప్పుడు భారత జట్టు తమ పరువును నిలబెట్టుకోవడానికి బరిలోకి దిగనుంది.

ఇంగ్లాండ్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్‌ల ఫాస్ట్ బౌలింగ్‌ను తట్టుకోలేకపోవడంపై భారత జట్టు యాజమాన్యం నిస్సందేహంగా ఆందోళన చెందుతోంది. వీరిద్దరితో పాటు లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ సామ్ కర్రన్ కూడా భారత బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టాడు. గాయాల కారణంగా వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాలు జట్టుకు దూరమవ్వడం, అలాగే ఒక ఓవర్‌లో 29 పరుగులు ఇచ్చిన రవి బిష్ణోయ్ తిరిగి వచ్చే అవకాశాలు సన్నగిల్లడంతో బౌలింగ్ విభాగంలో భారత్‌కు చాలా తక్కువ ఎంపికలు ఉన్నాయి.

బ్యాటింగ్ విభాగంలో షార్ట్-పిచ్ బంతులను ఎదుర్కోవడంలో వైభవ్ సూర్యవంశీ పేలవంగా రాణిస్తున్నప్పటికీ, భారత జట్టు యాజమాన్యం అతనికి దీర్ఘకాలిక అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. తుది జట్టు జింబాబ్వే పర్యటన జట్టు నుంచి సంజు శాంసన్‌ను తొలగించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది భారత జట్టు ఫ్యాన్స్‌లో అసంతృప్తికి గురిచేసింది.

ఫామ్‌లో లేని తిలక్ వర్మను తొలగిస్తేనే అతనికి తుది జట్టులో చోటు దక్కుతుంది. దీనివల్ల ఇషాన్ కిషన్, అయ్యర్ ఇద్దరూ ఒక స్థానం కిందకు వెళ్లాల్సి వస్తుంది. కిషన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. అయితే ఇషాన్‌ కిషన్‌ను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం జట్టుకు కలిసిరాని విషయంగా పరిగణించవచ్చు.

భారత జట్టు:
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, సంజు శాంసన్, సూర్యాంశ్ షెడ్గే, రవి బిష్ణోయ్.

ఇంగ్లాండ్ జట్టు:
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, విల్ జాక్స్, సామ్ కర్రాన్, జోష్ టంగ్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, రెహాన్ అహ్మద్, లియామ్ డాసన్, ల్యూక్ వుడ్, సాకిబ్ మహమూద్, సన్నీ బేకర్, జోర్డాన్ కాక్స్, జేమ్స్ కోల్స్.

ALso Read: తప్పక గెలవాల్సిన మ్యాచ్..టీమ్ఇండియా గెలుస్తుందా? ఇంగ్లాండ్‌పై పట్టు సాధిస్తుందా?

Also Read: ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో ముగిసిన మరో శకం.. స్టార్ ఆటగాడు నెయ్‌మేర్ రిటైర్మెంట్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Siddipet: హరీష్ రావు చేసిన సాయానికి రూ.6 లక్షల విరాళం!

Hyderabad, Telangana:

Harish Rao Latest News: సహాయం పొంది మరిచిపోయే ఈ రోజుల్లో.. నా కష్టాన్ని గుర్తించి ఇంజనీరింగ్ సీటు ఇప్పించారు. అందుకే మీ ప్రజా సేవలో నేను కూడా భాగస్వామినవుతాను.. అంటూ రోహిత్ అనే యువకుడు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును కలిశారు. ఉన్నత చదువుల కోసం తాపత్రయపడిన హరీష్ రావు చేసిన సహాయాన్ని మరిచిపోకుండా.. తన మొదటి ఏడాది జీతంలో సగభాగాన్ని సిద్దిపేట సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చి.. రోహిత్ తన కృతజ్ఞతా భావాన్ని చాటుకున్నాడు.

