Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad500064

రంగారెడ్డి ఆలయంలో చోరీ, రూ.10వేలకు పైగా నగదు చోరీ

Jun 17, 2024 18:35:08
Hyderabad, Telangana

అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నంది ముసలాయి గూడ సాయిబాబా ఆలయంలో రాత్రి చోరీ జరిగింది. పోలీస్ స్టేషన్‌కు 200 మీటర్ల దూరంలో ఉన్న ఆలయంలో కిలోన్నర వెండి, రూ.10వేలకు పైగా నగదు, పలు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. గుడి తాళం పగులగొట్టిన దొంగ తలుపులు తెరిచి ఆలయంలోని హుండీని ధ్వంసం చేసి అందులో ఉంచిన సొమ్మును అపహరించాడు. ఈ ప్రమాదంపై ఆలయ నిర్వాహకులు అత్తాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వేలిముద్రల ఆధారాలు సేకరించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డైంది.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Mar 23, 2026 11:01:01
Hyderabad, Telangana:

Maganti Gopinath Daughter Accident: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ నుంచి హ్యాట్రిక్‌గా గెలుస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే గతేడాది తీవ్ర అనారోగ్యంతో మృతి చెందగా.. ఆ విషాదం నుంచి ఇంకా కోలుకోకముందే ఆ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. మాగంటి గోపీనాథ్‌ కుమార్తెలు రోడ్డు ప్రమాదానికి గురయి తీవ్ర గాయాలపాలయ్యారు. వారిలో పెద్ద కుమార్తె పరిస్థితి అత్యంత విషమంగా ఉండగా.. చిన్న కుమార్తె తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. ఈ సంఘటనతో మాగంటి గోపీనాథ్ కుటుంబం తీవ్ర ఆవేదన చెందుతుండగా.. ఆయన అభిమానులు భయాందోళన చెందుతున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Garikapati On Anushka: 'దీని దుంపతెగ.. అన్నీ అవయవాలు అలా ఉన్నాయి'.. హీరోయిన్‌ అనుష్కపై గరికపాటి అనుచిత వ్యాఖ్యలు

మాగంటి గోపీనాథ్‌కు ఓ కుమారుడితోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అక్షర, దిశిర. వారు ఆదివారం రాత్రి గచ్చిబౌలి నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్తూ హైదరాబాద్‌లోని నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్‌)పై ప్రయాణిస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న ఫార్చూనర్‌ కారు ప్రమాదానికి గురయ్యింది. నిన్న అర్ధరాత్రి ప్రమాదవశాత్తు డీసీఎం వాహనాన్ని వారు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పెద్ద కుమార్తె అక్షర తీవ్ర గాయాలపాలవగా.. చిన్న కుమార్తె దిశిర ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా బయటపడింది. ఈ సంఘటన నార్సింగ్‌లో పోలీస్ అకాడమీ సమీపంలో చోటుచేసుకుంది.

Also Read: Vahan Portal: వాహన పోర్టల్‌లో చేరిన తెలంగాణ.. రిజిస్ట్రేషన్‌ నుంచి ప్రతిదీ ఆన్‌లైన్‌లోనే!

ప్రమాదం జరిగిన అనంతరం వాహనదారులు, స్థానికులు వెంటనే సహాయ చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకున్న అక్షరను బయటకు తీసుకురాగా.. దిశిర క్షేమంగా బయటపడింది. ఆ వెంటనే అంబులెన్స్‌లో ఆమెను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్షరకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ సంఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Revanth Reddy: సిద్దిపేట గడ్డపై రేవంత్ రెడ్డి ఛాలెంజ్.. హరీశ్‌ రావును ఓడిస్తే మంత్రి పదవి ఆఫర్

ఆందోళనలో మాగంటి కుటుంబం
ఈ ప్రమాదంపై మాగంటి గోపీనాథ్‌ కుటుంబంలో భయాందోళన చెందుతోంది. తండ్రిని కోల్పోయి పెద్ద దిక్కు లేని ఆ కుటుంబం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. తండ్రి చనిపోయి పది నెలలు కూడా గడవకముందే ఇప్పుడు అక్షర తీవ్ర గాయాలపాలవడంతో మాగంటి కుటుంబం షాక్‌కు గురయ్యింది. ఆయన చనిపోయి ఏడాది కాకముందే కుమార్తెలు అక్షర, దిశర ప్రమాదం బారినపడడంతో మాగంటి అభిమానులు కలత చెందుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ పార్టీ అగ్ర నాయకులు వివరాలు తెలుసుకున్నారు. మాగంటి కుటుంబానికి బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా నిలిచారు. కుటుంబసభ్యులతో మాట్లాడి అక్షర ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1091
comment0
Report
HDHarish Darla
Mar 23, 2026 10:55:32
Hyderabad, Telangana:

LPG Gas Booking Scam News: దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరత నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో మోసాలకు తెగబడుతున్నారు. మొబైల్స్‌లో గుర్తుతెలియని లింకులు లేదా యాప్‌లను నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్ లేదా హెల్ప్‌లైన్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకోవడం ఎల్లప్పుడూ ఉత్తమం అని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇప్పుడు దేశీయంగా LPG గ్యాస్ కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరు సైబర్ నేరగాళ్లు ఇదే అదునుగా భావించి మరో కొత్త స్కామ్‌కు శ్రీకారం చుట్టారు. గ్యాస్ సిలిండర్ బుకింగ్ స్కామ్ అనే కొత్త సైబర్ మోసానికి ఇప్పుడు ఎంతో మంది అమాయకులు బలి అవుతున్నారు. అయితే ఇలాంటి మోసాల పట్ల ప్రజల్లో అవగాహన కలిగి ఉండాలని.. అజాగ్రత్తగా ఉండరాదని పోలీసులు సూచించారు.  

మొబైల్ ఫోన్ల ద్వారా గ్యాస్ బుక్ చేసేవారు ఇలాంటి రకమైన మోసాలకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు ప్రజలను మభ్యపెట్టి.. వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేందుకు అనేక రకాల పద్ధతులను ఉపయోగిస్తున్నారు. మీ చిన్న నిర్లక్ష్యం మీ బ్యాంకు ఖాతాను పూర్తిగా ఖాళీ చేసే అవకాశం ఉంది. అందువల్ల, ఈ మోసం గురించి ప్రజలు ముందుగానే గ్రహించి..జాగ్రత్తగా ఉండడం ఎంతో ముఖ్యం. 

మోసం ఎలా జరుగుతుంది?
సైబర్ నేరగాళ్లు ముందుగా మీ ఫోన్‌కు ఒక సందేశం పంపుతారు. ఆ తర్వాత వాట్సాప్ ద్వారా 'గ్యాస్ బిల్ అప్‌డేట్ APK' అనే ఫైల్‌ను పంపుతారు. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి, మీ గ్యాస్ బుకింగ్‌ను అప్‌డేట్ చేసుకోమని వారు మిమ్మల్ని అడుగుతారు. మీరు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత.. సైబర్ మోసగాళ్లకు మీ ఫోన్‌పై పూర్తి నియంత్రణ లభిస్తుంది. వారు మీ బ్యాంక్ వివరాలు.. UPI పిన్, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలిస్తారు.

పోలీసులు ఏ సలహా ఇచ్చారు?
ఏ కారణం చేతనైనా గుర్తుతెలియని లింకులు లేదా యాప్‌లను నమ్మవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గ్యాస్‌ను ఎల్లప్పుడూ అధికారిక వెబ్‌సైట్ లేదా హెల్ప్‌లైన్ ద్వారానే బుక్ చేసుకోండి. మీకు ఏవైనా అనుమానాస్పద సందేశాలు వస్తే, వెంటనే వాటిని 1930 హెల్ప్‌లైన్‌కు తెలియజేయండి. మీరు దీనిని cybercrime.gov.in లో కూడా ఫిర్యాదు చేయవచ్చు.

