మెహిదిపట్నం లోని చోరీ కు యత్నం, కూలీలు పట్టుకొని దేహ శుద్ధి చేయడం తో తీవ్ర గాయాలతో మృతి చెందిన దొంగ
హైదరాబాద్.అసిఫ్ నగర్ పి.యస్ పరిధిలోని ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ నిర్మాణం ఉన్న భవవంలో యువకుల వద్ద ఉన్న సెల్ ఫోన్లను ఓ వ్యక్తి చోరీ చేసేందుకు యత్నించాడు. అక్కడ పనిచేసే కూలీలు ఆ దొంగను పట్టుకున్ని కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే ఆ దొంగకు తీవ్ర గాయాలయ్యాయి.. ఆ దొంగను ఆసుపత్రికి తీసుకెళ్ళుతున్న సమయంలో అతడు చనిపోయాడు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Traffic Diversions Hyderabad: జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్, ముగ్ధ జంక్షన్ ప్రాంతాల్లో స్టీల్ ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 27 (శుక్రవారం) నుండి బంజారాహిల్స్ రోడ్ నెం.2లో పిల్లర్ పనులు ప్రారంభం కానున్నాయి. ఫలితంగా ఈ మార్గాల్లో భారీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున, పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.
ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే..
NFCL నుండి జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వారు.. సాగర్ సొసైటీ (ముగ్ధ) వద్ద రద్దీగా ఉంటే.. శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్, ఇందిరానగర్ లేబర్ అడ్డా, రోడ్ నెం.5, వెంకటగిరి ఎక్స్ రోడ్స్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ చేరుకోవచ్చు.
రోడ్ నెం.36 & 45 నుండి పంజాగుట్ట వైపు వెళ్లే వారు.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుండి వెంకటగిరి రోడ్ నెం.2, యూసుఫ్ గూడ బస్తీ, మైత్రీవనం మీదుగా అమీర్పేట్ వైపు వెళ్లడం ఉత్తమం.
రోడ్ నెం.1 (KCP) నుండి వచ్చేవారు.. కేబీఆర్ పార్క్ వైపు వెళ్లకుండా రోడ్ నెం.10 మీదుగా క్యాన్సర్ హాస్పిటల్, అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్ గుండా రోడ్ నెం.45 వైపు వెళ్లవచ్చు.
మాసబ్ ట్యాంక్ నుండి వచ్చేవారు: విరించి హాస్పిటల్ వద్ద ఎడమకు తిరిగి అగ్రసేన్ ఐలాండ్ మీదుగా జూబ్లీహిల్స్ వైపు వెళ్లవచ్చు.
వాహనదారులకు ముఖ్య సూచనలు..
సాధ్యమైనంత వరకు ఉదయం 8:30 – 11:00, సాయంత్రం 5:00 – 9:00 మధ్య ఈ మార్గాల్లో ప్రయాణాలను వాయిదా వేసుకోండి. తాజా ట్రాఫిక్ అప్డేట్స్ కోసం Google Maps వంటి నావిగేషన్ యాప్స్ తప్పనిసరిగా వాడండి. నిర్మాణ పనుల దృష్ట్యా భారీ వాహనాలకు రద్దీ సమయాల్లో ఈ మార్గాల్లో అనుమతి ఉండదు. ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన సైన్ బోర్డులను గమనిస్తూ వారికి సహకరించండి.
అత్యవసర సమాచారం కోసం..
ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే హైదరాబాద్ ట్రాఫిక్ హెల్ప్లైన్ నంబర్ 9010203626 కు కాల్ చేయండి లేదా సోషల్ మీడియా వేదికలు @HYDTP ద్వారా అప్డేట్స్ పొందండి. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం జరుగుతున్న ఈ పనులకు పౌరులందరూ సహకరించాలని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) కోరారు.
Also REad: TTD Online Frauds: శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక హెచ్చరిక..వెలుగులోకి వచ్చిన భారీ మోసం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
TDP MLA MS Raju: 'హిందూ మత ఆచారాలు, సాంప్రదాయాలు, భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడం మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ముందు నుంచి ఆనవాయితిగా వస్తోంది. నిన్నటి రోజు పులివెందుల నందిపల్లి గ్రామంలో నందీశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకానికి వెళ్లిన మాజీ సీఎం వైఎస్ జగన్ అక్కడ పూజారి ఇచ్చిన తీర్థాన్ని స్వీకరించకుండా కిందికి వదిలేశారు' అని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. 'గోత్ర నామాలు చెప్పకుండా అవహేళన చేయడం, అగ్నిగుండంలోకి వేయాల్సిన వస్తువుల్ని తిరిగి మళ్లీ పూజారికి ఇవ్వడం. ఇవన్నీ భగవంతుడి మీద ఎటువంటి భక్తి లేదనడానికి వైఎస్ జగన్ తీరు నిదర్శనం' అని విమర్శించారు.
అసెంబ్లీ మీడియా పాయింట్లో మాజీ సీఎం వైఎస్ జగన్పై మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ' ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా టీటీడీలో ఏ రోజు పట్టువస్త్రాలు కుటుంబ సమేతంగా ఇవ్వలేదు. ఐదేళ్ల కాలంలో దాదాపు 2000 ఆలయాల మీద దాడులు జరగడం, అడుగడుగునా హిందుత్వాన్ని, హిందూ మతాన్ని హేళన చేస్తూ వ్యవహరించారు. నిన్న పులివెందులలో ప్రపంచం మొత్తం లైవ్లో చూస్తుండగా భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించి మహా పాపం చేశారు' అని ఆరోపించారు.
