icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
500064
RSRajesh SharmaFollow17 Jun 2024, 06:35 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Dharmendra Pradhan: నా ప్రియమైన బొద్దింకలకు అభినందనలు.. ప్రకాశ్‌ రాజ్‌ ట్వీట్‌ వైరల్‌

New Delhi, Delhi:

  Dharmendra Pradhan Resignation: రాజీలేకుండా.. ధృడసంకల్పంతో విద్యార్థులు అలుపెరగకుండా ఉద్యమం చేయడంతో భారత ప్రభుత్వం దిగివచ్చింది. విద్యార్థుల ఉద్యమానికి తలొగ్గిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ ఎట్టకేలకు రాజీనామా చేశాడు. ఆయన రాజీనామాతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాపై పలు రంగాల ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్పందిస్తున్నారు. అయితే మొదటి నుంచి విద్యార్థులకు తోడుగా ఉన్న పర్యావరణవేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌, సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ స్పందించారు. ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాను స్వాగతించారు. 

వాంగ్‌చుక్‌ స్పందన
నీట్‌ పేపర్‌ లీక్‌పై అవిశ్రాంత పోరాటం చేసిన పర్యావరణ వేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాపై ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘ఇది ప్రజాస్వామ్య విజయం’ అంటూ పోస్టు చేశారు. ‘వీధుల నుంచే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ఇది శాంతి, సహనం, పట్టుదల సాధించిన విజయం. కాక్రోచ్ జనతా పార్టీ, దేశ యువతకు అభినందనలు తెలిపారు. భయాన్ని వీడి ఉద్యమంలో పాల్గొన్న ప్రజలకు కృతజ్ఞతలు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఇకపై ఉద్యమం జవాబుదారీతనం, విద్యాసంస్కరణల దిశగా ముందుకు సాగుతుంది' అని సోనమ్‌ వాంగ్‌చుక్‌ ప్రకటించారు.

నీట్‌ పేపర్‌ లీక్‌పై సోనమ్‌ వాంగ్‌చుక్‌ ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లారు. జూన్ 28వ తేదీన కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు మద్దతుగా సోనమ్‌ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. 26 రోజులపాటు నిరాహారదీక్ష చేసిన ఆయన కేంద్ర ప్రభుత్వం హామీలతో గురువారం విరమించారు. ఆందోళనలో పాల్గొన్నవిద్యార్థులపై కేసులు, నీట్ వివాదం నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అంశాలపై కేంద్రం ప్రభుత్వం హామీ ఇచ్చింది.

ప్రకాశ్‌ రాజ్‌ స్పందన
సోనమ్ వాంగ్‌చుక్ నేతృత్వంలో సాగిన ఉద్యమంపై ప్రశంసలు కురిపిస్తూనే బొద్దింకలు అదే విద్యార్థుల పోరాటంపై అభినందనలు తెలిపారు. అధికారాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందనే విషయాన్ని ఈ పోరాటం నిరూపించిందని 'ఎక్స్‌' వేదికగా ప్రకాశ్‌ రాజ్‌ పోస్టు చేశారు. ప్రకాశ్‌ రాజ్‌ చేసిన పోస్టుకు నెటిజన్లు వేగంగా స్పందిస్తున్నారు. విద్యార్థుల పోరాటానికి అండగా నిలిచిన ప్రకాశ్‌ రాజ్‌ను కూడా అభినందిస్తున్నారు.

ట్వీట్‌ ఇదే!
'నా ప్రియమైన బొద్దింకల (కాక్రోచ్‌)కు అభినందనలు. ప్రియమైన సోనమ్ వాంగ్‌చుక్ సర్, యువత పక్షాన నిలబడిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. ఒక నిరంకుశ పాలనను మీరు మోకాళ్లపైకి తెప్పించగలరని నిరూపించారు'- ప్రకాశ్ రాజ్
 

0
0
Report

జగిత్యాలలో విషజ్వరాల కలకలం.. రెండ్రోజుల్లో ఇద్దరు చిన్నారులు మృతి!

Hyderabad, Telangana:

Jagtial Viral Fever: జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో విషజ్వరాలు పంజా విసిరాయి. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఆరేళ్ల చిన్నారులు జ్వరం బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.. ఒకే తరగతికి చెందిన ఆడుకునే స్నేహితులు వరుసగా మృతి చెందడంతో ఇరు కుంటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. 

కన్నీరు మున్నీరవుతున్న కుటుంబాలు..
గ్రామానికి చెందిన హరిస్మిత (6), వరుణ్ తేజ (6) అనే చిన్నారులు పక్కపక్క ఇళ్లలోనే నివాసముంటూ.. స్థానిక పాఠశాలలో యూకేజీ (UKG) చదువుతున్నారు. ఎంతో ఆప్యాయంగా కలిసి ఆడుకునే ఈ చిన్నారులను విధి జ్వరం రూపంలో బలితీసుకుంది. కొద్దిరోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వరుణ్ తేజ రెండు రోజుల క్రితం పరిస్థితి విషమించి ప్రాణాలు వదిలాడు. ఆ విషాదం నుంచి కోలుకోకముందే.. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హరిస్మిత కూడా నిన్న ఉదయం తుదిశ్వాస విడిచింది.

గల్ఫ్ నుంచి వచ్చినా దక్కని కుమార్తె.. 
కూతురు హరిస్మిత ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలుసుకున్న తండ్రి కిరణ్, గల్ఫ్ నుంచి హుటాహుటిన స్వగ్రామానికి చేరుకున్నారు. కానీ.. వచ్చేసరికి కూతురు మరణించడంతో ఆయన గుండెలవిసేలా రోదించిన తీరు గ్రామాన్ని తీవ్రంగా కలచివేసింది. చిన్నారులిద్దరూ తీవ్రమైన విషజ్వరం (Viral/Toxic Fever) కారణంగానే మరణించినట్లు వైద్యులు ప్రాథమికంగా వెల్లడించారు.

రంగంలోకి వైద్య ఆరోగ్య శాఖ..
ఇద్దరు చిన్నారుల మృతితో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తక్షణమే స్పందించారు. పొరండ్ల గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాలను (Medical Camps) ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రజల ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రాథమిక సర్వే ప్రకారం.. గ్రామంలో సుమారు 20 మంది వివిధ రకాల జ్వరాలతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించి.. వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు.

