icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
500064
RSRajesh SharmaFollow17 Jun 2024, 06:35 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Kcr Public Meeting: జగిత్యాలలో ఈ నెల 20న.. కేసీఆర్ భారీ బహిరంగ సభ.. జీవన్ రెడ్డి ఏమన్నారంటే..?..

Hyderabad, Telangana:

 kcr public meeting in jagtial on 20 th of these month: తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. జగిత్యాల జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరికపై తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలతో మరింత రచ్చ రాజుకుంది. దీనికి కాంగ్రెస్ నేతలు కౌంటర్ లు ఇస్తున్నారు. మరోవైపు జీవన్ రెడ్డి,కేసీఆర్ రాక నేపథ్యంలో ఈ నెల 20న సాయంత్రం 5 గంటలకు జగిత్యాలలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు.  గులాబీ దళపతి కేసీఆర్ సమక్షంలో BRS పార్టీ  కండువాను మాజీ మంత్రి జీవన్ రెడ్డి కప్పుకొనున్నారు.  జిల్లా కేంద్రంలోని మోతె రోడ్ లో బహిరంగ సభ ... ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతుంది . కేసీఆర్ సభ కోసం బహిరంగ సభ స్థలాలను మాజీ మంత్రి జీవన్ రెడ్డి తో పాటు, ఉమ్మడి జిల్లా బిఆర్ఎస్ నేతలు పరిశీలించారు

 జిల్లా కేంద్రంలోని ఎస్.కె.ఎన్.ఆర్ డిగ్రీ కాలేజ్, మోతే రోడ్డు, కాలేజీ గ్రౌండ్ స్థలాలను నాయకులు పరిశీలించారు.  జగిత్యాల లో కేసీఆర్ సభ స్థలాలను పరిశీలించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ రమణ, లోక్ బాపు రెడ్డి లు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ లు ఉన్నారు. ఈ క్రమంలో సభకు భారీగా కార్యకర్తలు, నాయకులు తరలి వస్తున్న నేపథ్యంలో వివిధ స్థలాలను నేతలు పరిశీలిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో.. BRS జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 20 న జగిత్యాల మోతె రోడ్ లో కెసిఆర్ బహిరంగా సభ ఉంటుందన్నారు. కేసీఆర్ కోసం రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సుమరు ఒక లక్ష మంది తో సభ ఏర్పాటు చేస్తామన్నారు.

మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఏమన్నారంటే..?..

జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తన శేష జీవితంలో కేసీఆర్  తో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నట్లు  చెప్పారు. మార్పు రావాలంటే కేసీఆర్ రావాలి రేవంత్ రెడ్డి పోవాలని మరోసారి కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. రెండున్నర సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలను  నెరవేర్చడంలో విఫలమైందన్నారు.

Read more: Aadi Srinivas: కేసీఆర్ విషకౌగిలిలోకి జీవన్ రెడ్డి.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Realme Narzo 100 Lite 5G: ఆరేళ్ల వరకు బ్యాటరీ గ్యారెంటీ! రియల్‌మీ నార్జో 100 లైట్ 5G లాంచ్ డేట్ ఫిక్స్..

Hyderabad, Telangana:

Realme Narzo 100 Lite 5g To Launch On April 14: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజ రియల్ మీ తన నార్జో సిరీస్‌లో మరో అద్భుతమైన మొబైల్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో అత్యంత శక్తివంతమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిని రియల్ మీ కంపెనీ రియల్‌మీ నార్జో 100 లైట్ 5G (Realme Narzo 100 Lite 5G) పేరుతో ఏప్రిల్ 14వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయబోతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కలిగిన మొబైల్స్ కొనుగోలు చేసేవారిని దృష్టిలో పెట్టుకొని ఈ  స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ మొబైల్‌కు సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ Realme Narzo 100 Lite 5G  స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇది 7000mAh టైటాన్ బ్యాటరీతో అందుబాటులోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే రెండు రోజుల పాటు నిరంతరంగా పనిచేయడమే కాకుండా సినిమాలు చూసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ బ్యాటరీ ఆరేళ్లపాటు అద్భుతమైన హెల్త్ కండిషన్ తో పనిచేస్తుందని రియల్ మీ కంపెనీ భరోసా కూడా అందిస్తూ వస్తోంది. ఇందులో కంపెనీ ప్రత్యేకమైన రివర్సల్ చార్జింగ్ సపోర్ట్‌తో పాటు దీనిని పవర్ బ్యాంకులో వాడుకునేందుకు వివిధ రకాల పరికరాలతో చార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. 

ముఖ్యంగా ఈ Realme Narzo 100 Lite 5G స్మార్ట్‌ఫోన్ గేమింగ్‌తో పాటు మల్టీ టాస్కింగ్ చేసే వారికి చాలా బాగా పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.9 అంగుళాల భారీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. అలాగే ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ప్రత్యేకమైన కూలింగ్ సిస్టం కూడా ఇందులో అందించినట్లు తెలుస్తోంది.

Also Read: Vivo V70 Elite: ఫ్లిప్‌కార్ట్ ధమాకా ఆఫర్.. రూ.55 వేల Vivo V70 Elite ప్రీమియం ఫోన్ కేవలం రూ.16 వేలకే!

ఈ Realme Narzo 100 Lite 5G ఫోన్ వెనక భాగంలో అద్భుతమైన కెమెరా మాడ్యూల్‌ని కలిగి ఉంటుంది. ఇందులో ఎంతో శక్తివంతమైన ప్రధాన కెమెరా అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఒక ప్రత్యేకమైన ఎల్‌ఈడీ ఫ్లాష్ కూడా లభిస్తుంది. అలాగే ఈ మొబైల్ ప్రతిష్టంగా ఉండేందుకు Armorshell ప్రొటెక్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది మొత్తం రెండు కలర్ ఆప్షన్స్ లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ధర వివరాల్లోకి వెళ్తే.. దీనిని కంపెనీ ధర రూ.13 వేల నుంచి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. మొదటి సేల్లో భాగంగా కొనుగోలు చేసే వారికి దీనిపై ఎన్నో రకాల అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉండబోతున్నాయి.