కచ్చితంగా ఆ దేవ దేవుడు వైఎస్ జగన్కు శిక్ష విధిస్తాడని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు శాపించారు. 'వైఎస్సార్సీపీ హయాలో హిందూ మతం మీద గౌరవం లేనటువంటి వ్యక్తుల్ని, హిందూ మత విశ్వాసాల మీద, వెంకటేశ్వర స్వామి మీద భక్తి విశ్వాసం లేనటువంటి వ్యక్తుల్ని టీటీడీ చైర్మన్గా నియమించారు. టీటీడీ అప్రతిష్ట పాలు కావడానికి వైఎస్ జగన్ ఎంతటి కారణమో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులకి, వెంకటేశ్వర స్వామికి తెలుసు' అని తెలిపారు 'హిందూ మతం మీద ఒక కక్షపూరిత వైఖరితో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. జగన్కు నిజంగా భగవంతుడి మీద నమ్మకం, గౌరవం లేనప్పుడు గుడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది?' అని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రశ్నించారు. హిందువుల మత ఆచారాల్ని అగౌరవపరిచేలా ఎందుకు వ్యవహరిస్తున్నారని.. ఇప్పటికైనా మాజీ సీఎం వైఎస్ జగన్ తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
eKYC Mandatory Before March 31 Details: మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదేవిధంగా ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. అయితే మీకు కూడా గ్యాస్ సబ్సిడీ వచ్చినట్లయితే దానికి మీరు ఒక విషయం ముందుగా తెలుసుకోండి. మార్చి 31 లోపు ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోండి. ఈకేవైసీ పూర్తి చేసుకోలేని వారికి గ్యాస్ సబ్సిడీ ఆగిపోయే ఛాన్స్ ఉంది. గ్యాస్ ఏజెన్సీకి వెళ్లకుండానే మీ ఫోన్లో ఆయిల్ కంపెనీ యాప్ ద్వారా మీరు సులభంగా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. దీనికి ఆధారం ఫేస్ RD యాప్ సహాయంతో ఇంటి నుంచే కేవైసీ చేసుకోండి. ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈ ప్రక్రియ ఎంతో సులభంగా జరుగుతుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే 18002333555 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి, లేకపోతే మీ డిస్ట్రిబ్యూటర్కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్..
ఇది ఇండియన్ ఆయిల్, హెచ్ పీ, భారత్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ కస్టమర్లకు వర్తిస్తుంది. ఈ కేవైసీ అంటే బయోమెట్రిక్ ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. లేకపోతే మీ దగ్గరలో ఉన్న మీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్ వెళ్లి కూడా ఈ పని పూర్తి చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఛార్జీలు కూడా వసూలు చేయరు.
అధికారిక వెబ్సైట్...
ఈ కేవైసీ పూర్తి చేసుకోవడానికి మీరు అధికారిక https://pmuy.gov.in/e-kyc.html . వెబ్సైట్ కూడా ఉంది. ఇందులో వివరాలు చెక్ చేయవచ్చు. ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం 9 సిలిండర్లకు గ్యాస్ సబ్సిడీ అందిస్తుంది. మార్చి 31వ తేదీ లోపు ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే రిఫండ్ వస్తుంది. లేకపోతే శాశ్వతంగా సబ్సిడీ రద్దు అయ్యే అవకాశం ఉంది.
ఇక మార్చి 1వ తేదీ గ్యాస్ ధరల సవరణ జరుగుతుంది. ప్రతి నెల ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ ఆయిల్ ధరలు సవరణ చేస్తూ ఉంటాయి. గత ఐదేళ్లుగా చూస్తే డొమెస్టిక్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ప్రస్తుతం LPG గ్యాస్ సిలిండర్ ద్వారా ఢిల్లీలో రూ.853, ముంబై రూ. 852, చెన్నై రూ. 868 ఉంది అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర గత ఐదేళ్లలో పోలిస్తే కేవలం మూడుసార్లు మాత్రమే సవరించారు.
ఇక హైదరాబాదులో ఈ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ద్వారా 14.2 కేజీలు రూ. 905 ఉంది. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ 19 కేజీలు మాత్రం రూ. 1961 ఉంది. గత కొన్ని నెలలతో పోలిస్తే పెద్దగా ఎలాంటి ధరల మార్పు జరగలేదు . ఇక అర్హులైన వారికి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ లభిస్తుంది. నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు రిఫండ్ చేస్తుంది ప్రభుత్వం.
Also Read: రైలు ప్రయాణీకులు బిగ్ అలెర్ట్.. మార్చి 1 నుంచి మారనున్న రూల్స్, తెలుసుకోకపోతే మీకే నష్టం..!
Also Read: టోల్ గేట్ ముందు టెన్షన్ వద్దు.. 30 సెకన్లలో FASTag బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Railway Rules Changing from March 1: ప్రతిరోజు కొన్ని వేల రైళ్లు రాకపోకలు చేస్తూ ఉంటాయి. మన దేశంలో ప్రధానంగా అతిపెద్ద రవాణా ఇండియన్ రైల్వే. లక్షలాది మంది ప్రయాణికులకు తమ గమ్య స్థానాలకు ఇది చేరవేస్తుంది. సుదీర్ఘ ప్రయాణాన్ని అతి తక్కువ సమయంలోనే తక్కువ టికెట్ ధరలతో వెళ్లవచ్చు. అయితే, ఇటీవల కాలంలో రైల్వే ప్రయాణికులకు అనుగుణంగా ఎన్నో మార్పులు చేస్తూనే ఉంది భారతీయ రైల్వే. కొత్త రైళ్లు, కారిడర్లు ప్రకటించడం చూశాం. దీంతోపాటు మార్చి 1వ తేదీ నుంచి కొత్త రైల్వే రూల్స్ మారాయి. UTS యాప్ అనేది పూర్తిగా తొలగించేసి.. RailOne యాప్ తో భర్తీ చేశారు. ఇది రైలు ప్రయాణికులు ముందుగా తెలుసుకోవాలి.