గ్రామప్రజలు ఎవరూ అధైర్యపడకూడదని.. పరిసరాల పరిశుభ్రత పాటించడంతో పాటు తప్పనిసరిగా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని వైద్య అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా తీవ్రమైన జ్వరం, నీరసంతో పాటు వాంతులు, విరేచనాలు, తీవ్రమైన కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్‌ఎంపీలు లేదా నాటు వైద్యులను ఆశ్రయించి కాలాన్ని వృథా చేయవద్దని.. తక్షణమే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని అధికారులు ప్రజలను సూచిస్తున్నారు.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

సినిమా ఫక్కీలో స్కెచ్.. సిద్ధిపేట ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్!

Hyderabad, Telangana:

Siddipet Latest News: సిద్ధిపేట జిల్లా కేంద్రంలో శనివారం తీవ్ర కలకలం రేగింది. వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చిన ఓ ఖైదీ.. పోలీసుల కళ్లుగప్పి సినిమా ఫక్కీలో పరారైన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బైక్ దొంగతనాల కేసులో రిమాండ్‌లో ఉన్న నిందితుడు సాయికుమార్ తప్పించుకోవడంతో పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఘటన వివరాల్లోకి వెళ్తే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బైక్ దొంగతనాల కేసులో నిందితుడైన సాయికుమార్‌తో పాటు మొత్తం ఏడుగురు ఖైదీలను క్రమశిక్షణా ప్రక్రియలో భాగంగా.. అలాగే జైలు నిబంధనల ప్రకారం.. మెడికల్ చెకప్ నిర్వహించేందుకు సిద్ధిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు.

ఆసుపత్రి ప్రాంగణంలో రోగుల రద్దీ ఎక్కువగా ఉండటాన్ని ఆసరాగా చేసుకున్న సాయికుమార్.. పోలీసులు అజాగ్రత్తగా ఉన్న సమయంలో వారి దృష్టిని మళ్లించి ఒక్కసారిగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఖైదీ మాయమైనట్లు గమనించిన సిబ్బంది వెంటనే తేరుకుని ఆసుపత్రి పరిసరాల్లో వెతికినప్పటికీ.. అప్పటికే అతడు పరారయ్యాడు.

పరారైన సాయికుమార్ పలు బైక్ దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. గతంలో వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తూ.. పోలీసులకు చిక్కాడు. న్యాయస్థానం అతనికి రిమాండ్ విధించడంతో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలోనే వైద్య పరీక్షలకు తీసుకురాగా ఈ ఊహించని ఘటన చోటుచేసుకుంది.

Also Read: Dharmapuri: అయ్యో.. ధర్మపురిలో తీవ్ర విషాదం.. నిద్రమత్తులో పామును తొక్కిన నాలుగేళ్ల బాలుడు.. ఆ తర్వాత..!

ఖైదీ పరార్ వార్త తెలిసిన వెంటనే జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఘటనపై తక్షణమే స్పందించి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల మండలాల్లోకి వెళ్లే ప్రధాన రహదారుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేసిన్నట్లు తెలుస్తోంది.. ఆసుపత్రి పరిసరాల్లోని సీసీటీవీ (CCTV) కెమెరాల ఫుటేజీని సేకరించి.. అతడు ఏ వైపు పరారయ్యాడనే అంశంపై విశ్లేషిస్తున్నారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లతో పాటు రద్దీగా ఉండే ప్రదేశాల్లో పోలీసులు గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు.

Also Read: Dharmapuri: అయ్యో.. ధర్మపురిలో తీవ్ర విషాదం.. నిద్రమత్తులో పామును తొక్కిన నాలుగేళ్ల బాలుడు.. ఆ తర్వాత..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Mukesh Ambani Grandson: ముఖేష్ అంబానీ మనవడు చదువుతున్న స్కూల్ ఏది? ఫీజు ఎంతంటే షాక్ అవ్వాల్సిందే!

Mumbai, Maharashtra:

Mukesh Ambani Grandson School Fee: ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా పేరుగాంచిన ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయం నిత్యం నెట్టింట వైరల్ అవుతుంటుంది. ముఖేష్, నీతా అంబానీ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్న విషయం తెలిసిందే. అయితే, ముఖేష్ అంబానీ పెద్ద మనవడు పృథ్వీ అంబానీ (ఆకాశ్ అంబానీ కుమారుడు) చదువుకుంటున్న స్కూల్, దాని ఫీజులకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

అంబానీ మనవడు చదువుతున్న స్కూల్ పేరు ఏంటంటే?
పృథ్వీ అంబానీ సాధారణ పాఠశాలల్లో కాకుండా, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. ఆయన చదువుతున్న స్కూల్ పేరు 'నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్' (NMAJS). ఈ పాఠశాలకు ప్రపంచంలోనే అత్యంత గౌరవప్రదమైన కరికులమ్ సంస్థ అయిన 'ఇంటర్నేషనల్ బాకలారియేట్ వరల్డ్ స్కూల్' (IB) గుర్తింపు ఉంది. ఇక్కడ పిల్లల ప్రాథమిక విద్య 'ప్రైమరీ ఇయర్స్ ప్రోగ్రామ్'తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 'మిడిల్ ఇయర్స్ ప్రోగ్రామ్' కూడా ఇక్కడే బోధిస్తారు.

ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC), జియో వరల్డ్ సెంటర్ ప్రాంగణంలో ఈ స్కూల్‌కు అత్యాధునికమైన రెండు భారీ క్యాంపస్‌లు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో బాలీవుడ్ ప్రముఖులు, నూతన తరం సెలబ్రిటీల పిల్లలు కూడా చదువుతుండటం విశేషం.

భారీగా స్కూల్ ఫీజులు!
ఈ స్కూల్‌లో ఫీజుల గురించి వింటే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. తరగతిని బట్టి జూనియర్ స్కూల్ ఫీజు సుమారు రూ.14 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుందని అంచనా. అంటే పృథ్వీ అంబానీ ప్రాథమిక విద్య కోసమే లక్షల్లో ఫీజు చెల్లిస్తున్నారు.

ఈ 'నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్' భారతదేశంలోనే నంబర్ వన్ ఇంటర్నేషనల్ స్కూల్‌గా పేరుగాంచిన ప్రఖ్యాత 'ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్' (DAIS)లో ఒక భాగం కావడం గమనార్హం. కేవలం ప్రాథమిక విద్యకే ఇంత భారీ స్థాయిలో ఫీజులు ఉంటే, ఉన్నత తరగతులకు ఫీజులు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు.