సిద్దిపేట పట్టణానికి చెందిన శ్రీనివాస్, వనిత దంపతుల కుమారుడు రోహిత్.. గతంలో ఉన్నత చదువుల కోసం విఎన్ఆర్ (విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ) కళాశాలలో కంప్యూటర్ సైన్స్ సీటు కావాలని రోహిత్ కుటుంబం హరీష్ రావును ఆశ్రయించింది. ఆ రోజు వారి పరిస్థితిని అర్థం చేసుకున్న హరీష్ రావు.. కేవలం ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో రోహిత్‌కు ఇంజనీరింగ్ సీటు వచ్చేలా సహాయం చేశారు.

మాజీ మంత్రి చేసిన ఆ సాయాన్ని గుండెల్లో పెట్టుకున్న రోహిత్.. ఎంతో కష్టపడి చదివి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం అమెరికా బహుళజాతి సంస్థ (MNC) అయిన రిగల్ రెక్స్‌నార్డ్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించాడు. ఏడాదికి రూ.12 లక్షల భారీ ప్యాకేజీ రోహిత్ ఈ ఉద్యోగంలో స్థిరపడ్డాడు.

తన ఎదుగుదలకు కారణమైన హరీష్ రావుపై ఉన్న ప్రేమ, కృతజ్ఞతతో రోహిత్ శనివారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయనను కలిశారు. తాను సాధించిన ప్రగతిని వివరించి.. తన వార్షిక వేతనం రూ.12 లక్షల్లో సగభాగమైన రూ. 6 లక్షల రూపాయల చెక్కును హరీష్ రావుకు విరాళంగా అందజేశాడు.. హరీష్ రావు సిద్దిపేట ప్రజల కోసం నిరంతరం చేస్తున్న సామాజిక.. సేవా కార్యక్రమాలకు ఈ నిధులను ఉడుతాభక్తిగా వినియోగించుకోవాలని రోహిత్ విజ్ఞప్తి చేశాడు. తన సంపాదన సమాజ సేవకు ఉపయోగపడాలన్నదే తన ఆకాంక్ష అని ఈ సందర్భంగా యువకుడు పేర్కొన్నాడు.

కృతజ్ఞతతో రోహిత్ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయానికి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. సహాయం పొంది లబ్ధి పొందాక కూడా పాత రోజులను, చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకోవడం ఈ రోజుల్లో చాలా అరుదని కొనియాడారు. నేటి తరం ఉద్యోగులకు, యువతకు రోహిత్ ఒక గొప్ప ఆదర్శమని.. ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. రోహిత్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి.. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హరీష్ రావు ఆశీర్వదించారు. 

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Akhil Meets Cult Fan: 'అయ్యగారే నంబర్ వన్' అఖిల్ ఫ్యాన్స్ ఊహించని సర్‌ప్రైజ్..ఇండస్ట్రీలో ఇలా ఏ హీరో చేయడేమో?

Hyderabad, Telangana:

Akkineni Akhil Meets Cult Fan: సాధారణంగా ఏ హీరోకైనా అభిమానులు ఉంటారు.. కొందరికి డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. కానీ, అక్కినేని అఖిల్‌కు మాత్రం ఒక 'కల్ట్ ఫ్యాన్' ఉన్నాడు. ఇప్పటివరకు సరైన కమర్షియల్ సక్సెస్ లేకపోయినా.. అఖిల్‌ను దేవుడిలా ఆరాధిస్తూ, సినిమా రిలీజ్ అయినప్పుడల్లా థియేటర్ల వద్ద రచ్చ చేసే ఒక యువకుడు సోషల్ మీడియాలో ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. "అయ్యగారే నెంబర్ వన్.. ఎవరివల్లా కాదు.. అఖిలే కరెక్ట్!" అంటూ అతడు ఇచ్చిన స్లోగన్‌తోనే ఇప్పుడు అందరూ అఖిల్‌ను ప్రేమగా 'అయ్యగారు' అని పిలుస్తున్నారు.

ఇప్పుడు ఆ కల్ట్ ఫ్యాన్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. దానికి కారణం.. అఖిల్ తాజాగా నటించిన 'లెనిన్' చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడమే!