Also Read: Vivo V70 Elite: ఫ్లిప్‌కార్ట్ ధమాకా ఆఫర్.. రూ.55 వేల Vivo V70 Elite ప్రీమియం ఫోన్ కేవలం రూ.16 వేలకే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Gudivada Amarnath Jail: మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు జైలుశిక్ష ఖరారు.. 6 నెలలు జైలు, రూ.5 వేలు జరిమానా..ఎందుకంటే?

Visakhapatnam, Andhra Pradesh:

Gudivada Amarnath Jail News: వైసీపీ నాయకుడు, ఏపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. పదేళ్ల క్రితం అనగా 2016 ఏప్రిల్‌లో నమోదైన ఓ కేసులో వాదనలు తాజాగా పూర్తవ్వగా విశాఖపట్నంలోని రెండో అదనపు ప్రధాన న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. నిందితుడిగా మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను పరిగణించిన కోర్టు.. ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఇదే విషయమై ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీలను సత్వరమే అమలు చేయాలని అప్పట్లో వైసీపీ నేతగా ఉన్న మాజీ మంత్రి అమర్‌నాథ్ నేతృత్వంలో ఆందోళనలు చేపట్టారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 2016లో నిరసనలు చేశారు. స్థానిక జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నాలుగు రోజుల పాటు ఆమరణ నిరాహర దీక్ష చేపట్టగా దీనిపై టూటౌన్‌లో కేసు నమోదయ్యింది. 

ఆ క్రమంలో ఆరోగ్య పరిస్థితి క్షీణించగా.. దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు ఏర్పాటు చేశారు. దీక్షను భగ్నం చేసి వెంటనే కింగ్ జార్జ్ ఆస్పత్రికి తరలించారు. అయితే నిరాహార దీక్ష పేరుతో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడని ప్రయత్నించారనే ఆరోపణలతో వైజాగ్ టూటైన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు గత ఎనిమిదేళ్లుగా కోర్టులో వాయిదాలు నడుస్తూ ఉంది. 

తాజాగా ఈ కేసుపై తుది విచారణ పూర్తి చేసిన తర్వాత విశాఖపట్నం రెండో అదనపు కోర్టు తీర్పు వెలువరించింది. అమర్‌నాథ్‌పై చేసిన ఆరోపణలు నిజమని నిర్ధారించగా.. మాజీ మంత్రి అమర్‌నాథ్‌ను దోషిగా తేల్చిన కోర్టు.. అతనికి  ఆరు నెలల జైలుశిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధించింది. ఒకవేళ జరిమానా చెల్లించని పరిస్థితుల్లో అదనపు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. 

వైజాగ్ అదనపు కోర్టు విధించిన జైలు శిక్షపై స్పందించిన వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్.. ప్రజా ప్రయోజనం కోసం అప్పట్లో రైల్వే జోన్‌ ఏర్పాటు సాధనే థ్యేయంగా చేసిన పోరాటాన్ని తప్పుగా చిత్రీకరించారని అమర్‌నాథ్ ఆరోపించారు. తమ పోరాటాల వల్లే విశాఖపట్నానికి రైల్వే జోన్ వచ్చిందని ఆయన చెబుతున్నారు. అయితే కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే.. న్యాయసలహా మేరకు హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. 

Also Read: Singer Mangli Case: టాలీవుడ్ సింగర్ మంగ్లీపై కేసు నమోదు..చంపేస్తామని మంగ్లీ సోదరుడు, డైరెక్టర్ వేణు‌ బెదిరింపులు?!

Also Read: Allu Arjun Remuneration: 'రాకా' సినిమా కోసం అల్లు అర్జున్ పారితోషికం ఎంతో తెలుసా? భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Macherla ASI: పల్నాడులో ఎఎస్సై బాగోతం.. ఏకాంతంగా ఉన్న జంటల వీడియోలు తీసి.. డిపార్ట్ మెంట్ లో దుమారం..

Hyderabad, Telangana:

Palnadu Asi blackmail couple after secretly filming photos: సాధారణంగా ఎవరికైన అన్యాయం జరిగితే వెంటనే పోలీసుల దగ్గరకు వెళ్తారు. తమకు జరిగిన అన్యాయంపై వారికి ఫిర్యాదు చేస్తారు. ఎలాగైన న్యాయం చేయాలని పోలీసుల్ని ప్రాధేయ పడతారు. చాలా మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రజలకు మేలు చేసే పనులుచేస్తారు. బాధితులకు అండగా నిలబడతారు.  మరోవైపు కొంత మంది మాత్రం దీనికి భిన్నంగా ఉంటారు.  వేసుకున్న ఖాకీ దుస్తుల పరువు తీసేలా ప్రవర్తిస్తారు.  ఏదైన సమస్య  ఉందని పీఎస్ కు వస్తే వేధింపులకు గురిచేస్తారు. అంతే కాకుండా లంచం ఇవ్వాలని, లైంగికంగా కూడా టార్చర్ చేస్తారు. ఇలాంటి ఘటనలు తరచుగా మనం చూస్తుంటాం.  

పల్నాడులోని మాచర్ల నియోజక వర్గంలో  ఒక ఏఎస్సై మొత్తంగా డిపార్ట్ మెంట్ పరువు తీసేలా ప్రవర్తించాడు. ఏకంతంగా ఉన్న జంటలను టార్గెట్ చేసుకుని వేధింపులకు గురిచేశాడు.ఈ ఘటన ఏపీలో దుమారంగా మారింది. పల్నాడు జిల్లా మాచర్ల పరిధిలో ఒక ఏఎస్సై నియోజక వర్గం పరిధిలో పర్యాటక ప్రాంతంలలో తరచుగా తిరిగే జంటలను టార్గెట్ చేశాడు. దీనికి  జమ్మల మడుగుకు చెందిన ఆటో డ్రైవర్ సాయం తీసుకున్నాడు. ఇతనిలో వారి ఏకంతంగా , రొమాన్స్ చేసుకుంటుండగా వీడియోలు, ఫోటోలు తీయాలని చెప్పేవాడు.

