icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
500064
RSRajesh SharmaFollow17 Jun 2024, 06:35 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

The Suraka School: కొల్లూరులో ది సురాకా స్కూల్ కొత్త అకడమిక్ బ్లాక్ ప్రారంభం

Hyderabad, Telangana:

The Suraka School: సీబీఎస్‌ఈ, కేంబ్రిడ్జ్ పాఠ్యాంశాలను ఒకే వేదికపై అందిస్తూ విద్యా సంస్థల్లో విశేష గుర్తింపు పొందిన ది సురాకా స్కూల్ - ఫ్యూచురా ఎక్సలెన్స్ తన అత్యాధునిక క్యాంపస్‌లో కొత్తగా అకడమిక్ బ్లాక్‌ను ప్రారంభించుకుంది. హైదరాబాద్‌ శివారులోని కొల్లూరు పాఠశాల ప్రాంగణంలో అకడమిక్‌ బ్లాక్‌ను ప్రారంభించుకుని విద్యార్థులకు అత్యుత్తమ విద్యా బోధన అందించేందుకు సిద్ధమైంది. భవిష్యత్‌కు అనుగుణమైన, విలువల ఆధారిత విద్యను అందించాలనే సంస్థ లక్ష్యానికి ఈ ప్రారంభోత్సవం ఒక కీలక ఘట్టంగా నిలిచిందని ది సురాకా స్కూల్‌ యాజమాన్యం తెలిపింది. అట్టహాసంగా జరిగిన ఈ అకడమిక్‌ బ్లాక్‌ ప్రారంభోత్సవంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేశ్‌, మాజీ డీజీపీ ఎన్. సాంబశివరావు ముఖ్య అతిథులుగా హాజరై అకడమిక్‌ బ్లాక్‌ను ప్రారంభించారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ రమేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలు  అంకితభావంతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. నాణ్యమైన విద్య సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. మాజీ డీజీపీ  సాంబశివరావు మాట్లాడుతూ.. 'భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దడంలో విద్యాసంస్థల పాత్ర ఎంతో కీలకం. విద్య, విలువలు, ఆవిష్కరణ  వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యం ఇచ్చే విద్యా వాతావరణాన్ని సృష్టించారు' అని పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం జరిగిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థుల మార్చ్‌పాస్ట్ కలర్ పార్టీ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. క్యాంపస్‌లో భారత క్రికెట్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన క్రిక్‌కింగ్‌డమ్ క్రికెట్ అకాడమీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాల క్రీడా మౌలిక సదుపాయాలు  నిపుణుల శిక్షణను అందిస్తుంది.

ది సురాకా స్కూల్ – ఫ్యూచురా ఎక్సలెన్స్ అకాడమిక్ బ్లాక్ ప్రారంభం భవిష్యత్‌కు అనుగుణమైన విద్య, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, విలువల ఆధారిత బోధన, అనుభవాత్మక అభ్యాసం  సమగ్ర వికాసం వైపు సంస్థ చేస్తున్న ప్రయాణంలో ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచింది. ఈ కార్యక్రమంలో మాజీ ఐసీఎల్ఎస్ అధికారి డాక్టర్ డి. విజయ భాస్కర్, ది వింటేజ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మహమ్మద్ తాహిర్, ది కాశ్మీర్ ఫైల్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్, టీసీఎస్‌  హైదరాబాద్- సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వి. చెన్నారెడ్డి, హెక్సాగాన్ సీఈఓ భల్లవ్ ముండ్రా, వ్యవస్థాపక ప్రిన్సిపాల్ అకడమిక్ డైరెక్టర్ మరుతీ రాంప్రసాద్ పెళ్లూరి హాజరయ్యారు.

డ్జోనియా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ద్వారా 12 సంవత్సరాలకు పైగా విద్యారంగ అనుభవాన్ని కలిగి ఉన్న పాఠశాల వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ నిలోఫర్ షేక్ ఆధ్వర్యంలో పాఠశాల కొనసాగుతోంది. సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ షాహిద్ షేక్‌తోపాటు డైరెక్టర్లు సుభాష్ దాభాడే  శ్యామ్ సుందర్ మోదాని మార్గదర్శకత్వంలో సురాకా పాఠశాల వ్యవహారాలు కొనసాగుతున్నాయి. వారి తమ దూరదృష్టి, మార్గదర్శకత్వంతో విద్యా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు.

సురాకా అంటే?
సురాకా అనే పదం సంస్కృతంలో పవిత్ర జ్ఞానం అనే అర్థాన్ని సూచిస్తుంది. విద్యా ప్రావీణ్యం, ఆవిష్కరణ, వ్యక్తిత్వ వికాసం సమగ్ర అభివృద్ధి కలిసిన ఒక రూపాంతరాత్మక విద్యా వాతావరణాన్ని సృష్టించాలనే లక్ష్యంతో ఈ విద్యాసంస్థకు సురాకా అనే పేరు పెట్టారు.

క్యాంపస్‌లో ప్రత్యేక సదుపాయాలు
రోబోటిక్స్ ల్యాబ్, వండర్ ల్యాబ్, సుకూన్ ల్యాబ్

దరఖాస్తులు ప్రారంభం
2026–27 విద్యా సంవత్సరానికి సీబీఎస్‌ఈ, కేంబ్రిడ్జి ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. భవిష్యత్‌కు సిద్ధం చేసే.. విలువలతో కూడిన విద్యను కోరుకునే తల్లిదండ్రులు కొల్లూరులోని పాఠశాలను సందర్శించవచ్చు. క్యాంపస్ టూర్‌ను బుక్ చేసుకోవచ్చు లేదా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు వెబ్‌సైట్:
www.thesurakaschool.com సందర్శించవచ్చు

0
0
Report

Tecno కొత్త సంచలనం.. భారీ బ్యాటరీ, అడ్వాన్స్‌డ్ AI ఫీచర్లతో Tecno Spark 50 Pro లాంచ్..

Hyderabad, Telangana:

Tecno Spark 50 Pro Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ టెక్నో (Tecno) తన స్పార్క్ సిరీస్‌ను మరింత విస్తరిస్తూ మార్కెట్లోకి సరికొత్త మొబైల్‌ను లాంచ్‌ చేసింది.. అద్భుతమైన ఫీచర్లతో పాటు శక్తివంతమైన కెమెరాతో టెక్నో స్పార్క్ 50 ప్రో (Tecno Spark 50 Pro) స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఇది అధునాతన మీడియాటెక్ ప్రాసెసర్‌తో పాటు చాలా ప్రత్యేకమైన కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అద్భుతమైన డిస్‌ప్లే..
ఈ Tecno Spark 50 Pro స్మార్ట్‌ఫోన్‌ ఎంతో ప్రత్యేకమైన 6.78 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.. అంతేకాకుండా దీనికి తోడు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండటం విశేషం..  అయితే, ఇది డిస్ల్పే పరంగా ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రావడం వల్ల  గేమింగ్, వీడియోలు చూసేటప్పుడు డిస్‌ప్లే ఎంతో స్మూత్‌గా, స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇందులో SGS ఫైవ్-స్టార్ ప్రీమియం డ్రాప్ రెసిస్టెన్స్ సపోర్ట్‌ కూడా అందుబాటులో ఉంది. దీని వల్ల ఫోన్ పొరపాటున కింద పడినా త్వరగా పాడవ్వదని కంపెనీ క్లైమ్‌ చేస్తూ వస్తోంది..

50MP సోనీ కెమెరా.. 
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం టెక్నో కంపెనీ చాలా అద్భుతమైన కెమెరా సెటప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీని వెనక భాగంలోని కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ LYT-600 ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన ఫోటోలను క్లిక్ చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో ఫ్రంట్‌లో భాగంగా అద్భుతమైన  8 మెగాపిక్సెల్ కెమెరాను అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు కంపెనీ తెలిపింది. 

శక్తివంతమైన ప్రాసెసర్‌..
టెక్నో స్పార్క్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ హెలియో G100 అల్టిమేట్ (Helio G100 Ultimate) చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతున్నట్లు కంపెనీ తెలిపింది.. ఈ ఫోన్‌లో ఎంతో ప్రత్యేకమైన ఎల్లా AI ఏజెంట్‌తో పాటు AI హెల్త్ అసిస్టెంట్, AI రైటింగ్, AI నాయిస్ క్యాన్సలేషన్, AI ఎరేజర్ 2.0 వంటి ఎన్నో రకాల అడ్వాన్స్‌డ్ AI టూల్స్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

భారీ బ్యాటరీ.. 
ఈ స్మార్ట్‌ఫోన్‌ మొత్తం రెండు బ్యాటరీ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. ఇందులో మొదటి ఆప్షన్‌  5,600mAh ఉండబోతోంది. అంతేకాకుండా రెండవది 6,000mAh బ్యాటరీ ఆప్షన్లలో లభించనుంది. దీనికి 60W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఫీచర్‌ కూడా అందుబాటులో ఉండడం విశేషం.. అలాగే కేవలం 30 నిమిషాల్లోనే 63 శాతం వరకు బ్యాటరీ ఫుల్‌ అవుతుంది. దీంతో పాటు ఇందులో కంపెనీ  IP68తో పాటు IP69 రేటింగ్స్ ఇచ్చారు.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Redmi Turbo 5: రూ.38 వేలకే ఐఫోన్ రేంజ్ ఫీచర్స్.. 7540mAh బ్యాటరీతో సరికొత్త Redmi Turbo 5 లాంచ్!

Hyderabad, Telangana:

Redmi Turbo 5 India Launch News: భారతదేశ మొబైల్ మార్కెట్లోకి రెడ్‌మి (Redmi) సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. దీనిని కంపెనీ రెడ్‌మి టర్బో 5 (Redmi Turbo 5) స్మార్ట్‌ఫోన్‌ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది చైనాలో విడుదలైన కొద్ది రోజులకే భారత మార్కెట్‌లోకి అందుబాటులోకి రావడం విశేషం.. అయితే, దీనిని కంపెనీ రూ.34 వేల నుంచి రూ.38 వేల బడ్జెట్‌ విభాగంలో ఐఫోన్ రేంజ్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ ప్రియులను ఆకట్టుకునేందుకు ఇది సిద్ధమైంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ధర వివరాలు..
భారతదేశంలో రెడ్‌మి టర్బో 5 బేస్ వేరియంట్ (8GB RAM + 256GB స్టోరేజ్) ధర రూ. 37,999 నుంచి ప్రారంభమవుతుంది.. ఈ స్మార్ట్‌ఫోన్ అస్ఫాల్ట్ బ్లాక్, నైట్రో బ్లూతో పాటు టర్బో వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది.. కస్టమర్లు ఈ మొబైల్‌ను ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ (Amazon India)తో పాటు Mi.com, అధికారిక స్టోర్ల ద్వారా కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది.. అంతేకాకుండా మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

కళ్లు చెదిరే డిస్‌ప్లే.. 
ఈ రెడ్‌మి టర్బో 5 ఫోన్‌లో 6.59-ఇంచుల 1.5K అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌తో పాటు 3,500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది.. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా, ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది.. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఇచ్చారు. అంతేకాకుండా, ధూళి మరియు నీటి నుండి రక్షణ కోసం అత్యుత్తమమైన IP66, IP68, IP69 మరియు IP69K రేటింగ్స్‌ను కలిగి ఉండటం విశేషం.

సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్.. 
గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం ఇందులో శక్తివంతమైన ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా (MediaTek Dimensity 8500 Ultra) చిప్‌సెట్‌ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది.. ఇది గరిష్టంగా 3.4GHz క్లాక్ స్పీడ్‌ను అందిస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3 (HyperOS 3)పై  ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇందులో అడ్వాన్స్‌డ్ AI ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది..

7,540mAh మెగా బ్యాటరీ.. 
రెడ్‌మి టర్బో 5 స్మార్ట్‌ఫోన్‌లో అతిపెద్ద హైలైట్ దీని బ్యాటరీ.. ఇందులో కంపెనీ ఏకంగా శక్తివంతమైన 7,540mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి తీసుకు వచ్చింది.. దీనికి తోడు 100W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఫీచర్‌ కూడా లభిస్తోంది. ఇది ఫోన్‌ను చాలా త్వరగా చార్జ్ చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది.. అలాగే 27W రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. దీని ద్వారా ఇతర డివైజ్‌లను కూడా ఎంతో సులభంగా చార్జ్ చేసుకుని సదుపాయం లభిస్తుంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

50MP అల్ట్రా కెమెరా..
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది.. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్‌తో కూడిన మోస్ట్ పవర్‌ఫుల్‌ 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రధాన కెమెరాతో పాటు అదనంగా శక్తివంతమైన 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాలు కూడా లభిస్తున్నాయి. ఇక ఫ్రంట్‌ భాగంలో సెల్ఫీల కోసం 20-మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

 

0
0
Report
Advertisement

Sircilla: అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర.. దుర్గమ్మకు సిరిసిల్ల నేతన్న అద్భుత కానుక..

Hyderabad, Telangana:

Sircilla Matchbox Silk Saree: మన భారతీయ చేనేత కళా వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే.. మరో అద్భుతమైన అరుదైన ఘట్టం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆవిష్కృతమైంది. అగ్గిపెట్టెలో పట్టే.. అత్యంత సూక్ష్మమైన, అరుదైన పట్టుచీరను ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ఓ భక్తుడు భక్తిశ్రద్ధలతో సమర్పించారు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కార్మికుడు.. చేనేత కళారత్న అవార్డు గ్రహీత నల్ల విజయ్ కుమార్ తన చేతులతో మగ్గంపై అద్భుతంగా నేసిన ఈ ప్రత్యేక పట్టుచీరను మంగళవారం అమ్మవారికి కానుకగా అందించారు.

వారం రోజుల శ్రమ.. 
ఈ అద్భుతమైన లలిత కళాఖండాన్ని రూపొందించడానికి విజయ్‌ కుమార్‌ దాదాపు వారం రోజుల పాటు రాత్రి పగలు మగ్గంపై శ్రమించారు.. ఈ  పట్టుచీర పొడవు 5.5 మీటర్లు కాగా..వెడల్పు 48 అంగుళాలు ఉంది. ఇంత పెద్ద చీర అయినప్పటికీ.. దీని మొత్తం బరువు కేవలం 200 గ్రాములు మాత్రమే కావడం విశేషం.. సాంప్రదాయ ఇక్కత్‌ డిజైన్‌తో.. అత్యంత అద్భుతంగా.. ఆకర్షనీయమైన రంగులతో నేసిన ఈ చీరను మడత పెడితే.. ఒక చిన్న అగ్గిపెట్టేలో సులువుగా పడుతుంది. సిరిసిల్ల నేతన్నల మంచి నైపుణ్యానికి ఈ చీర నిదర్శనమని చెప్పొచ్చు..

అమ్మవారు కనకదుర్గమ్మపై ఉన్న భక్తితో.. మా సిరిసిల్ల చేనేత కళా వైభవాన్ని అమ్మవారి పాదాల చెంత ఉంచాలనే సంకల్పంతో ఈ చీరను నేచారని చేనేత కళారత్న నల్ల విజయ్ కుమార్ తెలిపారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న విజయ్ కుమార్.. దుర్గమ్మ ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్‌ను కలిసి ఈ పట్టుచీరను అధికారికంగా అందజేశారు.. ఒక చిన్న అగ్గిపెట్టెలోంచి 5.5 మీటర్ల పట్టుచీరను బయటకు తీసి చూపిస్తుంటే ఆలయ అధికారులతో పాటు అర్చకులు, అక్కడున్న భక్తులు ఆశ్చర్యపోతున్నట్లు తెలుస్తోంది.. 

ఇంతటి చాలా అద్భుతమైన కళాఖండాన్ని అమ్మవారికి సమర్పించిన విజయ్ కుమార్‌ను ఈవో శీనా నాయక్ శాలువాతో సత్కరించి.. అమ్మవారి ప్రసాదాన్ని అందించి ప్రత్యేకంగా అభినందించారు. తాజాగా ఈ వార్తకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు సిరిసిల్లకు చెందిన చాలా మంది చేనేతలు ఇలాంటి చీరలను ఎన్నో నేచారు. అంతేకాకుండా చాలా మంది విదేశీయులు కూడా ఇలాంటి చీరలను కొనుగోలు చేసిన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి చీరలను చాలా అరుదుగా మాత్రమే నేస్తారు.  

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Cobra Video: శివలింగంపై కోబ్రా.. ప్రాణాలకు తెగించి అభిషేకం చేసిన మహిళ.. వీడియో..

Hyderabad, Telangana:

 Cobra Abhishekam Viral Video: హిందువుల మహా భక్తికి హద్దులు ఉండవని అంటూ ఉంటారు. కానీ ఇక్కడొక భక్తరాలు ఏకంగా తన ప్రాణాలనే పణంగా పెట్టి.. శివునిపై ఉన్న భక్తిని చూటుకుంది. సాధారణంగా పాము కనిపిస్తేనే కాళ్లూ చేతులూ వణికిపోతుతూ ఉంటాయి. అలాంటిది అత్యంత ప్రమాదకరమైన నాగుపాముకు ఓ మహిళ భయపడకుండా అభిషేక్ చేసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌ చల్‌ చేస్తున్నాయి. దీనికి సంబంధించి వీడియో చూసిన నెటిజన్స్‌ ఒక్కసారిగా షాక్‌ అవుతున్నారు. ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శివలింగంపై నాగుపాము..
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడిమో ప్రకారం.. ఒక శివాలయంలోని శివలింగంపై పెద్ద నాగుపాము పడగ విప్పి కూర్చిని ఉంది. అయితే, దాన్ని చూసి భయపడి పారిపోవాల్సింది పోయి.. అక్కడ ఉన్న ఇద్దరు భక్తులు ఆ స్వామికి అభిషేక్‌ చేయడం ప్రారంభించారు. అయితే, అక్కడే అసలైన ట్విస్ట్ ఉంది.. ఆ ఇద్దరిలో ఒక మహిళా భక్తురాలు ఏకంగా ఈ విషపూరితమైన కోబ్రా పడగను చేతులతో పట్టుకుని ఉండడం మీరు ఈ వీడియో క్లియర్‌గా చూడొచ్చు.. 

మరో భక్తుడు శివలింగంతో పాటు ఆ నాగుపాము తలపై నీళ్లు పోస్తూ అభిషేకం చేస్తుండగా.. సదరు మహిళ పామును కదలకుండా పట్టుకుని సహకరించడం మీరు ఈ వీడియోలో క్లయర్‌గా చూడొచ్చు.. ఆ పాము కూడా ఎలాంటి హాని చేయకుండా ప్రశాంతంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్‌ వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. కొంతమంది శివునిపై నమ్మకంతోనే ఆమె అలా చేయగలిగిందని కామెంట్స్‌ చేస్తుంటే.. మరికొంతమంది ఇది భక్తి కాదు, మూఢనమ్మకం.. ప్రాణాలతో చెలగాటం.. అంటూ మరికొందరు మండిపడుతున్నారు. చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

 
 
 
 
 

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు తీశారనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఏది ఏమైనప్పటికీ, ఈ నాగుపాము అభిషేకం వీడియో మాత్రం ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఈ అరుదైన, ఆశ్చర్యం కలిగించే వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే ఆలస్యం.. క్షణాల్లో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను bass.bhaskaran's అనే ఇన్‌స్టా అకౌంట్‌ నుంచి పోస్ట్‌ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియో 66 వేల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు లైక్‌ చేశారు. చాలా మంది వీక్షించిన్నట్లు తెలుస్తోంది. 

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

  

0
0
Report

Cobra Vs Rat Video: పాముకే చుక్కలు చూపించిన ఎలుక.. ఒకే డ్రమ్ములో కింగ్ కోబ్రా, ఎలుక ఫైట్ వీడియో వైరల్..

Hyderabad, Telangana:

 Cobra Vs Rat Video Watch Here: ప్రమాదకరమైన కింగ్‌ కోబ్రాలు కనిపిస్తేనే ఎలుకలు ప్రాణభయంలో పరుగులు తీస్తూ ఉంటాయి. మానవులు సైతం పరుగులు తీస్తూ ఉంటారు. అలాంటిది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన కింగ్‌ కోబ్రాతో ఓ ఎలుక తలపడితే.. ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? వినడానికే వింతగా ఉన్నప్పటికీ ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒకే ప్లాస్టిక్‌ డ్రమ్ములో చిక్కుక్కున్న కింగ్‌ కోబ్రాతో పాటు ఎలుక వీడియోకి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వీడియోలో అసలేం జరిగిందంటే..?
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక పెద్ద నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్ములో ప్రమాదవశాత్తు ఒక కింగ్ కోబ్రా, ఒక ఎలుక చిక్కుకుని ఉండడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు.. డ్రమ్ లోపల స్థలం తక్కువగా ఉండటంతో ఒకదానికొకటి ఎదురుపడక తప్పలేని సంర్భంగా కూడా గమనించవచ్చు.. సాధారణంగా పామును చూడగానే పారిపోయే ఎలుక, ఇక్కడ తప్పించుకునే దారి లేకపోవడంతో చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది..

కింగ్ కోబ్రా తన పడగ విప్పి ఎలుకపై దాడి చేయడానికి ప్రయత్నించడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు. అయితే, ఆ ఎలుక ఏమీ భయపడకుండా.. తన ప్రాణాలను కాపాడుకోవడానికి కోబ్రాపై ఎదురుదాడికి దిగడం మీరు గమనించవచ్చు.. పాము కాటు వేయడానికి ప్రయత్నించిన ప్రతిసారీ ఎలుక గాల్లోకి ఎటూ తప్పించుకుంటూ.. వీలైతే పాముపైనే దాడి చేస్తూ ఉండడం మీరు చూడొచ్చు..

 
 
 
 
 

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

నెటిజన్ల షాక్.. 
ఈ ఊహించని వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా ఈ వీడియోపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. పరిస్థితి ఎదురైతే ఎంతటి బలహీనుడైనా సింహంలా పోరాడతాడని ఈ ఎలుక నిరూపించిందని ఒకరు కామెంట్ చేయగా.. లక్, టైమింగ్ బాగుంటే కింగ్ కోబ్రా నుంచి కూడా ప్రాణాలతో బయటపడొచ్చని ఈ వీడియో చూస్తే అర్థమవుతోందని మరొకరు పేర్కొన్నారు. సాధారణంగా కోబ్రా ఒకసారి కాటు వేస్తే.. ఏనుగు అయినా సరే కొన్ని నిమిషాల్లో ప్రాణాలు కోల్పోతుంది. అలాంటిది ఆ డ్రమ్ములో ఎలుక చూపించిన ధైర్యం, చాకచక్యం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

  

0
0
Report
Advertisement

Sun Transit 2026: ఈ 4 రాశుల వారికి బంపర్ ఆఫర్.. అరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు.. ఇక తిరుగుండదు!

Hyderabad, Telangana:

Sun Transit In Ardra Nakshatra 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు రాజుగా భావించే సూర్యుడికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాన్ని అతి పెద్ద గ్రహంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. అయితే, ఇది ప్రతి నెల రాశి సంచారం చేస్తుంది. ఇలా సంచారం చేసే ప్రతిసారి అన్ని రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుంది. జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:31 గంటలకు సూర్యుడు మృగశిర నక్షత్రాన్ని వదిలిపెట్టి రాహువు నక్షత్రంగా భావించే అరుద్ర నక్షత్రంలోకి సంచారం చేస్తుంది. దీంతో అన్ని రాశులు ఊహించని స్థాయిలో ప్రభావితమవుతాయి. 

సూర్యుడు అరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించడం జ్యోతిష్య శాస్త్రం పరంగా.. చాలా అద్భుతమైన సంఘటనగా భావిస్తారు. దీని కారణంగా ఏర్పడిన ప్రభావం మొత్తం అన్ని రాశులవారిపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా 4 రాశులవారికి ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి జీవితంలో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికస్థితులు కూడా ఊహించని స్థాయిలో మెరుగుపడతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎక్కువగా మేలు జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మేష రాశి
అరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల మేష రాశివారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి ఊహించని స్థాయిలో ధైర్యం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా అన్ని పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు. ముఖ్యంగా ఈ సమయంలో ఊహించని  నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. వీరు తప్పకుండా ఉన్నతాధికారుల నుంచి కూడా ఊహించని సపోర్ట్‌ కూడా పొందుతారు. వీరికి నిలిపోయిన పనులు కూడా తిరిగి ప్రారంభమవుతాయి. అలాగే భారీ మొత్తంలో డబ్బులు కూడా తిరిగి పొందుతారు. ఈ సమయంలో తప్పకుండా కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

మిథున రాశి
అరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల మిథున రాశివారికి కూడా ఈ సమయం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో తప్పకుండా వ్యక్తిత్వ వికాశం కూడా పెరుగుతుంది. అలాగే సమాజంలో అద్భుతమైన గుర్తింపు కూడా లభిస్తుంది. అంతేకాకుండా చాలా మంది మీ మాటలు కూడా వింటారు. మిథున రాశివారికి నిలిచిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. వీరు తప్పకుండా జీవితంలో సులభంగా ముందుకు సాగుతారు. వ్యాపారాల పరంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. 

సింహ రాశి
సూర్యుడు నక్షత్ర సంచారం కారణంగా సింహ రాశివారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. ఆర్థిక సమస్యల నుంచి సులభంగా విముక్తి కలుగుతుంది. పాత అప్పులు కూడా వీరికి సులభంగా తిరిపోతాయి. దీంతో పాటు ఉద్యోగాల పరంగా కూడా అద్భుతమైన పురోగతి కూడా లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల చేస్తున్నవారికి ఈ సమయంలో తప్పకుండా మంచి పురోగతి కూడా లభించే చాన్స్‌లు ఉన్నాయి. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కూడా లభిస్తుంది. 

ధనుస్సు రాశి
ధనుస్సు రాశివారికి కూడా ఈ సమయంలో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. సూర్యుడు అరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. వ్యాపారాల పరంగా ఊహించని స్థాయిలో ముందుకు సాగుతాయి. అంతేకాకుండా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా లభిస్తాయి. దీని ద్వారా కూడా వీరు భారీగా డబ్బులు కూడా పొందుతారు. ఇక ఆందోళనతో పాటు మానసిక ఒత్తిడి వంటి సమస్యలో బాధపడేవారికి ఈ సమయంలో పరిష్కారం కూడా లభిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

FIFA World Cup 2026: మూడుసార్లు బొక్కబోర్లా.. 90వ నిమిషంలో సీన్ రివర్స్‌.. ఈక్వెడార్ ఓటమికి కారణాలు ఇవే..!!

BBhoomi9h ago
Secunderabad, Telangana:

Ivory Coast vs Ecuador: ఫీఫా ప్రపంచ కప్ 2026 గ్రూప్ ఈ మ్యాచ్‌లో, మాంచెస్టర్ యునైటెడ్ వింగర్ అమాద్ డియల్లో చివరి నిమిషంలో గోల్ చేయడంతో ఐవరీ కోస్ట్, ఈక్వెడార్‌ను 1-0 తేడాతో ఓడించింది. ఈ విజయంతో..  ఐవరీ కోస్ట్ 2014 తర్వాత తమ మొదటి ప్రపంచ కప్ విజయాన్ని నమోదు చేసి, పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి చేరుకుంది.

ఈ మ్యాచ్ గోల్ రహిత డ్రాగా ముగుస్తుందని అంతా అనుకున్నారు.  కానీ అమాద్ ఒక అద్భుతమైన షాట్‌తో గోల్ చేసి..  2014 తర్వాత ఐవరీ కోస్ట్‌కు ప్రపంచ కప్‌లో తొలి విజయాన్ని అందించాడు. ఈ విజయంతో ఐవరీ కోస్ట్ గ్రూప్ Eలో జర్మనీ వెనుక రెండవ స్థానానికి చేరుకుంది. ఆదివారం కురకావోను 7-1 తేడాతో ఓడించిన జర్మనీ మొదటి స్థానంలో ఉంది. ఫస్ట్ హాఫ్ లో ఈక్వెడార్ అనేక మంచి అవకాశాలను సృష్టించుకుంది. జాన్ యెబోవా కొట్టిన పవర్ ఫుల్  షాట్ క్రాస్‌బార్‌ను తాకడంతో దానిని గోల్‌గా తీసుకోలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికే, అలాన్ మిండా గోల్ చేసేందుకు దగ్గరగా వచ్చాడు.  కానీ అతని షాట్ కూడా బార్‌ను తాకి టార్గెట్ నుండి పక్కకు వెళ్లింది. ఈ విధంగా.. తొలి ఆధిక్యం సాధించే అవకాశాన్ని ఈక్వెడార్ కోల్పోయింది.

అయితే ఐవరీ కోస్ట్ కూడా కొన్నిడేంజరస్ అటాక్స్ షురూ చేసింది. యాన్ డియోమాండే కుడి వైపు నుండి అద్భుతంగా ఆడి, ప్రత్యర్థి రక్షణ శ్రేణిపై నిరంతరం ఒత్తిడి తెచ్చాడు. ఈలోగా, బజౌమానా టూరే కొట్టిన భారీ షాట్‌ను ఈక్వెడార్ గోల్ కీపర్ హెర్నాన్ గాలిండెజ్ అద్భుతంగా అడ్డుకుని గోల్ కాకుండా కంట్రోల్ చేశాడు. ఈ మ్యాచ్‌లో యాన్ డియోమాండే ఒక ప్రత్యేకమైన ఘనతను కూడా సాధించాడు. 19 సంవత్సరాల 212 రోజుల వయస్సులో, అతను ఐవరీ కోస్ట్ తరపున ప్రపంచ కప్ మ్యాచ్ ఆడిన మొదటి యువ ఆటగాడిగా నిలిచాడు.

సెకండ్ ఆఫ్ లో  ఇరు జట్లకు అవకాశాలు లభించాయి. అనుభవజ్ఞుడైన ఈక్వెడార్ ఆటగాడు ఎన్నర్ వాలెన్సియా కొట్టిన షాట్ పోస్ట్‌ను తాకింది. ఐవరీ కోస్ట్ ఆటగాడు ఎలీ వాహి కూడా గోల్ చేయడానికి దగ్గరగా వచ్చాడు. కానీ అతని ప్రయత్నం క్రాస్‌బార్‌ను తాకి గోల్‌గా మారింది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ, ఐవరీ కోస్ట్ బంతిపై మరింత పట్టు సాధించడం ప్రారంభించింది.

ఎక్కడా కూడా తడబడ కుండా ఆ జట్టు  ఎదురు దాడి కొనసాగించగా, ఈక్వెడార్ సెల్ఫ్ డిఫెన్స్ లో ఆటను కొనసాగించింది. చివరకు, 90వ నిమిషంలో, అమాద్ డియల్లో ఎలాంటి పొరపాటు చేయకుండా, ఒక అద్భుతమైన గోల్ చేసి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ విజయంతో, ఐవరీ కోస్ట్ గ్రూప్ Eలో మూడు కీలక పాయింట్లను దక్కించుకుని, తదుపరి రౌండ్‌కు వెళ్లే తమ అవకాశాలను పటిష్టం చేసుకుంది.

Also Read: చివరి నిమిషంలో ఒగావా మ్యాజిక్‌.. నెదర్లాండ్స్‌, జపాన్‌ సూపర్‌ ఫైట్‌ హైలెట్స్ ఇవే..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Business Ideas: ఈ ఒక్క చెట్టు పెంచితే చాలు...లక్షల్లో లాభం... కేజీ రూ. 650 పలికే ఈ పండును సాగు చేస్తే రైతులకు డబ్బే డబ్బు..!!

BBhoomi12h ago
Secunderabad, Telangana:

Business Ideas: రైతులకు చక్కటి లాభాలు కావాలి అంటే ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలి అంటే వ్యవసాయాన్ని మించిన మరొక మార్గం లేదు అని చెప్పవచ్చు. నేల తల్లిని నమ్ముకున్న వాడికి ఎప్పుడు మోసం జరగదు. సరైన పంటలను ఎంపిక చేసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకున్నట్లయితే వ్యవసాయం ని మించిన ఆదాయ మార్గం లేదు అని చెప్పవచ్చు. 

కర్ణాటకలోని మంగుళూరు ప్రాంతానికి చెందినటువంటి లోహిత్ శెట్టి అనే ఒక రైతు దక్షిణ కన్నడ జిల్లా, పెరడకా గ్రామంలో మాంగోస్టీన్ అనే అరుదైన పండ్ల జాతి మొక్కలతో వ్యవసాయం చేసి ప్రస్తుతం చక్కటి ఆదాయం పొందుతున్నాడు. ఈ మ్యాంగో స్టీన్ అనే పండు కేజీ ధర 650 రూపాయల వరకు పలుకుతోంది. విదేశాల్లో మాత్రమే లభించే ఈ పండును ఫైవ్ స్టార్ హోటల్స్, అలాగే అరుదైన ఎగ్జోటిక్ పండ్ల మార్కెట్లలో భారీ డిమాండ్ కలిగి ఉంది. 

వీటిని విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటారు. 2006 సంవత్సరంలో లోహిత్ శెట్టి తాను రెగ్యులర్ గా చేసే రబ్బర్ పంట, వక్క పంట సాగులో ఆదాయం తగ్గడంతో, ఇతర డిమాండ్ కలిగినటువంటి పంటలను పండించాలని నిర్ణయం తీసుకొని కేరళ వెళ్లి అక్కడ మాంగోస్టీన్, రాంబుటాన్ వంటి ఎక్సోటిక్ (అరుదైన) పండ్ల గిరాకీని దృష్టిలో ఉంచుకొని తనకు ఉన్నటువంటి వక్క పిక్కల తోటలో 50 మ్యాంగోస్టిన్ చెట్లను అంతర పంటగా వేసి చూశాడు. 

నిజానికి మ్యాంగోస్టింగ్ చెట్లకు ఎక్కువగా ఎండ అవసరం లేదు. కనుక కొబ్బరి చెట్లలా పెరిగే వక్క పిక్కల తోటలో అంతర పంటగా వేయడం వల్ల, మ్యాంగోస్టింగ్ చెట్లకు నేరుగా ఎండ తాకలేదు. వేడి ఎక్కువగా లేదని నేపథ్యంలో చక్కటి అనుకూలమైన వాతావరణం ఏర్పడి మ్యాంగోస్టిన్ పండ్ల పరిమాణం భారీగా పెరిగింది. దీంతో చక్కటి రాబడి వచ్చింది. దీనికి తోడు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల నీరు కూడా తక్కువగా ఖర్చు అయింది.

Also Read: Cafe Niloufer సిబ్బంది జీతాలు తెలిస్తే నోరెళ్లబెడతారు..!!  

ఇక ఈ మ్యాంగోస్టీన్ చెట్ల విషయానికి వచ్చినట్లయితే, నాటిన 8 ఏళ్లకు ఫలసాయం మొదలవుతుంది. 15 ఏళ్లు దాటిన చెట్టు నుండి సీజన్‌కు 100 నుండి 120 కిలోల దిగుబడి వస్తుంది.ఒక కిలో మాంగోస్టీన్ ధర రూ. 650 వరకు పెరుగుతుంది. సీజన్ చివరలో దీని ధర రూ. 250 వరకూ పడే అవకాశం ఉంటుంది. తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఈ పంటకు చాలా అనుకూలంగా ఉన్నాయి. మాంగోస్టీన్ చెట్టు తేమతో కూడిన ఉష్ణమండల వాతావరణానికి  బాగా అలవాటుపడుతుంది. 

సముద్ర తీర ప్రాంతాలు, అలాగే తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ చెట్టు బాగా పెరుగుతుంది. తక్కువ శ్రమతో, అరుదైన పండ్లను పండించి అధిక ఆదాయం పొందవచ్చు. అయితే ఇలాంటి అరుదైన మొక్కలతో వ్యవసాయం చేయాలి అనుకునే వారు ముందుగా వ్యవసాయ నిపుణుల వద్ద సలహా తీసుకుంటే మంచిది. . మీ నేల స్వభావం వాతావరణం వంటివి అంచనా వేసుకున్న తర్వాత మాత్రమే ఇలాంటి అరుదైన మొక్కల వ్యవసాయం చేయవచ్చు. లేకపోతే రిస్క్ లో పడే అవకాశం ఉంటుంది.

Also Read:  1రూపాయి పెట్టుబడితో.. ఈ వానాకాలంలో ఆ ఒక్క పంట

Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Petrol Diesel Price: భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..ట్రంప్ ప్రకటనతో ఒక్కసారి పడిపోయిన ఇంధన ధరలు!

Petrol Diesel Price News: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గత కొన్ని నెలలుగా వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలకు త్వరలోనే బ్రేక్ పడనుంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందం ప్రపంచ దేశాలకు పెద్ద ఊరటనిచ్చింది. వ్యూహాత్మక సముద్ర మార్గమైన 'హోర్ముజ్ జలసంధి'ని ఎలాంటి టోల్ ఫీజులు లేకుండా తిరిగి తెరుస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

ఈ పరిణామంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఆదివారం రాత్రి బ్రెంట్ క్రూడ్ ధర 3.9 శాతం తగ్గి బ్యారెల్‌కు 84 డాలర్లకు పడిపోగా, యూఎస్ క్రూడ్ 4.8 శాతం మేర తగ్గి దాదాపు 81 డాలర్లకు చేరింది. గడిచిన మార్చి నెల తర్వాత చమురు ధరలు ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

హోర్ముజ్ జలసంధి ఎందుకు అంత కీలకం?
ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే ముడి చమురులో అత్యధిక భాగం ఈ హోర్ముజ్ జలసంధి ద్వారానే సాగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఈ మార్గాన్ని మూసివేశారు. ఈ దిగ్బంధనం కారణంగా వాణిజ్య నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం లేదా సురక్షిత ప్రయాణం కోసం సగటున 2 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.16 కోట్లకు పైగా) అదనపు భారాన్ని భరించాల్సి వచ్చింది.

ఒకవేళ ఈ దిగ్బంధనం ఇలాగే కొనసాగి ఉంటే, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లను దాటేసేవని, అమెరికాలో గ్యాసోలిన్ ధరలు రికార్డు స్థాయికి చేరేవని నిపుణులు హెచ్చరించారు. ఈ ఉద్రిక్తతలకు శాంతి ఒప్పందంతో తెరపడటంతో ప్రపంచ ఇంధన మార్కెట్ ఊపిరి పీల్చుకుంది.

భారతదేశానికి ఎలాంటి ప్రయోజనం?
భారతదేశం తన ముడి చమురు అవసరాలలో 85 శాతం కంటే ఎక్కువ భాగాన్ని ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం వల్ల భారత్‌కు రెండు రకాలుగా లాభం చేకూరుతుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం వల్ల దేశ దిగుమతి బిల్లు భారీగా తగ్గుతుంది. సముద్ర రవాణా మార్గం సుగమం కావడంతో రవాణా ఖర్చులు మరియు ఇన్సూరెన్స్ ప్రీమియంలు భారం తగ్గుతాయి.

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు 8 శాతం నుండి 8.5 శాతం వరకు పెరిగాయి. అయితే ప్రస్తుత సానుకూల పరిణామాలపై భారత పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందిస్తూ.. రాబోయే నెలల్లో చమురు, గ్యాస్ ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు.

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర 80 డాలర్ల స్థాయికి చేరినందున, దేశీయ చమురు కంపెనీలు త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 నుండి రూ.5 రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉంది. దీనితో పాటు సామాన్యుడిపై భారం తగ్గించేలా వంటగ్యాస్ (LPG) సిలిండర్ ధరలు కూడా తగ్గే ఛాన్స్ ఉంది.

(గమనిక: చమురు ధరల తగ్గింపుపై ప్రభుత్వ రంగ సంస్థల నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ రానున్న రోజుల్లో సామాన్యుడికి ఇంధన ధరల నుండి ఉపశమనం లభించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరిచడం లేదు.)

Also Read: అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం..యుద్ధం ముగిసిందని ట్రంప్ సంచలన ప్రకటన!

Also Read: భారీగా పడిపోతున్న బంగారం ధరలు..ఇదే జరిగితే గోల్డ్ రేటు కుప్పకూలిపోవడం ఖాయం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

KTR: హైదరాబాద్ మెట్రో 2పై విఫలమైన రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి: కేటీఆర్‌

Baddipadaga, Telangana:

Hyderabad Metro Dispute: 'తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధానిమంత్రిని ప్రశ్నించలేని అసమర్ధుడు రేవంత్ రెడ్డి. మెట్రో రెండో దశకు అనుమతి దక్కకపోవడం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనం. తనపై వేలాడుతున్న ఓటుకు నోటు కేసు వల్లనే కేంద్రాన్ని ప్రశ్నించలేని అసమర్ధతలో ఉన్నాడు. 71 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డిని బీజేపీ దేకడం లేదు. ప్రధానిని ప్రశ్నించలేకనే ప్రతిపక్షంపై నిందలు వేసే నీచ ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్‌ రెడ్డి చేతకానితనంపై
మెట్రో రెండో దశపై రేవంత్‌ రెడ్డి నిర్వహించిన ప్రెస్‌మీట్‌పై కేటీఆర్‌ స్పందిస్తూ కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి చేతకానితనంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్ ఫ్లాప్ అయినందుకు, మొదటి దశను ఆగం చేస్తున్నందుకు రేవంత్‌ రెడ్డి వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి' అని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తి చేసిన ఘనత ముమ్మాటికి కేసీఆర్‌దే అని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు.

కేసీఆర్ చొరవ తీసుకుని
'28 శాతం మెట్రో పనులు కూడా పూర్తి చేయకుండా ప్రాజెక్టును చిక్కుల్లో వదిలేసిన నాటి కాంగ్రెస్. 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్ చొరవ తీసుకుని 72 శాతం పనులను పూర్తి చేశారు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ వివరించారు. కేవలం తన స్వార్థ ప్రయోజనాలకోసం ఉనికిలో లేని ఊహ నగరానికి మెట్రో రెండో దశను రేవంత్ రెడ్డి ప్రతిపాదించాడని తెలిపారు. కానీ గత ప్రభుత్వం ట్రాఫిక్ రద్దీ, నగర విస్తరణ, ప్రజల రోజు వారి అవసరాల కోసం మెట్రో రెండో దశను ప్రతిపాదించింది' అని వెల్లడించారు.

