icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
500001
VVishwaroopaFollow5 Jul 2024, 10:54 am

హైద్రాబాద్, ఇస్కాన్ అబిడ్స్ టెంపుల్ ఆధ్వర్యంలో ఈనెల 7న జగన్నాథ్ రథయాత్ర ఘనంగా నిర్వహించబోతున్నాము

Hyderabad, Telangana:

శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవ్ 2024కి సంబంధించి, వేదాంత చైతన్య దాస్ హైదరాబాద్ ఆలయ నిర్వహణ మండలి సభ్యుడు ఇస్కాన్ అబిడ్స్ ఆలయం ఈ నెల 7న జగన్నాథ రథయాత్రను నిర్వహించబోతోంది. ఆదివారం ఉదయం 11.30 గంటలకు స్టేడియం నుంచి ఎన్టీఆర్ రథయాత్ర ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ స్టేడియం మొజంజాహీ మార్కెట్ చౌరస్తా నుంచి యాత్ర ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు మైదానంలో ముగుస్తుంది. నారాయణగూడ నుంచి బషీర్ బాగ్ కూడలి వరకు మైదానంలో ఉత్సవాలు నిర్వహించనున్నారు. పండుగలో భజనలు మరియు సంగీత ప్రదర్శనలు కూడా ఉన్నాయి.

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Allu Arjun: పుష్ప 2 సినిమా వివాదంపై గ్యాగ్ ఆర్డర్.. ఊహాజనిత వార్తలు ప్రచారం చేయోద్దని హైదరాబాద్ సివిల్ కోర్టు ఆదేశాలు.!.

Hyderabad, Telangana:

Hyderabad civil court issued gag orders on allu arjun pushpa 2 movie controversy: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. గతంలో పుష్ప 2 మూవీ ప్రీరిలీజ్ వేళ అశోక్ నగర్ లోని సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో తమ ఎదుట హజరు కావాలని సమన్లు జారీ చేసింది. 2024 డిసెంబర్ 4న 'పుష్ప 2' సినిమా బెనిఫిట్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి అనే మహిళఅభిమాని చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికి చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో పోలీసులు మొత్తంగా 23 మందిపై గతంలో చార్జ్ షీట్ దాఖలు చేశారు.

తాజాగా.. ఈ కేసులో నాంపల్లి కోర్టు తమ ఎదుట హజరు కావాలని 19 మందికి సమన్లు జారీ చేసింది. దీనిలో ఏ 11గా ఉన్న అల్లు అర్లును కూడా నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల‌ 22న (సోమవారం) వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో ఈ పరిణామం అల్లుఅర్జున్ కు బిగ్ షాక్ గా మారింది.  మరోవైపు హైదరాబాద్ సిటి సివిల్ కోర్టు పుష్ప 2 వివాదంకు సంబంధించి గ్యాగ్ ఆర్డర్ విధించింది.
పుష్ప 2 సినిమా చిత్ర యూనిట్ తో పాటు ఎవరిపై కూడా ఊహాజనిత వార్తలు వేయవద్దంటూ కోర్టు ఆదేశించింది.

ఊహాజనిత వార్త కథనాలతో పాటు, టీవీ ఛానెల్స్ లలో డిబేట్లు పెట్టవద్దంటూ కోర్టు స్పష్టం చేసింది.  సంధ్య థియేటర్‌కు సంబంధించిన O.S. No.216 of 2026 లో I.A. No.369 of 2026 కేసులో, హైదరాబాద్ నగర సివిల్ కోర్టు గౌరవ వేకేషన్ సివిల్ జడ్జి-కమ్-XXV అదనపు చీఫ్ జడ్జి గారు 04 జూన్ 2026 తేదీన మధ్యంతర (Ad-Interim Ex Parte Injunction) ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఉత్తర్వుల ప్రకారం, పై కేసుకు సంబంధించిన అంశాలపై కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో.. వాస్తవ నిర్ధారణకు ముందుగానే ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఎటువంటి ఊహాగానాలు, అసత్య ప్రచారాలు, ఆధారరహిత ఆరోపణలు, వాస్తవాలకు విరుద్ధమైన చర్చలు, డిబేట్లు, వార్తా కథనాలు లేదా సోషల్ మీడియా పోస్టులు ప్రచురించడం లేదా ప్రసారం చేయరాదని కోర్టు ఆదేశించింది.

Read more: Allu Arjun Stampede Case: తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు నోటీసులు..కోర్టులో హాజరు కావాల్సిందేనంటూ ఆదేశం!

ముఖ్యంగా.. సంబంధిత మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా వేదికలు, ప్రజలు గౌరవ న్యాయస్థానం జారీ చేసిన ఈ ఉత్తర్వులను గౌరవించి, కేసుకు సంబంధించిన నిర్ధారణ కాని సమాచారాన్ని ప్రచారం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని  కోర్టు ఆదేశించింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Rajendranagar: రీల్స్ పిచ్చి పీక్స్‌.. కోబ్రా పిల్లతో స్టంట్లు.. యువకుడు మృతి!

Hyderabad, Telangana:

Rajendranagar Snake Bite Video: సోషల్ మీడియా పిచ్చి.. రీల్స్‌ మోజు నేటి తరం యువత ప్రాణాల మీదకు తెస్తోంది.. లైకులు, కామెంట్ల కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతూ చేసిన ఒక పిచ్చి ప్రయత్రం ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.. రీల్స్‌ కోసం ఏకంగా కింగ్‌ కోబ్రా పిల్లతో సాహసాలు చేయబోయిన ఓ యువకుడు, అది కాటేయడంతో కేవలం మూడు గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన రాజేంద్రనగర్ పరిధిలో కలకలం రేపింది.

రీల్స్ పిచ్చి..
స్థానికులతో పాటు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ పిల్లర్ నెంబర్ 248 పరిసర ప్రాంతంలో ఓ యువకుడు సోషల్ మీడియాలో రీల్స్ చేసి అప్‌లోడ్ చేయాలనుకున్నాడు. అందుకోసం స్థానికంగా కనిపించిన ఒక చిన్న కోబ్రా పిల్లను పట్టుకున్నాడు. అది చిన్న పిల్ల కదా.. ఏమౌతుందిలే అనే నిర్లక్ష్యంతో, చేతుల్లో పట్టుకుని రకరకాల విన్యాసాలు చేస్తూ వీడియోలు రికార్డ్‌ చేయించుకున్నాడు..

