icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
500001
VVishwaroopaFollow5 Jul 2024, 10:54 am

హైద్రాబాద్, ఇస్కాన్ అబిడ్స్ టెంపుల్ ఆధ్వర్యంలో ఈనెల 7న జగన్నాథ్ రథయాత్ర ఘనంగా నిర్వహించబోతున్నాము

Hyderabad, Telangana:

శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవ్ 2024కి సంబంధించి, వేదాంత చైతన్య దాస్ హైదరాబాద్ ఆలయ నిర్వహణ మండలి సభ్యుడు ఇస్కాన్ అబిడ్స్ ఆలయం ఈ నెల 7న జగన్నాథ రథయాత్రను నిర్వహించబోతోంది. ఆదివారం ఉదయం 11.30 గంటలకు స్టేడియం నుంచి ఎన్టీఆర్ రథయాత్ర ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ స్టేడియం మొజంజాహీ మార్కెట్ చౌరస్తా నుంచి యాత్ర ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు మైదానంలో ముగుస్తుంది. నారాయణగూడ నుంచి బషీర్ బాగ్ కూడలి వరకు మైదానంలో ఉత్సవాలు నిర్వహించనున్నారు. పండుగలో భజనలు మరియు సంగీత ప్రదర్శనలు కూడా ఉన్నాయి.

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Sonali Bendre Land Dispute: మహేష్‌బాబు హీరోయిన్‌పై కేసు నమోదు..భూమి ఆక్రమించిందంటూ రైతు ఆవేదన..తల్లిపై దాడి చేశారని ఆరోపణ!

Pune, Maharashtra:

Sonali Bendre Land Dispute News: హీరోయిన్ సోనాలి బెంద్రేతో పాటు అతని భర్త గోల్డీ బెహ్ల్‌పై కేసు నమోదయ్యింది. తన తాతల తరం నాటి భూమని ఇప్పుడు ఆ దంపతులు అక్రమంగా పత్రాలను తారుమారు చేశారని ఆరోపణలు చేశాడు. దీంతో పాటు ఆ ఎకరా భూమి తనదే అంటూ న్యాయపోరాటం కోసం కోర్టు మెట్లు ఎక్కాడు.

నటి సోనాలి బెంద్రే, ఆమె భర్త గోల్డీ బెహల్‌లపై ఇప్పుడు కేసు నమోదయ్యింది. పుణెలోని ఓ ఎకరం భూమి కొనుగోలు విషయంలో తమను మోసం చేశారని ఓ రైతు ఆవేదన ఇప్పుడు బయటకువచ్చింది. సోనాలి బెంద్రే భర్త గోల్డీ బెహల్ కొనుగోలు చేసిన భూమి తమ కుటుంబ పూర్వీకుల ఆస్తి అని ఇప్పుడు ఓ రైతు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఒప్పందంలో చట్టపరమైన వాస్తవాలను దాచిపెట్టారని ఆ రైతు స్పష్టం చేశారు.

పుణెలోని ఈ ఎకరం భూమి వివాదంలో గోల్డీ బెహల్, నటి సోనాలిపై ఆరోపణలు చేసిన రైతు పేరు చంద్రకాంత్ బాబు షిండే. ఏప్రిల్ 1, 1957 నుండి ఈ వివాదాస్పద భూమి తన తాత కేసు బాబాజీ షిండే పేరు మీద నమోదై ఉందని ఆయన వాదిస్తున్నారు. ఆ భూమిపై ఆయనకే పూర్తి హక్కులు ఉన్నాయని ఆ రైతు తెలిపారు. అయితే అసలు యజమాని నుంచి ఆ భూమిని మొదట మోసపూరిత పద్ధతుల ద్వారా బాలా షిండేకు అమ్మినట్లు చెప్పిన చంద్రకాంత్ షిండే.. ఆ తర్వాత పూర్తి హక్కులను చాకచక్యంగా దాచిపెట్టి గోల్డీ బెహల్ పేరు మీదకు బదిలీ చేశారని ఆరోపణలు చేస్తున్నారు. రిజిస్టర్ పత్రాలను తారుమారు చేయడం ద్వారా ఆ భూమిపై తమ కుటుంబ హక్కులను కాలరాస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. 

ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది వన్రాజ్ షిండే ఈ విషయంలో గట్టిగా గళం వినిపిస్తున్నారు. కేవలం కొనుగోలు, అమ్మకం పత్రాలను రూపొందించడం లేదా భూమి రికార్డులలో ఒకరి పేరు ఉండటం వల్ల ఎవరూ చట్టబద్ధమైన యజమాని అయిపోరని ఆయన వాదిస్తున్నారు. ఆ ఎకరం భూమిపై తన క్లయింట్ కుటుంబానికి అన్ని చట్టపరమైన హక్కులు ఉన్నాయని ఆ లాయర్ తెలిపారు. వాటిని విస్మరించి అక్రమంగా రిజస్టర్‌ చేయించారని ఆయన తెలిపారు. ఇది పూర్తిగా తప్పు అని నొక్కిచెప్పారు.

2025 డిసెంబర్‌లో సోనాలి బెంద్రే, ఆమె భర్త గోల్డీ బెహ్ల్ ఈ వివాద భూమి వద్దకు వచ్చినప్పుడు అక్కడ తన తల్లితో విగ్వాదం జరిగినట్లు చంద్రకాంత్ షిండే తెలిపారు. గోల్డీ బెహ్ల్, అతని మనుషులు తన వృద్ధ తల్లిపై దాడి చేసి, ఆమెను దురుసుగా ప్రవర్తించారని రైతు చంద్రకాంత్ షిండే ఆరోపణలు చేస్తున్నారు. ఆ తర్వాత షిండే న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఈ కేసు ఇప్పుడు కోర్టులో ఉంది. ప్రస్తుతం గోల్డీ బెహ్ల్ తరఫు న్యాయవాది రాజు షిండే అన్ని ఆరోపణలను ఖండించారు. ఈ కేసు పూణేలోని వాద్గావ్ మావల్ కోర్టులో విచారణలో ఉంది. 

Also Read: 8th Pay Commission: పోరుబాటకు సిద్ధమైన ప్రభుత్వ ఉద్యోగులు?! ఓపీఎస్, పెన్షన్లపై 8వ వేతన సంఘంతో పోరాటం.. ఇకపై చావో రేవో!

ALso Read: LPG Cylinder Shortage: మార్కెట్లో మరో గ్యాస్ సిలిండర్ స్కామ్..సగం గ్యాస్‌తో సిలిండర్ల అమ్మకం.. ఎలా తెలుసుకోవాలంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

LPG Cylinder Shortage: మార్కెట్లో మరో గ్యాస్ సిలిండర్ స్కామ్..సగం గ్యాస్‌తో సిలిండర్ల అమ్మకం.. ఎలా తెలుసుకోవాలంటే?

Hyderabad, Telangana:

How To Check Gas Level In Cylinder: దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఎల్పీజీ సిలిండర్ల కోసం జనం ఎగబడుతున్నారు. ఒక సిలిండర్‌ను ఇంటికి తీసుకువెళ్లడానికి ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు. కానీ ఆ సిలిండర్ సగం మాత్రమే నిండి ఉంటే పరిస్థితి ఏమిటి? అయితే అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఫుల్ సిలిండర్‌ను ఎలా తెలుసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఎల్పీజీ (LPG Gas) సంక్షోభం కొనసాగుతోంది. ఎక్కడ చూసినా గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు పొడవైన క్యూల్లో గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది బ్లాక్‌లో సిలిండర్లను కొనే సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో సామాన్యులు అధిక ధరలను చెల్లించాల్సి వస్తుంది. ఈ క్రమంలో మీరు బ్లాక్‌లో పొందినా.. సరాసరి కంపెనీ నుంచి సిలిండర్ డెలివరీ పొందిన దాని పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

బ్లాక్‌లో సిలిండర్ విక్రయించే వారు కొన్నిసార్లు ఫుల్ సిలిండర్లను కాకుండా సగం అయిపోయన సిలిండర్లను అమ్మకాలు చేస్తున్నారు. దీంతో ఆయా సిలిండర్లలో ఎంతమేర గ్యాస్ ఉందనే విషయం సామాన్యులకు తెలియరావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ ఎంతమేర ఉందని తెలుసుకునేందుకు కొన్ని చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మార్కెట్లో నుంచి తెచ్చిన గ్యాస్ సిలిండర్ ఫుల్‌గా ఉందా? సగం వినియోగించినదా? అనేది తెలుసుకోవాలంటే కొన్ని సింపుల్ చిట్కాలను తెలుసుకుందాం. ఈ విధంగా తడి గుడ్డతో సిలిండర్‌లోని గ్యాస్ లెవల్‌ను తెలుసుకోవడం ఎంతో ఈజీగా కనిపిస్తోంది. ముందుగా ఒక పాత క్లాత్‌ను నీటిలో నానాబెట్టి.. ఆ తర్వాత పిండేయాలి. ఆ వెంటనే క్లాత్‌ను గ్యాస్ సిలిండర్ చుట్టూ గట్టిగా చుట్టేయాలి.