ప్రమాదం ఎందుకు పెరుగుతోంది?
మోసగాళ్లు సిలిండర్ల కొరతను ఆసరాగా తీసుకుని ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. కొద్దిపాటి జాగ్రత్తతో, మీరు ఇలాంటి సైబర్ మోసాలను నివారించవచ్చు.

ఈ మోసాల బారిన పడకుండా ఉండేందుకు ఇవి పాటించండి...
1) తెలియని SMS లేదా WhatsApp లింక్‌లపై క్లిక్ చేయవద్దు.
2) బయటి నుండి ఏ 'APK ఫైల్' లేదా ఏ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయకండి.
3) కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా అప్లికేషన్ ద్వారా మాత్రమే గ్యాస్ బుక్ చేసుకోవడం ఉత్తమం.
4) మీ OTP, UPI PIN లేదా బ్యాంక్ వివరాలను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు.
5) ఎవరైనా మిమ్మల్ని వ్యక్తిగత వివరాలు చెప్పమని ఒత్తిడి చేస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి.
6) మీ ఫోన్‌లో యాంటీవైరస్, సెక్యూరిటీని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి.
7) అనుమానాస్పద సందేశాలు లేదా కాల్‌లను వెంటనే బ్లాక్ చేసేయండి.
8) మోసం జరిగిందని అనుమానం వస్తే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి.
9) cybercrime.gov.inలో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయండి.
 
Also Read: 
OnePlus 15T launch Price: రేపే OnePlus 15T లాంఛింగ్.. 7500 బ్యాటరీతో మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్..ధర ఎంతంటే?

Also Read: EPF ATM Withdrawal 2026: ఉద్యోగులకు భారీ శుభవార్త..పీఎఫ్ డబ్బు విత్‌డ్రా అప్పటి నుంచే..ఇలా చేస్తే 20 శాతం నష్టపోతారు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1079
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 23, 2026 09:56:44
Hyderabad, Telangana:

Telangana Joins Vahan Portal: 'షో రూమ్‌లలో పారదర్శకంగా వాహనాల రిజిస్టేషన్ అయ్యేలా చేశాం. తెలంగాణ రవాణా శాఖ చేస్తున్న సంస్కరణలు , రోడ్ సేఫ్టీపై కేంద్రంలో ప్రశంసలు వస్తున్నాయి. ఈవీ పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలకు తెలంగాణ బ్రాండ్‌గా మారుతుంది' అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. రవాణా శాఖ డిజిటల్ మార్పును ముందుకు తీసుకెళ్తోంది. మన రాష్ట్రంలో రోజుకు సుమారు 1,500 వాహనాలు కొత్తగా రోడ్లపైకి వస్తున్నాయి. ఇలాంటి భారీ సంఖ్యలో వాహనాల సమాచారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం. ఈ అవసరాన్ని తీర్చడానికి వాహన్ పోర్టల్ ఎంతో ఉపయోగపడుతుంది' అని వెల్లడించారు.

Also Read: Revanth Reddy: సిద్దిపేట గడ్డపై రేవంత్ రెడ్డి ఛాలెంజ్.. హరీశ్‌ రావును ఓడిస్తే మంత్రి పదవి ఆఫర్

హైదరాబాద్‌ బేగంపేట వరుణ్ మోటార్స్‌ వద్ద వాహన్ పోర్టల్‌ను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు ఏశారు. ఈరోజు వాహన్ పోర్టల్ ప్రారంభించుకోవడం  తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం' అని తెలిపారు. 'ప్రజా పాలన ప్రభుత్వం వచ్చిన తరువాత రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. దేశంలో అన్ని రాష్ట్రాలు వాహన్ సారథిలో ఉండేవి.. గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం సారథిలో చేరాం' అని వెల్లడించారు. వాహన్ పోర్టల్‌లో చేరడంతో వాహన్ ద్వారా ఈరోజు నుంచి వాహన కొనుగోలు చేసే వారికి 2 శాతం అదనపు టాక్స్ రద్దు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 15 చెక్కు పోస్టులు ఎత్తివేశామని తెలిపారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని.. రవాణా శాఖ ఈవీ పాలసీ, స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామని పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు.

Also Read: Garikapati On Anushka: 'దీని దుంపతెగ.. అన్నీ అవయవాలు అలా ఉన్నాయి'.. హీరోయిన్‌ అనుష్కపై గరికపాటి అనుచిత వ్యాఖ్యలు

'ఈ పోర్టల్ ద్వారా వాహనాలకు సంబంధించిన అన్ని వివరాలు ఒకే జాతీయ డేటాబేస్‌లో సమీకరిస్తారు. దీంతో సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందుతాయి. వాహన రిజిస్ట్రేషన్, ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్, పన్నుల చెల్లింపు వంటి సేవలు ఇప్పుడు ప్రజలకు సులభంగా అందుబాటులోకి వస్తాయి' అని పొన్నం ప్రభాకర్‌ వివరించారు. ప్రభుత్వం ప్రజలకు ఆర్థికంగా కూడా ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుందని.. నేటి నుంచి రెండు, మరియు తదుపరి వ్యక్తిగత వాహనాలపై ఉన్న అదనపు 2 శాతం జీవితకాల పన్నును రద్దు చేస్తున్నట్లు పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు. 'ఇది ప్రజలకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. వాహన్ పోర్టల్ ద్వారా ప్రభుత్వానికి కచ్చితమైన డేటా లభించి, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, మరియు భవిష్యత్ ప్రణాళికల్లో మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది' అని పేర్కొన్నారు.

Also Read: Cyber Crime: ఆర్‌టీఏ చలాన్‌ పేరిట సైబర్‌ నేరగాళ్ల మోసం.. జనసేన ఎమ్మెల్యే రూ.12 లక్షలు నష్టం

డిజిటల్ తెలంగాణ నిర్మాణంలో మనమందరం కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చార. గతంలో వాహనాల రిజిస్ట్రేషన్ రవాణా శాఖ కార్యాలయాల్లో జరిగేది దానిపై సంస్కరణలు తెచ్చి వాహనాలు కొనుగోలు చేసిన షో రూమ్‌లలోనే వాహనాల రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ప్రభుత్వ వాహనాలు కొనుగోలు చేసే వాటికి ఈవి వాహనాలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది' అని పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. 'హైదరాబాద్‌లో అన్ని డీజిల్ ఆటోలు రేటిరోఫిట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మేము పారదర్శకంగా సమర్థవంతంగా వాహనదారులకు ,డీలర్ల తో కోఆర్డినేట్ చేస్తూ సౌకర్యాలు కల్పిస్తున్నాం. 2016లో ప్రారంభమైన ఈ వాహన సారథి లో మనం ఈరోజు చేరాం' అని పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. 'వాహన్ పోర్టల్‌లో చేరడంతో వాహనాలకు సంబంధించిన డేటా ఆన్‌లైన్‌లో ఉంటుంది. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా ఉంటుంది' అని చెప్పారు. 

