రంగారెడ్డి ఆలయంలో చోరీ, రూ.10వేలకు పైగా నగదు చోరీ
Hyderabad, Telangana:అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నంది ముసలాయి గూడ సాయిబాబా ఆలయంలో రాత్రి చోరీ జరిగింది. పోలీస్ స్టేషన్కు 200 మీటర్ల దూరంలో ఉన్న ఆలయంలో కిలోన్నర వెండి, రూ.10వేలకు పైగా నగదు, పలు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. గుడి తాళం పగులగొట్టిన దొంగ తలుపులు తెరిచి ఆలయంలోని హుండీని ధ్వంసం చేసి అందులో ఉంచిన సొమ్మును అపహరించాడు. ఈ ప్రమాదంపై ఆలయ నిర్వాహకులు అత్తాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వేలిముద్రల ఆధారాలు సేకరించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డైంది.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
రెడ్ హ్యాండెడ్గా ఏఈఈ అరెస్ట్.. రైతు పొలానికి మట్టి తోలుకునేందుకు రూ.2 లక్షల లంచం
Aswaraopeta, Telangana:ACB Operation With Farmer: వ్యవసాయం చేసుకునే రైతు తన పొలానికి చెరువు నుంచి మట్టి తోలుకునేందుకు సాగునీటి ఇంజనీర్ను సంప్రదించగా.. అతడు పెద్ద ఎత్తున లంచం ఆశించాడు. పొలం పనులు చేసుకునే రైతుకు భారీ స్థాయిలో లంచం ఇచ్చుకునే స్తోమత లేదు. దీంతో అతడు వెంటనే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారుల ఆదేశాలతో లంచంగా డబ్బులు ఇచ్చాడు. ఆ వెంటనే ఏసీబీ అధికారులు దాడులు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో జరిగింది. అయితే ఆ రైతు ఇప్పటికే ఒక అధికారిని ఏసీబీకి పట్టించగా.. తాజాగా రెండో అధికారిని కూడా ఏసీబీకి అప్పగించాడు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏసీబీ వరుస దాడులు కొనసాగుతున్నాయి. ఈ రోజు అశ్వారావుపేటలో ఇరిగేషన్ ఏఈఈ ఎల్. శ్రీనివాస్ రూ.రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అశ్వారావుపేట పట్టణంలోని దొంతికుంట చెరువు నుంచి ఓ రైతు తన పొలానికి మట్టి తోలుకునేందుకు అనుమతి కోరగా.. ఏఈఈ శ్రీనివాస్ రూ.రెండు లక్షలు డిమాండ్ చేశాడు. ఆ డబ్బులు ఇస్తూ రైతు ఏసీబీ అధికారులకు పట్టించాడు.
మట్టి తోలుకునేందుకు
అశ్వారావుపేటలోని ఏఈ తన కార్యాలయంలో రైతు నుంచి రూ.రెండు లక్షల నగదు స్వీకరిస్తుండగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ నేతృత్వంలోని బృందం దాడి చేసి ఏఈఈని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. '2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఇరిగేషన్ ఏఈని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. దొంతికుంట చెరువు నుంచి రైతు పొలానికి మట్టి తోలుకునేందుకు అనుమతి అడగ్గా ఏఈఈ రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేశారు' అని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ వివరించారు.
ఖమ్మం జిల్లాలో ఏసీబీ దాడులు
అవినీతి నిరోధక శాఖ ఖమ్మం జిల్లాలో వరుసగా దాడులు చేస్తుండడంతో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. ఏ కార్యాలయంలో ఎలాంటి రైడ్స్ అవుతాయా? తెలియక ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పనులు, ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు నిజాయతీగా అమలు చేయాల్సి ఉండగా.. కొందరు డబ్బులు ఆశిస్తూ లంచాలకు అలవాటు పడడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. దీంతో కార్యాలయాలపై ఏసీబీ పంజా విసురుతోంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఏసీబీ దాడులు జరుగుతున్నాయి.
శభాష్ రైతన్న
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల అవినీతిపై ఓ రైతు ఉద్యమం చేస్తున్నట్టు కనిపిస్తోంది. తనకు అడుగడుగునా ప్రభుత్వ ఉద్యోగులు లంచం ఆశిస్తుండడంతో వారికి బుద్ధి చెప్పేందుకు ఏసీబీతో కలిసి భారీ ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఆ రైతు ఇద్దరు అధికారులను ఏసీబీకి పట్టించారు. గతంలో విద్యుత్ శాఖ అధికారిని, నేడు ఇరిగేషన్ శాఖ అధికారిని రైతు పట్టించడం విశేషం. మరి ఖమ్మం జిల్లాలో ఏసీబీ దాడులు జరుగుతుండడంతో ఆ జిల్లా అధికార యంత్రాంగం ఎలాంటి అవినీతి లేకుండా పనులు చేసేందుకు సిద్ధమైంది.
విశాఖపట్టణంలో ప్రతిష్టాత్మక సదస్సు.. నవంబర్ 12, 13 తేదీల్లో సీఐఐ కార్యక్రమం
Visakhapatnam, Andhra Pradesh:31st Edition CII Summit: ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖపట్టణం మరో ప్రతిష్టాత్మక సదస్సుకు వేదిక కానుంది. సీఐఐ భాగస్వామ్య సదస్సు నవంబర్లో నిర్వహించనున్నారు. విశాఖపట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విశాఖ సదస్సు కంటే ముందుగా 5 చోట్ల ప్రాంతీయ భాగస్వామ్య సదస్సులు నిర్వహించాలని తెలిపారు. కొత్త ఆలోచనలకు.. అవకాశాలకు సీఐఐ సదస్సు వేదిక కావాలని సూచించారు. ఎంఓయూలు, పెట్టుబడులతో పాటు నాలెడ్జ్ షేరింగ్ మీద ఎక్కువ దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026పై సోమవారం అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. విశాఖ భాగస్వామ్య సదస్సు గతానికి భిన్నంగా నిర్వహించాలని ఆదేశించారు. నవంబర్ 12, 13వ తేదీల్లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముందే ఈసారి ప్రాంతీయ స్థాయిలో కూడా సదస్సులు నిర్వహించాలని సూచించారు. Navigating Change: Leadership, Technology, Trust and Trade in a Transforming World థీమ్తో 31వ పార్టనర్షిప్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు సీఎం వెల్లడించారు.