ఆ తర్వాత చుట్టేసిన పాత క్లాత్‌ను కొంతసేపు ఆగిన తర్వాత తీసేయాలి. ఆ వెంటనే 2 నుండి 3 నిమిషాలు ఆగి గ్యాస్ సిలిండర్‌ను జాగ్రత్తగా గమనించాలి. గ్యాస్ లేని పైభాగం త్వరగా ఆరిపోతుందట. గ్యాస్ ఉన్న భాగంలో ఎక్కువసేపు తడి అలానే ఉండటాన్ని మీరు గమనిస్తారట. సిలిండర్‌పై తడి గ్యాస్ ఉన్న భాగంలో అలానే కొద్దిసేపు కనిపిస్తుంది. కానీ, గ్యాస్ లేని ఖాళీ సిలిండర్‌పై తడి వెంటనే ఆరిపోతుంది. దీనికి కారణం.. ఎల్‌పిజి గ్యాస్ చల్లగా ఉండటమే కారణం. అది సిలిండర్‌లోని ఆ ప్రాంతాన్ని చల్లగా ఉంచి, తేమ త్వరగా ఆరిపోకుండా నిరోధిస్తుంది.

సీల్‌ కూడా డమ్మీనే!
సిలిండర్ గ్యాస్‌తో నిండి ఉందో లేదో తనిఖీ చేయడానికి ఇంకో సులభమైన మార్గం కూడా ఉంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌పై ఒక ప్లాస్టిక్ సీల్ ఉంటుంది. ఆ సీల్‌ను మళ్లీ అతికించారో లేక అది వదులుగా ఉందో మీరు తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు, గ్యాస్ పరిమాణాన్ని తగ్గించడానికి సిలిండర్‌ను తారుమారు చేసే అవకాశం ఉంది.

పైన పేర్కొన్న చిట్కాలతో పాటు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బరువు ద్వారా కూడా సిలిండర్ పూర్తిగా ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఫుల్ గ్యాస్ సిలిండర్ బరువు గురించి మీకు ఓ అవగాహన రావడానికి దీనిని తనిఖీ చేయాల్సిన పరిస్థితి ఉంది. గ్యాస్ సిలిండర్లను జారీ చేసే కంపెనీల ద్వారా ఇంటికి వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పూర్తిగా నింపిన తర్వాత దాని బరువు సుమారుగా.. 29.5 కిలోలు ఉంటుంది. అయితే ఆ సిలిండర్‌లో సుమారుగా 14.2 కిలోలు గ్యాస్ ఉంటుంది.

Also Read: LPG Gas Booking Scam: ఎల్పీజీ గ్యాస్ బుకింగ్ స్కామ్..గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో భారీ మోసం..జాగ్రత్త బ్రదర్!

Also Read: Petrol Bunk Scams: పెట్రోల్ బంకుల్లో భారీగా పెరిగిన మోసాలు..ఆయిల్ కొట్టించే ముందు ఇవి సరిచూసుకోండి..జాగ్రత్త!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Chandrababu: అమరావతి అన్‌స్టాపబుల్‌.. ఇక రాజధానిపై ఎవరూ ఏం చేయలేరు: సీఎం చంద్రబాబు

Lingayapalem, Andhra Pradesh:

Capital Amaravati Celebrations: 'పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందటం ప్రజాస్వామ్య గొప్పదనం, ప్రజా సంకల్పాన్ని చాటి చెప్పిన రోజు ఇది. దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించ దగిన రోజుగా ఇది నిలిచిపోతుంది. అమరావతి చరిత్ర శాశ్వతం.. అందులో రైతులు చేసిన త్యాగం శాశ్వతం' అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అనేక కుట్రలను ఎదుర్కొని రాజధానిని దక్కించుకున్నట్లు చెప్పారు. ఇక అమరావతి అన్‌స్టాపబుల్‌ అని తెలిపారు. 'ప్రజా రాజధానిని సాధించుకున్నాం.. ఇది ప్రజా విజయం. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ప్రధానికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు చెప్పారు.

Also Read: Amaravati Capital: ఉభయసభల్లో రాజధాని బిల్లు ఆమోదం.. అధికారికంగా ఏపీ రాజధాని అమరావతి

పార్లమెంటులో అమరావతి చట్టబద్దత బిల్లు ఆమోదం తర్వాత రాజధాని ప్రాంతం ఉద్దండరాయుని పాలెం వద్ద అమరావతి రైతులు, మహిళలు నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ తీసుకువచ్చిన బిల్లుకు హోం మంత్రి అమిత్ షా సహా కేంద్రం, దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఈ బిల్లుకు సహకరించాయని వెల్లడించారు. 'పవిత్రమైన మట్టి- నీటిని రాజధాని శంకుస్థాపన చేసిన రోజున ప్రధాని తెచ్చారు. పార్లమెంట్ వద్ద ఉన్న పవిత్ర మట్టిని, పవిత్ర యమునా నది జలాలతో పునీతమైన పుణ్యభూమి ఇది. ఒక్క వైఎస్సార్‌సీపీ మినహా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు అమరావతికి ఇవాళ అండగా నిలబడ్డాయి' అని సీఎం చంద్రబాబు తెలిపారు.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ జాక్‌పాట్‌.. ఏపీ ప్రభుత్వం భారీ గిఫ్ట్‌

'అమరావతిని శ్మశానం అన్నారు.. కానీ ఇవాళ పార్లమెంటులో అమరావతికి తిరుగులేని శాసనం చేసుకున్నాం. రాజధానితో మూడు ముక్కలాట ఆడారు అడ్రస్ లేకుండా పోయారు' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రకటించారు. 'ఓ నమ్మకంతో 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు రాజధానికి భూములిచ్చారు. అమరావతి రాజధాని ఆంధ్రుల ఆత్మగౌరవానికి చిహ్నం. అమరావతికి అపజయం లేదు. రాష్ట్రానికి నడిబొడ్డున రాజధాని ఉంటే అందరికీ అందుబాటులో ఉంటుంది' అని పేర్కొన్నారు. 'రైతులు, రైతు కూలీలు, ప్రజల ఐకమత్యం వల్లే ఈ విజయం సాధించుకున్నాం' అని సీఎం చంద్రబాబు తెలిపారు.

'2019లో మనల్ని ఏమార్చారు. ఐదేళ్ల పాటు  చీకటి రోజులుగా రాష్ట్రానికి దాపురించాయి. ప్రజా వేదికతో విధ్వంసాన్ని ప్రారంభించి అమరావతిని ధ్వంసం చేశారు. దానిని అడ్డుకుంటూ రాజధాని రైతులు,  మహిళలు వీరత్వం, ప్రతాపం చూపారు' అని రాజధాని రైతులపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. 'అమరావతి రైతులు, మహిళల ఉద్యమ శిబిరాలకు నాడు సతీ సమేతంగా వచ్చా. రైతుల ఉద్యమం చూసి భువనేశ్వరి చలించిపోయారు.. ఉద్యమానికి సంఘీభావం తెలిపి చేతికున్న రెండు బంగారు గాజులు ఇచ్చారు. భువనేశ్వరి ఒక్కరే కాదు రాష్ట్ర ప్రజలు, రాష్ట్రేతరులు చాలా మంది ఉద్యమానికి అండగా నిలిచారు. అమరావతి ఉద్యమం కోసం నేను స్వయంగా జోలె పట్టా' అని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

'1631 రోజులు ఉద్యమం ఓ చరిత్ర... వీరోచితంగా పోరాడి రాజధానిని సాధించుకున్న అమరావతి సొంతం. న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. 2024లో కూటమి పార్టీకి అద్భుత విజయం అందించారు. ఇప్పుడు రాజధానికి చట్టబద్దత కలిగింది. ఆదర్శ రాజధాని తెలుగు జాతి గుండె, జాతి గౌరవం అమరావతే' అని సీఎం చంద్రబాబు వివరించారు. 'అమరావతి విషయంలో ఇంత జరిగినా వైసీపీకి మాత్రం బుద్ది రాలేదు. వారి పిచ్చి ఇంకా ముదిరింది. అమరావతికి చట్టబద్దత కల్పించే అంశంపై తీర్మానం పెడితే  ఆ పార్టీ అసెంబ్లీకి కూడా హాజరు కాలేదు. వైసీపీని అంతా మరిచిపోవాలి, రాష్ట్రానికి ఆ పార్టీ పీడ విరగడవ్వాలి' అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.

