రంగారెడ్డి ఆలయంలో చోరీ, రూ.10వేలకు పైగా నగదు చోరీ
Hyderabad, Telangana:అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నంది ముసలాయి గూడ సాయిబాబా ఆలయంలో రాత్రి చోరీ జరిగింది. పోలీస్ స్టేషన్కు 200 మీటర్ల దూరంలో ఉన్న ఆలయంలో కిలోన్నర వెండి, రూ.10వేలకు పైగా నగదు, పలు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. గుడి తాళం పగులగొట్టిన దొంగ తలుపులు తెరిచి ఆలయంలోని హుండీని ధ్వంసం చేసి అందులో ఉంచిన సొమ్మును అపహరించాడు. ఈ ప్రమాదంపై ఆలయ నిర్వాహకులు అత్తాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వేలిముద్రల ఆధారాలు సేకరించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డైంది.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Asha Bhosle Top 10 Songs: సింగర్ ఆశా భోస్లే పాడిన టాప్-10 సాంగ్స్..చివరి పాట తెలుగులో ఓ ఊపు ఊపేసింది!
Hyderabad, Telangana:Asha Bhosle Top 10 Songs List: దాదాపుగా 8 దశాబ్దాలకు పైగా తన గాత్రంలో ప్రేక్షకులను అలరించిన ఆ గొంతు.. నేటితో మూగబోయింది. ఎన్నో పాటలకు తన గాత్రంతో ప్రాణం పోసిన ఆ ఊపిరి ఆగిపోయింది. భారత దిగ్గజ నేపథ్య గాయనీ ఆశా భోస్లే (92) నేడు ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆమె మరణంతో చిత్రపరిశ్రమతో పాటు సంగీత ప్రపంచంలో విషాదం నెలకొంది.
1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సాంగ్లీ అనే ఊరులో దిగ్గజ సింగర్ ఆశా భోస్లే జన్మించారు. తండ్రి పండిట్ దీనానాథ్ మంగేష్కర్ ఒక గొప్ప శాస్త్రీయ, సంగీత విద్వాంసుడిగానే కాకుండా రంగస్థల నటుడిగా ప్రసిద్ధి పొందారు. తన ఇంట్లోనే సంగీత నేపథ్యం ఉండడం వల్ల ఆశో భోస్లేకు చిన్నతనం నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు. ఆమె 9 ఏళ్ల వయసులో తండ్రి దీనానాథ్ మంగేష్కర్ కన్నుమూయడంతో ఆ కుటుంబ బాధ్యత అంతా తన సోదరి లతా మంగేష్కర్పై పడింది. కుటుంబం కోసం వారిద్దరూ చిన్ననాటి నుంచే పాటలు పాడడం ప్రారంభించారు.
అలా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆశా భోస్లే దాదాపుగా 8 దశాబ్దాలకు పైగా తన గాత్రంలో భారతదేశం మొత్తాన్ని ఊపేశారు. హుషారెత్తించే, మత్తెక్కించే క్యాబరే పాటలకు ఆమె పెట్టింది పేరు. అలాగే మనసుకు హత్తుకునే మధుర గీతాలతో ఎన్నో ప్రయోగాలు చేస్తూ అందర్ని ఆశ్చర్యపరిచారు. ఆమె గాత్రంలో ప్రత్యేక శైలి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. నేడు ఆమె పరమదించిన వేళ ఆశా భోస్లే పాడిన లెజండరీ సాంగ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1) ఆయే మెహరాబన్ - హౌరా బ్రిడ్జ్ (1958)
O.P. నయ్యర్, ఆశా భోంస్లేల కలయిక వచ్చిన ఈ పాట ఎంతో పాపులర్ అయ్యింది. మధుబాల, అశోక్ కుమార్ హీరోహీరోయిన్లుగా నటించిన "హౌరా బ్రిడ్జ్" చిత్రంలోని ఈ పాట ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. అప్పట్లో సూపర్ హిట్ సాంగ్గా నిలిచిన ఈ పాట.. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ క్లాసిక్గా నిలిచింది.
2) పియా తు అబ్ తో ఆజా - కారావన్ (1971)
ఆశా భోంస్లే మధురమైన గాత్రం లేకుండా హెలెన్ కొరియోగ్రఫీని ఊహించడం కష్టం. ఆమె ఆకర్షణీయమైన గాత్రం, హెలెన్ చేసిన ఉత్సాహభరితమైన క్యాబరే డ్యాన్స్ ఎంతో చక్కగా సరిపోయేవి. "కారావన్" చిత్రంలోని ఈ పాట వినేందుకు ఆహ్లాదంగా ఉండడమే కాకుండా.. ఆశా భోస్లేకు 'ఉత్తమ నేపథ్య గాయని'గా ఫిల్మ్ఫేర్ అవార్డును కూడా తెచ్చిపెట్టింది.
3) హంగామా హో గయా - అన్హోని (1973)
'క్వీన్' చిత్రంలో పారిస్లోని ఒక క్లబ్లో ఆశా భోంస్లే పాడిన 'హంగామా' పాట రీమేక్ మనం ఇటీవలే విన్నాం. ఆ పాటకు కంగనా రనౌత్ ఊపేసే స్టెప్పులతో అలరించింది. అయితే ఆశా భోస్లే పాటల ప్రత్యేకత అదే! ఈ పాట తొలిసారి 'అన్హోని' సినిమా కోసం పాడారు.
4) దమ్ మారో దమ్ - హరే రామ హరే కృష్ణ (1971)
R.D. బర్మన్, ఆశా భోంస్లేల సింగింగ్ కాంబో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ను అందించింది. వాటిలో ఒకటి 'దమ్ మారో దమ్'. ఈ పాట 'హిప్పీ' ట్రెండ్ వారికి ఓ స్పెషల్ సాంగ్గా మారిపోయింది. అటు బాలీవుడ్లోనే కాకుండా ఇటు దక్షిణాది చిత్రసీమలోని సినిమాల్లో ఏదైనా పార్టీ సన్నివేశాల్లో కచ్చితంగా ఈ పాటను ప్లే చేస్తున్నారు. ఇదో 'కల్ట్ క్లాసిక్'గా ఇప్పటికీ మన మదిలో మెదులుతోంది. ఈ పాట పాడినందుకు గానూ ఆశా భోస్లేకు ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది.
5) చురా లియా హై తుమ్నే జో దిల్ కో - యాదోం కీ బారాత్ (1973)
బాలీవుడ్లో ఇప్పటివరకు వచ్చిన అత్యంత రొమాంటిక్ సాంగ్స్లో ఇదొకటిగా నిలిచింది. నేటికీ ప్రతి ఒక్కరి హృదయంలో స్థానం సంపాదించుకుంది. ఆశా భోస్లే మధురమైన గాత్రం, ఆర్.డి. బర్మన్ అద్భుతమైన సంగీతం వల్ల ఈ పాట నేటికీ ఎందరినో అలరిస్తూ ఎవర్ గ్రీన్ క్లాసిక్గా నిలిచింది.
6) దునియా మే లోగోం కో - అప్నా దేశ్ (1972)
రాజేష్ ఖన్నా, ముంతాజ్ల హీరోహీరోయిన్లుగా నటించి ఈ చిత్రంలో 'దునియా మే లోగోం కో' పాట మీ మూడ్ను ఇట్టే మార్చేస్తుంది.
