icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505001
SShankerreddyFollow17 Jul 2024, 11:48 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

12 ఏళ్ల పాపలా నటించి ఫ్యామిలీని ముంచిన 37 ఏళ్ల మహిళ.. చివరికి ఏమైందంటే?

Hyderabad, Telangana:

Real-Life Orphan Movie Case News: సినిమాల్లో మాత్రమే చూసే వింతైన మోసాలు ఒక్కొక్కసారి నిజజీవితంలోనూ జరిగి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి.. హాలీవుడ్ లో సంచలనం సృష్టించిన అనాధ సినిమా మీకు గుర్తుందా? అచ్చం అలాంటి ఘటన బ్రెజిల్ లో వెలుగు చూసింది.. ఒక 37 ఏళ్ల మహిళ..ఆటిజంతో బాధపడుతున్న 12 ఏళ్ల చిన్నారిగా నటించి ఏకంగా ఒక కుటుంబాన్ని దారుణంగా మోసం చేసింది.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్య పోవడం ఖాయం.. ఇప్పుడు ఈ హైడ్రామాకు ఘటనకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.. దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

బ్రెజిల్ కు చెందిన అమండ సౌజా డి ఒలివేరా అనే మహిళ ఈ కళ్ళు చెదిరే మోసానికి పాల్పడింది.. శాంటా కాటరినా రాష్ట్రంలో స్థానికంగా ఉండేవో చర్చికి వెళ్లే ఒక దంపతులను ఆమె టార్గెట్ చేసింది.. చర్చి పాస్టర్ ద్వారా వారితో పరిచయం పెంచుకొని.. తన పేరు గాబ్రియేలని .. తాను తీవ్రమైన ఆటిజంతో బాధపడుతున్నానని 12 ఏళ్ల అనాధ బాలికనని వారిని నమ్మించింది.. వారిలో సానుభూతి పొందేందుకు నోట్లో చిన్నపిల్లల పీకపెట్టుకొని తిరగడంతో పాటు పాల బాటిల్తో పాలు తాగడం, అర్ధరాత్రి నిద్రలో ఉలిక్కిపడి లేవడం, మెనీ మోర్ లాంటి బొమ్మల దుస్తులు వేసుకోవడం.. ఇలా అచ్చం చిన్నపిల్లల వ్యవహరిస్తూ దంపతులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసింది..

పాప అనుకోవడానికి ఆమె శరీర ఆకృతి పెద్దవారిలా ఎందుకు ఉందన్న అనుమానం రాకుండా ఆ యువతి ఒక పెద్ద కట్టుకతే అల్లింది.. చిన్నతనంలో తన తల్లిదండ్రులు తనను తీవ్రంగా హింసించారని.. బలవంతంగా హార్మోన్ ఇంజక్షన్లు ఇవ్వడం వల్లే తాను త్వరగా ఎదిగిపోయిందని.. పెద్ద దానిలాగా కనిపిస్తున్నానని కన్నీళ్లు పెట్టుకుంది.. దీంతో ఆ దంపతులు చలించిపోయారు.. ఏకంగా 14 నెలల పాటు తనను ఇంట్లో ఉంచుకొని.. ఆమె పన్నెండు పుట్టినరోజు వేడుకలను కూడా ఎంతో అద్భుతంగా నిర్వహించారు.. ఆమె బరువు తగ్గడం కోసం మౌన్‌జారో అనే ఖరీదైన మందులు కూడా కొనిచ్చి కంటికి రెప్పలా ఆ యువతీని కాపాడారు. ఆమెను చట్టబద్ధంగా దత్తత తీసుకునేందుకు కూడా వాళ్ళు సిద్ధమయ్యారు..

ఆ దంపతులకు చెందిన ఒక బంధువుకు ఆ యువతి వింత ప్రవర్తన పై అనుమానం వచ్చింది.. ఇంటర్నెట్లో ఇలాంటి కేసుల గురించి వెతకగా.. ఈమె ఇలాగే మోసం చేసిన పాత పాత వార్తలు కూడా కొన్ని కనిపించాయట.. ఆ బంధువులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం బయటపడింది.. పోలీసులు ఆ యువతీని విచారించగా మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు వెలుగులోకి వచ్చాయి.. ఆమె ఒక ప్రొఫెషనల్ మోసం చేసే యువతి అని.. దాదాపు ఏడు రాష్ట్రాల్లో ఇలాగే పేర్లు మార్చుకొని కుటుంబాలను మోసం చేసిందని గుర్తించారు. దత్తత తీసుకునే వారి నుంచి మరింత సానుభూతి కోసం ఏకంగా తన శరీరంలో 200 సూదులను స్వయంగా గుచ్చుకొని.. కన్నవాళ్లే చిత్రహింసలు పెట్టారని నమ్మించే ప్రయత్నం చేసిందట..

తాను మానసిక రోగినని.. ఎవరినీ మోసం చేయలేనని కోర్టులో ఆ యువతి వాదించింది. కానీ ఆమె పక్క ప్లాన్ ప్రకారమే మోసాలకు పాల్పడిందని గుర్తించిన న్యాయమూర్తి ఆ వాదనను తోసిపిచ్చారు. ఆమెపై మోపిన అభియోగాలు రుజువు కావడంతో కోర్టు ఆమెకు దాదాపు ఏడున్నర సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది..

Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

No Traffic Lights: ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేని ఏకైక దేశం ఇదే..

Hyderabad, Telangana:

No Traffic Lights Country: ప్రస్తుతం ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా నగరాల్లో వాహనాల్లో ఒకచోట నుంచి మరొక చోటికి వెళ్లడం ఊహించగలమా? ఎక్కడ చూసినా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో వెలిగే లైట్లు మనం చేసే ట్రావెలింగ్ ను అద్భుతంగా నియంత్రిస్తూ ఉంటాయి. అయితే ప్రపంచంలో ఎక్కడా ఒక ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేని దేశం ఒకటి ఉందని చెబితే మీరు నమ్ముతారా? మీరు తప్పకుండా నమ్మాల్సిందే.. అవును మీరు విన్నది నిజమే.. ఆ దేశం మరేదో కాదు మన పురుగున ఉన్న అద్భుతమైన హిమాలయ దేశం భూటాన్..