మాట నిలబెట్టుకున్న అఖిల్!
గతంలో ఈ వీరాభిమాని చేసిన వీడియోలు అఖిల్ దృష్టికి వెళ్లాయి. అప్పట్లో అఖిల్ స్పందిస్తూ.. "కచ్చితంగా నా అభిమానిని కలుస్తాను.. కానీ ఒక భారీ హిట్ కొట్టిన తర్వాతే ఆ కలయిక ఉంటుంది" అని ప్రామిస్ చేశారు.

ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది! 'లెనిన్' మూవీతో అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అందుకోవడంతో.. తన మాటను నిలబెట్టుకునేందుకు అఖిల్ సిద్ధమయ్యారు. తన 'నెంబర్ వన్' ఫ్యాన్‌ను స్వయంగా కలిసి ఒక ఊహించని గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఒక అభిమాని కోసం హీరోనే స్వయంగా వెళ్లడం టాలీవుడ్‌లో బహుశా ఇదే తొలిసారి కావచ్చు. దీనికి సంబంధించిన విజువల్స్ త్వరలోనే బయటకు రానున్నాయి.

థియేటర్లలో 'లెనిన్' ర్యాంపేజ్!
చాలా ఏళ్ల నిరీక్షణ తర్వాత అఖిల్ ఖాతాలో సాలిడ్ హిట్ పడటంతో అక్కినేని ఫ్యాన్స్ థియేటర్ల వద్ద పండగ చేసుకుంటున్నారు. అఖిల్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా 'లెనిన్' రికార్డు సృష్టించింది. బుక్ మై షోలో టికెట్లు శరవేగంగా అమ్ముడవుతుండటంతో వీకెండ్ థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి.

మున్ముందు ఈ సినిమా మరిన్ని కలెక్షన్ల రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. అటు సినిమా సక్సెస్, ఇటు ఫ్యాన్‌కు అఖిల్ ఇవ్వబోతున్న సర్‌ప్రైజ్ తో అక్కినేని క్యాంప్‌లో జోష్ మామూలుగా లేదు!

Also Read: 'మళ్లీ రావా' చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా? ఆ క్యూట్‌ పిల్ల కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్‌గా.

Also REad: "పెళ్లి అంటే భయం..కానీ, ఈ వ్యక్తితో బిడ్డను కనాలని ఉంది" హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరుసగా భర్తల హత్యలు!

Hyderabad, Telangana:

Karimnagar Two Husbands Murdered News: పచ్చని సంసారాల్లో క్షణికావేశం చిచ్చు రేపుతోంది.. చిన్నపాటి మనస్పర్థలతో పాటు రోజువారీ గొడవలు చివరకు దారుణ హత్యలకు దారితీస్తుండటం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నూరేళ్ల బంధానికి ప్రతీకగా నిలవాల్సిన భార్యాభర్తల బంధం.. అనుమానాలు, కోపతాపాల వల్ల రక్తసిక్తమవుతోంది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు భర్తలు భార్యల చేతిలోనే ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

కోరుట్లలో రోకలిబండతో ఘాతుకం..
ఈ నెల 9వ తేదీన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఒక దారుణమైన ఘటన జరిగింది.. ఒక సాదాసీదా కుటుంబంలో రేగిన వివాదం చివరకు ప్రాణాలు తీసే వరకు వెళ్లింది.. భార్యాభర్తల మధ్య జరిగిన తీవ్రమైన వాగ్వాదం కాస్తా .. పెనుగులాటగా మారింది. కోపంతో ఊగిపోయిన భార్య.. ఇంట్లోనే ఉన్న రోకలిబండతో భర్త తలపై బలంగా బాదింది. తీవ్ర రక్తస్రావంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.. 

సుల్తానాబాద్‌లో కుమారుడితో కలిసి..
కోరుట్ల ఘటన మరువక ముందే.. నిన్న పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తుర్క కాశీపల్లి గ్రామంలో మరో ఘోరం జరిగింది. ఇక్కడి కుటుంబంలో కూడా గత కొంతకాలంగా మనస్పర్థలు నడుస్తున్నట్లు సమాచారం. నిన్న రాత్రి జరిగిన గొడవ తీవ్రరూపం కావడంతో.. భార్య తన కుమారుడితో కలిసి భర్తపై దాడికి తెగబడింది. ఇద్దరూ కలిసి అత్యంత క్రూరంగా ఆ వ్యక్తి ప్రాణాలు తీశారు. కన్న తండ్రిని చంపేందుకు కుమారుడు కూడా తల్లికి సహాయడం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది..