ప్రభుత్వం తెస్తున్న పాలసీలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు పొన్నం ప్రభాకర్‌ సూచించారు. 'ఈవీ డీలర్లను ప్రభుత్వం కోరుతుంది.. కన్లుమర్‌ మీ దగ్గరకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునేలా చేశాం. కన్స్యూమర్‌కి ఇబ్బందులు లేకుండా చూడాలి.పారదర్శకంగా సమర్థవంతంగా చేయాలి..వారికి త్వర తర్వగా పూర్తయ్యేలా చేయాలి' అని వాహన యాజమాన్యాలకు పొన్నం ప్రభాకర్‌ సూచించారు. 'రోడ్ సేఫ్టీలో జ్యూరీ భాగస్వామి కావాలి. మీరు వాహనాలు అమ్మినప్పుడు రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించేలా కొనుగోలు చేసిన వారికి హెల్మెట్లు ఇవ్వడం, కాలుష్యాన్ని తగ్గించేలా వాహనాన్ని కొనుగోలు చేసిన వారికి ఒక మొక్కను అందించాలి' అని వాహనాల కంపెనీ యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. 'ఏటీఎస్‌లు ఏర్పాటు చేస్తున్నాం.. రవాణా శాఖకు కొత్త లోగో తెచ్చాం. రవాణా శాఖ తెస్తున్న సంస్కరణలు పై ప్రజలు సంతోషంగా ఉన్నారు. రవాణా శాఖ లో 100 శాతం ఆన్‌లైన్‌లో సేవలు కొనసాగిస్తున్నాం' అని స్పష్టం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

922
comment0
Report
HDHarish Darla
Mar 23, 2026 07:25:46
Hyderabad, Telangana:

Celebrity Owners Of IPL Teams: సినీ తారల నుంచి వ్యాపార దిగ్గజాల వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)లో ఎంతో మంది సెలబ్రిటీలు పాలుపంచుకున్నారు. ఓనర్లుగా, సహ యజమానులుగా కొందరు సెలబ్రిటీలు ఉన్నారు. ఐపీఎల్‌లో ఆటగాళ్లే కాకుండా వారి యజమానులు కూడా పెద్ద స్టార్లు ఉన్నారు. షారుక్ ఖాన్ నుంచి నీతా అంబానీ వరకు ఐపీఎల్‌లో ఉన్న సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి కేవలం మరో 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా విజేతగా నిలిచిన తర్వాత ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ఐపీఎల్ ఉత్సాహం పెరిగిపోతోంది. ఐపీఎల్‌లో 10 జట్లు తలపడుతున్నాయి. అయితే ఈ టీమ్స్‌లో ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లతో పాటు వారి యజమానులు కూడా చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు. దాదాపుగా ఐపీఎల్‌లోని ప్రతి ఫ్రాంఛైజీకి ఎవరో ఒకరు సెలబ్రిటీ నాయకత్వం వహిస్తున్నారు.  జట్ల యజమానుల్లో.. సినిమా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. అయితే ప్రధాన ఐపీఎల్ జట్టు యజమానుల గురించి తెలుసుకుందాం.

ముంబై ఇండియన్స్: ఐపీఎల్ లీగ్‌లోని బలమైన జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. ఈ జట్టుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, అతని భార్య నీతా అంబానీ యజమానులుగా ఉన్నారు. ముంబై ఇండియన్స్ 2013, 2015, 2017, 2019, 2020లో ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. 

కోల్‌కతా నైట్ రైడర్స్: కేకేఆర్ జట్టుకు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా, జయ మెహతా యజమానులుగా ఉన్నారు. కోల్‌కతా 2012, 2014, 2024లో మూడు ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకుంది. 

చెన్నై సూపర్ కింగ్స్: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇండియా సిమెంట్స్ యాజమాని ఎన్. శ్రీనివాసన్ నేతృత్వంలోని ఉంది. ఈ జట్టు 2010, 2011, 2018, 2021లో నాలుగు IPL టైటిళ్లను గెలుచుకుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఆర్సీబీ యాజమాన్యం డయాజియో గ్రూప్‌లో భాగమైన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ చేతిలో ఉంది. ఈ జట్టు గత సంవత్సరం తన తొలి ఐపిఎల్ టైటిల్‌ను గెలుచుకుంది.  

ఢిల్లీ క్యాపిటల్స్: ఢిల్లీ క్యాపిటల్స్ అనేది GMR గ్రూప్, JSW గ్రూప్‌ల ఉమ్మడి యాజమాన్యంలోని ఒక జట్టు. ఈ జట్టు 2020లో ఫైనల్‌కు చేరుకుంది. 

పంజాబ్ కింగ్స్: పంజాబ్ కింగ్స్ జట్టు నటి ప్రీతి జింటా, వ్యాపారవేత్తలైన మోహిత్ బర్మన్, నెస్ వాడియా, కరణ్ పాల్‌ల యాజమాన్యంలో ఉంది. ఈ జట్టు 2014, 2025లో ఫైనల్‌కు చేరుకుంది. 

రాజస్థాన్ రాయల్స్: 2008లో జరిగిన తొలి ఐపీఎల్‌ను గెలుచుకున్న జట్టు రాజస్థాన్ రాయల్స్. దీని ప్రధాన యజమానులుగా మనోజ్ బదాలే (ఎమర్జింగ్ మీడియా) లాచ్లాన్ ముర్డోక్ ఉన్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సన్ గ్రూప్ ఛైర్మన్ కలానిధి మారన్, ఆయన కుమార్తె కావ్య మారన్ యజమానులుగా ఉన్నారు. ఈ జట్టు 2016లో తన తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది.

గుజరాత్ టైటాన్స్: ఈ గుజరాత్ జట్టు 2022లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ జట్టు సీవీసీ క్యాపిటల్ పార్ట్‌నర్స్, టోరెంట్ గ్రూప్ యాజమాన్యంలో ఉంది. 

లక్నో సూపర్ జెయింట్స్: ఈ జట్టు ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకాకు చెందిన ఆర్‌పీజీఎస్ గ్రూప్ యాజమాన్యంలో ఉంది. ఈ జట్టు 2022లో తమ తొలి సీజన్‌ను ప్రారంభించింది. 

Also Read: EPF ATM Withdrawal 2026: ఉద్యోగులకు భారీ శుభవార్త..పీఎఫ్ డబ్బు విత్‌డ్రా అప్పటి నుంచే..ఇలా చేస్తే 20 శాతం నష్టపోతారు!

Also Read: RGUKT Holiday News: తెలంగాణలో విద్యార్థులకు షాకింగ్ న్యూస్..రేపటి నుంచి నాన్‌స్టాప్ సెలవులు..ఎందుకంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1083
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 22, 2026 18:29:37
Wadgaon, Maharashtra:

Samvadini App: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా ఇప్పటివరకు విదేశీ డిజిటల్‌ కమ్యూనికేషన్‌ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉన్నారు. ఆ స్థానంలో దేశీ కమ్యూనికేషన్‌ ప్లాట్‌ఫామ్‌ వచ్చింది. వ్యక్తిగత భద్రత.. గోప్యతకు ప్రాధాన్యం ఇస్తూ.. ఫోన్‌ నంబర్‌ లేకుండానే అభివృద్ది చేశారు. సైబర్‌ నేరాలపై అప్రమత్తత.. ఆర్థిక మోసాలు, స్పామ్‌, డిజిటల్‌ అరెస్ట్‌ వంటివి నేపథ్యంలో వాటిపై అప్రమత్తత వ్యక్తం చేసేలా దేశీయ ఏఐ ఆధారిత సాధనం తీసుకువచ్చారు. వాటి పేర్లే సంవధిని,  నిలబెట్టుకుంటారు.

Also Read: Revanth Reddy: సిద్దిపేట గడ్డపై రేవంత్ రెడ్డి ఛాలెంజ్.. హరీశ్‌ రావును ఓడిస్తే మంత్రి పదవి ఆఫర్

సైబర్‌ నేరగాళ్లు మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతుండడంతోపాటు దేశానికి విరుద్ధమైన కార్యకలాపాలు చేస్తున్న వారి సంఖ్య అధికమవుతోంది. విదేశీ సర్వర్‌లలో వాటి వివరాలు నిక్షిప్తమవడంతో తర్వాత చర్యలు తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వ్యక్తిగత భద్రత, జాతీయ భద్రతకు ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో విదేశీ ఏఐ ఆధారిత సంస్థలు ఏర్పాటయ్యాయి.