ఆ తర్వాత వారిని ఏఎస్సై బ్లాక్ మెయిల్ చేస్తు డబ్బులు ఇవ్వాలని, తనతో లైంగికంగా కలవాలని వారిని వేధింపులకు గురిచేశాడు. ఇటీవల ఒక వ్యాపారి, మహిళతో రొమాన్స్ చేసుకుంటుండగా వీడియో తీశాడు.  అతడ్ని కూడా ఇదే విధంగా వేధింపులకు గురిచేశాడు. దీంతో డబ్బులు ఇచ్చిన వేధింపులు ఆగక పోవడంతో  బాధితుడు ఎస్పీకి తన బాధను చెప్పుకున్నాడు.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సదరు పీఎస్ పరిధిలో ఎస్సై, ఏఎస్సై, కానిస్టేబుల్ సైతం ఇదే విధంగా ఏకతంగా ఉండే జంటలను టార్గెట్ చేసుకుని వేధించారని ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై ఏకంగా స్థానిలకు ఎస్పీని కలిశారు. దీనిపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ఈ ఘటనపై మహిళ కమిషన్ రంగంలోకి దిగింది.

Read more: Macherla Govt Woman rape Case: లొకేషన్ పెట్టి ప్రియుడ్ని ముగ్గులోకి లాగి.. మాచర్ల ప్రభుత్వ ఉద్యోగిని కేసులో బైటపడ్డ సంచలన నిజాలు...

దీనిపై సమగ్రంగా విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మహిళల భద్రతపై రాజీపడేదిలేదని స్పష్టం చేశారు. మహిళలను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Singer Mangli Case: టాలీవుడ్ సింగర్ మంగ్లీపై కేసు నమోదు..చంపేస్తామని మంగ్లీ సోదరుడు, డైరెక్టర్ వేణు‌ బెదిరింపులు?!

Hyderabad, Telangana:

Singer Mangli Case News: టాలీవుడ్ సింగర్, ప్రముఖ జానపద గాయని మంగ్లీ (సత్యవతి చౌహాన్)పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. ఆమెతో పాటు ఆమె సోదరుడు శివ, డైరెక్టర్ వేణు ఊడుగుల (విరాటపర్వం డైరెక్టర్)పై ఓ వ్యక్తి కేసు నమోదు చేశాడు. పెట్టుబడి డబ్బును మోసం చేయడం సహా హత్యాయత్న బెదిరింపుల నేపథ్యంలో సదరు బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో వీరు ముగ్గురు చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. 

బాధితుని లాయర్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. వ్యాపార పెట్టుబడులపై అధిక రాబడి ఇస్తామని వాగ్దానం చేసి నిందితులు దాదాపు 100 మంది బాధితుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొని.. ఇన్నేళ్లు గడిచినా.. లాభాలను గానీ, అసలు పెట్టుబడులను గానీ తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎన్ని రోజుల గడిచినా తన డబ్బు తిరిగి రావడం లేదనే ఆవేదనతో బాధితులు న్యాయం కోసం ఇప్పుడు పోలీసులను ఆశ్రయించారు. నిందితుల నుంచి డబ్బు అడిగేందుకు వెళ్లిన బాధితుడ్ని చంపుతామని బెదిరించినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫిర్యాదులో సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడు శివతో పాటు చిత్ర దర్శకుడు వేణు ఉడుగుల తనకు ఫోన్ చేసి బెదిరించారని.. దీంతో తన క్లైయింట్‌కు ప్రాణహాని ఉందని బాధితుని తరఫు లాయర్ ఆరోపించారు. 

ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తూ.. పంజాగుట్ట పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిధులను అక్రమంగా సేకరించారా, ఈ ఆరోపిత మోసంలో ఏదైనా పెద్ద నెట్‌వర్క్ ప్రమేయం ఉందా అనే విషయాలను అధికారులు ఇప్పుడు పరిశీలిస్తున్నారు. సింగర్ మంగ్లీకి పాపులర్ అయిన కారణంగా ఆమె పేరు ప్రముఖంగా ఈ కేసులో వినిపిస్తోంది.

అయితే ఫిర్యాదులో పేర్కొన్న ఇతరుల ప్రమేయం ఏ మేరకు ఉందో, అలాగే వాపసు కోరిన వారిని అణచివేయడానికి నిందితులు బెదిరింపులకు పాల్పడ్డారో లేదో కూడా దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ పెట్టుబడులు పథకం నిజమైనదా లేక అమాయక వ్యక్తులను మోసం చేసేందుకు పక్కాగా ప్లాన్ చేశారా అనేది విచారణలో తేలుతుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. 

Also Read: Allu Arjun Remuneration: 'రాకా' సినిమా కోసం అల్లు అర్జున్ పారితోషికం ఎంతో తెలుసా? భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు!

Also Read: Akanksha Puri Bikini Saree: చీరపై బికినీ బ్లౌజ్‌లో తమిళ హీరోయిన్ రచ్చ..సోషల్ మీడియాలో బండ బూతులు తిడుతున్నారు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

GDS 2nd Merit List: గుడ్‌న్యూస్‌.. పోస్టల్ శాఖ GDS 2nd మెరిట్ లిస్ట్ 2026 అవుట్.. రిజల్ట్ PDF లింక్ ఇదే!

Hyderabad, Telangana:

GDS 2nd Merit List 2026 OUT: అభ్యర్థులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న పోస్టల్ శాఖ GDS ఫలితాలు నిన్న అధికారికంగా విడుదల చేశారు. తెలంగాణ, ఏపీకి సంబంధించి మొత్తంగా దేశవ్యాప్తంగా ఈ ఫలితాలు విడుదలయ్యాయి. రెండో షార్ట్‌ లిస్టులో ఏపీలో 1016 పోస్టులు, తెలంగాణలో 608 పోస్టులు ఉన్నాయి... తెలంగాణ నుంచి 214 మంది ఎంపిక అవ్వగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి 555 మంది ఎంపికయ్యారు. వీరంతా ఏప్రిల్ 27న డివిజన్ ఆఫీసులో ధ్రువీకరణ పత్రాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. పదో తరగతి మార్కుల ఆధారంగా ఈ ఎంపిక చేపట్టారు. 