Also REad: కేంద్ర మంత్రి పదవికి రవ్‌నీత్ సింగ్ రాజీనామా..రాష్ట్రపతి ఆమోదం..!

Also REad: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా..అసలు ఎవరీ ధర్మేంద్ర, ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. మహారాష్ట్ర సీఎంకు అధిష్టానం పిలుపు.. ఏం జరుగుతుంది?

Hyderabad, Telangana:

Devendra Fadnavis Delhi Visit: కేంద్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు బీజేపీ అధిష్టానం నుంచి అత్యవసర పిలుపు రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఆయన హుటాహుటిన ఢిల్లీ పర్యటనకు సిద్ధం కావడంతో జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

కేంద్ర పెద్దల పిలుపుమేరకు ఢిల్లీ చేరుకోనున్న ఫడ్నవీస్.. బీజేపీ అగ్రనేతలు, భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడితో భేటీ కానున్నట్లు సమాచారం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఖాళీ అయిన కేంద్ర మంత్రివర్గ స్థానాన్ని భర్తీ చేయడం సహా, కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులు (Cabinet Reshuffle) చేపట్టేందుకు అధిష్టానం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది..

ఈ అత్యవసర భేటీలో పలు కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. మొదటగా.. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.. ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో కొత్తవారికి బాధ్యతలు అప్పగించడంతో పాటు కేంద్రంలో మహారాష్ట్ర నేతల ప్రాతినిధ్యంపై చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.  రాబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక వ్యూహాలపై అధిష్టానంతో చర్చించనున్నారు. మహారాష్ట్రలోని ప్రాంతీయ సమీకరణాలతో పాటు దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ వాతావరణంపై సమాలోచనలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..

రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ..
దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీ పర్యటన వెనుక పెద్ద వ్యూహాత్మక అడుగు ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు, మరోవైపు పార్టీ సంస్థాగత నియామకాలపై నిర్ణయాలు తీసుకునేందుకే అధిష్టానం ఆయనను అత్యవసరంగా పిలిపించినట్లు తెలుస్తోంది. ఫడ్నవీస్ భేటీ ముగిసిన తర్వాతే కేంద్రంలో జరగబోయే ఆ నిర్ణయాలపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Dharmendra Pradhan Net Worth: కేంద్ర మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆస్తుల వివరాలు..కోట్లలో సంపద, భారీగా పేరుకుపోయిన అప్పులు!

Hyderabad, Telangana:

Dharmendra Pradhan Net Worth: నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారం, ఇతర పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్షాల నిరసనలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తుతం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా నిలిచారు. ఆయన రాజీనామా డిమాండ్‌తో విద్యార్థి సంఘాలు, కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేస్తుండటంతో.. తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ క్రమంలో ధర్మేంద్ర ప్రధాన్ వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానంతో పాటు ఆస్తుల వివరాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. ఆయన ఆస్తులు, అప్పుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మొత్తం ఆస్తులు, అప్పులు
2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆస్తుల విలువ సుమారు రూ.6.92 కోట్లుగా ఉంది. ఆయనపై వివిధ బ్యాంకులు, ఇతరుల నుంచి కలిపి మొత్తం రూ.2.30 కోట్ల మేర రుణాలు ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడీబీఐ (IDBI) బ్యాంకుల నుంచి ఆయన దాదాపు రూ.31.38 లక్షల రుణం తీసుకున్నారు.

బ్యాంక్ రుణాలతో పాటు ఆయన తన భార్యకు రూ.10 లక్షలు, తండ్రికి రూ.5 లక్షలు ఇవ్వడంతో పాటు మరికొంత మంది బంధువులకు కూడా వ్యక్తిగత అప్పులు ఇచ్చినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

వార్షిక ఆదాయం
ఆదాయం విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ కంటే ఆయన సతీమణి ముందుండటం విశేషం. ధర్మేంద్ర ప్రధాన్ వార్షిక ఆదాయం రూ.12.75 లక్షలు కాగా, ఆయన భార్య వార్షిక ఆదాయం రూ.49.92 లక్షలుగా ఉంది.

పెట్టుబడులు, పొదుపులు
ధర్మేంద్ర ప్రధాన్ దంపతులు తమ సంపాదనలో సింహభాగాన్ని భద్రమైన ఆర్థిక పథకాల్లో మళ్లించారు. బ్యాంక్ డిపాజిట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDs), పీపీఎఫ్ (PPF) ఖాతాల్లో సుమారు రూ.2.47 కోట్లు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్లలో రూ.80.40 లక్షల పెట్టుబడులు ఉన్నాయి. అలాగే ఎల్ఐసీ (LIC) తదితర బీమా పాలసీల విలువ రూ.67.72 లక్షలుగా ఉంది.

స్థిరాస్తులు (భూములు, ఇళ్లు)
ఒడిశాలో రూ.12 లక్షల విలువైన వ్యవసాయ భూమి, రూ. 20.50 లక్షల విలువైన వ్యవసాయేతర భూమి ఆయన పేరిట ఉన్నాయి. అదే విధంగా ఘజియాబాద్, భువనేశ్వర్‌లలో మంత్రి దంపతుల పేరిట సుమారు రూ.1.98 కోట్ల విలువైన ఇళ్లు ఉన్నాయి.

బంగారం, వెండి, వాహనాలు
ధర్మేంద్ర ప్రధాన్ వద్ద 200 గ్రాముల బంగారం, 2.5 కిలోగ్రాముల వెండి ఉండగా.. ఆయన భార్య వద్ద 500 గ్రాముల బంగారం, 10 కిలోగ్రాముల వెండి ఉన్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ వద్ద 2011 మోడల్ హోండా సిటీ కారు ఉండగా, ఆయన భార్య పేరిట పలు వాణిజ్య వాహనాలు నమోదై ఉన్నాయి.

Also Read: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా..అసలు ఎవరీ ధర్మేంద్ర, ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి?

Also Read: కేంద్ర మంత్రి పదవికి రవ్‌నీత్ సింగ్ రాజీనామా..రాష్ట్రపతి ఆమోదం..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

ఆగస్టు 2 నుంచి కేతువు ఎఫెక్ట్‌.. ఈ 4 రాశుల వారికి తిరుగులేని రాజయోగం!

Hyderabad, Telangana:

Ketu Transit Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో కేతువు గ్రహ సంచారానికి ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంటుంది.. గ్రహాల నక్షత్ర మార్పుల ప్రభావంతో ద్వాదశ రాశుల జీవితాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయి. రాబోయే ఆగస్టు 2న రాత్రి 12 గంటలకు కేతువు మఘ నక్షత్రం రెండవ పాదంలోకి సంచారం చేయబోతోంది.. ఈ నక్షత్ర పద సంచారం అక్టోబర్ 3 వరకు కొనసాగనుంది. ఈ సమయం నాలుగు ప్రత్యేక రాశుల వారికి అత్యంత శ్రేయస్సకరంగా మారడమే కాకుండా.. వారి ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారే అవకాశాలు ఉన్నాయి..

ఈ సమయంలో ఆయా రాశుల వారికి నూతన ఆదాయ మార్గాలు విపరీతంగా పెరుగుతాయి. కుటుంబంలో దీర్ఘకాలంగా వేధిస్తున్న విభేదాలు తొలగిపోయి శాంతి సౌఖ్యాలు వర్ధిల్లుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కేతువు శుభ దృష్టి వల్ల విపరీతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
 
ఈ రాశులవారికి బంపర్‌ జాక్‌ఫాట్..
కన్యా రాశి (Virgo)
కన్యా రాశి వారికి ఈ నక్షత్ర సంచారం అత్యంత అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. పట్టేదల్లా బంగారమే అన్నట్లుగా.. ప్రతి పనిలో విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నట్లు జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగంలో ఉన్నతాధికారుల మెప్పు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.. కీలక బాధ్యతలు స్వీకరిస్తారు. అంతేకాకుండా రాబడి నుంచి భారీ మొత్తంలో ధన లాభాలు కూడా కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది..

మేష రాశి (Aries)
కేతువు నక్షత్ర సంచారం కారణంగా మేష రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూల ఫలితాలను అందిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి పురోగతి కూడా కలుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఫలితంగా ఒక్కసారిగా రాబడి పెరిగి ఆర్థిక స్థిరత్వం కూడా విపరీతంగా పెరుతుంది.. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా.. సంతోషంగా మారుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు..

మిథున రాశి (Gemini)
మిథున రాశివారికి ఈ సమయం ఒక రకంగా గోల్డెన్ టైమ్‌గా భావించవచ్చు. వ్యాపారాన్ని విస్తరించడానికి నూతన పెట్టుబడులు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఉద్యోగంలో ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించి.. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.

ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి వారికి కేతు ప్రభావంతో కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి భారీ జీతంతో కూడిన మంచి ఆఫర్లు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి.. సమాజంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులందరి మధ్య అప్యాయత, సమన్వయం పెరుగుతాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

Dharmendra Pradhan: ప్రజా ఉద్యమానికి ఎవరైనా తలొగ్గాల్సిందే.. మోదీపై 'బొద్దింకల' విజయం

New Delhi, Delhi:

Dharmendra Pradhan Resignation: నీట్‌ పేపర్‌ లీక్‌ అంశం భారతదేశాన్ని ఒకతాటిపైకి తెచ్చింది. రాజ్యాంగం కల్పించిన ప్రశ్నించే హక్కు.. పోరాడే హక్కుతో విద్యార్థులు మొక్కవోని సంకల్పంతో పోరాడారు. నీట్‌ పేపర్‌ లీక్‌తో అమాయకులైన విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. లోపభూయిష్టమైన పరీక్ష విధానంతో లక్షలాది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. దానిపై విద్యార్థులు ఉద్యమించారు. న్యాయస్థానంలో బొద్దింకలుగా అవమానపడిన విద్యార్థులే ఇప్పుడు భారత ప్రభుత్వాన్ని కదిలించారు. ఢిల్లీ పీఠాలను కదిలించి గొప్ప విజయం సాధించారు. కొన్ని నెలలుగా సాగుతున్న పోరాటానికి.. కొన్ని వారాలుగా విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. విద్యార్థులు చేసిన ప్రధాన డిమాండ్‌ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామా. ఆయన రాజీనామా చేయడంతో విద్యార్థులు గెలిచారు. ఇది ఒక్క విద్యార్థుల విజయం కాదు ప్రజాస్వామ్య భారతదేశం గెలుపు. అన్యాయంపై బాధితులు సాధించిన విజయం ఇది.

కొన్ని వారాల విద్యార్థుల పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ ఎట్టకేలకు రాజీనామా చేశారు. రాజీనామా చేస్తూ లేఖ విడుదల చేశారు. ఆ లేఖను ప్రధానమంత్రికి పంపినట్లు ఎక్స్‌ వేదికగా ప్రకటించడంతో విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. నీట్‌ పేపర్‌ లీక్‌పై దేశ యువత కొన్ని నెలలుగా తీవ్ర పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా సోనమ్‌ వాంగ్‌చుక్‌ ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో విద్యార్థుల పోరాటం తీవ్ర రూపం దాల్చింది.

అలుపెరగని పోరాటం
అనంతరం కాక్రోచ్‌ జనతా పార్టీ జంతర్‌ మంతర్‌ వద్ద కొన్ని వారాలుగా అలుపెరగని పోరాటం చేసింది. లాఠీచార్జ్‌ చేసినా.. బాష్పవాయువు ప్రయోగించినా.. కేసులు పెడతామని హెచ్చరించినా.. పాస్‌పోర్టులు రద్దు చేస్తామని ప్రకటించినా.. అత్యంత ప్రమాదకర వస్తువులు వాడి భద్రతా బలగాలు బెదిరింపులకు దిగినా విద్యార్థులు వెనకడుగు వేయలేదు. విద్యార్థుల పోరాటానికి యావత్‌ భారతదేశం కదిలివచ్చింది. ఢిల్లీలో ఆందోళనలు దేశంలోని ప్రతి గల్లీకి చేరాయి. ఒక్క అధికార పక్షం తప్ప అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాస్వామ్య సంఘాలు, విద్యార్థి, యువత, సామాజిక సంస్థలు అన్నీ కూడా ఈ పోరాటంలో భాగమయ్యాయి. భావి భారత పౌరులకు సంబంధించిన ఉద్యమంలో అందరూ చేరారు. దీంతో మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామా చేయడంతో విద్యార్థుల పోరాటం ఫలించింది. విద్యార్థుల పోరాటానికి నరేంద్ర మోదీ మెడలు వంచారు.

ఎంతటి నియంత అయినా
ప్రజాస్వామ్య దేశంలో ఎంతటి నియంత అయినా ప్రజా ఉద్యమానికి తలొగ్గాల్సిందే. పన్నెండేళ్లుగా భారతదేశాన్ని పరిపాలన చేస్తున్న నరేంద్ర మోదీ ఎట్టకేలకు ప్రజా ఉద్యమానికి దిగివచ్చాడు. విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మోడీ మెడలు వంచాడు. నీట్‌ పేపర్‌ లీక్‌ అంశంపై నూనుగు మీసాల పోరగాళ్లు చేస్తున్న ఉద్యమంతో ఢిల్లీ పీఠాలు కదిలాయి. దీంతో సుదీర్ఘ కాలం తర్వాత ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజా ఉద్యమం గెలిచింది. 

అవమానం నుంచి విజయం దాకా
తరచూ తమ సమస్యలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులను దేశ సర్వోన్నత న్యాయస్థానం బొద్దింకలు అంటూ అవహేళన చేయగా.. నేడు అవే బొద్దింకలే నేడు భారత ప్రభుత్వం మెడలు వంచేలా చేశాయి. తిరుగులేని అధికారంతో.. విశ్వగురుగా పేరొందిన నరేంద్ర మోదీపైనే బొద్దింకలుగా పేర్కొన్న ఆ విద్యార్థులే విజయం సాధించారు. జయహో విద్యార్థుల్లారా అందుకో అభినందనలు.

0
0
Report

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన రాజీనామా..'నేను బాధ్యత నుంచి తప్పించుకోలేదు' అంటూ ట్వీట్‌!

Hyderabad, Telangana:

Dharmendra Pradhan Resigns: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. జరిగిన పరిణామాల వల్ల గత కొన్ని రోజులుగా విద్యార్థులు, సీజేపీ తీవ్రంగా స్పందించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. గత నాలుగు దశాబ్దాలుగా తాను విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్కరణల కోసం అంకితభావంతో పనిచేశానని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ సేవ చేసే అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, 2026 మే 3న జరిగిన నీట్ పరీక్ష లీకేజీ విషయం వెలుగులోకి రాగానే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడంతో పాటు పరీక్షను రద్దు చేసి, తిరిగి నిర్వహించింది. పరీక్షలను వచ్చే ఏడాది నుంచి పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తామని కూడా ప్రకటించామని ఆయన అన్నారు.

 

 

 కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖలో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజాస్వామ్య శక్తిపై తనకు ఎల్లప్పుడూ అచంచలమైన విశ్వాసం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, దేశ యువత ఆశయాలు, కలలు, ఆకాంక్షల పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని, యువత కేవలం దేశ భవిష్యత్తు మాత్రమే కాదు, దేశ నిర్మాణానికి ప్రధాన శిల్పులని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. గత పది రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలను చూసి తన మనసు తీవ్రంగా కలత చెందిందని, ఇది వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని, భారతీయ యువశక్తే దేశానికి అసలైన బలం అని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వ్యతిరేక శక్తుల ప్రయోజనాలను వినియోగించుకోకుండా చూడాలని, దేశ ఐక్యత దెబ్బతినకూడదని ఆయన పేర్కొన్నారు. దేశంలోని ఏ ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదని, వారు తమ భవిష్యత్తును చదువుకే కేటాయించి దేశ నిర్మాణంలో దృష్టి పెట్టాలని కోరుతూ, ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రాజీనామా పత్రాన్ని గౌరవనీయ ప్రధానమంత్రి గారికి పంపించానని ధర్మేంద్ర ప్రధాన్ రాసుకొచ్చారు. అలాగే, తనపై నమ్మకం ఉంచి, నిరంతరం సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనతో కలిసి పనిచేసిన సహచర మంత్రులకు, మంత్రిత్వ శాఖ అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ, దేశసేవ తన జీవితంలో అత్యున్నత ప్రాధాన్యత అని, అందులో తాను ఎప్పటికీ అంకితభావంతో ఉంటానని పేర్కొన్నారు. శ్రీ జగన్నాథ స్వామి ఆశీస్సులతో భరతమాతకు, ఒడిశా ప్రజలకు, దేశ యువత ఆకాంక్షల సాధనకు భవిష్యత్తులో కూడా తన వంతు సేవలు అందిస్తూనే ఉంటానని ధర్మేంద్ర ప్రధాన్ తన లేఖలో ఎమోషనల్‌ అయ్యారు. 

Also Read:​ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా..అసలు ఎవరీ ధర్మేంద్ర, ఆయన బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

Also Read:​ వివాదాలొచ్చినా చెక్కుచెదరని పదవి.. ధర్మేంద్ర ప్రధాన్‌పై మోదీకి అంత నమ్మకమెందుకు?

'ఇది విద్యార్థుల విజయం'..
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో, ఇది విద్యార్థుల విజయమని నెటిజన్లు పేర్కొంటున్నారు. వారు అనుకుంటే ఏదైనా సాధించవచ్చని పోస్టులు పెడుతూ, అనుకున్నది సాధించారని ప్రశంసిస్తున్నారు. విద్యార్థులు పట్టుబట్టి తలుచుకుంటే ఏ ప్రభుత్వమైనా దిగిరావాల్సిందేనని వారు మరోసారి నిరూపించారని అంటున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Dharmendra Pradhan: మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కేంద్ర క్యాబినేట్ మద్దతు..అసలు ఎవరీ ధర్మేంద్ర ప్రధాన్, ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి?

Hyderabad, Telangana:

Dharmendra Pradhan Biography: ప్రస్తుత విద్యాసంబంధ పరిణామాలు, నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురించి నెట్టింట, విద్యార్థి వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన నేపథ్యం, విద్యార్హతలు, రాజకీయ ప్రయాణం ఎలా సాగిందనే వివరాలు పరిశీలిద్దాం.