సీఐఐ సదస్సులో భాగంగా ఎంఓయూలు కుదుర్చుకోవడం, మినిస్టీరియల్ సెషన్స్, ప్లీనరీ, కంట్రీ సెషన్స్, బీ2బీ, బీ2జీ సమావేశాలతో రెండు రోజుల భాగస్వామ్య సదస్సు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. విశాఖ భాగస్వామ్య సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, వివిధ దేశాలకు చెందిన డెలిగేట్స్ను ఆహ్వానించాలని చెప్పారు. భాగస్వామ్య సదస్సు నిర్వహణకు సంబంధించి వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు లేఖలు రాయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.
'విశాఖపట్టణంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు సంబంధించి దేశ విదేశాల్లో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలి. జూలై నుంచి సెప్టెంబర్ వరకు దేశవిదేశాల్లో రోడ్ షోలు చేపట్టాలి. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, కోయంబత్తూర్, అహ్మదాబాద్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో సీఐఐ భాగస్వామ్య సదస్సులకు సంబంధించి రోడ్ షోలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలి' అని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రధాన భాగస్వామ్య సదస్సుకంటే ముందుగానే విశాఖ, రాజమండ్రి లేదా కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతి నగరాల్లో ప్రాంతీయ భాగస్వామ్య సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ సదస్సుల్లో ఎంఓయూలు కుదర్చుకునే అంశంపై అధికారులు ఎలాంటి ప్రణాళికలు చేపట్టారని సీఎం ప్రశ్నించగా.. ఏయే ప్రాంతాల్లో ఏయే రంగాలకు చెందిన పరిశ్రమలు స్థాపించేందుకు అవకాశం ఉంటుందో బేరీజు వేసుకుని.. ఆ మేరకు ఆయా ప్రాంతీయ సదస్సుల్లో ఎంఓయూలు కుదుర్చుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వివరణ ఇచ్చారు.
సదస్సుపై సమీక్ష చేసిన అనంతరం సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 'భాగస్వామ్య సదస్సులు అంటే కేవలం పెట్టుబడులు రాబట్టడం, ఎంఓయూలు కుదుర్చుకోవడం అనే భావన పోవాలి. భాగస్వామ్య సదస్సుల్లో వివిధ కీలక అంశాలపై చర్చ జరగాలి. ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయి? ఎన్ని ఎంఓయూలు కుదుర్చుకున్నామనే దానికంటే నాలెడ్జ్ షేరింగ్ ఎంత వరకు చేసుకోగలుగుతున్నామనేది ముఖ్యం' అని తెలిపారు.
'విశాఖలో జరగబోయే 31వ భాగస్వామ్య సదస్సులో జరిగే కార్యక్రమాలపై ప్రజలు చర్చించుకోవాలి. వినూత్నంగా ఆయా రంగాలను ఏ విధంగా అభివృద్ధి సాధించాలనే ఆలోచనలు రేకేత్తించాలి. టెక్నాలజీ సహా వివిధ అంశాల గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఆయా రంగాల్లో ఛాంపియన్ గా నిలిచిన వాళ్లే గ్లోబల్ లీడర్లుగా ఎదుగుతున్నారు. ఫ్యూచరిస్టిక్ రంగాలపై ఎక్కువ దృష్టి సారించాలి' అని అధికార యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రముఖ యూనివర్శిటీలకు చెందిన నిపుణులు భాగస్వామ్య సదస్సుకు వచ్చేలా చూడాలని.. సీఐఐ గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్ను అమరావతిలో ఏర్పాటు చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్
సీఐఐ భాగస్వామ్య సదస్సును వినూత్నంగా నిర్వహించాలని.. ప్రాంతీయ స్థాయిలో భాగస్వామ్య సదస్సులు నిర్వహిస్తే ప్రజలు, యువత, విద్యార్థుల భాగస్వామ్యం మరింతగా పెరుగుతుంది. కొత్త ఆలోచనలను ప్రజలకు చేరవేయడం.. యువతలోని ఇన్నోవేషన్లను ఆయా రంగాల పారిశ్రామిక పెద్దల దృష్టికి వెళ్లడం అనేది సాధ్యమవుతుంది' అని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రాంతాల వారీగా నిర్వహించే సదస్సుల్లో స్టార్టప్ కంపెనీలకు, ఇన్నోవేషన్లకు అగ్రభాగం ఉండాలి. ప్రాంతీయ సదస్సుల్లోనూ ఎంఓయూలు కుదుర్చుకునే అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలాంటి కార్యక్రమాలు ఏదో ఒక్క చోట కాకుండా వివిధ ప్రాంతాల్లో జరిగితే... ప్రభుత్వం చేస్తున్న కృషి.. పడుతున్న కష్టం ప్రజలకు అర్థమవుతుంది' అని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.
రేపు సత్యవేడులో ప్రముఖ కంపెనీ ప్రారంభం.. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే!