ప్రపంచమంతా సాంకేతికత వైపు పరుగులు తీస్తూ ఉంటే.. భూటాన్ మాత్రం భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది.. ఆ దేశ రాజధాని థింఫూ తో సహా దేశంలో ఎక్కడ ఒక ట్రాఫిక్ సిగ్నల్ కూడా మనకు కనిపించదు.. ఇందుకు ప్రధాన కారణం అక్కడి ప్రజలు మనస్తత్వంగా భావించవచ్చు.. ట్రాఫిక్ లైట్లు అనేవి కేవలం యంత్రాలని.. వాటికి ఎలాంటి బాగోద్వేగాలు ఉండవని భూటాన్ ప్రజలు నమ్ముతూ ఉంటారు.. యంత్రాల ద్వారా నియంత్రించడం కంటే తోటి మనుషులే దారి చూపడాన్ని వారు ఇష్టపడతారట..

అయితే, భూటాన్‌లో ఎప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ ను ప్రయత్నించలేదా అంటే.. చేశారు కూడా.. కొన్ని సంవత్సరాల క్రితం థింఫూ నగరంలోని ఓ రద్దీ ఉండే కూడలిలో మొదటిసారిగా ఒక ట్రాఫిక్ లైట్ను ప్రభుత్వం ప్రయోజనాత్మకంగా ఏర్పాటు చేసింది.. కానీ ఆ లైట్లను చూసి అక్కడ ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.. అది యాంత్రికంగా ఉందని.. మనుషుల మధ్య ఉండే ఆత్మీయ బంధాన్ని దూరం చేస్తోందని వారు భావించారట.. ప్రజల వ్యతిరేకతను గమనించిన అక్కడి ప్రభుత్వం.. ఆ లైట్లను పెట్టిన 24 గంటల్లోనే తీసేసిందట.. అప్పటినుంచి ఇప్పటివరకు భూటాన్ లో మళ్ళీ ట్రాఫిక్ సిగ్నల్స్ ఊసే ఎత్తలేదు..

సిగ్నల్స్ లేనప్పుడు అంత రద్దీలో ట్రాఫిక్ ఎలా కంట్రోల్ చేస్తారని సందేహం రావడం సహజం.. అయితే, థింఫూ నగరంలోని కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా డిజైన్ చేసిన అందమైన బూతులలో నిలబడి.. తమ చేతి సైగలతో వాహనాలను నియంత్రిస్తూ ఉంటారట.. వారు ఎంతో ఓపికగా.. నవ్వుతూ ట్రాఫిక్ క్లియర్ చేయడం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.. ప్రజలు కూడా నిబంధనలు పాటిస్తూ ఎంతో క్రమశిక్షణతో డ్రైవ్ చేస్తారు.. కాబట్టి అక్కడ ప్రమాదాలు జరగడం చాలా అరుదు..

Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్‌..

భూటాన్ దేశం అభివృద్ధిని GDPతో కాకుండా ప్రజల సంతోషంతో కొలుస్తుంది.. ప్రజల సంతోషానికి.. ప్రశాంతతకు భంగం కలిగించే ఆధునికతను వారు సున్నితంగా తిరస్కరిస్తారట.. ట్రాఫిక్ లైట్ ల స్థానంలో పోలీసులను నియమించడం కూడా ఇందులో భాగమే.. యంత్రాలకంటే మనుషులకే ఎక్కువగా విలువనిచ్చే భూటాన్.. నిజంగా నేటి ప్రపంచానికి ఒక గొప్ప ఆదర్శం అనడంలో ఎలాంటి సందేహం లేదని కొంతమంది నిపుణులు చెబుతూ వస్తున్నారు..

Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Suryakumar Yadav Reentry: టీమ్ఇండియాలోకి సూర్యకుమార్ యాదవ్ రీఎంట్రీ? బీసీసీఐ నుంచి కీలక సమాచారం లీక్!

Hyderabad, Telangana:

Suryakumar Yadav Re-Entry News: గత టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియాను విజయపథంలో నడిపించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాత జట్టులో కనుమరుగయ్యాడు. ప్రపంచ ఛాంపియన్‌గా భారత్‌ను నిలబెట్టిన సూర్యకుమార్ యాదవ్‌ను జట్టు నుంచి తప్పించడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే టీ20లతో పాటు ఇతర సిరీస్‌లలో భారత్ వరుస ఓటముల తర్వాత సూర్యకుమార్ యాదవ్‌ను తిరిగి జట్టు కెప్టెన్‌గా తీసుకోవాలని బీసీసీఐ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. 

అంతకుముందు, దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా పరుగులు సాధిస్తే సూర్యకుమార్ యాదవ్ భారత జట్టులోకి తిరిగి రాగలరని BCCI (భారత క్రికెట్ నియంత్రణ మండలి) వర్గాలు ANIకి తెలిపాయి. బ్యాటింగ్‌లో ఫామ్ కోల్పోవడంతో, ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు ముందు సూర్యకుమార్ యాదవ్ T20I కెప్టెన్సీని కోల్పోవడమే కాకుండా జట్టు నుంచి కూడా తొలగించారు. ఈ క్రమంలో శ్రేయాస్ అయ్యర్‌ను కొత్త T20I కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది.

అయితే, అయ్యర్ నాయకత్వంలో భారత జట్టు ప్రదర్శన అంతగా ఆశాజనకంగా లేదు. ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్‌వాష్‌కు గురైన 'మెన్ ఇన్ బ్లూ' (భారత జట్టు), ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 4-0తో ఓటమిని చవిచూసింది (మొదటి మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది).