కుటుంబ నేపథ్యం, జననం
ధర్మేంద్ర ప్రధాన్ 1969 జూన్ 26న ఒడిశా రాష్ట్రంలోని తల్చేర్‌లో జన్మించారు. ఆయన తండ్రి డా.దేవేంద్ర ప్రధాన్ ప్రముఖ రాజకీయ నాయకుడు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో ఆయన కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించడం వల్ల ధర్మేంద్ర ప్రధాన్‌కు చిన్నతనం నుంచే ప్రజా జీవితంపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది.

విద్యార్హతలు
ధర్మేంద్ర ప్రధాన్ తన ప్రాథమిక విద్యను ఒడిశాలోనే పూర్తి చేశారు. ఆ తర్వాత తల్చేర్ కళాశాల నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. అనంతరం భువనేశ్వర్‌లోని ప్రఖ్యాత ఉత్కల్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించి, ఆంత్రోపాలజీ (మానవ శాస్త్రం)లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.

రాజకీయ ప్రయాణం
ఆయన విద్యార్థి దశలోనే రాజకీయ రంగప్రవేశం చేశారు. ఉత్కల్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న సమయంలో ఆరెస్సెస్ విద్యార్థి సంఘమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో క్రియాశీలకంగా పనిచేశారు. ఆ తర్వాత భారతీయ జనతా యువ మోర్చా (BJYM)లో చేరి వివిధ హోదాల్లో పనిచేశారు. ఒక దశలో BJYM జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు.

ఎన్నికల రాజకీయాలు, పదవులు
2000 సంవత్సరంలో తొలిసారిగా ఒడిశా శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాలంలో రాజ్యసభ సభ్యుడిగా కూడా సుదీర్ఘకాలం సేవలందించారు. ప్రస్తుతం ఆయన ఒడిశాలోని సంబల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

కేంద్ర మంత్రిగా సేవలు
నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ధర్మేంద్ర ప్రధాన్ పలు కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. గతంలో పెట్రోలియం & సహజ వాయువు శాఖ, ఉక్కు శాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రులుగా పనిచేశారు. ఆ తర్వాత 2021 జూలైలో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి అప్పటి నుంచి అదే పదవిలో కొనసాగుతున్నారు. ఒడిశా రాజకీయాల నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన బీజేపీ ప్రముఖులలో ఆయన ఒకరు.

Also Read; కేంద్ర మంత్రి పదవికి రవ్‌నీత్ సింగ్ రాజీనామా..రాష్ట్రపతి ఆమోదం..!

Also REad: "విద్యార్థులతో పాటు నిరసన చేయడానికి డబ్బులిస్తున్నారు" నటి ఆకాంక్ష సంచలన కామెంట్స్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

ముందు NEET అంటే ఏంటో చెప్పండి.. విద్యార్థుల వీడియో వైరల్..

Hyderabad, Telangana:

 CJP Protesters Viral Video: NEET రచ్చ చేస్తున్న కొన్ని రాజకీయ శక్తులకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు గట్టి షాక్ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు పేరిట, క్లాసులను బంద్ చేయించి తమ నిరసనల్లో పాల్గొనాలని బలవంతం చేయడానికి వచ్చిన  కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులకు ఆంధ్రా విద్యార్థుల తెలివితేటలు, పదునైన ప్రశ్నల ముందు నోట మాట రాలేదు. అంతేకాకుండా ఇప్పుడు ఈ విద్యార్థులకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. విద్యార్థుల క్షేమం కోసమే పోరాడుతున్నామని హంగామా చేస్తూ.. వచ్చిన CJP ఆందోళనకారులను ఆంధ్రా విద్యార్థులు అడ్డుకున్నారు. ముందుగా వారి అవగాహనను పరీక్షించేందుకు.. అసలు మీకు NEET Full Form ఏమిటో చెప్పండి?" అని ప్రశ్నించారు. ఈ బేసిక్ ప్రశ్నకు సమాధానం చెప్పలేక నిరసనకారులు ఒక్కసారిగా నీళ్లు నమలాల్సి వచ్చింది.

ఆంధ్రా యూత్ గట్టి కౌంటర్..
కనీస సమాచారం కూడా లేకుండా నిరసనల పేరుతో కాలేజీలపై పడటంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మీరు దేనికోసం పోరాడుతున్నారో.. ఆ పరీక్ష పేరు ఏమిటో కూడా మీకు తెలియదు. అలాంటప్పుడు విద్యార్థుల తరఫున పోరాడుతున్నామని ఎలా చెప్తారు? అని నిలదీశారు. దీంతో డిఫెన్స్‌లో పడ్డ నిరసనకారులు.. అవన్నీ మాకు అవసరం లేదు.. మేం విద్యార్థుల కోసమే చేస్తున్నాం.. అంటూ మాట దాటవేసేందుకు.. కవర్ చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, విద్యార్థులు ఏమాత్రం తగ్గకుండా.. మీ రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని వాడుకోవద్దు.. ముందు విషయాన్ని తెలుసుకుని రండి.. అంటూ వారిని తిప్పి పంపించారు.

 
 
 
 
 

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అవగాహన కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం విద్యాసంస్థలను, విద్యార్థులను వాడుకుంటే.. ఇలానే ఉంటుందని, విద్యార్థులు చేసిన పనికి నెటిజన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోను చూసిన కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఇలా స్పందిస్తున్నారు. ఏ విషయంపై పోరాడుతున్నారో తెలియకుండా జెండాలు పట్టుకుని తిరిగే నాయకులకు ఆంధ్రా విద్యార్థులు ఇచ్చిన కౌంటర్ సూపర్.. అని కామెంట్లు పెడుతున్నారు. విద్యార్థులు చూపిన ఈ చైతన్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

  

0
0
Report

AP SIR 2026 Completed: ఆంధ్రప్రదేశ్‌లో SIR పూర్తి..44.71 లక్షల ఓట్లు తొలగింపు..తుదిజాబితా విడుదల అప్పుడే!

Vijayawada, Andhra Pradesh:

AP SIR 2026 Completed News: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా కీలక దశ విజయవంతంగా ముగిసింది. ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియ అర్ధరాత్రి 12 గంటలకు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఈ సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 44,71,523 మంది ఓటర్లను 'అన్ కలెక్టబుల్'గా గుర్తించినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇది రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 10.74%గా ఉంది.

'అన్ కలెక్టబుల్' ఓటర్ల వర్గీకరణ
గుర్తించిన జాబితాలో ప్రధానంగా ఈ కొన్ని కేటగిరీల వారు ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఆ జాబితాలో మరణించిన ఓటర్లు, ఆచూకీ లభించని వారు (Untraceable), శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు (Permanent Shift), ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉన్న డబుల్ ఎంట్రీలు వంటి వాటిగా గుర్తించారు. వీటన్నింటిని అన్‌ కలెక్టబుల్‌ ఓటర్ల వర్గీకరణలోకి తెచ్చి ఆ ఓట్లను తొలగించనున్నారు.

ముసాయిదా ఓటరు జాబితా విడుదల
ఈ నెల 31వ తేదీన ఎన్నికల సంఘం ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనుంది. ఈ ముసాయిదాలో 'అన్ కలెక్టబుల్'గా తేలిన ఓటర్ల వివరాలను కూడా అందుబాటులో ఉంచనున్నారు.

దరఖాస్తులు, మార్పులకు అవకాశం
ముసాయిదా ప్రదర్శన అనంతరం అర్హులైన కొత్త ఓటర్లు పేర్ల నమోదుకు, లేదా చిరునామా మార్పుల కోసం ఫామ్-6, ఫామ్-8 దరఖాస్తులను సమర్పించుకోవచ్చు.

ఒకవేళ అన్ కలెక్టబుల్ జాబితాలో పేరుండి, తాము అర్హులని భావించే వారు తిరిగి పేరు నమోదు చేసుకోవడానికి ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ (చిరునామా ధ్రువీకరణ పత్రం) తదితర అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలని అధికారులు సూచించారు.

తుది ఓటరు జాబితా విడుదల
ప్రజాధారణ పొందిన అభ్యంతరాలు, సవరణలు, నూతన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత, అక్టోబర్ 3వ తేదీన తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేయనుంది. దీనితో ఏపీలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ పూర్తిగా ముగియనుంది.

Also REad: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మరో ఘోర ప్రమాదం..ఒక కాంట్రాక్ట్ కార్మికుడు మృతి!

Also REad: Seediri Appalaraju Arrest: కొడుకు కోసం కటకటాల్లోకి మాజీ మంత్రి..సీదిరి అప్పలరాజుకు వైసీపీ మద్దతు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Mercury Transit: పుష్య నక్షత్రంలోకి బుధుడు.. ఆగస్టు 8 నుంచి ఈ 4 రాశులకు తిరుగులేని అదృష్టం..

Hyderabad, Telangana:

Mercury Transit In Pushya Nakshatra Telugu: గ్రహాల రాశి, నక్షత్ర సంచారాలకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సంచారాల కారణంగా ఏర్పడే ప్రభావం మానవ జీవితాలపై, ముఖ్యంగా వివిధ రాశులవారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బుద్ధి, వాక్కు, వ్యాపారానికి కారకుడిగా భావించే బుధ గ్రహం ఆగస్టు 8న అత్యంత కీలకమైన నక్షత్ర సంచారం చేయబోతోంది. ఆగస్టు 8న ఉదయం 07:23 గంటలకు బుధుడు, శని గ్రహానికి సంబంధించిందిన పుష్య నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఆగస్టు 16 వరకు బుధుడు ఇదే నక్షత్రంలో సంచార దశలో ఉండబోతున్నాడు.

జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. శని నక్షత్రమైన పుష్య నక్షత్రంలోకి వ్యాపార కారకుడైన బుధుడు ప్రవేశించడం వల్ల అత్యంత శుభప్రదమైన యోగం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ గ్రహ సంచారం కారణంగా 4 రాశుల వారికి జాతకం అద్భుతంగా మారబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరి ఉద్యోగ, వ్యాపారాలలో ఊహించని ప్రగతి కనిపించడమే కాకుండా.. ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు..
కన్యా రాశి:
కన్యా రాశికి అధిపతిగా భావించే బుధుడు నక్షత్ర మార్పు చేయడం వీరికి అదృష్టాన్ని అందిస్తుంది.. ముఖ్యంగా వీరికి ఆదాయం ఒక్కసారిగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెరీర్‌లో సరైన నిర్ణయాలు తీసుకోవడం భవిష్యత్తుకు బలమైన పునాదిని అందించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

మేష రాశి:
పుష్య నక్షత్రంలో బుధుడి సంచారం మేష రాశి వారికి అత్యంత లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి.. ఉద్యోగంలో పురోగతి లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీలో ఆత్మవిశ్వాసం, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం విపరీతంగా పెరుగుతుంది.. ఫలితంగా కార్యాలయంలో ప్రశంసలతో పాటు పదోన్నతి, జీతం పెరుగుదల ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారవేత్తలకు పెద్ద ప్రాజెక్టులు దక్కే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన డబ్బు చేతికి అంది.. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలుగుతుంది..

మిథున రాశి:
మిథున రాశివారికి ఈ సమయం సువర్ణాధ్యాయం లాంటిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోయి.. కొత్త ఆదాయ మార్గాలు సుగమం అవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపార రంగానికి చెందిన వారికి ఆర్థికంగా బాగా కలసివస్తుంది. పెట్టిన పెట్టుబడుల నుంచి ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు అందుతాయి.

వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ సంచారం ఎన్నో రకాల శుభఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆత్మవిశ్వాసంతో చేపట్టిన ప్రతీ పనిలో విజయం తప్పకుండా కలుగుతుంది.. ఉద్యోగస్తులకు కొత్త జాబ్ ఆఫర్ లెటర్లు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. చాలా కాలంగా పూర్తికాకుండా నిలిచిపోయిన పనులు ఈ సమయంలో సులభంగా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ఊహించని రీతిలో లాభాలు కూడా కలుగుతాయి. కుటుంబంలో సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. పాత గొడవలు సర్దుమణిగి బంధాలు బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

విద్యార్థుల సైకోయిజం.. గుండెను పిండేస్తున్న రిపోర్టర్‌ వీడియో..

Hyderabad, Telangana:

 Zee News Reporter Viral Video: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు, సామాన్య పౌరులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఇదిలా ఉంటే, సమాజంలో ఏం జరుగుతుందో క్షణక్షణానికి ప్రజలకు చేరవేసేందుకు.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా క్షేత్రస్థాయికి వెళ్లిన ఒక బాధ్యతాయుతమైన జర్నలిస్ట్‌కు ఎదురైన అవమానం ప్రతి ఒక్కరి గుండెను పిండేస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ జీ న్యూస్‌కి సంబంధించిన వీడియో ఊహించని స్థాయిలో వైరల్ అవుతోంది. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను చూసి స్టూడెట్స్‌పై మండిపడుతున్నారు. అయితే, ఇప్పుడు ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..