Satyavedu, Andhra Pradesh:Chandrababu Tour: ఆంధ్రప్రదేశ్లో వేగంగా పారిశ్రామికీకరణ జరుగుతోంది. ఏపీలో మరో కీలక కంపెనీ ప్రారంభానికి సిద్ధం కానుంది. సత్యవేడులో రేపు హీరో కంపెనీ తన జీపీస కేంద్రానికి శంకుస్థాపన చేసుకోనుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్తోంది. అంతేకాకుండా రేపు లబ్ధిదారులందరికీ కూడా పింఛన్ పంపిణీ చేయనున్నారు. సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొనేందుకు రేపు తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లాల పర్యటన ఖరారైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మదనపాలెంలో హీరో మోటార్ కార్ప్స్
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్-జీపీసీకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు శంకుస్థాపన చేయనున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని మదనపాలెంలో హీరో మోటార్ కార్ప్స్ నూతనంగా ఏర్పాటు చేయనున్న జీపీసీకు భూమిపూజ జరగనుంది. హీరో మోటార్స్కు చెందిన వివిధ తయారీ కేంద్రాలు, డీలర్లకు ద్విచక్ర వాహనాల విడి భాగాలను తయారు చేసి సరఫరా చేసేలా ఆ సంస్థ ఈ సెంటర్ను ఏర్పాటు చేయనుంది.
4 వేల మందికి ఉద్యోగ, ఉపాధి
రూ.750 కోట్ల పెట్టుబడితో హీరో మోటార్ కార్పోరేషన్ ఈ జీపీసీ 2.0ను సత్యవేడులో నిర్మించనుంది. దీనిద్వారా స్థానికంగా 4 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనుండడంతో ఇక్కడి ప్రజల ఆర్థిక స్థితిగతులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే శ్రీసిటీ సమీపంలో హీరో మోటార్స్ సంస్థ ఏర్పాటుచేసిన అధునాతన ద్విచక్ర వాహనాల తయారీ ప్లాంట్లో ఏడాదికి 1.5 మిలియన్ల వాహనాలను ఉత్పత్తి జరుగుతున్న విషయం తెలిసిందే.
స్కాలర్ షిప్
దేశ, విదేశాల్లో ఉన్న మోటార్ సైకిళ్లు, స్కూటెక్లు, ఈవీలకు విడి భాగాలను తయారుచేసేందుకు ఈ జీపీసీను హీరో మోటార్స్ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే పీ4 కార్యక్రమంలో మార్గదర్శిగా ఉన్న హీరో మోటార్స్ సంస్థ పలువురికి స్కాలర్ షిప్లను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్వర్ణాంధ్ర ఫౌండేషన్ ద్వారా హీరో మోటార్స్ అందించనున్న బ్రిజ్ మోహన్ లాల్ ముంజల్ పేరుతో హీరోస్ ఆఫ్ టుమారో పేరిట స్కాలర్షిప్లను రేపు సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. ఇక ఈ కంపెనీకి చెందిన వాహనాలను ఏపీ పోలీస్ శాఖకు కూడా కేటాయించాలని నిర్ణయించారు. ఏపీ పోలీసులు వినియోగించుకునేలా హీరో మోటార్స్ సంస్థ ప్రత్యేకంగా తయారుచేసిన ఎలక్ట్రిక్ మొబిలిటీ వాహనాలను కూడా సీఎం చంద్రబాబు అందించనున్నారు.
పింఛన్ల పంపిణీ
ఎన్టీఆర్ భరోసా ఫించన్లు జూలై 2026కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం పున్నపువారిపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. పేదల సేవా కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. వృద్ధాప్య, వితంతు సహా వేర్వేరు కేటగిరీలకు చెందిన 62 లక్షల మంది లబ్దిదారులకు రూ.2,750 కోట్ల మేర ఏపీ ప్రభుత్వం పింఛన్ అందిస్తున్న విషయం తెలిసిందే. పున్నపువారిపాలెం గ్రామంలో ఓ లబ్దిదారు ఇంటికి వెళ్లి సీఎం చంద్రాబు స్వయంగా పింఛన్ను పంపిణీ చేయనున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు పాల్గొని కీలక ప్రసంగం చేయనున్నారు. రాత్రికి శ్రీసిటీలో ఉన్న అతిథి గృహంలో ముఖ్యమంత్రి బస చేయనున్నారు.
అభిమానుల్లో తీవ్ర ఆందోళన.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అత్యవసర ఆపరేషన్
Mumbai, Maharashtra:Pawan Kalyan Health Update: భుజం కండరాల్లో తీవ్రమైన గాయంతో బాధపడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. కావాల్సిన వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని గుర్తించారు. అయితే శస్త్రచికిత్స ఇప్పుడు వద్దని పవన్ కల్యాణ్ ససేమిరా అన్నారు.
ఉప ముఖ్యమంత్రి, సినీనటుడు పవన్ కల్యాణ్కి ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో సోమవారం వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. రెండు భుజాలను నిశితంగా పరీక్షించిన వైద్యులు రొటేటర్ కఫ్తో పాటు భుజానికి సంబంధించిన రెండు కండరాల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు తమ పరీక్షల్లో నిర్ధారణ చేశారు. ఈ నొప్పిని తట్టుకోవడానికి తక్షణం శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. ఇప్పటికిప్పుడు సర్జరీ చేసుకోవడానికి తాను సిద్ధంగా లేనని పవన్ కల్యాణ్ వైద్యులకు స్పష్టం చేశారు.
తర్వాత శస్త్ర చికిత్స
ముందుగా నిర్ణయించిన పాలనాపరమైన.. అధికారిక కార్యక్రమాలు పూర్తి చేయాలని, ఆ తర్వాతే శస్త్ర చికిత్స చేయించుకోవాలని పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పవన్ కల్యాణ్ కొంతకాలంగా భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ గాయం, రెండు భుజాలకి చెందిన కండరాలు పూర్తిగా చిట్లడంతో ఇబ్బందిపడుతున్నాడు. అంతకుముందు సైనస్తో బాధపడుతున్న పవన్ కల్యాణ్ గతంలో సర్జరీ చేసుకున్న విషయం తెలిసిందే. మరోసారి సర్జరీ చేసుకోవాల్సి ఉండడంతో ఆయన అభిమానులు, జనసేన పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.