పోలీసుల ప్రాథమిక విచారణ..
ఈ రెండు ఘటనల వెనుక ప్రధానంగా కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో పాటు ఒకరిపై ఒకరికి పెరిగిన అనుమానాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ వరుస హత్యల వల్ల కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే చనిపోలేదు.. వారి వెనుక ఉన్న కుటుంబాలు పూర్తిగా రోడ్డున పడ్డాయి.. భర్తలు ప్రాణాలు కోల్పోగా.. భార్యలు, వారికి సహకరించిన పిల్లలు జైలు పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ఆయా కుటుంబాల్లోని చిన్న పిల్లలు అనాథలుగా మారుతున్నారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

మనుషుల మధ్య సహనం నశించిపోవడం.. కోపాన్ని అదుపు చేసుకోలేకపోవడం వల్లే ఇలాంటి ఘాతుకాలు జరుగుతున్నాయని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చిన్న సమస్యలకే కౌన్సిలింగ్ తీసుకోకపోవడం.. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు చేసుకోకపోవడం వల్ల ఇవి హత్యల వరకు దారితీస్తున్నాయి.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

PM Modi Emotional: స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..30 ఏళ్ల నాటి జ్ఞాపకంతో కంటతడి పెట్టుకున్నారు!

Auckland, Auckland:

PM Modi Emotional In New Zealand: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఆక్లాండ్‌లో జరిగిన భారతీయ కమ్యూనిటీ వేడుకలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఒక పాత జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.

40 ఏళ్ల తర్వాత చారిత్రాత్మక పర్యటన..
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. 140 కోట్ల మంది భారతీయ సోదర సోదరీమణుల శుభాకాంక్షలను మీకు అందించడం నాకెంతో గర్వంగా ఉంది" అని ప్రవాస భారతీయులపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

స్టేజ్‌పై 30 ఏళ్ల నాటి మఫ్లర్!
తాను రాజకీయాల్లో క్రియాశీలకంగా లేని, ప్రభుత్వంలో ఎలాంటి పదవుల్లో లేని రోజులను ప్రధాని ఈ వేదికపై గుర్తుచేసుకున్నారు. సుమారు 25 నుంచి 30 ఏళ్ల క్రితం తాను సాధారణ పౌరుడిగా న్యూజిలాండ్‌కు వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అప్పట్లో ఒక స్నేహితుడు తనకు ఇచ్చిన బహుమతిని అందరికీ చూపించారు.

"ప్రధానిగా ఇది నా మొదటి పర్యటన కావచ్చు. కానీ 25-30 ఏళ్ల క్రితం నేను ఇక్కడికి వచ్చినప్పుడు న్యూజిలాండ్‌కు చెందిన ఒక స్నేహితుడు నాకు ఒక టోపీ, చేతి తొడుగులు, ఒక మఫ్లర్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ రోజు నేను మీ ముందుకు అదే మఫ్లర్‌ను ధరించి వచ్చాను. ఇన్నేళ్లుగా దీనిని నేను ఎంతో భద్రంగా దాచుకుని వాడుతున్నాను. ఈ రోజు మీరంతా నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఎంత వెలకట్టలేనివో.. నా స్నేహితుడు ఇచ్చిన ఈ గిఫ్ట్ కూడా నాకు అంతే అమూల్యమైనది" అని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

తాను ధరించిన మఫ్లర్‌ను చూపిస్తూ ప్రధాని మోదీ ఈ మాటలు చెబుతున్నప్పుడు వేదికపై ఉన్నవారంతా ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ప్రధాని భావోద్వేగానికి గురైన తీరు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలించింది.

Also REad: అమర్‌నాథ్‌లో శివలింగం అదృశ్యం..అయినా తగ్గని భక్తుల తాకిడి..1.71 లక్షల మంది దర్శనం!