మూడు గంటల్లోనే.. 
పాముతో ఆటలాడుతున్న సమయంలో అది ఒక్కసారిగా యువకుడిపై దాడి చేసి కాటు వేసింది. చిన్న పామే కదా అని మొదట లైట్ తీసుకున్నప్పటికీ...కొద్దిసేపటికే విషం శరీరం మొత్తం పాకడం మొదలైంది. తీవ్ర అస్వస్థతకు గురైన యువకుడిని గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, కోబ్రా విషం అత్యంత ప్రమాదకరమైనది కావడంతో.. కాటు వేసిన కేవలం మూడు గంటల సమయంలోనే ఆ యువకుడు చికిత్స పొందుతూ చనిపోయాడు.. ఈ వార్త తెలియడంతో యువకుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికుల ఆందోళన.. 
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో యువతకు రీల్స్ పిచ్చి ముదిరిపోతోందని.. నాలుగు లైకుల కోసం, వ్యూస్ కోసం బిల్డింగ్‌ల పైనుంచి దూకడం, బైక్ స్టంట్లు చేయడం, ఇప్పుడు ఇలా విషసర్పాలతో ఆటలాడటం చూస్తుంటే భయమేస్తోందఅని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వన్యప్రాణులు, విషసర్పాలతో ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయోద్దని.. ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని పోలీసులతో పాటు అటవీ శాఖ అధికారులు గట్టిగా హెచ్చరిస్తూ వస్తున్నారు. 

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

 

0
0
Report

Korutla: కోరుట్లలో అరుదైన కాటిల్ ఈగ్రేట్ పక్షుల.. ఎందుకొచ్చాయో తెలుసా?

Jagtial, Telangana:

Korutla Mini Tank Bund News: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ ప్రాంతం ప్రస్తుతం పక్షుల కిలకిలరావాలతో, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో కళకళలాడి పోతోంది.. కంటికి ఇంపుగా, చూడముచ్చటైన రూపురేఖలతో సందర్శకులను ఆకట్టుకుంటున్న కాటిల్ ఈగ్రేట్ (Cattle Egret) పక్షులు ఇప్పుడు పట్టణ వాసులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. అసలు ఈ పక్షులు ఎక్కడి నుంచి వచ్చాయి. వీటి ప్రాముఖ్యత పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సంతానోత్పత్తి కోసమే ఈ రాక..
సాధారణంగా వివిధ ప్రాంతాలకు వలస వెళ్లే ఈ కాటిల్ ఈగ్రేట్ పక్షులు.. ప్రస్తుతం కోరుట్లలోని మినీ ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న తుమ్మ చెట్లపై ప్రత్యేకమైన స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇవి కేవలం విశ్రాంతి కోసమే కాకుండా.. సంతానోత్పత్తి కోసం ఇక్కడికి చేరుకున్నట్లు సమాచారం.. చెట్లపై గుంపులు గుంపులుగా చేరుతూ.. గూళ్లు కట్టుకుని, గుడ్లు పొదుగుతూ పక్షులు చేస్తున్న సందడి ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తూ వస్తోంది..

ఆకర్షణీయమైన రంగులో..
ఈ పక్షుల ప్రత్యేకత వాటి రంగులోనే ఉంటుంది.. సాధారణ కొంగల కంటే ఇవి ఎంతో భిన్నంగా.. వీటి తల, మెడతో పాటు వీపు భాగం నారింజ, గోధుమ రంగుల సమ్మేళనంతో మెరిసిపోతూ చాలా ఆకర్షణీయంగా నిలుస్తూ ఉంటాయి.. పట్టణం మధ్యలో కూడా ఇటువంటి వలస పక్షులు కోరుట్లను తమ ఆవాసంగా ఎంచుకోవడం పర్యావరణ సమతుల్యతకు.. ఇక్కడి మినీ ట్యాంక్ బండ్ పరిసరాలు పక్షుల జీవనానికి అనుకూలంగా ఉన్నాయనడానికి నిదర్శనమని పర్యావరణవేత్తలు అభిప్రాయ పడుతూ వస్తున్నారు..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

ప్రకృతి ప్రేమికుల్లో ఆనందం..
రోజూ సాయంత్రం సమయంలో మినీ ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చే స్థానికులు.. చెట్లపై వాలి ఉన్న ఈ పక్షులను చూసి ఆశ్చర్యపోతున్నట్లు తెలుస్తోంది.. చాలా మంది వీటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాల్లో కూడా పోస్ట్‌ చేస్తున్నారు. అయితే, పక్షుల గూళ్లకు, వాటి సంతానోత్పత్తికి ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని.. ఈ అరుదైన పక్షులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్థానిక ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Honor నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్.. ఏకంగా 7,700mAh బ్యాటరీ, ప్రత్యేక AI బటన్..

Hyderabad, Telangana:

Honor 600 Smart 5G: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Honor స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు అద్భుతమైన శుభవార్తను చెప్పెందుకు సిద్ధమైంది. భారీ బ్యాటరీ సామర్థ్యంతో సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు రెడీ అయ్యింది. దీనిని కంపెనీ Honor 600 Smart 5G పేరుతో సరికొత్త మోడల్‌ను కంపెనీ త్వరలోనే మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇప్పటికే ఫ్రాన్స్‌కు చెందిన అధికారిక హానర్‌ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ 'కమింగ్ సూన్' (Coming Soon) ట్యాగ్‌తో లిస్ట్ అవ్వడంతో దీనిపై భారీ అంచనాలు పెరిగాయి..

ఛార్జింగ్ టెన్షన్‌కు చెక్.. 
ఈ Honor 600 Smart 5G స్మార్ట్‌ఫోన్ అతిపెద్ద హైలైట్ దీని బ్యాటరీ సామర్థ్యం. సాధారణంగా స్మార్ట్‌ఫోన్లలో 5000mAh లేదా 6000mAh బ్యాటరీలను చూస్తుంటాం.. కానీ Honor ఒక అడుగు ముందుకు వేసి ఇందులో ఏకంగా 7,700mAh భారీ బ్యాటరీని అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభించడం విశేషం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజులకు రోజులు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేలా ఈ ఫోన్‌ను డిజైన్ చేసిన్నట్లు తెలుస్తోంది..

ప్రత్యేక AI బటన్.. 
టెక్నాలజీ పరంగా చూస్తే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్‌ను వినియోగదారులు సులభంగా యాక్సెస్ చేయడానికి వీలుగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఒక ప్రత్యేకమైన AI బటన్‌ను అందించిన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 10.0 (MagicOS 10.0) ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది.. అంతేకాకుండా, ఇందులో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 (Snapdragon 4 Gen 4) ప్రాసెసర్‌ను వినియోగించిన్నట్లు సమాచారం..