7) ఖతూబా - అలీబాబా ఔర్ 40 చోర్
అరబిక్ ఛాయలున్న 'ఖతూబా' సాంగ్ పాట ఎంతో ఆకట్టుకుంటుంది. ఆశా భోస్లే గాత్రం ఈ పాటను మరింత స్పెషల్గా మార్చింది.
8) మేరా నామ్ హై షబ్నం - కటి పతంగ్ (1970)
భారతదేశపు మొట్టమొదటి ర్యాప్ పాటగా ప్రసిద్ధి చెందిన ఈ పాటను టాక్-సంగ్ శైలిలో స్వరపరిచారు. ఈ ప్రయోగాత్మక పాట భారీ విజయం సాధించింది.
9) జరా సా ఝూమ్ లూ మై - దిల్ వాలే ధులనియా లే జాయేంగే (1995)
గత తరం నటి మధుబాల నుండి నేటి తరం కథానాయిక కాజోల్ వరకు.. ఆశా భోస్లే తన వయసుతో సంబంధం లేని గాత్రంతో అందరి కోసం పాడారు. జతిన్-లలిత్ స్వరపరిచిన, షారుఖ్ ఖాన్, కాజోల్ నటించిన ఈ ఉషారైన పాటను ఈ దిగ్గజ గాయని పాడారు.
10) రంగీలా రే - రంగీలా (1995)
62 ఏళ్ల ఆశా భోస్లే 1995లో విడుదలైన 'రంగీలా' చిత్రంలో 20 ఏళ్ల వయసున్న ఊర్మిళ మటోండ్కర్ కోసం పాడి, దానికి ప్రత్యేక జ్యూరీ అవార్డును అందుకున్నారు. ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ఈ చార్ట్ బస్టర్ ఇప్పటికీ స్పెషల్ సాంగ్గా నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
TS Inter Exams 2026: ఇంటర్ ఫెయిల్ అయ్యారా? ఈ ముఖ్యమైన తేది గుర్తుపెట్టుకోండి!
Hyderabad, Telangana:TS Inter Supplementary Exams 2026 Latest News: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి కీలక ప్రకటన చేసింది.. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం వచ్చే నెలలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించబోతున్నట్లు బోర్డు వెల్లడించింది. మే 13వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కాబోతున్నట్లు వెల్లడించింది. ఫలితాల విడుదల తర్వాత విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని.. ఏడాదంతా వృధా కాకుండా ఉండేందుకు ఈ సప్లిమెంటరీ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించబోతున్నట్లు బోర్డు తెలిపింది.. అయితే దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
బోర్డు ప్రకటించిన షెడ్యూల్ కు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మే 13 నుంచి థియరీ పరీక్షలు ప్రారంభమై విడతల వారీగా జరుగుతాయని షెడ్యూల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా అనంతరం మే 22వ తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతాయని బోర్డు స్పష్టం చేసింది. ఒకేసారి పరీక్షలు రాయలేని వారు లేదా మార్కులను ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది.
సప్లమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏప్రిల్ 13వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు తమ సంబంధిత కళాశాలలో పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఫీజు చెల్లించేందుకు అనుమతి ఉండదని.. విద్యార్థులు ఈలోపే ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు సూచించారు. పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లతో పాటు పూర్తిస్థాయి టైం టేబుల్ లో త్వరలోనే అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని ఇంటర్ బోర్డు తెలిపింది..
Also Read:TS Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా.. 83.72 శాతంతో మేడ్చల్ టాప్..!
పరీక్ష నిర్వాహణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి వెల్లడించారు. విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ప్రణాళిక బద్దంగా చదువుకోవాలని.. సప్లమెంటరీ పరీక్షలను కూడా వార్షిక పరీక్షల మాదిరిగానే.. సీరియస్ గా తీసుకొని రాయాలని సూచించారు.. మార్కుల రీ వెరిఫికేషన్ తో పాటు రీకౌంటింగ్ దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు కూడా సప్లిమెంటరీ పరీక్షలకు పరీక్షల జరిగే దరఖాస్తు సమయంలోనే అప్లై చేసుకోవాలని స్పష్టం చేసింది..
Also Read:TS Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా.. 83.72 శాతంతో మేడ్చల్ టాప్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sircilla: స్మార్ట్ భిక్షాటన.. QR Codeతో రంగంలోకి దిగిన యాచకుడు!
Hyderabad, Telangana:Sircilla QR Code Beggar Latest News: మారుతున్న కాలంతోపాటు సాంకేతికత సామాన్యుడి ముంగిటకే కాదు.. బిచ్చగాళ్ల చెంతకు కూడా చేరింది. అమ్మ ధర్మం చేయండి.. చిల్లర లేకపోతే ఈ కోడ్ను స్కాన్ చేయండి.. అంటూ యాచకుడు చేస్తున్న డిజిటల్ బిగ్షాట్ అని ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. చిల్లర లేదనే సాకుతో తప్పించుకునే వారికి గట్టిగా చెక్ పెడుతూ.. సాంకేతికతను తన అవసరానికి వాడుతున్న అతడి తీరును చూసి స్థానికులు సైతం ఎంతగానో ఆశ్చర్యానికి గురవుతున్నారు..
సిరిసిల్ల పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే గాంధీ చౌక్ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా ఒక దృశ్యం కనిపిస్తూ వస్తోంది.. సాధన యాచకులు తిన్నే పట్టుకొని అడుక్కుంటారు.. కానీ ఈ వ్యక్తి మాత్రం ఒక చేతిలో గిన్నెతో పాటు మరో చేతిలో ఫోన్ పే QR Code ఉన్న బోర్డును పట్టుకొని వీధుల్లో తిరుగుతూ ఉన్నాడు. పట్టణంలోని వ్యాపార సముదాయంతో పాటు హోటల్లు, ప్రధానం కూడళ్ల వద్ద వెళ్తూ దాతలను భిక్షాటన చేయమని అడుగుతూ ఉన్నాడు..
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు QR Code వినియోగించి పేమెంట్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆన్లైన్ పేమెంట్స్ కే ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నారు. చాలా మంది జేబుల్లో చిల్లర నగదు ఉండడం లేదు. ఎవరైనా దానం అడిగితే.. చిల్లర లేదు నాయనా అని చెప్పి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా సదరు యాచకుడు డిజిటల్ బాట పట్టాడు.. ఎవరైనా చిల్లర లేదని చెబితే. వెంటనే తన చేతిలో ఉన్న క్యూఆర్ కోడ్ ను చూపిస్తూ.. అయ్యా స్కాన్ చేసి రూపాయి లేదా రెండు రూపాయలు పంపండి అంటూ యాచి ఇస్తున్నాడు..
Also Read:TS Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా.. 83.72 శాతంతో మేడ్చల్ టాప్..!
యాచకుడి వద్ద ఈ స్థాయి టెక్నాలజీ చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.. డిజిటల్ ఇండియా అంటే ఇదేనేమో.. చిల్లర లేదని అబద్ధం చెప్పే పరిస్థితి లేకుండా పోయిందని.. కొందరు సరదాగా మాట్లాడుకుంటున్నారు. మరికొందరైతే టెక్నాలజీ ఏ స్థాయికి చేరుకుందో చూసి ఆశ్చర్యపోతున్నారు.. స్మార్ట్ఫోన్ వాడకం పెరగడంతో యాచకులు కూడా అప్డేట్ అవ్వక తప్పడం లేదని కొంతమంది భావిస్తున్నారు. ఈ వినూత్న భిక్షాటనకు సంబంధించిన ఫోటోలతో పాటు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాకుండా దీనిపై సోషల్ మీడియా వినియోగదారులు కూడా వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.
Also Read:TS Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా.. 83.72 శాతంతో మేడ్చల్ టాప్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Khammam: ఒక్క రోజు ఓపిక పట్టి ఉంటే.. మెరిట్ మార్కులతో పాస్.. కానీ ప్రాణం లేదు!
Khammam, Telangana:Khammam Student News: ఇంటర్ రిజల్ట్స్ రాకముందే ఒక విద్యార్థి తీసుకున్న తొందరపాటు నిర్ణయం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. పరీక్షల్లో ఫెయిల్ అవుతానని అనవసర భయంతో తన కలను అర్ధాంతరంగా పాడు చేసుకున్నాడు. కానీ తీరా ఫలితాలు వచ్చాక.. ఆ విద్యార్థి గౌరవప్రదమైన మార్కులతో పాస్ అయ్యాడని తెలిసిన తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.. బాగా ఎదిగిన కొడుకు కళ్ళముందే కానురాని లోకాలకు వెళ్ళిపోతుంటే తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం..
ఖమ్మం జిల్లా రాపల్లి గ్రామానికి చెందిన అక్షాంత్ అనే విద్యార్థి ఇంటర్మీడియట్ ఎంపీసీ (MPC) మొదటి సంవత్సరం చదువుకుంటున్నాడు. ఇంటర్ పరీక్ష ముగిసినప్పటినుంచి ఫలితాల గురించి అక్షంత్ తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు. తాను సరిగ్గా రాయలేదని.. ఫెయిల్ అయితే తన భవిష్యత్తు ఏమవుతుందో అన్న భయం అతడిని ఎంతగానో వెంటాడింది.. ఈ క్రమంలో ఫలితాలు వెలుపడటానికి ముందే.. గురువారం రోజు తీవ్ర మనస్థాపంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు..
శుక్రవారం ఉదయం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలను విడుదల చేసింది. తన కొడుకు పేరుతో ఫలితాలు చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అక్షంత్ అన్ని సబ్జెక్టులోనూ ఉత్తీర్ణత సాధించడమే కాకుండా ఏకంగా 347 మార్కులు సాధించి మెరిట్ జాబితాలో నిలిచాడు.. మార్కులు చూసి సంతోషించాలో.. కొడుకు లేడు అన్న నిజాన్ని తలుచుకొని ఏడవాలో తెలియక ఆ తల్లిదండ్రులు విలవిస్తున్న తీరు గ్రామస్తులను ఎంతగానో బాధకు గురి చేసింది. ఒక్కరోజు ఓపిక పట్టి ఉంటే నా కొడుకు ఈరోజు మన మధ్య ఉండేవాడు.. అని తల్లి తండ్రి రోదిస్తుంటే గ్రామం మొత్తం కన్నీరు పెట్టింది..
Also Read:TS Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా.. 83.72 శాతంతో మేడ్చల్ టాప్..!
ఈ ఘటన నేపథ్యంలో విద్యావేత్తలతో పాటు మానసి నిపుణులు విద్యార్థులకు కొన్ని కీలకమైన సూచనలు చేస్తున్నారు. జీవితమనేది ఒక మహా సముద్రం లాంటిదని.. మార్కులు లేదా ఒక పరీక్ష ఫలితం మీ భవిష్యత్తును పూర్తిగా నిర్ణయించలేవని వారు చెబుతున్నారు. పరీక్షల సమయంలో లేదా ఫలితాల ముందు ఒత్తిడిగా అనిపిస్తే తల్లిదండ్రులతో లేదా స్నేహితులతో మాట్లాడాలని.. ఒకవేళ ఫెయిల్ అయిన సప్లిమెంటరీ పరీక్షలు లేదా ఇతర మార్గాల ద్వారా విజయం సాధించవచ్చుని నిపుణులు తెలుపుతున్నారు. పిల్లలపై మార్కుల కోసం మితిమీరిన ఒత్తిడి తీసుకురావద్దని.. వారి మానసిక స్థితిని గమనిస్తూ ధైర్యం చెప్పాలని నిపుణులు కోరుతున్నారు..
Also Read:TS Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా.. 83.72 శాతంతో మేడ్చల్ టాప్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Saturn Transit 2026: శని చూపు పడితే అంతే సంగతులు.. వచ్చే 30 రోజులు ఈ రాశుల వారికి కఠిన పరీక్ష!
Hyderabad, Telangana:Saturn Transit 2026 Effect On Zodiac Signs Telugu: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహంగా.. కర్మఫల ప్రదాతగా భావించే శని దేవుడు తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. ఏప్రిల్ 17వ తేదీ శని గ్రహం ఉత్తరాభాద్ర పాద నక్షత్రంలోని నాలుగవ పాదంలోకి ప్రవేశించబోతోంది. మే 17వ తేదీ వరకు శని ఇదే స్థితిలో కొనసాగుతాడు. శని గ్రహం గమనం లేదా నక్షత్ర మార్పు జరిగితే అన్ని రాశుల వారిపై కీడు ప్రభావం పడుతుందనే మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రపంచంపై ప్రభావం పడడమే కాకుండా ఎక్కువగా మానవ జీవితాలు ప్రభావితం అవుతాయి. ముఖ్యంగా ఈ నక్షత్ర మార్పు కారణంగా నాలుగు రాశుల వారికి వచ్చే నెల రోజులపాటు ఆర్థికంగా ఆరోగ్యపరంగా వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతేకాకుండా చిన్న చిన్న సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయడం మంచిది.
ప్రభావితం అయ్యే రాశులు ఇవే..
మేషరాశి
మేషరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావం కొనసాగుతోంది. దీని కారణంగా శని నక్షత్రం మార్పు కారణంగా వీరికి వృత్తి జీవితంలో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పనుల్లో ఆటంకాలు కూడా కలగడం.. తీసుకునే నిర్ణయాలు బెడిసి కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల భారీగా నష్టపోయే ప్రమాదం కూడా ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కోరుకున్న కోరికను నెరవేరకపోవచ్చు.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు పని ప్రదేశంలో అనేక ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్లో అనేక సమస్యలు ఎదురవుతాయి. కుటుంబంలో గొడవలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చిన్నపాటి కారణాలే కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలకు దారితీస్తాయి. మానసిక ప్రశాంతత కోసం ఈ సమయంలో తప్పకుండా ధ్యానం చేయడం మంచిది.
తులారాశి
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు కెరీర్ పరంగా అనేక సవాళ్లు ఎదురవుతాయి. అలాగే ఆత్మవిశ్వాసం తగ్గడం వల్ల పనులు పూర్తి చేసుకోకుండానే అనేక సమస్యలల్లో పడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా కొన్ని పనుల్లో విపరీతమైన జాప్యం కూడా ఎదురవుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కకపోవడంతో ఆందోళన చెందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తొందరపాటు ఉద్యోగ మార్పులు అంత మంచిది కాదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
మకర రాశి
ఏప్రిల్ 17వ తేదీ నుంచి మే 17వ తేదీ వరకు వీరికి చాలా కఠినమైన కాలంగా చెప్పవచ్చు. ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి.. కాబట్టి ఆహార నియమాలు దృష్టి సారించడం మంచిది. ప్రతి పనిలోనూ ఆచితూచి అడుగులు వేయడం అవసరం. ఏ మాత్రం అశ్రద్ధ వహించిన నష్టపోయే అవకాశాలకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా అనేక రకాల చిన్నచిన్న సమస్యలు ఎదురవవచ్చు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sanju Samson Century: సంజూ శామ్ సన్ రికార్డు సెంచరీ.. 2026లో చెన్నై బోణి కొట్టిందోచ్!
Chennai, Tamil Nadu:Chennai Super Kings Beat By 23 Runs To Delhi Capitals: హ్యాట్రిక్ ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతం చేసి ఢిల్లీ క్యాపిటల్స్పై ఊహించని విజయం సాధించింది. ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన చెన్నై జట్టు ఢిల్లీపై 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి బోణి కొట్టింది. సంజూ శామ్సన్ అజేయ సెంచరీతో అదరగొట్టాడు. మోస్తరు లక్ష్యమైనా కూడా ఢిల్లీ చేధించలేకపోవడం గమనార్హం. అత్యంత ఆసక్తికర మ్యాచ్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: RR vs RCB: ఐపీఎల్ 2026 రారాజు రాజస్థాన్.. సూర్యవంశీ, జురేల్ బ్యాటింగ్ విధ్వంసంతో బెంగళూరు బోల్తా
చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. టీ20 ప్రపంచకప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన సంజూ శామ్సన్ బ్యాట్తో విధ్వంసం సృష్టించాడు. 56 బంతుల్లో 115 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. వరుస ఓటములు ఎదుర్కొంటున్న నేపథ్యంలో విజయం కోసం పరితపిస్తున్న సమయంలో సంజూ శతకం బాదాడం చెన్నై అభిమానులకు వినోదం అందించింది. ఈ సీజన్లో సంజూకు ఇది తొలిసారి. 15 ఫోర్లతో బౌండరీల వర్షం కురిపించగా.. 4 సిక్సర్లు బాదాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 15 పరుగులకు పరిమితమవగా.. యువ ఆటగాడు ఆయుశ్ మాత్రే 36 బంతుల్లో 59 పరుగులు చేసి అర్ధ సెంచరీ నమోదు చేసి రిటైన్ అయ్యాడు. అనంతరం శివమ్ దూబే 20 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు వికెట్లు తీయడంలో ఘోరంగా విఫలమయ్యారు. పొదుపుగా బౌలింగ్ చేసినా వికెట్లు తీయకపోవడం గమనార్హం. కెప్టెన్ అక్షర్ పటేల్ తీసిన వికెట్ ఒకటే కావడం విశేషం.
Also Read: KTR Speech: చరిత్రహీనుడిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు.. ప్రజలే బుద్ధి చెబుతారు: కేటీఆర్
మోస్తరు లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓవర్లు పూర్తి చేసి 189 పరుగులకు పరిమితమైంది. బ్యాటర్లందరూ చేతులెత్తేయడంతో ఆలౌటైంది. పథూమ్ నిస్సాంక 41 పరుగులతో రాణించగా.. కేఎల్ రాహుల్ (18) భారీ పరుగులు రాణించడంలో విఫలమయ్యాడు. సమీర్ రిజ్వీ (6), కెప్టెన్ అక్షర్ పటేల్ (1), డేవిడ్ మిల్లర్ (17) అతి తక్కువ పరుగులు చేశారు. ఓటమి ఖరారు చేసుకున్న క్లిష్ట సమయంలో త్రిస్టన్ స్టబ్స్ అద్భుతంగా రాణించి 38 బంతుల్లో 60 పరుగులు చేసి జట్టుకు గెలుపు ఆశలు రేకెత్తించాడు. అశుతోష్ శర్మ 19 పరుగులతో రాణించగా.. అనంతరం వచ్చిన బ్యాటర్లందరూ ఘోరంగా విఫలమయ్యారు. ఆకిబ్ నబీ (4), కుల్దీప్ యాదవ్ (4), లుంగీ ఎంగిడి (3), నటరాజన్ (1) చాలా తక్కువ పరుగులు చేసి జట్టును ఓటమి వైపు మళ్లించారు. ఈ మ్యాచ్ విజయం సాధించాలనే కసితో చెన్నై బౌలర్లు బౌలింగ్ వేశారు. తక్కువ పరుగులు ఇస్తూనే వరుస వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బకొట్టారు. జేమీ ఓవర్టన్ కీలక వికెట్లు తీసి ఢిల్లీ నడ్డి విరిచాడు. అతి తక్కువగా 18 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. అన్షుల్ కంబోజ్ 3 వికెట్లు తీసి రాణించగా.. ఖలీల్ అహ్మద్, గుర్జాప్నిత్ సింగ్, నూర్ అహ్మద్ తలా ఒక్కో వికెట్ తీసి జట్టుకు విజయాన్ని అందించారు.
Also Read: KCR Jeevan Reddy: 'దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని' కేసీఆర్తో జీవన్ రెడ్డి
మూడు ఓటముల అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ గొప్పగా పుంజుకుని ఆల్రౌండ్ ప్రదర్శన చేసింది. సంజూ శామ్సన్ భారీ సెంచరీతో వినోదం అందించగా.. బ్యాటర్లు, బౌలర్లు సమష్టి కృషి చేయడంతో జట్టుకు తొలి విజయం దక్కింది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడు ఓటములు, ఒక విజయం సాధించిన చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో తన ర్యాంకును మెరుగుపర్చుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఓటమిని ఊహించలేకపోయింది. నాలుగు మ్యాచ్లు ఆడి విజయాలు, ఓటమలు రెండేసి చొప్పున ఉన్న ఢిల్లీ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. రేపు లక్నో, గుజరాత్ మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా.. రెండో మ్యాచ్ ముంబై, బెంగళూరు మధ్య జరగనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
PBKS Vs SRH Match: సన్రైజర్స్పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం..కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్!
Tira, Punjab:PBKS Vs SRH Match 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పుడు మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. కోల్కతా నైట్రైడర్స్తో జరగాల్సిన గత మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వగా.. ఇప్పుడు సన్రైజర్స్పై గెలిచి సత్తా చాటింది. 220 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా 18.5 ఓవర్లలో ఛేదించి.. ఈ సీజన్లో మరో బలమైన జట్టుగా నిలిచింది. ఈ గెలుపుతో పంజాబ్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో 7 పాయింట్లతో రెండో స్థానానికి చేరుతుంది.
న్యూ ఛంఢీఘర్లోని మహారాజ యుధవీంద్ర అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టుతో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడింది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులను రాబట్టారు. ఆరంభం నుంచే సన్రైజర్స్ బ్యాటర్లు విజృంభించారు.
ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్తో 28 బంతుల్లో 74 పరుగులు రాబట్టి పవర్ప్లేలో ఎక్కువ స్కోర్ రాబట్టేందుకు కృషి చేశాడు. ఇందులో 8 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. అభిషేక్కు తోడుగా బ్యాటింగ్కు వచ్చిన ట్రావిస్ హెడ్ 23 బంతుల్లో 38 పరుగులు రాబట్టి మెరుగైన భాగస్వామ్యం అందించేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన ఇషాన్ కిషన్ (27), క్లాసెన్ (39) తమదైన ఇన్నింగ్స్తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంలో విజయం సాధించారు.
ఆ వెంటనే వచ్చిన సన్రైజర్స్ బ్యాటర్లు అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడం వల్ల 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 219 పరుగులతో సరిపెట్టుకుంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, శశాంక్ సింగ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జేవియర్ ఓ వికెట్ సాధించాడు.
ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్దేశించిన 220 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలో దిగిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఆదినుంచే ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (57 పరుగులు; 5 సిక్సర్లు, 5 ఫోర్లు), ప్రభ్సిమ్రన్ సింగ్ (51 పరుగులు; 4 సిక్సర్లు, 4 ఫోర్లు) అర్ధశతకాలతో దూకుడుగా ఆడారు. వీరిద్దరూ కలిసి 100 పరుగులకు పైగా భాగస్వామ్యం రాబట్టి పంజాబ్ కింగ్స్ జట్టుకు టెన్షన్ లేని ఛేజింగ్ స్థాయికి తీసుకొచ్చారు.
ఆ తర్వాత వచ్చిన కూపర్ కాన్లీ 11 పరుగులకే వెనుదిరిగినా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తనదైన బ్యాటింగ్తో హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 33 బంతుల్లో 69 పరుగులు రాబట్టి (5 సిక్సర్లు, 5 ఫోర్లు) తనదైన మార్క్ ఇన్నింగ్స్ ఆడాడు. నేహాల్ వధేరా 14 పరుగులు చేయగా.. శశాంక్ సింగ్ 16 పరుగులు రాబట్టారు. దీంతో 18.5 ఓవర్లలో నిర్దేశిత లక్ష్యాన్ని చేధించిన పంజాబ్ కింగ్స్ జట్టు ఈ లీగ్లో తమ మూడో విజయాన్ని నమోదు చేసుకుంటూ.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకున్నారు. మరోవైపు సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో శివాంగ్ కుమార్ 3 వికెట్లు పడగొట్టగా.. హర్ష్ దుబే ఒక్క వికెట్ పడగొట్టగలిగారు.
Also Read: RR vs RCB Preview: నేడు ఐపీఎల్లో హోరాహోరీ పోరు..రాజస్థాన్ Vs బెంగళూరు..బుడ్డోడు అదరగొడతాడా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
keesara Toll plaza Accident: కీసర టోల్గేట్ వద్ద ఘోరం.. BMW కారు మీద పడ్డ సిమెంట్ ట్యాంకర్.. వీడియో ..
Hyderabad, Telangana:Keesara Toll plaza accident cement tanker overturns on bmw car: ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కంచికచర్ల మండలం, కీసర టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకున్న ఘటనతో ఆ మార్గంలో భారీగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. హైదరాబాద్ కు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ టోల్ వద్దకు రాగానే అదుపు తప్పి పక్కనే ఉన్న BMW కారుపై బోల్తా పడింది . దీంతో కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ఘటనతో అక్కడున్న వారు షాక్ అయ్యారు. టోల్ గేట్ వద్దకు రాగానే లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో.. అదుపు తప్పి BMW కారుపై సిమెంట్ ట్యాంకర్ బోల్తా పడింది.
ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బోల్తా పడి BMW కారు నుజ్జునుజ్జు
ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల మండలం, కీసర టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకున్న ఘటన
టోల్ గేట్ వద్దకు రాగానే లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో.. అదుపు తప్పి BMW కారుపై బోల్తా పడ్డ వాహనం
ఈ ఘటనలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు.. ఎంతమంది… pic.twitter.com/OHpckNS4oi
— PulseNewsBreaking (@pulsenewsbreak) April 11, 2026
వెంటనే టోల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అతి కష్టం మీద పోలీసులు శ్రమించి BMW కారులో ఉన్న వ్యక్తిని బైటకు తీశారు. అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. అయితే ఘటన స్థలంలోనే అతను చనిపోయాడు.
చనిపోయిన వ్యక్తిని ఎల్లారెడ్డికి చెందిన అడ్వకేట్ బి. శ్రీనివాస్ గా గుర్తించారు. దీనిపై అధికారులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. దీనిపై హైవే అధికారి మాత్రం అతివేగం లేదా డ్రైవర్ తాగి ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని చెప్పారు. మొత్తంగా దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
CSK Vs DC Playing 11: చెన్నె సూపర్ కింగ్స్లో ధోనీ ఎంట్రీ ఖరారు..రసవత్తరంగా మారనున్న ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్!
Chennai, Tamil Nadu:CSK Vs DC Match Playing 11: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా నేడు (శనివారం) చెన్నైలో చేపాక్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. పాయింట్స్ పట్టికలో చివరి పదో స్థానంలో ఉన్న చెన్నై జట్టు ఈ మ్యాచ్లో బోణీ కొట్టాలని చూస్తోంది. అలాగే ఈ మ్యాచ్లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ జట్టులో చేరుతాడనే వార్త జట్టులో మరింత ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా తమ గత మ్యాచ్లో ఓటమి తర్వాత చెన్నైపై కచ్చితంగా గెలవాలని ఊవ్విళ్లూరుతుంది.
చెన్నై విషయానికి వస్తే వారు ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్లలో బ్యాటింగ్ లైనప్ బలహీనంగా ఉన్నందున.. డెవాల్డ్ బ్రెవిస్ను జట్టులోకి ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది. అయితే అతడు జట్టులోకి ఎప్పుడు చేరుతాడనే దానిపై సీఎస్కే మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఈ సీజన్ కోసం 14 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన కార్తిక్ శర్మ స్థానంలో అతను జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఢిల్లీ విషయానికొస్తే .. బ్యాటింగ్ ఆర్డర్లో నితీష్ రాణాకు అంతగా కలిసి రాలేదు. అతని స్థానంలో కరీన్ నాయర్ లేదా అభిషేక్ పోరెల్ను తీసుకునే అవకాశం ఉంది. వీరిద్దరూ గత సీజన్లో మంచి ఐపీఎల్లో రాణించి జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు .
చెన్నై Vs ఢిల్లీ తుది జట్లు అంచనా..
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, కరుణ్ నాయర్ , సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ , లుంగి ఎన్గిడి, టి.నటరాజన్, ముఖేష్ కుమార్.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సంజు శాంసన్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, డెవాల్డ్ బ్రీవిస్, శివమ్ దూబే , జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ , అన్షుల్ కాంబోజ్, మాట్ హెన్రీ.
చెన్నై సూపర్ కింగ్స్ Vs ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు..
ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీశ్ రాణా, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, లుంగీ ఎన్గిడి, టి.నటరాజన్, ముఖేష్ కుమార్, అశుతోష్ శర్మ, ఔకిబ్ నబీ దార్, సమీర్ రిజ్లీన్ చవి, ఔకిబ్ నబీ దార్, సమీర్ రిజ్లీన్ చవి జామీసన్, అజయ్ జాదవ్ మండల్, పృథ్వీ షా, త్రిపురాన విజయ్, అభిషేక్ పోరెల్, సాహిల్ పరాఖ్, మాధవ్ తివారీ.
చెన్నై సూపర్ కింగ్స్: సంజూ శాంసన్(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుష్ మ్హత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్, మాథ్యూ షార్ట్, అకేల్ హోసేన్, కార్తీక్ సింగ్, ద్ష్ణో శర్మ, రామకృష్ణ, జి.ఎస్.ఎస్. శ్రేయాస్ గోపాల్, రాహుల్ చాహర్, స్పెన్సర్ జాన్సన్, ముఖేష్ చౌదరి, ఉర్విల్ పటేల్, అమన్ ఖాన్, డెవాల్డ్ బ్రెవిస్, జకరీ ఫౌల్కేస్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KTR Speech: చరిత్రహీనుడిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు.. ప్రజలే బుద్ధి చెబుతారు: కేటీఆర్
Ibrahimpatnam, Telangana:Ibrahimpatnam Politics: అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. రేవంత్ అహంకారానికి ప్రజలే బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని జోష్యం చెప్పారు. ఇంకో 50 ఏళ్ల దాకా కాంగ్రెస్ మళ్లీ తిరిగి అధికారంలోకి రాదని స్పష్టం చేశారు. ఫ్యూచర్ లేని రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కడతా అంటున్నాడు. ఏఐ ఫోటోలతో ఫ్యూచర్ సిటీ అని మభ్యపెడుతున్నారు. ఫోర్త్ సిటీ ఒక పెద్ద డ్రామా. తన కుటుంబసభ్యులకు భూములు కట్టబెట్టేందుకు కుట్ర. నిషేధిత భూముల జాబితాతో బ్లాక్మెయిల్ రాజకీయాలు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: RR vs RCB: ఐపీఎల్ 2026 రారాజు రాజస్థాన్.. సూర్యవంశీ, జురేల్ బ్యాటింగ్ విధ్వంసంతో బెంగళూరు బోల్తా
ఇబ్రహీంపట్నంలో గెలిచిన నూతన బీఆర్ఎస్ సర్పంచ్లు, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లను శనివారం సన్మానించారు. విజేతలను సన్మానించిన అనంతరం అభినందించి కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. 'కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలకు, అన్యాయాల ఫలితంగా మల్లో 50 సంవత్సరాల దాకా తిరిగి అధికారంలోకి రాదు' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫ్యూచర్ లేని రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కడతాను ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఏఐ చిత్రాలతో గ్రాఫిక్స్తో ఫ్యూచర్ సిటీ అని కొత్త కుట్రకి రేవంత్ రెడ్డి తెరలేపాడు. ఫ్యూచర్ సిటీ పూర్తిగా తన కుటుంబసభ్యులు, అనుచరుల భూమి కుంభకోణాల కోసమే' అని ఆరోపించారు.
Also Read: KCR Jeevan Reddy: 'దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని' కేసీఆర్తో జీవన్ రెడ్డి
అన్ని వర్గాలను మోసం చేస్తూ.. తన కుటుంబసభ్యులు, అనుచరుల కోసం పేదవాళ్ల భూములను అరాచకంగా గుంజుకుంటున్న రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్రలో ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 'తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని చీత్కరించే రోజులు తప్పకుండా వస్తాయి. రేవంత్ రెడ్డి పదవి దిగిపోయిన తర్వాత కనీసం పలకరించే నాథుడు కూడా ఉండడు' అని చెప్పారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఆ విషయం మర్చిపోయి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని జోష్యం చెప్పారు.
Also Read: IPL 2026 LSG vs KKR: ఓటమి నుంచి లక్నో విజయం.. బౌలర్ల వైఫల్యంతో కలకత్తా హ్యాట్రిక్ ఓటమి
'మున్సిపల్ ఎన్నికల అనంతరం దాదాపు 2 నెలల పాటు అన్ని రకాల అన్యాయాలు, అక్రమాలు చేసిన తర్వాత ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగిరిందనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. మంచి నాయకత్వం, మొండితనం ఉన్న నాయకత్వం ఉంటే కచ్చితంగా ప్రజలు ఆదరిస్తారని ఈ ఎన్నికల్లో సాధించిన విజయం నిరూపించిందని పేర్కొన్నారు.
'ఫార్మా సిటీ పేరుతో రేవంత్ రెడ్డి భూముల దందా చేస్తున్నాడు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం సేకరించిన 14,000 ఎకరాల ఫార్మా సిటీ భూములను తిరిగి రైతులకు ఇస్తామని చెప్పి వారితో ఓట్లు వేయించుకొని.. ఇప్పుడు ఫోర్త్ సిటీ పేరుతో మోసం చేస్తున్నాడు' అని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ఒకవైపు కోర్టులో ఫార్మా సిటీ ఉందని చెబుతూ బయటకు వచ్చి అవే భూముల్లో ఫోర్త్ సిటీ కడతామని రేవంత్ రెడ్డి చెప్పి మోసానికి పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'భూమిని రైతుల నుంచి గుంజుకొని ఫోర్త్ సిటీని, భారత్ ఫ్యూచర్ సిటీని కడతానని నాటకాలు ఆడుతున్నారు. భూములు పొందడం కోసమే ఈ ఫ్యూచర్ సిటీ డ్రామాను రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. ఉన్న సిటీనే పట్టించుకునే తెలివి రేవంత్ రెడ్డికి లేదు. ఉన్న సిటీలో దోమలు కుట్టి జనం చనిపోతుంటే పట్టించుకునే పరిస్థితి లేదు, అలాంటిది ఫ్యూచర్ సిటీ కడతానని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఫ్యూచరే లేని నాయకుడు మళ్లీ ఫ్యూచర్ సిటీ కడతా అంటే ప్రజలు నవ్వుతున్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
KCR Jeevan Reddy Meeting: మరోసారి కలవనున్న జీవన్ రెడ్డి, కేసీఆర్.. త్వరలోనే పబ్లిక్ మీటింగ్!
Hyderabad, Telangana:KCR Jeevan Reddy Public Meeting: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, జీవన్ రెడ్డి కలయిక ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ పబ్లిక్ మీటింగ్లో కలవనున్నారట.Chhattisgarh: మైనర్లు స్వచ్ఛందంగా వెళ్తే అది కిడ్నాప్ కాదు: ఛత్తీస్గఢ్ హైకోర్టు సంచలన తీర్పు!
Hyderabad, Telangana:Chhattisgarh HC Verdict Latest News: ప్రేమ వ్యవహారాల్లో మైనర్ బాలికలు తమకు తాముగా.. స్వచ్ఛందంగా ఎవరితోనైనా వెళ్ళిపోయినప్పుడు వారిపై కిడ్నాప్ లేదా పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేయడం చెల్లదని ఛత్తీస్గఢ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ మేరకు జస్టిస్ సంజయ్ కి అగర్వాల్, జస్టిస్ రాధాకృష్ణన్ అగర్వాల్ లతో కూడిన ధర్మాసనం నిందితుడికి ట్రయల్ కోర్టు విధించిన 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను కొట్టివేసింది. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
2022 సంవత్సరంలో చతిస్గఢ్కు చెందిన 15 ఏళ్ల మైనర్ బాలిక.. 24 ఏళ్ల యువకుడితో కలిసి ఇంటి నుంచి వెళ్ళిపోయింది.. వీరిద్దరూ సుమారు నెల రోజులపాటు విజయవాడ తో పాటు హైదరాబాదు నగరాల్లో కలిసి నివసించారు. బాలిక కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వారి రంగంలోకి దిగి.. మైనర్ బాలికతో పాటు 24 ఏళ్ల యువకుడిని గుర్తించి.. యువకుడిపై కిడ్నాప్ కేస్ తో పాటు పోక్సో చట్టం, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. ఈ కేసును విచారించిన స్థానిక ట్రయల్ కోర్టు హిందీతుడిని దోషిగా నిర్ధారిస్తూ దాదాపు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది..
ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు.. ఈ సందర్భంగా హైకోర్టు కీలక అంశాలను ప్రస్తావిస్తూ జడ్జిమెంట్ అందించింది. బాలిక తన వాంగ్మూలంలో నిందితుడు తనను బలవంతంగా తీసుకెళ్లలేదని.. ఇష్టపూర్వకంగానే అతడితో వెళ్లానని స్పష్టం చేసింది.. నెల రోజుల పాటు బహిరంగ ప్రదేశాలతో పాటు.. రద్దీగా ఉండే నగరాల్లో తిరిగినప్పుడు ఎక్కడ ఆమె ప్రతిఘటించలేదని కోర్టు గుర్తించింది. నిందితుడు ఎటువంటి హింసకు కూడా పాల్పడలేదని.. బాలిక స్వచ్ఛందంగానే అతనితో కలిసి జీవించిందని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఒక మైనర్ బాలిక తన ఇష్టంతో.. ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వకుండా ఇల్లు వదిలి వెళ్ళినప్పుడు.. అది కిడ్నాప్ కిందికి రాదని.. చట్టం ప్రకారం మైనర్ల రక్షణ ముఖ్యమే అయినప్పటికీ.. వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలి అని ధర్మాసనం పేర్కొంది. బాధితురాలు స్వయంగా నిందితుడికి అనుకూలంగా సాక్ష్యం చెప్పడంతో.. అతనిపై మోపిన సెక్షన్లు చెల్లవని తీర్పునిస్తూ నిందితుడిని తక్షణమే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది.. ఈ తీర్పు ప్రస్తుతం న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది..
Also Read: Vivo V70 Elite: ఫ్లిప్కార్ట్ ధమాకా ఆఫర్.. రూ.55 వేల Vivo V70 Elite ప్రీమియం ఫోన్ కేవలం రూ.16 వేలకే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Lemon Prices: అమ్మో నిమ్మకాయ! ధర చూస్తే గుండె గుభేల్.. చుక్కలు చూపిస్తున్న పులుపు!
Hyderabad, Telangana:Lemon Prices Hike Latest News: వేసవి సూర్యుడు అప్పుడే తన ప్రతాపాన్ని చూపిస్తూ వస్తున్నాడు.. ఎండలు ముదురుతుండడంతో అల్పాహారం నుంచి మధ్యాహ్నం భోజనం వరకు.. దాహం తీర్చుకునే పానీయాల వరకు దేనికైనా నిమ్మకాయ ఉండాల్సిందే. అయితే ప్రస్తుతం నిమ్మకాయల ధరలు చూస్తుంటే సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎంతో తక్కువ ధరల్లో లభించే నిమ్మకాయలు.. ఇప్పుడు వాటి ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. కేవలం మూడు వారాల వ్యవధిలోనే ధరలు ఆకాశాన్ని తాకడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఇప్పుడు మార్కెట్లో కేజీ నిమ్మకాయ ఎంత ధరల్లో లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
జనవరి మాసంలో నిమ్మకాయ ధరలు కేజీ రూ.10 మాత్రమే ఉండేవి.. ఫిబ్రవరి చివరి వారంలో రూ.30 పలికిన ధరలు.. ఇప్పుడు మార్కెట్లో ఏకంగా రూ.135 వరకు పలుకుతోంది. అంటే దాదాపు నాలుగు నుంచి ఐదు రెట్లు పెరిగింది. రిటైల్ మార్కెట్లో ఒక్కొక్క నిమ్మకాయ ధర దాదాపు 8 నుంచి 10 రూపాయల మధ్యలో ఉంది. అయితే ఒక్కసారిగా నిమ్మకాయలు ఇంత ధరలకు అమ్మడంతో సామాన్యులు కొనాలంటేనే జంకుతున్నారు.. అలాగే కొన్ని చోట్ల అయితే ఒక్కొక్క నిమ్మకాయను 15 రూపాయలకు పైగా విక్రయిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.
ధరలు పెరిగిన రైతుల్లో మాత్రం సంతోషం కనిపించడం లేదు.. వాతావరణ మార్పుల కారణంగా నిమ్మ తోటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎకరాకు సగటున 40 నుంచి 50 బస్తాలు వస్తూ ఉండేవట.. కానీ వాతావరణ మార్పుల కారణంగా 15 బస్తాలు రావడం కూడా గగనమైందని కొంతమంది రైతులు చెబుతూ ఉన్నారు. చీడపీడల నివారణకు మందులు కొట్టడం.. సాగు ఖర్చులు పెరగడం వల్ల వచ్చే ఆదాయం వీటికి సరిపోవడం లేదని వాపోతున్నారు..
అకాల వర్షాలతో పాటు పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల పూత రాలిపోవడం దిగుబడిని తగ్గించడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వేసవిలో శరీరానికి చలువచేసే నిమ్మరసం తాగాలనుకుంటున్న వారికి పెద్ద షాకే అని చెప్పొచ్చు. హోటళ్లతోపాటు జ్యూస్ సెంటర్లలో యజమానులు కూడా ధరలు పెరగడం వల్ల నష్టపోతున్నామని.. కస్టమర్ల వద్ద ఆనందంగా వసూలు చేయలేకపోతున్నామని ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. నిమ్మకాయ ధరలు ఇలాగే పెరిగితే వేసవిలో నిమ్మరసం తాగడం సామాన్యుడికి కలగానే మిగిలిపోయేలా ఉంది.
Also Read: Vivo V70 Elite: ఫ్లిప్కార్ట్ ధమాకా ఆఫర్.. రూ.55 వేల Vivo V70 Elite ప్రీమియం ఫోన్ కేవలం రూ.16 వేలకే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Solar Eclipse 2027: ఆగస్టులో సుదీర్ఘ సూర్యగ్రహణం..పగటిపూట సూర్యుడ్ని మింగేసే చంద్రుడు.. చీకటి పడే రోజు అతిదగ్గర్లోనే!
Hyderabad, Telangana:Solar Eclipse 2027 Time: ఖగోళ సంఘటనల పరంగా 2026 సంవత్సరానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని పరిగణిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే ఒక సూర్యగ్రహణం, ఒక చంద్రగ్రహణం సంభవించాయి. ఇక ఇదే ఏడాది మరో రెండు గ్రహణాలు ఉన్నాయి. అయితే 2027లో సంభవించే సూర్యగ్రహణం సుదీర్ఘకాలం పాటు కొనసాగడం వల్ల గణనీయమైన దృష్టిని ఆకర్షిస్తోంది. దీనిని 'శతాబ్దపు గ్రహణం' అని పిలుస్తున్నారు. అందువల్ల 2027లో సంభవించే సూర్యగ్రహణం గురించి ప్రజలలో మరికొంత ఆందోళన, ఇంకొంత ఆసక్తి నెలకొంది.
2026 సూర్య-చంద్ర గ్రహణం ఎప్పుడు?
2026వ సంవత్సరపు ప్రధాన సూర్యగ్రహణం ఆగస్టు 12వ తేదీ రాత్రి ప్రారంభమై ఆగస్టు 13వ తేదీ ఉదయం వరకు కొనసాగుతుంది. ఈ గ్రహణం సుదీర్ఘంగా ఉన్నా.. ఇది భారతదేశంలో నేరుగా కనిపించదు. అలాగే ఏడాదిలో రెండో చంద్రగ్రహణం ఆగస్టు 27, 28 తేదీల రాత్రి సంభవిస్తుంది.
గ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?
ఈ సూర్యగ్రహణం ప్రధానంగా గ్రీన్ల్యాండ్, ఐస్ల్యాండ్, ఆర్కిటిక్ ప్రాంతం, యూరప్లోని కొన్ని భాగాలలో కనిపిస్తుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి అక్కడ దీని ప్రభావం పరిమితంగా ఉంటుందని అంచనా. చంద్రగ్రహణం మాదిరిగా ఉత్తర, దక్షిణ అమెరికా.. యూరప్, ఆఫ్రికాలోని పశ్చిమ ప్రాంతాలైన తూర్పు పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలలో కనిపిస్తుంది.
భారత్లో సూతక కాలం ఉంటుందా?
ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి మన ప్రజలు సూతకాలం వర్తించదు, అలా సూతకం పాటించాల్సిన అవసరమే లేదు. అంటే ప్రజలు ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ దైనందిన కార్యకలాపాలు చేసుకోవచ్చు. ఆచారాలు నిర్వహించుకోవడంతో పాటు శుభకార్యాలు చేసుకోవచ్చు.
2027 సూర్యగ్రహణం ఎందుకు ప్రత్యేకమైనది?
ఇక 2027 విషయానికి వస్తే.. ఆగస్టు 2, 2027న సంభవించే సూర్యగ్రహణం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తున్నారు. దీని మొత్తం వ్యవధి సుమారు 6 నిమిషాల 23 సెకన్ల పాటు ఉండవచ్చని అంచనా. దీంతో ఇది సుదీర్ఘ కాలం పాటు నడిచే సూర్యగ్రహణంగా పరిగణిస్తారు. ఈ గ్రహణం సమయంలో చాలా ప్రదేశాలలో పగటిపూట చీకటిగా ఉండవచ్చు. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా అడ్డుకున్నప్పుడు ఇది జరుగుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల ఆకాశమంతటా సూర్యాస్తమయం లాంటి ఒక ప్రత్యేకమైన దృశ్యం ఏర్పడుతుంది.
భారతదేశంలో ఈ 2027లో ఏర్పడనున్న గ్రహణం పూర్తిగా కాకుండా పాక్షికంగా మాత్రమే కనిపిస్తుంది. అంటే సూర్యునిలోని కొంత భాగం అస్పష్టంగా కనబడుతుందట. దీనివల్ల ఇది ఒక ప్రత్యేకమైన దృశ్యంగా ఉంటుంది, కానీ పూర్తిగా చీకటిగా ఉండదు.
అయితే ఇంతటి సుదీర్ఘ కాలం పాటు కొనసాగే సంపూర్ణ సూర్యగ్రహణం చాలా అరుదుగా ఏర్పడుతుందట. శాస్త్రవేత్తల ప్రకారం.. ఇంతటి అరుదైన సంఘటన ఎన్నో ఏళ్ల తర్వాత ఏర్పడుతుందట. అందుకే దీనిని శతాబ్దపు గ్రహణం అని పిలుస్తారట. 2027లో సంభవించనున్న ఈ సుదీర్ఘ సూర్యగ్రహణం సమయంలో ఒక ఆసక్తికరమైన ఖగోళ అద్భుతం ఏర్పడనుందట. ఆ సమయంలో చంద్రుడు భూమికి ఎంతో దగ్గరకు ఉంటాడట. అయితే సూర్యుడు సాపేక్షంగా దూరం కారణంగా.. చంద్రుడు ఆకాశంలో పెద్దగా కనిపించి.. సూర్యుడిని పూర్తిగా కప్పివేసే విధంగా కనిపిస్తాడట. దీని ఫలితంగా భూమధ్యరేఖకు చాలా దూరంలో నీడలా ఏర్పడుతుందట. దీని వల్ల పగటి పూట దాదాపుగా 6 నిమిషాల పాటు చీకటి అలుముకుంటుందట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Poco M8s Launch: త్వరలోనే Poco M8s విడుదల.. 50MP కెమెరా, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో అదుర్స్!
Hyderabad, Telangana:Poco M8s Hit Indian Market: ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం పోకో తమ వినియోగదారులకు మరో అద్భుతమైన శుభవార్త అందించబోతోంది. మార్కెట్లో ఇప్పటికే మంచి విజయాన్ని అందుకున్న M సిరీస్లో భాగంగా సరికొత్త మోడల్ పరిచయం చేసేందుకు సిద్ధమైంది. ఇది Poco M8s మోడల్ పేరుతో అందుబాటులోకి. ముఖ్యంగా ఈ మొబైల్కు సంబంధించిన కొన్ని వివరాలు థాయ్లాండ్కు చెందిన నేషనల్ బ్రాడ్కాస్టింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ కమిషన్ (NBTC) డేటాబేస్లో కనిపించినట్లు సమాచారం. దీంతో ఈ ఫోన్ త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నట్లు స్పష్టమైంది. అయితే, దీనిని కంపెనీ మొదట భారత మార్కెట్లోకి విడుదల చేసినట్లు తెలుస్తోంది.
NBTC వెబ్సైట్ సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్ఫోన్ను కంపెనీ 26067PC09G అని మోడల్ నెంబర్తో లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఎలాంటి ఎలక్ట్రానిక్స్ అయినా మార్కెట్లో వచ్చేముందు ఇటువంటి సర్టిఫికేషన్లు పొందడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈ మొబైల్ కూడా ప్రత్యేకమైన సర్టిఫికేషన్ పొందడం విశేషం.. అయితే, ఈ మొబైల్కు సంబంధించిన విడుదల తేదీని Poco కంపెనీ కొన్ని వారాల్లోనే ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ మొబైల్ గతంలో విడుదలైన Poco M8కు అప్గ్రేడ్ వెర్షన్గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మొబైల్కు సంబంధించిన ఫీచర్స్ కూడా లీకైన సంగతి తెలిసిందే..
ఈ స్మార్ట్ఫోన్ ఫీచర్స్కు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ చాలా అద్భుతమైన 6.77 అంగుళాల Full HD+ అమోలెడ్ డిస్ప్లేతో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో విడుదల కాబోతోంది. ఇక ఈ మొబైల్ శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 Gen 3 చిప్సెట్ ప్రాసెసర్ను కలిగి ఉంటుంది. వెనక భాగంలో అద్భుతమైన కెమెరా మాడ్యూల్ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీని వెనక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా ఉంటున్నట్లు తెలుస్తోంది. సెల్ఫీ కోసం ఇందులో కంపెనీ 20MP ఫ్రంట్ కెమెరాను కూడా అందించింది.
Also Read: Vivo V70 Elite: ఫ్లిప్కార్ట్ ధమాకా ఆఫర్.. రూ.55 వేల Vivo V70 Elite ప్రీమియం ఫోన్ కేవలం రూ.16 వేలకే!
అంతేకాకుండా ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన 5,520mAh భారీ బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో అందుబాటులోకి రాబోతోంది. ఇక ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2 సాఫ్ట్వేర్పై పనిచేస్తుంది. ఈ మొబైల్ భారత మార్కెట్లోకి అందుబాటులోకి వస్తే దీని ధర రూ.18 వేల నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది వివిధ రకాల బ్రాండ్లతో ఇటీవల విడుదలైన మొబైల్స్తో పోటీ పడే అవకాశాలున్నాయి. అయితే, పోకో కంపెనీ అతి త్వరలోనే ఈ స్మార్ట్ఫోన్ లాంచింగ్కు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.
Also Read: Vivo V70 Elite: ఫ్లిప్కార్ట్ ధమాకా ఆఫర్.. రూ.55 వేల Vivo V70 Elite ప్రీమియం ఫోన్ కేవలం రూ.16 వేలకే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