సాధారణంగా రైల్వే టికెట్ బుక్ చేసుకోవాలంటే అనేక ప్లాట్ ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. ఆఫ్ లైన్ అయితే రైల్వే స్టేషన్ వెళ్లి అక్కడ కౌంటర్లలో బుక్ చేసుకుంటారు. అయితే రోజువారీ ప్రయాణం చేసేవారికి RailOne App బెస్ట్. రైలు ప్రయాణికులతో పాటు వారి బంధువులు కూడా ప్లాట్ ఫారం టికెట్ వంటివి ఉంటాయి. అయితే మార్చి 1వ తేదీ నుంచి UTS App అందుబాటులో ఉండదు. కేవలం RailOne యాప్ మాత్రమే ప్రయాణికులు ఉపయోగించాల్సి ఉంటుంది.
గూగుల్ ప్లే స్టోర్ నుంచి రైలు వన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ క్రెడియన్షియల్స్ తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ జనరల్ టికెట్, ప్లాట్ ఫామ్ టికెట్, రిజర్వేషన్ సులభంగా ఈ సింగల్ యాప్ ద్వారా మీరు యాక్సెస్ చేయవచ్చు. ఇప్పటి నుంచి రైలు టికెట్ బుక్ చేయడానికి ,స్టేటస్ చెక్ చేయడానికి, రెండు మూడు యాప్స్ డౌన్లోడ్ చేయాల్సిన పనిలేదు. RailOne యాప్ తో మీకు కావాల్సిన సేవలు లభిస్తాయి. జనరల్ టికెట్ మీ మొబైల్ డివైజ్ ద్వారా ఈ యాప్ లోనే బుక్ చేసుకుంటారు. ప్రతిరోజు రాకపోకలు చేసే వారికి రైల్వే వన్ యాప్ తప్పనిసరి.
పెద్ద మొత్తంలో రైల్వే కౌంటర్ల వద్ద క్యూ కట్టి రైల్ టికెట్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. సులభంగా రైల్వే యాప్ తో ఇది సాధ్యమవుతుంది. RailOne యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాలి. ఇందులో కేవలం టికెట్ బుకింగ్ మాత్రమే కాదు రిజర్వేషన్, లైవ్ ట్రైన్ స్టేటస్, లొకేషన్ ట్రాకింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. అంటే ఒక్క యాప్ ద్వారా అనేక బెనిఫిట్స్ లభిస్తున్నాయి.
RailOne App లో టికెట్ బుక్ చేసుకునే విధానం..
రైల్ వన్ యాప్ ఓపెన్ చేయండి. అక్కడ మీ జర్నీ ప్లాన్ ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత అన్ రిజర్వ్డ్ జనరల్ టికెట్ ఎంచుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మీకు జీపీఎస్ కూడా ఆన్ చేసుకునే సౌలభ్యం ఉంది. తద్వారా లోకేషన్ కూడా డిటెక్ట్ అయిపోతుంది. మీకు ఏ టైం కావాలి కూడా ఎంపిక చేసుకోవచ్చు. మెయిల్, ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మీరు సరిగ్గా వివరాలు నమోదు చేశారా? ఒకసారి చెక్ చేసుకోండి. చివరగా చెల్లింపులు చేసి ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయండి. అప్పుడు నేరుగా మీ ఫోన్కు మై టికెట్ సెక్షన్లో టికెట్ వచ్చేస్తుంది. దాని పీడీఎఫ్ ఫార్మాట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Also Read: టోల్ గేట్ ముందు టెన్షన్ వద్దు.. 30 సెకన్లలో FASTag బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Snake in Cabbage Video Watch Here: ప్రస్తుతం మార్కెట్ నుంచి తెచ్చుకునే కూరగాయల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించే ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. సాధారణంగా కూరగాయల అన్నాక క్రిములు.. కీటకాలు, చిన్న చిన్న పురుగులు రావడం సర్వసాధారణం. కానీ మనం రోజు తినే క్యాబేజీలో ఏకంగా పాము ప్రత్యక్షమవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రమాదకరమైన పాము క్యాబేజీలోకి వెళ్తున్న దృశ్యాలు చూసి నేటిజెన్లు షాక్ అయిపోతున్నారు. ఇంతకీ ఈ వీడియో నిజమేనా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఒక క్యాబేజీ లోపల పొరల మధ్య ఒక చిన్న పాము నక్కి ఉండడం మీరు క్లియర్ గా ఈ వీడియోలో చూడొచ్చు. అయితే ఈ పాము క్యాబేజీ చిన్న చిన్న ఆకుల పొరల మధ్యలో ఉండడం.. దాని తోక భాగం మాత్రం బయటికి కనిపించేలా ఉండడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఈ పాము క్యాబేజీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం కూడా గమనించవచ్చు. అయితే, ఇలాంటి కూరగాయలను తీసుకువచ్చే క్రమంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మార్కెట్లోని ఒకటికి రెండుసార్లు చూసి కొనుగోలు చేయడం మంచిది.. లేదంటే వీటిని పట్టుకునే క్రమంలో దాడి చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు.
ఈ వీడియోని చూసిన కొంతమంది నిపుణులు స్పందిస్తూ వస్తున్నారు.. ముఖ్యంగా క్యాబేజీ లాంటి ఆకుకూరలతో పాటు కొన్ని రకాల కూరగాయలు కొనుగోలు చేసిన తర్వాత శుభ్రం చేసే క్రమంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందట. ముఖ్యంగా వీటిని కొనుగోలు చేసే సమయంలోనే వాటిని క్షుణ్ణంగా పరిశీలించి.. రంధ్రాలు కలిగిన వాటిని కొనుగోలు చేయకపోవడం చాలా మంచిదని వారు చెబుతున్నారు. ముఖ్యంగా క్యాబేజీ లాంటి కూరగాయలను నేరుగా కోయకుండా.. ఒక్కొక్క పొరను విడదీసి చూసుకొని మరి జాగ్రత్తగా కోసుకోవడం మంచిది.