డిస్‌ప్లే, కెమెరా..
Honor 600 Smart 5G మొబైల్‌కి సంబంధించని ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఈ ఫోన్ 1,020 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.87 ఇంచుల HD+ (1592 × 720 పిక్సెల్స్) LCD డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వెనక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఇందులో అద్భుతమైన సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్లను అందించారు.

ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం వెబ్‌సైట్‌లో వైట్‌తో పాటు బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు, భారీ బ్యాటరీ బ్యాకప్‌తో రాబోతున్న ఈ హానర్‌ 600 స్మార్ట్ 5G ఫోన్ మార్కెట్లో వన్ ప్లస్, శామ్‌సంగ్, వివో వంటి బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే దీని ధరతో పాటు లాంచ్ తేదీల అధికారిక వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Allu Arjun Stampede Case: తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు నోటీసులు..కోర్టులో హాజరు కావాల్సిందేనంటూ ఆదేశం!

Hyderabad, Telangana:

Allu Arjun Stampede Case News: హైదరాబాదులోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. రాబోయే సోమవారం నాడు కోర్టు ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఆయనను ఆదేశించింది.

ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే 23 మందిని నిందితులుగా చేర్చుతూ కోర్టులో ఛార్జ్‌షీటు దాఖలు చేశారు. వీరిలో 19 మంది నిందితులకు నాంపల్లి కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది. 

ఈ కేసులో ప్రధాన నిందితులుగా సంధ్య థియేటర్‌కు చెందిన యాజమాన్యం, సిబ్బందిని A1 నుంచి A10 వరకు ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. అలాగే ఏ 11 నిందితుడిగా నటుడు అల్లు అర్జున్ పేరును పోలీసులు ఈ కేసులో చేర్చారు. 

ఏం జరిగిందంటే? 
2024 డిసెంబర్ 4 తేదీన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద 'పుష్ప 2' సినిమా బెనిఫిట్ షో ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా నటుడు అల్లు అర్జున్ అక్కడికి రావడంతో భారీగా అభిమానులు తరలివచ్చారు. ఆ సమయంలో తీవ్రమైన తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దురదృష్టకర తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు శ్రీ తేజ తీవ్రంగా గాయపడ్డాడు. 

తాజాగా ఈ కేసులో నాంపల్లి కోర్టు నుంచి నోటీసులు అందుకున్న నిందితులంతా సోమవారం నాడు కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. నిందితుల హాజరు నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత.. నాంపల్లి కోర్టు ఈ కేసు పై అధికారికంగా ట్రయల్ విచారణ ప్రారంభించనుంది.

Also Read: హీరోయిన్‌గా బుల్లితెర మెగాస్టార్ కూతురు..హీరోయిన్లనే తలదన్నే అందం దివిజ!

Also Read: ఆర్ఆర్ఆర్‌లో నటించిన చిన్నారి మల్లి ఇప్పుడెలా ఉందో తెలుసా? ఇంత అందంగా ఉందేంట్రా బాబూ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Oppo Reno 16c 5G: అరాచకమైన ఫీచర్స్.. 6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Oppo కొత్త ఫోన్!

Hyderabad, Telangana:

Oppo Reno 16c 5g Launching Soon: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ ఒప్పో భారత మార్కెట్‌లోకి మరో అద్బుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ అంతర్జాతీయంగా ఎంతో పేరు పొందించిన Reno సిరీస్‌లో మార్కెట్‌లోకి లాంచ్‌ కాబోతోంది. దీనిని కంపెనీ Oppo Reno 16c 5G మోడల్‌లో భారత్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కంపెనీ సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. ఇది ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో పాటు అద్భుతమైన బ్యాటరీతో, అత్యంత చీప్‌ ధరలో లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. 

లీకైన ధర, వేరియంట్లు..
ప్రముఖ టిప్‌స్టర్ అందించిన సమాచారం ప్రకారం.. ఈ Oppo Reno 16c 5G స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్‌లోకి మొత్తం రెండు వేరియంట్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీని బేస్ వేరియంట్‌ 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో రూ. 34,999 ధరతో విడుదల కాబోతోంది. ఇక రెండవ వేరియంట్‌ 12GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్ ధర రూ. 37,999తో లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ ఎంతో అద్బుతమైన ఇది పాప్ వైట్, ట్విలైట్ వయొలెట్ వంటి కలర్‌ ఆప్షన్స్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్..
Oppo Reno 16c 5G స్మార్ట్‌ఫోన్‌ 6.57-ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ (Full HD+) అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లేతో విడుదల కాబోతోంది. అంతేకాకుండా ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. కాబట్టి దీనివల్ల స్క్రోలింగ్‌తో పాటు గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అత్యంత స్మూత్‌గా ఉంటుందని టెక్‌ నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పర్ఫార్మెన్స్ వివరాల్లోకి వెళితే.. ఇందులో 4 నానోమీటర్ల టెక్నాలజీతో తయారు చేసిన పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 (MediaTek Dimensity 7300) ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి. ఇది LPDDR5X ర్యామ్‌తో పాటు UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్‌తో వస్తుండటం వల్ల మల్టీటాస్కింగ్ ఎంతో సులభంగా చేసుకోవచ్చు.

అద్భుతమైన ట్రిపుల్ కెమెరా సెటప్..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ అద్భుతమైన కెమెరా సెటప్‌ను అందించిన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దీని వెనక భాగంలో ఎంతో ప్రత్యేకమైన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. అందులో అద్భుతమైన ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ కలిగిన ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 3.5x ఆప్టికల్ జూమ్ సామర్థ్యం గల 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరాను కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా కూడా ఉంటుంది. దీంతో పాటు ఫ్రంట్‌ భాగంలో వీడియో కాలింగ్ కోసం పవర్‌ఫుల్ 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించిన్నట్లు తెలుస్తోంది. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

మెగా బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్..
ఈ స్మార్ట్‌ఫోన్‌ అత్యంత అద్భుతమైన భారీ 6,500mAh బ్యాటరీ సామర్థ్యంతో లాంచ్‌ కాబోతోంది.. దీనిని వేగంగా ఛార్జ్ చేసేందుకు కంపెనీ 45W సూపర్ ఊక్ (SuperVOOC) ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అందించిన్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ సరికొత్త IP69 రేటింగ్‌తో అందుబాటులోకి వస్తోంది. దీని వల్ల దుమ్ముతో పాటు వాటర్ నుంచి ఫోన్‌కు పూర్తి రక్షణ లభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కనెక్టివిటీ పరంగా ఇందులో 5G నెట్‌వర్క్, ఎన్‌ఎఫ్‌సీ (NFC), స్టీరియో స్పీకర్ల సపోర్ట్ కూడా లభిస్తోంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

FiFa World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్‌లో Mexico సరికొత్త చరిత్ర.. రౌండ్ ఆఫ్ 32కు చేరిన తొలి జట్టుగా రికార్డ్..!!