'మావిగన్ అంటూ ఓ కొత్త ప్రతిపాదన చేశారు. డిక్షనరిలో చూశాను నాకు అర్థం కాలేదు. వైఎస్సార్‌సీపీవి అన్నీ బుద్ది లేని వ్యాఖ్యలు.. దుర్మార్గపు ఆలోచనలే. అమరావతికి చట్టబద్దత కల్పిస్తుంటే చట్టసభ నుంచి ఆ పార్టీ ఎంపీలు వాకౌట్ చేశారు. ప్రజలు ఆ పార్టీ బ్లాక్ అవుట్ చేయాలి. అమరావతిని చంపాలనుకున్న వైసీపీ బాగుపడదు. ఇంతటి  నీతిమాలిన రాజకీయం నా చరిత్రలో చూడలేదు' అని సీఎం చంద్రబాబు చెప్పారు. 'రాష్ట్రంలో ప్రతీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని అమరావతి సాక్షిగా ప్రజలకు హామీ ఇస్తున్నా. అమరావతి అన్ స్టాపబుల్.. అద్వితీయం, అజేయం, అజరామరం' అని ప్రకటించారు. 'ప్రజలు సహకరిస్తే ప్రపంచంలోని ప్రతీ అభివృద్ధి మోడల్ ను అమరావతికి తెస్తా. అమరావతికి శాశ్వతత్వం తెచ్చినందుకు ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. పార్లమెంటులో చేసిన చట్టాన్ని ఎవరూ మార్చలేరు. ఇప్పటివరకు రాష్ట్రానికి అడ్రస్ లేదు. ఇప్పుడు మనకు ఓ అడ్రస్ వచ్చింది' అని సీఎం చంద్రబాబు తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

8th Pay Commission: పోరుబాటకు సిద్ధమైన ప్రభుత్వ ఉద్యోగులు?! ఓపీఎస్, పెన్షన్లపై 8వ వేతన సంఘంతో పోరాటం.. ఇకపై చావో రేవో!

Hyderabad, Telangana:

8th Pay Commission Union Demands: ఎన్నో రోజులుగా 8వ వేతన సంఘం ద్వారా జీతాలు, పెన్షన్ల పెంపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉద్యోగులు, పెన్షనర్ల సహనం ఇప్పుడు నశిస్తోంది. దేశంలోని లక్షలాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతిపెద్ద సంస్థ అయిన ఎన్‌సీ-జేసీఎం (NC-JCM) (స్టాఫ్ సైడ్) ఇప్పుడు పలు డిమాండ్లను చేస్తోంది. మోదీ సర్కార్ ఏర్పాటు చేసిన 8వ వేతన సంఘానికి 9 అంశాల డిమాండ్ల జాబితాను వారికి సమర్పించింది.

ఏప్రిల్ 1, 2026 తేదీన రాసిన ఓ లేఖ ఆధారంగా.. ఎన్‌సీ-జేసీఎం కార్యదర్శి శివ్ గోపాల్ మిశ్రా.. 8వ వేతన సంఘం సభ్య కార్యదర్శి పంకజ్ జైన్‌కు నిర్మొహమాటంగా ఇలా చెప్పారు. పే కమిషన్ జారీ చేసిన 18 ప్రశ్నలను సవరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఫార్మాట్‌లో అనేక ముఖ్యమైన అంశాలు లేవని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నారు. అయితే NC-JCM ఉద్యోగ సంఘం పే కమీషన్ ముందుంచిన ప్రముఖ డిమాండ్స్‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

1. పాత పింఛను వ్యవస్థ (OPS) పునరుద్ధరణ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక, ప్రధాన డిమాండ్ పాత పెన్షన్ పథకం (OPS)ను పునరుద్ధరించడమేనని ఉద్యోగ సంఘం అభిప్రాయపడింది. NPS (నేషనల్ పెన్షన్ స్కీమ్) ఇటీవల ప్రకటించిన UPS (యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్) పట్ల ఉద్యోగులు సంతృప్తిగా లేరని వారు స్పష్టం చేశారు. తాము కాంట్రిబ్యూటరీ పెన్షన్‌కు అనుకూలంగా లేమని CCS (పెన్షన్) రూల్స్, 1972 (ప్రస్తుతం 2021) ప్రకారం పాత నాన్-కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ను కోరుకుంటున్నామని వారు పునరుద్ఘాటించారు.

2. పెన్షనర్ల హక్కుల పరిరక్షణ
పెన్షనర్ల కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాల జేఏసీ పే కమిషన్‌ను కోరింది. ఇందులో కమ్యూటెడ్ విలువ పునరుద్ధరణ, పదవీ విరమణానంతర ప్రయోజనాలు, పెన్షన్ పెంపులో సమానత్వం వంటి అంశాలు ఉంటాయి.

3. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక నిబంధనలు
పని ప్రదేశ భద్రత, రుతుస్రావ సెలవు, ప్రసూతి ప్రయోజనాలు, శిశు సంరక్షణ సెలవు (CCL) పని ప్రదేశంలో సమానత్వం వంటి సున్నితమైన సమస్యలను కవర్ చేస్తూ.. మహిళా ఉద్యోగుల కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని వేతన సంఘాన్ని మొదటిసారిగా కోరారు.

4. విభాగాల్లో సమస్య పరిష్కారం
కేంద్ర ప్రభుత్వంలోని ప్రతి విభాగంలో స్వతహాగా అనేక సవాళ్లు ఉన్నాయి. ప్రతి విభాగం పనితీరు వివిధంగా ఉంటుంది కాబట్టి, విభాగాల వారీ సమస్యలను పరిష్కరించడానికి కమిషన్ ప్రత్యేక నిబంధనలను రూపొందించాలని NC-JCM వాదిస్తోంది.

5. గడువు పొడిగింపు
8వ వేతన సంఘానికి విన్నపాలను అందజేసే వివిధ శాఖాపరమైన అంశాలపై వినతిపత్రాలు సమర్పించే గడువును మే 31, 2026 వరకు పొడిగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న సంస్థలు, యూనియన్లతో సంప్రదించడానికి మరికొంత సమయం పట్టే నేపథ్యంలో వారు ఈ విధంగా గడువు పొడిగించాలని వారు కోరుతున్నారు.

6. పరిమితి విస్తరణ
తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు 500 పదాల (3,500 అక్షరాల) పరిమితి చాలా తక్కువగా ఉందని ఉద్యోగులు ఫిర్యాదు చేస్తున్న క్రమంలో.. ఆ పరిమితిని 10,000 అక్షరాలను పెంచినట్లు AIDEF సెక్రటరీ జనరల్ సి.శ్రీకుమార్ ప్రకటించారు. అలాగే డాక్యుమెంట్ అటాచ్‌మెంట్ పరిమాణాన్ని (కెపాసిటీ) కూడా 2 MB నుండి 6 MBకి పెంచారు.

7. సాంకేతిక సమస్యలు
ప్రతి ప్రశ్నకు క్రమపద్ధతిలో సమాధానం ఇచ్చేలా ప్రశ్నావళి ఫార్మాట్‌ను సరళీకరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సాంకేతిక ఇబ్బందుల కారణంగా దీన్ని విస్మరించకుండా ఉండేలా ఆన్‌లైన్‌లో సమర్పణలతో పాటు ఇమెయిల్, హార్డ్ కాపీ ద్వారా కూడా వినతిపత్రాలను స్వీకరించాలని వారు అభ్యర్థిస్తున్నారు.

8వ వేతన సంఘం అందరినీ కలుపుకొని పోయేలా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు NC-JCM కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా స్పష్టం చేశారు. ఉద్యోగుల వాదనలు, సమాచారం, కారణాలను సమర్పించడానికి తగినంత అవకాశం, సమయం ఉండాలని ఆయన తెలియజేశారు.

NC-JCM ప్రస్తుతం అన్ని ఉద్యోగ సంఘాలతో కలిసి ఒక ఉమ్మడి ఒప్పంద పత్రాన్ని రూపొందిస్తోంది. ఉద్యోగుల వైఖరి దూకుడుగా ఉండడంతో పాటు వారు పింఛన్ల నుండి వేతనాల పెంపు వరకు ఉన్న సమస్యలపై రాజీ పడటానికి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. పైన పేర్కొన్న డిమాండ్లను ఎంత ప్రముఖంగా చేర్చాలనేది నిర్ణయం ఇప్పుడు 8వ వేతన సంఘం చేతిలో ఉంది.

Also Read: PMSYM Monthly Pension: కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్..60 ఏళ్లు దాటితే నెలకు రూ.3,000 పెన్షన్..ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Also Read: 8th Pay Commission: ఉద్యోగులు మరో తీపికబురు..8వ వేతన సంఘం ద్వారా జీతాలు భారీగా పెంపు?! అకౌంట్లోకి జమ అప్పటి నుంచే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Kanpur: కాన్పూర్‌లో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు.. రూ.50 వేల గొడవతో బయటపడ్డ అంతర్జాతీయ మాఫియా!