రీ-అపాయింట్మెంట్
పదవీ విరమణ పొందుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓఎస్డీ కె. వెంకట కృష్ణకు ప్రభుత్వం మళ్లీ నియమించుకుంది. మూడేళ్ల రీ-అపాయింట్మెంట్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్న కె. వెంకట కృష్ణకు జూలై 1 నుంచి నియామకం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఓఎస్డీగా ఆయన కొనసాగనున్నారు. మూడేళ్లు లేదా డిప్యూటీ సీఎం పదవీకాలం ముగిసే వరకు ఆయన బాధ్యతల్లో ఉండనున్నారు. చివరి జీతం నుంచి పెన్షన్ మినహాయించి వేతనం చెల్లింపు ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. పదోన్నతులపై ఎలాంటి ప్రభావం ఉండదని జీవో విడుదల చేసింది.
తిరుమలలో వైభవంగా ఏరువాక పౌర్ణమి 'గరుడ సేవ'
Dharmavaram, Andhra Pradesh:Garuda Vehicle Seva Done In Tirumala For Eruvaka Pournami Watch Videoమార్మోగిన గోవింద నామస్మరణ.. తిరుమలలో వైభవంగా ఏరువాక పౌర్ణమి 'గరుడ సేవ'
Tirupati Urban, Andhra Pradesh:Eruvaka Pournami: ప్రతి పౌర్ణమి సందర్భంగా తిరుమల ఆలయంలో నిర్వహించే గరుడ సేవ ఈసారి ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని అత్యంత వైభవంగా జరిగింది. తిరుమల శ్రీవారి సన్నిధిలో పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా.. భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరగ్గా.. పెద్ద ఎత్తున భక్తులు హాజరై తరించారు. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు తన దేవేరులతో కలిసి గరుడవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగి వేలాదిమంది భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు.
గరుడ వాహన సేవ సందర్భంగా వేద పండితుల వేదఘోషలు, మంగళవాయిద్యాలు 'గోవింద... గోవింద..' నామస్మరణలు మార్మోగాయి. గరుడసేవ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉట్టిపడేలా చేసింది. స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గరుడవాహనంపై ఉన్న మలయప్పస్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని.. సర్వదోషాలు తొలగి శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం.
ప్రతి నెల పౌర్ణమి గరుడసేవకు విశేష ప్రాధాన్యం ఉంది. ఈ క్రమంలో జూలైలో వచ్చిన ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని గరుడ సేవకు టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రత, తాగునీరు, వైద్యసేవలు, క్యూలైన్ల నిర్వహణ వంటి ఏర్పాట్లను సమర్థవంతంగా చేపట్టారు. ఉత్సవంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా టీటీడీ అధికారులు, వేలాదిమంది భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తులతో కిక్కిరిసిన తిరుమాడ వీధులు, విద్యుత్ దీపాలంకరణలు, భక్తి గీతాలు, గోవింద నామస్మరణలతో తిరుమల క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ వైభవమైన పౌర్ణమి గరుడసేవ మరోసారి భక్తులను ఆధ్యాత్మిక అనుభూతిలో ముంచెత్తింది.
భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి శిలాతోరణం వరకు లైన్లో భక్తులు వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 18-24 గంటల సమయం పడుతుంది. రూ.300 శీఘ్రదర్శనానికి 4-5 గంటల సమయం పడుతుండగా.. సర్వ దర్శనం టోకెన్ పొందిన భక్తులకు 5 నుంచి 7 గంటల సమయం పట్టింది. నిన్న స్వామివారిని 91,793 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,221 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా.. హుండీ ఆదాయం రూ.0 కోట్లు వచ్చింది.మొత్తం విక్రయించిన లడ్డూల సంఖ్య రూ.8 లక్షలు, అన్నప్రసాదాలు 3.13 లక్షల మంది భక్తులు స్వీకరించారు.
On the auspicious Pournami, Sri Malayappa Swamy, accompanied by Sridevi and Bhudevi, blessed devotees on the sacred Garuda Vahanam during Pournami Garuda Seva at Tirumala. Thousands witnessed the divine procession with devotion.#ttd #tirumala #garudaseva #malayappaswamy pic.twitter.com/h00l4hhGn8
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) June 29, 2026
దేశం గర్వించేలా అమరావతిని వేగంగా చేస్తాం: సీఎం చంద్రబాబు
Amaravathi, Andhra Pradesh:AP CM Chandrababu Review On Capital Amaravati And Key Orders To Officialsఉద్యోగుల ఫ్రెండ్లీగా ఏపీ ప్రభుత్వం.. సీఎం చంద్రబాబుతో ఉద్యోగ సంఘాలు భేటీ
Amaravathi, Andhra Pradesh:AP Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఇటీవల ఏపీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్ల వరకు పెంచడంతోపాటు కొన్ని శాఖల ఉద్యోగులకు సీపీఎస్ స్థానంలో పాత పింఛన్ విధానం అమలు తదితర నిర్ణయాలు తీసుకోవడంతో పలు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసి ధన్యవాదాలు చెప్పారు. కొద్దిసేపు సీఎం చంద్రబాబుతో చర్చించారు.
ఉద్యోగులకు మేలు చేసేలా ఇటీవల ఏపీ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. 2004 సెప్టెంబర్ ముందు వివిధ నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన ఉద్యోగులకు పాత పింఛన్ విధానం (ఓల్డ్ పెన్షన్ స్కీం) వర్తింపచేయడం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కార్పొరేషన్లకు చెందిన సంస్థలు, గురుకులాలకు చెందిన ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచడం వంటి నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.
గత మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నప్పటి నుంచి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలుస్తూనే ఉన్నారు. తాజాగా సోమవారం రాష్ట్ర సచివాలయంలో వివిధ ఉద్యోగ సంఘాలకు చెందిన ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ నేతృత్వంలో ఉద్యోగ సంఘాల నాయకులు సీఎం చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం చేసిన మేలును మరువలేమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు.