అలాగే మార్కెట్లలో ఈ క్యాబేజీని కొనుగోలు చేసిన తర్వాత తప్పకుండా వన్డే క్రమంలో గోరువెచ్చని నీటిలో శుభ్రం చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఏవైనా క్రిమి కీటకాలు లేదా మరేమైనా పురుగులు ఉంటే చనిపోయే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం చాలా పాములు ఆహారం లభించలేకపోవడం కారణంగా.. పొలాల్లో చేరి.. ఇలాంటి ఆహారాలతో కడుపు నింపుకుంటున్నాయి. ఇటీవల వివిధ కూరగాయలను తింటున్న పాములకు సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.. అయితే ఈ వీడియో చూసిన చాలా మంది మాత్రం ఇది అసలైన వీడియో కాదని.. ఎవరో కావాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎడిట్ చేసి పోస్ట్ చేశారని చెబుతున్నారు. ఫ్యాక్ట్ చెక్ లో భాగంగా ఈ వీడియో నిజమైంది కాదని తెలింది.
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Cobra Hair Video Here: ప్రకృతిలో మనకు తెలిసిన వింతలు ఎన్నో జరుగుతూ ఉంటాయి.. కొన్నిసార్లు మనం చూసే దృశ్యాలు ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా భయాందోళన కూడా సృష్టిస్తూ ఉంటాయి. తాజాగా ఇలాంటి దృశ్యాలకు సంబంధించిన వీడియోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలు అత్యంత ప్రమాదకరమైన నాగుపాము కూడా ఉంది. అయితే, ఈ పాము అన్ని పాములు కంటే చాలా భిన్నంగా ఉంది. అంతేకాకుండా చాలా ప్రత్యేకంగా కూడా కనిపిస్తూ ఉంది. సాధారణ పాములకు జుట్టు ఉండదు.. కానీ ఈ వీడియోలో కోబ్రాకు జుట్టు ఉన్న దృశ్యాలు మీరు చూడొచ్చు. ఈ వింత వీడియోను చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో.. అత్యంత ప్రమాదకరమైన కోబ్రా పాము పడగవిప్పి ఉండడం మీరు గమనించవచ్చు.. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ పాము పడగ వెనక భాగంలో మనుషుల జుట్టు లాంటి నల్లటి వెంట్రుకలు కనిపిస్తూ ఉన్నాయి. గాలికి ఆ జుట్టు అటు ఇటు ఊగడం మీరు క్లియర్గా చూడొచ్చు. పాము పడక విప్పినప్పుడు ఆ నల్లటి జుట్టు దాని తల నుంచి కిందకు వేలాడుతూ ఉండడం మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. సాధారణంగా పాములు ఎలాంటి జుట్టును కలిగి ఉండవు. కానీ ఈ వీడియోలో మాత్రం అత్యంత ప్రమాదకరమైన పాముకు జుట్టు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ వింత దృశ్యాన్ని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. కొందరు ఇది నిజమైన పామేనా అని అనుమానం వ్యక్తం చేస్తుంటే. మరి కొంతమంది అయితే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సృష్టించిన వీడియో అని కామెంట్లు రాస్తూ వస్తున్నారు. అలాగే మరికొందరైతే పురాణాల్లో ఇలాంటి పాముల గురించి ప్రస్తావించారని.. ఇలా జుట్టు ఉన్న పాములు అనేక కథల్లో ఉన్నాయని వింత వింతగా కామెంట్లలో చెబుతూ వస్తున్నారు. మరి కొంతమంది అయితే.. ఎవరో కావాలని పాము తల భాగంలో వెంట్రుకలను పెట్టారని అంటున్నారు.
శాస్త్రీయంగా చూస్తే.. పాములకు ఎలాంటి జుట్టు ఉండే అవకాశం లేదట.. అలాంటిది ఈ పాము కు జుట్టు ఉండడం ఆశ్చర్యమేస్తుంది కదూ.. సాధారణంగా పాముల శరీర భాగం క్లియర్ గా పరిశీలిస్తే.. పొలుసులుగా ఉంటుంది.. కానీ ఈ వీడియోలో పాము స్మూత్ గా కనిపించడం చూసి.. చాలామంది ఇది ఎడిటింగ్ చేసిన వీడియో అని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చిన తర్వాత.. ఇలా ప్రమాదకరమైన పాములకు వింత వింత వస్తువులను జోడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు.
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Cobra In Shoe Video Watch Here: ప్రతి ఒక్కరికి ఇంటి బయట లేదా వరండాల్లో తప్పకుండా చెప్పులు విడిచే అలవాటు ఉంటుంది.. ఈ అలవాటు మీకు కూడా ఉందా? అయితే, ఈ వీడియో మీ కోసమే. షూ రాక్లోని దాక్కున్న ఓ భారీ నాగుపాము కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో కోబ్రా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. షూ పెట్టుకునే రాక్ లో దర్శనమిచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మనం ఎక్కడి నుంచైనా బయటికి వెళ్లి ఇంటికి రాగానే చెప్పులు లేదా షూస్ ను తప్పకుండా పక్కనే ఉన్న స్టాండ్లో పెట్టుకుంటూ ఉంటా. అయితే అలా పెట్టిన స్టాండ్ లో ఉన్న షూలో అత్యంత ప్రమాదకరమైన కోబ్రా కనిపించింది.. ఓ వ్యక్తి ఆ షూను వేసుకుందామని వెళ్లగా అక్కడ ఊహించని దృశ్యాలు అతనికి కనిపించాయి.. షూ లోపల ఒక నాగుపాము దూరి ఉంది.. ఆ పాము నెమ్మదిగా అందులో నుంచి బయటికి రావడం ఆయన గమనించారు.. వెంటనే అతను అతని కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయడంతో వారు ఆ పామును చూసేందుకు అక్కడికి వచ్చారు..
ఈ వీడియోలో కనిపిస్తున్న గ్రే కలర్ షూలోపల నాగుపాము తన శరీరాన్ని చుట్టుకొని ఉండటం మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఆ పాము నెమ్మదిగా షూ లోపలి నుంచి బయటికి పాకుతూ కింద ఉన్న ఇతరు చెప్పుల వైపుగా వెళ్తోంది. అదృష్టవశాత్తు ఆ వ్యక్తికి షూ వేసుకోక ముందే పాము కనిపించింది.. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది అనవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ పామును గమనించకపోతే తప్పకుండా దాని కాటు బారిన పడేవాడు.