Also Read: Garikapati On Anushka: 'దీని దుంపతెగ.. అన్నీ అవయవాలు అలా ఉన్నాయి'.. హీరోయిన్‌ అనుష్కపై గరికపాటి అనుచిత వ్యాఖ్యలు

సురక్షితమైన కమ్యూనికేషన్‌ కోసం అనువధిని ఏఐ రెండు యాప్‌లను పరిచయం చేసింది. అయితే దేశీ ఏఐ జెన్‌జీ కీబోర్డును ప్రోత్సహించింది. గృహపరంగా డిజిటల్‌ ఎకోసిస్టమ్‌ లక్ష్యంగా గోప్యత, భద్రతపై దృష్టిపై సారించింది. దేశీ ఏఐ విషయమై అనువధిని ఏఐ సీఈఓ డాక్టర్‌ బుద్దా చంద్రశేఖర్‌ వివరిస్తూ.. 'విదేశం నుంచి దేశీయంగా సురక్షితంగా మన భాషలో.. మన దేశంలో కమ్యూనికేషన్‌ చేసుకోవచ్చు' అని వెల్లడించారు.

హైప్డ్‌ సంవదిని, దేశీ ఏఐ జెన్‌జీ కీ బోర్డును ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులంతా డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించుకోవచ్చు. హైప్డ్ సంవాదిని వాట్సప్ తరహాలో ఎండ్- టు- ఎండ్ ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంటుంది. అడ్వాన్స్‌డ్ యాంటీస్పామ్ మెకానిజాన్ని పొందుపరచడంతో ఇది సైబర్ మోసాలను నియంత్రిస్తోందని కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. 

సంవధిని ఫీచర్లు ఇలా

  • మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ అవసరం లేకుండా సంవధిని పనిచేస్తుంది. బహు భాషల్లో సందేశాలు పంపడంలో రూపొందించారు.
  • ఈ ప్లాట్‌ఫామ్‌లో చాట్‌ ఐడీలు ఉంటాయి.
  • ఈ హైప్డ్ సంవాదినిలో వన్ టు వన్, గ్రూప్, బ్రాడ్ కాస్ట్ మెసేజ్‌లు భద్రంగా.. ఎలాంటి భయం లేకుండా చేసుకోవచ్చు. ఆడియో, వీడియో కాల్స్‌కు అవకాశం ఉంది. 55కి పైగా భాషల్లో రియల్‌టైమ్ అనువాదం (ట్రాన్స్‌లేషన్) అందుబాటులో ఉండడం.
  • ఈ యాప్‌ 55 భాషల్లో అందుబాటులో ఉండగా.. రియల్‌ టైమ్‌ అనువాదం చేస్తుంది. వాయిస్‌ను టెక్స్ట్‌గా.. టెక్ట్స్‌ను వాయిస్‌గా మారుస్తుంది. స్టేటస్‌ అప్‌డేట్‌తోపాటు బహుభాషల్లో సహాయం అందించడం, గోప్యత కంట్రోల్‌ అనే మరికొన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి.
  • భద్రతాపరంగా చూస్తే వన్‌ టాప్‌ ఎస్‌ఓఎస్‌ సిస్టమ్‌ లైవ్‌ లొకేషన్‌తోపాటు అత్యవసర సమయంలో ఇతరులను అప్రమత్తత వ్యక్తం చేసే అవకాశం కూడా ఉంది.
    బహుభాషా సామర్థ్యాన్ని కలిగి ఉండడం
  • అనువాదిని ఏఐ అత్యాధునిక సాంకేతికతతో 22 భారతీయ, 37 విదేశీ భాషల్లో రియల్ టైమ్ టెక్ట్స్‌తోపాటు వాయిస్ అనువాదం.
  • ఏఐ ద్వారా అభివృద్ధి చేసిన ఈ రెండు యాప్‌లు పూర్తి స్వదేశీ డిజిటల్ పరిష్కారాలు అని అర్థమవుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1058
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 22, 2026 13:46:36
Siddipet, Telangana:

Siddipet MLA Harish Rao: ఓటమి ఎరుగకుండా దశాబ్దాలుగా సిద్దిపేట నుంచి గెలుస్తున్న హరీశ్‌ రావుకు ఓటమి రుచిచూపించేందుకు రేవంత్ రెడ్డి వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలో శంకుస్థాపన చేసి.. పనులు ప్రారంభించిన నర్మెట్ట ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన అనంతరం రేవంత్‌ రెడ్డి రాజకీయ వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట నుంచి కాంగ్రెస్‌ వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట నుంచి గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేను మంత్రిగా చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

Also Read: Garikapati On Anushka: 'దీని దుంపతెగ.. అన్నీ అవయవాలు అలా ఉన్నాయి'.. హీరోయిన్‌ అనుష్కపై గరికపాటి అనుచిత వ్యాఖ్యలు

సిద్దిపేట జిల్లా నర్మెట్ట గ్రామంలో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఉన్నప్పుడు రాజకీయాలు చేద్దాం. ఎన్నికలు లేనప్పుడు ప్రాంతాల అభివృద్ధి కోసం పరస్పరం సహకరించుకోవాలి' అని బీఆర్‌ఎస్‌ పార్టీ, బీజేపీకి సూచించారు. ప్రత్యర్థి పార్టీ నాయకుల గురించి ఆలోచిస్తే ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు ఇచ్చే నిధులపై వివక్ష చూపించే వ్యక్తి తాను కాదని.. హరీశ్‌ రావు చేసిన వ్యాఖ్యలకు రేవంత్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు.

Also Read: Cyber Crime: ఆర్‌టీఏ చలాన్‌ పేరిట సైబర్‌ నేరగాళ్ల మోసం.. జనసేన ఎమ్మెల్యే రూ.12 లక్షలు నష్టం

దశాబ్దాలుగా సిద్దిపేటలో ఒక కుటుంబాన్ని గెలిపిస్తున్నారని.. ఈసారి సిద్దిపేటలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 'గత పాలకులు విపక్ష నాయకుల నియోజకవర్గాలపై వివక్ష చూపించారు. నేను నాయకులతో వ్యతిరేకిస్తాను కానీ ప్రజలపై వివక్ష చూపను' అని స్పష్టం చేశారు. సిద్దిపేటకు కూడా నిధులు భారీగా ఇచ్చానని.. వివక్ష చూపేవాడినైతే ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీని కొడంగల్‌కు తీసుకెళ్లేవాడినని తెలిపారు. 'వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలోనూ కాంగ్రెస్‌ గెలవాలి. ఇక్కడి నుంచి గెలిచిన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తా' అని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

Also Read: BC Budget: బడ్జెట్‌లో కాంగ్రెస్ పార్టీ మోసం.. రేవంత్‌ రెడ్డి బీసీ వ్యతిరేకి: ఆర్‌.కృష్ణయ్య