 దేశవ్యాప్తంగా 19 సర్కిల్స్ లో ప్రస్తుతం నాలుగు సర్కిల్స్ ఎన్నికల్లో కోడ్ ఉండటంతో ఫలితాలు నిలిపివేశారు. మొత్తంగా ఈ పోస్టల్ గ్రామీణ డాగ్ సేవకు దేశవ్యాప్తంగా 28,636 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఇతర పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. వారి లిస్టు ఆన్‌లైన్లో పొందుపరిచారు. అభ్యర్థులు రాష్ట్రాలవారీగా పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

GDS ఫలితాలు సెకండ్ మెరిట్ లిస్ట్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం..
అధికారిక వెబ్‌సైట్ GDS సెకండ్ మెరిట్ లిస్టులో పొందుపరిచారు.
https://indiapostgdsonline.gov.in/ ఓపెన్ చేసి అందులో 'కేండిడేట్స్ కార్నర్' క్లిక్ చేయండి. అక్కడ ఎడమ వైపున కిందికి స్క్రోల్ డౌన్ చేసే ఆన్‌లైన్ ఎంగేజ్మెంట్ సెక్షన్ కనిపిస్తుంది. దానిపై సెకండ్ మెరిట్ లిస్ట్ పీడీఎఫ్ ఎంపిక చేసుకోవాలి. అక్కడ పోస్టల్ సర్కిల్ స్క్రీన్ కనిపిస్తుంది. మీ సంబంధిత రాష్ట్రం, సర్కిల్ ఎంపిక చేసుకొని 'జీడీఎస్ రిజల్ట్స్ 2026 సెకండ్ మెరిట్ లిస్టు' పీడీఎఫ్ సెలెక్ట్ చేయాలి. CTRL+F ఏడు సంఖ్యల రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

GDS పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు త్వరలో కాల్ లెటర్ అందజేస్తారు. ముందుగా సంబంధిత సెంటర్ కి వెళ్లి వారి ధ్రువపత్రాలు అందజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే తుది ఎంపిక జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ జీతం, పెర్క్స్‌ ఇతర బెనిఫిట్స్‌ కూడా అందుకుంటారు.

Also Read:  కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీం.. రోజుకు రూ.2 ఆదా చేస్తే చాలు, నెలకు రూ. 3,000 పెన్షన్, ఇలా అప్లై చేసుకోండి!

Also Read: పదో తరగతి పాస్ అయ్యారా? ఇంటర్ చదువుతూనే నెలకు వేలల్లో సంపాదించే గోల్డెన్ ఛాన్స్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Women Reservations: మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు: రేవంత్‌ రెడ్డి

New Delhi, Delhi:

Women Reservations: మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఇప్పుడున్న సీట్లలో కూడా మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు కదా? అని ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు నియోజకవర్గాల పెంపు అత్యవసరం ఎందుకు? అని నిలదీశారు. సీడబ్ల్యూసీలో నియోజకవర్గాల పెంపుపై కీలకమైన అభిప్రాయాలను తెలిపినట్లు వెల్లడించారు. నియోజకవర్గాల పెంపుతో చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరగనుందని ఆందోళన వ్యక్తం చేశారు. 'చిన్న రాష్ట్రాలు చిన్నగా.. పెద్ద రాష్ట్రాలు మరీ పెద్దగా అయిపోతాయి. చిన్న రాష్ట్రాలు ప్రాముఖ్యత కోల్పోతాయి. ఉత్తరాదికి అడ్వాంటేజ్‌గా మారనుంది' అని చిట్‌చాట్‌లో రేవంత్‌ రెడ్డి తెలిపారు.

Also Read: Birthday As Death Day: బర్త్‌డేను డెత్‌ డేగా మార్చిన పాము.. మంచంపై అమ్మతో నిద్రిస్తుంటే

న్యూఢిల్లీ పర్యటనకు వచ్చిన రేవంత్‌ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. కీలక విషయాలపై స్పందిస్తూ మాట్లాడారు. 'ఉత్తరాది రాష్ట్రాలతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు. నియోజకవర్గాల పెంపు పార్టీల సమస్య కాదు, ప్రాంతాల సమస్య. నియోజకవర్గాల పెంపు, అందమైన ముసుగులో మోసం. నియోజకవర్గాల పెంపుతో చిన్న రాష్ట్రాలు ,పెద్ద రాష్ట్రాల మధ్య ఇప్పుడున్న గ్యాప్  ఉండాలి' అని పేర్కొన్నారు. ఆర్థిక ప్రాతిపదికన నియోజకవర్గాలు పెంచొచ్చని తెలిపారు.

Also Read: RR vs RCB: ఐపీఎల్‌ 2026 రారాజు రాజస్థాన్‌.. సూర్యవంశీ, జురేల్‌ బ్యాటింగ్‌ విధ్వంసంతో బెంగళూరు బోల్తా

'దక్షిణాదిపై వివక్ష కొనసాగుతుంది. 50 శాతం పెంపుతో జరిగే నష్టాలపై సీడబ్ల్యూసీలో స్పష్టంగా చెప్పా. బీజేపీ పెడుతున్న మెలికల్లో రాజకీయ స్వార్థం ఉంది. వివక్షను మేము అంగీకరించం' అని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. 'ఎలా పెంచాలి.. ఏంటి అనేది చర్చ లేకుండా ఇప్పటికిప్పుడు ఎందుకింత అర్జెంటు? ఇప్పుడున్న 543 సీట్లలో 181 సీట్లను మహిళలకు ఇవ్వచ్చు కదా?' అని ప్రశ్నించార. తెలంగాణలో ఐదు నెలల్లో జనగణన, కులగణనలను పూర్తి చేశామని వెల్లడించారు.

Also Read: Deepam Scheme: దీపం లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు తీపి కబురు.. ఏమిటంటే?