ముఖ్యంగా వర్షాకాలంలో లేదా ఎండాకాలంలో విష సర్పాలు ఇలా ఆహ్వానం కోసం ఇళ్లలోకి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇంటి లోపల ఎక్కువగా వస్తువులు ఉన్న చోటికి ఇలాంటి పాములు వస్తూ ఉంటాయి. కాబట్టి అడవికి దగ్గరగా ఉండేవారు తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంటి బయట ఉన్న వస్తువులు ఒకటికి రెండుసార్లు చూసి వాటిని పట్టుకోవడం మంచిది. లేదంటే ఇలాంటి విషపూరితమైన పాము కాటున పడాల్సి వస్తుందని కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు.
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Employee Bonus Telugu Latest News: ప్రస్తుత కాలంలో కంపెనీ లాభాల కోసం ఎంప్లాయిస్పై ఊహించని ఒత్తిడి పెడుతుంటే.. ఒక చైనీస్ కంపెనీ మాత్రం తన ఉద్యోగుల పట్ల అపారమైన ప్రేమను చాటుకుంది. తమ వార్షిక లాభాల్లో పెద్ద భాగాన్ని ఉద్యోగులకే బోనస్ గా ప్రకటించి వార్తల్లో నిలిచాడు ఆ కంపెనీ యజమాని.. చైనాకు చెందిన హెనాన్ కువాంగ్షాన్ క్రేన్ కంపెనీ ఉద్యోగులకు ఏకంగా 180 మిలియన్ యువాన్ల బోనస్ ను పంపిణీ చేశారు. ఇప్పటికీ ఇంత ఊహించని స్థాయిలో బోనస్ ప్రకటించిన కంపెనీలో ఈ కంపెనీ నిలిచిపోయింది.
అయితే, కంపెనీకి సంబంధించిన యజమాని బోనస్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవంగా సెలబ్రేట్ చేశారు. కంపెనీ నిర్వహించిన వార్షిక వేడుకలో సుమారు 7000 మంది ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదికపై భారీ టేబుల్ ల మీద నగదు కట్టలను కుప్పలుగా పేర్చారు. సుమారు 80 కోట్లను అక్కడక్కడే నగదు రూపంలో పంపిణీ చేయడం విశేషం.. అంతేకాకుండా ఉద్యోగులకు ఒక ఆసక్తికరమైన టాస్కులు కూడా పెట్టారు.. వేదికపై ఉన్న నగదును వారు చెప్పిన సమయంలో ఎంత లెక్కపెట్టగలిగితే.. ఆ మొత్తాన్ని వారి ఇంటికి తీసుకెళ్లవచ్చు అని తెలిపారు. దీంతో ఉద్యోగులు ఎంతో ఉత్సాహంగా నగదు కట్టలను చేతిలోకి తీసుకుంటున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
2025 సంవత్సరం ఈ కంపెనీ సుమారు 270 మిలియన్ల యువాన్ల లాభాలు పొందినట్లు సమాచారం. ఇందులో దాదాపు 70 శాతం మొత్తాన్ని అంటే 180 మిలియన్ యువాన్లను ఉద్యోగులకు బోనస్ రూపంలో ఇవ్వడం ఇప్పుడు విశేషం.. కంపెనీ చైర్మన్ పీజున్ మాట్లాడుతూ.. యువత ప్రస్తుతం కారులోన్లతో పాటు ఇంటి లోన్లతో సతమతమవుతున్నారు.. వారికి మా వంతుగా కొంత ఉపశమనం కలిగించాలన్నదే కంపెనీ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు..
Also Read: Garikapati Narasimha Rao: లివింగ్ రిలేషన్ ఒక కొత్త దరిద్రం.. మంథనిలో గరికిపాటి సంచలన వ్యాఖ్యలు!
గతంలో కూడా ఈ కంపెనీ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు భారీ గిఫ్ట్లను అందించింది. దీంతో ఈ యజమానికి డబ్బులు పంచెయ్ బాస్గా పేరు ఉంది. కేవలం గిఫ్టులతో పాటు వస్తువులకు పరిమితం కాకుండానే.. ఈ కంపెనీకి సంబంధించిన బాస్ నేరుగా నగదును చేతిలో పెడతారు. దీనివల్ల ఉద్యోగులకు వస్తువుల కంటే ఎక్కువగా నగదుతో ఉపయోగముంటుందనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా చేస్తారని కంపెనీలోని కొంతమంది అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలను చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Also Read: Garikapati Narasimha Rao: లివింగ్ రిలేషన్ ఒక కొత్త దరిద్రం.. మంథనిలో గరికిపాటి సంచలన వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
YCP MLCs Attack On Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కాస్తా తోపులాట వరకు వెళ్లడంతో సభలో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ (BJP) ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై వైకాపా సభ్యులు దాడికి యత్నించడం సంచలనంగా మారింది.
అసలేం జరిగింది?
మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ జరిగింది. దీనిపై నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సుదీర్ఘంగా సమాధానం ఇచ్చారు. మంత్రి సమాధానం పూర్తయిన వెంటనే, ఈ అంశంపై మరింత చర్చ జరపాలని వైకాపా సభ్యులు పట్టుబట్టారు.
అయితే, మంత్రి సమాధానం ముగియడంతో మండలి ఛైర్మన్ మోషేనురాజు తదుపరి ప్రశ్నకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలో భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడేందుకు ప్రయత్నించగా, నిరసన తెలుపుతున్న వైకాపా సభ్యులు ఒక్కసారిగా ఆయనపైకి దూసుకెళ్లారు.