Hyderabad, Telangana:

Kidney Smuggling Gang Busted: క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో ఉండే ట్విస్టులు ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్లో నిజంగానే చోటుచేసుకున్నాయి. కేవలం రూ.50 వేల రూపాయల కోసం జరిగిన గొడవ.. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఒక భారీ అంతర్జాతీయ కిడ్నీ విక్రయ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. అమాయకులతో పాటు నిరుపేదలను లక్ష్యంగా చేసుకొని సాగుతున్న ఈ అక్రమ వ్యాపారంలో విస్తుకుపోయే నిజాలు విచారణలో వెలుగులో బయటపడ్డాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన వార్తలు దేశవ్యాప్తంగా చర్చనీ అంశానికి దారితీసాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం  ఇప్పుడు  తెలుసుకుందాం..

వివరాల్లోకి వెళ్తే.. కాన్పూర్ కు చెందిన ఒక యువకుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల తన కిడ్నీని విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఒక మధ్యవర్తి ద్వారా కిడ్నీ విక్రయ ముఠాను సంప్రదించాడు.. యువకుడి కిడ్నీని సదరు విక్రయించే ముఠా.. 10 లక్షలుగా ధర నిర్ణయించి ఒప్పందం కుదుర్చుకుంది. అంత అనుకున్నట్లుగానే ఆపరేషన్ పూర్తయింది.. యువకుడు తన కిడ్నీని కోల్పోయాడు. అయితే ఒప్పందం ప్రకారం రూ.10 లక్షలు ఇవ్వాల్సిన ఆ ముఠా.. అతనికి కేవలం 9.5 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది..

మిగిలిన 50 వేల కోసం ఆ యువకుడు ముఠా సభ్యులతో వాగ్వాదానికి దిగాడు.. తాను చేస్తున్నది చట్ట విరుద్ధమని తెలిసిన మొండిగా పోలీసులను ఆశ్రయించాడు.. తనను మోసం చేశారంటూ ఫిర్యాదు చేశాడు.. ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులకు మొదట ఇది సాధారణ గొడవల అనిపించిన.. లోతుగా దర్యాప్తు చేయడంతో కిడ్నీ మాఫియా నెట్వర్క్ చూసి అధికారులే ఆశ్చర్యపోయారు.. అంతేకాకుండా విచారణ జరుగుతున్న కొద్ది ఆశ్చర్యపరిచే విషయాలు బయటికి రావడంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు..

విచారణలు వెలుగులోకి వచ్చిన నిజాలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దాతల నుంచి పది లక్షలకు కిడ్నీలను సేకరిస్తూ ఈ ముఠా అవసరం ఉన్న రోగులకు దానిని 60 లక్షల నుంచి 70 లక్షలకు విక్రయిస్తోంది. దీని వెనక అంతర్జాతీయ స్థాయి నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ పత్రాలను సృష్టించడంలో వీరుదిట్టగా తేలింది. అప్పుల ఊబిలో ఉన్న వారితో పాటు నిరుద్యోగులే లక్ష్యంగా చేసుకొని ఈ ముఠా ముందుకు కొనసాగుతోంది. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉన్న వృద్ధులను సైతం వీరు వదిలిపెట్టడం లేదు.. ఇలా వారి నుంచి కిడ్నీలను సేకరించి విక్రయిస్తూనే ఉన్నారు.. ఈ కేసులో ఇప్పటివరకు పలువురు కీలక సూత్రధారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్‌లో రూ.30 వేలకే కారు మీ సొంతం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Moon Transit 2026: ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో లాభం.. చంద్రుడి సంచారంతో మారనున్న వీరి జాతకం!

Hyderabad, Telangana:

Moon Transit 2026 Effect On Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మానవ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ క్రమంలోని ఏప్రిల్ 2026 సంవత్సరంలో చంద్రుడు స్వాతి నక్షత్రం లోకి ప్రవేశించడం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదం. ముఖ్యంగా ఈ నెలలోనే చంద్రుడు ఈ నక్షత్ర సంచారం చేయబోతున్నాడు దీనివల్ల ద్వాదశ రాశుల వారిపై ఊహించని ప్రభావం పడబోతోంది. ముఖ్యంగా ఆయారాశుల వారి జీవితాల్లో అనేకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. సూర్యుడి ప్రభావంతో మూడురాశుల వారికి ధన లాభాలు కలగడమే కాకుండా మానసికంగా విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకున్న పనుల్లో ఊహించని ధనం కూడా లభించబోతోంది.

స్వాతి నక్షత్రానికి అధిపతి రాహువు.. అలాంటిది చంద్రుడు ఈ నక్షత్రంలోకి సంచారం చేసినప్పుడు కొన్ని రాశుల వారికి ఊహించని విజయాలు వరించబోతున్నాయి. వృత్తి, వ్యాపారాల పరంగా ఈ సమయంలో విశేషమైన లాభాలు కలుగుతాయి. అలాగే ఈ క్రింది రాశుల వారికి సమయం అత్యంత అనుకూలంగా ఉండడం విశేషం..

ఈ రాశులవారికి లాభాలు:
మేషరాశి 
మేష రాశి వారికి ఈ చంద్రుడి సంచారం చాలా అద్భుతమైన ఫలితాలను అందించబోతోంది. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి కావడమే కాకుండా.. ఆర్థిక స్థిరత్వం లభించబోతోంది. దీంతోపాటు ఉద్యోగస్తులకు అద్భుతమైన ప్రమోషన్లతో పాటు జీతాలు కూడా పెరిగే అవకాశాలున్నాయి. కుటుంబంలో నెలకొన్న కలహాలు తొలగిపోయి.. ప్రశాంతత చేకూరుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఈ సమయంలో అనుకున్న పనుల్లో అద్భుతమైన అవకాశాలు లభించబోతున్నాయి. 

తులారాశి 
మనసుకు కారకుడుగా భావించే చంద్రుడు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల తులా రాశి వారికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. వీరికి ఉత్సాహం రెట్టింపు అవుతుంది. దీని కారణంగా ఎలాంటి పనులైన సింపుల్గా చేయగలుగుతారు. నూతన పెట్టుబడులకు ఇది సరైన సమయంగా మారుతుంది. అంతేకాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు కూడా విపరీతంగా పెరుగుతాయి. వైవాహిక జీవితంలో ఉన్న మనస్పార్ధాలు కూడా పూర్తిగా తొలగిపోయి భాగస్వాములతో అద్భుతంగా జీవితాన్ని గడపగలుగుతారు. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

ధనస్సు రాశి 
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో ఆకస్మిక ధన లాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో నిలిచిపోయిన డబ్బులు కూడా ఈ సమయంలో చేతికి అందుతుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అద్భుతమైన విజయాలు లభించబోతున్నాయి. అంతే కాకుండా ఆరోగ్యపరంగా ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోబోతున్నట్లు జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే మానసిక ఉల్లాసం కూడా విపరీతంగా పెరుగుతుంది. దీని కారణంగా ఎలాంటి పనులు చేపట్టిన మానసిక ఆనందంతో అద్భుతంగా చేయగలుగుతారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Sun Transit 2026: మేషంలో ఉచ్ఛస్థితికి సూర్యుడు.. ఆ 5 రాశుల వారికి రాజయోగం.. మీరున్నారా ఇందులో?

Hyderabad, Telangana:

Sun Transit 2026 Effect On Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు రాజుగా పిలుచుకునే సూర్యుడు.. ఏప్రిల్ 14వ తేదీన మీనరాశి నుంచి మేష రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. సరిగ్గా ఇదే రోజున కొన్ని రాష్ట్రాలకు నూతన సంవత్సరం కావడం విశేషం. సూర్యుడు మేషరాశిలో ఉచ్చ స్థితిలో ఉండబోతున్నాడు. దీనివల్ల వచ్చే 30 రోజులపాటు కొన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి కెరీర్ పరంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఆర్థిక పరంగా అద్భుతమైన కాలం రాబోతోంది. కొన్ని రాశుల వారికి అదృష్టం కూడా వరించబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందబోతున్న రాశులు ఏవో తెలుసుకోండి. 

ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
మేషరాశి 

సూర్యుడు సొంత రాశిలోకే సంచారం చేయబోతున్నాడు. దీనివల్ల వీరికి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్న పనులని ఎంతో సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా సమాజంలో గౌరవం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. ఉన్నత అధికారుల నుంచి అద్భుతమైన ప్రశంసలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మిధున రాశి 
మిధున రాశి వారికి ఈ సంచారం చాలా లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందడమే కాకుండా.. కొత్త ఆదాయ వనరులు కూడా సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలించబోతున్నాయి. వ్యాపారస్తులకు పెద్ద డీల్స్ కుదిరే అవకాశాలు ఉండడం విశేషం. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

సింహరాశి 
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. రాజకీయాల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు లభించడమే కాకుండా తండ్రి వైపు నుంచి ఆస్తులు కూడా వస్తాయి. అలాగే ఈ రాశి వారికి తొమ్మిదవ స్థానంలో ఈ సంచారం జరగబోతోంది.. కాబట్టి ఆధ్యాత్మిక యాత్రలు చేయగలుగుతారు. ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. 