BBhoomi4h ago
Secunderabad, Telangana:

Mexico vs South Korea 1-0 Match Highlights: ఆతిథ్య దేశమైన మెక్సికో.. శుక్రవారం దక్షిణ కొరియాపై 1-0 తేడాతో విజయం సాధించి 2026 ఫీఫా ప్రపంచ కప్ రౌండ్ ఆఫ్ 32లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది.  లూయిస్ రోమో చేసిన గోల్ తో  మెక్సికో తన విజయాన్ని ఖాయం చేసింది. దీంతో ప్రపంచ కప్‌లో తమ మొదటి 2 మ్యాచ్‌లలో క్లీన్ షీట్ సాధించి.. విజయం సాధించిన 1998లో ఫ్రాన్స్ తర్వాత మొదటి ఆతిథ్య దేశంగా మెక్సికో రికార్డు క్రియేట్ చేసింది. క్లీన్ షీట్ అంటే.. మెక్సికోతో జరిగిన 2 మ్యాచ్‌లలోనూ ప్రత్యర్థులు ఒక్క గోల్ కూడా చేయకపోవడమని అర్థం.

గోల్ లేకుండా ముగిసిన ఫాస్టాఫ్  తర్వాత.. మెక్సికో స్కోరింగ్‌ను ప్రారంభించింది. 50వ నిమిషంలో లూయిస్ రోమో గోల్ చేశాడు... హెడర్‌తో బంతిని అడ్డుకోవడానికి కొరియా గోల్ కీపర్ చేసిన ప్రయత్నం విఫలమవడంతో మెక్సికో ఆ గోల్‌ను సాధించింది. ఆ తర్వాత స్కోరును సమం చేయడానికి కొరియా తీవ్రంగా ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో సౌతాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో మెక్సికో విజయం సాధించింది.

ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారిగా.. మెక్సికో తమ మొదటి రెండు గ్రూప్ దశ మ్యాచ్‌లను ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా గెలుచుకుంది. గతంలో వారు 2002 (1-0 క్రొయేషియా, 2-1 ఈక్వెడార్),  2018 (1-0 జర్మనీ, 2-1 దక్షిణ కొరియా)లలో తమ ప్రారంభ మ్యాచ్‌లను గెలుచుకున్నారు.  కానీ ఆ రెండు టోర్నమెంట్‌లలోనూ వారు తమ రెండవ మ్యాచ్‌లో గోల్ ఇచ్చారు.

లూయిస్ రోమో తన సొంత గడ్డపై మెక్సికో తరఫున గోల్ చేశాడు. ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో తన క్లబ్ అయిన సిడి గ్వాడలజారా సొంత మైదానంలో తన జాతీయ జట్టు తరఫున గోల్ చేసిన ఆటగాడికి అత్యంత ఇటీవలి ఉదాహరణగా  చెబుకుంటే..  జోహన్నెస్‌బర్గ్‌లోని సాకర్ సిటీలో జరిగిన 2010 ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్‌లో సిఫివే త్షబలాల (కైజర్ చీఫ్స్). ఈ ఘనతను 1970 ప్రపంచ కప్‌లో ఎస్టాడియో అజ్టెకాలో మెక్సికో తరఫున జేవియర్ ఫ్రాగోసో (క్లబ్ అమెరికా) సాధించాడు.

గ్రూప్ Aలో అగ్రస్థానంలో నిలిచిన మెక్సికో, జూన్ 30న మెక్సికో సిటీలో జరిగే రౌండ్ ఆఫ్ 32లో గ్రూప్ C, E, F, H లేదా E నుండి మూడవ స్థానంలో నిలిచిన జట్టుతో తలపడుతుంది. 1994 నుండి బ్రెజిల్ (8)ను అధిగమించి, మెక్సికో (9) అత్యధిక సార్లు ప్రపంచ కప్ గ్రూప్ దశకు అర్హత సాధించింది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Telangana ప్రజలకు అలర్ట్.. ఆ 3 రోజులు రిజిస్ట్రేషన్లు బంద్, ఎందుకో తెలుసా?

Hyderabad, Telangana:

Telangana Registration Department Updates News: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భూములకు సంబంధించిన క్రయ విక్రయాలు జరిపే వారికి, రిజిస్ట్రేషన్ల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఒక ముఖ్యమైన గమనిక. ఈ నెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ సేవలకు తాత్కాలికంగా బ్రేక్ పడబోతోంది.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌తో పాటు దాని అనుబంధ ఆన్లైన్ సేవలు ఈ సమయంలో పనిచేయవని ఆ శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారికంగా వెల్లడించారు.. షెడ్యూల్ చేసిన సర్వర్ మెయింటెనెన్స్ పనుల కారణంగానే ఈ తాత్కాలిక అంతరాయం ఏర్పడుతోందని ఆయన స్పష్టం చేశారు.

ఐదేళ్ల తర్వాత అప్‌గ్రేడ్.. 
గడిచిన ఐదేళ్ల కాలంలో సర్వర్ల నిర్వహణ పనులు ఈ స్థాయిలో చేపట్టడం ఇదే తొలిసారి. సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంచడమే కాకుండా అన్ని రకాల సెక్యూరీలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ తాత్కాలికంగా బ్రేక్ అని ఐజీ తెలిపారు. అప్డేట్‌ చేసిన తర్వాత సర్వర్ వ్యవస్థ ఎటువంటి సాంకేతిక లోపాలు లేకుండా మరింత వేగంగా పనిచేస్తాయని తెలిపారు. ఆన్లైన్ డేటాతో పాటు భద్రతా ప్రమాణాలు (Security Standards) మరింత పటిష్టం కాబోతున్నాయని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నాణ్యత పెరిగి.. ప్రజలకు సులభతరమైన అనుభూతి లభిస్తుందని తెలిపారు..