ముగ్గురు ఎమ్మెల్సీల దూకుడు
వైకాపా ఎమ్మెల్సీలు ఇజ్రాయెల్, విక్రాంత్, రమేశ్ యాదవ్లు సోము వీర్రాజు వైపు వేగంగా దూసుకువచ్చారు. "మేము నిరసన తెలుపుతుంటే మీరు మైక్ ఎలా తీసుకుంటారు?" అంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి యత్నించారు. ఈ అనూహ్య పరిణామంతో సభలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది.
అడ్డుకున్న మంత్రులు - సభ వాయిదా
సోము వీర్రాజుపై వైకాపా సభ్యులు దూసుకురావడాన్ని గమనించిన మంత్రులు వంగలపూడి అనిత, గొట్టిపాటి రవికుమార్ తక్షణమే స్పందించారు. వారు వీర్రాజుకు మద్దతుగా నిలిచి, వైకాపా సభ్యులను అడ్డుకున్నారు. ఉభయ పక్షాల మధ్య వాగ్వాదం పెరగడంతో సభ నియంత్రణ తప్పింది.
పరిస్థితిని చక్కదిద్దేందుకు మండలి ఛైర్మన్ మోషేనురాజు సభను కొద్దిసేపు వాయిదా వేశారు. శాసన సభ, మండలిలో సభ్యులు హుందాగా వ్యవహరించాల్సింది పోయి, ఇలా భౌతిక దాడులకు దిగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
TTD Room Booking Fraud: తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదుల బుకింగ్ పేరుతో భక్తులు మరోసారి నిలువునా మోసపోతున్నారు. భక్తులను మోసం చేస్తున్న దళారులు, నకిలీ వెబ్సైట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తీవ్రస్థాయిలో మండిపడింది. భక్తులు మోసపోకుండా ఉండేందుకు టీటీడీ విజిలెన్స్ విభాగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది.
వెలుగులోకి వచ్చిన ఘటన
కేరళకు చెందిన సి.కె. సురేష్ బాబు అనే భక్తుడు తిరుమలలో గదులు ఇప్పిస్తామన్న దళారుల మాటలు నమ్మి మోసపోయారు. 'కర్ణాటక ప్రవాసి సౌధ' పేరుతో గదులు బుక్ చేస్తామని చెప్పి ఆయన దగ్గర డబ్బులు వసూలు చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్ విభాగం, దళారుల నెట్వర్క్ను ఛేదించే పనిలో పడింది.
నకిలీ వెబ్సైట్లు ఎలా గుర్తిస్తారు?
టీటీడీ ఐటీ విభాగం జరిపిన విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. టీటీడీ అధికారిక చిహ్నాలు, శ్రీవారి ఆలయ చిత్రాలను వాడుతూ అచ్చం ఒరిజినల్ వెబ్సైట్లాగే భక్తులను నమ్మిస్తున్నారు. గూగుల్లో సర్చ్ చేసినప్పుడు ఈ ఫేక్ సైట్లు ముందుగా కనిపిస్తూ, ఆన్లైన్ పేమెంట్ల ద్వారా భక్తుల సొమ్మును కాజేస్తున్నాయి. ఇప్పటికే అటువంటి వెబ్సైట్లపై కాపీరైట్ చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
భక్తులు పాటించాల్సిన జాగ్రత్తలు..
శ్రీవారి భక్తులు కింది విషయాలను గుర్తుంచుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. దర్శనం, వసతి, సేవ టికెట్ల కోసం కేవలం అధికారిక వెబ్సైట్ను మాత్రమే సంప్రదించండి. తిరుమలలో వసతి గదులు ఇప్పిస్తామనే దళారులను అస్సలు నమ్మకండి. ఏదైనా అనుమానాస్పద ఫోన్ కాల్స్ లేదా వెబ్సైట్లు కనిపిస్తే వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం అందించండి.
ముఖ్య సూచన: భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఒకే ఒక అధికారిక వెబ్సైట్ను నిర్వహిస్తోంది. దయచేసి ఇతర ప్రైవేట్ లింకుల ద్వారా డబ్బులు చెల్లించి మోసపోవద్దు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Crime News: ఒకే రోజు డబుల్ షాక్.. రూ.7 లక్షల ఫేక్ గోల్డ్ స్కాం.. 6 తులాల బంగారం దోపిడి..!!
Fake Gold Scam: తెలంగాణలోని రెండు జిల్లాల్లో చోటుచేసుకున్న వేర్వేరు ఘటనలు ప్రజల్లో భయాందోళన రేపుతున్నాయి. ఒకటి ఫేక్ గోల్డ్ పేరుతో జరిగిన ఘరానా మోసం కాగా, మరొకటి పట్టపగలే జరిగిన ఇంటి దొంగతనం. నల్లగొండ జిల్లాలో ఫేక్ గోల్డ్ పేరుతో 7 లక్షల వరకు మోసపోయిన బాధితులు బోరుమంటుంటే.. నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మండలం హాజీపూర్ గ్రామంలో ఓ ఇంట్లోకి చొరబడిన దుండగలు 6 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ రెండు సంఘటనలు అప్రమత్తత ఎంత ముఖ్యమో మళ్లీ గుర్తు చేస్తున్నాయి.
నల్లగొండ జిల్లాలోని శాలిగౌరారం మండలం రామానుజపురంలో మోసగాళ్ల ముఠా చాకచక్యంగా పన్నిన పథకం వెలుగులోకి వచ్చింది. విజయవాడ ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు మరో వ్యక్తితో కలిసి గ్రామాల్లో సంచరిస్తూ అమాయకులను టార్గెట్ చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. విజయవాడ వరదల్లో దొరికిన బంగారం అని చెప్పి తక్కువ ధరకు అమ్ముతామని నమ్మబలికారు. మొదట అసలు బంగారం ముక్కను నమూనాగా చూపించి నమ్మకం కలిగించారు. ఆ నమ్మకంతో గ్రామానికి చెందిన వ్యక్తి రూ.7 లక్షలు చెల్లించి ఆభరణాలు కొనుగోలు చేశాడు. అయితే తర్వాత పరీక్షించగా అవి ఇత్తడి అని తేలడంతో అసలు మోసం బయటపడింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని, ఈ ముఠా వెనుక మరెవరైనా ఉన్నారా అనే దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ వస్తే నమ్మవద్దని అధికారులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.