BCCI వర్గాల సమాచారం ప్రకారం, సూర్యకుమార్ పునరాగమన అవకాశాలను బోర్డు పూర్తిగా తోసిపుచ్చలేదు. ప్రస్తుత ప్రణాళికల్లో లేనప్పటికీ, దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తే జట్టు ఎంపికకు ఆయన పరిగణించబడే అవకాశం ఉంది. "సూర్యకుమార్ యాదవ్‌కు ఇంకా అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అతను జట్టు ఎంపిక పరిశీలనలో లేనప్పటికీ, దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా పరుగులు సాధిస్తే తిరిగి జట్టులోకి వచ్చే అర్హత అతనికి ఉంది" అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ప్రకారం.. టీమ్ఇండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్, శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య కొలంబోలో కలిశారు. సూర్యకుమార్ జయసూర్యను పలకరిస్తూ కాసేపు మాట్లాడటం కనిపించింది. జయసూర్య చాలా ఫిట్‌గా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించిన భారత బ్యాటర్, ఆయన అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారా అని సరదాగా అడిగారు. "మరింత ఫిట్‌గా తయారవుతున్నారు, పునరాగమనం కోసం ప్రయత్నిస్తున్నారా? చూస్తుంటే 100% అలాగే అనిపిస్తోంది" అని ఆయన అన్నారు. ఆ కామెంట్‌కు శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య నవ్వారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్ల మనసులను గెలుచుకుంది.

Also Read: శ్రీలంకతో టెస్టులో ఉద్రిక్తత..లంక బౌలర్‌తో యశస్వి జైస్వాల్ రణరంగం..వీడియో వైరల్!

Also Read: డబ్ల్యూటీసీ రేసులో భారత్ అసలు సిసలైన పరీక్ష.. ఫైనల్‌ చేరాలంటే భారత్‌ ఇలా చేయాలి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Costly Egg Auction: డజన్ కాదు ఒక్కటే.. రూ.25 వేలకి అమ్ముడుపోయి కోడిగుడ్డు..

Hyderabad, Telangana:

Egg Sold For Rs 25k: సాధారణంగా ఒక కోడిగుడ్డు ధర ఎంత ఉంటుంది.. మహా అయితే దాదాపు 7 నుంచి 8 రూపాయల వరకు ఉంటుంది.. కొన్ని కోడిగుడ్ల ధరలు దాదాపు 20 రూపాయలు ఉంటాయి.. కానీ ఎవరైనా ఒక కోడిగుడ్డుని ఏకంగా 25,000 పెట్టి కొన్నాను అంటే మీరు కళ్ళు మూసుకొని నమ్మగలుగుతారా..? అవును మీరు చదువుతున్నది అక్షరాల నిజమే.. ఈ ఆశ్చర్యకరమైన ఘటన లద్దాఖ్‌లోని లేహ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఒక సాధారణ కోడి గుడ్డును వేలంలో ఏకంగా 25 వేల రూపాయలకు కొనుగోలు చేసేసారంటే నమ్మాల్సిందే.. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణం తెలిసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఆ కారణమేంటో? ఇంత ధరకు అమ్ముడు పోవడానికి గల కారణాలు.. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇటీవల ఇరాన్లో నెలకొన్న ఘర్షణలతో పాటు యుద్ధ వాతావరణం వల్ల ఎంతోమంది అమాయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. ఇరాన్ బాధితులకు సహాయం చేసేందుకు లద్దాఖ్, కాశ్మీర్ తదితర ప్రాంతాల ప్రజలు ఏకమైనట్లు తెలుస్తోంది.. ఈ నేపథ్యంలోనే లేహ్ జిల్లాలో భారీ ప్రత్యేకమైన విరాళాల సేకరణ కార్యక్రమం చేపడుతూ వస్తున్నారు. ఇందులో భాగంగా స్థానికులు తమ వద్ద ఉన్న వస్తువులతో పాటు నగదును విరాళంగా ఇవ్వడం మొదలుపెట్టారు..

ఈ క్రమంలోనే ఒక కోడి గుడ్డును వేలానికి ఉంచగా.. షబీర్ హుస్సేన్ అనే స్థానిక వ్యక్తి దానిని ఏకంగా 25 వేలకు పాడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ఒక గుడ్డు ధర ₹10 మాత్రమేనని నాకు తెలుసని.. కానీ నేను ఆ పాతిక వేలు ఇచ్చింది గుడ్డు కోసం కాదని.. ఇరాన్ కష్టాలు పడుతున్న బాధితులకు నా వంతు సహాయం చేయడం కోసమని.. మానవత్వం ముందు డబ్బు ఎంత అవసరమైతే మా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమంటూ గొప్ప మనసును చాటుకున్నాడు..

కేవలం కోడి గుడ్డు మాత్రమే కాదు.. కాశ్మీర్ అంతట ఇరాన్ బాధితుల కోసం ప్రజలు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు.. మహిళలు తమ బంగారంతో పాటు వెండి ఆభరణాలు విరాళాన్ని ఇస్తుంటే.. చిన్నపిల్లలు సైతం తమ కడ్డీ బ్యాంకులను పగలగొట్టి దాచుకున్న డబ్బులను విరాళంగా ఇచ్చేస్తున్నారు. మరి కొంతమంది తమ ఇళ్ళలోని సైకిళ్లతో పాటు పాత్రలు, పశువులను సైతం విరాళంగా అందించి మానవత్వం చాటుకుంటున్నారు.. 

Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్‌..

భారతీయులు చూపుతున్న ఈ ఆదరణ పట్ల ఇరాన్ రాయబారి కార్యాలయం కూడా స్పందించింది. కష్ట కాలంలో అండగా నిలిచిన భారతీయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.. మీ దయతో పాటు మానవత్వాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము.. థాంక్యూ ఇండియా అంటూ ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఒక చిన్న కోడి గుడ్డు ద్వారా మొదలైన ఈ గొప్ప సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. తోటి మనుషుల కష్టాల్లో ఉన్నప్పుడు మతంతో పాటు ప్రాంతాలకు అతీతంగా స్పందించడమే నిజమైన మానవత్వం అని భారత ప్రజలు నిరూపించారు.

Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

0
0
Report

Viral News: పగలు ప్రియుడితో.. రాత్రి భర్తతో.. భార్య షిఫ్ట్ కాపురం..