స్మార్ట్ ప్లానింగ్..
ఈ మూడు రోజుల విరామం వల్ల సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తుగా వ్యూహాత్మక ప్లాన్ వేసిన్నట్లు తెలుస్తోంది.. జూన్ 26వ తేదిన మొహర్రం పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం ఉండమే కాకుండా.. జూన్ 28 ఆదివారం సాధారణ వీక్లీ ఆఫ్, జూన్ 27 కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే ప్రభుత్వ ఆఫీసులు మళ్లీ తిరిగి ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ ఒక్కరోజు మాత్రమే ఈ భూ రిజిస్ట్రేషన్లు బంద్‌ ఉంటాయి.. ఈ విధంగా ప్లాన్ చేయడం వల్ల పని దినాల్లో కేవలం ఒక్క రోజు మాత్రమే రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోతాయని, తద్వారా ప్రజలపై పడే ప్రభావం ఒకటే రోజు ఉంటుందని ఐజీ వివరించారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

29 నుంచి సేవలు యథావిధి..
ఈ అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని.. ప్రజలు తమ భూ క్రయ విక్రయాలతో పాటు రిజిస్ట్రేషన్ సంబంధిత పనులను ముందస్తుగానే ప్లాన్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 29వ తేదీ  సోమవారం నుంచి అన్ని సేవలు ఎప్పటిలాగే పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. అధికారులు చేపట్టే ఈ సాంకేతిక అభివృద్ధి పనులకు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Venus Transit 2026: జూలై 29న సూర్యుడి నక్షత్రంలోకి శుక్రుడి ప్రవేశం.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు, అదృష్టమే అదృష్టం!

Hyderabad, Telangana:

Venus Transit In Uttara Phalguni Nakshatra 2026 Telugu News: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. కొన్ని గ్రహాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాకుండా కొన్నింటిని శక్తివంతమైన గ్రహాలుగా కూడా పరిగణిస్తారు. అలాగే ధనానికి సూచికగా కూడా కొన్ని గ్రహాలు ఉంటాయి. అయితే, ఈ గ్రహాల ప్రభావంతో అన్ని రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు వస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే.. జూలై 29న ఆనందం, శ్రేయస్సు, ప్రేమ, కళ, ఆకర్షణలకు సూచికగా భావించే శుక్రుడు ఉదయం 4 గంటల సమయంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అయితే, ఇది సూర్యుడి నక్షత్రంగా భావిస్తారు. ఈ సమయంలో సూర్యుడి నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించడం కారణంగా ఈ కింది రాశులవారి జీవితాల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కొన్ని రాశులవారు ఈ సమయంలో ఆర్థిక లాభాలు, వృత్తిలో విజయం, సామాజిక హోదా పెరగడమే కాకుండా ఊహించని ధన లాభాలు కలుగబోతున్నాయి. అనుకున్న పనుల్లో ఊహించని విజయాలు సొంతం చేసుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరం కాబోతున్నాయి. అయితే ఈ సమయంలో శుక్రుడి సంచారంతో ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శుక్రుడి ప్రభావంతో ఈ రాశులవారికి బంపర్ జాక్‌పాట్:
తులారాశి
శుక్రుడి శక్తివంతమైన ప్రభావంతో తులా రాశివారికి ఈ సమయంలో చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా జీవిత భాగస్వామి పూర్తి సపోర్ట్‌తో క్లిష్టతరమైన పరిస్థితుల నుంచి ఎంతో సులభంగా బయటపడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా సులభంగా మెరుగుపడతాయి. దీంతో పాటు నిలిచిపోయిన పనులు కూడా సులభంగా ఊపందుకుంటాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి అద్భుతమైన పదోన్నతులు లభించి.. సమయంలో గౌరవం కూడా సులభంగా పొందుతారు. 

మేష రాశి
శుక్రుడి సంచారం ప్రభావంతో మేష రాశివారికి వ్యాపారాల, వృత్తిపరంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతకాకుండా జీవితంలో వీరు తప్పకుండా సానుకూలమైన ఫలితాలు కూడా పొందుతారు. ఈ సమయంలో వివేకం పెరగడంతో పాటు అద్భుతమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ముఖ్యంగా భవిష్యత్తులో ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ముఖ్యమైన పనుల్లో అద్భుతమైన విజయాలు కూడా సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యుల సపోర్ట్‌తో సంబంధాలు కూడా మెరుగుపడతాయి. అలాగే వీరికి ఈ సమయంలో అవగాహన కూడా పెరుగుతుంది. 

మిథున రాశి
సూర్యుడి నక్షత్రంలోకి శుక్రుడి ప్రవేశించడం వల్ల మిథున రాశివారికి ఈ సమయంలో అద్భుతమైన ధన లాభాలు కలుగుతాయి. అలాగే వ్యక్తుత్వ వికాశం కూడా రెట్టింపు అవుతుంది. దీని కారణంగా ఆత్మవిశ్వాసం కూడా గతంలో కంటే ఇప్పుడు మరింత పెరుగుతుంది. అంతేకాకుండా భూములు కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. వీరు తప్పకుండా ఈ సమయంలో మంచి మంచి శుభవార్తలు కూడా వింటారు. వీరికి ఈ సమయంలో తప్పకుండా మానసిక ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది. 

సింహరాశి
సింహ రాశివారికి ఈ సమయంలో తప్పకుండా మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది. వీరికి తప్పకుండా జీవితంలో సానుకూలమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా జీవితంలో ముందుకు సాగుతారు. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. సంబంధాలు కూడా విపరీతంగా మెరుగుపడతాయి. ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయి. ప్రేమ సంబంధాలు కూడా ఊహించని స్థాయిలో మెరుగుపడతాయి. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

 

0
0
Report

IPL 2027 Schedule: ఐపీఎల్ అభిమానులకు గుడ్‌న్యూస్..94 మ్యాచ్‌లతో మెగా టోర్నీ..ఆర్సీబీకి పండగే!