విద్యార్థులు ధర్నా నుంచి నిజాయితీగా ప్రత్యక్ష ప్రసారం (Live Reporting) అందిస్తున్న జీ న్యూస్ రిపోర్టర్‌ను నిరసనకారులు, కొందరు ఉన్మాదంతో ప్రవర్తించి ఆయన చుట్టుముట్టారు. చుట్టూ ముసిరి.. అతని ముందే చేతులు ఊపుతూ.. లూజర్.. లూజర్ అంటూ వికృత చేష్టలతో భయభ్రాంతులకు గురిచేశారు. ఏ క్షణంలో ఏమవుతుందో తెలియని భయాందోళనల నడుమ, కేవలం తన వృత్తిధర్మాన్ని నెరవేర్చడానికి నిలబడిన ఆ విలేకరిపై చూపిన ఈ అనాగరిక వైఖరి యావత్ మీడియా రంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

మీడియాపై కక్ష సాధింపా? 
కొన్ని ఛానెళ్లు తమ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయనే నెపంతో.. క్షేత్రస్థాయిలో వార్తలు సేకరిస్తున్న ఒక సామాన్య విలేకరిపై తమ కోపాన్ని ప్రదర్శించడం ఎంతవరకు సమంజసం? వార్త నచ్చకపోతే ప్రశ్నించే హక్కు ఉంది కానీ.. రాత్రింబవళ్లు శ్రమిస్తూ..  ప్రజాసమస్యలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టుల స్వేచ్ఛను హరించే హక్కు ఎవరిచ్చారు? విద్యార్థులమని చెప్పుకుంటూ.. వార్తాల రిపోర్టింగ్‌కి అంతరాయం కలిగించడం, వృత్తిపరమైన బాధ్యతల్లో ఉన్నవారిని మానసికంగా వేధించడం ప్రజాస్వామ్య విలువలకు తీవ్ర విఘాతం కలిగిస్తోంది.

 
 
 
 
 

జర్నలిస్టులకు భద్రతేది?
ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాల్లో వైరల్ కావడంతో నెటిజన్లతో పాటు, జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. విధులు నిర్వర్తిస్తున్న ప్రతినిధిపై ఇలాంటి అరాచకానికి పాల్పడటాన్ని మేధావులు తీవ్రంగా ఖండిస్తున్నారు. జర్నలిస్టుల రక్షణే ధ్యేయంగా పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ముంబైలో భారీగా భద్రతా బలగాలను మోహరించినప్పటికీ.. నిజాయితీగా పనిచేసే విలేకరులపై జరుగుతున్న ఇటువంటి దాడులు మీడియా రంగానికి పెద్ద సవాలుగా మారాయి. మైకులతో నిలబడే జర్నలిస్ట్ వెనుక ఒక కుటుంబం, ఒక బాధ్యత ఉంటాయని విద్యార్థులు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

0
0
Report

ప్లాన్‌తో పోలీసులపై దాడులు.. జంతర్ మంతర్ ఉద్రిక్తత వెనుక 2,500 మంది క్రిమినల్స్?

Hyderabad, Telangana:

Jantar Mantar Violence: CJP ఆందోళనలపై జరుగుతున్న దర్యాప్తులో ఢిల్లీ పోలీసులు అత్యంత కీలకమైన విషయాలను వెల్లడించారు. దేశ రాజధానిలోని నిరసన ప్రాంగణం జంతర్ మంతర్ వద్ద జూలై 21 నుంచి 23 మధ్య జరిగిన ప్రదర్శనల్లో నేర చరిత్ర కలిగిన వందలాది మంది వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు అధికారికంగా ధృవీకరించారు.

ఢిల్లీ పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) ద్వారా నిర్వహించిన చెకింగ్‌లో భాగంగా ఏకంగా 2,500 మందికి పైగా పాత నేరస్థులు, క్రిమినల్ రికార్డులు ఉన్న వ్యక్తులు నిరసనల్లో చురుగ్గా పాల్గొన్నట్లు గుర్తించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సాధారణ పౌరుల ముసుగులో ఈ దుండగులు ప్రవేశించినట్లు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి.

భద్రతా దళాలపై పథకం ప్రకారం దాడులు..
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఆందోళనకారుల గుంపులో కలిసిపోయిన దుండగులు ముందస్తు ప్రణాళిక ప్రకారమే.. భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్నారు. తీవ్రమైన ఉద్రిక్తతలను సృష్టించేందుకు వీరు కత్తులతో పాటు కొడవళ్లు, ఇతర పదునైన ఆయుధాలతో విధుల్లో ఉన్న పోలీసులపై దాడులకు పాల్పడ్డారని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ అనూహ్య దాడితో తీవ్ర ఆందోళనకర వాతావరణం నెలకొంది.

సాధారణ ప్రజలు, నిరసనకారుల వెనుక దాక్కుని నేరస్థులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నించారని.. భద్రతా దళాలపై పదునైన ఆయుధాలతో దాడులు చేయడం చాలా బాధకరమని ఢిల్లీ పోలీస్‌ అధికారులు తెలిపారు...

రంగంలోకి FRS..
జూలై 20న జంతర్ మంతర్ ప్రాంతంలో చెలరేగిన తీవ్ర హింసాకాండను గమనించిన పోలీసులు తక్షణమే అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రించేందుకు.. నిరసన ప్రదేశానికి వచ్చే వారిపై నిఘా పెట్టేందుకు అత్యాధునిక ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను (FRS) అక్కడ హుటాహుటిన ఏర్పాటు చేశారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పాత నేరస్థుల డేటాబేస్‌తో పోల్చి.. చూడగా ఈ ఊహించని నిజాలు బయటపడ్డట్లు తెలుస్తోంది..

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

15 కేసులు నమోదు..
ఈ నిరసనలు, తదనుగుణంగా జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు 15 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. FRS సాంకేతికత ద్వారా గుర్తించిన 2,500 మంది నేరస్థుల వివరాలతో పాటు వీడియో ఫుటేజ్‌ల ఆధారంగా వారిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. రాజధానిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే.. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement
Advertisement
Back to top