Hyderabad, Telangana:

Viral Latest News: పోలీస్ స్టేషన్‌ను ప్రతిరోజు ఎన్నో రకాల ఫిర్యాదులు వస్తూ ఉండడం మనం అప్పుడప్పుడు వార్తల్లో చూస్తూ ఉంటాం.. ఆస్తి తగాదాలతో పాటు దొంగతనాలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా ఎన్నో రకాల కేసులు పోలీసులు చూస్తూ ఉంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని వెలుగు చూసిన ఓ విచిత్రమైన కేసును చూసి పోలీసులకే మైండ్ బ్లాక్ అయ్యింది.. అవును మీరు చదువుతుంది నిజమే.. ఒకే ఇంట్లో తన భర్తతో పాటు ప్రియుడితో కలిసి జీవించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఓ మహిళ ఏకంగా పోలీసులను ఆశ్రయించడం ఆసక్తి కలిగిస్తోంది. వినడానికి వింతగా ఉన్న ఇది అక్షరాల నిజమే.. ఈ ఆసక్తికర ఘటన ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లా పరిధిలో చోటుచేసుకుంది.. అయితే ఈ ఘటనకు సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

సీతాపూర్ జిల్లా మహమ్మదాబాద్ కొత్వాలి పోలీస్ స్టేషన్కు ఓ మహిళ తన భర్తతో పాటు ప్రియుడితో కలిసి వచ్చింది.. ముగ్గురూ కలిసి పోలీసులకు ఓ లిఖితపూర్వకమైన ఫిర్యాదును అందించారు. తాము ముగ్గురం ఒకే ఇంట్లో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నామని.. తమ ప్రత్యేకమైన కాపురానికి రక్షణ కల్పించాలని వారు కోరారు.. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే.. ఆ మహిళ చెప్పిన షిఫ్ట్ కాపురం ప్లాన్ విన్న పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైపోయారట..

 తన భర్త పగటిపూట ఉద్యోగానికి వెళ్తాడని.. ఆ సమయంలో తన ప్రియుడు ఇంట్లో ఉంటాడని మహిళ వివరించింది.. ఆ తర్వాత రాత్రి పూట ప్రియుడు డ్యూటీకి వెళ్తాడని.. అప్పుడు భర్త ఇంటికి వస్తాడని.. ఇలా ఎవరి షిఫ్ట్ ప్రకారం వారు తనతో సమయం గడుపుతారని చెప్పుకొచ్చింది.. ఇద్దరి పని వేళలకు అనుగుణంగా తన జీవితాన్ని ప్లాన్ చేసుకున్నానని.. తాము ముగ్గురం ఈ ఒప్పందానికి పూర్తిగా అంగీకరించామని ఆమె పోలీసులకు చెప్పడంతో వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు..

ఒక ఒప్పందానికి భార్య, భర్త, ప్రియుడు ముగ్గురు అంగీకరించినప్పటికీ.. భర్త కుటుంబ సభ్యులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట.. ముఖ్యంగా భర్త తండ్రి, ఇద్దరు ఆడపడుచులు ఈ ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నారట.. తమ వ్యక్తిగత జీవితంలో వారు జోక్యం చేసుకోకుండా ఆదేశించాలని.. వారి నుంచి తమకు రక్షణ కల్పించాలని ఆ ఆ ముగ్గురు కలిసి పోలీసులను వేడుకున్నారు..

సాధారణంగా ఇలాంటి వ్యవహారాలలో గొడవలు, దాడులు జరగడం మనం చూస్తూ ఉంటాం.. కానీ భర్త ప్రియుడు కలిసిపోయి.. ఒకే ఇంట్లో భార్యతో షిఫ్టుల వారిగా కాపురం చేయడానికి అంగీకరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. తమ పోలీసులు తమ సర్వీసులో ఇలాంటి వింత కేసులు ఎప్పుడూ చూడలేదని తలలు పట్టుకుంటున్నారు.. చట్ట పరిధిలో ఈ ఒప్పందానికి ఎలాంటి అనుమతి ఇవ్వాలో అర్థం కాక అధికారులు గందరగోళంలో పడ్డారు..

Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

YS Jagan Press Meet: కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మరోసారి ఫైర్..రాష్ట్రంలో కరువు పరిస్థితులపై కీలక ప్రెస్‌మీట్!

Vijayawada, Andhra Pradesh:

YS Jagan Press Meet Today: గత కొన్ని రోజులుగా డీఎస్సీ, ఏపీపీఎస్సీ అంశాలపై వాస్తవాలను ప్రజల ముందుంచినప్పటికీ, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని వైయస్సార్‌సీపీ అధినాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులు, బీసీల సంక్షేమంపై మాట్లాడిన ఆయన మరికొన్ని అంశాలను లేవనెత్తారు. 

రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు
రాష్ట్రవ్యాప్తంగా సగటున -52 శాతం వర్షపాతం లోటు ఉందని.. కోస్తాంధ్రలో -47 శాతం, రాయలసీమలో -52 శాతం చొప్పున లోటు నమోదైందని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే రాష్ట్రంలోని 688 మండలాల్లో 625 మండలాల్లో (91 శాతం) లోటు వర్షపాతం ఉందని.. 28 జిల్లాలకు గాను 25 జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొందని అన్నారు.

ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి విడుదల అంటూ ప్రభుత్వం పబ్లిసిటీ స్టంట్లు చేసిందని, వాటిని నమ్మి రైతులు అప్పులు చేసి విత్తనాలు వేస్తే నార్లు ఎండిపోయి ఎకరాకు రూ.15 వేల వరకు నష్టపోయారని వైఎస్ జగన్ ఆరోపించారు.

రైతులను ఆదుకోవడంలో విఫలం..
వైయస్సార్‌సీపీ హయాంలో పూర్తిగా ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రూ.7,802 కోట్ల ఉచిత బీమాను అందించామని, ప్రస్తుత ప్రభుత్వం దానిని రద్దు చేసి రైతులపై భారం మోపిందని వైఎస్ జగన్ విమర్శించారు. ఇ-క్రాప్, రైతు భరోసా కేంద్రాలు, అగ్రిల్యాబ్స్‌తో పాటు సున్నా వడ్డీ పథకాన్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. జూన్, జులై నెలల్లోనే వర్షపాతం లోటు స్పష్టంగా కనిపిస్తున్నా, ఇప్పటివరకు ఎలాంటి కరువు నివారణ చర్యలు గానీ, ప్రత్యామ్నాయ విత్తనాల పంపిణీ గానీ చేపట్టలేదని విమర్శించారు.

బీసీల సంక్షేమం
వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో బీసీలకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని జగన్ తన మాటగా చెప్పుకున్నారు. తన కేబినెట్‌లో 40 శాతం (11 మంది) మంత్రి పదవులు బీసీలకే కేటాయించడమే కాకుండా ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వడం జరిగిందని ఆయన వెల్లడించారు. రాజ్యసభ, లోక్‌సభ, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేయడం జరిగిందని జగన్ మీడియాతో అన్నారు.

అదే విధంగా 139 బీసీ కులాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టులలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కోరుతూ పార్లమెంట్‌లో ప్రైవేట్ బిల్లు కూడా పెట్టించామన్నారు.

ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం బీసీల రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేక వారిపై అక్రమ కేసులు బనాయిస్తోందని జగన్ ఆరోపించారు. యాక్సిడెంట్ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసిన కేసులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్.. అలాగే వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ మహిళా ఎస్సైను వేధించిన కేసు.. మహిళలను వేధించిన కేసులో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు..  అక్రమ మద్యం కేసులో మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు వంటి వారిని అరెస్టు చేయగా.. బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని తమ పార్టీ నేతలను వైఎస్ జగన్ వెనకేసుకొస్తున్నారు.

Also Read: మద్యం ప్రియులకు కిక్ ఇచ్చే వార్త.. తెలంగాణలో 121 కొత్త అంతర్జాతీయ బ్రాండ్లు సిద్ధం!

Also Read: మంత్రి కొండా సురేఖపై అధిష్టానానికి పీసీసీ నివేదిక..మంత్రివర్గ మార్పులపై చర్చ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Toxic Vs Irumudi: 'టాక్సిక్' నెగటివ్ టాక్.. రవితేజ 'ఇరుముడి' సినిమాకు ఊహించని బూస్ట్!

Hyderabad, Telangana:

Toxic Vs Irumudi At Box Office: బాక్సాఫీస్ వద్ద సినిమాల జాతకాలు ఎప్పుడు, ఏ విధంగా మారతాయో ముందే చెప్పడం ఎవరికైనా చాలా కష్టం. ఒక భారీ సినిమా అనుకున్న స్థాయిలో ఆడకపోతే, థియేటర్లలో స్థిరంగా నడుస్తున్న మరో సినిమాకు అది పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. ప్రస్తుతం సరిగ్గా ఇదే తరహా ఆసక్తికరమైన పరిణామం సినిమా పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి అడుగుపెట్టిన రాకింగ్ స్టార్ యశ్ తాజా చిత్రం 'టాక్సిక్' చిత్రానికి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగాను, అలాగే సాధారణ ప్రేక్షకుల్లోనూ తీవ్ర నెగటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ నెగటివ్ ప్రభావం మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఇరుముడి' సినిమాకు అనూహ్యమైన ప్లస్ పాయింట్ గా మారబోతోందని సినిమా ఇండస్ట్రీలోనూ, నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ ఉన్న యశ్ సినిమా 'టాక్సిక్' విడుదలవుతుండటంతో, సహజంగానే 'ఇరుముడి' సినిమాకు కేటాయించిన థియేటర్ల సంఖ్య తగ్గింది. అయితే ఇప్పుడు 'టాక్సిక్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడంతో పరిస్థితి తారుమారైంది. థియేటర్లలో ఉన్న ప్రేక్షకులు మళ్లీ మంచి పాజిటివ్ టాక్‌తో విజయవంతంగా నడుస్తున్న 'ఇరుముడి' సినిమా వైపు చూసే అవకాశం ఏర్పడింది. దీనివల్ల పెరిగిన డిమాండ్‌కు తగినట్లుగా ఎగ్జిబిటర్లు సైతం రవితేజ సినిమాకు థియేటర్ల సంఖ్యను, రోజువారీ షోలను మళ్లీ పెంచే యోచనలో ఉండటం విశేషం.

వంద కోట్ల మైలురాయి దాటిన 'ఇరుముడి'.. 
మరోవైపు మాస్ మహారాజా రవితేజ 'ఇరుముడి' సినిమా తొలి రోజు నుంచే అత్యంత అద్భుతమైన పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. బాక్సాఫీస్ వద్ద స్థిరమైన వసూళ్లను రాబడుతూ రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి ఘన విజయం దిశగా వేగంగా దూసుకుపోతోంది. రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, కథలోని బలమైన మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే ఈ స్థాయి అద్భుతమైన వసూళ్లకు ప్రధాన కారణమైంది.

వీకెండ్స్, పండగ సెలవుల అడ్వాంటేజ్..
ప్రస్తుతం వరుసగా పండగలు, వారాంతపు సెలవులు (లాంగ్ వీకెండ్స్) వస్తుండటం రవితేజ 'ఇరుముడి' సినిమాకు మరింత పెద్ద వరంలా మారనుంది. బాక్సాఫీస్ వద్ద భారీ పోటీగా నిలుస్తుందని భావించిన 'టాక్సిక్' చిత్రం రేసులో కాస్త వెనుకబడటంతో, ఈ రాబోయే లాంగ్ హాలిడే సీజన్ పూర్తి అడ్వాంటేజ్ మొత్తం రవితేజ ఖాతాలోనే పడనుంది. అనుకున్నట్లుగా థియేటర్లు కూడా పెరిగితే రాబోయే రోజుల్లో రవితేజ 'ఇరుముడి' బాక్సాఫీస్ వసూళ్లు మరిన్ని సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: చిరంజీవి 'విశ్వంభర' విడుదల అవుతుందా? మూవీ యూనిట్ ఏం చేస్తుంది? 2027లో కూడా డౌటే?!

Also Read: రూ.200 కోట్ల క్లబ్‌లో 'విశ్వనాథ్ అండ్ సన్స్'.. బాక్సాఫీస్ వద్ద సూర్య కొత్త రికార్డు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Vishwambhara Postponed: చిరంజీవి 'విశ్వంభర' విడుదల అవుతుందా? మూవీ యూనిట్ ఏం చేస్తుంది? 2027లో కూడా డౌటే?!

Hyderabad, Telangana:

Vishwambhara Release Date Postponed: ఆగస్టు 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని విడుదలైన 'కాకా' ప్రాజెక్ట్ గ్లింప్స్ అభిమానుల్లో ఊహించని స్థాయి జోష్ నింపింది. అయితే, ఇదే తరుణంలో అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన 'విశ్వంభర' చిత్రం నుంచి మాత్రం ఎటువంటి సాలిడ్ అప్‌డేట్ రాకపోవడంతో మెగా ఫ్యాన్స్ కొంత నిరాశకు లోనయ్యారు. 

వాస్తవానికి, ఈ దసరా పండుగ సీజన్‌కే ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తుందని, చిరంజీవి బర్త్‌డే రోజే 'విశ్వంభర' అధికారిక విడుదల తేదీని ఘనంగా ప్రకటిస్తారని ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కానీ, అభిమానులను నిరాశపరుస్తూ చిత్రబృందం కేవలం ఒక పోస్టర్‌ను మాత్రమే విడుదల చేసి సరిపెట్టుకుంది. ఆ పోస్టర్‌లో ఎక్కడా విడుదల తేదీ ప్రస్తావన లేకపోవడం సినీ వర్గాలలో, ట్రేడ్ వర్గాలలో సరికొత్త చర్చలకు దారితీసింది.

ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. 'విశ్వంభర' విడుదల తేదీపై నిర్మాతలు ఇప్పటికీ ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోతున్నారు. షూటింగ్ పనులన్నీ దాదాపుగా పూర్తయినప్పటికీ, సినిమా ఆలస్యం కావడానికి ప్రధాన కారణం విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులేనని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన కంప్యూటర్ గ్రాఫిక్స్ (సీజీ) పనులు ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. 

అందుతున్న నివేదికల ప్రకారం, సీజీకి సంబంధించి కనీసం 30 శాతం వరకు వర్క్ ఇంకా పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఈ విజువల్స్ పనులన్నీ పూర్తయి చేతికి వచ్చినప్పటికీ, ఆ తర్వాత కూడా కరెక్టోరియల్ వర్క్స్, క్వాలిటీ చెకింగ్స్ వంటి సాంకేతిక ప్రక్రియలను పూర్తి చేయడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో కచ్చితంగా చెప్పలేని అయోమయ పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.

ఒకవేళ ఈ చిత్రం ఈ ఏడాది దసరా రేసు నుంచి తప్పుకుంటే, ఈ సంవత్సరంలో సినిమా థియేటర్లలోకి రావడం దాదాపుగా అసాధ్యమేనని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే వచ్చే సంక్రాంతి కానుకగా ఎలాగూ 'కాకా' చిత్రం బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండటంతో, 'విశ్వంభర'కు అక్కడ కూడా స్థలం దొరికే అవకాశం లేదు. దీంతో ఈ భారీ ప్రాజెక్ట్ నేరుగా 2027 వేసవి కాలానికి వాయిదా పడే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి.

వాస్తవానికి 'మన శంకర వరప్రసాద్ గారు' కంటే ముందే థియేటర్ల ముందుకు రావలసిన ఈ అద్భుత విజువల్ వండర్, ఇప్పుడు 'కాకా' చిత్రం తర్వాత విడుదలవుతే అభిమానుల నుంచి ఆసక్తి ఏమేరకు ఉంటుంది అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. మరి ఈ గ్రాఫిక్స్ అడ్డంకులను దాటుకుని 'విశ్వంభర' ఎప్పుడు ప్రేక్షకులను పలకరిస్తుందో వేచి చూడాలి.

Also Read: Eshwar Sai Video: "మీ అందరికి దండం పెడతా..నన్ను వదిలేయండి" ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి రిక్వెస్ట్!

Also Read: రూ.200 కోట్ల క్లబ్‌లో 'విశ్వనాథ్ అండ్ సన్స్'.. బాక్సాఫీస్ వద్ద సూర్య కొత్త రికార్డు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Kendra Raja Yoga: కేంద్ర రాజయోగంతో జాక్‌పాట్.. ఉద్యోగం, వ్యాపారాల్లో ఈ రాశులకు తిరుగుండదు!

Hyderabad, Telangana:

Kendra Raja Yoga Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రంలో కుజ, శని గ్రహాలకు అత్యంత ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. కుజుడిని ధైర్యంతో పాటు బలం సామర్థ్యానికి కారకుడిగా భావిస్తారు. మరోవైపు శని కష్టపడి పని చేయడంతో పాటు క్రమశిక్షణ సహనం, బాధ్యతకు సూచికగా చెప్పుకుంటారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ ప్రారంభంలో పూజ శని గ్రహాలు ఒకే స్థితిలో ఉండడం వల్ల శని, కుజ కేంద్ర రాజుయోగం ఏర్పడబోతోంది. ఈ యోగం కొన్ని గ్రహాలపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతాయి. సెప్టెంబర్ 1 నుంచి కుజుడు శని గ్రహాలు ఒకదానికొకటి 90 డిగ్రీల కోణంలోకి రాబోతున్నాయి.

ఈ సమయంలో ప్రణాళికలతో పనులు చేసిన వ్యక్తులకు, ముఖ్యంగా వ్యాపారాలతో పాటు వృత్తి జీవితం కొనసాగిస్తున్న వారికి ఆర్థికంగా అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరుతాయి. ఈ సమయంలో అదృష్టం విపరీతంగా పెరిగి ఉద్యోగాలు, వ్యాపారాలు, డబ్బు విషయాల్లో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకుండా చాలా నెమ్మదిగా జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. 

మిథున రాశి 
కుజ, శని గ్రహాలకు కేంద్ర రాజయోగ ప్రభావం వల్ల మిథున రాశి వారికి మృతి జీవితంలో కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా తిరిగి ప్రారంభమవుతాయి. పనుల్లో కొత్త బాధ్యతలు రావడమే కాకుండా అద్భుతమైన ప్రశంసలు కూడా సొంతం చేసుకోగలుగుతారు. అంతేకాకుండా తమ వ్యాపారాలను విస్తరించాలనుకునే వ్యక్తులందరికీ ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉండడంతో పాటు ఖర్చులపై నియంత్రణ ఉంచుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా సన్నిహితుల నుంచి విశేషమైన ప్రయోజనాల సొంతం చేసుకుంటారు..

కన్య రాశి 
కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకు శని, కుజుడి కేంద్ర యోగంతో వృత్తిపరమైన మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభించడమే కాకుండా కొత్త బాధ్యతలు లభిస్తాయి. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు సులభంగా నెరవేరుతాయి. పాత పరిచయస్తుల నుంచి కొత్త అవకాశాలు పొంది డబ్బులు భారీ మొత్తంలో సొంతం చేసుకోగలుగుతారు. అంతేకాకుండా ఆర్థికంగా బాగా మెరుగుపడి జీవిత భాగస్వామితో ప్రశంసలు పొందుతారు. అలాగే కష్టపడి చదివే వారికి ఈ సమయంలో తప్పకుండా ఫలితాలు లభిస్తూనే ఉంటాయి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టి ముందుకు సాగడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు సొంతం చేసుకోగలుగుతారు.

ధనస్సు రాశి 
కేంద్ర యోగం వల్ల ధనస్సు రాశి వారికి ఉద్యోగాలతో పాటు వ్యాపారాల పరంగా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపార భాగస్వామితో కలిసి అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా ప్రణాళికలు వేసుకొని.. భవిష్యత్తు పరంగా లాభాలు పొందగలుగుతారు. కొత్త ఆదాయ మార్గాలు పొందడమే కాకుండా ఈ సమయంలో వ్యక్తిగత జీవితంలో ఊహించని ప్రయోజనాలు పొందగలుగుతారు. ముఖ్యంగా సమాజంలో గౌరవం అంచలంచెలుగా పెరిగి అనుకున్న మొత్తంలో ధన లాభాలు సొంతం చేసుకోగలుగుతారు.. ముఖ్యంగా వ్యాపారాల పరంగా దిమ్మ తిరిగే ధన లాభాలు కలుగుతాయి..

మీన రాశి 
మీన రాశి వారికి కుజ, శని కేంద్ర సంయోగం అద్భుతమైన అవకాశాల అందిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించిన ఏవైనా దీర్ఘకాలిక సమస్యలతో పాటు ఆందోళన వంటి సమస్యలు ఉన్నవారు విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా వ్యాపారవేత్తలకు ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. డబ్బు విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాన్ని తీసుకోకపోవడం మంచిది. అంతేకాకుండా పెద్ద పెట్టుబడులు పెట్టడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం ఎంతో మంచిది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో గౌరవంతో పాటు అనుకోని ధన లాభాలు కలుగుతాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report
Advertisement

Irumudi 100 Crores: సెంచరీ కొట్టేసిన రవన్న.. రవితేజ కెరీర్‌లో రూ.వంద కోట్ల 'ఇరుముడి'

Baddipadaga, Telangana:

Ravi Teja Irumudi Movie: ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఇల్లు కళగా ఉంటుంది. అదే సినిమాగా తీస్తే కనకమహాలక్ష్మి కాసుల వర్షం కురిపిస్తుంది. అది రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'ఇరుముడి' సినిమా కలెక్షన్లతో రుజువు అవుతోంది. తండ్రీ కుమార్తె మధ్య ఉన్న అనుబంధంపై శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఇరుముడి సినిమా బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. రవితేజ కెరీర్‌లోనే రికార్డు హిట్‌గా నిలుస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.వంద కోట్లు కొల్లగొట్టింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ బృందం ప్రకటించింది.

బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుండడంతో కుటుంబ ప్రేక్షకులు కూడా థియేటర్‌కు వస్తున్నారు. తొలి మూడు రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా మంగళవారం రూ.వంద కోట్ల మైలురాయిని దాటేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు కొల్లగొట్టినట్లు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. తండ్రీ, కూతురి మధ్య కథకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కథ నచ్చడంతో ప్రేక్షకులు థియేటర్లకు బారులు తీరుతుండడంతో ఈ సినిమా థియేటర్ల సంఖ్య పెరుగుతోంది.

తొలి షో నుంచే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా రూ.వంద కోట్ల మార్క్‌ను నాలుగు రోజుల్లోనే చేరుకుంది. ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా.. బేబీ నక్షత్ర రవితేజ కూతురి పాత్రలో ఆకట్టుకోగా చక్కటి కుటుంబ సినిమాగా ఇరుముడి ప్రేక్షకాదరణ పొందుతోంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం కూడా తోడవడంతో సినిమాకు ఊహించని కలెక్షన్లు వస్తున్నాయి. విక్రమార్కుడు తర్వాత ఆ స్థాయిలో కలెక్షన్లు రవితేజ నటించిన ఇరుముడి సినిమాకు వస్తున్నాయి. మొదటి రోజే దాదాపు 60 శాతానికి పైగా రివకరీ సాధించిన ‘ఇరుముడి’ సినిమా రెండో రోజు ప్రవేశించే సమయానికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. తొలి రోజు రూ.20 కోట్లకు పైగా కలెక్షన్లు పొందిన ఈ సినిమా రెండో రోజు రూ.13 కోట్లకు పైగా షేర్ అందుకుంది. మూడో రోజు అంచనాలకు మించి రూ.15 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. 

రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించడంతో రవితేజ చాలా రోజుల తర్వాత 'ఇరుముడి'తో భారీ బంపర్‌ హిట్‌ సినిమా పొందాడు. ధమాకా తర్వాత రవితేజ రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించిన రెండో సినిమాగా రికార్డు నెలకొల్పింది. అంతకుముందు చిరంజీవితో నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా మూడో రూ.వంద కోట్లు సాధించిన సినిమా. మంచి మౌత్‌టాక్‌తో దూసుకెళ్తున్న ఇరుముడి సినిమా వసూళ్లల్లోనూ అదే స్థాయిలో దూసుకెళ్తుండగా శుక్రవారం విడుదల అవుతున్న 'టాక్సిక్‌' కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. యశ్‌ నటించిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో ఉండడంతో కొంత ఇరుముడికి ఆదరణ తగ్గేలా ఉంది. అయినా కూడా వారం తర్వాత మళ్లీ ఇరుముడి కలెక్షన్లు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.