వృశ్చిక రాశి 
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు సూర్యుడి ప్రభావం ఎంతో అనుకూలంగా మారబోతోంది. వీరికి శత్రువులపై విజయాలు లభించడమే.. కాకుండా కోర్టు సంబంధిత కేసులు కూడా అనుకూలంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం అత్యున్నతంగా రాణించగలుగుతుంది. అంతేకాకుండా కొన్నింటిలో విశేషమైన ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Best Used Cars: రూ. 1.25 లక్షలకే హోండా అమేజ్.. రూ. 5 లక్షలకే బెంజ్ కారు.. రండి బాబు రండి!

Hyderabad, Telangana:

Cheapest Used Cars In India Telugus: సొంత కారు కల సహకారం చేసుకోవాలనుకునే మధ్యతరగతి ప్రజలకు ఢిల్లీలోని రోహిణి ప్రాంతం ఒక అద్భుతమైన వేదికగా మారింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్ని కంపెనీలకు సంబంధించిన కార్లు సగం కంటే తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని కార్లు అయితే కేవలం రూ.90 వేలు నుంచే ప్రారంభమవుతున్నాయి. సెకండ్ హ్యాండ్ లో మంచి కార్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం. ముఖ్యంగా రోహిణి ప్రాంతంలో ఉన్న సెకండ్ హ్యాండ్ ఆటోమొబైల్ షోరూమ్స్ ప్రత్యేకమైన డిస్కౌంట్తో సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయిస్తున్నాయి. పెద్ద బ్రాండ్లకు సంబంధించిన కార్లు కూడా ఏకంగా 60% తగ్గింపుతో అందుబాటులో ఉండడం విశేషం.. అయితే ఇక్కడ ఏయే కార్లు ఎంతెంత ధరలతో అందుబాటులో ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

సామాన్యుల బడ్జెట్కు అనుగుణంగా ఇక్కడ అనేక కారులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మారుతి సుజుకి ఈకో కేవలం ఇక్కడ రూ.1.5 లక్షలకే లభిస్తోంది. అలాగే హోండా అమేజ్ 2012 మోడల్ కార్లు కేవలం రూ 1.25 లక్షలకే అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు యువత ఎక్కువగా ఇష్టపడే స్విఫ్ట్ తో పాటు బెలినో కార్లు కేవలం ఇక్కడ రూ.2.90 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. కాబట్టి అతి తక్కువ ధరలోనే మంచి కారు కొనుగోలు చేయాలనుకునే వారు తప్పకుండా ఈ మార్కెట్ను సందర్శించడం చాలా మంచిది..

చాలాచోట్ల సెకండ్ హ్యాండ్ కార్ల విషయంలో మీటర్ రీడింగ్ మార్చుకోవడం వంటి మోసాలు జరుగుతున్నాయి. అయితే, ఢిల్లీలోని ఈ సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లో విక్రయించే కార్లు కంపెనీ సర్వీస్ రికార్డ్ తో కూడి ఉంటాయని అక్కడి ఓనర్స్ చెబుతున్నారు. అంతేకాకుండా ఒకవేళ ఎవరైనా కార్ మీటర్ రీడింగ్ లో తప్పు ఉందని నిరూపిస్తే కారుతోపాటు భారీ నగదు బహుమతులు కూడా ఇస్తామని వారు చెబుతున్నారు. అన్నిచోట్ల ఇది లేకపోయినా.. కొన్నిచోట్ల మాత్రం రియల్ కార్ రీడింగ్ తో విక్రయిస్తున్నారు..

అలాగే ఈ మార్కెట్లో లగ్జరీ కార్లు కూడా సగం ధరలకే అందుబాటులో ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్, ఆడి, జాగ్వార్ పాటు వోల్వో వంటి బ్రాండ్లు 50% ప్రత్యేకమైన తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఓల్డ్ మోడల్ మెర్సిడెస్ బెంజ్ కేవలం 5 లక్షల రూపాయల నుంచి మాత్రమే ప్రారంభమవుతుంది. అంతేకాకుండా తొమ్మిది లక్షలకే జాగ్వార్ కారు సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీంతోపాటు 2022 మోడల్ సరికొత్త స్కార్పియో కేవలం 16 లక్షలు అందుబాటులో ఉండడం విశేషం. ఇవే కాకుండా మహీంద్రా కు సంబంధించిన అనేక కార్లు అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.

Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్‌లో రూ.30 వేలకే కారు మీ సొంతం!

ఇక్కడ కార్లను కొనుగోలు చేసే వారికి షాప్ ఓనర్స్ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ ను కూడా విక్రయిస్తూ ఉన్నారు. దీంతోపాటు కొన్ని రకాల సదుపాయాలను కూడా అందించడం విశేషం. ముఖ్యంగా ఇక్కడ కొనుగోలు చేసే వారికి అన్ని రకాల కార్లపై లోన్స్ సదుపాయం కూడా అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడికైనా కారు డెలివరీ చేసేందుకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. అలాగే పాత కార్లను ఎక్స్చేంజి చేసుకునే సౌకర్యం కూడా అందిస్తున్నారు. దీంతోపాటు మంచి కండిషన్ లో ఉన్న కార్లను తక్కువ ధరలకు డౌన్ పేమెంట్ మెథడ్ లో విక్రయించడం విశేషం..

Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్‌లో రూ.30 వేలకే కారు మీ సొంతం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Good Friday Wishes 2026: గుడ్‌ఫ్రైడే విషెస్ 2026, మెసేజెస్, గ్రీటింగ్స్, కోట్స్..

Hyderabad, Telangana:

Good Friday 2026 Wishes: గుడ్ ఫ్రైడే 2026 సందర్భంగా మీ సన్నిహితులు, కుటుంబ సభ్యులను శుభాకాంక్షలు తెలిపేందుకు ఎదురు చూస్తున్నారా? అయితే ఈ రకమైన విషెస్‌తో మీ వారినికి ఆకట్టుకునే పండుగ శుభాకాంక్షలు తెలిపే సందేశాలు ఇక్కడ ఉన్నాయి. వాటిలో మీకు నచ్చిన వాటిని ఎంచుకొని మీ స్నేహితులకు, సన్నిహితులకు శుభాకాంక్షలు తెలియజేయండి.
  
క్రిస్టియన్లు ఏప్రిల్ 3న గుడ్‌ఫ్రైడే పండుగను జరుపుకోనున్నారు. ఆ రోజున క్రిస్టియన్ల ఆరాధ్య దైవరం యేసుక్రీస్తును శిలువ వేసిన రోజును గుర్తుగా వారంతా గుడ్‌ఫ్రైడే ను ఊరూరా నిర్వహిస్తారు. ఇదే రోజున తమ సోదరసోదరీమణులు, కుటుంబసభ్యులతో ఈ పండుగ తాలూకూ శుభాకాంక్షలను తెలియజేస్తారు.  మీకు ప్రియమైన వారికి ఏ విధంగా గుడ్‌ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేయాలను ఆలోచిస్తున్నారా? అయితే ఇప్పుడు ఇదే విషయంపై వివరంగా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము. 

మీరు 2026 గుడ్ ఫ్రైడే కోసం అర్థవంతమైన శుభాకాంక్షల కోసం చూస్తున్నట్లయితే, వాట్సాప్, సోషల్ మీడియా లేదా వ్యక్తిగత సందేశాల కోసం మీరు వినియోగించుకునేందుకు తగిన పండుగ శుభాకాంక్షల ఎంపికలు ఇక్కడ ఉన్నాయి. వాటిలో మీకు నచ్చిన సందేశాన్ని ఎంచుకొని మీకు ప్రియమైన వారికి పంపించండి.