'హడావిడి చేసి రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చారు. రైతుల ఆందోళనతో మళ్లీ వెనక్కి తీసుకున్నారు. నియోజకవర్గాల పెంపుపై దక్షిణాదిలో రియాక్షన్ వస్తే చిన్న రాష్ట్రాలు వ్యతిరేకిస్తే ఏం చేస్తారు? బిల్లు అడ్డుకోవాల్సి వస్తే పోరాటం తప్పదు' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. 'దక్షిణాది రాష్ట్రాలు ఫైనాన్షియల్ క్యాపిటల్‌గా ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాలు పొలిటికల్ క్యాపిటల్‌గా కొనసాగుతున్నాయి. తెలంగాణ ఒక్క రూపాయి కేంద్రానికి కడితే 42 పైసలే ఇస్తున్నారు. దక్షిణాదికి చాలా అన్యాయం జరుగుతోంది' అని పేర్కొన్నారు.

'మేం బాధతో ఉన్నాం.. ఆర్థికంగా నష్టపోతున్నాం. రాజకీయంగా కూడా సెకండ్ గ్రేడ్‌గా చూస్తున్నారు. మాపై వివక్ష కొనసాగుతుంది' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. 'సీనియర్లకు అవమానం జరిగిందని కేటీఆర్ మాట్లాడడం సిగ్గుచేటు. ఆలె నరేంద్ర, దేశిని చిన్న మల్లయ్య, ఈటల రాజేందర్ ఇలా ఎంతోమందికి బీఆర్ఎస్ పార్టీలో ఏం జరిగింది. దక్షిణాది నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు కేంద్ర ప్రభుత్వంలో చోటు దక్కింది. ఇప్పుడు సీట్లు పెరిగాక చప్రాసి పదవి కూడా దొరకదు. నా పోరాటం నా వ్యక్తిగతం కోసం కాదు ప్రజల కోసమే. మెరిట్ డిసబిలిటీ విధానంలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఉండాలి' అని చిట్‌చాట్‌లో రేవంత్‌ రెడ్డి వెల్లడించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

IPL 2026 RR vs RCB: ఐపీఎల్‌ 2026 రారాజు రాజస్థాన్‌.. సూర్యవంశీ, జురేల్‌ బ్యాటింగ్‌ విధ్వంసంతో బెంగళూరు బోల్తా

Guwahati, Assam:

RR Win By 6 Wickets: రాజస్థాన్‌ రాయల్స్‌ ఐపీఎల్‌ 2026లో రారాజుగా నిలుస్తోంది. అసలు ఓటమి ఎరుగకుండా వరుస విజయాలు సాధిస్తున్న ఈ జట్టు నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుని అరుదైన ఘనత సాధించింది. ప్రత్యర్థి ఎవరైనా సరే వారిని ఓడించేస్తున్న రాజస్థాన్‌ తాజాగా డిఫెండింగ్‌ చాపింయన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును కూడా బోల్తా కొట్టించింది. 6 వికెట్ తేడాతో మ్యాచ్‌ను సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

Also Read: Deepam Scheme: దీపం లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు తీపి కబురు.. ఏమిటంటే?

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఫిల్‌ సాల్ట్‌ గోల్డెన్‌ డకౌట్‌ కాగా.. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ 32 పరుగులు చేశాడు. దేవదత్‌ పడిక్కల్‌ (14), కృనాల్‌ పాండ్యా (1), జితేష్‌ శర్మ (5), టిమ్‌ డేవిడ్‌ (13) తక్కువ పరుగులకు ఔటయ్యారు. కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ 40 పరుగుల్లో 63 పరుగులు చేయగా.. వాటిలో 4 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. రాజస్థాన్‌ రాయల్స్‌ పొదుపుగా వేసినా పరుగులు ద్విశతకం దాటాయి. అయినా కూడా జోఫ్రా ఆర్చర్‌, రవి బిష్ణోయ్‌, బ్రిజేష్‌ శర్మ తలా రెండేసి వికెట్లు వేశారు. సందీప్‌ శర్మ, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

Also Read: KCR Jeevan Reddy: 'దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని' కేసీఆర్‌తో జీవన్‌ రెడ్డి

బెంగళూరు విధించిన లక్ష్యాన్ని 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి రాజస్థాన్‌ రాయల్స్‌ ఛేదించింది. గత మ్యాచ్‌లో అదరగొట్టిన యశస్వి జైస్వాల్‌ (13) తక్కువ పరుగులకే ఔటవగా... ధృవ్‌ జురేల్‌, వైభవ్‌ సూర్యవంశీ బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించారు. 26 బంతుల్లో అత్యంత వేగంగా సూర్యవంశీ 78 పరుగులు చేయగా.. వాటిలో 8 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. ధ్రువ్‌ జురేల్‌ 43 బంతుల్లో 81 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడు 8 బౌండరీలు బాదగా.. మూడు సిక్సర్లు ఉన్నాయి. షిమ్రాన్‌ హిట్‌మెయిర్‌ డకౌట్‌ కాగా.. కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ మూడే పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 24 స్కోర్‌తో నాటౌట్‌గా నిలిచాడు. అజేయంగా గెలుస్తున్న రాజస్థాన్‌ ఓడించేందుకు బెంగళూరు బౌలర్లు మరింత శ్రమించాల్సి ఉంది. యువ బ్యాటర్లను ఔట్‌ చేయడంలో విఫలమవడంతో భారీ స్కోర్‌ సాధించారు. జోష్‌ హేజిల్‌వుడ్‌, కృనాల్‌ పాండ్యా రెండేసి వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు పరుగులు ఇవ్వడమే సరిపోయింది తప్ప వికెట్లు తీయలేకపోయారు.