ALso Read: కరూర్ తొక్కిసలాట కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం..నియామక పత్రాలను సీఎం విజయ్ అందజేత!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

షాబాద్ ఆరుగురి హత్య కేసులో ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్ ముందు గ్రామస్థుల ధర్నా, ఎమ్మెల్యే కాలే యాదయ్యపై తిరగబడ్డ జనం!

Hyderabad, Telangana:

Shabad 6 Murders Protest:  రాష్ట్రవ్యాప్తంగా షాబాద్‌ హత్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. బాధితుల కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఎమ్మెల్యేపై తిరగబడటంతో, ఆయనను ముట్టడించి "గో బ్యాక్" అంటూ నినాదాలు చేస్తూ తీవ్రంగా నిలదీశారు. ఈ గొడవ , ఎమ్మెల్యే ఎదుర్కొన్న పరిస్థితికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ పోక్సో కేసు మర్డర్ సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన ఉత్కంఠకు దారితీస్తున్నాయి.

షాబాద్‌ 6 గురి మర్డర్‌ అప్‌డేట్‌..
షాబాద్‌లో జరిగిన ఈ ఘాతుకానికి సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే, నిందితుడు రాజకుమార్ నిన్న రాత్రి 11 గంటల నుండి అర్ధరాత్రి దాటిన రెండు గంటల పాటు ఒక నరరూప రాక్షసుడిలా వ్యవహరించాడు. పోలీసుల దర్యాప్తు ప్రకారం, నిందితుడు మొదట బాధితురాలైన మైనర్ బాలిక ఇంటికి వెళ్లి, ఆమె తల్లి, నానమ్మను హత్య చేశాడు. అనంతరం ఆ బాలికను సుమారు మూడు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి దారుణంగా చంపేశాడు. అంతటితో ఆగకుండా, తిరిగి తన సొంత ఇంటికి చేరుకుని అక్కడ ఉన్న తన భార్య సరితను ఇద్దరు చిన్న పిల్లలను కూడా నిర్దాక్షిణ్యంగా హతమార్చాడు. ఈ దారుణ చర్య జరిగిన తర్వాత, నిందితుడు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేసినట్లు తెలిసింది. ప్రస్తుతం నిందితుడు రాజకుమార్ పరారీలో ఉన్నాడు.

ఇప్పటికే నిందితుడిపై పలు కేసులు..
పోలీసుల విచారణలో నిందితుడిపై గతంలో కూడా రెండు కేసులు ఉన్నట్లు వెల్లడైంది. నిందితుడు గతంలో భూమికి సంబంధించి తగాదాలు పడటమే కాకుండా, బెదిరింపులకు పాల్పడటంతో పాటు, ప్రేమ పేరుతో ఒక మైనర్ బాలికను వేధించినట్లు సమాచారం. ఆ బాలికను కలవాలని, మాట్లాడాలని బలవంతం చేస్తున్నాడని మే 16వ తేదీన ఆమె తల్లి చేసిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదైంది. అయితే, కొన్ని రోజులకే బెయిల్ మీద బయటకు వచ్చిన నిందితుడు, ఈ కక్షతో దైవాలగూడ ప్రాంతంలో నివసించే ఆ కుటుంబ సభ్యులందరినీ కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. సోషల్ మీడియాలో ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో, నిందితుడు ఆ మైనర్ బాలికను బయటకు తీసుకువెళ్తున్న దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి, వీటిని ఆధారంగా చేసుకుని పోలీసులు దర్యాప్తు చేశారు.

 

 

ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం, నిర్లక్ష్యం కారణంగానే ఇంతటి ఘోరం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో పోక్సో కేసు నమోదైనప్పటికీ, నిందితుడిపై కఠినమైన సెక్షన్లు విధించకుండా కేసును నీరుగార్చారు. దీంతో అతను బయటకు వచ్చి ఇలాంటి హత్యాకాండకు పాల్పడ్డాడని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఎస్ఐ రమేష్‌ను సస్పెండ్ చేశారు. అనంతరం కలెక్టర్ గారు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ప్రజలు ఆందోళన విరమించారు.

