icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505001
SShankerreddyFollow17 Jul 2024, 11:48 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Ishan Kishan 350 Runs: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు చేసిన ఇషాన్ కిషన్..రికార్డు క్రియేట్ చేసిన యువ కెప్టెన్!

Hyderabad, Telangana:

Ishan Kishan 350 Runs Duleep Trophy: చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియం వేదికగా సౌత్ జోన్‌తో జరిగిన 2026 దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ప్రదర్శనతో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఈ ఎడమచేతి వాటం వికెట్ కీపర్ - బ్యాటర్ మొదటి ఇన్నింగ్స్‌లో 344 బంతుల్లో 270 పరుగులు చేసి, తన జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగుల భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 

అనంతరం సౌత్ జోన్ జట్టును 336 పరుగులకే ఆలౌట్ చేసిన ఈస్ట్ జోన్, 372 పరుగుల భారీ ఆధిక్యాన్ని పొందింది. రెండవ ఇన్నింగ్స్‌లోనూ తన అత్యుత్తమ ఫామ్‌ను కొనసాగించిన కిషన్, వేగంగా ఆడుతూ 98 బంతుల్లో 80 పరుగులు సాధించాడు.

2023లో భారత జట్టుకు దూరమై, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన అనంతరం, తన మనస్తత్వాన్ని మార్చుకుని దేశవాళీ క్రికెట్‌లో కష్టపడి తిరిగి వన్డే, టీ20 జట్లలో స్థానం సంపాదించాడు. అతిగా ఆలోచించడం మాని, కేవలం పరుగులు చేయడంపైనే దృష్టి పెట్టడమే ఈ ఘనతకు కారణమని కిషన్ వెల్లడించాడు.

ఈ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఈ మ్యాచ్‌లో మొత్తం 350 పరుగులు సాధించడం ద్వారా, దులీప్ ట్రోఫీ చరిత్రలోనే ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా కిషన్ ఘనత వహించాడు. దీనితో పాటు 1987 అక్టోబర్‌లో భిలాయిలో జరిగిన మ్యాచ్‌లో వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ తరఫున రమణ్ లాంబా నెలకొల్పిన 320 పరుగుల సుదీర్ఘ రికార్డును కూడా అతను అధిగమించాడు.

ఈ చారిత్రాత్మక విజయం అనంతరం మాట్లాడిన కిషన్.. తన కెరీర్‌లో ఎదురైన క్లిష్ట సమయం గురించి పంచుకున్నాడు. 2023లో భారత జట్టు తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడినప్పటికీ, ఊహించని పరిణామాల వల్ల అతడు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌పై పూర్తి దృష్టి సారించిన కిషన్, 2025-26 రంజీ ట్రోఫీలో సెంచరీలు సాధించాడు.

అంతేకాకుండా, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రెండు సెంచరీలతో కలిపి మొత్తం 517 పరుగులు చేసి జార్ఖండ్ జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ అద్భుతమైన దేశవాళీ ప్రదర్శనలతో అతడు తిరిగి బీసీసీఐ కాంట్రాక్ట్‌ను సాధించడమే కాకుండా, భారత వైట్-బాల్ (వన్డే, టీ20) జట్లలో కూడా చోటు దక్కించుకున్నాడు.

తనలో వచ్చిన ఈ మార్పు గురించి కిషన్ వివరిస్తూ.. "మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, అతిగా ఆలోచించకపోవడం, అనవసరమైన అంచనాలను పక్కన పెట్టడం వల్ల ఈ ఫలితాలు వచ్చాయి" అని తెలిపాడు. కేవలం మైదానంలోకి దిగి పరుగులు చేయడం, జట్టును గెలిపించడంపైనే తన దృష్టి ఉందని అతడు స్పష్టం చేశాడు.

Also Read: డబుల్ సెంచరీతో అలరించిన ఇషాన్ కిషన్..31 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..

Also REad: రేపే భారత్ Vs పాకిస్థాన్ మధ్య పోరు..ఆసియా కప్‌ 2026లో దుబాయ్‌లో హై-వోల్టేజ్ మ్యాచ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Indian Railways: తత్కాల్ కొత్త రూల్స్ వచ్చినా దక్కని ప్రయాణం.. సెకన్లలోనే 'నో రూమ్'!

Hyderabad, Telangana:

Tatkal Ticket Booking:  రైల్వే ప్రయాణం ఎంతో సులభతరం. భారతీయరైల్వేలో టిక్కెట్‌ ధరలు కూడా తక్కువ ధరలోనే ఉంటాయి. దీంతో ఎక్కువశాతం మంది రైలు ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తారు. దీపావళి, ఛత్‌పూజ సందర్భంగా కూడా చాలా మంది సొంతూళ్లకు వెళ్లడానికి రైలు టిక్కెట్‌ బుక్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దొరకని వారు తత్కాల్‌ ఉందిలే అనుకుంటున్నారు. కానీ, ఇది కూడా సెకన్లకే నో రూమ్‌ అని కనిపించడంతో ప్రయాణీకులు తలలు పట్టుకుంటున్నారు.

ఐఆర్‌సీటీటీ వెట్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా కూడా తత్కాల్‌ టిక్కెట్‌ బుకింగ్‌ కష్టతరంగానే మారింది. ఇక రానున్న దీపావళి, ఛత్‌పూజ సందర్భంగా ఆ డిమాండ్‌ మరింత పెరుగుతోంది. సాధారణంగా అయితే, రెండు నెలలు ముందుగానే రిజర్వేషన్‌ ప్రారంభం అవుతుంది. నవంబర్‌ 8వ తేదీ దీపావళి సందర్భంగా ఇప్పటికే రిజర్వేషన్‌ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. వీరంతా ఉదయం 8 గంటలే బుక్‌ చేయాలి. ఇవి కూడా రెండు మూడు నిమిషాల్లోనే వెయిటింగ్‌ లిస్ట్‌ చూపిస్తోంది. కనీసం అందుబాటులో ఉన్న టిక్కెట్లు కూడా కనిపించవు. ఇందులో టెక్నికల్‌ సమస్యలతో ఒక్కోసారి పేమెంట్‌ కూడా పూర్తవ్వదు.

ప్రధానంగా ఉదయం 8 గంటల సమయంలో టిక్కెట్‌లు బుక్‌ చేయాలంటే హెవీ ట్రాఫిక్‌ వల్ల బుకింగ్‌ కష్టతరంగా మారింది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, బీటా వెర్షన్‌, రైల్‌ వన్‌ యాప్‌ ద్వారా బుక్‌ చేసిన టిక్కెట్లు కొద్దిసేపటికే వెయిటింగ్‌ లిస్ట్‌లోకి వెళ్లిపోతున్నాయి. ఇక ఉదయం 11 గంటలకు బుక్‌ చేసే తత్కాల్‌ కూడా ఇదే పరిస్థితి.

ఇక పండుగల సమయంలో అయితే, ఢిల్లీ, ముంబై, గుజరాత్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, హరియాణ, బీహార్‌, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాలకు రద్దీ అధికంగా ఉంటుంది. ఈ రూట్‌లో డిమాండ్‌ కూడా ఎక్కువ. దీంతో టిక్కెట్‌ బుకింగ్‌ కూడా త్వరగా ఫిల్‌ అవుతుంది. తత్కాల్‌, ప్రీమియం తత్కాల్‌, స్పెషల్‌ ట్రైన్‌ సర్వీసెస్‌ ఇలాంటి సమయంలో దొరకవు.