నర్మెట్ట సభలో రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. సిద్దిపేటలో ఓటమి లేకుండా గెలుస్తున్న హరీశ్‌ రావును ఓడించేందుకు ఇప్పటి నుంచే కాంగ్రెస్‌ పార్టీ వ్యూహం రచిస్తోందని అర్థమవుతోంది. ఓటమి కాదు కదా సిద్దిపేట నుంచి మెజార్టీలో రికార్డులు తిరగరాస్తున్న హరీశ్‌ రావును రాజకీయంగా దెబ్బతీయాలని కాంగ్రెస్‌ ఇప్పటికే కుయుక్తులు పన్నుతోంది. ఇటీవల జరిగిన సర్పంచ్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి సిద్దిపేట నియోజకవర్గంలో ఘోర పరాభవం ఎదురైంది. ఇక్కడ బీఆర్‌ఎస్‌ పార్టీ భారీ స్థానాలు సొంతం చేసుకోవడంతో హరీశ్‌ రావును దెబ్బతీసేందుకు రేవంత్‌ రెడ్డి నర్మెట్ట సభను ఉపయోగించుకున్నారు. అయితే ఎవరెన్ని వచ్చినా కూడా హరీశ్‌ రావును సిద్దిపేట నుంచి వేరు చేయలేరని రాజకీయ మేధావులు చెబుతున్నారు. వచ్చే పదేళ్లలో హరీశ్‌ రావును ఓడించడం అనేది కలగా పేర్కొంటున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1053
comment0
Report
HDHarish Darla
Mar 22, 2026 11:39:01
Hyderabad, Telangana:

EPF ATM Withdrawal News: దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ (ఈపీఎఫ్ఓ) అతిత్వరలోనే ATM ఆధారిత నగదు ఉపసంహరణలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీని ద్వారా ఈపీఎఫ్‌లో పొదుపు చేసిన డబ్బును క్షణంలో పొందవచ్చు. ATM ద్వారా డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు సులభతం చేసినా.. ప్రస్తుత ఉపసంహరణ, పన్ను నిబంధనలు యథావిధిగా వర్తిస్తాయి. ఉద్యోగులు ఐదేళ్ల సర్వీస్ పూర్తికాకముందే చేసే నగదు ఉపసంహరణపై TDS విధించిన తర్వాత తుది చెల్లింపులు తగ్గుతాయి.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ATM ఆధారిత విత్‌డ్రాయల్స్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీనివల్ల చందాదారులు విత్‌డ్రా చేసేందుకు ఎక్కువ రోజులు ఎదురుచూడాల్సిన పనిలేకుండా ఏటీఎం ద్వారా నగదు తక్షణమే పొందవచ్చు. యూజర్-ఫ్రెండ్లీ సేవలను అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ EPFO ​​3.0 అప్‌గ్రేడ్‌లో ఇది ఒక భాగం.

దీన్ని ప్రవేశపెట్టిన తర్వాత వినియోగదారులు తమ EPF బ్యాలెన్స్‌లో కొంత భాగాన్ని నేరుగా ATMలు లేదా UPI ద్వారా విత్‌డ్రా చేసుకోగలుగుతారు. దీనివల్ల వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గుతుంది. అర్హత షరతులను బట్టి, బ్యాలెన్స్‌లో 50–75 శాతం వరకు పొందవచ్చని ఈపీఎఫ్‌ నివేదిస్తుంది. అయితే ఈ ఏటీఎం విత్‌డ్రా నిబంధనను ఏప్రిల్ రెండో వారం లేదా ఏప్రిల్ నెలాఖరు నుంచి అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం.

అయితే నగదు ఉపసంహరణకు మినహాయించి మిగిలిన వాటి నిబంధనలు ఏమాత్రం మారలేదు. సాధారణంగా పదవీ విరమణ లేదా నెలల తరబడి నిరుద్యోగం కారణంగా పూర్తి ఉపసంహరణకు వెసులుబాటు ఉంది. అయితే వైద్య అవసరాలు, విద్య లేదా గృహవసతి వంటి నిర్దిష్ట పరిస్థితులలో పాక్షికంగా నగదు విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఉంది.

ఇందులో అతిపెద్ద చిక్కు పన్నుల విధింపు. మీరు ఐదు సంవత్సరాల నిరంతర సర్వీసును పూర్తి చేయకముందే EPF నుండి డబ్బు తీసుకుంటే, అది పన్ను పరిధిలోకి వస్తుంది. అలాంటి సందర్భాల్లో TDS కట్ చేస్తారు. దీంతో మీరు రిటైర్మెంట్ తర్వాత వచ్చే సెటిల్మెంట్‌లో నగదు వ్యత్యాసం రావొచ్చు.

ఐదేళ్ల సర్వీస్ పూర్తికాకముందే విత్‌డ్రాయల్ రూ.50,000 దాటితే, పాన్ (PAN) సమర్పించినట్లయితే 10 శాతం టీడీఎస్ (TDS) వర్తిస్తుంది. పాన్ (PAN) లేకుండా నగదు డ్రా చేస్తే దాదాపుగా 20 శాతం పన్ను కింద కోత విధిస్తారు. దీనివల్ల మీరు అందుకునే మొత్తం మరింత తగ్గుతుంది. మీరు ఉద్యోగంలో కనీసం ఐదేళ్ల సర్వీసును పూర్తి చేస్తేనే EPF విత్‌డ్రాయల్స్ పన్ను రహితంగా ఉంటాయి. ముందుగా విత్‌డ్రాయల్స్ చేస్తే TDS వర్తించడమే కాకుండా, ఆ సంవత్సరానికి మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయానికి కూడా అది జోడించే అవకాశం ఉంది.

అత్యవసరం అయితే తప్ప, గడువుకు ముందే ఈపీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు. దానికి బదులుగా.. మీరు ఉద్యోగాలు మారినప్పుడు మీ EPFను బదిలీ చేసుకోవడం ద్వారా ఖాతాలో కొనసాగింపు ఉంటుంది. భవిష్యత్తులో పన్ను రహిత విత్‌డ్రాను కూడా పొందవచ్చు. అర్హత ఉన్నట్లయితే, ఫారం 15G లేదా 15H సమర్పించడం ద్వారా కూడా TDSను తగ్గించుకోవచ్చు లేదా పూర్తిగా నివారించవచ్చు.

Also Read: RGUKT Holiday News: తెలంగాణలో విద్యార్థులకు షాకింగ్ న్యూస్..రేపటి నుంచి నాన్‌స్టాప్ సెలవులు..ఎందుకంటే?

Also Read; LPG Gas Shortage: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త..వారికి 5 కిలోల గ్యాస్ సిలిండర్ ఉచితం..పంపిణీ అప్పుడే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

1098
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 22, 2026 11:20:48
Hyderabad, Telangana:

 Giant Python Meat Viral Video Watch: సోషల్ మీడియా పుణ్యమా అని రోజు ఎన్నో వింతలతో పాటు ఆశ్చర్యం కలిగించే ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సాధారణంగా మాంసం దుకాణాల్లో కోళ్లతో పాటు మేకలు లేదా గొర్రెల మాంసాన్ని విక్రయించడం మనందరం రోజు చూస్తూ ఉంటాం. కానీ తాజాగా ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న వీడియో చూస్తే మాత్రం ఎవరైనా సరే ఆశ్చర్య పోవాల్సిందే.. అత్యంత భయంకరమైన భారీ పరిమాణంలో ఉన్న ఒక కొండచిలువను ముక్కలుగా కోసి బహిరంగ విక్రయిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారులను బిత్తరపోయేలా చేస్తున్నాయి..

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక మాంసం దుకాణంలో యజమాని ఏమాత్రం భయపడకుండా భారీ కొండచిలువను టేబుల్ పై ఉంచి.. దానిని చిన్న చిన్న ముక్కలుగా నరకడం మీరు గమనించవచ్చు.. దుకాణానికి వచ్చిన కస్టమర్లు కూడా అదేదో మామూలు మాంసం అన్నట్లుగా చూస్తూ ఉండడం గమనార్హం.. అంతేకాకుండా ఆ షాప్ కి వచ్చిన కస్టమర్లు కూడా అత్యంత ప్రమాదకరమైన కొండచిలువను ముట్టుకొని దాని మాంసాన్ని అటు ఇటు అనడం మీరు వీడియోలో క్లియర్గా చూడొచ్చు..