Read more: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. పోక్సో కేసు పెట్టారని పగతో ఆరుగురి దారుణహత్య!

Read more: ఇంత బలుపా?.. మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన సియా గోయల్, వీడియో వైరల్!

గంటలోనే ఆరు మర్డర్‌లు..
కేవలం గంట వ్యవధిలోనే ఆరుగురిని చంపేసిన ఈ ఘటనపై ప్రజా సంఘాలు, మహిళా కమిషనర్, రాజకీయ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై టీఆర్ఎస్ నేత కవిత స్పందిస్తూ, నిందితుడు బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ ఇలాంటి దారుణాలకు పాల్పడటంపై ప్రభుత్వం, పోలీసు వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంపై స్పందించాలని, రాజీనామా చేయాలని ట్వీట్ చేశారు. మరోవైపు, తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఫ్యూచర్ సిటీ సిటీ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ కూడా ఈ కేసు వివరాలను సమీక్షిస్తూ, పరారీలో ఉన్న నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. నేరస్తులకు వెన్నులో వణుకు పుట్టేలా కఠిన శిక్షలు పడాలని, బాధిత మహిళలకు కమిషన్ పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

మిక్సీ జార్‌లో తిష్టవేసిన పాము.. వీడియో చూసి నెటిజన్లు ఫుల్ షాక్..

Hyderabad, Telangana:

 Snake Spotted Inside Mixer Video Watch: సాధారణంగా ఇళ్లల్లో మహిళలు ఉదయాన్నే లేవగానే వంటగదిలోకి వెళ్తూ ఉంటారు. బ్రేక్‌ఫాస్ట్ కోసమో.. మరేదైనా వంటకం కోసమో గ్రైండర్, మిక్సీలను ఉపయోగించడం సర్వసాధారణం.. అయితే, నిత్యం మనం వాడే వస్తువుల్లోనే మృత్యువు దాగి ఉంటే? ఎలా ఉంటుంది.. సరిగ్గా ఇలాంటి ఘటనే ఒక ఇంట్లో వెలుగుచూసింది. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్న ఒక వీడియోలో.. కిచెన్‌లో ఉన్న గ్రైండర్‌ గిన్నెలో ఒక పాము ప్రత్యక్షమైంది.

గ్రైండర్ గిన్నెలో అటు ఇటు కదులుతూ..
వైరల్ అవుతున్న ఆ వీడియోను గమనిస్తే.. కిచెన్‌లోని పెద్ద గ్రైండర్ గిన్నె లోపల ఒక చిన్న పాము దూరడం మీరు చూడొచ్చు.. అది గిన్నెలో ఉన్న బ్లేడ్ల మధ్య ఇరుక్కుపోకుండా.. చాలా ఫ్రీగా అటు ఇటు కదులుతూ ఉండడం నెటిజన్లకు క్లియర్‌గా కనిపిస్తుంది.. చల్లదనం కోసమో.. లేదా ఎలుకల వేటలో భాగంగానో అది ఆ గిన్నెలోకి వెళ్లి.. ఉండవచ్చని భావించవచ్చు.. ఆ సమయంలో గిన్నె ఖాళీగా ఉండటం.. అలాగే మహిళ చూసుకోకుండా గ్రైండర్ స్విచ్ ఆన్ చేయకపోవడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి.. ఒకవేళ గమనించకుండా అందులో పదార్థాలు వేసి గ్రైండ్ చేసి ఉంటే.. పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదో ఊహించుకుంటేనే ఏదోలా ఉంది..

 
 
 
 
 

నెటిజన్లు షాక్.. 
ప్రస్తుతం ఈ ఆశ్చర్యం కలిగించే వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా షేర్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత వంటగదిలో ఏ వస్తువు ముట్టుకోవాలన్నా భయమేస్తోందని ఒకరు కామెంట్ చేయగా.. అమ్మబాబోయ్.. కాస్తలో ప్రాణాలు పోయే ప్రమాదం తప్పింది.. గ్రైండర్ ఆన్ చేయకపోవడం ఆ దేవుడి స్క్రిప్ట్.. అంటూ మరొకరు రాసుకొచ్చారు. ఇలా సోషల్ మీడియా వినియోగదారులు వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