1) మీకు మీ కుటుంబసభ్యులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు
2) ఈ గుడ్ ఫ్రైడే మీలో ఆశను, తగిన బలాన్ని ప్రసాదించుగాక
3) శాంతిని, సౌఖ్యాన్ని పెంపొందించే గుడ్ ఫ్రైడే జరుపుకోండి
4) ఈ గుడ్‌ఫ్రైడే నాడు మీ హృదయం విశ్వాసంతో, శాంతితో ఉప్పొంగాలని కోరుకుంటున్నాను.
5) ఈ గుడ్‌ఫ్రైడే నాడు మీకు నా ప్రార్థనలు, శాంతిని పంపుతున్నాను.
6) ఈ రోజు మీ జీవితంలో తగిన ఓదార్పు, ప్రశాంతత లభించుగాక
7) ఈ గుడ్ ఫ్రైడే మన కుటుంబానికి శాంతిని, సంతోషాలను తీసుకురావాలని కోరుకుంటున్నాను.
8) ఈ గుడ్‌ఫ్రైడే రోజున కుటుంబానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు
9) మన ఇల్లు ఎల్లప్పుడూ ప్రేమతో, ప్రశాంతతతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను.
10) గుడ్‌ఫ్రైడే నాడు మనమంతా కలిసి ఎల్లప్పుడూ బలంగా ఉండాలని కోరుకుంటున్నాను.
11) గుడ్‌ఫ్రైడే మీలో శాంతి, సహనం నింపేలా ఉండేలా గుర్తుచేస్తున్నాను.
12) మన కుటుంబానికి శాంతి లభించుగాక
13) ఈ గుడ్ ఫ్రైడే నాడు మీకు శాంతి, మీ కుటుంబంలో సానుకూలత కలగాలని కోరుకుంటున్నాను.
14) ఈ గుడ్‌ఫైడే మీకు ప్రశాంతతను, స్పష్టతను తీసుకురావాలని ఆశిస్తున్నాను.
15) ఈ ప్రత్యేకమైన గుడ్‌ఫ్రైడ్ రోజున మిమ్మల్ని తలచుకుంటున్నాను
16) గుడ్‌ఫ్రైడే నాడు మీ హృదయం తేలికగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను.
17) మీకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు
18) భయంపై విశ్వాసమే ఎల్లప్పుడూ పైచేయి సాధిస్తుంది.
19) గుడ్‌ఫ్రైడే ఈ రోజు ఆశకు గుర్తుగా నిలవాలి.
20) ఈ పర్వదినం రోజున ప్రశాంతమైన మనసుతోనే శాంతి మొదలవుతుంది.
21) మనసులో ఆశ ఎన్నటికీ సన్నగిల్ల కుండా చూడండి.
22) మీకు మరియు మీ ప్రియమైన వారికి గుడ్ ఫ్రైడే 2026 శుభాకాంక్షలు.
23) గుడ్‌ఫ్రైడే రోజున అందరికీ శాంతిని, బలాన్ని ప్రసాదించుగాక
24) గుడ్‌ఫ్రైడే నాడు మీకు నా ప్రార్థనలు, శుభకాంక్షలు తెలియజేస్తున్నాను.
25) అందరికీ శాంతి, సహనంతో కూడిన గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు

గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు పంచుకోవడం అనేది ఈ క్రింది వాటికి ఒక సులభమైన మార్గం. ఈ రోజన మనలో శాంతి, సహనం, సామరస్యాన్ని వ్యాప్తి చేస్తే మంచిది. ప్రియమైనవారితో సంబంధాలు ఎప్పటికీ అలాగే కొనసాగించండి. ఈ రోజుకు తగిన అర్థాన్ని గుర్తుచేసుకోండి. ఒక చిన్న సందేశం (శుభాకాంక్షలు) కూడా ఎదుటివారికి తాము గుర్తుండిపోయామనే భావనను కలిగిస్తుంది.

Also Read: Auto LPG Price Hike: రాష్ట్రంలో భారీగా పెరిగిన ఆటో ఎల్పీజీ ధరలు..లీటరు రూ.106కి అమ్ముతున్న ఫిల్లింగ్ స్టేషన్లు!

Also Read: AP High Court Jobs 2026: నెలకు రూ.1,47,760 జీతం..ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీగా ఉద్యోగాలు..7వ తరగతి చదివితే చాలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Amaravati Capital: ఉభయసభల్లో రాజధాని బిల్లు ఆమోదం.. అధికారికంగా ఏపీ రాజధాని అమరావతి

New Delhi, Delhi:

Amaravati Capital Bill Passed In Rajya Sabha: రాజధాని లేని రాష్ట్రంగా కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్‌కు ఇకపై శాశ్వత రాజధానిగా అమరావతిని చేస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఒక్క రాష్ట్రపతి సంతకం అయితే మాత్రం చట్టంగా రూపుదాల్చనుంది. రాజధాని అమరావతి బిల్లును ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసి బిల్లు పంపించగా ఆ బిల్లును భారత పార్లమెంట్‌ ఆమోదించింది. దీంతో రాజధాని అమరావతి బిల్లు కాస్త చట్టంగా మారింది. ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్దత దక్కడంతో ఆంధ్రప్రదేశ్‌లో సంబరాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ జాక్‌పాట్‌.. ఏపీ ప్రభుత్వం భారీ గిఫ్ట్‌

ఏపీ రాజధాని 'అమరావతి'కి చట్టబద్ధత కల్పించే ‘ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు-2026’కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. లోక్‌సభలో బుధవారం ఆమోదం పొందిన బిల్లును రాజ్యసభలో గురువారం ప్రవేశపెట్టగా ఆ బిల్లును రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. రాజధాని 'అమరావతి' చట్టబద్ధత బిల్లును పార్లమెంట్‌ ఆమోదం తెలపడంతో అది చట్టంగా మారింది. రాష్ట్రపతి ఆమోదముద్ర అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధానిగా 'అమరావతి' నిలవనుంది. ఒక రాష్ట్ర రాజధానికి కేంద్రం చట్టబద్ధత కల్పించడం దేశంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 1953లో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన 'ఆంధ్ర రాష్ట్రం'.. ఇప్పుడు రాజధానికి చట్టబద్ధత పొందిన తొలి రాష్ట్రంగా ఏపీ ప్రత్యేకత సాధించింది.

Also Read: Liquor Shops: రేపు హైదరాబాద్‌లో 24 గంటలు వైన్‌షాపులు, బార్లు బంద్‌

అమరావతికి దీపహారతులు
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుకి ఆమోదం పొందిన తరువాత కూటమి ఎంపీలకు నారా లోకేష్  అభినందనలు తెలిపారు. బిల్లుకు మద్దతు తెలిపిన పలు పార్టీల నాయకులకు కృతజ్ఞతలు చెప్పారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ధన్యవాదాలు తెలిపారు. రాజధానికి పట్టిన గ్రహణం వీడిందని నారా లోకేశ్‌ 'ఎక్స్‌'లో ప్రకటించారు. 'ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత వచ్చింది.. చట్టబద్ధతకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ఈ ఆనంద సమయంలో అమరావతికి దీపహారతులు ఇద్దాం. ఈరోజు రాత్రి 7 గంటలకు అందరం ఇళ్లముందు దీపాలు వెలిగిద్దాం. దీపాలతో సెల్ఫీ తీసుకుని సామాజిక మాధ్యమాల్లో #APThanksIndia హ్యాష్‌ట్యాగ్‌తో అందరం షేర్ చేద్దాం' అని నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు.

Also Read: Liquor Income:లిక్కర్‌తో తెలంగాణ ఖజానా గలగల.. ఏడాదిలో వచ్చిన ఆదాయం ఎంతంటే?

రాజధాని గ్రామాల్లో సంబరాలు
అమరావతికి రాజధానిగా చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంట్‌ ఆమోదం తెలపడంపై రాజధాని గ్రామాల్లో సంబరాలు జరుగుతున్నాయి. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు, ఆయా గ్రామాల ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా మందడం గ్రామస్తులు టపాసులు కాల్చుకుని.. మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.

కమరావతి కాకూడదు
'పార్లమెంట్ ఉభయసభల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని బిల్లును ఆమోదించిన కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి నాది ఒక సూచన. మీరు కట్టేది అమరావతే తప్ప కమరావతి కాకుండా చూచుకోండి. తస్మాత్ జాగ్రత్త!' అని మాజీ రాజ్యసభ సభ్యులు విజయ్ సాయి రెడ్డి హెచ్చరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Auto LPG Price Hike: రాష్ట్రంలో భారీగా పెరిగిన ఆటో ఎల్పీజీ ధరలు..లీటరు రూ.106కి అమ్ముతున్న ఫిల్లింగ్ స్టేషన్లు!

Bengaluru, Karnataka:

Auto LPG Price Hike News: ఇండియన్ ఆయిల్ (IOCL) వంటి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇప్పుడు సామాన్యులకు షాక్ ఇచ్చాయి. ఐఓసీఎల్ ఆధ్వర్యంలో బెంగళూరులో కార్యకలాపాలు చేస్తున్న ఫిల్లింగ్ స్టేషన్లలో ఆటో ఎల్పీజీ (Auto LPG) ధరలు లీటరుకు రూ.11.78 పెంచేందుకు నిర్ణయించారు. అయితే ఈ పెంపు అనేది ఏప్రిల్ 1 నుంచి అములులోకి వస్తుందని తెలియజేశారు. దీంతో ఆటో ఎల్పీజీ ధర లీటరుకు రూ.89.52కు చేరింది. చివరి సవరణ 2026 మార్చి 20న జరగ్గా..అప్పుడు ఎల్పీజీ ధర లీటరుకు రూ.77.74గా విక్రయించారు. అయితే యుద్ధం నేపథ్యంలో ఎల్పీజీ కొరను ఆసరాగా తీసుకోని పలు ప్రైవేట్ ఆటో ఎల్‌పిజి స్టేషన్లు లీటరుకు రూ.106 వరకు వసూలు చేస్తున్నాయని ఆటో డ్రైవర్లు ఫిర్యాదు చేస్తున్నారు.