అంతేకాకుండా ఆ దుకాణం ముందు భాగంలో ఆ కొండచిలువ తల నుంచి నడుము భాగం వరకు వేలాడదీయడం కూడా మీరు చూడొచ్చు. ఇది చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు.. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయం స్పష్టత లేకపోయినప్పటికీ.. ఆగ్నేయాసియాలోని దేశాల్లో ఏదో ఒక మార్కెట్ అయి ఉండవచ్చని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..

 
 
 
 
 

ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన కొద్ది రోజుల్లోనే వేల సంఖ్యలో షేర్లతో పాటు లైకులు వస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. వన్యప్రాణులను ఇలా బహిరంగంగా చంపి మాంసం గా అమ్మడం చెడ్డ విరుద్ధం కాదా అని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లలో ప్రశ్నలు పెడుతుంటే.. ఇక మరి కొంతమంది ఇలాంటి అడవి జంతువుల మాంసం తినడం వల్ల కొత్త రకమైన వైరస్తులు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని మరికొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.. ఇక మరికొంతమంది ఆ తలను.. అలా వేలాడదీయడం చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తోంది.. కామెంట్లు పెడుతున్నారు..

Read more: Two-headed Snake Video: ఒకే పాము రెండు తలలు.. ఇలాంటి వీడియో ఎప్పుడైనా చూశారా?

భారతదేశంతో సహా మెజారిటీ దేశాల్లో వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం కొండచిలువను చంపడం లేదా వాటి మాంసాన్ని అమ్మడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు.. ఇలాంటి చర్యలకు పాల్పడితే వారికి భారీ జరిమానా తో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.. విచ్చల వీడిక అడవి జంతువులను వేటాడి విక్రయించే ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని కొంతమంది జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ వీడియోస్ స్పష్టంగా గమనించి చూస్తే.. భారతదేశంలో కాకుండా మరేదో దేశంలో జరిగినట్లు తెలుస్తోంది..

Read more: Two-headed Snake Video: ఒకే పాము రెండు తలలు.. ఇలాంటి వీడియో ఎప్పుడైనా చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

  

1085
comment0
Report
HDHarish Darla
Mar 22, 2026 10:43:48
Hyderabad, Telangana:

Telangana RGUKT Holidays 2026: తెలంగాణ విద్యార్థులకు ముఖ్యగమనిక. రేపటి నుంచి వరుస సెలవులను ప్రకటించింది రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జీ అండ్ టెక్నాలజీస్ యాజమాన్యం. బాసరలోని ఈ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థిని ఇటీవలే అనుమానాస్పదంగా మృతి చెందిన కారణంగా నిరసనలు తెలియజేసేందుకు విద్యార్థి సంఘాలు సిద్ధమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఆ కాలేజీ యాజమాన్యం మార్చి 23 నుంచి నిరవధిక సెలవులను ప్రకటించింది. క్యాంపస్‌లో వైద్య సౌకర్యాలు సరిపోవడం లేదని విద్యార్థులు ఆరోపించడంతో పాటు, మృతుని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

మెదక్ జిల్లాకు చెందిన పీయూసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని మల్లిపూడి తేజస్విని మరణంతో ఈ నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ మృతికి నిరసనగా విద్యార్థి చేస్తున్న ఆందోళనలకు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) మార్చి 23 నుంచి సెలవులను ప్రకటించింది.ప్రీ-యూనివర్సిటీ కోర్సు (PUC) ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు.. అలాగే ఇంజనీరింగ్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు సెలవులను ప్రకటించింది. 

విద్యార్థిని మృతి తర్వాత క్యాంపస్‌లో వైద్య సౌకర్యాలు సరిపోవడం లేదని ఆరోపిస్తూ జరుగుతున్న నిరసనల నేపథ్యంలో, విద్యా క్యాలెండర్‌కు అంతరాయం కలగకుండా నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం జారీ చేసిన ఒక ప్రకటనలో అధికారులు తెలిపారు. అయితే క్లాసులు తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయాన్ని త్వరలోనే తెలియజేస్తామని వారు అన్నారు. దీంతో విద్యార్థులు ఈ విరామాన్ని సద్వినియోగం చేసుకోవాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు.

మెదక్ జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన 17 ఏళ్ల తేజస్విని, లుకేమియా వ్యాధితో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మార్చి 16న మరణించింది. తేజస్విని మృతికి కారణం క్యాంపస్‌లో వైద్య సౌకర్యాలు సరిగా లేకపోవడమే అనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో తేజస్విని మృతికి న్యాయంగా కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు మార్చి 17న నిరసనలు చేపట్టారు. 

యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ కార్యాలయం వద్ద విద్యార్థులు నిరసన ప్రదర్శన చేసి, న్యాయం కోరుతూ నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా, తేజస్విని తల్లిదండ్రులు ప్రభుత్వం న్యాయం, తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వారు శుక్రవారం ఆర్‌జీయూకేటీ ప్రవేశ ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు.

Also Read: LPG Gas Shortage: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త..వారికి 5 కిలోల గ్యాస్ సిలిండర్ ఉచితం..పంపిణీ అప్పుడే?

Also Read; Petrol Rate Today: ఇంధన ధరలపై యుద్ధ ప్రభావం..నిన్న భారీగా పెరిగిన పెట్రోల్ ధర..ఈరోజు ఎలా ఉన్నాయంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1084
comment0
Report
HDHarish Darla
Mar 22, 2026 10:02:55
Hyderabad, Telangana:

LPG Gas Shortage News: పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ క్రమంలో తాజాగా ఇరాన్‌తో చర్చలు జరిపి భారత్‌కు ముడిచమరు, గ్యాస్ తీసుకురావడంలో దౌత్యం ఫలించింది. తాజాగా అందుకు సంబంధించిన నౌకలు కూడా భారత్‌కు సురక్షితంగా చేరుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఓ కీలక ప్రకటన చేసింది. గత మూడు వారాలుగా ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడిన కారణంగా ఇప్పుడు పరిశ్రమలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. 

ఈ నేపథ్యంలో రెస్టారెంట్లు, హోటళ్లు, చిన్న తరహా పరిశ్రమలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కేంద్రం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై కీలక నిర్ణయాన్ని వెలువరించింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్లను తక్షణమే 20 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి నెలాఖరు నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అనేక రెస్టారెంట్లు, హెటళ్లు, డాబాలు మూతపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో యథావిధిగా హోటళ్లు తెరచుకోనున్నాయి. 

అయితే పెంచిన సరఫరాలో మొదటగా రెస్టారెంట్లు, హోటళ్లు, ఇండస్ట్రియల్ క్యాంటీన్లు, డైరీ యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అలాగే వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడిపే సబ్సిడీ క్యాంటీన్లకు కూడా గ్యాస్ కొరత లేకుండా చూడాలని మోదీ సర్కార్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

మరోవైపు వలస కూలీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రంలోని మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వలస కార్మికుల కోసం 5 కిలోల గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇదే నిర్ణయాన్ని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖను రాసింది. అయితే వలస దారులకు 5 కిలోల గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రక్రియను రేపటి నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. 

అయితే గ్యాస్ వినియోగంలో ఎటువంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు కేంద్రం కొన్ని నిబంధనలను జారీ చేసింది. వలస కూలీలు, కమర్షియల్ యూజర్లు  సంబంధిత యాప్‌ల ద్వారా లేదా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరని స్పష్టం చేసింది. దేశంలో గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని.. కేవలం సరఫరాను క్రమబద్ధీకరించే వరకు ఈ చర్యలు తీసుకుంటున్నామని మోదీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Also Read: LPG Gas Price Hike 2026: భారీగా పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధరలు..ఇప్పుడే బుక్ చేసుకోండి! కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే!

Also Read: LPG ATM Gurugram: యుద్ధం వేళ సామాన్యులకు గుడ్‌న్యూస్..గ్యాస్ సిలిండర్లకు ATM..2 నిమిషాల్లో గ్యాస్ రీఫిల్ అయిపోతుంది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1045
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 22, 2026 09:11:07
Nuzendla, Andhra Pradesh:

Garikipati Narasimha Rao On Anushka Shetty: తెలుగులో అద్భుతమైన ప్రవచనాలు చేస్తూ గుర్తింపు పొందిన గరికిపాటి నరసింహా రావు ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో తన ప్రవచనాలతో నిత్యం ట్రెండింగ్‌లో ఉండే గరికిపాటి నరసింహారావు మరో వివాదంలో చిక్కుకున్నారు. హీరోయిన్‌ అనుష్క శెట్టిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఓ వీడియో చక్కర్లు తిరుగుతోంది. గతంలో ఓ సమావేశంలో పాల్గొన్న గరికిపాటి నరసింహారావు తన కొడుకుతో జరిగిన సంభాషణను వివరించారు. ఈ సందర్భంగా అనుష్క శర్మ ఫొటోను తాను తన కుమారుడు చూశాడని గరికిపాటి చెప్పుకొచ్చారు. వారిద్దరి మధ్య అనుష్క ఫొటో విషయమై జరిగిన సంఘటన వెల్లడించారు. అర్ధనగ్నంగా ఉన్న ఫొటో తనను.. తన కొడుకును ఆకర్షించింది.. దానిలో తప్పేం లేదని ప్రకటించారు.

Also Read: Cyber Crime: ఆర్‌టీఏ చలాన్‌ పేరిట సైబర్‌ నేరగాళ్ల మోసం.. జనసేన ఎమ్మెల్యే రూ.12 లక్షలు నష్టం

'నేను ఒకసారి పేపర్‌ అలా చూస్తుంటే ఏమిటుంది కుర్రాళ్లు ఎందుకు ఇలా చూస్తున్నారని చూశా. నా చూపు కూడా ఒక చోట నిలిచిపోయింది. చేసిన తప్పు చెప్పాలి కదా. ఎవరంటే మహానటి అనుష్క. అలా నిలబడి ఉన్న ఓ ఫోజు.. ఓ స్టిల్‌ ఇచ్చింది' అని గరికిపాటి నరసింహారావు తెలిపారు. 'మా అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు. వాడేమిటో నా కాళ్ల దగ్గర కూర్చున్నాడు. స్నానం చేసిన వచ్చి నా కాళ్లకు దండం పెట్టడానికి కూర్చున్నాడని ఆశీర్వాదం చేద్దామనుకున్నా. లేదు కానీ వాడు అనుష్క ఫొటో చూస్తున్నాడు. వాడి ధోరణిలో వాడు ఉన్నాడు నా ధోరణిలో నేను ఉన్నాడు. దానికేముంది? ఇప్పుడు ఎవడికి కావాల్సినది వాడు చూసుకుంటున్నాడు' అని గరికిపాటి నరసింహారావు తెలిపాడు.

Also Read: LPG Gas: ఎల్పీజీ గ్యాస్‌ సంక్షోభం నుంచి భారీ ఊరట.. వాణిజ్య గ్యాస్ కోటా 50 శాతానికి పెంపు

'ఏమిటి రా అంటే ఏమీ లేదని వెళ్లిపోయాడు. మన దృష్టి తిన్నగా ఉండదు కదా? నేను చూసేసరికి.. వీడు ఈ అమ్మాయిని చూశాడంటే తప్పేం లేదు మరి. నన్నే ఆకర్షిస్తుందంటే వాడిని ఆకర్షించదా?' గరికిపాటి నరసింహా రావు తెలిపారు. కానీ ఒక కవిని ఆకర్షించిందంటే వెంటనే ఒక పద్యం వస్తుంది. నిజంగా అనుష్క ఒక మంచి.. అందమైన అర్ధనగ్న స్థితి సుమారుగా అనుకోండి. మనకే అనిపించింది సరదాగా.. అంటూ హీరోయిన్ అనుష్కపై గరికిపాటి నరసింహారావు పద్యం అందుకున్నాడు.

Also Read: Harish Rao: శిలాఫలకాలపై రేవంత్ రెడ్డి పేరు ఉండొచ్చు కానీ.. ప్రజల మనస్సులో ఉండేది కేసీఆర్ పేరే!

వదలనీదు చూపు
కదలనీదు చూపు
వదలనీదు మనసు
అంగమంగమoధు అతుకుకుని

దీని దుంపతెగ చూపు ఎక్కడ పడితే అక్కడే అతుకుపోతున్నది. కిందకు రావాట్లేదు.. పైకి వెళ్లట్లేదు. అన్నీ అవయవాలు అలాగే ఉన్నాయి. మరి వాడు చూశాడంటే తప్పేం ఉంది?' అని అనుష్కపై గరికిపాటి నరసింహా రావు నీచంగా మాట్లాడారు. ఆ తర్వాత మళ్లీ కదలనీదు చూపు అంటూ పద్యం అందుకున్నాడు. ఇలా అవయవాలు.. అర్ధనగ్నం అంటూ నీతి వాక్యాలు చెప్పే గరికిపాటి నరసింహారావు నోటి నుంచి రావడాన్ని సర్వత్రా తప్పుపడతారు. ప్రవచనాలు అంటే నీతి వాక్యాలు.. ఆదర్శనీయమైన పదాలు చెప్పాల్సి ఉండగా.. ఇలా చేయడాన్ని నెటిజన్లు ఖండిస్తున్నారు. కొడుకు చూసేదే తప్పంటే అది తప్పు కాదని కొడుకును వెనకేసుకొచ్చాడు. మొన్న మధ్యాహ్న భోజనం.. ఇప్పుడు అనుష్కపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1027
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 22, 2026 08:54:31
Hyderabad, Telangana:

 Tata Nano Modification Video Watch Here: భారత ఆటోమొబైల్ రంగంలో రతన్ టాటా కలల ప్రాజెక్టు టాటా నానో ఒక గురించి ప్రత్యక్షంగా పరిచయం అక్కర్లేదు.. కేవలం లక్ష రూపాయలకే కారును సామాన్యుడికి చేరువ చేసిన ఈ చిన్న కారు.. అప్పట్లో ఒక సంచలనం.. కాలక్రమమైన అమ్మకాలు తగ్గి ఉత్పత్తులు నిలిచిపోయినప్పటికీ రోడ్లమీద ఇప్పటికీ నానో కార్లు కనిపిస్తూనే ఉంటాయి. అయితే తాజాగా కొందరు యువకులు ఈ బుజ్జి కారును ఓ రేంజ్ లో రీ మోడలింగ్ చేసి ఏకంగా స్పోర్ట్స్ కారుగా మార్చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఆటో మొబైల్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తోంది..

సాధారణంగా నానో కారు అంటేనే చాలా చిన్నదిగా.. సింపుల్ గా ఉంటుంది.. కానీ ఈ రీ మోడలింగ్ కారు చూస్తే ఎవరు అది నానో అని గుర్తుపట్ట లేకపోతూ ఉంటారు.. యువ ఇంజనీర్లు దీని బాడీని పూర్తిగా మార్చేసి.. చిన్న చక్రాలను తీసేసి పెద్ద చక్రాలను అమర్చారు. దీంతో డిజైన్ పూర్తిగా మారిపోయింది.. కారుకు వెడల్పాటి టైర్లతో పాటు మెరిసే అల్లాయ్ వీల్స్‌ను కూడా అమర్చినట్లు మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అంతేకాకుండా ఆ కారుకు ఆకర్షణీయమైన ఎల్లో కలర్ వేయడం అద్భుతమైన ప్రీమియం లుక్కునందించింది.. 