ముఖ్యంగా వర్షాకాలం  ఇలాంటి విషసర్పాలు కిచెన్, బాత్‌రూమ్‌లలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వన్యప్రాణి నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలల్లో ఇళ్లల్లో మహిళలు ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరని నిపుణులు తెలుపుతున్నారు. కిచెన్‌లో మిక్సీ, గ్రైండర్ లేదా ఓవెన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను ఉపయోగించే ముందు వాటి లోపల ఏముందో ఒకసారి టార్చ్ లైట్ వేసి లేదా జాగ్రత్తగా పరిశీలించాలని వారు కోరుతున్నారు.. వంటగదిలోని గిన్నెలు, గ్రైండర్ జార్‌లను ఎప్పుడూ తెరిచి ఉంచకూడదని.. వాడిన తర్వాత వాటిని శుభ్రం చేసి బోర్లించి ఉంచడం సురక్షితమని వారు చెబుతున్నారు..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

0
0
Report

కింగ్ కోబ్రాకే చుక్కలు చూపించిన నల్ల తేలు.. వీడియో ఇదే..

Hyderabad, Telangana:

 Scorpion Vs Cobra Video Watch: ప్రకృతిలో ఏ ప్రాణిని కూడా తక్కువ అంచనా వేయలేం.. పరిమాణంలో చిన్నదైనా.. తనను తాను రక్షించుకోవడానికి ఎంతటి బలమైన శత్రువునైనా ఎదిరిస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విషసర్పాలలో ఒకటైన కింగ్ కోబ్రాకు.. ఒక చిన్న నల్ల తేలు ఊహించని షాక్ ఇచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఘనట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన వారంత ఆశ్చరపోతున్నారు. అయితే, ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కోబ్రాపై తేలు దాడి..
సాధారణంగా పాము కనిపిస్తే.. ఎంతటి జీవులైనా భయంతో అక్కడి నుంచి పరుగుపెడుతూ ఉంటాయి.. అందులోనూ అది బ్లాక్ కింగ్ కోబ్రా అయితే ఇక చెప్పక్కర్లేదు.. కానీ ఈ వీడియోలో సీన్ కాస్త భిన్నంగా ఉందని భావించవచ్చు. ఒక భయంకరమైన నలుపు రంగు తేలు నెమ్మదిగా కదులుతుండగా.. దాన్ని చూసిన ఒక బ్లాక్ కింగ్ కోబ్రా వేటకై దాని వైపు దూసుకొచ్చింది.. తేలును ఒక్క దెబ్బతో మింగేయాలని పాము ప్లాన్ చేసింది..

కానీ, అక్కడ ఉన్నది సాదాసీదా తేలు కాదు.. తన ప్రాణాల మీదకు వచ్చేసరికి ఆ నల్ల తేలు తీవ్రంగా స్పందించింది.. కోబ్రా దాడి చేయడానికి దగ్గరకు రాగానే.. ఏమాత్రం భయపడకుండా తనకున్న బలమైన కొండీలతో పాముపై ఎదురుదాడికి దిగింది.. తేలు తన విషపూరితమైన కొండీతో కోబ్రాకు గట్టిగా షాక్ ఇవ్వడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు.

గాయపడ్డ పాము.. 
తేలు ఊహించని వేగంతో చేసిన ఈ దాడితో కింగ్ కోబ్రా విలవిలలాడిపోవడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. తేలు కొండీ దెబ్బకు ఆ ప్రమాదకరమైన పాము తీవ్రంగా గాయపడింది. వేటాడదామని వచ్చిన పాము.. చివరికి ప్రాణాలు దక్కించుకుంటే చాలనుకుంటూ అక్కడ నుంచి వెనక్కి తగ్గాల్సి వచ్చింది.. ఈ ఊహించని ట్విస్ట్‌తో కథ అడ్డం తిరగడం చూసి సోషల్ మీడియా విపియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. 

 
 
 
 
 

నెట్టింట హల్ చల్ చేస్తోన్న వీడియో..
ప్రస్తుతం ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌ ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. లక్షలాది వ్యూస్‌తో వేలల్లో లైకులతో దూసుకుపోతోంది. కింగ్ కోబ్రాకే చుక్కలు చూపించావా.. తేలు మాములిది కాదు భయ్యా.. సమయం వస్తే చిన్న ప్రాణి అయినా సింహాన్నైనా ఎదిరిస్తుంది.. అంటూ నెటిజన్లు భిన్నమైన రీతిలో కామెంట్లు పెడుతున్నారు. 

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

0
0
Report

మకర రాశిలోకి రాహువు సంచారం.. ఆ రాశుల వారికి అదృష్టం మాములుగా లేదు!

Hyderabad, Telangana:

Rahu Transit in Capricorn Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల గమనం మానవ జీవితాలపై ఊహించని ప్రభావాన్ని చూపుతాయని మనందరికీ తెలుసు.. ముఖ్యంగా కీడు గ్రహంగా పరిగణించే.. రాహువు గ్రహ సంచారం చేయడం వల్ల అన్ని రాశులు ఊహించని స్థాయిలో ప్రభావితమవుతాయి.. వచ్చే డిసెంబర్ 5వ తేదీన రాహువు కుంభ రాశిని విడిచిపెట్టి.. శని దేవుడికి సంబంధించిన మకర రాశిలోకి సంచారం చేస్తాడు.. రాహువు ఒక రాశిలో దాదాపు 18 నెలల పాటు కొనసాగుతాడు. ఈ రాహువు మార్పు వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని ధనలాభాలతో పాటు సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఊహించని స్థాయిలో లభిస్తాయి. అదృష్టం కూడా అనుకున్నంత స్థాయిలో పెరుగుతుంది.

తులా రాశి
ముఖ్యంగా తులా రాశి రాహువు ప్రభావంతో సమాజంలో తమకంటూ ఒక సరికొత్త గుర్తింపు కూడా లభిస్తుంది. ఆర్థికంగా గరిష్ట పురోగతి కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. గతంలో చేసిన హార్డ్ వర్క్ ఇప్పుడు మీకు విలాసవంతమైన జీవితాన్ని అందిస్తుంది. మీ జీవనశైలి కూడా ఊహించని స్థాయిలో మారిపోతుంది.. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలని.. అక్కడ స్థిరపడాలని ఎప్పటి నుంచో కలలు కంటున్న వారికి ఈ 18 నెలల కాలంలో ఆ కల నిజం కాబోతోందని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. 

మిథున రాశి
రాహువు మకర రాశిలోకి సంచారం చేయడం వల్ల మిథున రాశివారికి కెరీర్ పరంగా అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగ రంగంలో ఊహించని స్థాయికి ఎదిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఉన్నవారికి అయాచితంగా లేదా ఆకస్మికంగా భారీ ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన పెద్ద మొత్తంలో డబ్బు తిరిగివచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

సింహ రాశి
సింహ రాశి వారికి రాహువు సంచారం ప్రభావం వల్ల వారు గతంలో పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.. అదృష్టం మీ వెంటే ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మీ పేరు ప్రఖ్యాతులు నలుదిశలా వ్యాపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు వేగంగా వృద్ధి చెందే ఛాన్స్‌లు ఉన్నాయి. ఇక వ్యక్తిగత జీవితంలో గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య ఉన్న దూరాలు, మనస్పర్థలు తొలిగిపోతాయి. జీవిత భాగస్వామితో ఎంతో సంతోషంగా గడుపుతారు.

కుంభ రాశి
రాహువు కుంభ రాశిని విడిచిపెట్టి.. మకరంలోకి వెళ్తున్నప్పటికీ.. కుంభ రాశి వారికి ఇది అనేక రంగాలలో మేలు చేస్తుంది. మల్టీనేషనల్ కంపెనీల (MNC) నుంచి పెద్ద పెద్ద ఉద్యోగ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. కేవలం పదోన్నతులు మాత్రమే కాకుండా భారీగా జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. కార్యాలయంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరిగి..  ఉన్నతాధికారుల సపోర్ట్ పొందుతారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report
Advertisement
Advertisement
Back to top