Mumbai, Maharashtra:

IPL 2027 94 Matches: ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన క్రికెట్ లీగ్ 'ఇండియన్ ప్రీమియర్ లీగ్' (ఐపీఎల్) రాబోయే 2027 సీజన్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక భారీ మెగా ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు 74 మ్యాచ్‌లతో సాగుతున్న ఈ టోర్నీని, మరింత గ్రాండ్‌గా మార్చడానికి మ్యాచ్‌ల సంఖ్యతో పాటు షెడ్యూల్‌లోనూ కీలక మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఐపీఎల్ సీజన్‌లో క్రికెట్ ప్రేమికులకు డబుల్ వినోదం అందనుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఫార్మాట్ ప్రకారం జరుగుతున్న 74 మ్యాచ్‌ల సంఖ్యను ఏకంగా 94కు పెంచాలని బీసీసీఐ భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. మ్యాచ్‌ల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో, షెడ్యూల్‌లో ఒకే రోజు రెండు మ్యాచ్‌లు జరిగే రోజుల సంఖ్య కూడా గణనీయంగా పెరగనుంది.

వేసవి తాపానికి బ్రేక్.. 
సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లు మార్చి చివరి వారంలో ప్రారంభమై మే ఆఖరు వరకు జరుగుతాయి. అయితే ఏప్రిల్, మే నెలల్లో ఉండే తీవ్రమైన ఎండల కారణంగా దేశీ, విదేశీ ఆటగాళ్లు శారీరకంగా తీవ్రంగా అలసిపోతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు 2027 సీజన్‌ను కాస్త ముందుగానే ప్రారంభించాలని బీసీసీఐ కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసింది.

ప్రతిపాదించిన షెడ్యూల్ ప్రకారం.. 2027లో రాబోయే 20వ ఐపీఎల్ సీజన్‌ను మార్చి 10, 2027 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అలాగే 94 మ్యాచ్‌లతో కూడిన ఈ టోర్నీని మే 15న ముగించేందుకు ప్రణాళిక చేస్తున్నారని సమాచారం. ఇలా షెడ్యూల్‌ను ముందుకు జరపడం వల్ల మే నెలలోని పీక్ ఎండల నుండి ఆటగాళ్లకు ఉపశమనం లభించడమే కాకుండా, ఆ తర్వాత జరిగే ఐసీసీ టోర్నమెంట్‌లకు సిద్ధమవడానికి తగినంత సమయం దొరుకుతుంది.

ఆర్‌సీబీ హ్యాట్రిక్ సాధిస్తుందా?
2025లో ఛాంపియన్‌గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈ ఏడాది కూడా అదే ఫామ్‌ను కొనసాగించి 'బ్యాక్-టు-బ్యాక్' ట్రోఫీలను ముద్దాడింది. ఈ నేపథ్యంలో, రాబోయే చారిత్రాత్మక 20వ సీజన్‌లో ఆర్‌సీబీ 'హ్యాట్రిక్' కొడుతుందా.. లేక ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి మాజీ ఛాంపియన్లు పునరాగమనం చేస్తాయా అన్నది అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

మ్యాచ్‌ల సంఖ్య 94కు పెంచడం వల్ల ఆటగాళ్లపై పనిభారం పెరిగే అవకాశం ఉంది. దీన్ని బీసీసీఐ ఎలా బ్యాలెన్స్ చేస్తుందనేది చూడాలి. మరోవైపు వచ్చే సీజన్‌కు ముందు జరగబోయేది మెగా వేలమా లేక మినీ వేలమా అనే ఉత్కంఠ కూడా నెలకొంది. వీటన్నింటిపై రాబోయే కొన్ని నెలల్లో బీసీసీఐ నుండి అధికారిక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.

Also Read: హృదయాలను గెలిచిన జపాన్ ఫ్యాన్స్..మ్యాచ్ తర్వాత చెత్తను శుభ్రం చేసిన అభిమానులు!

Also Read: పాకిస్థాన్ బౌలర్ మెడ పట్టుకున్న టీమ్ఇండియా బ్యాటర్..సోషల్ మీడియాలో వైరల్ వీడియో!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

YS Jagan: సాయికృష్ణ కేసులో సీబీఐ దర్యాప్తు చేయాలి.. దోషులను శిక్షించాలి: వైఎస్‌ జగన్‌

Vijayawada, Andhra Pradesh:

YS Jagan With Saikrishna: విజయవాడ కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో లాకప్‌డెత్‌కు గురయ్యాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న గాదె సాయికృష్ణ తల్లిని, అతడి కుటుంబ సభ్యులను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి పరామర్శించారు. కృష్ణలంకలో ఉంటున్న వారి ఇంటికి వెళ్లి మాట్లాడిన ఓదార్చారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. 'మే నెలలోనే ఇలాంటి ఘటనలు రెండు జరిగాయి. కృష్ణలంక సీఐ వేధిస్తున్నాడని క్రాంతికుమార్‌ ఆత్మహత్య. మే 9వ తేదీన సాయికృష్ణను తీసుకెళ్లిన పోలీసులు. కొడుకు కోసం పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిరిగిన తల్లి. కొడుకు ఫొటోకు దండ వేసుకోమన్న సీఐ. వారిచ్చిన ఫిర్యాదును చెత్తబుట్టలో వేసిన పోలీసులు' అని తీవ్ర ఆరోపణలు చేశారు.

అందుకే కృష్ణలంక సీఐ సస్పెండ్‌
'సాయికృష్ణను చంపేసిన తర్వాత పోలీసులే దహనం చేసి ఆ తర్వాత సాయికృష్ణ తల్లితో బేరసారాలు. హైకోర్టును సాయికృష్ణ తల్లి ఆశ్రయించి హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేయడంతోనే పోలీసుల్లో భయం' అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చివరకు సాయికృష్ణను చంపారని ఒప్పుకున్నారని.. అందుకే కృష్ణలంక సీఐని సస్పెండ్‌ చేశారని పేర్కొన్నారు. ఇద్దరి చావుకు కృష్ణలంక సీఐ కారణం అని.. అయినా కేసు పెట్టకుండా కేవలం సస్పెన్షన్‌ చేశారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో సీఐనే బాధ్యుడిని చేయడం సరికాదని.. నేరంలో విజయవాడ సీపీ, డీజీపీకి భాగం ఉందని ప్రకటించారు. అందరిపైనా మర్డర్‌ కేసు పెట్టి శిక్షించాలని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు.