బడేభాయ్ ని మెప్పించి ఒప్పించలేక
71 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినప్పటికీ తన 'బడేభాయ్'ని మెప్పించి ప్రాజెక్టును ఒప్పించలేకపోవడం రేవంత్ రెడ్డి చేతకానితనానికి, దద్దమ్మ పాలనకు నిలువెత్తు నిదర్శనమని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 'ఎల్ అండ్ టీపై బెదిరింపులు, ఆస్తుల కొల్లగొట్టే కుట్రతోనే ఎల్ అండ్ టీ సంస్థ పారిపోతున్నది. ఎల్ అండ్ టీపై బెదిరింపులతో మెట్రో రైల్ ఆస్తులు కొల్లగొట్టే కుట్ర' అని తీవ్ర ఆరోపణలు చేశారు. మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టును కేంద్రం నుంచి సాధించలేక, తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే రేవంత్‌ రెడ్డి ఇన్ని కుప్పిగంతులు తొక్కుతున్నారని, అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి తన అసమర్థతను దాచుకోవడానికి అనేక అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు.

బీజేపీతో చీకటి ఒప్పందాలు
యూపీ, అహ్మదాబాద్, వైజాగ్ వంటి నగరాలకు కేంద్రం మెట్రోలను మంజూరు చేస్తుంటే, హైదరాబాద్‌కు ఎందుకు తీసుకురాలేకపోయారో ముందుగా ప్రజలకు జవాబు చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనం మెట్రో రెండో దశకి అనుమతి దక్కకపోవడం అని తెలిపారు. రాష్ట్రం ప్రతిపాదించిన మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వని కేంద్ర ప్రభుత్వంపై, నరేంద్ర మోదీని విమర్శించే సత్తా ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు అని విమర్శించారు. తనపై నమోదైన ఓటుకు నోటు కేసు ఉచ్చు బిగుస్తుందనే భయంతో బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

రేవంత్ రెడ్డి నీచమైన ప్రయత్నం
కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీని కాకుండా తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని విమర్శించి ప్రజలను తప్పుదోవ పట్టించే నీచమైన ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. బీజేపీతో రేవంత్ రెడ్డికి ఉన్న లోపాయికారి ఒప్పందంతోనే ఎన్నిసార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా పట్టించుకోవడం లేదని గుర్తుచేశారు. తన చేతగానితనానికి రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమర్థవంతమైన నాయకుడు ఉంటే గతంలో కేసీఆర్ పాలనలో అనుమతులు, రుణాలు శరవేగంగా ఎలా వచ్చాయో, మీ దిక్కుమాలిన పాలనలో అవి ఎందుకు ఆగిపోయాయో ప్రజలకు అర్థమవుతోందని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వివరించారు.

0
0
Report

Japan Football Fans: హృదయాలను గెలిచిన జపాన్ ఫ్యాన్స్..మ్యాచ్ తర్వాత చెత్తను శుభ్రం చేసిన అభిమానులు!

Hyderabad, Telangana:

Japan Football Fans Clean Stadium: ఫీఫా ప్రపంచకప్‌ 2026లో భాగంగా జపాన్ అభిమానులు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో ఆదివారం (జూన్ 14) నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జపాన్ అద్భుతంగా ఆడి మ్యాచ్‌ను 2-2 పాయింట్లతో డ్రా చేసింది. అయితే ఆటతో ఫుట్‌బాల్ ఆటగాళ్లు తమ అభిమానుల హృదయాలను గెలుచుకోగా.. జపాన్ అభిమానులు కూడా తమ వంతు బాధ్యతగా ఆతిథ్య దేశం పట్ల గౌరవ సూచకంగా మ్యాచ్ తర్వాత స్టేడియంను శుభ్రం చేశారు. 

తమ జట్టు పాల్గొనే క్రీడా ఈవెంట్‌లలో మ్యాచ్‌ల తర్వాత తాము కూర్చున్న ప్రాంతాన్ని శుభ్రం చేయడం జపాన్ అభిమానులకు అలవాటు. ఇప్పుడు ఫీఫా వరల్డ్ కప్ 2026 వారి సంస్కృతికి మరో ఉదాహరణగా నిలిచింది. ఆదివారం మ్యాచ్ తర్వాత అభిమానులు స్టేడియంను శుభ్రం చేస్తున్న వీడియోను FIFA నిర్వాహకులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఎంతోమంది హృదయాలను గెలుచుకుంటోంది.

జపాన్ ఫ్యాన్స్ ఎందుకు శుభ్రం చేస్తున్నారు?
ఫీఫా అధికారిక X (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన వీడియోలో.. అభిమానులు చెత్తను నీలం రంగు సంచులలో వేస్తూ స్టేడియంలో తాము కూర్చున్న ప్రాంతాన్ని శుభ్రం చేయడం కనిపిస్తుంది. అప్పుడు ఒక అభిమాని ఈ పనికి గల కారణాన్ని వెల్లడించారు. "అది మా సంస్కృతి. ఇది అన్నింటి పట్ల గౌరవం - ఆటగాళ్ల పట్ల, తోటి అభిమానుల పట్ల, స్టేడియం పట్ల గౌరవం. ఇక్కడ ఉండటం మాకు గౌరవప్రదమైన విషయం, కాబట్టి మేము చెత్తను అలాగే వదిలి వెళ్లకూడదనుకుంటున్నాము. అందుకే మేము ఇలా చేస్తున్నాము" అని ఆ వీడియోలో స్పష్టం చేశారు.

ఈ ఆలోచన "Tatsu tori ato wo nigosazu" అనే జపనీస్ సామెత యొక్క సారాంశాన్ని ప్రతిబింబిస్తుంది. దీనికి ఆంగ్లంలో "A bird leaves nothing behind" (పక్షి ఎటువంటి ఆనవాళ్లనూ వదిలిపెట్టదు) అని అర్థం. ఈ సామెత యొక్క అసలు అర్థం "ఏదైనా ప్రదేశాన్ని మీరు ఎలా చూశారో, తిరిగి వెళ్లేటప్పుడు కూడా అలాగే ఉంచడం" అని అర్థం వస్తుంది.

చిన్నతనంలోనే పాఠశాలల్లో తరగతి గదులు, కారిడార్లను శుభ్రం చేయడం ద్వారా ఈ విధానం ప్రజలలో అలవాటుగా మారుతుంది. ఒసాకా యూనివర్సిటీకి చెందిన సోషియాలజీ ప్రొఫెసర్ స్కాట్ నార్త్ 2018లో BBCకి ఇలా వివరించారు. "చిన్నప్పటి నుండి నిరంతరం గుర్తుచేయడం వల్ల, ఈ ప్రవర్తనలు చాలా మంది ప్రజలకు అలవాటుగా మారిపోతాయి" అని ఆయన అన్నారు.

జపాన్ తర్వాతి మ్యాచ్‌లు..
జపాన్ తన రెండవ గ్రూప్ F మ్యాచ్‌ను జూన్ 20న మెక్సికోలోని ఎస్టాడియో మాంటెర్రేలో ట్యునీషియాతో ఆడనుంది. ఆ తర్వాత జూన్ 25న డల్లాస్ స్టేడియంలో స్వీడన్‌తో గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌లో తలపడుతుంది. నెదర్లాండ్స్‌తో 2-2తో మ్యాచ్ డ్రా అయిన తర్వాత, జపాన్ ప్రస్తుతం తన గ్రూప్‌లో స్వీడన్ తర్వాత రెండవ స్థానంలో ఉంది. 