0
0
Report
Advertisement

Godavari Pushkaralu: సీఎం చంద్రబాబు సమీక్ష.. రూ.4,026 కోట్లతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు

Amaravathi, Andhra Pradesh:

Chandrababu Review Meeting: అఖండ గోదారిని ఆరాధించేలా పుష్కరాలు ఉండాలని.. పుష్కరాల్లో భక్తులకు అత్యుత్తమ సౌకర్యాలు, పవిత్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. పుష్కరాలకు పది కోట్ల మంది పుణ్య స్నానాలు చేస్తారని.. దీనికోసం భారీ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పుష్కరాల కోసం 181 కొత్త ఘాట్ల నిర్మాణంతో సహా 440 ఘాట్ల అభివృద్ధి చేయాలని.. మొత్తం రూ.4,026 కోట్ల వ్యయంతో 4,932 పనులు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజులపాటు గోదావరి పుష్కరాలు రానుండడంతో పుష్కరాల ఏర్పాట్లపై అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. పుష్కరాల్లో భాగంగా రూ.4,026 కోట్లతో చేపట్టిన 4,932 పనులకు సంబంధించి పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రకృతి ఆరాధన-ఆధ్యాత్మిక చింతన మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఎక్కడా పవిత్రత దెబ్బతినకుండా.. భక్తులకు సమస్యలు తలెత్తకుండా ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

'పుష్కరాలు కేవలం ప్రభుత్వం నిర్వహించడమే కాదని.. స్థానిక ప్రజలను భాగస్వాములను చేయాలి. పుష్కరాలకు ఇంకా 10 నెలల సమయమే ఉండడంతో త్వరితగతిన అన్ని పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలి. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు' అధికార యంత్రాంగానికి సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 'ఈ పనులకు సంబంధించి ఇప్పటికే రూ.899 కోట్లు ఆర్ధిక శాఖ కేటాయింపులు జరిగాయి. పట్టణాభివృద్ధి, ఆర్ అండ్ బీ, జల వనరులు, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి అత్యధిక పనులు ఉన్నాయి' అని వివరించారు. 

'2015 మహా పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 4.86 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేయగా.. 2027లో 8 నుంచి 10 కోట్ల మంది గోదావరి పుష్కరాలకు తరలి వస్తారని అంచనాలు ఉన్నాయి. రోజుకు సుమారు కోటి మంది పుణ్య స్నానాలు చేసే అవకాశం ఉంది. రద్దీని తట్టుకునేలా మొత్తం 440 ఘాట్లు సిద్ధం చేస్తున్నాం. 259 ఘాట్లను అభివృద్ధి చేయడంతో పాటు అదనంగా 181 కొత్త ఘాట్లను నిర్మిస్తున్నాం' అని సీఎం చంద్రబాబుకు వివరించారు.

గోదావరి పరివాహక ప్రాంతంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. పిఠాపురంలో శక్తి పీఠం సహా పంచారామాల్లో 4 క్షేత్రాలు, ద్వారకా తిరుమల, అన్నవరం, వాడపల్లి, అంతర్వేది వంటి ప్రధాన ఆలయాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలి' అని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. భక్తులు పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించేందుకు వీలుగా హోం స్టేలను ప్రోత్సహించాలని సూచించారు. కొత్తగా హోటళ్ల నిర్మాణం చేపట్టేవారికి త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని చెప్పారు.

‘రాజమహేంద్రవరంలో కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలి. దేశ, విదేశాల్లో ప్రముఖులు అందరికీ గోదావరి పుష్కరాలకు ఆహ్వానం అందించాలి. కూచిపూడి ఈవెంట్ వంటివి భారీ తరహాలో నిర్వహించేలా దేవా దాయ-పర్యాటక శాఖలు ప్రణాళికలు రూపొందించాలి. పుష్కర ఘాట్లను కలిపే రహదారుల నిర్మాణం సహా పుష్కరాలు జరిగే 6 జిల్లాలో ఏ రోడ్లపై గుంతలు కనిపించకూడదు' అని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 'పోలవరం ప్రాజెక్టును సందర్శించేలా రహదారుల నిర్మాణం జరగాల్సి ఉంది. బ్రిడ్జిల సామర్ధ్యాన్ని పరిశీలించి దానికి అనుగుణంగా మరమ్మతులు చేయాలి. గోదావరిలో చుక్క కూడా మురుగు నీరు కలవకుండా చూడాలి. అధికారులు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలి. హేవ్‌లాక్ బ్రిడ్జి, సమీపంలో దీవుల అభివృద్ధి పనులు పూర్తి చేయాలి’ అని సీఎం చంద్రబాబు నిర్దేశించారు.  

'వైద్య సేవల పరంగా ఎటువంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. అంబులెన్స్‌లు, ఫస్ట్ ఎయిడ్‌, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని చెప్పారు. 30 ఫీల్డ్ ఆస్పత్రులను తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసి, వాటికి అనుబంధంగా ల్యాబ్‌లు సిద్ధం చేస్తున్నాం' అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. గోదావరి నదీ పరివాహక జిల్లాల్లోని 260 గ్రామ పంచాయతీలలో 50 గ్రామ పంచాయతీలను మోడల్‌ పుష్కర పంచాయతీలుగా అభివృద్ధి చేయాలని తెలిపారు. 

అఖండ గోదావరికి పుష్కర ఏర్పాట్లు
'గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా.. భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతోపాటు దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రపంచస్థాయి మౌలిక వసతులు, రవాణా, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, భద్రత, వసతి, సాంకేతిక పరిజ్ఞానంతో సమగ్ర ఏర్పాట్లను అద్భుతంగా చేయాలి' అని సీఎ చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. గోదావరి జన్మస్థానం నుంచి సముద్ర సంగమం వరకు అనేక ఉప నదులు, వాగులు, ఏరులు కలుస్తుండడంతో అఖండ గోదావరి పేరుతో పుష్కరాలు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు.

0
0
Report
Advertisement
Advertisement
Back to top