దగ్గరుండి ప్రోత్సాహం
'విజయవాడ నడిబొడ్డున అంటే రాష్ట్రానికి రాజధాని ప్రాంతం. ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే ముఖ్యమంత్రి నివాసం. ఆ పక్కనే ఉన్న ఈ తల్లి ఎంత దారుణంగా ఈ ఘటన జరిగిందో చెబుతూ రోదిస్తున్నది. చంద్రబాబు దగ్గరుండి ప్రోత్సహిస్తున్న కొంతమంది పోలీసులు, వీరు చేసే పనులతో రాష్ట్రంలో ఏదైనా అన్యాయం జరిగితే పోలీసు స్టేషన్‌కు పోవడానికి కూడా భయపడే పరిస్ధితి నెలకొంది' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

'మే నెలలో సాయికృష్ణది ఓ ఘటన అయితే క్రాంతికుమార్‌ అనే వ్యక్తిది ఇంకో ఘటన. అది ఆత్మహత్య ఘటన. పలానా సీఐ, పలానా పోలీసు స్టేషన్‌ పరిధి. రోజూ నన్ను కొడుతున్నాడు, నేను తట్టుకోలేకపోతున్నా. నా చావుకు కారణం ఆ సీఐ అని మరణ వాంగ్మూలం ఇస్తూ తాను ఆత్మహత్య చేసుకున్న పరిస్ధితి. మే 9న సాయికృష్ణ ఘటన కూడా జరిగింది' అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస జగన్‌ వివరించారు.

నీ కొడుకు ఫొటోకు దండ వేసుకో
'సాయికృష్ణ తల్లి పోలీసుస్టేషన్‌ చుట్టూ తిరిగితే నీ కొడుకు ఫొటోకు దండ వేసుకో అంటూ ఈ తల్లిని హేళనగా మాట్లాడిన పరిస్ధితి. ఆరోజు నుంచి ఈ తల్లి నా కొడుకును చూపించమని బాధపడుతున్న పరిస్ధితులు మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. ఈ ఘటన మీద డీజీపీ ఆఫీసుకు వెళ్లి ఫిర్యాదు చేస్తే అది ఏమైంది? చివరికి చెత్త బుట్టలోకి వెళ్లింది. డీజీపీ ఫిర్యాదును సీపీకి పంపించడం, సీపీ యాక్షన్‌ తీసుకోకుండా మిగతా వాళ్లను పిలిపించి బేరం పెట్టించే కార్యక్రమం చేశారు' అని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు.

'ఒకే పోలీసు స్టేషన్‌లోనే సీఐ, ఏసీపీ, కమిషనర్, డీజీపీ ఇలా మొత్తం ఒకరినొకరు కాపాడుకుంటూ మొత్తం అందరికీ తెలిసి స్టేషనలో జరిగిన ఒక హత్య అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. 'ఇంత పెద్ద హేయమైన కార్యక్రమం జరిగిందంటే ఆ సీఐని, బాధ్యుడైన కమిషనర్‌ను, డీజీపీని మర్డర్‌ కేసు పెట్టి శిక్షించాల్సింది పోయి కేవలం సీఐని సస్పెన్షన్‌ మాత్రమే చేశారు. అంటే అందరూ పకడ్పందీగా, కలిసికట్టుగా నేరం చేసి తూతూ మంత్రంగా, కంటితుడుపు చర్యగా, టెంపరరీగా ఓ అధికారిని తప్పించారు. ఇదా మనం ఈ రాష్ట్రంలో చూడాల్సింది' అని కూటమి ప్రభుత్వంపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని
'సాయికృష్ణ కేసులో కోర్టు పాత్ర లేదు. వీళ్లే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఏకంగా ఇద్దరు పిల్లలు ఒకే నెలలో చనిపోవడానికి కారణమయ్యారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు జరగాలి.. ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్‌ అయ్యారనేది బయటికి రావాలి' అని వైఎస్‌ జగన్‌ కోరారు. న్యాయపోరాటంలో ఈ తల్లికి, చనిపోయిన మరో పిల్లాడి కుటుంబానికి వైఎస్సార్సీపీ సంపూర్ణంగా అండగా ఉంటుందని ప్రకటించారు.

'ఇదంతా ఎంత కంటితుడుపు చర్య అంటే, అసలు యాక్షనే తీసుకోలేదు. మే 9వ తేదీ నుంచి రెండు మర్డర్‌ ఘటనలు జరిగితే ఇప్పుడు జూన్‌లో బయటికి వచ్చిన తర్వాత కంటి తుడుపు చర్యగా అరెస్టులు కూడా చేయకుండా సస్పెన్షన్లు చేస్తున్నారంటే, ఏ విధంగా వీళ్లంతా క్రై మ్‌ ను బయటికి రాకుండా చేస్తున్నారో అర్థమవుతోంది. ఈ తల్లి దగ్గరకు పంచాయతీలు చేసి.. సర్దుబాట్లు చేసుకునేందుకు బేరసారాలు చేస్తూ ఇక్కడ టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన ఇన్‌ఛార్జ్‌లు మాట్లాడుతున్నారంటే రాష్ట్రంలో ఎలాంటి దారుణమైన పరిస్ధితులు ఉన్నాయో గమనించాలి' అని వైఎస్‌ జగన్‌ తెలిపారు. ప్రజల ప్రాణాలతో ఎలా చెలగాటం ఆడుతున్నారనే దానికి ఇది ఇంకొక నిదర్శనం అని పేర్కొన్నారు.

అందరూ నిర్లక్ష్యపు వైఖరి
'సాయికృష్ణ కేసుపై కచ్చితంగా సీబీఐ విచారణకు పోవాలి. బాధ్యులు ఎవరెవరైతే ఉన్నారో సీఐ దగ్గరి నుంచి ఏసీపీ, కమిషనర్, డీజీపీ, హోంమంత్రి వరకూ అందరూ నిర్లక్ష్యపు వైఖరితో ఉన్నారు. కాబట్టి సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే' అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. దోషులు ఎవరో తెలిసి ఎలా కాపాడుతున్నారు? ఎందుకు రోటీన్‌ పద్ధతిలో ఇలాంటి లాకప్‌ డెత్‌లు జరుగుతున్నాయో తెలియాలంటే సీబీఐ రావాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

0
0
Report

Oppo Reno 15a: ఇక ఛార్జింగ్ కష్టాలకు గుడ్ బై.. 2 రోజులు వచ్చే బ్యాటరీతో ఒప్పో కొత్త ఫోన్.. అన్ని అదుర్స్!

Hyderabad, Telangana:

Oppo Reno 15a Launch Date: ప్రముఖ మొబైల్‌ కంపెనీ ఒప్పో (Oppo) మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.. సరికొత్త ఫీచర్లతో పాటు అద్భుతమైన డిజైన్‌తో ఒప్పో రెనో 15A (Oppo Reno 15A) స్మార్ట్‌ఫోన్‌ను జపాన్ మార్కెట్లో అధికారికంగా లాంచ్‌ చేసింది.. ఇది మంచి బ్యాటరీ లైఫ్ కోరుకునే వినియోగదారులను టార్గెట్ చేస్తూ.. ఇందులో కంపెనీ ఏకంగా 7000mAh భారీ బ్యాటరీతో పాటు 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వంటి హై-ఎండ్ ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి విడుదలైంది.. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఒప్పో రెనో 15Fకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది..