కూటమి ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటోందని.. తాము ఉద్యోగులకు సహకరించినట్టే... ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఏపీఆర్ఈఐ సొసైటీతోపాటు వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సంస్థల సొసైటీలు, డీఎస్సీ 2003 టీచర్ల ఫోరమ్కు చెందిన ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో గురుకులాల జేఏసీ నాయకులు దామచర్ల మధుసూదన రావు, ప్రభాకర్, రామ్మోహన్ రావు, రమేష్, డీఎస్సీ 2003 ఫోరం ప్రతినిధులు మోపిదేవి శివ శంకర్రావు, గురు బ్రహ్మం, రాజేష్ ఉన్నారు.
రేపే తెలంగాణ రైతు భరోసా.. రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ కానున్న డబ్బులు
Hyderabad, Telangana:Rythu Bharosa Amount: తెలంగాణ రైతులకు భారీ శుభవార్త. పంట పెట్టుబడి సహాయంగా అందించే రూ.6 వేలు రేపు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం రేపు రైతులకు డబ్బులు వేయనుంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతు ఆశీర్వాద సభ వేదిక మార్చివేసి హైదరాబాద్కు మార్చారు. రైతు భరోసా నిధుల విడుదల యథావిధిగా కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించారు. హైదరాబాద్లోని శిల్పాకళావేదిక నుంచి రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం జరగనుంది. మొదటి విడతలో రెండు ఎకరాల వరకు భూమి కలిగిన 41.37 లక్షల మంది రైతులకు రూ.2,482.02 కోట్లు జమ చేయనుంది.
మెగా రైతు మేళా రద్దు
రైతు భరోసా నిధుల విడుదలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభ వేదికను మార్చినట్లు తెలిపారు. రైతుల భద్రత, ప్రజాప్రతినిధుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని.. మధిరలో రైతుల కోసం భారీ ఎత్తున ఏర్పాటుచేయాలనుకున్న 'మెగా రైతు మేళా'ను కూడా నిర్వహించడం సాధ్యం కాలేదని మంత్రి వివరించారు.
రైతుల ఖాతాల్లో జమ
వర్షాలు విస్తరిస్తుండటంతో రైతులు విత్తనాలు వేసే అత్యంత కీలక సమయంలోనే రైతు భరోసా పెట్టుబడి సహాయం రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలంగాణ మంత్రి తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేకుండా రైతు భరోసా నిధులను రేపు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని శిల్పకళావేదికలో రైతు ఆశీర్వాద సభ నిర్వహించనున్నట్లు.. అక్కడ రైతు భరోసా నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుందని మంత్రి వెల్లడించారు.
రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు
'రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు అందాల్సిన పెట్టుబడి సహాయాన్ని అందించాలనే దృఢసంకల్పంతో రైతు భరోసా నిర్వహిస్తాం. రైతులు విత్తనాలు వేసే సమయంలోనే ఆర్థిక భరోసా అందించడం ద్వారా సాగు వ్యయభారాన్ని తగ్గించడంతో పాటు వ్యవసాయ కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది' అని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 73.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు దశలవారీగా జమ చేయనున్నారు. తొలి విడతలో రెండు ఎకరాల వరకు భూమి కలిగిన 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది.
కొత్తగా పాస్ పుస్తకాలు
తొలి విడతలో ఒక ఎకరం, మరో విడతగా రెండు ఎకరాలు కలిగిన రైతులకు డబ్బులు జమ చేయనుండగా.. తర్వాత మిగిలిన రైతులకు దశలవారీగా రైతు భరోసా నిధులు జమ చేయనున్నారు. కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు జూలై 5వ తేదీలోపు సమీప వ్యవసాయ విస్తరణాధికారిని కలిసి బ్యాంకు అకౌంట్ వివరాలు సమర్పిస్తే రైతు భరోసా పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
రైతు భరోసా వివరాలు
తొలి విడతలో ఒక ఎకరం వరకు భూమి కలిగిన 14.65 లక్షల మంది రైతుల కోసం రూ.878.94 కోట్లు
రెండు ఎకరాల వరకు భూమి కలిగిన 26.72 లక్షల మంది రైతుల కోసం రూ.1,603.08 కోట్లు
హైదరాబాద్ ప్లస్గా అమరావతి నిర్మాణం.. దేశం గర్వించేలా నిర్మిస్తాం: సీఎం చంద్రబాబు
Amaravathi, Andhra Pradesh:Capital Amaravati: దేశం గర్వించే రాజధాని నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని.. అమరావతి అంటే ఏపీతోపాటు దేశానికి గౌరవం సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాద్ ప్లస్గా అమరావతి నిర్మాణం జరగాలని.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి నగర నిర్మాణంలో కాంట్రాక్టు సంస్థలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అమరావతి నిర్మాణంలో పని చేశామన్న బ్రాండ్ను కాంట్రాక్టర్లు సంపాదించేలా పనులు చేపట్టాలని సూచించారు. రాజధాని నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
కాంట్రాక్టు సంస్థలతో సమీక్ష
అమరావతిలో నిర్మాణ పనుల పురోగతిపై సచివాలయంలో సోమవారం సీఎం చంద్రబాబు కాంట్రాక్టు సంస్థలతో సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత గడువు కంటే ముందే నిర్మాణ పనులు పూర్తి చేయాలని చెప్పారు. ప్రస్తుతం రూ.50,999 కోట్ల విలువైన పనులు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించామని.. హౌసింగ్, ట్రంక్ ఇన్ ఫ్రా, ఎల్పీఎస్ ఇన్ ఫ్రా, సహా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్ల లాంటి ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రాజెక్టులు వేగంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. పనులు వేగంగా చేసేందుకు అవసరమైన మానవ వనరులు, యంత్రాలు ఇతర సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించారు.