Also Read: Birthday As Death Day: బర్త్‌డేను డెత్‌ డేగా మార్చిన పాము.. మంచంపై అమ్మతో నిద్రిస్తుంటే

యువ ఆటగాళ్లతో నిండిన రాజస్థాన్‌ రాయల్స్‌ ఐపీఎల్‌ 2026లో అద్భుతం చేసేస్తోంది. ప్రత్యర్థి ఎవరనేది చూడకుండా వరుస మ్యాచ్‌లు ఆడుతూ విజయాలు సొంతం చేసుకుంటోంది. గత సీజన్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును కూడా రాజస్థాన్‌ తేలికగా తీసిపడేసింది. వరుసగా నాలుగు విజయాలతో అజేయంగా పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో అగ్రస్థానాన్ని పదిలం చేసుకోగా.. బెంగళూరు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో తొలి ఓటమిని ఖాతాలో వేసుకుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Allu Arjun Remuneration: 'రాకా' సినిమా కోసం అల్లు అర్జున్ పారితోషకం ఎంతో తెలుసా? భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు!

Hyderabad, Telangana:

Allu Arjun Raaka Remuneration: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కుతోన్న బారీ బడ్జెట్ చిత్రం 'రాకా'. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా 'రాకా' సినిమాలో ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో హీరోగా అల్లు అర్జున్ విలక్షణ పాత్ర పోషిస్తున్నట్లు.. తోడేలు చేతిని చూపిస్తూ కనిపించాడు. ఒక్క ఫస్ట్‌లుక్‌తో సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది చిత్రబృందం. భారీగా విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కనున్న ఈ మూవీకి దాదాపుగా రూ.900 నుంచి రూ.1000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. 

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేస్తున్నారన్న వార్తల నడుము నటీనటులు రెమ్యూనరేషన్ గురించి తెగ చర్చ జరుగుతోంది. అంతర్జాతీయ స్థాయి హంగులతో విజువల్ ఎఫెక్ట్స్‌తో అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్ కోసం నిర్మాతలు ఖర్చుకు వెనుకాడడం లేదట. 
 
ఇంతటి భారీ బడ్జెట్ చిత్రంలో నటీనటుల రెమ్యునరేషన్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 'రాకా' సినిమా కోసం కథానాయకుడు అల్లు అర్జున్ దాదాపు రూ.175 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

అదే విధంగా ఈ సినిమాలోని హీరోయిన్ దీపికా పదుకొణె కూడా హీరోకి తగ్గట్టుగా రూ.25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో రష్మిక మంధన్న కీలక పాత్ర పోషిస్తుందని.. ఆమె కూడా రూ.5 నుంచి రూ.7 కోట్ల పారితోషకం డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. 

'రాకా' సినిమాలో మృగం గెటప్ కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తున్నారట. ఈ లుక్ కోసం కాస్ట్యూమ్స్, మేకప్, గ్రాఫిక్స్ భారతీయ తెరపై మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతున్నాయని సమాచారం. ఈ చిత్రం 2027 సమ్మర్‌లో విడుదల చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Also Read: Akanksha Puri Bikini Saree: చీరపై బికినీ బ్లౌజ్‌లో తమిళ హీరోయిన్ రచ్చ..సోషల్ మీడియాలో బండ బూతులు తిడుతున్నారు!

Also Read: Silk Smitha Apple Auction: సిల్క్ స్మిత కొరికిన ఆపిల్ పండు వేలం..ఎంతకు కొన్నారో తెలుసా? స్టార్ హీరో సినిమా రెమ్యూనరేషన్ అది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Deepam Scheme: దీపం లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు తీపి కబురు.. ఏమిటంటే?

Amaravathi, Andhra Pradesh:

LPG Covert To PNG: గ్యాస్‌ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు దీపం లబ్దిదారులకు శుభవార్త ప్రకటించారు. ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారాలని అవగాహన కల్పించాలని.. అలా మారిన వారికి కూడా దీపం పథకం అమలవుతుందని తెలిపారు. పీఎన్జీ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎల్పీజీ సరఫరా ఏర్పడిన నేపథ్యంలో పీఎన్జీ ఎంతో దోహదం చేస్తుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

Also Read: Birthday As Death Day: బర్త్‌డేను డెత్‌ డేగా మార్చిన పాము.. మంచంపై అమ్మతో నిద్రిస్తుంటే

రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గ్యాస్ సరఫరా ఇబ్బందులను అధిగమించడానికి ఆయిల్ కంపెనీలు పీఎన్జీ కనెక్షన్లను పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్దాల కారణంగా తలెత్తిన ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యను ఎదుర్కొనేందుకు మరింత సన్నద్దతతో పనిచేయాలని  ఆయిల్ కంపెనీలకు, అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) వినియోగం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీపం పథకం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన కల్పించాలని.. దీపం పథకం లబ్దిదారులు పీఎన్జీకి మారితే వారికి కూడా దీపం పథకం కింద ఇచ్చే రాయితీ సొమ్మును జమ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని.. వెంటనే ఉత్తర్వులు విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Also Read: KCR Jeevan Reddy: 'దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని' కేసీఆర్‌తో జీవన్‌ రెడ్డి

పీఎన్జీ కనెక్షన్ తీసుకున్నా దీపం పథకం ద్వారా కలిగే లబ్ది పొందవచ్చనే విషయం లబ్దిదారులకు అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగానికి సూచించారు. వచ్చే 6 నెలల్లో మొత్తం 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని ఈ విషయంలో జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. టార్గెట్ ఎట్టిపరిస్థితుల్లో చేరుకోవాలని నిర్దేశించారు. గృహ అవసరాలకు సంబంధించి గ్యాస్ సరఫరాలో సమస్యలను అధిగమించామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. డొమస్టిక్‌ పంపిణీకి సంబంధించి సమస్యను తగ్గించామని.. త్వరలో సాధారణ స్థితికి తీసుకువస్తామని తెలిపారు. 

Also Read: Tirumala Laddu: తిరుమలలో సరికొత్త రికార్డు.. రూ.13.95 కోట్ల లడ్డూ విక్రయాలతో రూ.567 కోట్ల ఆదాయం

శ్రీకాకుళం - కాకినాడ నేచురల్ గ్యాస్ పైప్ లైన్ పనుల్లో జాప్యంపై కూడా సీఎం చంద్రబాబు అధికారుల వివరణ కోరారు. దీనికి సంబంధించి కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని అధికారులు చెప్పడంతో వెంటనే సీఎం చంద్రబాబు ఆ సమావేశంలోనే కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ఫోన్ చేశారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తవడంతో వెంటనే పనులు పూర్తి చేసేలా చూడాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే సమీక్షించి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Chandrababu: క్వాంటం డీప్ టెక్‌లో అజేయ శక్తిగా అమరావతి: సీఎం చంద్రబాబు

Amaravathi, Andhra Pradesh:

Amaravati Quantum Hub: సాంకేతికతతో కొత్త విప్లవం సృష్టించిన క్వాంటం టెక్నాలజీలో గ్లోబల్ లీడర్‌గా అమరావతి ఎదుగుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. నేషనల్ క్వాంటం మిషన్ లక్ష్యాలను అందిపుచ్చుకుని దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటింగ్ కేంద్రంగా రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు. క్వాంటం టెక్నాలజీలో పరిశోధనలు, ఆవిష్కరణల దిశగా అవసరమైన ఎకో సిస్టం సిద్ధమవుతోందని.. క్వాంటంలో ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్ ప్రపంచానికి చిరునామాగా మార్చేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

Also Read: KCR Jeevan Reddy: 'దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని' కేసీఆర్‌తో జీవన్‌ రెడ్డి

ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ క్వాంటం కంప్యూటర్ల టెస్టింగ్ రిఫరెన్సు ఫెసిలిటీని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. గన్నవరంలోని మేధా టవర్స్‌తో పాటు రాజధానిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 1ఎస్, 1 క్యూ పేరిట రెండు వేర్వేరు క్వాంటం టెస్టింగ్ రిఫరెన్సు ఫెసిలిటీలు ప్రారంభం కానున్నాయి. దీంతో దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్సు ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించనుండడం విశేషం.

Also Read: Birthday As Death Day: బర్త్‌డేను డెత్‌ డేగా మార్చిన పాము.. మంచంపై అమ్మతో నిద్రిస్తుంటే

ఈ స్వదేశీ నిర్మిత క్వాంటం రిఫరెన్స్ టెస్ట్ ఫెసిలిటీలు అమరావతిని ఓ అత్యాధునిక క్వాంటం ఎకోసిస్టమ్‌గా తీర్చిదిద్దనున్నాయని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో భారత్‌లోనే తొలిసారి క్వాంటం కంప్యూటర్ హార్డ్‌వేర్‌ను పరీక్షించే సౌకర్యాన్ని అమరావతిలో ఏర్పాటుచేశారనే విషయాన్ని గుర్తుచేశారు. క్వాంటం కంప్యూటింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించేలా ఓపెన్ యాక్సెస్ రిఫరెన్స్‌ ఫెసిలిటీగా దీనిని ఏర్పాటుచేస్తున్నారు.

క్వాంటం రిఫరెన్స్‌ ఫెసిలిటీ టెస్ట్ బెడ్‌లు క్వాంటం హార్డ్‌వేర్ తయారీలో కీలకం కానున్నాయని సీఎం చంద్రబాబు ఆశిస్తున్నాయరు. ఈ రెండు చోట్లా మైనస్ 273 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో క్వాంటం కంప్యూటర్లు పనిచేయనుండగా.. క్వాంటం కంప్యూటర్లలో ఉపకరించే వివిధ పరికరాలను టెస్ట్ చేసేలా ఈ రిఫరెన్స్‌ ఫెసిలిటీలు తోడ్పాటు అందించనున్నాయి. క్వాంటం టెక్నాలజీలో కేవలం సాఫ్ట్‌వేర్ అల్గారిథమ్స్ తో పాటు హార్డ్‌వేర్ తయారీలోనూ స్వయం సమృద్ధి సాధించాలన్నది సీఎం చంద్రబాబు  ఆశయం పెట్టుకున్నారు. క్వాంటం కంప్యూటర్లకు అవసరమైన పరికరాలను తయారు చేయాలని కూడా లక్ష్యంగా నిర్దేశించారు. ఇటీవలే 30కి పైగా క్వాంటం హార్డ్ వేర్ తయారీ సంస్థలతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. అమరావతిలో ఏర్పాటవుతున్న క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ భారత్‌లో క్వాంటం హార్డ్‌వేర్ నెట్‌వర్క్‌కు యాంకర్ నోడ్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా సీఎం నిర్దేశించారు. ప్రెసిషన్ ఎలక్ట్రానిక్స్, క్వాంటం గ్రేడ్ ఫ్యాబ్రికేషన్ లాంటి రంగాల్లో స్వదేశీ క్వాంటం కంప్యూటింగ్ ఉపకరణాల తయారీకి కేంద్రంగా అమరావతి మారాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన ముఖ్య ఉద్దేశం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

PM Modi Assassination: ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర..ముగ్గురు అరెస్టు..అమెరికాతో బేరసారాలు?!

Hyderabad, Telangana:

PM Modi Assassination Attempt: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య కోసం పన్నిన కుట్ర ఇప్పుడు భగ్నమైంది. ప్రధాని మోదీని హత్య చేసేందుకు పన్నాగం పన్నిన ఆరోపణల కారణంగా బిహార్‌లో ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు. తొలుత అధికారులు వెల్లడించిన సమాచారం మేరకు పోలీసులు సిమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంటిపై దాడి చేసి ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

నిందితుడ్ని అమన్ తివారీగా గుర్తించారు. ఇతను సిమ్రిలోని ఆశా పడ్రి నివాసిగా నిర్ధారించారు. బక్సర్ ఎస్పీ శుభమ్ ఆర్య వెల్లడించిన వివరాల ప్రకారం.. అతను ప్రధానమంత్రిని హత్య చేసే లక్ష్యంగా చేసుకుని కుట్ర పన్నాడని, ఈ ప్రణాళికకు సంబంధించి ఒక విదేశీ ఏజెన్సీని సంప్రదించాడని ఆరోపణలు ఉన్నాయి.

దర్యాప్తులో భాగంగా నిందితుడు ఈ కుట్రను అమలు చేయడానికి ప్రతిఫలంగా భారీ మొత్తంలో డబ్బు కోరుతూ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA)కి ఒక ప్రతిపాదన పంపినట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ ప్రణాళికను అమలు చేయడానికి అతను 22 రోజుల సమయం కూడా కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి.

నిందితుడు అమన్ తివారీ ఇంటిని సోదా చేసే సమయంలో నిందితుడి నివాసం నుంచి పోలీసులు ఒక ల్యాప్‌టాప్‌తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆరోపిత కుట్రకు సంబంధించిన మరిన్ని ఆధారాలు సేకరించేందుకు ప్రస్తుతం ఈ పరికరాలను పరిశీలిస్తున్నారు. 

ప్రధాన నిందితుడు అమన్ తివారీ అందించిన సమాచారం ఆధారంగా మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. ఈ కుట్ర పూర్తి స్థాయిని, దాని ఉద్దేశ్యాన్ని వెలికితీసేందుకు ఆ ముగ్గురినీ విచారిస్తున్నారు. అయితే దర్యాప్తు కొనసాగుతోందని, ఆరోపిత కుట్రలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు మరిన్ని సంబంధాలపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు.

Also Read: BJP Manifesto 2026: మహిళలకు గుడ్‌న్యూస్..నెలకు రూ.3,000 అకౌంట్లో జమ..ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం!

Also REad: RR vs RCB Preview: నేడు ఐపీఎల్‌లో హోరాహోరీ పోరు..రాజస్థాన్ Vs బెంగళూరు..బుడ్డోడు అదరగొడతాడా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

BJP Manifesto 2026: మహిళలకు గుడ్‌న్యూస్..నెలకు రూ.3,000 అకౌంట్లో జమ..ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం!

Chhotobainan, West Bengal:

BJP Manifesto West Bengal 2026: రాబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రణాళికలు రచిస్తుంది. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో మహిళా ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసింది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ఎన్నికల హామీలను విడుదల చేశారు.

రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు రూ.3,000 భత్యం ఇస్తామని తెలియజేసింది. 75 లక్షల మంది మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని బీజేపీ తమ మేనిఫెస్టోలో ప్రకటించింది. సాధ్యమైనంత త్వరగా మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి..అందులో నారీ సహాయతా డెస్క్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 

రాష్ట్రంలో కఠినమైన చట్టాన్ని అమలు చేయడంతో పాటు మహిళలపై నేరాలను ఏమాత్రం సహించబోమని బీజేపీ మానిఫెస్టోలో పేర్కొన్నారు. రద్దీగా ఉండే నగర ప్రాంతాలతో పాటు విద్యాసంస్థలు, హాస్టళ్లు, బహిరంగ ప్రదేశాలలో మహిళల భద్రత, గౌరవాన్ని మేము కాపాడతామని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు.

అయితే పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలోని కొన్ని కీలక పాయింట్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

1) ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లోని గర్భిణీ స్త్రీలకు రూ.21,000 నగదు సహాయంతో పాటు 6 పోషకాహార కిట్లు అందజేయడం.
2) రద్దీగా ఉండే నగర ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలలో గస్తీ నిర్వహించేందుకు మహిళా అధికారుల గస్తీ బృందాలతో కూడిన మహిళలకే ప్రత్యేకమైన దుర్గా సురోఖ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయడం.
3) రాష్ట్ర రిజర్వ్ పోలీస్ దళంలో మాతంగిని హజ్రా, రాణి శిరోమణి పేరిట రెండు మహిళా బెటాలియన్ల ఏర్పాటుకు హామీ.
4) పోలీసు బలగాలతో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం.
5) ప్రైవేట్ రంగ సంస్థలను ప్రోత్సహించడం ద్వారా మహిళా కార్మికులకు ప్రాధాన్యతనిచ్చే కొత్త పారిశ్రామిక విధానం.
6) ప్రభుత్వ బస్సులన్నింటిలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం (కర్ణాటక, తెలంగాణ, ఏపీ మోడల్).
7) మహిళా శ్రామిక శక్తికి మద్దతుగా ప్రతి జిల్లాలో ఉద్యోగం చేసే మహిళల కోసం ప్రత్యేకంగా హాస్టల్‌ను ఏర్పాటు చేయడం.
8) అంగన్‌వాడీ, ప్రాణీ మిత్ర, ఆశా కార్యకర్తలకు తగిన గౌరవప్రదమైన పరిహారం అందించేందుకు వారి నెలవారీ గౌరవ వేతనాన్ని పెంచడం.
9) బాల్య వివాహాలను నివారించడానికి, యువతుల భవిష్యత్తును పరిరక్షించడానికి బలంగా చర్యలను అమలు చేయడం.
10) ఉన్నత విద్యలో మహిళలకు మద్దతుగా, గ్రాడ్యుయేషన్ కోర్సులలో ప్రవేశం పొందే సమయంలో బాలికలకు రూ.50,000 అందజేయడం.
11) 40 ఏళ్ల లోపు బాలికలు, మహిళలందరికీ ఉచితంగా HPV టీకా అందించడం.
12) అట్టడుగు, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన 40 ఏళ్లు పైబడిన మహిళలకు ఉచిత రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ అందించడం, తద్వారా వ్యాధిని ముందుగానే గుర్తించి, సకాలంలో చికిత్స పొందే అవకాశాన్ని మెరుగుపరచడం.
13) గతంలో మహిళలపై జరిగిన అన్యాయం, అఘాయిత్యాల కేసులన్నింటినీ తిరిగి తెరవడం, అవసరమైన చోట తగిన తక్షణ పరిహారంతో పాటు న్యాయ సహాయం అందించడం.

Also Read: DA Hike 2026 Update: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్..డీఏ పెంపుపై క్యాబినెట్‌లో జరగని చర్చ..డీఏ పెంపు లేనట్టేనా?

Also Read: Akanksha Puri Bikini Saree: చీరపై బికినీ బ్లౌజ్‌లో తమిళ హీరోయిన్ రచ్చ..సోషల్ మీడియాలో బండ బూతులు తిడుతున్నారు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top