ధర వివరాలు..
ఈ Oppo Reno 15A స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం జపాన్ మార్కెట్లో అందుబాటులో ఉంది.. ప్రస్తుతం ఇది ఆఫ్టర్‌గ్లో పింక్, ట్విలైట్ నేవీతో పాటు అరోరా బ్లూ వంటి అద్భుతమైన రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన ధరల వివరాల్లోకి వెళితే.. దీని మొదటి స్టోరేజ్‌ వేరియంట్‌ 8GB RAM + 128GB స్టోరేజ్‌తో ధర రూ.38,000తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా రెండవది 12GB RAM + 256GB స్టోరేజ్‌తో ధర రూ. 45,100తో లభిస్తోంది. అదేవిధంగా అక్కడ మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి స్పెషల్ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

ప్రీమియం డిస్‌ప్లే.. 
ఒప్పో రెనో 15A ఫోన్‌లో కంపెనీ అద్భుతమై 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.6-ఇంచుల Full HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండబోతోంది.. ఇది 1,400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో పాటు 10-బిట్ కలర్ డెప్త్‌కు సపోర్ట్ చేస్తుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది. స్క్రీన్ ప్రొటక్షన్‌ కోసం  AGC Dragontrail STAR D ప్లస్‌ గ్లాస్‌ను కూడా వినియోగించిన్నట్లు తెలుస్తోంది.. అలాగే సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ ఫీచర్‌ కూడా లభిస్తోంది. ఈ ఫోన్ శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 (Snapdragon 6 Gen 1) ప్రాసెసర్‌పై రన్‌ అవుతుంది.

భారీ బ్యాటరీ..
ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ.. ఇందులో కంపెనీ మోస్ట్ పవర్‌ఫుల్‌ 7,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించింది.. దీనికి తోడు 80W ఫాస్ట్ చార్జింగ్‌తో పాటు 55W PPS చార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల ఫోన్ చాలా స్పీడ్‌గా చార్జ్ అవుతుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే రెండు రోజుల పాటు బ్యాటరీ ఛార్జింగ్‌ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కంపెనీ వెల్లడించింది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

కెమెరా లవర్స్ కోసం 50MP సెల్ఫీ కెమెరా..
ఫోటోగ్రఫీకి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దీని వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. అందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరాతో పాటు అదనంగా 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో కెమెరా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.. ఇక సెల్ఫీల కోసం.. ఇందులో ప్రత్యేకంగా ముందు భాగంలో 50MP పవర్‌ఫుల్ కెమెరాను అందించారు..

కొత్త ఫీచర్లు ఇవే..
ఈ ఒప్పో రెనో 15A స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ ఓఎస్ 16 (ColorOS 16)తో అందుబాటులోకి వచ్చింది.. ఇందులో వాటర్‌తో పాటు డస్ట్ నుంచి ప్రొటక్షన్‌ కోసం దీనికి IP66, IP68తో పాటు IP69 రేటింగ్స్ అందించిన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇందులో NFC, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్-సి ఆడియో, మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ వంటి అద్భుతమైన ఫీచర్లు కూడా లభిస్తున్నాయి. అయితే, దీనిని త్వరలోనే భారత మార్కెట్‌లోకి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Karimnagar: కరీంనగర్‌లో NEET రీ-ఎగ్జామ్.. అక్కడ సెక్షన్ 163 అమలు.. ఇవి బంద్!

Hyderabad, Telangana:

NEET 2026 Re-Exam in Karimnagar: రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న నీట్‌ 2026 రీ-ఎగ్జామినేషన్‌కు కరీంనగర్ రూరల్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తూ వస్తోంది.. జూన్ 21వ తేదీన కరీంనగర్ రూరల్ మండలం పరిధిలోని బొమ్మక్కల్ మైనారిటీ రెసిడెన్షియల్ కాలేజీలో ఈ పరీక్ష జరగబోతోంది.. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రం పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. అక్రమాలకు తావులేకుండా ఉండేదుకు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా పరీక్షా కేంద్రం చుట్టూ 200 మీటర్ల పరిధిలో సెక్షన్ 163 అమలు చేస్తున్నట్లు MRO జి. లక్ష్మీనర్సింహారావు ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించారు.

మధ్యాహ్నం 2 నుంచి ఆంక్షలు..
జూన్‌ 21వ తేదిన మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్షా సమయాల్లో ఈ ఆంక్షలు అత్యంత కఠినంగా అమలులో ఉంటాయని MRO స్పష్టం చేశారు. ఈ సమయంలో పరీక్షా కేంద్రం పరిసరాల్లో నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటంపై పూర్తి నిషేధం ఉంటుందని అధికారులు తెలిపారు. ధర్నాలతో పాటు నిరసనలు లేదా గుంపులుగా ఉండడాన్ని చట్టవిరుద్ధంగా పరిగణిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా మైకులు.. లాడ్‌స్పీకర్లు వాడటాన్ని కూడా పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు.

జిరాక్స్ కేంద్రాల బంద్..
పరీక్షల్లో ఎలాంటి అవకతవకలతో పాటు లీకేజీలు, కాపీయింగ్ వంటి ఉదంతాలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పరీక్షా కేంద్రానికి సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్, కొరియర్‌తో పాటు ఇంటర్నెట్ సెంటర్లను పరీక్ష ముగిసే వరకు మూసివేయాలని MRO లక్ష్మీనర్సింహారావు ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా జిరాక్స్ సెంటర్లు తెరిచినా లేదా గుంపులుగా తిరిగినా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

ప్రశాంత వాతావరణంలో పరీక్షలు..
విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా.. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసేలా అధికారులు, పోలీస్ యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తున్నారు. పరీక్షా కేంద్రం వద్ద సీసీ కెమెరాల నిఘాతో పాటు గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు అధికారుల ఆదేశాలకు లోబడి, పరీక్షలు సజావుగా సాగేందుకు సహకరించాలని తహశీల్దార్ ఈ సందర్భంగా కోరారు. లేదంటే చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుందని తెలిపారు. 

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement
Advertisement
Back to top