icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
500008
RSRajesh SharmaFollow22 Jun 2024, 10:47 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Career Options After 10th: 10వ తరగతి తర్వాత ఏం చేయాలి? ఏ కోర్సు తీసుకుంటే కెరీర్ బాగుంటుంది?

Hyderabad, Telangana:

Career Options After 10th Class: ఇరు తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి ఫలితాలు వచ్చేశాయి. పదో తరగతి పూర్తైన తర్వాత ఏం చేయాలి? అని ప్రతి విద్యార్థితో పాటు వారి తల్లీదండ్రులను వెంటాడే ప్రశ్న. మనలో చాలామందికి పెద్ద పెద్ద చదువులకు ఖర్చు పెట్టే అంత స్థోమత దిగువ మధ్య తరగతి కుటుంబాలకు ఉండకపోవచ్చు. విద్యార్థుల్లో అధికంగా ఇంటర్మీడియట్ వైపు మళ్లుతుండగా.. ప్రస్తుతం అనేక సాంకైతిక, వృత్తిపరమైన కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. తక్కువ  సమయంలోనే నైపుణ్యాలను పొందుతూ త్వరగా ఉద్యోగ అవకాశాలను పొందేందుకు అవకాశం ఉంది. వాటిలో ఉత్తమ ఎంపిక ఏదో తెలుసుకుందాం.
 
పాలిటెక్నిక్ డిప్లొమా
ఇంజనీరింగ్ కోర్సుల్లో ముందుగానే ప్రవేశించాలనుకునే వారికి పాలిటెక్నిక్ డిప్లొమా అనేది మంచి ఎంపిక. అయితే ఇది మూడేళ్ల పాటు సాగే కోర్సు. ఇందులో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ వంటి బ్రాంచ్‌లు ఉంటాయి. ఈ పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థులు లెటరల్ ఎంట్రీ ద్వారా సాంకేతిక డిగ్రీ కోర్సు బీటెక్‌లో రెండో ఏడాది నుంచి కొనసాగించే అవకాశం ఉంది. 

ఐటీఐ 
సాంకేతిక పనులపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఐటీఐ కోర్సు మంచి ఎంపికగా ఉంటుంది. 1 లేదా 2 ఏళ్లలో ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఫిట్టర్, ప్లంబర్, కంప్యూటర్ ఆపరేటర్, మెకానిక్ వంటి ట్రేడ్‌లను నేర్చుకోవచ్చు. ఐటీఐ పూర్తి చేసిన తర్వాత రైల్వేలు, ప్రైవేట్ కంపెనీలు, ఫ్యాక్టరీలు, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే వీటి ప్రారంభ జీతం రూ.15,000 నుంచి రూ.30,000 వరకు ఉంటుంది. 

డిజిటల్ మార్కెటింగ్
నేటి కంప్యూటర్ యుగంలో వేగంగా ఎదుగుతున్న రంగాల్లో డిజిటల్ మార్కెటింగ్ కూడా ఉంది. కేవలం 3 నెలల నుండి 12 నెలల్లో పూర్తి చేయగలిగిన ఈ కోర్సులో SEO, ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ ప్రమోషన్ వంటి స్కిల్స్ నేర్పిస్తారు. డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగాలతో పాటు సొంతంగా వ్యాపారం ప్రారంభించుకునే అవకాశం ఉంది. ఈ రంగంలో ప్రారంభ ఆదాయం రూ.20,000 నుండి రూ.40,000 వరకు ఉంటుంది.

పారామెడికల్ కోర్సులు
హెల్త్ సెక్టార్‌లో ఎదగాలి అనుకునే వారికి పారామెడికల్ కోర్సు ఓ మంచి ఎంపిక. నర్సింగ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఎక్స్-రే టెక్నీషియన్ వంటి కోర్సులు ఇందులో ఉంటాయి. 1 లేదా 2 ఏళ్లుగా సాగే కోర్సును పూర్తి చేసిన తర్వాత క్లినిక్స్, ఆస్పత్రులు, డయాగ్నిసిస్ ల్యాబ్స్ వంటి వాటిలో ఉద్యోగాలు పొందవచ్చు. వీటిలో ప్రారంభ జీతం రూ.15,000 నుంచి రూ.25,000 వరకు ఉంటుంది.

కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ నెట్‌వర్కింగ్
కంప్యూటర్స్, ల్యాప్‌టాప్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్ రంగానికి మంచి గిరాకీ ఉంది. 6 నెలల నుంచి 1 ఏడాదిలోపు ఉండే ఈ కోర్సు పూర్తి చేసిన వెంటనే.. కంప్యూటర్ సర్వీస్ సెంటర్లు, ఐటీ కంపెనీల్లో టెక్నిషియన్‌గా లేదా సొంత వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశం ఉంది. ఆదాయం మీరు ఎంచుకున్న మార్గాన్ని బట్టి మారుతుంది.

అయితే, 10వ తరగతి తర్వాత సరైన కోర్సు ఎంపిక మీ జీవితాన్ని, దాని భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. మీ వ్యక్తిగత ఆసక్తి, మీకు ఉన్న నైపుణ్యాలకు అనుగుణంగా సరైన ఎంపిక చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఇప్పుడు వేసే తొలి అడుగు.. మీ జీవితాంతం కొనసాగుతుంది. మంచి కెరీర్ నిర్మాణానికి మంచి రంగంలోకి ఎంపిక ఇప్పుడే అవసరం. 

Also Read: MI Vs SRH Match: రికెల్డన్ సెంచరీ వృథా..ముంబైని దంచికొట్టిన సన్‌రైజర్స్ బ్యాటర్లు..వరుసగా ఐదో విజయం!

Also Read: Riyan Parag Vape: రియాన్ పరాగ్ అరెస్ట్ తప్పదా?? ఐపీఎల్ మ్యాచ్‌ల్లో రాజస్థాన్ కెప్టెన్‌ను బ్యాన్ చేస్తారా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

MI Vs SRH Match: రికెల్డన్ సెంచరీ వృథా..ముంబైని దంచికొట్టిన సన్‌రైజర్స్ బ్యాటర్లు..వరుసగా ఐదో విజయం!

Mumbai, Maharashtra:

MI Vs SRH Match 2026: ఐపీఎల్ వేదికగా నేడు జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలుపొందింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ టీమ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. హైదరాబాద్ టీమ్‌కు ఇది వరుసగా ఐదో విజయం కావడం విశేషం. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానం నుంచి సన్‌రైజర్స్ మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుత లీగ్ ఇప్పటి వరుకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 6 మ్యాచ్‌లు గెలిచి, 3 మ్యాచ్‌ల్లో ఓడింది.

మరోపక్క ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో సతమతమవుతుండగా..ఈ లీగ్‌లో ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలోనే గెలవడం గమనార్హం. కేవలం 4 పాయింట్లతో టేబుల్‌లో 9వ స్థానంలో ముంబై కొనసాగుతోంది. 244 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆరంభంలో ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. అభిషేక్ శర్మ 45 పరుగులతో ఆకట్టుకోగా.. 30 బంతుల్లో 76 పరుగులతో ట్రావిస్ హెడ్ చెలరేగాడు.

ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ డకౌట్ అవ్వగా.. క్లాసెన్ 65 పరుగులతో విజృభించగా, నితీష్ కుమార్ రెడ్డి (21) సన్‌రైజర్స్ జట్టును ఆదుకున్నారు. చివరిగా వచ్చిన సలీల్ 10 బంతుల్లో 30 పరుగులు రాబట్టి చివరి షాట్‌తో విజయాన్ని అందించాడు. మరోవైపు ముంబై బౌలర్లలో ఘజాఫర్  2 వికెట్లు పడగొట్టగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ట్రెండ్ బౌల్ట్ చెరో వికెట్ సాధించాడు. 

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 పరుగులను రాబట్టింది. ఓపెనర్లు అద్భుతంగా రాణించగా.. రైన్ రికెల్డన్ (123) సెంచరీ సాధించగా, అది ఇప్పుడు వృథా అయ్యింది. విల్ జాక్స్ (46) పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్ 5 పరుగులతో మరోసారి విఫలమయ్యాడు. ఆ వెంటనే క్రీజ్‌లోకి వచ్చిన నమన్ ధీర్ (22), హార్దిక్ పాండ్యా 31 పరుగులతో తమదైన స్టైల్లో జట్టు స్కోర్ బోర్డు పరుగులు పెట్టడంలో కృషి చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ 2 వికెట్లు పడగొట్టగా.. ఇషాన్ మలింగ్, షకీబ్ హుస్సేన్, నితీష్ కుమార్ రెడ్డి చెరో వికెట్ సాధించారు. 

Also Read: Riyan Parag Vape: రియాన్ పరాగ్ అరెస్ట్ తప్పదా?? ఐపీఎల్ మ్యాచ్‌ల్లో రాజస్థాన్ కెప్టెన్‌ను బ్యాన్ చేస్తారా?

Also Read: Exit Poll Results 2026: హీరో విజయ్ సీఎం అవుతాడా? పశ్చిమబెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందా? 2026 అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
0
Report

Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. ఆరోగ్య పథకంపై బిగ్‌ అప్‌డేట్‌ ఇదే!

Baddipadaga, Telangana:

Employees Health Scheme: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త ఇది. ఆరోగ్య పథకానికి సంబంధించి ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈహెచ్‌ఎస్‌ పథకం అమలు కోసం విధివిధానాల ఖరారయ్యాయని తెలుస్తోంది. ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఆరోగ్య పథకానికి సంబంధించి ఉద్యోగుల ప్రతినిధులు చర్చించి తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

Also Read: Singer Mangli: యూట్యూబ్‌ చానళ్లపై మంగ్లీ ఫిర్యాదు! మేనేజర్‌ తీవ్ర ఆరోపణలు

హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన బుధవారం ఉద్యోగుల ఆరోగ్య భద్రత పథకం అమలు అంశంపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సెంట్రల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, ఇతర ప్రతినిధులు పులగం దామోదర్ రెడ్డి, చావ రవి, వంగ రవీందర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, రిటైర్డ్‌ ఉద్యోగుల తరఫున ముజీబ్ హుస్సేన్, బి. శ్యామ్, దాస్య నాయక్, రమేష్, లక్ష్మయ్య,  మహమ్మద్ అబ్దుల్లా, ఉమాదేవి పాల్గొన్నారు.

Also Read: AP Summer Camps: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. త్వరలో 1,389 సమ్మర్‌ క్యాంపులు

ఈ పథకం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఆ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఆరుగురు సభ్యులు, పెన్షనర్ల నుంచి ఇద్దరు సభ్యులు ఉంటారు. అదనంగా ప్రభుత్వ ఉద్యోగులలో ఒకరిని సీఈఓగా రాష్ట్ర ప్రభుత్వం నియమించనుంది. ఉద్యోగులు, పెన్షనర్ల బేసిక్ పే లో 1.5 శాతం మొత్తాన్ని కంట్రిబ్యూషన్‌గా తీసుకోవాలని ఆ మొత్తానికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు వాటాగా నిధులు జమ చేస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు . నగదు రహిత వైద్య సేవల కోసం అర్హత కలిగిన 515 ఆసుపత్రులను ప్రస్తుతానికి గుర్తించామని.. ఈ ఆరోగ్య పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని నిర్ణయించారు.

పోలీస్ శాఖకు ఆరోగ్య భద్రత పథకం కింద, ఎక్సైజ్ శాఖకు సహాయత పథకం కింద ఆరోగ్య పథకాలు అమలులో ఉన్నాయి. భవిష్యత్తులో ఆ శాఖల ఉద్యోగులను కూడా ఈహెచ్‌ఎస్‌ పథకంలో చేర్చే విషయాన్ని పరిశీలిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అవసరమైన విధి విధానాలను 15 రోజులలోగా సిద్ధం చేసి.. 45 రోజులలోగా ముఖ్యమంత్రి ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Riyan Parag Vape: రియాన్ పరాగ్ అరెస్ట్ తప్పదా?? ఐపీఎల్ మ్యాచ్‌ల్లో రాజస్థాన్ కెప్టెన్ బ్యాన్ చేస్తారా?

Hyderabad, Telangana:

Riyan Parag Vape Incident: ఐపీఎల్ 2026లో నిన్న జరిగిన పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ ర్యాన్ పరాగ్ ఒక చిక్కులో పడ్డాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో అతను చేయకూడని పని చేస్తూ కెమెరాకు చిక్కాడు. దీనివల్ల అతని అరెస్టు తప్పదంటూ వార్తలు వస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ-సిగరెట్ వినియోగిస్తూ కెమెరాకు చిక్కడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. లైవ్ మ్యాచ్‌లో డ్రైస్సింగ్ రూమ్ నుంచి రియాన్ సిగరెట్ తాగుతున్న వీడియో క్లిప్ ఇప్పుడు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. 

సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో.. రియాన్ పరాగ్‌ను అరెస్ట్ చేస్తారా లేదా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఎందుకంటే, ప్రత్యక్ష ప్రసారం అవుతున్న మ్యాచ్ సమయంలో ఈ-సిగరెట్ తాగడం యువతకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది? అనే విధంగా చర్చ జరుగుతోంది. 

అయితే ఈ ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాగ్ పరాగ్ అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్ష్య ఛేదన సమయంలో, 16 బంతుల్లో 29 పరుగులు చేసి ఔటయ్యాక రియాన్ పరాగ్ నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాడు. అలా వచ్చి రాగానే రియాన్ పరాగ్ వేపింగ్ చేయడం మొదలుపెట్టాడు. అది కాస్త కెమెరాకు చిక్కింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఇప్పుడు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇదే విషయమై రియాన్ పరాగ్‌పై క్రిమినల్ చర్యలు తీసుకుంటారా అని బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియాను అడిగారు. అయితే, క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెబుతున్నారు.

ఎలక్ట్రానిక్ సిగరెట్ నిషేధ చట్టం (PECA) 2019 ప్రకారం.. వేప్‌లు, ఇ-సిగరెట్ల తయారీ, అమ్మకం, దిగుమతి, ప్రకటనలను భారత ప్రభుత్వం నిషేధించింది. వీటిని సేవించకూడదని స్పష్టం చేసింది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడుతుంది. అదేవిధంగా, నేరం రుజువైతే రియాన్ పరాగ్ కు రూ.లక్ష జరిమానాతో పాటు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. అయితే ఈ ఘటన క్రికెట్ స్టేడియంలో జరగడం వల్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

స్టేడియంలో వంటి బహిరంగ ప్రదేశాలలో ధూమపానం లేదా వేపింగ్ చేయడం నేరపూరితమైనది. రియాన్ పరాగ్‌పై కొన్ని మ్యాచ్‌ల నిషేధం విధించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి బీసీసీఐ నిర్ణయంపైనే ఉంది. 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్న రియాన్ పరాగ్ ఇప్పటికే బ్యాటింగ్ వైఫల్యంతో బాధపడుతున్నాడు. ఇప్పుడు వేపింగ్ చేస్తూ వీడియోలో చిక్కి వైరల్ అవుతున్నాడు. పంజాబ్‌తో మ్యాచ్‌కు రియాన్ పరాగ్ ఆడిన 7 ఇన్నింగ్స్‌లలో కేవలం 81 మాత్రమే చేసి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 

Also Read; Exit Poll Results 2026: హీరో విజయ్ సీఎం అవుతాడా? పశ్చిమబెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందా? 2026 అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్..

Also Read: Tamil Nadu Exit Poll: తమిళనాడులో హీరో విజయ్ సీఎం అవుతాడా? ఎగ్జిట్ పోల్స్ సర్వే ఏం చెబుతోంది?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Tamil Nadu Exit Poll: తమిళనాడులో హీరో విజయ్ సీఎం అవుతాడా? ఎగ్జిట్ పోల్స్ సర్వే ఏం చెబుతోంది?

Nagalapuram, Tamil Nadu:

Tamil Nadu Exit Poll 2026: తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మ‌రోసారి అధికారం చేప‌ట్ట‌నుంద‌ని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 84 శాతంపైగా ఓటింగ్ నమోదవ్వగా.. గత 2021 ఎన్నికల కంటే 11 శాతం ఎక్కువగా ఓటింగ్ పెరిగింది. తమిళనాడు చరిత్రను పరిశీలిస్తే గత నాలుగు దశాబ్దాల్లో రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారే సంప్రదాయం ఉంది. అయితే 2016లో మాత్రం జయలలిత నేతృత్వంలో ఏఐడీఎంకే వరుసగా రెండోసారి అధికారం చేపట్టారు. ఇప్పుడు డీఎంకే కూడా రెండోసారి అధికారం చేపట్టే అవకాశాలున్నట్టు సర్వేలో తేలింది. 

అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకే కూటముల మధ్య తీవ్ర పోటీ ఉన్నా డీఎంకే ఆధిపత్యం కనిపిస్తోందని సర్వేలో తేలింది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ రెండు కూటములకు గట్టి పోటీ ఇస్తుందని సర్వేలో వెల్లడైంది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు. డీఎంకే కూటమి 125-145 స్థానాలతో అధికారం చేప‌ట్ట‌నుంద‌ని సర్వేలో తేలింది. ఏఐడీఎంకే 65-80 స్థానాలతో మరోసారి ప్రతిపక్షానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. టీవీకే 18-24 స్థానాలు, ఇతరులు 2-6 స్థానాలు గెలుపొందే అవకాశాలున్నాయి.

అలాగే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి 38.4 శాతం, ఏఐడీఎంకే 31.5 శాతం, టీవీకే 23.6 శాతం, ఇతరులు 6.5 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నట్లు పీపుల్స్ సర్వే చెబుతోంది. ఎన్నికల సర్వేలో 3 శాతం ప్లస్ ఆర్ మైనస్ ఉండే అవకాశం ఉందని తెలిపింది.

మహిళలు డీఎంకేకు 37.8 శాతం, ఏఐడీఎంకేకు 30.2 శాతం, టీవీకేకు 26 శాతం, ఇతరులకు 6 శాతం మద్దతివ్వగా... పురుషులు డీఎంకేకు 39.5 శాతం, ఏఐడీఎంకేకు 32.6 శాతం, టీవీకేకు 21.1 శాతం, ఇతరులకు 6.8 శాతం మద్దతిచ్చినట్లు తేలింది. అలాగే రాష్ట్రంలోని యువ ఓటర్లు అనగా 18 నుండి 24 ఏళ్ల మధ్య నూతన యువ ఓటర్లలో డీఎంకేకు 34.9 శాతం, ఏఐడీఎంకు 25.8 శాతం, టీవీకేకు 32.3 శాతం, ఇతరులకు 7 శాతం మద్దతిచ్చినట్టు సర్వేలో తేలింది. సినీ నటడు విజయ్ యువ ఓటర్లపై భారీ ఆశలు పెట్టుకున్నా అధికార డీఎంకే వైపు యువత మొగ్గు చూపినట్టు సర్వేలో వెల్లడైంది.

డీఎంకే, ఏఐడీఎంకే ప్రత్యక్షంగా పోటీ పడకుండా వారి మిత్రపక్షాలు పోటీ పడిన స్థానాల్లో టీవీకే గట్టి పోటీ ఇచ్చిందని సర్వేలో తేలింది. ప్రధాన అభ్య‌ర్థుల‌ స్థానాలను పరిశీలిస్తే డీఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ కొలతూరులో, ఏఐడీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి ఎడప్పాడిలో విజయం దిశగా కొనసాగుతారని పీపుల్స్ సర్వే చెప్పింది. మరో ఏఐడీఎంకే మాజీ సీఎం పన్నీరు సెల్వం ఎన్నికల ముందు డీఎంకేలో చేరి బోడినాయకనూర్ నుండి పోటీ చేస్తుండగా అక్కడ టీవీకే నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.

సినీ నటుడు టీవీకే అధినేత విజయ్ రెండు స్థానాల్లో పోటీ చేస్తుండగా పెరంబూర్ నుండి గెలిచే అవకాశాలుండగా, ఈస్ట్ తిరుచిరాపల్లిలో వెనకబడినట్టు సర్వేలో తేలింది. అలాగే డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చపాక్ నుండి పోటీ పడుతుండగా ఆయన అక్కడ టీవీకే పార్టీ నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.

శ్రీపెరంబదూర్ నుండి పోటీలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సెల్వ అక్కడ టీవీకే చేతిలో వెనుకబడినట్టు సర్వేలో తేలింది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ మైలాపూర్‌లో బీజేపీ తరఫున పోటీ పడుతుండగా ఆమె టీవీకే చేతిలో ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తమిళనాడు బీజేపీ చీఫ్ నయనార్ నాగేందర్ పోటీ పడుతున్న సత్తూరులో ఆయన గెలిచే అవకాశాలున్నట్టు సర్వేలో తేలింది. సినీ నటుడు దివంగత విజయ్‌కాంత్ సతీమణి, డీఎండీకే చీఫ్ ప్రేమలత గతంలో విజయ్‌కాంత్ గెలిచిన విరుదాచలం నుండి పోటీ పడుతుండగా ఆమె మూడో స్థానానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. 

తమిళ రాజకీయాల్లో వృద్ధ నేత. కరుణానిధి సన్నితులైన 86 ఏళ్ల దురై మురుగన్ డీఎంకే తరఫున కాట్పాడి నుండి పోటీ పడుతుండగా ఆయన ఇప్పుడు పదకొండవ సారి గెలిచే అవకాశాలున్నాయి. ఏఐడీఎంకే మిత్రపక్షం పీఎంకే చీఫ్ అన్బమణి రాందాస్ సతీమణి సౌమ్య అన్బమణి రాందాస్ ధర్మపురి నుండి పోటీ చేస్తుండగా ఆమె టీవీకే నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.

డీఎంకే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు టీవీకే, ఏఐడీఎంకే మధ్య చీలిపోతున్నాయి. టీవీకే, పీఎమ్‌కే (ఆర్), శశికళ కూటమితో ఏఐడీఎంకే నష్టపోతోందని సర్వే తెలియజేస్తోంది. ముఖ్యంగా ఏఐడీఎంకే ట్రెడిషనల్ ఓటు బ్యాంకు అయిన తేవర్ శశికళ కూటమి, ఓపీఎస్ వల్ల, వన్నియార్ ఓటు పీఎమ్‌కే (ఆర్) పార్టీ వల్ల నష్టపోతుంది. తద్వారా గ్రాస్ రూట్‌లో ఏఐడీఎంకే చాలా స్థానాల్లో దెబ్బతింది.

ఎస్సీ యూత్ టీవీకే ఆకర్షించగా, వీసీకే మద్దతుతో డీఎమ్‌కే తన ఎస్సీ ఓటు బ్యాంకు పదిలపరుకుంటుంది. విజయ్ వల్ల డీఎంకే కొంత క్రిస్టియన్ ఓట్లు కోల్పోపోతున్నప్పటికీ, ముస్లింలు డీఎంకే వైపే మొగ్గు చూపారు. డీఎంకే ప్రభుత్వ పథకాలతో మహిళలు ఆ కూటమి వైపు మొగ్గు చూపారు.

Also REad: Exit Poll Results 2026: హీరో విజయ్ సీఎం అవుతాడా? పశ్చిమబెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందా? 2026 అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్..

Also REad: Telangana Pending Dues: ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..రూ.1000 కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Exit Poll Results 2026: హీరో విజయ్ సీఎం అవుతాడా? పశ్చిమబెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందా? 2026 అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్..

Hyderabad, Telangana:

Exit Poll Results 2026 Updates: దేశంలో ఇటీవలే ప్రారంభమైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ నేటితో ప్రశాంతంగా ముగిసింది. మే 4వ తేదీన వెలువడనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం యావత్ భారత్ ఎదురుచూస్తోంది. అయితే ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేజెక్కిచ్చుకోబోతుందనే అంశంలో ఎగ్జిట్ పోల్ సర్వే వచ్చేసింది.

బీజేపీకి 'బెంగ'ల్ తప్పదా?

 పార్టీ తృణమూల్ (TMC)  ఎన్డీఏ (NDA) కాంగ్రెస్ (INC) సీపీఎం (CPM) ఇతరులు
 సీట్లు      170 - 190      120 - 130  1 - 4  0 - 2 1 - 5

ఈ సర్వే ప్రకారం భారతీయ జనతా పార్టీ ఎంతో ఆశలు పెట్టుకున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ ‌పోల్‌ను పరిశీలిస్తే.. బీజేపీ నేతృత్వంలోని ఎన్టీఏ (NDA) కూటమికి మరోసారి పరాభవం తప్పదని అంచనా వేస్తున్నారు. సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ మరోసారి అధికారం చేపట్టబోతోందని సర్వే చెబుతోంది. అధికార టీఎంసీ పార్టీ 170 నుంచి 190 స్థానాల్లో విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది.

అలాగే ఎన్డీఏ కూటమికి 120 -130 స్థానాలు.. కాంగ్రెస్‌ (INC)కు 1-4 సీట్లు.. సీపీఎం (CPM) పార్టీకి 0-2 స్థానాలతో పాటు ఇతరులు 1-5 సీట్లలో గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ సర్వే చెబుతోంది. అయితే పశ్చిమ బెంగాల్‌లోని 294 అసెంబ్లీ ఎన్నికల స్థానాలకు గానూ మ్యాజిక్ మార్క్ 148 స్థానాల్లో గెలుపొందిన వారే అధికారం చేపట్టే అవకాశం ఉంది. దీంతో సర్వే ప్రకారం పశ్చిమ బెంగాల్‌లో మరోసారి దీదీ అధికారం చేపట్టబోతోందని అంచనాలు వెల్లడిస్తున్నాయి. మమతా బెనర్జీ వరుసగా నాలుగో సారి అధికారం చేపట్టి రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. 

కేరళలో మారనున్న అధికారం..

 పార్టీ కాంగ్రెస్ (UDF)  ఎల్‌డీఎఫ్ (LDF) బీజేపీ (BJP) ఇతరులు
 సీట్లు      76 - 81   61 - 66  3 - 4 0 - 1

కేరళ విషయానికొస్తే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) కూటమి.. అధికారం చలాంచి దిశగా వెళుతుందని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ యూడీఎఫ్ కూటమికి 76 - 81 స్థానాల్లో గెలుపొందుతుందని.. అలాగే సీఎం పినరయి విజయ్ పార్టీ ఎల్‌డీఎఫ్ (LDF) పార్టీకి 61 - 66 సీట్లు.. భారతీయ జనతా పార్టీకి 3 నుంచి 4 సీట్లు.. ఇతరులు సున్నా లేదా ఒక అసెంబ్లీ స్థానాల్లో నెగ్గే అవకాశం కనిపిస్తోంది.

ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికల్లో 140 అసెంబ్లీ స్థానాలకు గాను 74% పైగా ఓటింగ్ నమోదయింది. మ్యాజిక్ ఫిగర్ 71 స్థానాలు చేరుకున్నవారు అధికారం చేపట్టనున్నారు. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని (UDF) గెలుపు ఖాయమని.. పినరయ్ విజయన్ సీఎం స్థానం నుంచి తప్పుకోక తప్పదని సర్వేలు చెబుతున్నాయి. 

మరోసారి ఎన్డీఏ..

 పార్టీ కాంగ్రెస్ + ఎన్డీఏ (NDA) ఇతరులు
 సీట్లు 40 - 46  84 - 90 2 - 3

అస్సాం రాజకీయాల విషయానికొస్తే అధికార బీజేపీ ఎన్డీఏ కూటమి అలాగే కాంగ్రెస్ నాయకత్వంలోని మహాజోత్ కూటమి మధ్య తీవ్ర ఉత్కంఠపోరు నెలకొంది. బీజేపీ తరఫున సీఎం హిమంత విశ్వ శర్మ దూకుడుగా ప్రచారం చేశారు. అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోటీల్లో అధికార ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపట్టబోతోందని సర్వే చెబుతోంది. బీజేపీ కూటమికి 46 శాతం ఓట్లతో 84 - 90 స్థానాల్లో గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ కూటమికి 42 శాతం ఓట్లతో 40 - 46 స్థానాలు.. ఇతరులు 2 -3 స్థానాల్లో నెగ్గే అవకాశం ఉంది. 

తమినాడులో వాళ్లదే అధికారం..

 పార్టీ డీఎంకే (DMK)  అన్నాడీఎంకే (AIADMK) టీవీకే (TVK)
 సీట్లు 130 - 141      84 - 90  4 - 8

ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా సాగాయి. గత ఎన్నికల్లో ద్విముఖ పోరుగా ఉన్న అసెంబ్లీ ఎన్నికలు.. హీరో విజయ్ రాకతో త్రిముఖ పోరుగా మారాయి. సీఎం స్టాలిన్ నాయకత్వంలో అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) పార్టీ ప్రచారంలో దూసుకుపోయింది. అయితే పళని స్వామి నాయకత్వంలోని అన్నా డీఎంకే (AIADMK) మాత్రం కొంత వెనుకబడిందని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాట అధికారమే లక్ష్యంగా బరిలో దిగిన హీరో విజయ్ తమిళ వెట్రి కజగం (TVK) పార్టీ ప్రభావం చూపలేకపోయింది. 

ఏప్రిల్ 23న జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో 234 అసెంబ్లీ స్థానాలకు 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదయింది. అయితే తమిళనాడు ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధిక ఓటింగ్ కావడం విశేషం. ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం తమిళనాడు రాష్ట్రంలో మరొకసారి అధికార డీఎంకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని అంచనా వేస్తున్నారు. ఈ పార్టీకి 130 - 141 స్థానాల్లో గెలుపొందే అవకాశం కనిపిస్తోంది. అలాగే అన్నా డీఎంకే పార్టీకి 84 - 90 స్థానాలు.. విజయ్ టీవీకే పార్టీకి 4 - 8 స్థానాలు రావొచ్చని అంచనాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలకు గానూ మ్యాజిక్ మార్క్ 118 స్థానాల్లో గెలుపొందిన పార్టీ అధికారం చేపడుతోంది. 

పుదుచ్చేరి బీజేపీదే?!

 పార్టీ ఎన్డీఏ (NDA)  కాంగ్రెస్ (SPA) టీవీకే (TVK)
 సీట్లు 17 - 19      11 - 12  1 - 2

అదేవిధంగా పుదుచ్చేరి అసెంబ్లీ ఎలక్షన్స్ లో మొత్తం 30 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ఎక్కువ 17 నుంచి 19 స్థానాల్లో గెలుపొందే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమికి 11 నుంచి 12 స్థానాలు.. అలాగే సినీ నటుడు విజయ స్థాపించిన టీవీకే పార్టీకి 1 - 2 స్థానాల్లో విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని అంచనా. 

మొత్తంగా హైదరాబాద్‌లోని ఎస్ఏఎస్ గ్రూపు చెందిన ఐఐటిఎస్ గ్రూప్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2026లో జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఫలితాలు ఇలా రాబోతున్నాయని అంచనా వేయడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఏఫ్ (UDF), అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ (NDA), తమిళనాడులో అధికార డీఎంకే (DMK), వెస్ట్ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC), పుదుచ్చేరిలో ఎన్డీఏ (NDA) కూటమి విజయకేతనం ఎగురవేసే అవకాశం కనిపిస్తుంది.

(గమనిక: పైన పేర్కొన్న ఎగ్జిట్ పోల్స్ సమాచారం కేవలం అంచనా మాత్రమే. కొన్నిసార్లు ఇందుకు భిన్నంగా కూడా ఫలితాలు రావొచ్చు లేదా దీనికి అనుగుణంగా వెలువడొచ్చు. కానీ, దీన్నే అంతిమంగా ఖరారు చేసుకోరాదు.)

Also Read: Telangana Pending Dues: ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..రూ.1000 కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల!

Also Read: Vande Bharat Derail: వందేభారత్ రైలుకు తృటిలో తప్పిన ప్రమాదం..పట్టాలు తప్పిన రన్నింగ్ ట్రైన్..అంతలోనే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Telangana Pending Dues: ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..రూ.1000 కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల!

Hyderabad, Telangana:

Telangana Pending Dues Released: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. గతంలో అసెంబ్లీ వేదికగా ఇచ్చిన హామీ మేరకు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు తీపికబురు అందించారు. ఉపముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాల మేరకు, ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం రూ.1000 కోట్ల నిధులను తెలంగాణ ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. డిప్యూటీ సీఎం సూచన మేరకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఈ మేరకు నిధుల విడుదల చేశారు. 

​గతేడాది ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల నేపథ్యంలో ప్రభుత్వం నెలకు రూ.700 కోట్లు విడుదల చేస్తామని హామీ గతంలో ఇచ్చింది. ఈ విధంగా మార్చి 2026 వరకు ప్రతినెల ఉద్యోగులకు ఇచ్చిన మాటను  ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే, ఉద్యోగుల ఆర్థిక అవసరాలను, ఇబ్బందులను స్వయంగా మానిటర్ చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఆ మొత్తాన్ని రూ.1000 కోట్లకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ నెలలో రూ.1000 కోట్లను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేశారు. 

అదే విధంగా ​రిటైర్డ్ ఉద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందించింది. అక్టోబర్ 2025 వరకు పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) బకాయిలన్నింటినీ ఈ నిధులతో పూర్తిగా క్లియర్ చేయడం జరిగింది. రిటైర్మెంట్ తర్వాత సెటిల్మెంట్‌ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇదో గొప్ప ఊరటనిచ్చే అంశం.

అలాగే ఉద్యోగుల ఆరోగ్య అవసరాలకు సంబంధించి మెడికల్ బిల్లులను ఆలస్యం చేయకుండా, ప్రాధాన్యత క్రమంలో చెల్లింపులు చేసేందుకు అధికారులకు ఆదేశాలు అందాయి. ప్రస్తుతం మెడికల్ బిల్లుల చెల్లింపులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి. ​మెడికల్ బిల్లులు, స్కాలర్‌షిప్‌లకూ మోక్షం ​ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో రాజీపడకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక్క రోజు కూడా జాప్యం లేకుండా మెడికల్ బిల్లుల చెల్లింపులు రెగ్యులర్‌గా జరిగేలా యంత్రాంగం చర్యలు చేపట్టింది. తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చొరవతో పెద్ద మొత్తంలో నిధులు విడుదల కావడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Also Read: Chitra Pournami 2026: అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు అత్యంత శుభ ముహూర్తం..ఈ పవిత్ర ఘడియల్లో స్వామి దర్శనం అపూర్వం!

Also Read: Watermelon At Night: రాత్రిపూట పుచ్చకాయ తింటే చనిపోతారా? ముంబై ఫ్యామిలీ మృత్యువాత వెనుక కారణం ఇదే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Watermelon At Night: రాత్రిపూట పుచ్చకాయ తింటే చనిపోతారా? ముంబై ఫ్యామిలీ మృత్యువాత వెనుక కారణం ఇదే!

Hyderabad, Telangana:

Watermelon At Night Good Or Bad: ముంబైలో ఒక కుటుంబం తమ బంధువులతో కలిసి రాత్రి భోజనంలో బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చాక, బంధువులు వెళ్ళిపోయాక ఇంట్లో ఉంచిన పుచ్చకాయను ఆ నలుగురు బయటకు తీసి తిన్నారు. అది తిన్న కొద్దిసేపటికే వారి శారీరక పరిస్థితి మారిపోయింది. ఒకరి తర్వాత ఒకరుగా వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. అంతలోనే నలుగురినీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ వారు మరణించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు, వారు తిన్న ఆహారాన్ని ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు. మరణానికి కారణం పరీక్షలు జరుగుతున్నాయి. బిర్యానీ తిన్న తర్వాత గ్యాస్ ట్రబుల్ సమస్య వస్తుందని అందరికి తెలుసు. కానీ, బిర్యానీ లేదా పుచ్చకాయలో ఏదైనా రసాయనం కలిసిందా? అనేది తెలియాల్సి ఉంది. 

ఈ సంఘటన ఇప్పుడు ప్రజల మనసుల్లో అనేక ప్రశ్నలను రేకెత్తించింది. ఈ అలర్జీ పుచ్చకాయ వల్ల వచ్చిందా? ఆ పండు వల్ల ఎలాంటి ప్రభావాలు ఉండవచ్చు? దాన్ని తినడం వల్ల ఇంత పెద్ద ప్రభావం ఎందుకు పడింది? ప్రజలు తమలో తాము అనేక రకాలుగా ఆలోచిస్తున్నారు. 

ఈ విషయంపై ఓ పోషకాహార నిపుణులు మాట్లాడుతూ.. పుచ్చకాయ వల్ల ఫుడ్ పాయిజనింగ్ కలగదని చెప్పారు. అయితే కొన్ని సందర్భాల్లో పరిస్థితులను బట్టి తీవ్రమైన అనారోగ్యాలను దారితీసే అవకాశం ఉందని తెలియజేశారు. పుచ్చకాయలో అధిక నీటి శాతం, సహజ చక్కెర ఉండటం వల్ల, ఆ పండు కొద్దిగా కలుషితమైనా అందులో వేగంగా వ్యాపిస్తుంది. పుచ్చకాయ తీపి కోసం గ్లూకోజ్ నీళ్లు లేదా చక్కెర నీటిని కలుపుతారని కూడా అంటున్నారు. సహజంగా కాకుండా ఇతర ద్రవాలను అందులో కలపడం వల్ల కల్తీ జరిగే అవకాశం ఉంది. 

పుచ్చకాయ వల్ల ఫుడ్ పాయిజనింగ్ రావడం కొత్తేమీ కాదు. అటువంటి కృత్రిమ సారం కలిపిన పుచ్చకాయను తిన్నప్పుడు, ఆహార నొప్పి, వాంతులు, కడుపు, విరేచనాలు వంటివి సంభవించవచ్చు. అంతేకాకుండా, పిల్లలు దీని బారిన పడినప్పుడు కడుపు నొప్పి, విరేచనాలు వంటివి కలగవచ్చు. ఇలా జరిగితే ప్రాణాలకే ప్రమాదం రావొచ్చు. కలుషిత ఆహారం తినే ముందు వాటిలో కల్తీ జరిగిందో లేదా అని నిర్ధారించుకున్న తర్వాతే వాటిని తినడం మేలు. 

పుచ్చకాయను ఎప్పుడు తినవచ్చు?
మీరు పుచ్చకాయను తినే సమయం కూడా దాని జీర్ణక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. నిద్రలో జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అందువల్ల, రాత్రి ఆలస్యంగా (ముఖ్యంగా రాత్రి 7 గంటల తర్వాత) పండ్లు లేదా భారీ భోజనం మానుకోవడం ఉత్తమం అని వైద్యుల సూచిస్తున్నారు.

పుచ్చకాయ తినడానికి ఉత్తమ సమయం ఉదయం భోజనానికి ముందు లేదా తర్వాత కొంత సమయం తర్వాత తినొచ్చు. అలాగే పగటిపూట చిరుతిండిగానూ పుచ్చకాయ తినొచ్చు. రాత్రి ఆలస్యంగా పండ్లు తినడం వల్ల మాత్రమే ఫుడ్ పాయిజనింగ్ రాదు, కానీ ఆ పండ్లు కలుషితమైతే లేదా శరీరానికి జీర్ణక్రియ సరిగా లేకపోతే, జీర్ణ సంబంధిత రుగ్మతలు పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Vande Bharat Derail: వందేభారత్ రైలుకు తృటిలో తప్పిన ప్రమాదం..పట్టాలు తప్పిన రన్నింగ్ ట్రైన్..అంతలోనే

Also Read; Kohli IPL 9000 Runs: మరో 11 పరుగుల దూరంలో విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు..ఐపీఎల్ చరిత్రలో ఒకేఒక్క మొనగాడు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Snake Video: ఫ్యాన్సీ క్లిప్ అనుకుంటే పొరపాటే.. అమ్మాయి జడలో ప్రత్యక్షమైన పాము పిల్ల.. వీడియో..

Hyderabad, Telangana:

 Snake In Hair Video Watch Now: ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల వింతలతో పాటు విశేషాలు వైరల్ అవ్వడం సర్వసాధారణమైపోయింది. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో మాత్రం సోషల్ మీడియా వినియోగదారుల వెన్నుల్లో వెనుక పుట్టిస్తుంది. సాధారణంగా మహిళలు తమ జడలను పూలతోనో.. అందమైన క్లిప్పులతోను అలంకరించుకుంటారు. కానీ ఇక్కడ ఒక యువతి ఏకంగా పాము పిల్లను తన జడలో పెట్టుకొని కనిపించడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. 

వైరల్ అవుతున్న వీడియోను గమనిస్తే.. ఒక యువతి ఒకచోట కూర్చుని ఉండగా.. ఆమె వెనక ఉన్న జడ మధ్యలో ఒక చిన్న పాము పిల్ల చుట్టలు చుట్టుకొని ఉండడం మీకు కనిపిస్తుంది. ఆ పాము ప్రాణాలతోనే ఉండి.. అటు ఇటు కదులుతూ పడక విప్పడానికి ప్రయత్నిస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. మొదట చూసినవారు అదేదో ఫ్యాన్సీ హెయిర్ క్లిప్ అని అనుకున్నారు.. కానీ ఆ పాము చిన్నగా కదులుతూ కనిపించడంతో అది నిజమైన పామని నిర్ధారించుకొని అందరూ షాక్ అయిపోయారు..

ఈ ఘటనకు సంబంధించిన చిన్న క్లిప్పు ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. వీడియో పై సోషల్ మీడియాలో భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అందరు ఇది కావాలని చేసిన సాహసం అని కామెంట్లలో రాసుకు వస్తే.. మరి కొంతమంది ఫ్రాంక్ వీడియో కావచ్చు అని భావిస్తున్నారు. ఆ యువతి ముఖంలో ఎక్కడ భయం లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ వీడియో చూసిన మరికొంతమంది మాత్రం బహుశా ఆ యువతీ నిద్రపోతున్న సమయంలో లేదా ఆరు బయట కూర్చున్నప్పుడు పాము పిల్ల ఆమె జడలోకి దూరి ఉండొచ్చని కామెంట్లు చేస్తున్నారు..

ఇక ఈ వీడియో చూసిన మరి కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం అమ్మో చూస్తుంటేనే భయం వేస్తోంది.. ఆ పాము గాని కరిస్తే పరిస్థితి ఏంటని కామెంట్ చేయగా.. పాములు ఎక్కడ దూరి ఉంటాయో చెప్పలేం.. మహిళలు జడ వేసుకునే ముందు జాగ్రత్తగా చూసుకోవాలని కొంతమంది సూచిస్తూ కామెంట్లు పెడుతున్నారు. పాము పిల్ల చిన్నదైనప్పటికీ దాని విషయం ప్రాణాంతకం కావచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

 
 
 
 
 

Also Read:  Samar Cobra Video: అత్యంత అరుదైన సమర్ కోబ్రా.. పడగ విప్పి ఏం చేస్తుందో చూడండి.. వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

  

0
0
Report

Kondagattu: అంజన్న క్షేత్రానికి అరుదైన గౌరవం.. కేంద్ర ప్రభుత్వ దివ్య భారత్ జాబితాలో కొండగట్టు!

Hyderabad, Telangana:

Kondagattu Anjanna Temple News: తెలంగాణలోని అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రంగా పేరున జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయానికి అరుదైన గౌరవం దక్కింది.. భారత ప్రభుత్వ మేధోమథన సంస్థ (Think Tank) నీతి ఆయోగ్‌ తాజాగా ప్రచురించిన దివ్యభారత్ పుస్తకంలో ఈ క్షేత్ర విశేషాలను అందించడం విశేషం. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాల జాబితాలో అంజన్న ఆలయానికి చోటు లభించడం రెండు తెలుగు రాష్ట్రాలకే గర్వకారణం.. ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయని ఒక నమ్మకం..

దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు భారతదేశంలోని అపురూపమైన సాంస్కృతితో పాటు ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల గురించి సమగ్ర అవగాహన కల్పించే లక్ష్యంతో నీతి అయోగ్ ఈ పుస్తకాన్ని రూపొందించింది. విభిన్న రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను మాత్రమే ఇందులో చేర్చారు.. ఈ ఘనతను మన కొండగట్టు ఆంజనేయ స్వామి దక్కించుకోవడం తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి నిదర్శనం..

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎన్నో చారిత్రక, పురాతన ఆలయాలు ఉన్నప్పటికీ.. కేవలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్రానికే ఈ ప్రతిష్టాత్మక పుస్తకంలో చోటుదక్కడ గర్వకారణం.. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకెళ్తున్న సమయంలో ఒక భాగం ఇక్కడ పడిందని పురాణ గాధలు చెబుతూ ఉంటాయి.. చుట్టూ కొండలతో పాటు ఆకుపచ్చని ప్రకృతి మధ్య కొలువైన ఈ ఆలయం పర్యాటక ప్రాంతంగా కూడా ఎంతో విశిష్టమైంది.. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వేలాదిమంది భక్తులు ఇక్కడికి తరలివస్తు ఉంటారు.

నీతి అయోగ్ ప్రచురణలో చోటుదక్కడ వల్ల ఈ క్షేత్రం గురించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం లభిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో విదేశీ పర్యటకుల రాకలు పెరగడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆలయ అభివృద్ధికి మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం వందల కోట్ల రూపాయల కేటాయింపులు చేసిన నేపథ్యంలో.. కేంద్ర సంస్థ నుంచి లభించిన ఈ గుర్తింపు అంజన్న క్షేత్ర అభివృద్ధికి మరింత సహాయపడుతుందని ఆలయ కమిటీతో పాటు భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..

Also Read:  Samar Cobra Video: అత్యంత అరుదైన సమర్ కోబ్రా.. పడగ విప్పి ఏం చేస్తుందో చూడండి.. వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Karimnagar News: కరీంనగర్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం కీలక నిర్ణయం.. వెయిటింగ్ పీరియడ్‌కు చెక్!

Hyderabad, Telangana:

Karimnagar Latest News: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులకు పాస్‌పోర్ట్ సేవల విషయంలో ఇకపై ఆలస్యం ఉండదు.. కరీంనగర్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం లో అపాయింట్మెంట్ స్లాట్ల సంఖ్య అధికారులు భారీగా పెంచారు. విదేశీ ప్రయాణాలతో పాటు ఉన్నత చదువుల కోసం పాస్పోర్ట్ దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు ఈ కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనివల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పాస్‌పోర్ట్ అప్లై చేసుకునే వారికి తొందరలోనే లభించబోతోంది. అంతేకాకుండా మరిన్ని ప్రత్యేకమైన సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు కరీంనగర్ కేంద్రంలో రోజుకు కేవలం 220 స్లాట్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. దీనివల్ల అపాయింట్మెంట్ దొరకడానికి దరఖాస్తుదారులకు చాలా సమయం పట్టేది. తాజా నిర్ణయంతో ఈ సంఖ్య నాలుగు వందలకు పెంచారు. అంతేకాకుండా పాస్‌పోర్ట్‌లకు సంబంధించిన కొన్ని రకాల ప్రత్యేకమైన సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే, స్లాట్‌ల పెంపుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెళ్లడైనట్లు తెలుస్తోంది..

గతంలో ఉన్న 160 స్లాట్లకు 310కి పెంచగా.. అదనపు స్లాట్లతో పాటు ఇతర సేవలను కూడా మెరుగుపరిచినట్లు తెలుస్తోంది. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోటాను కూడా 30కి పెంచినట్లు సమాచారం.. సాధారణంగా కరీంనగర్ కేంద్రంలో అపాయింట్మెంట్ లభించాలంటే దాదాపు 8 నుంచి 12 రోజులపాటు సమయం పట్టేది.. స్లాట్‌ల సంఖ్య దాదాపు రెట్టింపు కావడంతో.. ఇకపై దరఖాస్తు చేసుకున్న నాలుగు రోజుల్లోపే అపాయింట్మెంట్ లభించే అవకాశం ఉంది. దీనివల్ల అత్యావసరంగా విదేశాలకు వెళ్లాల్సిన వారికి, విద్యార్థులకు ఎంతగానో ఊరట లభించబోతోంది.

ఈ పెంచిన స్లాట్‌ల విధానంతో పాటు మెరుగుపరిచిన సేవలు మే 4వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాబోతున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ తేదీ నుంచి దరఖాస్తులు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు అదనపు కోటాను కూడా అందుబాటులో ఉంచబోతున్నారు. పాస్పోర్టుకు సంబంధించిన సేవలలో పారదర్శకతను పెంచడంతో పాటు ప్రజలకు వేగవంతమైన సేవలను అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది..స్లాట్ల పెరుగుదలతో కరీంనగర్ పాస్‌పోర్ట్ కేంద్రంపై ఒత్తిడి తగ్గడమే కాకుండా ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రజలకు వారి సొంత ప్రాంతాల్లోనే ఎంతో సులభంగా పాస్‌పోర్ట్ పనులు అయిపోతాయి..

Also Read:  Samar Cobra Video: అత్యంత అరుదైన సమర్ కోబ్రా.. పడగ విప్పి ఏం చేస్తుందో చూడండి.. వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

King Cobra Video: స్టౌపై గిన్నెలో తిష్టవేసిన భారీ కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే!

Hyderabad, Telangana:

 King Cobra Video Watch: సాధారణంగా వంటగదిలోకి వెళ్తే గరిటల చప్పుడు తో పాటు వంటకాల సువాసనలు ఆస్వాదిస్తూ ఉంటాం.. కానీ ఆ ఇంట్లో మాత్రం ఊహించని భయంకర దృశ్యం ఎదురైంది. వంట రూమ్ లోకి వెళ్లిన ఇంటి యజమాని ఒక్కసారిగా షాక్కు గురైయ్యాడు. అక్కడ స్టవ్ మీద ఉన్న ఒక బౌల్లో ఏకంగా ఒక భారీ కింగ్ కోబ్రా పడగ విప్పి కూర్చొని ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇప్పుడు ఈ వీడియో చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉన్నారు..

వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక నివాస ఇంట్లోని వంట గదిలో గ్యాస్ స్టవ్ పైన బౌల్ లోపల ఒక కింగ్ కోబ్రా చుట్టలు చుట్టుకొని కూర్చొని ఉంది. ఆ ప్రమాదకరమైన పాము కేవలం అక్కడ ఉండడమే కాకుండా.. తన పడకను పైకి లేపి అటు ఇటు గమనిస్తూ అత్యంత భయంకరంగా కనిపించడం వీడియోలో చూడొచ్చు. చల్లదనం కోసమో లేదా ఆహారం కోసమో ఆ పాము అక్కడి వచ్చి ఉంటుందని భావిస్తూ ఉన్నారు. 

ఇంటి యజమాని వంట గదిలోకి వెళ్లి ఆ దృశ్యాన్ని చూసి మొదట ఆశ్చర్యానికి గురయ్యాడు. అప్రమత్తంగా పామును గమనిస్తుండగా.. అది మరింత ఆగ్రహానికి గురైనట్లు ఈ వీడియోలో మీరు చూడొచ్చు. యజమాని దాని సమీపానికి వెళ్ళగానే ఆ ప్రమాదకరమైన కింగ్ కోబ్రా ఒక్కసారిగా ముందుకు ముందుకు వస్తూ కాటేసే ప్రయత్నం చేసింది. పడక విప్పి బుసలు కొడుతూ ఆ పాము నానా హంగామా సృష్టించింది.. దాని ఆగ్రహం చూసి యజమాని ఆ ప్రమాదకరమైన పాముకు దూరంగా ఉన్నాడు..

 
 
 
 
 

Also Read:  Samar Cobra Video: అత్యంత అరుదైన సమర్ కోబ్రా.. పడగ విప్పి ఏం చేస్తుందో చూడండి.. వీడియో!

ఈ భయంకరమైన దృశ్యాన్ని ఎవరు కెమెరాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు వంటగదిలోకి వెళ్లేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో లేదా అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉండేవారు వస్తువులను ముట్టుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ భయంకరమైన పాము కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో హల్చల్ చేస్తోంది.

Also Read:  Samar Cobra Video: అత్యంత అరుదైన సమర్ కోబ్రా.. పడగ విప్పి ఏం చేస్తుందో చూడండి.. వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

  

0
0
Report

Telangana: సర్పంచ్ భార్య.. సంతకం భర్తది! సిరిసిల్ల జిల్లాలో వింత ఘటన..

Sircilla, Telangana:

Rajanna Sircilla News: రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో ఒక వింతైన ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించి మహిళలను పదవుల్లో కూర్చోబెడుతుంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం భర్త పాలన కొనసాగుతోందని విమర్శలకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. అధికార రిజిస్టర్లు సర్పంచ్‌కు బదులుగా ఆమె భర్త సంతకం చేయడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

మంగళవారం మండలంలోని రంగపేట గ్రామ అంగన్వాడీ కేంద్రంలో ఆఫ్టర్ కేర్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి గ్రామ ప్రతినిధులతో పాటు అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసిన అనంతరం.. నిబంధనల ప్రచారం విచ్చేసిన ఆధితులు వివరాలతో పాటు వారి అభిప్రాయాలను అంగన్వాడి అధికారిక రిజిస్టర్లు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలోనే అసలు విషయం బయటపడింది..

అతిథుల సంతకాలు సేకరిస్తున్న క్రమంలో ప్రోటోకాల్ ప్రకారం.. ముందుగా గ్రామ సర్పంచ్ సంతకం చేయాల్సి ఉంటుంది.. అయితే, అక్కడ ఉన్న సర్పంచ్ భాగ్యలక్ష్మి కంటే ముందే ఆమె భర్త పరశురాములు చొరవ తీసుకున్నారు.. అధికారిక రిజిస్టర్లు సర్పంచ్ సంతకం చేయాల్సిన చోట ఆయన సంతకం చేసి.. పక్కన బ్రాకెట్లో సర్పంచ్ అని రాశారు.. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భర్త సంతకం చేసిన తర్వాతే సర్పంచ్ భార్య దాని కింద సంతకం చేశారు. ఇది చూసిన అక్కడి సిబ్బందితో పాటు అతిధులు ఒక్కసారిగా ఆశ్చర్య పోయారట..

ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఏ అధికారిక పత్రం మీదైన సర్పంచ్ మాత్రమే సంతకం చేయాల్సి ఉంటుంది.. భర్తకు ఎటువంటి అధికారిక హోదా లేకపోయినప్పటికీ.. ఏకంగా రిజిస్టర్‌లోని సంతకం చేయడంపై అక్కడి అధికారులతో పాటు విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ రికార్డుల్లో అనధికార వ్యక్తులు సంతకం చేయడం చట్ట విరుద్ధమని మేధావులు సైతం పేర్కొంటున్నారు. మహిళా సర్పంచులు ఉన్నచోట వారి భర్తలు షాడో సర్పంచులుగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి ఇదొక నిదర్శనమని గ్రామస్తులు గుసగుసలాడుతున్నారు..

Also Read:  Samar Cobra Video: అత్యంత అరుదైన సమర్ కోబ్రా.. పడగ విప్పి ఏం చేస్తుందో చూడండి.. వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top