ఇక మరో ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. అచ్చంపేట మండలం హాజీపూర్ గ్రామంలో సైదులు అనే వ్యక్తి ఇంట్లో మధ్యాహ్నం సమయంలోనే దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంటి యజమాని పనిమీద బయటకు వెళ్లిన సమయంలో తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాను పగలగొట్టి నగదు, సుమారు 6 తులాల బంగారం అపహరించారు. సాయంత్రం ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు ఇల్లు చిందరవందరగా ఉండటాన్ని చూసి షాక్కు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. క్లూస్ టీమ్ సహాయంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. గ్రామాల్లో కొత్త వ్యక్తుల కదలికలపై సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. రెండు జిల్లాల్లో జరిగిన ఈ ఘటనలు గ్రామీణ ప్రాంతాల్లోనూ నేరగాళ్లు చురుగ్గా ఉన్నారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఇక ఫేక్ గోల్డ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. బంగారం పేరుతో కాపర్, బ్రాస్ వంటి లోహాలను ప్రత్యేక్షంగా పాలిస్ చేసి గోల్డ్ లుక్ వచ్చే విధంగా తయారు చేస్తారు. రెడ్ కలర్ షేడ్ ఉండటంతో ఇది సాధారణ బంగారం వలే కనిపిస్తుంది. మొదట కొనుగోలు చేసినప్పుడు మెరుస్తుంది. కానీ కొద్ది వారాల్లోనే రంగు తగ్గుతుంది. మచ్చలు పడటం, మెటల్ వెలిసిపోతుంది. ముఖ్యంగా ఇందులో గోల్డ్ కంటెంట్ జీరో. అందుకే రీసేల్ వాల్యూ ఉండదు. లోన్ తీసుకోవడం కూడా సాధ్యం కాదు. ఈ స్కామ్ ఎక్కువగా రూడ్లపై.. చిన్న మార్కెట్లో సోషల్ మీడియాలో గ్రూపుల్లో సర్క్యూలేట్ అవుతోంది. ఇంపోర్ట్ గోల్డ్, స్మగ్లింగ్ స్టాక్, డ్యూటీ లేకుండా వచ్చిన బంగారం అంటూ మార్కెట్ ధర కంటే 20శాతం నుంచి 40శాతం తక్కువ ఇస్తామని నమ్మబలుకుతున్నారు. వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ ఒత్తిడి చేస్తుంటారు. బిల్లు ఉండదు. అసలు బిస్ హాల్ మార్క్ఉండదు. ఫేక్ స్టాంప్ వేసి ఇస్తారు. కొన్న తర్వాత వారి ఫోన్ నెంబర్స్ కూడా పనిచేయవు. ఇదే వారి మోసం. ఇలాంటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.
Also Read: Gold: మార్కెట్లో బంగ్లాదేశ్ ఫేక్ గోల్డ్ చక్కర్లు.. గుర్తు పట్టడం దేవుడి వల్ల కూడా కాదు..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
India Vs Zimbabwe Match Preview: చెన్నైలోని చెపాక్ స్టేడియం నేడు బ్లూ జెర్సీలతో నిండిపోనుంది. టీ20 ప్రపంచకప్ సూపర్-8లో టీమ్ఇండియా ఈ రోజు కీలక మ్యాచ్ ఆడనుంది. టోర్నీ సెమీఫైనల్కు వెళ్లేందుకు ఈ మ్యాచ్ చావోరేవో తేల్చుకోవాల్సిన సమయం సూర్యసేన ఎదురుకొంటోంది. జింబాబ్వేతో జరిగే ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఉండడం వల్ల అభిమానుల్లో కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరోవైపు ప్రత్యర్థి జట్టు కూడా బలంగా కనిపించడం వల్ల ఇప్పుడు ఫ్యాన్స్లో మరింత టెన్షన్ వాతావరణం నెలకొంది.
మ్యాచ్ సమాచారం:
టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా నేడు అనగా ఫిబ్రవరి 26న భారత్, జింబాబ్వే మధ్య మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకు (IST) చెన్నైలోని చెపాక్ స్టేడియం ఈమ్యాచ్కు వేదిక కానుంది. సెంట్రల్ పిచ్ (నెం. 5)పై మ్యాచ్ జరగనుంది. ఇది నల్లరేగడి నేల పిచ్.. గత మ్యాచ్ల్లో ఈ పిచ్ పై జరిగిన స్కోర్లు 200 వరకు నమోదయ్యాయి. దీంతో ఈ పిచ్లో జరిగే మ్యాచ్ బ్యాటర్లకు పండగే.
భారత జట్టు
భారత బ్యాటింగ్ లైనప్పై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా టాప్-ఆర్డర్ విఫలం కావడం ఆందోళన కలిగిస్తోంది. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం సంజు శామ్సన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు తన తండ్రి అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమైన రింకూ, బుధవారం సాయంత్రం తిరిగి జట్టుతో చేరాడు. జింబాబ్వేలో ఎక్కువ మంది కుడిచేతి వాటం బ్యాటర్లు ఉన్నందున అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
టీమ్ఇండియా జట్టు అంచనా..
అభిషేక్ శర్మ, సంజు శామ్సన్ (wk), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (c), శివం దుబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ CV, జస్ప్రీత్ బుమ్రా.
జింబాబ్వే తుదిజట్టు విశ్లేషణ..
వెస్టిండీస్ చేతిలో ఓటమి తర్వాత జింబాబ్వే కూడా ఇప్పుడు గెలిచి తీరాల్సిన స్థితిలో ఉంది. ముంబై మ్యాచ్లో గాయపడిన కెప్టెన్ సికందర్ రజా కోలుకున్నాడు, అతను 100% ఆడుతున్నట్లు జట్టు వర్గాలు తెలిపాయి. జింబాబ్వేలో వైవిధ్యమైన బౌలింగ్ ఆప్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా లెగ్ స్పిన్నర్ ర్యాన్ బర్ల్ భారత్కు సవాల్ విసరే అవకాశం ఉంది.