బెంగళూరులోని ఓ ఆటో డ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. ఆటో ఎల్‌పిజి ఫిల్లింగ్ స్టేషన్లు డ్రైవర్లను దోచుకుంటున్నాయని ఆరోపించారు. "ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ (IOCL) నిర్ణయించిన ఆటో ఎల్‌పిజి ధర రూ.89.52 విక్రయిస్తుండగా.. బెంగళూరులోని అనేక ప్రైవేట్ చమురు ఫిల్లింగ్ స్టేషన్లు లీటరుకు రూ.106 వరకు ఆటో డ్రైవర్ల నుంచి వసూలు చేస్తున్నాయి. అందులోనూ ఆటో ఎల్పీజీ కోసం 2 కిలోమీటర్ల వరకు క్యూలో వేచి చూడాల్సి వచ్చేంది." అని ఆటో డ్రైవర్ సంఘాలు తెలిపాయి. ధరలు ఇప్పటికే ఆకాశాన్ని అంటగా..ఇప్పుడు ఆటో గ్యాస్ గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంద
చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఆటో గ్యాస్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఈ పరిస్థితిలో ఆటో డ్రైవర్లు ఎలా బ్రతుకుతారు?

పశ్చిమ ఆసియాలో ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు 2026 ఫిబ్రవరి 28న ప్రారంభమయ్యాయి. ఆ రోజు నుంచి ఆయా దేశాల సమన్వయ దాడులు నేపథ్యంలో ప్రతీకార చర్యలు భారీగా మొదలయ్యాయి. దీంతో ప్రపంచంలోని ఇంధన వాణిజ్య మార్గమైన కీలక హోర్ముజ్ జలసంధి నుంచి నౌకాయానానికి అంతరాయం ఏర్పడింది. ఈ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలను పెరిగిన క్రమంలో ఇంధన సరఫరాకు అంతరాయం కలిగించింది.

ఆటో ఎల్పీజీ ఇంధన కొరత కారణంగా ఆటో డ్రైవర్లు కూడా ప్యాసింజర్స్ నుంచి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఎల్పీజీ ధరలు కూడా భారీగా పెంచినట్లు ఓ ఆటో ఎల్పీజీ డీలర్ తెలియజేశారు. "గత వారం ఒక టన్ను ఎల్‌పిజి ధర సుమారు రూ.60,000 ఉండేది. ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దాని ధర దాదాపు రూ. 1.90 లక్షలకు చేరింది. సరఫరా సరిపోవడం లేదు. చాలా ఫిల్లింగ్ స్టేషన్లు మూతపడుతున్నాయి, ఉన్నవాటిలో కొన్ని ఎక్కువ వసూలు చేస్తున్నాయి," అని ఆ డీలర్ అన్నారు.

అయితే కర్ణాటక రాష్ట్రంలో ఆటో ఎల్పీజీ కొరత లేదని ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది. మార్చి 29, 2026 నాటి పత్రికా ప్రకటనలో.. ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలచే నిర్వహిస్తున్న కర్ణాటక వ్యాప్తంగా ఉన్న 72 ఆటో ఎల్పీజీ డిస్పెన్సింగ్ స్టేషన్లలో (ALDS), బెంగళూరులోని 31 స్టేషన్లతో సహా ఆటో ఎల్‌పీజీ సులభంగా అందుబాటులో ఉందని ఆ శాఖ పేర్కొంది.

"గతంలో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) రోజుకు సగటున 64.9 మెట్రిక్ టన్నుల ఆటో LPGని పంపిణీ చేశాయి. ఈ యుద్ధానికి ముందు ఈ పంపిణీ 57.6 మెట్రిక్ టన్నులుగా ఉండేది. ఇది సరఫరాలో పెరుగుదలను సూచిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ సరఫరా అవుతున్న సుమారు 4 లక్షల గృహ వినియోగ LPG సిలిండర్లు, దాదాపు 18,000 వాణిజ్య LPG సిలిండర్లకు ఇది అదనం" అని అది పేర్కొంది. అన్ని రంగాలకు నిరంతరాయంగా LPG సరఫరాను నిర్ధారించడానికి రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉందని తెలిపింది.

Also Read: Bank Holiday April 2026 List: షాకింగ్ న్యూస్..ఏకంగా 12 రోజులు సెలవులు..బ్యాంకు ఉద్యోగులకు పండగే..ఎందుకంటే?

Also Read: Russia Petrol Export Ban: భారత్‌కు పెట్రోల్ ఎగుమతిపై నిషేధం..ఏప్రిల్ 1 నుంచి అన్నీ బంద్..భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ జాక్‌పాట్‌.. ఏపీ ప్రభుత్వం భారీ గిఫ్ట్‌

Nuzendla, Andhra Pradesh:

AP Govt Employees Jackpot: ప్రభుత్వ ఉద్యోగులతోపాటు పింఛన్‌దారులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది. కొంతకాలంగా భారీగా పేరుకుపోయిన బిల్లులను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లుల విడుదలకు రూ.7 వేల కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మిగిలిన సమస్యలు కూడా త్వరలోనే పరిష్కరిస్తామని ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సత్వరమే పెండింగ్‌ బిల్లులను విడుదల చేయాలని ఆదేశించడంతో ఉద్యోగ వర్గాలకు భారీ ఊరట లభించనుంది.

Also Read: Liquor Shops: రేపు హైదరాబాద్‌లో 24 గంటలు వైన్‌షాపులు, బార్లు బంద్‌

ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఉపశమనం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిల చెల్లింపులపై కసరత్తు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నిధుల లభ్యతను బట్టి ఉద్యోగులకు చెల్లింపులు జరిపేలా ఆర్థిక మంత్రి పయ్యావుల కసరత్తు చేస్తున్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లుల్లో రూ.7059 కోట్లు విడుదలకు ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను ప్రణాళికాబద్దంగా ప్రభుత్వం చెల్లించనుంది.

Also Read: Liquor Income:లిక్కర్‌తో తెలంగాణ ఖజానా గలగల.. ఏడాదిలో వచ్చిన ఆదాయం ఎంతంటే?

పెండింగ్‌ బిల్లుల చెల్లింపుల్లో ప్రావిడెంట్ ఫండ్ కింద రూ.1,847.83 కోట్లు, గ్రాట్యూటీ కింద రూ.3,411.03 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ రూ.1,800 కోట్లు, పోలీసులకు అదనపు సరెండర్ లీవులు రూ. 223.47 కోట్ల బిల్లులు విడుదలయ్యాయి. ఇక గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ నిమిత్తం 4,793 మంది ఉద్యోగులకు రూ.76 కోట్ల చెల్లింపులు ప్రభుత్వం చేసింది. రూ.7059 కోట్ల మేర బిల్లులకు చెల్లింపుల ప్రక్రియను ఆర్థిక శాఖ ప్రారంభించింది. ఇప్పటికే ప్రావిడెంట్ ఫండ్ కింద రూ.1,847.83 కోట్లను ప్రభుత్వం ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసింది. జీఎల్ఐ కింద రూ.76 కోట్ల మేర చెల్లింపులు పూర్తి చేసింది. వివిధ శాఖలకు మెటీరియల్ సరఫరా చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకు రూ.614 కోట్ల మేర పెండింగ్ బిల్లుల చెల్లింపులు క్లియర్‌ చేసింది. మరికొన్ని బకాయిలు ఉండడంతో వాటిని త్వరగా ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించనున్నారు. ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులకు ఉద్యోగుల అంశంపై చర్చలు జరిపి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. సీఎం, మంత్రి ఆదేశాలతో ఆర్థిక శాఖ కొన్ని రోజుల్లోనే బకాయిలకు సంబంధించిన రూ.7 వేల కోట్లు విడుదల చేయనుంది.

Also Read: LSG vs DC Highlights: లక్నోకు ఘోర ఓటమి.. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌

ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలు
తమకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులు విడుదల కానుండడంతో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్మెంట్‌ పొందిన ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు బిల్లులు మంజూరు కాక పడుతున్న తీవ్ర ఇబ్బందులు తీరనున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపడంపై ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు సీఎం చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. మిగిలిన డీఏ, పీఆర్‌సీ వంటి సమస్యలు కూడా పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Hanuman: హనుమంతుడి ఒళ్లంతా సింధూరం.. సీతమ్మ చెప్పిన ఆ మాటే కారణమా?

Hyderabad, Telangana:

Hanuman Wears Sindoor Story: రామాయణంలో హనుమంతుడి భక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే.. రామనామమే శ్వాసగా.. రామసేవయే ధ్యానంగా బ్రతికిన మహాబలిశాలి ఆయన.. అయితే మనం హనుమంతుడి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆయన విగ్రహం ఎక్కువగా సింధూరంతో మెరుస్తూ కనిపిస్తుంది. ఆంజనేయుడు ఒళ్లంతా సింధూరం పూసుకోవడం వెనక ఉన్న అసలైన కథ ఏంటో మీకు తెలుసా? ఇది ఇప్పటికీ చాలామందికి తెలియదు చాలామందికి తెలియదు. అది ఆయన భక్తితో పాటు అమాయకత్వానికి నిదర్శనమని పురాణాలు చెబుతున్నాయి. అయితే, ఆయన విగ్రహానికి ఎందుకు సింధూరం ఉంటుందో మనం  ఇప్పుడు తెలుసుకుందాం..

రావణ సంహారం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు రాజవ్వాల్సిన సమయం అది.. ఒకరోజు సీతాదేవి తన నుదుట ఎర్రటి సింధూరాన్ని ధరించడాన్ని హనుమంతుడు గమనించాడు. ఆశ్చర్యంతో ఆమె వద్దకు వెళ్లి.. తల్లి, నువ్వు ప్రతిరోజు నీ నుదుట ఈ ఎర్రటి పొడిని ఎందుకు ధరిస్తావు అని ప్రశ్నించాడు.. అప్పుడు సీతమ్మ నవ్వుతూ.. హనుమా.. ఇది సింధూరం.. దీనిని ధరిస్తే నా పతి అయిన శ్రీరాముడికి ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి.. ఆయన ఎల్లప్పుడూ క్షేమంగా ఉంటారు అని సమాధానం అందించారు..

సీతమ్మ మాట విన్న హనుమంతుడు ఆలోచనలో పడ్డాడు.. కేవలం నుదుట కొద్దిగా సింధూరం ధరిస్తేనే నా ప్రభువుకి అంతటి క్షేమం చేకూరితే.. ఇక నా ఒళ్లంతా సింధూరం పూసుకుంటే ఆయనకు ఇంకెంత మేలు జరుగుతుంది? అని భావించాడు.. వెనుక ముందు ఆలోచించకుండా.. హనుమంతుడు వెంటనే వెళ్లి తన శరీరం అంతట సింధూరాన్ని దట్టంగా పూసుకున్నాడు.. ఆ రూపంతోనే నేరుగా శ్రీరాముడి దర్బార్కు చేరుకున్నాడు..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

హనుమంతుడి వింత రూపాన్ని చూసి సభలో వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు.. శ్రీరాముడు నవ్వుతూ కారణము అడగగా.. ప్రభు.. మీరు కలకాలం ఆరోగ్యంగా.. నిండు నూరేళ్లు వర్ధిల్లాలని నా శరీరం అంత సింధూరం పూసుకున్నాను.. అని హనుమ జవాబు ఇచ్చాడు.. ఆ మాటలకు శ్రీరాముడు చలించి పోయాడు.. ఆంజనేయుడికి తనపై ఉన్న భక్తిని, ప్రేమని చూసి ముగ్ధుడయ్యాడు.. వెంటనే శ్రీరాముడు హనుమంతుడిని ఆశీర్వదిస్తూ.. హనుమా.. ఇకపై ఎవరైతే నిన్ను సింధూరంతో పూజిస్తారో.. వారికి నా సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.. అని వరం ప్రసాదించాడు.. నాటి నుంచి హనుమంతుడికి సింధూరం సమర్పించడం ఒక సాంప్రదాయంగా మారింది. ఈ సింధూర ధారణ భక్తులకు శక్తితో పాటు అద్భుతమైన ధైర్యాన్ని నమ్మకాన్ని అందిస్తుంది..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Honda Shine రూ.45 వేలు.. TVS Rider కేవలం రూ.50వేలే.. సగం ధరకే మీ సొంతం!

Hyderabad, Telangana:

Second Hand Bikes In Hyderabad Telugu: ఎప్పటినుంచో మంచి మోటార్ సైకిల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు.. హైదరాబాద్ లోని ఆటోనగర్ లో ఉన్న శ్రీరామ్ ఆటో మాల్ వేదికగా నిర్వహించిన బ్యాంకు  సీజ్డ్ వాహనాల వేలం పాటలో సామాన్యులకు ఊహించని ధరలకే అత్యాధునిక మోడల్ వాహనాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈఎంఐ సకాలంలో చెల్లించని కారణంతో బ్యాంకులు స్వాధీనం చేసుకున్న 185 బైకులపై వేలం వేశారు. ఇందులో భాగంగా ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన బైకులు 50 శాతం కంటే తక్కువ ధరలకే అందుబాటులోకి వచ్చాయి. ఏడాది కింది మోడల్స్ సైతం అత్యంత తక్కువ ధరలోని అందుబాటులోకి రావడం విశేషం. 

ఈ వేళలో భాగంగా ప్రధాన ఆకర్షణ ఏంటంటే.. 2024 సంవత్సరం మోడల్ బైక్స్‌తో పాటు.. 2025 సంవత్సరం మోడల్ వాహనాలు కూడా సగం ధరలకే అందుబాటులో ఉండడం. ముఖ్యంగా హోండా ఎస్పీ 125, టీవీఎస్ రైడర్, యమహా R15, హీరో స్ప్లెండర్ వంటి పాపులర్ మోడళ్లు వేలంలో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. చాలామంది ఈ వేలంలో పాల్గొని సగం ధరలకే వీటిని కొనుగోలు చేశారు. మంచి కండిషన్ కలిగిన బైక్లను వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడ్డారు..

ఇక ఈ  వేలంలో ఉన్న బైక్ లకు సంబంధించిన ధరల వివరాల్లోకి వెళ్తే..2024 మోడల్ హోండా ఎస్పీ 125 బైక్ రూ. 45,000 నుంచి రూ. 60,000 మధ్య ధర పలకగా.. 2025 మోడల్ టీవీఎస్ రైడర్ కేవలం రూ. 50,000లకే సోల్డ్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా స్పోర్ట్స్ బైక్ ప్రియుల కోసం యమహా R15 V4 మోడల్ రూ. 1.40 లక్షలకు అందుబాటులో ఉంది. అలాగే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ..2025 మోడల్ టీవీఎస్ స్పోర్ట్ వాహనం కేవలం రూ. 30,000కే వేలంలో అమ్ముడైంది.. ఇలా వివిధ బ్రాండ్లకు సంబంధించిన మోటార్ సైకిల్స్ అత్యంత తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చాయి..

ప్రతి శనివారం నిర్వహించే ఈ వేలం పాటలో పాల్గొనే వారు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. ఇందులో భాగంగా ముందుగానే శ్రీ రామ్ ఫైనాన్స్ కంపెనీకి రూ. 10,120 డిపాజిట్ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా.. వెంట తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ వేలంలో ఏ వాహనం కొనుగోలు చేయలేకపోతే.. చెల్లించిన డిపాజిట్ మొత్తాన్ని అక్కడికక్కడే తిరిగి ఇచ్చేస్తారు.. వాహనాన్ని దక్కించుకున్న వారు ఒక వారం రోజుల్లో పూర్తి మొత్తాన్ని చెల్లించి వాహనాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది..

Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్‌లో రూ.30 వేలకే కారు మీ సొంతం!

చాలా వాహనాలు ఆర్‌టీఓ ఫారమ్స్ (RTO Forms) తో వస్తున్నాయి. అంటే ఒరిజినల్ ఆర్‌సీ లేకపోయినా, ఫైనాన్స్ కంపెనీలు ఫామ్ 35, 36 వంటి పత్రాలను అందిస్తాయి. వీటితో వాహనాలు కొనుగోలు చేసిన వారంతా వాటిని తమ పేరు మీద సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కొన్ని వాహనాలపై పెండింగ్ జవాన్లు ఉన్నప్పటికీ.. వాటిని కొనుగోలుదారులే చెల్లించాల్సి ఉంటుంది. తక్కువ ధరలు కొత్త వాహనం కొనాలనుకునే మధ్య తరగతి ప్రజలకు ఈ వేలం మంచి వేదికగా నిలుస్తోంది. మరిన్ని వివరాల కోసం ప్రతి శనివారం ఉదయం 10 సమయంలో ఆటోనగర్ శ్రీరామ్ ఆటో మాల్ సందర్శించవచ్చు.

Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్‌లో రూ.30 వేలకే కారు మీ సొంతం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement
Advertisement
Back to top