భారతదేశంలో జపాన్ ఆడనున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్ మ్యాచ్‌లను ప్రత్యక్షప్రసారం చూడొచ్చు. జీ మీడియాకు సంబంధించిన Zee5 యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఫుట్ బాల్ ప్రపంచకప్ మ్యాచ్‌లను లైవ్‌లో వీక్షించవచ్చు.

Also Read: పాకిస్థాన్ బౌలర్ మెడ పట్టుకున్న టీమ్ఇండియా బ్యాటర్..సోషల్ మీడియాలో వైరల్ వీడియో!

Also Read: ప్రపంచకప్‌లో విజయఢంకా మోగించిన జర్మనీ..కురాకో జట్టుపై 7 గోల్స్‌లో భారీ గెలుపు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Pawan Kalyan: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మరోసారి పవన్ కల్యాణ్ కీలక ప్రకటన..తాను ఎప్పటికీ తెలంగాణకు వ్యతిరేకం కాదని వెల్లడి!

Delhi, Delhi:Pawan Kalyan On Telangana: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా 'జనసేన ప్రస్థానం - జాతీయ సమగ్రత కోసం' సమావేశాన్ని జనసేన పార్టీ ప్రారంభించింది. జనసేన పార్టీని ప్రారంభించి 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా పార్టీ అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ఎప్పుడూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తీరును తప్పుబట్టినట్లు ఆయన ప్రస్తావించారు.
0
0
Report

Peko Kalp Collaboration: చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు సరికొత్త భాగస్వామ్యం..మరో డిజిటల్ విప్లవానికి నాంది పలికిన పెకో, కల్ప్!

Hyderabad, Telangana:

Peko And Kalp Collaboration: యూఏఈ వ్యాపార రంగంలో ఒక సరికొత్త డిజిటల్ విప్లవానికి తెరలేచింది. దుబాయ్‌కు చెందిన ప్రముఖ ఆల్-ఇన్-వన్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ 'పెకో' (Peko).. ప్రముఖ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టోకనైజేషన్ టెక్నాలజీ సంస్థ 'కల్ప్' (Culp) చేతులు కలిపాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఫైనాన్స్, వాణిజ్య రంగాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ రెండు కంపెనీలు ఒక వ్యూహాత్మక ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశాయి. దీనివల్ల సాధారణంగా పెద్ద కార్పొరేట్ కంపెనీలకే పరిమితమయ్యే ఏఐ (AI), స్మార్ట్ పేమెంట్స్ వంటి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలు ఇకపై చిన్న వ్యాపారులకు కూడా అందుబాటులోకి రానున్నాయి.

నేటి డిజిటల్ యుగంలో వ్యాపారంలో కేవలం మంచి ప్రొడక్ట్ లేదా సర్వీస్ ఉంటే సరిపోదు. వాటితో పాటు కింది సేవలు కూడా అంతే ముఖ్యంగా అవసరం దాపురించింది. ఇన్వాయిసింగ్, బిల్లింగ్, అకౌంటింగ్, టాక్స్, జీతాల నిర్వహణ, కస్టమర్ మేనేజ్‌మెంట్, లైసెన్సింగ్ వంటివి ప్రస్తుత కాలంలో అత్యవసరంగా మారాయి. 

పెద్ద కంపెనీలు ఈ పనుల కోసం ఖరీదైన సాఫ్ట్‌వేర్‌లను వాడుతుంటాయి. కానీ చిన్న వ్యాపారాలకు (SMEs) అంత బడ్జెట్ ఉండదు. ఇక్కడే పెకో-కల్ప్ భాగస్వామ్యం చిన్న వ్యాపారాల పనిని మరింత సులభతరం, వేగవంతం, సురక్షితంగా మార్చబోతుంది. 

పెకో - కల్ప్ టెక్నాలజీ హైలైట్స్
ఈ ఒప్పందం ప్రకారం.. కల్ప్ సంస్థకు చెందిన అత్యాధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలను పెకో ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానిస్తారు. దీని ద్వారా వ్యాపారాలకు కింది డిజిటల్ సేవలు లభిస్తాయి.  వ్యాపార లావాదేవీలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో మరింత సులభతరం చేయడంతో పాటు మరింత సురక్షితమైన, పారదర్శకమైన లావాదేవీల నిర్వహణ దీని బాధ్యత. అలాగే వేగవంతమైన వాల్యూ-మూవ్‌మెంట్ మౌలిక సదుపాయాలు..  సురక్షితమైన కీ-మేనేజ్‌మెంట్‌తో కూడిన టోకనైజేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటివి కీలకం కానున్నాయి.

రెండు భిన్న శక్తుల కలయిక
పెకో (Peko) అనే సంస్థ యూఏఈలో వ్యాపారాలకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌లా పనిచేస్తోంది. బ్యాంకులు, ఫ్రీ జోన్లు, ప్రభుత్వ సంస్థలకు ఇన్వాయిసింగ్, పేరోల్, కార్పొరేట్ ట్రావెల్, ఇన్సూరెన్స్ వంటి 50కి పైగా సేవలను అందిస్తోంది.

మరోవైపు కల్ప్ (Culp) అనే సంస్థ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వెనుక ఉండి డిజిటల్ మౌలిక సదుపాయాలను అందిస్తుంది. భాగస్వామ్య కంపెనీలు తమ సొంత బ్రాండ్ పేరుతో అధునాతన డిజిటల్ ఫైనాన్స్ సేవలు అందించేలా బ్యాకెండ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది.

కంపెనీల అధినేతలు ఏమన్నారంటే..?
"మేము పెకోను నిర్మించినప్పుడు, కేవలం వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయడం మాత్రమే మా లక్ష్యం కాదు. వాటి వెనుక ఉన్న మౌలిక సదుపాయాలను సరికొత్తగా పునఃరూపకల్పన చేయడమే మా అసలు లక్ష్యం" అని పెకో ప్రతినిధి అహ్మద్ ఖాన్ అన్నారు. 

"మాది 'ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్' నమూనా. అంటే కేవలం ప్రచారం కోసం ఒక వినియోగదారు బ్రాండ్‌గా నిలవడం మా ఉద్దేశం కాదు. నమ్మకమైన ప్లాట్‌ఫారమ్‌ల వెనుక ఉంటూ శక్తివంతమైన సాంకేతికతను అందించడమే మా లక్ష్యం. రాబోయే దశాబ్దంలో వ్యాపారాలు డబ్బును నిర్వహించే శైలి మారబోతోంది. ఆ మార్పును SMEలు లీడ్ చేసేలా చేయడమే మా ప్లాన్" కల్ప్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు తపన్ సంగల్ పేర్కొన్నారు.

ఒకప్పుడు కేవలం పెద్ద ఆర్థిక సంస్థలకే పరిమితమైన హై-ఎండ్ డిజిటల్ టెక్నాలజీని, సాధారణ వ్యాపారాలు కూడా రోజువారీగా ఉపయోగించుకునేలా చేయడమే ఈ డీల్ ముఖ్య ఉద్దేశం. ఈ భాగస్వామ్యం భవిష్యత్తులో చిన్న, మధ్య తరహా వ్యాపారాల ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడంలో కీలక పాత్ర పోషించనుంది.

Also REad: భారీగా పడిపోయిన బంగారం ధరలు..రూ.3,000 తగ్గిన గోల్డ్

Also Read: భారత్‌లో ప్రజలు ఏడాది పాటు బంగారం కొనకపోతే ఏం జరుగుతుంది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top