Also Read:  విశాఖ వాసులకు రైల్వే అలర్ట్.. ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్ల మార్గాలు

Also Read:  రైల్వే ప్రయాణీకులకు శుభవార్త.. దీపావళి సందర్భంగా 20 ప్రత్యేక రైళ్లు, హైదరాబాద్‌ మీదుగా ఎన్నంటే?

నాన్‌ ఏసీ తత్కాల్‌ బుకింగ్‌..
తత్కాల్‌ అన్నీ ఏసీ క్లాసులు ఉదయం 10 గంటలకు ప్రతిరోజూ టిక్కెట్‌ బుకింగ్‌ ఓపెన్‌ అవుతే.. ఉదయం 11 గంటలకు నాన్‌ ఏసీ స్లీపర్‌ క్లాసులు ఓపెన్‌ అవుతాయి. 

రైల్వే ప్రయాణీకులు ఉదయం 11 గంటలకు స్వీపర్‌ బుకింగ్‌ ఓపెన్‌ అవుతే, లాగిన్‌ ఫెయిల్యూర్స్‌ అవుతున్నాయి. మరోవైపు పేమెంట్‌ చెల్లింపులు ఫెయిల్యూర్‌, టెక్కికల్‌ సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. 2025 జూలై 1 నుంచి తత్కాల్‌ ప్రీమియం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ఆధార్‌ అథెంటికేషన్‌, ప్రోఫైల్‌ వెరిఫై, ఓటీపీ వయా అథెంటికేషన్‌ తప్పనిసరి చేశారు. ఇక మొదటి అరగంట వరకు ఏజెంట్స్‌ బుకింగ్‌ కూడా నిలిపివేశారు. ఉదయం 10 నుంచి 10:30 గంటలు, నాన్‌ ఏసీ ఉదయం 11:00 నుంచి 11:30 వరకు రెగ్యులర్‌ ప్రయాణీకులు మాత్రమే బుకింగ్‌ చేసుకోవాలి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Free AC Bus Travel: మహిళలకు బిగ్ గుడ్‌న్యూస్.. ఇకపై ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం! సీఎం కీలక ప్రకటన!

Vijayawada, Andhra Pradesh:

Free AC Bus Travel For Woman: మహిళలకు సౌకర్యవంతమైన, గౌరవప్రదమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా కొత్త ఏసీ బస్సులను ప్రవేశపెట్టి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. దీనితో పాటు సూపర్ సిక్స్ హామీలు, పింఛన్ల పంపిణీ, దీపం పథకం మరియు మెగా డీఎస్సీ విజయవంతం కావడంపై సీఎం కీలక వివరాలను వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 'స్త్రీశక్తి' పథకం ద్వారా ఆర్టీసీ ఆర్డినరీ, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంది. అయితే ఈ ఉచిత ప్రయాణ సదుపాయం ఇప్పటివరకు ఏసీ బస్సుల్లో లేదు. ఈ నేపథ్యంలో మహిళల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేస్తూ, ఏసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.

మహిళలు చల్లటి ఏసీ బస్సులలో హాయిగా, సురక్షితంగా, గౌరవప్రదంగా ప్రయాణించాలనేదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళా సాధికారత అనేది కేవలం మాటలకే పరిమితం కాకుండా, చేతల్లో చూపించడమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం అమలు కోసం రాష్ట్రంలో త్వరలోనే భారీ సంఖ్యలో నూతన ఏసీ బస్సులను ప్రవేశపెడుతున్నామని, వాటిల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

ఉపాధి, ఉద్యోగాలు, వ్యాపారాలు, దైవ దర్శనాలు లేదా కుటుంబ అవసరాల కోసం పుట్టింటికి వెళ్లే మహిళలు ఈ ఏసీ బస్సుల సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. కాగా, ప్రస్తుతం ఉన్న ఉచిత ప్రయాణ సదుపాయం దివ్యాంగులకు కూడా వర్తిస్తోందని పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి "సూపర్ సిక్స్" హామీని నెరవేర్చడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని సీఎం స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తూ పాలన సాగిస్తున్నామని చెప్పారు. పేదవాడి చేతికి నేరుగా లబ్ధి చేకూర్చడమే నిజమైన సంక్షేమం అని, ఈ విషయంలో తమ ప్రభుత్వం సరికొత్త రికార్డులను సృష్టిస్తోందని తెలిపారు. ఇప్పటివరకు పెన్షన్ల రూపంలోనే పేదలకు ఏకంగా రూ.73,000 కోట్లు అందించామని, ప్రతి నెలా ఒకటో తేదీనే నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ ఇచ్చే అద్భుతమైన వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని వివరించారు.

అంతేకాకుండా, ఆడబిడ్డల వంటింటి కష్టాలను తీర్చడానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించే 'దీపం' పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తూ మహిళల ఆర్థిక భారాన్ని తగ్గించామని పేర్కొన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి తగినన్ని నిధులు రాబడుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. 

గత పాలకులు మెగా డీఎస్సీని అడ్డుకోవడానికి ఏకంగా 350 కేసులు వేసి అడుగడుగునా అడ్డంకులు సృష్టించినప్పటికీ, కోర్టులో తీవ్రంగా పోరాడి మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహించామని వివరించారు. ఎన్ని కుట్రలు, అడ్డంకులు ఎదురైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని ఎవరూ ఆపలేరని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

Also Read: రేపు స్కూళ్లకు సెలవు ఉందా లేదా? సెప్టెంబరు 11న ఆంధ్ర, తెలంగాణల్లో పరిస్థితి ఇదే!

Also Read: స్కూల్ సెలవు కోసం తోటి విద్యార్థిని చంపబోయి..బాలుర గురుకుల పాఠశాలలో ఘోరం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Trump Midterm Election: ఇరాన్‌తో భీకర యుద్ధం వేళ అమెరికాలో మధ్యంతర ఎన్నికలు..ట్రంప్ అధ్యక్ష పదవి కోల్పోతాడా?

Pensacola, Florida:

Trump Midterm Election 2026: అమెరికాలో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టిన ఇరు రాజకీయ పార్టీలు.. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఎన్నికల నేపథ్యంలో ఓ సంచలన ప్రకటన చేశారు. మధ్యంతర ఎన్నికలు ముగిసిన వెంటనే ఇరాన్‌తో యుద్ధం కూడా ముగిసిపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

వాషింగ్టన్ రాజకీయంలో మార్పు వస్తుందనే ఆశతోనే ఇరాన్ ఈ యుద్ధాన్ని సాగదీస్తోందని, అమెరికా ఓటర్లను గందరగోళానికి గురిచేసి అక్కడ బలహీనమైన ప్రభుత్వాన్ని తీసుకురావాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ఇదే సమయంలో పర్షియన్ గల్ఫ్‌లో ఇరాన్ చమురు ట్యాంకర్లపై అమెరికా క్షిపణి దాడులు చేయగా, జోర్డాన్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ ప్రతిదాడులకు దిగింది.