పనులు ఇలా
అమరావతి నిర్మాణ పనులపై మున్సిపల్, పట్టణ శాఖ మంత్రి నారాయణ స్పందిస్తూ సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చారు.ప్రస్తుతం 26,924 మంది కార్మికులు, 5,140కి పైగా భారీ యంత్రాలు అమరావతి నిర్మాణ పనుల్లో నిమగ్నమైనట్టు వివరించారు. నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహాలు సజావుగా సాగేందుకు వీలుగా వాటిని వెడల్పు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ ప్రాంతం పునీతం..
భవిష్యత్ నగరంగా నిర్మిస్తున్న అమరావతి నిర్మాణంలో పని చేశామన్న బ్రాండ్ను కాంట్రాక్టర్లు సంపాదించేలా పనులు చేపట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. కొందరు వ్యక్తులు కావాలని లిటిగెంట్లుగా మారి రాజధాని పనుల్ని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని .. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్లాలని చెప్పారు. కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల నివాసాలు, రహదారులు, మౌలిక సదుపాయాలతో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్ల నిర్మాణాలపై ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. దేశవ్యాప్తంగా వివిధ పుణ్య క్షేత్రాలు, నదుల నుంచి పవిత్రమైన మట్టి, నీళ్లు తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశామని.. గత పాలకులు ఐదేళ్ల పాటు రాజధాని నిర్మాణాన్ని ఆపేశారని సీఎం చెప్పారు.
మళ్లీ గాడిలో..
గడిచిన రెండేళ్లుగా అమరావతి నిర్మాణాన్ని మళ్లీ గాడిలో పెట్టామని.. అత్యుత్తమ నివాసయోగ్య నగరంగా నిర్మాణం చేస్తున్న అమరావతిలో భాగస్వాములం అయ్యామన్న ఆలోచనతో కాంట్రాక్టు సంస్థలు పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. పనులు పూర్తి అయ్యాక రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తామని సీఎం తెలిపారు. నిర్మాణ పనుల వేగంతో పాటు నాణ్యత పై కూడా ఎక్కడా రాజీ లేకుండా చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
అమరావతికి పేరు తెచ్చేలా..
అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ భవనాలు ఐకానిక్ నిర్మాణాలుగా ఉండాలని.. అమరావతికి పేరు తెచ్చేలా ఈ భవనాలను నిర్మించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అమరావతి రాజధాని నిర్మాణంలో చిన్న ఇబ్బందులు కూడా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ప్రతీ రెండు నెలలకు ఒకసారి నిర్మాణాల పురోగతిపై సమీక్షిస్తానని తెలిపారు. ఎల్ అండ్ టీ, షాపూర్ జీ పల్లోంజి, మెగా ఇంజినీరింగ్, ఎన్సీసీ, బీఎస్ఆర్, కేఎంవీ సహా వేర్వేరు కాంట్రాక్టు సంస్థలు చేపట్టిన పనులకు సంబంధించిన అంశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా సంస్థల ప్రతినిధులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. రూ.30 వేల కోట్ల కోసం ఏపీ ప్రభుత్వానికి ఆల్టిమేటం
Nuzendla, Andhra Pradesh:Govt Employees Big Decision: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోకపోవడంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా రూ.30 వేల కోట్ల మేర పేరుకుపోయిన పెండింగ్ బిల్లులపై ఉద్యోగులు పోరాటానికి సిద్ధమయ్యారు. చెల్లించాల్సిన బకాయిల పై ఉద్యమానికి సన్నద్ధం అవుతున్నట్లు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఏదైనా జరిగితే తాము బాధ్యులం కాదని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు.
కలెక్టర్కు వినతి
తమ పెండింగ్ బిల్లుల విడుదల కోసం ఉద్యోగ సంఘాలు రాష్ట్రవ్యాప్త కార్యాచరణ ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా సోమవారం రాజమండ్రి కలెక్టరేట్లో రెవెన్యూ ఉద్యోగులతో కలిసి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. జూలై 12వ తేదీన మొట్టమొదటి ఉద్యమ సన్నద్ధ సభను శ్రీకాకుళంలో నిర్వహిస్తామని ప్రకటించారు.
ఎంతో ఆశ పడ్డాం
'వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సుమారుగా రూ.30 వేల కోట్ల పైచిలుకు బకాయిలు ఉన్నాయి. ఎన్నికల్లో కూటమి నాయకులు తాము అధికారంలోకి వచ్చాక బకాయిలు చెల్లిస్తామని మాట ఇచ్చారు. ఎప్పటికప్పుడు డీఏలు చెల్లిస్తాం.. మంచి పీఆర్సీ ఇస్తాం.. పీఆర్సీ ఆలస్యమైతే ఈలోపు ఐఆర్ చెల్లిస్తాం, సరెండర్ లీవ్స్, ఎర్న్ లీవ్స్, జీతభత్యాలు ఆలస్యం లేకుండా ఉంటాయని చెప్పారు. దీంతో ఎంతో ఆశ పడ్డాం' అని రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వివరించారు.
ఉద్యమానికి సిద్ధం
'గత ప్రభుత్వ హయాంలో ఇవ్వాల్సిన రూ.30 వేల కోట్ల బకాయిలు ఎవరికి ఎంతెంత రావాలో కనీసం లెక్కలు కూడా కూడా వేయలేదు. ఆర్థికంగా ఉద్యోగులు చితికిపోతా ఉంటే కూటమి ప్రభుత్వం కనీసం చర్చించలేదు. మేము ఉద్యమ కార్యాచరణ ప్రకటించినా ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాలు, శాఖాపరమైన సంఘాలందరం కూడా ఉమ్మడిగా నిర్ణయం తీసుకొని ఇప్పటికే ఉద్యమానికి సిద్ధమవుతున్నాం' అని బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు.
సన్నద్ధ సభలు
'ఉద్యమ కార్యాచరణలో భాగంగా జూలై 12వ తేదీన తొలి సన్నద్ధ సభను శ్రీకాకుళంలో నిర్వహించబోతున్నాం. 21వ తేదీన అనంతపురంలో మరో సభ నిర్వహించనున్నాం. అనంతరం ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా సన్నద్ధ సభలు నిర్వహిస్తాం' అని బొప్పరాజు వెంకటేశ్వర్లు కార్యాచరణ ప్రకటించారు. 'పెండింగ్ బిల్లుల కోసం ఉద్యోగులు ఆలోచించే సమయం దాటిపోయింది. తీవ్రమైన పని ఒత్తిడిలో నెట్టివేశారు. ఇది చాలా బాధాకరమైన విషయం' అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఐక్య ఉద్యమాలు
'ఉద్యోగులు అందరికీ అవగాహన కల్పించి ఉద్యమం చేసేందుకు ఏపీ జేఏసీ అమరావతి సిద్ధమవుతుంది. కలిసి వచ్చే సంఘాలన్నీ జేఏసీలో కలుపుకొని ముందుకువెళ్తాం. ఐక్య ఉద్యమాలకు కూడా ఏపీ జేఏసీ అమరావతి పక్షాన సిద్ధంగా ఉంటాం' అని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఉద్యోగులకు రావాల్సిన ఆర్థికపరమైన అంశాల్లో చంద్రబాబు ప్రభుత్వం స్పందించాలని కోరారు. తాము చేపట్టే ఉద్యమంతో ప్రజలకు ఏదైనా అసౌకర్యం కలిగినా.. ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు.
HYDRAA: కబ్జా చెర నుంచి ప్రభుత్వ భూమికి విముక్తి.. రూ.750 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా..
Secunderabad, Telangana:HYDRAA Operation: జలాశయాల పరిరక్షణ, ప్రభుత్వ భూములను కాపాడడం ప్రాధాన్యంగా తీసుకున్న హైడ్రా మరోసారి అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది. కబ్జా కోరల్లో చిక్కుకున్న ప్రభుత్వ భూమిని పరిరక్షించి ప్రజాధనాన్ని హైడ్రా కాపాడింది. అయితే పేదల ఇళ్లను కూల్చారని.. పేదలను నిరాశ్రయులను చేశారని కొందరు చేస్తున్న ప్రకటనలను హైడ్రా ఖండించింది. హైదరాబాద్లోని హస్మత్పేటలో కబ్జాకు గురయిన భూమిని కాపాడినట్లు హైడ్రా ప్రకటించింది.
వాస్తవం ఇదే
హస్మత్పేటలో పేదల ఇళ్లను కూల్చేసిందంటూ కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం, రాజకీయ ప్రేరేపితం అని హైడ్రా ప్రకటన చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించి.. భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం తప్ప దీనిలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టతనిచ్చింది. విమర్శలు చేసే ముందు అసలు అక్కడ ఏం జరిగిందో.. వాస్తవాలు ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని హైడ్రా గుర్తుచేసింది. ఈ సందర్భంగా పూర్తి వివరాలను హైడ్రా వెల్లడించింది.
అసలు ఏం జరిగిందంటే?
హస్మత్పేట సర్వే నంబర్-1లో మొత్తం 108 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి దశాబ్దాలుగా కబ్జాకోరల్లో చిక్కుకుపోయింద. ఆక్రమణల కారణంగా ఇప్పటికే ఆ భూమిలో 98 ఎకరాలు కబ్జాకోరుల పాలైంది. కబ్జాకు గురయిన భూమి కాకుండా ప్రభుత్వానికి 10 ఎకరాలు మాత్రమే మిగిలింది. ఈ పది ఎకరాలను కాపాడి.. భవిష్యత్ తరాల ప్రజా అవసరాలకు ఉపయోగించాలనే ఉద్దేశంతోనే హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది.
రెవెన్యూ శాఖ లేఖ ఆధారంగా
ఆ భూమి పరిరక్షణ కోసం హైడ్రా ఇప్పటికే ప్రజలు నివసిస్తున్న ఏ ఒక్క శాశ్వత ఇంటి జోలికి కూడా వెళ్లలేదు. జీవో నెం.58, 59 కింద క్రమబద్ధీకరణ (రెగ్యులరైజ్) అయిన ఇళ్లను కూల్చేశారని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. రెవెన్యూ శాఖ అధికారుల లేఖ ఆధారంగా.. వారి సమక్షంలోనే భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆపరేషన్ నిర్వహించి ప్రభుత్వ భూమిని పరిరక్షించినట్లు హైడ్రా వెల్లడించింది. ప్రభుత్వ భూమిపై కొత్తగా వేసిన ప్రీకాస్ట్ గోడలు, తాత్కాలిక షెడ్లు, అక్రమ కంచెలు, ప్లాట్లుగా విభజించేందుకు చేసిన ఏర్పాట్లను మాత్రమే తొలగించినట్లు హైడ్రా వివరించింది.
ఎలాంటి రాజకీయ కోణం లేదు
ఈ ఆపరేషన్ హైడ్రా స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయం కాదని.. రెవెన్యూ శాఖ అధికారుల లిఖితపూర్వక విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న భూమిని రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్ అని హైడ్రా తెలిపింది. తాము చేసిన ఆపరేషన్ చట్టబద్ధమైన పరిపాలనా చర్య మాత్రమేనని.. దీనిలో ఎలాంటి రాజకీయ కోణం లేదని హైడ్రా స్పష్టం చేసింది. కబ్జా చెర నుంచి విడిపించిన పదెకరాల ప్రభుత్వ భూమి విలువ బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ.750 కోట్లు ఉంటుందని హైడ్రా తెలిపింది.
