శిక్షకుల శిక్షణ మరియు పారిశుధ్య కార్మికుల భద్రత మరియు గౌరవంపై జరిగిన సమీక్షా సమావేశంలో గౌరవనీయులైన శ్రీమతి పమేలా సత్పతి జిల్లా పాలనాధికారి, గౌరవనీయులు శ్రీ ప్రఫుల్ల దేశాయ్ అధనపు కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడారు.
Back
505001
ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ అండ్ సేఫ్టీ అండ్ డిగ్నిటీ ఆఫ్ శానిటేషన్ వర్కర్స్ సమీక్షా సమావేశం
Karimnagar, Telangana
1
Share
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Bellampalle, Kannal Rural, Telangana:
తెలంగాణ రైతాంగం జరిపిన సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరించి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి వాడుకుంటుందని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆదివారం మాట్లాడుతూ కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పోరాటం రైతాంగ సాయుధ పోరాటం అన్నారు. పోరాటంలో 4,300 మంది అమరులు అయ్యారని తెలిపారు. పోరాటంతో సంబంధం లేని శక్తులు ఈ పోరాటానికి మతం రంగు పులిమి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని పేర్కొన్నారు.
0
Share
Report
Kannal Rural, Telangana:
సెప్టెంబర్ 11 తేది నుంచి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి అన్నారు. సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని నెంబర్-2 ఇంక్లైన్ రడగంబాల బస్తిలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పతకాన్ని పట్టణ కార్యదర్శి రాజమౌళి ఆవిష్కరించారు. సాయుధ పోరాట యోధుల వారసత్వాన్ని పునికి పుచ్చుకొని పార్టీ శ్రేణులు పునరంకితం కావాలని విజ్ఞప్తి చేశారు.
0
Share
Report
Kannal Rural, Telangana:
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పాత బస్టాండ్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షులు
కోడి రమేష్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు గోనె శ్యాంసుందర్ రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గం అత్యధిక సంఖ్యలో బిజెపి సభ్యత్వం నమోదు చేయించాలని నాయకులు కార్యకర్తలు పిలుపునిచ్చారు.
0
Share
Report
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం టేకులబస్తీలోని ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గంను గురువారం ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షుడిగా సజ్న షఫీ, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా కే.సదానందం, ప్రధాన కార్యదర్శులుగా మనోజ్ కుమార్ పాండే, ఎస్ కే.సుభాన్ పాష ,కోశాధికారిగా కే.నవీన్ ఎన్నికయ్యారు.
వారు మాట్లాడుతూ అందరం సమిష్టిగా కలిసి మెలసి పనిచేసి ప్రెస్ క్లబ్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
0
Share
Report
Bellampalle, Telangana:
1893లో స్వాతంత్ర ఉద్యమ సమయంలో బ్రిటిష్ వారు ప్రజలు ఒక్కచోట ఉండకుండా చేస్తే అందరం ఒక సమూహంగా ఐక్యతగ ఉండాలని గణేష్ ఉత్సవాలు ఏర్పాటు చేసిన మహాను బావుడు బాలగంగాధర్ తిలక్ అని ఎస్సీ మోర్చ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కోడి రమేష్ అన్నారు. బెల్లంపల్లిలో మాట్లాడుతూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రుల ఉత్సవాలు జరుపుకుంటున్నారంటే దేశ ప్రజల ఐక్యత ఎంత గొప్పదో గుర్తించాలన్నారు.
2
Share
Report
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ఎల్లంపల్లి గోదావరి వాటర్ స్కీం పాయింట్ ను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సందర్శించారు. ఎల్లంపల్లి నుంచి బెల్లంపల్లి వరకు నీరు సరఫరా చేయనున్న విధివిధానాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అడా ప్రాజెక్టు నుంచి కాకుండా గోదావరి నీటిని అందిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కార్యాచరణ రూపొందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
1
Share
Report
Thattupalle, Telangana:
ఖమ్మం జిల్లాలో వరద ప్రాంతాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బిజెపి ఎంపిలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ నేపాథ్యంలో మొదటగా ఖమ్మం మున్నేరు ముంపు ప్రాంతాన్ని వారు పరిశీలించిన అనంతరం తిరుమలాయపాలెం మండలం రాకాసితండలో పర్యటించారు. వరద ప్రవాహంతో రాసాకితండా మొత్తం కొట్టుకుపోయింది. పంట భూముల్లో ఇసుక మేటలు వేసి పంట సాగుచేయడానికి అవకాశం లేకుండా పోయింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిస్థితిని కేంద్రమంత్రికి వివరించారు.
1
Share
Report
Thattupalle, Telangana:
ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ముదిగొండ మండలం అయ్యగారిపల్లి గ్రామం వద్ద నుండి వెళుతుండగా గ్రామస్తులు భట్టిని తమ గ్రామంలో ఆగాలని కోరారు. దీంతో ఆయన కాసేపు ఆగి గ్రామస్తుల సమస్యలు తెలుసుకున్నారు. రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై భట్టిని అడిగారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని ఆయన స్పష్టం చేసారు.
1
Share
Report
Bellampalle, Kannal Rural, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరికి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,సోనియాగాంధీ ఆశీర్వాదంతో బెల్లంపల్లి నియోజవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.
0
Share
Report
Bellampalle, Kannal Rural, Telangana:
మంచిర్యాల జిల్లా తాండూర్ మండల సేవాజ్యోతి శరణాలయంలో బాలగణేశ్ మండలి శ్రీ వినాయక చవితి పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. బాలగణేశ్ మట్టి ప్రతిమను మండపంలో ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుతూ పిల్లలు, పెద్దలు అందరూ కలిసి భజనలు కీర్తనలు పాడారు. రానున్న తరాలకు హిందూ సంస్కృతి సాంప్రదాయాలు తెలిపేందుకు ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నామని శరణాలయం నిర్వాహకురాలు శ్రీదేవి పేర్కొన్నారు.
0
Share
Report