డల్లాస్‌లో జరగనున్న రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ప్రచారానికి బయలుదేరే ముందు వైట్ హౌస్ వద్ద డోనాల్డ్ ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. వాషింగ్టన్‌లో రాజకీయ అధికార మార్పుపై ఆశలతో ఇరాన్ పోరాటాన్ని పొడిగిస్తోందని చెప్పారు. అమెరికా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి టెహ్రాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని, అమెరికాలో బలహీనమైన పాలకులు ఉంటే సులువుగా అణుఆయుధాలు సమకూర్చుకోవచ్చని ఇరాన్ భావిస్తోందని విమర్శించారు. అయితే ఇరాన్ వద్ద శక్తివంతమైన ఆయుధాలు ఉంటే ప్రపంచానికే ప్రమాదమని, అలాంటి పరిస్థితిని రానివ్వనని స్పష్టం చేశారు.

చర్చలకు అమెరికా నిరాకరణ
ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలు జరిపే ఆలోచన ప్రస్తుతం అమెరికాకు లేదని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా జరిపిన సైనిక చర్యల ధాటికి ఇరాన్ ఆర్థిక, సైనిక వ్యవస్థలు పూర్తిగా అతలాకుతలమయ్యాయని, ఇప్పుడు ఆ దేశంలో మిగిలింది చాలా తక్కువేనని పేర్కొన్నారు. భవిష్యత్తులో చర్చలు జరిగినా, అది కేవలం అణు ఒప్పందానికే కాకుండా గతంలో ఎన్నడూ లేని కఠిన నిబంధనలతో ఉంటుందని తేల్చి చెప్పారు.

పర్షియన్ గల్ఫ్‌లో అమెరికా క్షిపణి దాడులు
గల్ఫ్ జలాల్లో ఇరాన్‌కు చెందిన చమురు రవాణా నౌకలు, ఇంధన నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు తీవ్రస్థాయిలో దాడులు చేస్తున్నాయి. ఇరాన్‌కు చెందిన దాదాపు తొమ్మిది భారీ చమురు ట్యాంకర్లను అమెరికా సైన్యం ధ్వంసం చేసిందని ట్రంప్ ధృవీకరించారు. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం, గత 48 గంటలుగా అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్ వరుసగా క్షిపణి దాడులకు తెగబడటంతో ప్రతిచర్యగా ఈ దాడులు జరిగాయి.

ఓమన్ గల్ఫ్‌లోని నాలుగు ముడి చమురు నౌకలతో పాటు, ఖార్గ్ ఐలాండ్ సమీపంలో ఇరాన్ విప్లవాత్మక గార్డ్స్‌తో సంబంధమున్న నౌకను ధ్వంసం చేశారు. దాడికి ముందే నౌకలోని సిబ్బందిని బయటకు పంపినట్లు, తమ దళాలకు ఎలాంటి నష్టం జరగలేదని అమెరికా ప్రకటించింది.

మరోవైపు అమెరికా దాడులకు నిరసనగా ఇరాన్ బలగాలు జోర్డాన్‌లోని 'మువఫ్ఫాక్ సాల్టీ' వైమానిక స్థావరంపై క్షిపణులతో దాడి చేశాయి. ఈ ఎయిర్ బేస్‌ను అమెరికా దళాలు తమ సైనిక కార్యకలాపాలకు ఉపయోగిస్తుండటంతో దానిని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఘర్షణలు ఎటు దారితీస్తాయోనని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ యుద్ధ ప్రభావం రాబోయే అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం కనిపిస్తోంది.

ట్రంప్ అధ్యక్ష పదవి కోల్పోతాడా?
అమెరికాలో ప్రస్తుతం జరగబోయే మధ్యంతర ఎన్నికలు అధ్యక్ష పదివికి అని కొందరిలో అభిప్రాయం ఏర్పడింది. అమెరికాలో త్వరలోనే జరగబోయే ఎన్నికలు మన రాష్ట్రాల్లోని శాసన మండలి, పార్లమెంట్‌లోని రాజ్యసభను పోలి ఉంటాయి. ఈ మధ్యంతర ఎన్నికల ద్వారా అమెరికన్ కాంగ్రెస్‌లోని (పార్లమెంట్) ప్రతినిధుల సభలో అన్నీ స్థానాలకు, అలాగే సెనేట్ల సభలో కొన్ని స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ట్రంప్ పార్టీ అన్నీ స్థానాల్లో ఓడిపోయినా.. ట్రంప్ తన పదవిని కోల్పోయే అవకాశం లేదు. కానీ, చట్టసభల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ట్రంప్ ప్రభుత్వం పట్టు కోల్పోయి అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం పొందే అవకాశం లేదు. కాబట్టి, ఈ మధ్యంతర ఎన్నికల ద్వారా డొనాల్డ్ ట్రంప్ తన అధ్యక్ష పదవిని కోల్పోతాడనే అభిప్రాయాల్లో నిజం లేదు.

Also Read: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం..209 విమానాలపై ప్రభావం, ప్రయాణికులకు తీవ్ర అంతరాయం

Also Read: విదేశీ మహిళతో నగ్నంగా పూజలు చేసిన జోతిష్య్కుడు..వీడియో రికార్డు చేసి బెదిరింపులు!

0
0
Report

Apple iPhone 18 Launch: యాపిల్ ఐఫోన్ 18 సంచలనం..మడతబెట్టే ఐఫోన్ వచ్చేసింది..ఒక్కోటి రూ.3 లక్షలు మాత్రమే!

Hyderabad, Telangana:

Apple iPhone 18 Duo Launch: అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ 'ఐఫోన్ డ్యూయో'తో పాటు ఐఫోన్ 18 శ్రేణిని ప్రపంచానికి పరిచయం చేసింది. కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్‌లో జరిగిన 'సర్‌ప్రైజ్ అండ్ షైన్' కార్యక్రమంలో కొత్త సీఈఓ జాన్ టెర్నస్ ఈ నూతన ఉత్పత్తులను ఆవిష్కరించారు. ఫోల్డబుల్ డిజైన్‌తో పాటు శక్తివంతమైన ఏ20 ప్రో చిప్, అధునాతన కెమెరాలు, మెరుగైన బ్యాటరీ లైఫ్, ఏఐ ఆధారిత ఫీచర్లు, నూతన వాచ్, ఎయిర్‌పాడ్స్ మోడళ్లు ఈ ఆవిష్కరణలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో ఉన్న యాపిల్ పార్క్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సంస్థ నూతన సీఈఓ జాన్ టెర్నస్ ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ సహా సంస్థ తొలి ఫోల్డబుల్ వెర్షన్‌ను ప్రదర్శించారు.

యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ 'ఐఫోన్ డ్యూయో'..
అందరూ ఆసక్తిగా ఎదురుచూసినట్లుగానే యాపిల్ తన తొలి మడతబెట్టే ఫోన్ 'ఐఫోన్ డ్యూయో'ను పరిచయం చేసింది. స్టార్ వైట్, నైట్ స్కై అనే రెండు రంగుల్లో ఇది అందుబాటులోకి వచ్చింది. మడత విప్పినప్పుడు ఇది అత్యంత పల్చటి ఐఫోన్‌గా మారడమే కాకుండా 7.6 అంగుళాల సూపర్‌ రెటీనా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లేను అందిస్తుంది. 

ఇందుకు అనుగుణంగా ఐఓఎస్ 27 (iOS 27) ను ప్రత్యేకంగా రీడిజైన్ చేశారు. ఇందులో రెండు హోమ్ స్క్రీన్ పేజీలతో పాటు మెయిల్, మెసేజెస్ కంటెంట్‌ను చూసుకోవచ్చు, అలాగే రెండు యాప్‌లను ఒకేసారి పక్కపక్కన వినియోగించుకోవచ్చు. ఫోన్ మడతపెట్టినప్పుడు (5.4 అంగుళాలు) విడ్జెట్స్, వెదర్, క్యాలెండర్, మ్యూజిక్‌తో కూడిన బెడ్‌సైడ్ క్లాక్‌లా పనిచేస్తుంది.

ఇది నాలుగు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.
256 GB: రూ. 2,99,900
512 GB: రూ. 3,24,900
1 TB: రూ. 3,74,900
2 TB: రూ. 4,49,900

అక్టోబర్ 16 సాయంత్రం 5:30 గంటల నుండి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయి, అలాగే అక్టోబర్ 23 నుండి అమ్మకాలు మొదలవుతాయని సదరు యాపిల్ సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఆఫర్లలో భాగంగా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ. 7,000 వరకు తక్షణ డిస్కౌంట్, రూ. 4,500 నుండి రూ. 81,500 వరకు ట్రేడ్-ఇన్ క్రెడిట్ మరియు నో-కాస్ట్ EMI సౌకర్యం ఉన్నాయి. అయితే ఈ ఐఫోన్ బాక్స్‌లో కేవలం USB-C కేబుల్ మాత్రమే ఉంటుంది. ఛార్జింగ్ అడాప్టర్ ఉండదు.

శక్తివంతమైన A20 ప్రో చిప్‌తో 2nm ప్రాసెస్‌ చిప్‌తో పనిచేస్తుంది. ఇందులో 6-కోర్ CPU, 7-కోర్ GPU, డ్యూయల్ 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ఉన్నాయి. ఇరువైపులా ఉన్న డ్యూయల్ బ్యాటరీ వ్యవస్థ లోపలి స్క్రీన్‌పై 31 గంటలు, బయటి స్క్రీన్‌పై 44 గంటల వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని ఇస్తుంది. కేబుల్ ఛార్జింగ్‌తో 20 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ పూర్తి అవుతుంది.

కెమెరా వ్యవస్థ, సాఫ్ట్‌వేర్ ఐఫోన్ డ్యూయోలో 48MP ఫ్యూజన్ మెయిన్, 48MP ఫ్యూజన్ అల్ట్రా-వైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ముందరి భాగంలో 12MP సెంటర్ స్టేజ్ కెమెరా, అంతర్గత డిస్‌ప్లే కింద అండర్-డిస్‌ప్లే ఫేస్‌టైమ్ కెమెరా కలవు. ఈ ఫోన్ డ్యూయల్ స్క్రీన్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన iOS 27.1 పై నడుస్తుంది. ఇది రెండు యాప్‌లను పక్కపక్కనే ఉపయోగించడానికి స్ప్లిట్ వ్యూ సౌకర్యాన్ని అందిస్తుంది. దీనితో పాటు సిరి AI బీటా రూపంలో అందుబాటులో ఉన్నాయి.

ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ విశేషాలు..
భారత్‌లో ఐఫోన్ 18 ప్రో మోడళ్లు 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ, 2 టీబీ స్టోరేజ్ సామర్థ్యాల్లో డీప్ బ్లాక్, సిల్వర్, గ్లేసియర్ బ్లూ, బర్గుండీ రంగుల్లో లభిస్తాయి. 6.3 అంగుళాల డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్‌లో కొత్త ఏ20 ప్రో చిప్ (7-కోర్ జీపీయూ, 6-కోర్ సీపీయూ) అమర్చారు. 

ఏఐ ఆధారిత సిరి, ఇమేజ్ ప్లేగ్రౌండ్ వంటి యాపిల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నాయి. 48 ఎంపీ ఫ్యూజన్ మెయిన్ కెమెరాలో ఆస్ట్రోఫొటోగ్రఫీ, నైట్ మోడ్ మెరుగయ్యాయి. 4కే రిసొల్యూషన్, డాల్బీ విజన్ హెచ్‌డీఆర్‌లో టైమ్ లాప్స్ సపోర్ట్ ఉంది. 

ఇది ఒక ఛార్జింగ్‌తో 24 గంటల వినియోగం, 36 గంటల వీడియో ప్లేబ్యాక్ ఇస్తుంది. కేవలం 15 నిమిషాల్లో 50% ఛార్జ్ అవుతుంది. ఇక 6.9 అంగుళాల డిస్‌ప్లే కలిగిన ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఒక ఛార్జింగ్‌తో 30 గంటల వినియోగం, 45 గంటల వీడియో ప్లేబ్యాక్ ఇస్తుంది.

ఎయిర్‌పాడ్స్ 5, యాపిల్ వాచ్ సిరీస్..
ఓపెన్ ఇయర్ డిజైన్‌తో వచ్చిన ఎయిర్‌పాడ్స్ 5లో 50% మెరుగైన నాయిస్ రిడక్షన్, లైవ్ ట్రాన్స్‌లేషన్, హ్యాండ్స్ ఫ్రీ మోడ్‌లో సిరి, కెమెరా రిమోట్, వాల్యూమ్ స్వైప్ ఫీచర్లు ఉన్నాయి. యాపిల్ వాచ్ సిరీస్ 12, అల్ట్రా 4 మోడళ్లలో ఏఐ ఆడియో, 15 సెకన్ల లైవ్ రివైండ్, మెరుగైన ఈసీజీ, ఆప్టికల్ సెన్సార్లు ఉన్నాయి. ఇవి ప్రతి 5 సెకన్లకు (60 రెట్లు ఎక్కువ) హృదయస్పందనను నమోదు చేస్తాయి, అలాగే నిద్ర, రక్త డేటాతో పాటు వాస్తవ వయసుతో ఆరోగ్య సంకేతాల పోలికను అందజేస్తాయి.

Also Read: బ్యాంకులు సమ్మె..వరుసగా 4 రోజులు సెలవు..నెలాఖరులో మరో 3 రోజులు బంద్!

Also Read: వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.1,000 ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ ఉచితం..ఈ పని చేస్తే చాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

AP Gurukul Student Murder: స్కూల్ సెలవు కోసం తోటి విద్యార్థిని చంపబోయి..బాలుర గురుకుల పాఠశాలలో ఘోరం!

Kambhamvaripalle, Andhra Pradesh:

AP Gurukul Student Murder News: ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. గ్యారంపల్లె గురుకుల పాఠశాల వసతి గృహంలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు, తమతో పాటే ఒకే గదిలో నివాసముంటున్న మరో విద్యార్థిపై ఘాతుకానికి ఒడిగట్టారు. వారం రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రపోతున్న వేళ, పథకం ప్రకారం బాధిత విద్యార్థి ముఖంపై దిండు గట్టిగా నొక్కిపట్టారు. ఊపిరాడకుండా చేయడంతో పాటు గొంతు నులిమి ప్రాణాలు తీసేందుకు తీవ్రంగా యత్నించారు.

అకస్మాత్తుగా జరిగిన ఈ దాడితో దిగ్భ్రాంతికి గురైన బాధిత విద్యార్థి తన ప్రాణాలను కాపాడుకునేందుకు తీవ్రంగా పెనుగులాడాడు. చివరకు నిందితుల పట్టు నుంచి చాకచక్యంగా తప్పించుకుని, కేకలు వేస్తూ గది బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ ఘటనను పాఠశాల యాజమాన్యం వారం రోజుల పాటు గోప్యంగా ఉంచినప్పటికీ, విషయం లీక్ కావడంతో విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టి నిందితులైన ఇద్దరు విద్యార్థులకు టీసీలు (TCs) ఇచ్చి పంపించివేశారు.

గోప్యంగా ఉంచిన ఉపాధ్యాయులు..
తోటి విద్యార్థిని అంతమొందించేందుకు యత్నించిన ఈ తీవ్రమైన ఘటనను పాఠశాల ఉపాధ్యాయులు, యాజమాన్యం బయటకు పొక్కకుండా తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి గానీ, పోలీసులకు గానీ సమాచారం ఇవ్వకుండా వారం రోజుల పాటు గోప్యంగా ఉంచారు. అయితే, ఈ దారుణం స్థానికంగా లీక్ కావడంతో చివరకు విద్యాశాఖ అధికారుల దృష్టికి చేరింది. సమాచారం అందుకున్న మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) రెడ్డిబాషా బుధవారం పాఠశాలకు చేరుకుని ప్రత్యక్షంగా విచారణ చేపట్టారు.

పాత సంఘటనే ప్రేరణగా ఘాతుకం..
ఎంఈవో రెడ్డిబాషా పాఠశాల సిబ్బందిని, నిందితులైన విద్యార్థులను, బాధితుడిని వేర్వేరుగా విచారించడంతో పాటు వారి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. సుమారు రెండేళ్ల క్రితం ఇదే పాఠశాలలో ఒక విద్యార్థి అనుకోని పరిస్థితుల్లో మరణించగా, అప్పట్లో పాఠశాలకు కొన్ని రోజులు సెలవులు ప్రకటించారు. ఆ పాత సంఘటనను గుర్తుపెట్టుకున్న ఈ ఇద్దరు బాలురు, ఇప్పుడు కూడా ఎవరినైనా చంపేస్తే బడికి వరుసగా సెలవులు వస్తాయనే భావనతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు విచారణలో అంగీకరించారు.

తల్లిదండ్రుల్లో ఆందోళన..
తోటి విద్యార్థి ప్రాణాలకే ముప్పు తెచ్చిన సదరు ఇద్దరు విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం బదిలీ సర్టిఫికెట్లు (టీసీలు) జారీ చేసి హాస్టల్ నుంచి తొలగించి ఇంటికి పంపించివేసింది. ఈ ఉదంతంపై సమగ్ర వివరాలతో కూడిన నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించినట్లు ఎంఈవో తెలిపారు. పాఠశాలకు సెలవుల కోసం పసి మనస్సులు ఇంతటి దారుణమైన నేరానికి సిద్ధపడటం విద్యావర్గాలను, ఇతర విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హాస్టళ్లలో ఉండే పిల్లల మానసిక స్థితిపై ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: YS Jagan Padayatra: పాదయాత్ర షెడ్యూల్‌పై వైఎస్ జగన్ కీలక ప్రకటన..వచ్చే దసరా నుంచి షురూ!

Also Read: ఆంధ్ర, తెలంగాణలో వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలి? 14 లేదా 15? పండగ సెలవు ఎప్పుడంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Union Cabinet: భారీ రైల్వే ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌.. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

Baddipadaga, Telangana:

Telangana Railway Projects: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. రైల్వేకు సంబంధించిన కీలక ప్రాజెక్టుకు కేంద్ర మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో సికింద్రాబాద్ - కాజీపేట్ మధ్యన మల్టీట్రాకింగ్ రైల్వేలైన్‌తోపాటు 5 మల్టీట్రాకింగ్ రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రూ. 2,418 కోట్ల అంచనా వ్యయంతో 110 కిలోమీటర్ల పొడవున మల్టీ ట్రాకింగ్ రైల్వే లైన్ నిర్మాణం చేపట్టేందుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

ఈ ప్రాజెక్టు చేపట్టడంతో రైళ్ల ట్రాఫిక్ తగ్గడంతోపాటు రైళ్ల సమయపాలన మెరుగుపడనుందని రైల్వే శాఖ భావిస్తోంది. సరుకు రవాణా రైళ్లు కూడా త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవడంతో ఇంధనం ఆదా అవడంతోపాటు ఫ్రైట్ ఛార్జీలు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మల్టీ ట్రాకింగ్ రైల్వే లైన్‌తో సంవత్సరానికి 9.83 మిలియన్ టన్నుల సరుకును అదనంగా రవాణా చేసే అవకాశం ఉంది. బొగ్గు, ఐరన్‌ ఓర్‌, ఆహార ధాన్యాలు ప్రస్తుతం చేస్తున్న దానికంటే అదనంగా రవాణా చేసుకునే అవకాశం లభించనుంది. 

సికింద్రాబాద్ - కాజీపేట్ మధ్యన అందుబాటులోకి రానున్న ఈ రైల్వే లైన్ ద్వారా విజయవాడ, ముంబయి మార్గాలలో మెరుగైన రైలు ప్రయాణాలు సాగించడానికి మార్గం సుగమం కానుంది. అంతేకాకుండా ఈ మార్గంలో ఉన్న యాదాద్రి, స్వర్ణగిరి, సురేంద్రగిరి ఆలయాలను సందర్శించే భక్తులకు, భువనగిరి కోటను సందర్శించే పర్యాటకులకు కూడా ఈ మల్టీ ట్రాకింగ్ రైల్వే లైన్ అనుకూలంగా మారనుంది. దీంతో పర్యాటకంగా కూడా ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది.

​సికింద్రాబాద్ - కాజీపేట్ మధ్యన మల్టీట్రాకింగ్ రైల్వేలైన్ నిర్మాణానికి ఆమోదం లభించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీకి, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. 'తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రైల్వే బడ్జెట్ కేటాయింపులు 21 రెట్లు పెరిగాయి. 12 సంవత్సరాల కాలంలో రూ.36,286 కోట్లను తెలంగాణకు కేటాయించారు' అని కిషన్‌ రెడ్డి వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు రూ.50 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు పనులు జరుగుతున్నాయని.. మరో రూ. 50 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు సర్వే జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వివరించారు. రైల్వే లైన్లతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 42 రైల్వేస్టేషన్లలో దాదాపు రూ.3 వేల కోట్లతో అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పించి అమృత్ భారత్ స్టేషన్లుగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. వీటిలో ఇప్పటికే 6 రైల్వేస్టేషన్లను ప్రారంభించినట్లు గుర్తుచేశారు. రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి మరింతగా కృషి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు.

మల్టీట్రాకింగ్ రైల్వేలైన్ ప్రాజెక్టుతో అదనంగా సరుకు రవాణా ఇలా.. 
==> బొగ్గు 7.06 మిలియన్ టన్నులు
==> ఐరన్ ఓర్ 0.73 మిలియన్ టన్నులు
==> ఆహారధాన్యాలు 0.65 మిలియన్ టన్నులు

0
0
Report

Telangana Police Jobs: పోలీస్‌ జాబ్‌ కోసం ఎదురుచూసే వారికి తెలంగాణ సర్కార్‌ తీపి కబురు

Baddipadaga, Telangana:

Telangana Police Job Notification: తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాల నియామకంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండగా తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. పోస్టుల సంఖ్య పెంచడం.. వయో పరిమితిని పెంచడం వంటి డిమాండ్లు చేస్తుండగా నిరుద్యోగుల స్పందనకు ప్రభుత్వం స్పందించి కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగం కోసం పోటీ పడే వారి వయో పరిమితిని పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాల గరిష్ట వయోపరిమితి మరో మూడేళ్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం వెలిబుచ్చింది. ​తెలంగాణ రాష్ట్రంలో పోలీస్, ఫైర్ సర్వీసెస్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్‌) విభాగాల్లోని కానిస్టేబుల్, తత్సమాన పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు మరో 3 సంవత్సరాలు వయో పరిమితి పెంచుతూ జీఓ 129ను జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం పోలీసులు, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, అగ్ని మాపక దళం, జైళ్లశాఖల్లో 7,437 ఉద్యోగాల భర్తీకి గత నెల 29వ తేదీన ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ జరగనుంది.

నిరుద్యోగుల నుంచి మరో డిమాండ్‌
లాంగ్‌జంప్‌పై కూడా నిరుద్యోగుల నుంచి మరో డిమాండ్‌ వస్తోంది. 4 మీటర్ల లాంగ్ జంప్ నిబంధనను 3.8 మీటర్లకి తగ్గించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. లాంగ్‌జంప్‌ ఇతర రాష్ట్రాల్లో తక్కువ ఉందని వివరిస్తున్నారు. ఏపీతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో లాంగ్ జంప్ క్వాలిఫై 3.8 మీటర్లుగానే పరిగణిస్తున్నారనే విషయం ఉద్యోగ అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు. పోలీస్‌ ఉద్యోగాల ఎంపికలో ఈవెంట్స్‌లో 4 మీటర్ల లాంగ్ జంప్ నిబంధనతో చాలా మంది అభ్యర్థులు క్వాలిఫై కాలేకపోతున్నారని వాపోతున్నారు. దీంతో వయో పరిమితి మాదిరి లాంగ్‌జంప్‌ విషయంలో కూడా ప్రభుత్వం స్పందించి.. లాంగ్ జంప్ నిబంధనను 3.8మీటర్లకు తగ్గించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

వయో పరిమితిపై ఎమ్మెల్సీ విజ్ఞప్తి
కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల అభ్యర్థుల వయో పరిమితి పెంచాలని ముఖ్యమంత్రికి ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్ విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. కరోనా పరిస్థితుల నేపథ్యం, నోటిఫికేషన్లు ఆలస్యమవడంతో చాలా మంది నిరుద్యోగులు వయో పరిమితి మించిపోయి, అవకాశం కోల్పోతున్నారని వివరించారు. కానిస్టేబుల్ ఉద్యోగానికి వయో పరిమితి 34 ఏళ్ల నుంచి 36 ఏళ్ల వరకు.. ఎస్సై ఉద్యోగానికి వయో పరిమితి 37 ఏళ్ల నుంచి 38 ఏళ్ల వరకు పెంచాలని వినతిపత్రంలో ఎమ్మెల్సీ వెంకట్‌ కోరారు.

0
0
Report
Advertisement

చేతులు..  మోకాళ్లు నల్లగా మారాయా? మీ వంటింట్లోని ఈ 3 వస్తువులతో నలుపు మాయం!

Hyderabad, Telangana:

Dark Elbows And Knees Remedies: మన పూర్వీకుల కాలం నుండి కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగిస్తున్నారు. ఇవి చర్మానికి ఎంతో మేలు చేయడమే కాకుండా మంచి నిగారింపును అందిస్తాయి. అంతేకాకుండా చర్మాన్ని డ్రై సమస్య నుండి కూడా కాపాడతాయి. చాలామందిలో మోచేతులు, మోకాళ్లు నలుపుగా మారిపోవడం మనం చూస్తుంటాము. వంటగదిలో ఉండే కొన్ని సహజమైన వస్తువులతోనే ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఈ మాస్కులు నల్లగా మారిన మోచేతులు, మోకాళ్లకు మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి ఎక్స్‌ఫోలియేటింగ్ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి కఠినమైన చర్మానికి మంచి నిగారింపును, ఈవెన్ స్కిన్ టోన్‌ను అందిస్తాయి. ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. అయితే, ముందుగా ఇరిటేషన్ వచ్చే అవకాశం ఉన్నందున ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం తప్పనిసరి. డెర్మటాలజిస్ట్ సూచనలు లేకుండా ఈ రెమెడీస్ పాటిస్తున్నట్లయితే, ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేయించుకోవాలి.

శనగపిండి, పెరుగు..
శనగపిండిని మన పూర్వీకుల కాలం నుండి సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తున్నారు. ఇవి వంటగదిలో సులభంగా అందుబాటులో ఉంటాయి. ఇండియన్ స్కిన్ కేర్ రొటీన్‌లో వీటిని చేర్చుకోవచ్చు. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మానికి మంచి ఈవెన్ టోన్‌ను అందిస్తుంది. నల్లగా ఉన్న మోచేతులు  మోకాళ్ల కోసం, ఒక టేబుల్ స్పూన్ శనగపిండిలో పెరుగు కలిపి మెత్తని పేస్ట్‌లా తయారు చేయాలి. దీనిని నలుపుగా ఉన్న ప్రాంతాల్లో అప్లై చేసి, 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మంచి మాయిశ్చరైజేషన్ లభించి నలుపుదనం తగ్గుతుంది.

ఓట్ మిల్, తేనె మాస్క్..
ఓట్ మిల్ చర్మానికి మంచి నిగారింపును అందిస్తుందని, ముఖంపై ఉన్న నలుపుదనాన్ని తగ్గిస్తుందని మనకు తెలుసు. దీన్ని స్క్రబ్బర్‌లా కూడా వాడవచ్చు, ఇది ఫిజికల్ ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. ఓట్ మిల్‌తో కలిపి నలుపుగా ఉన్న ప్రాంతంలో స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల నలుపుదనం త్వరగా వదిలిపోతుంది. కొన్ని నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల చర్మానికి మంచి హైడ్రేషన్, మాయిశ్చర్ లభిస్తాయి.

Also Read: హోల్ మిల్క్ vs స్కిమ్డ్ మిల్క్.. గుండె ఆరోగ్యానికి ఏ పాలు బెస్ట్? డాక్టర్లు ఏమంటున్నారంటే..

Also Read: తెల్ల జుట్టు, గ్యాస్ ప్రాబ్లమ్‌కి కరివేపాకుతో చెక్.. రోజూ ఇలా తీసుకోండి!

కలబంద, పసుపు మాస్క్..
కలబంద, పసుపు కలిపిన పేస్ట్‌ను అప్లై చేయడం వల్ల చర్మానికి మంచి హైడ్రేషన్ లభిస్తుంది. పసుపును మన పూర్వీకుల కాలం నుండి బ్యూటీ రొటీన్‌లో వాడుతున్నారు. కలబంద, పసుపు కలిపి రాయడం వల్ల మోచేతులు, మోకాళ్ల వద్ద ఉన్న నలుపుదనం తగ్గుతుంది. ఒక టేబుల్ స్పూన్ కలబందలో ఒక చిటికెడు పసుపు వేసి, అప్లై చేసిన తర్వాత పది నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి. ఇలా చేయడం వల్ల నలుపుదనం తగ్గి, చర్మం ఈవెన్ స్కిన్ టోన్‌ను పొందుతుంది.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Collectors Conference: రేపటి నుంచి 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు.. దిశానిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు 

Velgapudi, Andhra Pradesh:

AP District Collectors Conference: అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నో హామీలు.. పథకాలు ప్రకటించడంతోపాటు పరిపాలనాపరమైన నిర్ణయాలు, విధానపరమైన అంశాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వంటి వాటిపై నిత్యం సమీక్ష చేస్తున్న సీఎం చంద్రబాబు ఈ క్రమంలోనే జిల్లాల కలెక్టర్లకు కూడా దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయనున్నారు.

8వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండు రోజుల పాటు జరగనుండగా.. రేపు రాష్ట్ర సచివాలయంలో ప్రారంభం కానుంది. 10, 11వ తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుండగా దీనికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, విభాగాధిపతులు పాల్గొననున్నారు.

7వ కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై చేపట్టిన చర్యల నివేదికతో మొదటి రోజు సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆర్థిక వృద్ధి, సంక్షేమం, మానవాభివృద్ధి, సాంకేతికత, పెట్టుబడులు, శాంతిభద్రతలు లాంటి కీలక విభాగాల వారీగా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. ప్రభుత్వ సేవలు, వివిధ పథకాల అమలు వంటి వాటిపై క్షేత్రస్థాయి పరిస్థితులపై ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సులో ఏయే అంశాలపై చర్చ జరగనుందో తెలుసుకుందాం.

మొదటి రోజు
జీఎస్డీపీ, స్వర్ణాంధ్ర విజన్‌కు జిల్లాస్థాయి రోడ్‌మ్యాప్‌లపై సమీక్షిస్తారు. సూపర్ సిక్స్ పథకాలు, తాగునీరు, గృహనిర్మాణం, ఆరోగ్యం, విద్యా రంగంలో పురోగతి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, జలధార, జిల్లాల బెస్ట్ ప్రాక్టీసెస్ సదస్సులో పలువురు కలెక్టర్లు ప్రదర్శిస్తారు.
రెండో రోజు
సదస్సులో ఇ-గవర్నెన్స్, ఫైళ్ల పరిష్కారం, ఆర్టీజీఎస్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, జిల్లాల వారీ ర్యాంకింగ్స్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగం, నైపుణ్యాభివృద్ధి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం, శాంతిభద్రతలు

0
0
Report
Advertisement

EPF Advance Withdrawal: ఉద్యోగులకు ముఖ్య గమనిక..ఈపీఎఫ్ అడ్వాన్స్ కొత్త రూల్స్..ఎన్నిసార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు?

Hyderabad, Telangana:

EPF Advance Withdrawal Rules: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చందాదారులు తమ వివిధ రకాల ఆర్థిక అవసరాల కోసం ఈపీఎఫ్ అడ్వాన్స్ నిధులను ఉపసంహరించుకునేందుకు స్పష్టమైన నిబంధనలను నిర్దేశించింది. అత్యవసరాలు, ఇంటి అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు అనే మూడు ముఖ్యమైన కేటగిరీల కింద ఏ అవసరానికి ఎన్నిసార్లు డబ్బులు ఉపసంహరించుకోవచ్చో పరిమితులను స్పష్టం చేసింది. 

వైద్య చికిత్సల కోసం ఎలాంటి పరిమితి లేకుండా ఎన్నిసార్లయినా విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఇవ్వగా చదువు, వివాహం, ఇంటి నిర్మాణం, ప్రత్యేక పరిస్థితులకు పరిమిత సంఖ్యలో క్లెయిమ్‌లు చేసుకోవచ్చని వెల్లడించింది.

కేటగిరీ-1
అత్యవసరాలు (Emergency Needs) చందాదారుల వ్యక్తిగత, కుటుంబ సభ్యుల అత్యవసరాల కోసం ఈ క్రింది విధంగా ఉపసంహరణలకు అవకాశం కల్పించారు:

అనారోగ్యం: వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వైద్య చికిత్సల కోసం చందాదారుడు తన మొత్తం సర్వీసు కాలంలో ఎన్నిసార్లయినా నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి పరిమితి లేదు. దీనికి ఈపీఎఫ్‌వో నిబంధనలు వర్తిస్తాయి. 

విద్య: వ్యక్తిగత లేదా తన కుటుంబ సభ్యుల చదువుల ఖర్చుల కోసం మొత్తం సర్వీసులో పది (10) సార్లు నగదును ఉపసంహరించుకోవచ్చు.

వివాహం: వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వివాహ ఖర్చుల కోసం మొత్తం సర్వీసు సమయంలో ఐదు (5) సార్లు క్లెయిమ్ చేయవచ్చు.

కేటగిరీ-2 
ఇంటికి సంబంధించిన అవసరాలు సొంత ఇంటి అవసరాలు, నివాస సదుపాయాల కోసం నిధులను విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది.

ఇల్లు, భూమి కొనుగోలు, నిర్మాణం: ఇల్లు లేదా భూమి కొనుగోలు చేయడానికి, గృహ నిర్మాణం చేపట్టడానికి, గృహ రుణ (Home Loan) చెల్లింపులకు, అలాగే ఇంటి మరమ్మతుల కోసం మొత్తం సర్వీసు కాలంలో ఐదు (5) సార్లు నగదును అడ్వాన్స్‌గా పొందే అవకాశం ఉంది.

కేటగిరీ-3
ప్రత్యేక పరిస్థితులు అనుకోకుండా ఎదురయ్యే ప్రత్యేక ప్రతికూల పరిస్థితుల్లో చందాదారులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రత్యేక అవకాశాన్ని అందించారు.

ప్రత్యేక పరిస్థితులలో విత్‌డ్రా..
ప్రకృతి విపత్తులు రావడం, లాకౌట్ లేదా సంస్థ మూసివేత జరగడం, ఉద్యోగం కోల్పోవడం, తీవ్ర రోగాల వ్యాప్తి సంభవించిన సమయాల్లో చందాదారులు ఒక ఆర్థిక సంవత్సరంలో రెండు (2) సార్లు నగదును ఉపసంహరించుకోవచ్చు. ఈపీఎఫ్‌వో అందించే ఈ అడ్వాన్స్ సదుపాయం ద్వారా చందాదారులు తమ విభిన్న అవసరాలకు అనుగుణంగా నిబంధనలను అనుసరించి నిధులను డ్రా చేసుకోవచ్చు.

Also Read: బ్యాంకులు సమ్మె..వరుసగా 4 రోజులు సెలవు..నెలాఖరులో మరో 3 రోజులు బంద్!

Also Read: ఇళ్లు లేని వాళ్లకు గుడ్‌న్యూస్..పీఎం ఆవాస్ యోజనతో రూ.2.30 లక్షల కోట్లు మంజూరు?!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

BRS Party: అసెంబ్లీ వద్ద దాడిలో ఫేస్‌ మార్ఫింగ్, ఏఐ ఫొటోలు.. డీజీపీకి ఎమ్మెల్యేల ఫిర్యాదు

Baddipadaga, Telangana:

Telangana DGP: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు ఆవరణ ఎదుట బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలపై జరిగిన దాడిపై విడుదలైన ఫొటోలు అన్నీ మార్ఫింగ్‌.. ఏఐతో చేసినవని తెలుస్తోంది. ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ న్యాయ పోరాటానికి దిగింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసిన ఫొటోలు ఫేక్‌ మార్ఫింగ్‌ అని, ఏఐ ఫొటోలు అని పేర్కొంటూ.. వాటిపై చర్యలు తీసుకోవాలని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు డీజేపీని కలిసి ఫిర్యాదు చేశారు. వెంటనే ఏఐ ఫొటోలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు.

హైదరాబాద్‌లో తెలంగాణ డీజీపీ మహేష్ మురళీధర్ భగవత్‌ను బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం తరఫున ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ చారి కలిసి ఫిర్యాదు అందజేశారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా, వివిధ డిజిటల్ వేదికల్లో మార్ఫింగ్ చేసిన తప్పుడు చిత్రాలు, ఏఐ ద్వారా రూపొందించిన ఫేక్ ఇమేజ్‌లు, దుష్ప్రచార కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నారని బీఆర్‌ఎస్ పార్టీ శాసనసభాపక్షం తెలిపింది. అలాంటి వారిపై తక్షణమే దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేసింది. 

'తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులపై జరిగిన దాడి, దురుసు ప్రవర్తన ఘటనల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఉద్దేశపూర్వకంగా ఫేక్ డిజిటల్ కంటెంట్‌ను సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఫేక్ లేదా ఏఐ జనరేటెడ్ చిత్రాలను నిజమైనవిగా చూపిస్తూ ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడమే కాకుండా.. ఎన్నికైన ప్రజాప్రతినిధుల ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది' అని బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం ఫిర్యాదులో పేర్కొంది.

ఫేక్, మార్ఫింగ్, ఏఐ జనరేటెడ్ చిత్రాలు, పోస్టులను సైబర్ క్రైమ్ విభాగం వెంటనే గుర్తించి దర్యాప్తు చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు డీజీపీని కోరారు. ఫేక్‌, మార్ఫింగ్‌, ఏఐ కంటెంట్‌ను రూపొందించిన.. అప్‌లోడ్ చేసిన, ప్రచారం చేసిన వ్యక్తులను గుర్తించాలని, సంబంధిత చిత్రాలపై సాంకేతిక ఫోరెన్సిక్ దర్యాప్తు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత డిజిటల్ ఆధారాలు, సోషల్ మీడియా అకౌంట్ వివరాలు, యూఆర్‌ఎల్‌లు, టైమ్‌స్టాంప్‌లు, మెటాడేటాను భద్రపరచాలని వినతిపత్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరారు. సైబర్ క్రైమ్, పరువునష్టం, తప్పుడు సమాచార ప్రచారం తదితర వర్తించే చట్టాల ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

ఫేక్, మార్ఫింగ్ కంటెంట్ వ్యాప్తిని అడ్డుకుని ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పోలీస్‌ యంత్రాంగానికి బీఆర్‌ఎస్ పార్టీ శాసనసభాపక్షం గుర్తుచేసింది. రాజకీయ భేదాలు ఉన్నాయనే కారణంతో ఎన్నికైన ప్రజాప్రతినిధులపై కల్పిత డిజిటల్ కంటెంట్‌ను తయారు చేసి ప్రచారం చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని ప్రకటించింది. ఇక అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలో పోలీసుల వైఖరిపై కూడా సమగ్ర విచారణ జరపాలని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. దీంతోపాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై కూడా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఎమ్మెల్యేలు కోరారు. మొత్తం వ్యవహారంపై నిష్పక్షపాతంగా, అత్యవసరంగా దర్యాప్తు నిర్వహించి, ఫేక్ డిజిటల్ కంటెంట్‌ను రూపొందించి ప్రచారం చేసిన వారితో పాటు అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు డీజీపీని కోరారు.

0
0
Report

Ganesh Utsav: వినాయక చవితి ఉత్సవాలపై నారా లోకేశ్‌ శుభవార్త.. ఏమిటో తెలుసా?

Nuzendla, Andhra Pradesh:

Ganesh Chaturthi 2026: వారంలో ప్రారంభం కానున్న వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది. గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం వినాయక ఉత్సవ కమిటీలకు గుడ్‌న్యూస్‌ వినిపించింది. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసే గణేశ్‌ మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. 

వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి కీలక విషయం తెలుపుతూ 'ఎక్స్‌' వేదికగా నారా లోకేశ్‌ కీలక ప్రకటన చేశారు. 'ఈ గణేశ్‌ చతుర్థి సందర్భంగా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసే వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నా. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు చేసుకుంటున్న ప్రజలకు అండగా నిలవడానికి.. ఈ వేడుకలను మరింత ఉత్సాహభరితంగా మార్చడానికి మా ప్రభుత్వం చేపట్టిన ఒక ముఖ్యమైన కార్యక్రమం ఇది' అని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు.

ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ స్పందించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. 'వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ప్రకటించి.. హిందూ బంధువులందరికీ సంతోషాన్ని కలిగించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. ప్రతి సోమవారం ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే బీజేపీ ‘జనతా వారధి’ కార్యక్రమంలో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులు అన్ని జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. ఈ విజ్ఞప్తులపై తక్షణమే స్పందించి వినాయక చవితి మంటపాలకు ఉచిత విద్యుత్ అందించే నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. ప్రజల విశ్వాసానికి, ఆకాంక్షలకు అనుగుణంగా తక్షణమే  స్పందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు' అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ తెలిపారు.

 

రేపో, మాపో మార్గదర్శకాలు
ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యుత్‌పై ఇంకా స్పష్టత రాలేదు. గణేశ్‌ మండపాలకు ఉచిత విద్యుత్‌ ప్రకటనపై రేపో, మాపో ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది. ఉచిత విద్యుత్‌కు సంబంధించి ముందస్తుగా గణేశ్‌ ఉత్సవ నిర్వాహకులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. మీ సేవ లేదా.. స్థానిక ప్రభుత్వ కార్యాలయాల్లో ఉచిత విద్యుత్‌కు సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతానికి దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.

0
0
Report
Advertisement
Advertisement
Back to top