స్వార్థ రాజకీయ ప్రచారాలు
ఇంత విలువైన ప్రభుత్వ ఆస్తి కూడా కబ్జాకు గురైతే.. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, పార్కులు, రోడ్ల వంటి ప్రజా అవసరాల కోసం భూమి ఎక్కడి నుంచి వస్తాయని హైడ్రా ప్రశ్నిస్తోంది. ప్రజల ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని హైడ్రా వివరణ ఇచ్చింది. ఆ బాధ్యతను నిర్వర్తిస్తే దానిని రాజకీయ కోణంలో చూడటం ఎంతవరకు సమంజసం? అని తప్పుడు ప్రచారం చేస్తున్న వారి తీరును ఖండించింది. ప్రభుత్వ భూములు అంటే అవి ప్రతి పౌరుడి ఆస్తి అని గుర్తుచేసింది. హస్మత్పేటలో జరిగింది పేదల ఇళ్ల కూల్చివేత కాదు.. దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ కబ్జాలకు చెక్ పెడుతూ రూ.750 కోట్ల విలువైన ప్రజా ఆస్తిని రక్షించిన సాహసోపేతమైన చర్య అని హైడ్రా వెల్లడించింది. దీనిపై కొందరి స్వార్థ రాజకీయ ప్రచారాలు ప్రజలెవరూ కూడా నమ్మకుండా, వాస్తవాలను గ్రహించాలని హైడ్రా సూచించింది.
Hyderabad Twin Reservoirs: భారీ వర్షాల నడుమ నిండు కుండలా మారిన హైదరాబాద్ జంట రిజర్వాయర్లు..
Hyderabad, Telangana:Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..పెట్టుబడికి ఇదే సరైన సమయం?!
Hyderabad, Telangana:Gold Price Today News: గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్లతో నేడు మరోసారి పతనమయ్యాయి. గడిచిన ఏడు నెలల కాలంలోనే అత్యల్ప స్థాయికి ఇరు లోహాల ధరలు పడిపోవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. అయితే నేడు అనగా జూన్ 29న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.Mumbai Hotel Raid: ముగ్గురు హీరోయిన్లతో హైటెక్ లెవల్ వ్యభిచారం..ముంబైలో చీకటి దందా బట్టబయలు
Mumbai, Maharashtra:Mumbai Hotel Raid Actress Rescued: ముంబైలోని గిర్గావ్ ప్రాంతంలో నడుస్తున్న ఒక హై-ప్రొఫైల్ వ్యభిచార ముఠాను ముంబై పోలీసులు ఛేదించారు. ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్న హోటల్పై పోలీసులు దాడి చేసి ముగ్గురు హీరోయిన్లను రక్షించారు. ఈ ఘటన వినోద పరిశ్రమలో పెద్ద కలకలం రేపుతూ, తీవ్ర చర్చకు దారితీసింది.
దక్షిణ ముంబైలోని గిర్గావ్ ప్రాంతంలో ఒక హై-ప్రొఫైల్ వ్యభిచార ముఠాను ముంబై పోలీసులు గుట్టు రట్టు చేశారు. అక్రమ కార్యకలాపాలు జరుగుతున్న హోటల్పై పోలీసులు దాడి చేసి ముగ్గురు హీరోయిన్లను రక్షించగా.. వీరిలో ఒక మరాఠీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి కాగా.. మరొకరు బెంగాలీ సినీ ఇండస్ట్రీకి చెందిన వారిగా గుర్తించారు. అలాగే మూడో వ్యక్తి బాలీవుడ్ చిత్రాల్లో అతిథి పాత్రలు పోషించే నటిగా పోలీసులు గుర్తించారు. ఇప్పుడీ వార్త చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చగా మారింది.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. ముంబైలోని గిర్గావ్లో ఒక హోటల్లో ఉన్నత స్థాయి వ్యభిచార ముఠా పనిచేస్తోందని పోలీసులకు నిఘా సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీసులు సదరు హౌటల్పై దాడి చేశారు. ఈ సీక్రెట్ ఆపరేషన్లో ఇద్దరు హీరోయిన్లను మొదటగా గుర్తించగా.. ఆ తర్వాత మరో హీరోయిన్ ఉందని గుర్తించారు. ఆ తర్వాత దాడిలో పట్టుబడ్డ మహిళలను, ఇతర వ్యక్తులను ఇప్పుడు ముంబై పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా ప్రమేయం ఉన్నారా అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
జనవరిలో ఓసారి దొరికారు..
ఈ ఏడాది జనవరిలో నవీ ముంబైలోని తుర్బే నాకా ప్రాంతంలో మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (AHTU) ఒక భారీ ఆపరేషన్ నిర్వహించింది. తుర్బే నాకాలోని ఒక లాడ్జ్లో నడుస్తున్న వ్యభిచార ముఠాపై దాడి చేసి ఏడుగురు మహిళలను రక్షించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
పోలీసులకు అందిన సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. సమాచారాన్ని ధృవీకరించుకోవడానికి, పోలీసులు ఒక నకిలీ కస్టమర్ను లాడ్జ్కు పంపారు. అక్కడ వ్యభిచారం జరుగుతోందని నిర్ధారించుకున్న తర్వాత, బృందం వెంటనే దాడి చేసింది. ఈ దాడిలో, ఏడుగురు మహిళలను వ్యభిచారం కోసం లాడ్జ్లోని వేర్వేరు గదుల్లో ఉంచినట్లు కనుగొన్నారు. గిర్గావ్లో జరిగిన ఈ ఆపరేషన్ అనంతరం ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి హై-ప్రొఫైల్ వ్యభిచార ముఠాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read: మరోసారి తండ్రి కాబోతున్న ‘కల్కి’ డైరెక్టర్ నాగ్అశ్విన్..సోషల్ మీడియాలో క్రేజీ పోస్ట్
Also REad: సినిమా ప్రారంభం అవ్వకముందే 'ఓజీ 2' స్టోరీ లీక్..నేతాజీ చుట్టూ అసలు కథ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