ఈ స్పోర్ట్స్ నానో కారు రోడ్లమీద వేగంగా దూసుకుపోతుంటే జనం కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు.. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు ఇంస్టాగ్రామ్ తో పాటు ప్రముఖ సోషల్ మీడియా వేదికల్లు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. లక్ష రూపాయల కారును 10 లక్షల కారుగా మార్చేశారు అంటూ కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. కొందరైతే ఇది నానో లేక ఏదైనా పెద్ద కంపెనీకి సంబంధించిన స్పోర్ట్స్ కారా అని ఫన్నీ కామెంట్లు పెడుతూ వస్తున్నారు..

 
 
 
 
 

Read more: Two-headed Snake Video: ఒకే పాము రెండు తలలు.. ఇలాంటి వీడియో ఎప్పుడైనా చూశారా?

ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబాల సొంత కారు కలలను నిజం చేసిన నానో.. సేఫ్టీ రేటింగ్ తో పాటు మార్కెటింగ్ వ్యూహాల వల్ల వెనకబడిన మాట వాస్తవమే.. కానీ ఇలాంటి క్రియేటివ్ ఐడియాల వల్ల నానో మళ్లీ వార్తల్లో నిలుస్తోంది.. కేవలం రవాణా కోసమే కాకుండా స్టైలిష్ గా మార్చుకోవచ్చని ఈ యువత నిరూపించారు.. క్రియేటివిటీ ఉంటే ఏదైనా సాధ్యమే.. పాత నానోకు సరికొత్త జీవం పోసిన యువత ప్రతిభ మహా అద్భుతం అంటూ ఆటోమొబైల్ నిపుణులు సైతం ఈ వీడియో చూసి ప్రశంసిస్తున్నారు..

Read more: Two-headed Snake Video: ఒకే పాము రెండు తలలు.. ఇలాంటి వీడియో ఎప్పుడైనా చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

  

1042
comment0
Report
HDHarish Darla
Mar 22, 2026 07:59:01
Hyderabad, Telangana:

LPG Gas Price Hike News: భారతదేశంలో ఎల్‌పీజీ గ్యాస్‌ ధరలు మరింత పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్‌పై ఇటీవలే రూ.60 పెరిగిన సంగతి తెలిసిందే. అయితే దేశీయంగా గ్యాస్ సిలిండర్ల కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుంది. అయితే మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కారణంగా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అతిపెద్ద LNG కేంద్రమైన ఖతార్ పారిశ్రామిక నగరంలోని రాస్ లఫాన్‌పై ఇరాన్ చేసిన దాడి ప్రపంచానికి వినాశకరంగా మారే అవకాశం ఉంది. ఖతార్ గ్యాస్ కేంద్రాలపై ఇరాన్ జరిపిన దాడుల వల్ల పశ్చిమాసియాలో సహజ వాయువు (LNG) ఎగుమతి సామర్థ్యానికి భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఖతార్ ఇంధన శాఖ మంత్రి సాద్ అల్-కాబీ పేర్కొన్నారు.

ఈ దాడి ఎప్పుడు జరిగిందంటే?
మార్చి 18వ తేదీ రాత్రి ఖతార్‌లోని కొన్ని గ్యాస్ కర్మాగారాలపై ఇరాన్ దాడులు జరిపింది. సహజ వాయువును క్లీన్ డీజిల్, కిరోసిన్ వంటి ద్రవ ఇంధనాలుగా మార్చే పెర్ల్ GTL ప్లాంట్‌పై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసిన కారణంగా ఎంతో నష్టం వాటిల్లింది. ఇరాన్ తాజా క్షిపణి లక్ష్యంగా చేసిన దాడితో గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్, నిల్వ ట్యాంకుల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది.

అలాగే మార్చి 19న ఖతార్‌లోని అనేక LNG కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ తన రెండవ దాడి చేసింది. రాస్ లఫాన్‌లోని రెండు ప్లాంట్స్‌తో పాటు మొత్తం 14 LNG ట్రాన్స్-గ్యాస్ యూనిట్లు లక్ష్యంగా చేసుకొని దాడికి తెగబడ్డాయి. తమ సోదర భావంగా భావించే ముస్లిం దేశం రంజాన్ మాసంలో ఈ విధంగా దాడులకు తెగబడుతుందని ఖతార్ ఎనర్జీ సీఈఓ కాబీ వెల్లడించారు.

అయితే ఇరాన్ చేసిన దాడుల వల్ల ఖతార్‌లోని LNG ఎగుమతి సామర్థ్యంలో 17% పూర్తిగా దెబ్బతిన్నదని అంచనా వేశారు. దీనివల్ల ఏటా సుమారు $20 బిలియన్ల ఆదాయ నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఖతార్ ఎనర్జీ సీఈఓ కాబీ తెలిపారు. దాడుల తర్వాత ఈ ప్లాంట్ల మరమ్మతులు అవసరమని, దీనివల్ల రాబోయే మూడు నుండి ఐదు సంవత్సరాల పాటు 12.8 మిలియన్ టన్నుల LNG ఉత్పత్తికి అంతరాయం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ప్రభావితం అయ్యే దేశాలు ఇవే..
సుమారు 40-50 శాతాన్ని భారతదేశం తన LNG అవసరాల కోసం ఖతార్ నుండి దిగుమతి చేసుకుంటుంది. సరఫరా తగ్గితే, దేశంలో సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు నిస్సందేహంగా పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎల్‌పీజీలో గణనీయమైన భాగం సహజ వాయువును శుద్ధి చేయడం ద్వారా వస్తుంది. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, గ్యాస్ ధరలతో పాటు దేశీయ, వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

అదే విధంగా భారత్‌తో పాటు పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌, పాకిస్తాన్ దేశాలు  ఇప్పటికే ఇంధన సంక్షోభంతో సతమతమవుతున్నాయి. ఈ క్రమంలో సరఫరా కూడా తగ్గితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలపై భారీగా ప్రభావం పడనుంది.

మరికొన్ని ఆసియా దేశాలైన చైనా, దక్షిణ కొరియా, జపాన్ కూడా ఖతార్ నుండి పెద్ద ఎత్తున LNGని కొనుగోలు చేస్తాయి. 2025లో ఖతార్ నుంచి తెచ్చుకుంటున్నLNG దిగుమతుల్లో 90 శాతం వాటా వీటిదే. దీంతో గ్యాస్ సరఫరాలో కొరత ఏర్పడితే పక్షంలో ఈ దేశాలు స్పాట్ మార్కెట్లో అధిక ధరలకు గ్యాస్ కొనుగోలు చేయాల్సి పరిస్థితి ఏర్పడింది.

మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఐరోపా దేశాలు గ్యాస్ కోసం ఖతార్‌పై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. రాస్ లఫాన్‌పై ఇరాన్ దాడి ఐరోపాలో గ్యాస్ ధరలు 30-35% పెరిగేందుకు భారీగా ఛాన్స్ ఉంది.

Also Read: LPG ATM Gurugram: యుద్ధం వేళ సామాన్యులకు గుడ్‌న్యూస్..గ్యాస్ సిలిండర్లకు ATM..2 నిమిషాల్లో గ్యాస్ రీఫిల్ అయిపోతుంది!

Also Read; AP Weather Update: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హెచ్చరిక..రాబోయే 3 రోజులు అల్లకల్లోలం..బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరిక!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1040
comment0
Report
Advertisement
Back to top