జింబాబ్వే తుదిజట్టు అంచనా..
బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మరుమాని (wk), డియోన్ మైయర్స్, ర్యాన్ బర్ల్, సికందర్ రాజా (c), టోనీ మున్యోంగా, తషింగా ముసేకివా, బ్రాడ్ ఎవాన్స్, గ్రేమ్ క్రీమర్, రిచర్డ్ న్గారావ, బ్లెస్సింగ్ ముజారబాని.
మీకు తెలుసా?
1) ఈ ప్రపంచకప్లో భారత ఓపెనింగ్ వికెట్ సగటు కేవలం 6.80 మాత్రమే. ఇది అన్ని జట్ల కంటే తక్కువ.
2) 2024 నుంచి ఇప్పటివరకు T20Iలలో 1748 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బెన్నెట్ రికార్డు సృష్టించాడు.
3)భారత్ తరపున బుమ్రా (33), అర్ష్దీప్ (32) వికెట్లతో టాప్ ఫామ్లో ఉన్నారు.
దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత సెమీఫైనల్ బెర్త్ కోసం నెట్ రన్ రేట్ (-3.800) కీలకం కానుంది. కాబట్టి జింబాబ్వేపై భారీ విజయం సాధించడం టీమ్ ఇండియాకు అత్యవసరం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cardiac Arrest Death: పాఠశాలలో తన స్నేహితులతో సరదాగా ఆడుకుంటున్న బాలిక అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఆట స్థలంలో ఆడుకుంటున్న సమయంలో బాలిక కూలిపోయింది. తోటి విద్యార్థులు.. ఉపాధ్యాయులు బాలికను లేపి చూడగా ఎంతకీ లేవలేదు. వెంటనే హడావుడిగా ఆస్పత్రికి తరలించగా.. పరిశీలించిన వైద్యులు అప్పటికే బాలిక మృతి చెందిందని వాపోయారు. ఈ సంఘటన రాజస్థాన్లోని ఓ పట్టణంలో జరిగింది. బాలిక కుప్పకూలుతున్న వీడియో వైరల్గా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Milk Tragedy: తెలంగాణలో కల్తీపాలు తయారీ.. డబ్బు కోసం వ్యాపారి కక్కుర్తి
రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా గోటన్ పట్టణానికి చెందిన రాజేంద్ర బపేడియా కుమార్తె దివ్య (9) స్థానికంగా ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్లో 5వ తరతగతి చదువుతుండేది. నిత్యం పాఠశాలకు వెళ్లి బుద్ధిగా చదువుకునేది. ఆటల సమయంలో ఆటలు ఆడేది. ఈనెల 23వ తేదీన యథావిధిగా పాఠశాలకు వచ్చిన దివ్య పాఠశాల తరగతులు అయిపోయిన తర్వాత మైదానంలో ఆటలాడుకుంటోంది. ఈ సమయంలో అకస్మాత్తుగా దివ్య కుప్పకూలిపోయింది.
Also Read: Save Punarvika: చిన్నారి పునర్వికకు నారా లోకేశ్ అండ.. రూ.6 కోట్ల భారీ విరాళం
తమ స్నేహితురాలు కుప్పకూలిపోవడంతో తోటి స్నేహితులు లేపి చూసినా లేవలేదు. దీంతో అక్కడే ఉన్న పాఠశాల సిబ్బందితోపాటు టీచర్లు దివ్యను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతిచెందారని వైద్యులు ధ్రువీకరించారు. అయితే బాలికకు ఎలాంటి గాయాలు కాకపోవడం గమనార్హం. ఎలాంటి గాయాలతో మృతి చెందలేదని.. గుండెపోటు కారణంగా బాలిక మృతి చెంది ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో దివ్య కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. అయితే ఆ కుటుంబంలో ఇలాంటి సంఘటన రెండోది కావడం కలచివేస్తోంది.
రాజేంద్ర బపేడియాకు గతంలో కుమారుడు కూడా ఉండేవాడు. ఆ బాలుడు కూడా దివ్య మాదిరి చనిపోయాడు. దివ్య సోదరుడు అభిషేక్ గుండెపోటుతోనే మరణించినట్లు వారి బంధుమిత్రులు గుర్తుచేస్తున్నారు. గతేడాది సెప్టెంబర్లో ఆ బాలుడు ఇంట్లో ఆడుకుంటూ కూలిపోయాడు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే అభిషేక్ మరణించాడు. ఇప్పుడు బాలుడి చెల్లెలు దివ్య కూడా అదే తీరున మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది. నెలల వ్యవధిలో ఇద్దరు పిల్లలను కోల్పోయిన ఆ కుటుంబం తీరని విషాదంలో మునిగింది. ఒక కుటుంబంలోని ఇద్దరు ఇలా హఠాన్మరణం చెందడం చూస్తే జన్యుపరమైన లోపం ఏమైనా ఉంటుందా? అనే చర్చ జరుగుతోంది. వంశపారంపర్యగా వచ్చిన అనారోగ్య సమస్యలతో ఇలా మరణిస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది. దీంతో ఆ కుటుంబం వైద్య పరీక్షలు చేయించుకోనుంది. కాగా తోటి బాలిక మృతితో ఆ పాఠశాలలో తీవ్ర విషాదం ఏర్పడింది. పాఠశాలలో బాలిక కుప్పకూలిపోయిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.
Nagaur में 9 साल की बच्ची की हार्ट अटैक से मौत!
खेल के मैदान में मासूम की अचानक तबीयत बिगड़ी और जान चली गई। pic.twitter.com/C7yxKEb1KM— एक नजर (@1K_Nazar) February 26, 2026
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook