హైదరాబాద్లో అక్రమాలకు పాల్పడుతున్న నేరగాళ్లను ఆదుకునేందుకు పోలీసులు ముందడుగు వేశారు.
Hyderabad, Telangana:హైదరాబాద్: హైదరాబాద్లో పెరుగుతున్న నేరాల రేటును దృష్టిలో ఉంచుకుని నగర సీపీ ఆదేశాల మేరకు సౌత్వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ మహ్మద్ అష్ఫాక్ ఈరోజు హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్, ఆసిఫ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్ల జీవితాల్లో మార్పు వచ్చిన తర్వాత వారిపై పెండింగ్లో ఉంటుంది, ప్రభుత్వం వారికి తగిన సహాయం అందించి, వారికి జీవనోపాధి కల్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
ఆగస్టు 7న నవపంచమ యోగం ఎఫెక్ట్.. ఈ 4 రాశుల జాతకం మారబోతోంది.. ఇక కోట్లలో ధన లాభం!
Hyderabad, Telangana:Navpancham Drishti Yoga Effect: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. ప్రతి గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తుంది. గ్రహాల దృష్టి మానవ జీవితంపై విశేష ప్రభావాన్ని చూపుతాయని జ్యోతిష్యలు తెలుపుతున్నారు.. ఈ క్రమంలో రాబోయే ఆగస్టు 7న ఉదయం 8:11 గంటలకు సూర్యుడితో పాటు శని గ్రహాల కలయికతో అత్యంత శక్తివంతమైన నవపంచమ దృష్టి యోగం ఏర్పడబోతోంది. ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి 120 డిగ్రీల కోణంలో రాబోతున్నాయి..
సూర్య, శని గ్రహాల కలయిక ప్రతికూలంగా ప్రభావాన్ని చూపినప్పటికీ.. ఈ నవపంచమ యోగం మాత్రం నాలుగు నిర్దిష్ట రాశుల వారికి అత్యంత శుభఫలితాలను అందిస్తుంది. అంతేకాకుండా బోలెడు ధన లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ యోగం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా.. కొత్త ఆదాయ మార్గాలు కూడా లభిస్తాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఆ అదృష్ట 4 రాశులు ఇవే..
తులా రాశి (Libra)
తులా రాశి వారికి లక్ష్మీదేవి విశేష అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి ఊహించని భారీ లాభాలు వస్తాయి. క్రియేటివ్ రంగాల్లో పనులు చేస్తున్నవారికి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ప్రేమ జీవితంలో బోలెడు లాభాలు కలిగే అవకాశాలు ఉన్నట్లు జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.
వృషభ రాశి (Taurus)
వృషభ రాశి వారికి ఈ నవపంచమ యోగం ప్రభావంతో అద్బుతమైన లాభాలు కలుగుతాయి.. ఈ సమయంలో తప్పకుండా శ్రమకు తగిన ప్రతిఫలం కూడా సులభంగా కలుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఆదాయ వనరులు సమకూరి ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి.. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రేమ బంధం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి.. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
సింహ రాశి (Leo)
సింహ రాశి వారికి ఈ సమయం ఆత్మవిశ్వాసాన్ని, విజయాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. ఆగిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయి. పని ప్రదేశంలో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం లభిస్తుంది. విద్యార్థులకు ఇది అత్యంత అనుకూల సమయంగా భావించవచ్చు. భాగస్వామితో నమ్మకంతో పాటు బంధం మరింత మెరుగుపడుతుంది.. సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల క్లిష్ట పరిస్థితులను కూడా సులువుగా తొలగిపోతాయి..
మకర రాశి (Capricorn)
మకర రాశిలో జన్మించిన వారికి ఈ గ్రహ యోగం అద్భుతమైన ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి విజయం లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఈ సమయంలో సులభంగగా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కుటుంబంలో శాంతి విపరీతంగా లభిస్తుంది. జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా పూర్తి స్థాయిలో లభిస్తుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Shreyas Iyer Dhoni Record: ధోని రికార్డును బ్రేక్ చేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్! టీ20 ఫార్మాట్లో ఒకే ఒక్కడు!
Hyderabad, Telangana:Shreyas Iyer Dhoni Toss Record: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉంది. ప్రస్తుతం జింబాబ్వేతో టీమ్ఇండియా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఇటీవలే జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీమ్ఇండియా ఘనవిజయం సాధించింది. 7 వికెట్లు నష్టపోయి మరో 40 బంతులు మిగిలుండగానే గెలుపును సాధించింది.
అయితే ఇదే టీమ్ ఇంతకు ముందు ఐర్లాండ్తో జరిగిన టీ20 మ్యాచ్ల్లో 0-2, ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో 0-4 తేడాతో వైట్ వాష్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి వరుస ఓటముల తర్వాత భారత్కు ఈ విజయం ఓదార్పును ఇచ్చినట్లు అయ్యింది. అయితే జింబాబ్వేతో మరో రెండు టీ20 మ్యాచ్లు సిరీస్లో భాగంగా ఆడాల్సి ఉంది. అయితే రాబోయే మ్యాచ్ల్లోనూ సత్తా చాటాలని టీమ్ఇండియా భావిస్తోంది.
నిన్న (జూలై 23) జింబాబ్వేతో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టు తరఫున ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. మాదేవెర్ 39 పరుగులు, మరుమణి 27 పరుగులు, ర్యాన్ పెర్ల్ 26 పరుగులు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్, అభిషేక్ శర్మ 1, సూర్యవంశీ 50, ఇషాన్ కిషన్ 35, శ్రేయస్ అయ్యర్ 28*, తిలక్ వర్మ 6* పరుగులతో 7 వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: సూర్యవంశీ
ఆ విషయంలో వైభవ్ సూర్యవంశీ నిన్న 18 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. మిగిలిన తదుపరి రెండు మ్యాచ్లు రేపు (జూలై 25), ఎల్లుండి (జూలై 26) హరారే స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్లో జరుగుతాయి.
ధోనీ రికార్డు బ్రేక్..
భారత జట్టు విజయంతో పాటు, టీ20ఐ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక కొత్త రికార్డు సృష్టించాడు. అంతేకాదు, భారత జట్టు అత్యంత విజయవంతమైన కెప్టెన్గా పరిగణించబడే ఎంఎస్ ధోనీని శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు అధిగమించాడు. దీని గురించి మరిన్ని వివరాలను మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు.
కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తన తొలి 8 టీ20ఐలలో టాస్ గెలిచాడు. అంతేకాకుండా, వరుసగా తన తొలి 8 టీ20ఐలలో టాస్ గెలిచిన తొలి కెప్టెన్గా కూడా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. బహమాస్కు చెందిన గ్రెగొరీ టేలర్ తన తొలి 7 మ్యాచ్లలో 7 సార్లు టాస్ గెలిచాడు.
గతంలో, భారత మాజీ కెప్టెన్ ధోనీ కూడా మే 2010 నుండి ఫిబ్రవరి 2012 వరకు వరుసగా 7 టీ20ఐలలో టాస్ గెలిచాడు. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ దీనిని కూడా అధిగమించాడు. శ్రేయస్ ఐర్లాండ్పై 2, ఇంగ్లాండ్పై 5, జింబాబ్వేపై ఒకటి సహా మొత్తం 8 టీ20ఐలలో టాస్ గెలిచాడు. భారత్, జింబాబ్వేల మధ్య మిగిలిన రెండు మ్యాచ్లు రేపు, ఎల్లుండి సాయంత్రం 4.30 గంటలకు (IST) ప్రారంభమవుతాయి. మీరు వాటిని యునైట్8 స్పోర్ట్స్ టీవీ, ఫ్యాన్కోడ్లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
Also Read: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ షెడ్యూల్ ఖరారు..ఈ సారి ఫైనల్ ఎక్కడ జరుగుతుంది
ALso Read: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్కు జైలు శిక్ష?! ఆ కేసులో అడ్డంగా బుక్కయ్యాడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
రూ.17,999లకే 6500mAh భారీ బ్యాటరీ ఫోన్.. iQOO Z11 Lite 5G ఆఫర్లు, ఫీచర్లు ఇవే!
Hyderabad, Telangana:Iqoo Z11 Lite Price In India: ప్రముఖ ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఐకూ (iQOO) భారత మార్కెట్లోకి మరొ మోస్ట్ పవర్ఫుల్ 5G స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది.. దీనిని కంపెనీ iQOO Z11 Lite 5G పేరుతో ఈ ఫోన్ను అధికారికంగా లాంచ్ చేసింది. తక్కువ ధరలో అద్బుతమైన ఫీచర్లు కోరుకునే వినియోగదారులతో పాటు ముఖ్యంగా విద్యార్థులు, యువతను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ ఫోన్ను తయారు చేసిన్నట్లు తెలుస్తోంది.. 6,500mAh భారీ బ్యాటరీతో పాటు 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా, ప్రీమియం ప్రాసెసర్తో ఈ ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడ మనం తెలుసుకుందాం..
ధర ఇతర వివరాలు..
భారత్లో iQOO Z11 Lite 5G స్మార్ట్ఫోన్ అత్యంత తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది. ఇది ఆఫర్లతో కలిపి రూ.17,999లకే అందుబాటులో ఉంది. రూ.20,000 లోపు బడ్జెట్ విభాగంలో ఉన్న స్మార్ట్ఫోన్లకు ఇది గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ స్మార్ట్ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ (Amazon) నుంచి విక్రయించబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది సోలార్ ఫ్లేమ్ (Solar Flame)తో పాటు మిడ్నైట్ బ్లూ (Midnight Blue) అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి వచ్చిన్నట్లు కంపెనీ వెల్లడించింది..
డిస్ప్లే, డిజైన్ వివరాలు..
ఈ iQOO Z11 Lite 5G ఫోన్ 6.74 అంగుళాల HD+ LCD డిస్ప్లేతో లభిస్తుందని కంపెనీ తెలిపింది.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్నెస్కు సపోర్ట్తో అందుబాటులో ఉంది. దీనివల్ల సూటిగా పడే ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుందని కంపెనీ తెలిపింది.. అలాగే నోటిఫికేషన్ల కోసం ఇందులో డైనమిక్ లైట్ (Dynamic Light) రింగ్ ఫీచర్ను కూడా అందించారు.
ప్రాసెసర్, ఇతర వివరాలు..
ఈ స్మార్ట్ఫోన్లో ఆక్టాకోర్ MediaTek Dimensity 6300 చిప్సెట్ ప్రాసెసర్ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. యాంట్యూట్యూ (AnTuTu) బెంచ్మార్కింగ్ ప్లాట్ఫామ్పై ఈ ఫోన్ 5,79,000 కంటే ఎక్కువ పాయింట్లను సాధించి తన శక్తివంతమైన మొబైల్గా అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది.. మల్టీటాస్కింగ్, గేమ్స్ ఆడటానికి, నిత్యం వినియోగించడానికి ఇది చాలా అద్భుతంగా పని చేస్తుంది..
కెమెరా క్వాలిటీ వివరాలు..
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈ స్మార్ట్ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్ను కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది.. ఇది స్పష్టమైన, వివరాలతో కూడిన ఫోటోలను అందించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం.. ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించిన్నట్లు తెలుస్తోంది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
6500mAh భారీ బ్యాటరీ, ఛార్జింగ్ సపోర్ట్..
ఈ ఫోన్లోని అతిపెద్ద ప్లస్ పాయింట్.. దీని శక్తివంతమైన 6,500mAh బ్యాటరీగా భావించవచ్చు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 20 గంటల సోషల్ మీడియా స్క్రోలింగ్ లేదా 80 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, ఇది 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్తో సుమారు 8 గంటల టాక్టైమ్ లేదా 7.2 గంటల వీడియో ప్లేబ్యాక్ సపోర్ట్ను కూడా అందిస్తుందని కంపెనీ తెలిపింది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ఫ్లిప్కార్ట్లో ఊహించని ఆఫర్.. ఛీప్ ధరకే Samsung Galaxy S25 5G ఫోన్!
Hyderabad, Telangana:Samsung Galaxy S25 5g Price Cut: ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ సొంతం చేసుకోవాలనుకునే టెక్ ప్రియులకు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ అదిరిపోయే శుభవార్తను అందించింది. సాంసంగ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మార్కెట్లోకి తీసుకొచ్చిన సాంసంగ్ గెలాక్సీ S25 5G (Samsung Galaxy S25 5G) స్మార్ట్ఫోన్పై ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయినప్పటి.. నుంచి ఇప్పటివరకు ఇదే అత్యంత తక్కువ ధరకు లభించడం విశేషం.. అయితే, బ్యాంక్ ఆఫర్లతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్లను వినియోగిస్తే.. ఎప్పుడు పొందలేనంత చీప్ ధరకే సొంతం చేసుకోవచ్చు..
ఆఫర్లు, డిస్కౌంట్ వివరాలు..
సాంసంగ్ గెలాక్సీ S25 సాధారణంగా రూ.74,999 ధరతో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక సేల్లో ఫ్లిప్కార్ట్ భారీ ఫ్లాట్ డిస్కౌంట్ను అందిస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి చాలా చీప్ ధరకే సొంతం చేసుకోవచ్చు..
అలాగే దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. కొన్ని బ్యాంక్లకు సంబంధించిన క్రెడిట్తో పాటు డెబిట్ కార్డ్ల (SBI, HDFC, Flipkart Axis కార్డ్లు) ద్వారా కొనుగోలు చేస్తే తక్షణమే వేల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.. అలాగే మీ వద్ద ఉన్న పాత స్మార్ట్ఫోన్ను ఎక్స్ఛేంజ్ చేయడం వల్ల అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. ఇవే కాకుండా బడ్జెట్ పరంగా ఒకేసారి చెల్లించలేని వారి కోసం నెలకు తక్కువ వాయిదాలతో కొనుగోలు చేసేందుకు వీలుగా నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది..
గెలాక్సీ S25 ప్రధాన ఫీచర్లు..
ఇది 6.2 అంగుళాల ఫుల్ HD+ డైనమిక్ AMOLED 2X డిస్ప్లే కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, అత్యధిక బ్రైట్నెస్ను అందిస్తుంది. ఫోన్ సైజ్ చేతిలో పట్టుకోవడానికి చాలా కాంపాక్ట్గా, అత్యంత ప్రీమియమ్గా ఉంటుంది. అత్యంత పవర్ఫుల్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ (Snapdragon 8 Elite for Galaxy) ప్రొసెసర్తో ఇది పనిచేస్తుంది. హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్ అనుభవం ఇందులో అద్భుతంగా ఉంటుంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ఈ ఫోన్ వెనుక వైపు 50MP ప్రధాన కెమెరా (OIS)తో పాటు 12MP ఆల్ట్రా-వైడ్, 3x ఆప్టికల్ జూమ్తో 10MP టెలిఫోటో కెమెరాలను కలిగి ఉంటుంది.. సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఇందులో చాలా ప్రత్యేమైన లైవ్ ట్రాన్స్లేషన్, సర్కిల్ టు సెర్చ్, లైవ్ నోట్స్తో పాటు AI ఫోటో ఎడిటింగ్ వంటి అనేక అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సాంసంగ్ ఈ ఫోన్కు ఏకంగా 7 సంవత్సరాల పాటు Android OSతో పాటు సెక్యూరిటీ అప్డేట్ల హామీ ఇస్తోంది. ఇది శక్తివంతమైన 4000mAh బ్యాటరీతో పాటు వేగవంతమైన ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్, IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ప్రొటక్షన్ను అందిస్తుంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ఈ రోజు నుంచి బుధ ఎఫెక్ట్.. ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం.. ధన లాభం ఖాయం!
Hyderabad, Telangana:Mercury Transit Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహరాజుగా బుధుడిని చెప్పుకుంటూ ఉంటారు. వాక్చాతుర్యం, వ్యాపారానికి అధిపతిగా భావించే బుధ గ్రహం తన సంచారంలో ఒక పెద్ద మార్పుకు సిద్ధమవుతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. జూలై 24 బుధ గ్రహం వక్రగతి నుంచి నేరుగా సంచారం దశలోకి రాబోతోంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏదైనా కీలక గ్రహం వక్ర స్థితి నుంచి సక్రమార్గంలోకి వెళ్లినప్పుడు దాని ప్రభావం ద్వాదశ రాశుల జీవితాలపై నేరుగా పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
బుధ గ్రహం వక్రంలో ఉన్న సమయంలో చాలామంది కమ్యూనికేషన్ సమస్యలతో పాటు వ్యాపారంలో అడ్డంకులు, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, మానసిక అయోమయానికి గురవుతూ ఉంటాడు.. అయితే, జూలై 24 నుంచి బుధ గ్రహం సక్రమ మార్గంలోకి.. రావడంతో గందరగోళ పరిస్థితులు పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. ముఖ్యంగా స్పష్టత, సరైన నిర్ణయాధికార శక్తి పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పెండింగ్లో ఉన్న పనులు సానుకూల ఫలితాలను కూడా అందిస్తాయి.
అదృష్ట రాశులు ఇవే..
సింహ రాశి (Leo)
సింహ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వృత్తిపరంగా మీరు తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలు, చేసే పెట్టుబడులు భారీ లాభాలను తెచ్చిపెడతాయి.. కొత్తగా చేసుకునే ఒప్పందాలు (Deals) వ్యాపారంలో విశేషమైన ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి.
మిథున రాశి (Gemini)
బుధుడి సక్రమ మార్గంలోకి వెళ్లడం వల్ల మిథున రాశి వారికి అత్యంత అనుకూల ఫలితాలను అందిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి అనూహ్యమైన అభివృద్ధి కనిపిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొత్త ఆస్తి, భూమి లేదా సొంత వాహనం కొనుగోలు చేయడానికి ఇది సువర్ణ సమయంగా భావించవచ్చు. ఆర్థిక నిల్వలు గణనీయంగా పెరుగుతాయి..
కన్యా రాశి (Virgo)
కన్యా రాశి జాతకులకు సమాజంలో గౌరవ మర్యాదలు, ప్రశంసలు ఊహించని స్థాయిలో లభిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి (Promotion) లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆఫీసులో కీలక బాధ్యతలు చేపట్టడం వల్ల మీ గుర్తింపు మరింత ఊహించని స్థాయిలో పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మేష రాశి (Aries)
మేష రాశి వారికి ఈ సమయం ఆత్మవిశ్వాసాన్ని ఊహించని స్థాయిలో అందిస్తుంది. మీ సంభాషణ శైలి అందరినీ ఆకట్టుకుంటుంది.. సమాజంలో మీ మాటలకు విలువ విపరీతంగా పెరుగుతుంది. అయితే, ఏ విషయంలోనూ తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా.. కాస్త ఓర్పు వహించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
ఈ రోజే మృగశిరలోకి కుజుడు.. ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని రాజయోగం!
Hyderabad, Telangana:Mars Transit In Mrigashira Nakshatra 2026: జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని మనందరికీ తెలుసు. గ్రహాల సేనాపతిగా పరిగణించే కుజుడు ధైర్య సాహసాలు, శక్తి, ఆత్మవిశ్వాసాలకు సంకేతంగా పరిగణిస్తారు.. అందుకే కుజ గ్రహ సంచారంలో లేదా నక్షత్ర మార్పులో వచ్చే ఎలాంటి మార్పులైన.. దాని ప్రభావం ద్వాదశ రాశుల జీవితాలపై స్పష్టంగా కనిపిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. జులై 24న కుజ గ్రహం రోహిణి నక్షత్రం నుంచి తన సొంత నక్షత్రమైన మృగశిర నక్షత్రంలోకి సంచారం చేసింది.. ఈ నక్షత్ర సంచారం రాబోయే 20 రోజుల పాటు కొనసాగనుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మృగశిర నక్షత్ర విశిష్టత..
జ్యోతిష్య ప్రకారం.. 27 నక్షత్రాల్లో మృగశిర నక్షత్రం 5వ స్థానంలో ఉంటుంది.. మృగశిర నక్షత్రం కుజుడి శక్తికి, చంద్రుడి శాంత స్వభావానికి అద్భుతమైన ప్రభావాన్ని అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. దీని కారణంగా కుజుడు తన సొంత నక్షత్రంలో ప్రవేశించడం వల్ల అత్యంత శుభయోగాలు ఏర్పడతాయి.. ఈ ప్రభావం వల్ల ముఖ్యంగా 3 రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి.. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా ఆర్థికంగా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
అదృష్టం పొందే రాశులు ఇవే..
కర్కాటక రాశి (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ సంచార సమయం ఎంతో శ్రేయస్స్కరంగా ఉంటుంది.. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఊహించని ధన లాభాలు కూడా కలుగుతాయి. నూతన ఆదాయ మార్గాలు కూడా లభిస్తాయి. విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారాలు విస్తరించాలనుకునేవారికి ఈ సమయం ఎంతో చాలా శుభప్రదంగా ఉంటుంది. పాత అప్పులు తీరిపోయి.. మనశ్శాంతి లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మేష రాశి (Aries)
కుజుడి నక్షత్ర సంచారంతో మేష రాశి వారికి ఎన్నో అనుకూలమైన మార్పులు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలతో పాటు ప్రమోషన్ లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా కనిపిస్తుంది.. ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో సంతోషకరమైన, శాంతియుత వాతావరణం నెలకొంటుంది.
వృశ్చిక రాశి (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు నుంచే బంగారు సమయం మొదలవుతుంది.. కుటుంబంలో ఉన్న సుదీర్ఘ వివాదాలు, గొడవలు పరిష్కారమవుతాయి. అంతేకాకుండా కొత్త ఉద్యోగ అవకాశాలు లభించడమే కాకుండా ఆఫీసులో బాస్ సపోర్ట్ కూడా లభించి ప్రమోషన్కు సిఫార్సు అయ్యే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. నిలిచిపోయిన బకాయిలు తిరిగి చేతికి అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Sonam Wangchuk: ఆమరణ దీక్ష విరమించిన సోనమ్ వాంగ్చుక్..
Hyderabad, Telangana:Sonam Wangchuk Latest News: ప్రముఖ సామాజిక వేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా, సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్లతో జరిగిన కీలక సమావేశం అనంతరం ఆయన తన దీక్షను విరమించారు. మంత్రులు స్వయంగా నిమ్మరసం అందించి వాంగ్చుక్తో దీక్షను విరమింపజేశారు.
అసలేం జరిగింది?
పరీక్షల లీకేజీల అంశంపై కేంద్ర ప్రభుత్వ జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ.. సోనమ్ వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. దీక్ష క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనను ప్రత్యేక చికిత్స నిమిత్తం గుర్గావ్లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాంగ్చుక్ను కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు కలిసి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. వాంగ్చుక్ లేవనెత్తిన ప్రధాన సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని.. తగిన చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రులు స్పష్టమైన హామీ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది.. దేశానికి మీ సేవలు ఇంకా చాలా అవసరమని.. యువత భవిష్యత్తు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రులు ఈ సందర్భంగా హామీ ఇచ్చిన్నట్లు సమాచారం..

శాంతియుత చర్చలకు మార్గం సుగమం..
కేంద్ర మంత్రుల నుంచి సానుకూలమైన స్పందన లభించడంతో పాటు పలువురు పార్లమెంట్ సభ్యుల విజ్ఞప్తి మేరకు తాను దీక్ష విరమించాలని నిర్ణయించుకున్నట్లు సోనమ్ వాంగ్చుక్ తెలిపారు. విద్యార్థులు, యువత ఆందోళనలను విరమించి.. ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వంతో జరిగిన ఈ చర్చలు సానుకూల వాతావరణంలో ముగియడంతో దేశవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వంతో కలిసి శాంతియుత మార్గంలో పరిష్కరిస్తారని వాంగ్చుక్ తెలిపిన్నట్లు తెలుస్తోంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
తిరుమలలో మైసూర్ రాజకుటుంబం.. ఇతర ప్రముఖులు
Dharmavaram, Andhra Pradesh:Mysore Maharaja Family Visits To Tirumala Temple Watch VideoKTR Birthday: అనుకున్నది ఏదీ సాధించలే.. కానీ కేటీఆర్ పేరు తెలంగాణకు ఓ బ్రాండ్
Baddipadaga, Telangana:KTR Birthday: అభివృద్ధికి దిక్సూచిగా.. చిరునామాగా.. పర్యాయపదంగా కేటీఆర్ నిలుస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ యువతరానికి కేటీఆర్ అనే పేరు ఒక బ్రాండ్గా మారింది. ముఖ్యంగా యువత కేటీఆర్ను అమితంగా అభిమానిస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా కేటీఆర్ను తమ తరానికి ఒక ఐకాన్గా భావిస్తున్నారు. కల్వకుంట్ల తారక రామారావు కన్నా కేటీఆర్గా పేరు మార్మోగుతోంది. తండ్రికి తగ్గ వారసుడిగా.. విజయవంతమైన కేటీఆర్ తెలంగాణకు తర్వాత కాబోయే నాయకుడిగా యువత భావిస్తోంది.
గతంలో సంపన్న, మధ్యతరగతి ప్రజల ఆదరాభిమానం పొందిన కేటీఆర్ ఇప్పుడు మాస్ ప్రజల్లో కూడా గుర్తింపు పొందుతున్నారు. ఉద్యమంలో ఒక కేటీఆర్ను... మంత్రిగా ఒక కోణం.. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మరో కోణంలో ప్రజలు చూస్తున్నారు. కేసీఆర్ నోట్లో నుంచి ఊడిపడినట్టు కేటీఆర్ వ్యవహార శైలి.. మాటతీరు ఉంటుంది. కేసీఆర్ మాదిరి ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, తెలుగు భాషల్లో అదరగొడతాడు. సామెతలు, కథలు, పంచ్లు, చలోక్తులు, జోకులు వేయడంలో కేసీఆర్ మాదిరి కేటీఆర్ ఉన్నాడు.
వాస్తవంగా కేటీఆర్కు రాజకీయాలు అనేవి అంతగా ఆసక్తి లేవు. కరీంనగర్ ఉప ఎన్నిక సందర్భంగా తండ్రి కేసీఆర్కు తోడుగా ఉందామని తట్టాబుట్టా సర్దేసుకుని అమెరికా నుంచి తెలంగాణకు వచ్చాడు. ఈ విషయం కేసీఆర్కు కూడా తెలియదు. తర్వాత చెబితే కేసీఆర్ సర్లే అని వెంట తిరిగాడు. అయితే అంతకుముందు చదువు కూడా కేటీఆర్ ఇష్టపడి.. తాను చదవాలనుకున్నది చదవలేదు. అమ్మ డాక్టర్ కావాలని.. నాన్న ఐఏఎస్ కావాలని కలలు కంటే కేటీఆర్ మాత్రం విదేశాల్లో ఓ ప్రైవేటు ఉద్యోగం చేశారు. ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ ఇలా ఏ చదువు కూడా తాను అనుకున్నది కేటీఆర్ చదవలేదు.
కానీ కష్ట సమయంలో తండ్రి కేసీఆర్కు అండగా నిలవడమే కేటీఆర్ జీవితంలో అతి పెద్ద టర్నింగ్ పాయింట్. అప్పటి నుంచి నేటి వరకు రాజకీయాల్లో కేటీఆర్ కొనసాగుతున్నాడు. గతంలో తండ్రి వెనుకాల ఉండగా.. కొన్నాళ్లకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఓటమన్నేది లేకుండా దూసుకెళ్తున్నాడు. సిరిసిల్ల నుంచి వరుసగా ఓటమి లేకుండా గెలుస్తున్నాడు. మంత్రిగా.. బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా విజయవంతంగా పార్టీని నడుపుతున్న కేటీఆర్ కుటుంబానికి మాత్రం సమయం ఇవ్వడం లేదు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వందకు ఒకటి తక్కువ సీటు అంటే 99 కార్పొరేటర్లు సీట్లు గెలిచిన తర్వాత కేటీఆర్కు యమ క్రేజ్ పెరిగింది. నాడు కేసీఆర్కు కొడుకు గిఫ్ట్ అని గుర్తింపు లభించింది. నాటి నుంచి ఎన్నికలకు వెళ్తున్నా ప్రతికూల ఫలితాలు ఎదురవుతున్నాయి. దీనికి తోడు అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా ఏవీ వచ్చినా ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో కేటీఆర్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ వాటన్నిటిని తట్టుకుని నిలబడి రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కేటీఆర్ అడుగులు వేస్తున్నాడు. ఇక తెలంగాణలో మరోసారి తన తండ్రి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయాలనే సంకల్పంతో కేటీఆర్ పని చేస్తున్నాడు.
ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. 3 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, నేతన్న భరోసా పథకానికి గ్రీన్ సిగ్నల్
Amaravathi, Andhra Pradesh:Nethanna Bharosa Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ శుభవార్త వినిపించింది. పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేయాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏపీ మంత్రివర్గ సమావేశం పచ్చజెండా ఊపింది. చేనేత కార్మికులకు 'నేతన్న భరోసా' కింద రూ.25 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు ఏపీ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వీటితోపాటు గోదావరి పుష్కరాలు, భోగాపురం విమానాశ్రయం ప్రారంభం తదితర అంశాలపై మంత్రిమండలి కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది.
అమరావతిలోని సచివాలయంలో గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశం పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. కొన్ని గంటలపాటు చర్చించిన మంత్రిమండలి కొన్ని కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. ఈ సందర్భంగా మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రివర్గంలో సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రధాని మోదీ ఎయిర్పోర్టును ప్రారంభిస్తుండడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు, గోదావరి పుష్కరాలపై ఏపీ మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మంత్రివర్గ నిర్ణయాలు
==> 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మంత్రిమండలి పచ్చజెండా ఊపింది.
==> చేనేత కార్మికులకు 'నేతన్న భరోసా' కింద రూ.25 వేలు చొప్పున ఆర్థిక సహాయం
==> బాపట్లలో వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు
==> పుష్కరాలకు భద్రత, బందోబస్తుకు రూ.50 కోట్లు మంజూరు
==> ఏపీ మార్క్ఫెడ్కు సెంట్రల్ బ్యాంక్ నుంచి ఇచ్చే రూ.300 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీకి మంత్రిమండలి అంగీకారం
పొగాకు రైతుల సమస్యపై చర్చ
పొగాకు రైతులకు మద్దతుగా మాజీ సీఎం వైఎస్ జగన్ పోరాటం చేసేందుకు సిద్ధమవగా అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం స్పందించింది. పొగాకు రైతులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. పొగాకు రైతుల సమస్యల అంశంలో 3 ప్రతిపాదనలపై ఏపీ మంత్రివర్గం చర్చించింది. పొగాకు రైతులకు రూ.60 వేలు వడ్డీలేని రుణం ఇవ్వాలని మంత్రివర్గం ప్రతిపాదన చేసింది. పొగాకు బోర్డు నుంచి వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇచ్చేలా రెండో ప్రతిపాదన చేయగా.. గ్రేడ్ల విషయంపైనా ఆలోచించాలని మరో ప్రతిపాదన చేసింది.
మంత్రులకు కీలక ఆదేశాలు
ఎక్కడ ఏ సమస్య తలెత్తినా ఇన్ఛార్జ్ మంత్రులు చొరవ తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. క్షేత్రస్థాయికి వెళ్లి సమస్య పరిష్కరించే వరకు ఇన్ఛార్జ్ మంత్రులదే బాధ్యత అని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర 6 జిల్లాల్లో పింఛన్ల పంపిణీ ఒకరోజు ముందే పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. పింఛన్ల పంపిణీ పూర్తిచేసి ప్రధాని మోదీ భోగాపురం పర్యటన కార్యక్రమంలో నిమగ్నం కావాలని మంత్రులకు సీఎం చంద్రబాబు చెప్పారు.
Riya Yadav Protest: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా ఈ మోడల్ ఎవరు?
Mumbai, Maharashtra:Riya Yadav Police Van: దేశవ్యాప్తంగా కలకలం రేపిన 'నీట్ (NEET) ప్రశ్నపత్రం లీక్' వ్యవహారంపై ఢిల్లీ నుంచి ముంబై వరకు నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఈ క్రమంలో ముంబైలోని ప్రముఖ శివాజీ పార్క్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. విద్యార్థుల కోసం ధైర్యంగా పోలీస్ వ్యాన్ను ఎదుర్కొన్న ఓ యువతి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారి, దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఆ ధైర్యవంతురాలైన యువతి ఎవరు? అక్కడ ఏం జరిగింది? అనే వివరాలు ఇక్కడ చూద్దాం.
అసలు ఏం జరిగింది?
గత బుధవారం, ముంబైలోని దాదర్ నుండి శివాజీ పార్కుకు వెళ్తున్న రియా అహిర్, దారిలో అరెస్టు చేయబడిన నిరసనకారులతో (విద్యార్థులతో) వెళ్తున్న ఒక పోలీసు వ్యాన్ను గమనించారు. వెంటనే ఆమె ఏమాత్రం సంకోచించకుండా, ఆ పోలీస్ వ్యాన్ ముందు నిలబడి దానిని అడ్డుకున్నారు.
పోలీసులు ఎంత చెప్పినా ఆమె వెనక్కి తగ్గలేదు. అరెస్టు చేసిన విద్యార్థులను ఆ తర్వాతి సమయంలో విడుదల చేస్తామని అధికారులు చెప్పినప్పటికీ, ఆమె ఒప్పుకోలేదు. విద్యార్థులను అక్కడికక్కడే వెంటనే విడుదల చేయాలని ఖచ్చితమైన పట్టుబట్టారు. రియా చూపిన దృఢమైన వైఖరి, ధైర్యానికి తలొగ్గిన పోలీసులు చివరకు నిరసనకారులను సెట్స్ నుంచే విడుదల చేశారు.
రియా అహిర్ (రియా యాదవ్) ఎవరు?
రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో నేషనల్ సెన్సేషన్గా మారిన రియా అహిర్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈమె పూర్తి పేరు రియా యాదవ్, వయసు 27 సంవత్సరాలు. వృత్తి రీత్యా ఈమె మోడల్, నటిగానే కాకుండా వ్యాపారవేత్తగా రాణిస్తుంది. రియా 'రియాసత్' పేరుతో సొంత క్లాథింగ్/దుస్తుల బ్రాండ్ను నడుపుతున్నారు. ఇటీవలే వైరల్ అయిన 'దిల్బరా' మ్యూజిక్ ఆల్బమ్లో కూడా ఆమె నటించారు. ఈమెకు ఇన్స్టాగ్రామ్లో 1.10 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. చిత్ర పరిశ్రమలోని ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్, నటుడు అభిషేక్ బానర్జీ వంటి వారితో ఈమెకు మంచి సంబంధాలు ఉన్నాయి.
వెల్లువెత్తుతున్న ప్రశంసలు
పోలీస్ వ్యాన్ను అడ్డుకున్న ఉత్కంఠభరిత వీడియో నెట్లో వైరల్ అవ్వడంతో, ఆమె సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని నెటిజన్లు విశేషంగా కొనియాడుతున్నారు. బాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు జోయా అక్తర్ సహా పలువురు ప్రముఖులు రియా ఫోటోను తమ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఆమె చూపిన తెగువను బహిరంగంగా అభినందించారు.
Also REad; "హీరోయిన్ నడుముని ఇప్పుడు ఎవ్వరూ చూడడం లేదు".. బాలీవుడ్పై కాజల్ సంచలన వ్యాఖ్యలు!
Also Read: 'ఓం భీమ్ బుష్' హీరోయిన్ ఆయేషా ఖాన్ అరెస్ట్..నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లిన ముంబై పోలీసులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ind vs Zim: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. వైభవ్ సూర్యవంశీ తొలి అంతర్జాతీయ అర్ధ సెంచరీ
Harare, Harare Province:Vaibhav Sooryavanshi: టీ20 ప్రపంచకప్ తర్వాత జరిగిన ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్లను కోల్పోయి ఘోర పరాభవం ఎదుర్కొన్న టీమిండియా తొలి విజయాన్ని అందుకుంది. జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత జట్టు ఆల్రౌండ్ ప్రదర్శన చేసి మ్యాచ్ను సొంతం చేసుకుంది. అంతర్జాతీయ మ్యాచ్లో తొలి అర్థ సెంచరీని సాధించిన వైభవ్ సూర్యవంశీ జట్టుకు తొలి విజయాన్ని అందుకుంది. బౌలింగ్, బ్యాటింగ్లో అదరగొట్టిన భారత్ ప్రత్యర్థిపై పైచేయి సాధించింది.
మాదాపూర్లోని పాన్ షాప్లో గంజాయి దందా..
Hyderabad, Telangana:Hyderabad Paan Shop News: మీటా పాన్, సాదా పాన్, కలకత్తా పాన్, జర్థా పాన్.. ఇలా పాన్ ప్రియులు తమకు నచ్చిన పాన్లను ఆస్వాదించడానికి పాన్ షాప్ల ముందు క్యూ కడుతూ ఉంటారు. మరికొందరు సిగరెట్లు, ఇతర పదార్థాల కోసం వెళ్లడం చూస్తుంటాం.. కానీ.. ఐటీ కారిడార్గా పేరున్న హైదరాబాద్లోని మాదాపూర్ ప్రాంతంలో ఉన్న ఓ పాన్ షాపునకు వెళ్తే మాత్రం ప్రత్యేకమైన మత్తు పదార్థాలు లభిస్తాట.. పాన్ మసాలాల చాటున ఏకంగా గంజాయి విక్రయాలు చేస్తున్న ఓ కేటుగాడిని ఎక్సైజ్ ఎస్టీఎఫ్ అధికారులు పట్టుకున్నారు. పాన్ షాప్ను అడ్డాగా మార్చుకుని సాగిస్తున్న ఈ అక్రమ దందాను చూసి అధికారులే విస్తుపోయారు..
మాదాపూర్ పరిధిలోని చందానాయక్ నగర్ రోడ్డులో ఉన్న ఓ పాన్ షాప్ కేంద్రంగా అక్రమంగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం ఎస్టీఎఫ్ (STF) ఎక్సైజ్ అధికారులకు అందింది. సమాచారం అందడమే ఆలస్యం ఎస్టీఎఫ్ డీ-టీమ్ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో సిబ్బంది సత్వరమే స్పందించి సదరు పాన్ షాప్పై ఆకస్మిక దాడి నిర్వహించారు. అధికారులు షాప్ను చుట్టుముట్టి తనిఖీలు చేయగా.. అమ్మడానికి సిద్ధంగా ఉంచిన 500 గ్రాముల గంజాయి దొరికింది.. దాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈజీ మనీ కోసం షార్ట్కట్ దారి..
తక్కువ శ్రమతో త్వరగా డబ్బు సంపాదించాలనే ఈజీ మనీ ఆశతోనే నిర్వాహకుడు ఈ అక్రమ దందాకు తెరలేపినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం... నిందితుడు బయటి వ్యక్తుల నుంచి గంజాయిని పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుని.. తన షాప్లోనే 10 గ్రాముల చొప్పున చిన్న చిన్న ప్యాకెట్లుగా విడగొట్టేవాడని.. ఒక్కో 10 గ్రాముల గంజాయి ప్యాకెట్ను రూ. 300కు కొనుగోలు చేసి.. దాన్ని మత్తుకు బానిసలైన వినియోగదారులకు రూ.500 చొప్పున విక్రయించేవాడు. అంటే ఒక్కో ప్యాకెట్పై ఏకంగా రూ.200 లాభం అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నాడన్నారు.
Read more: Secunderabad: అయ్యో... సికింద్రాబాద్లో ఘోరం.. అత్తను ఈడ్చుకుంటూ కత్తితో దాడి చేసిన కోడలు.. వీడియో..
నిందితుడి అరెస్ట్..
పాన్ షాప్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తున్న మాలిక్ ఆస్లామ్ టామ్ బోలీ అనే వ్యక్తిని ఎస్టీఎఫ్ బృందం అక్కడికక్కడే అరెస్ట్ చేసింది.. స్వాధీనం చేసుకున్న 500 గ్రాముల గంజాయితో పాటు నిందితుడిని తదుపరి చట్టపరమైన విచారణ.. కఠిన చర్యల నిమిత్తం మాదాపూర్ ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించారు. నగరంలో చట్టవిరుద్ధంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాలను విక్రయించినా.. రవాణా చేసినా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని.. పాన్ షాప్లు లేదా ఇతర వ్యాపారాలను అడ్డం పెట్టుకుని.. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.
Read more: Secunderabad: అయ్యో... సికింద్రాబాద్లో ఘోరం.. అత్తను ఈడ్చుకుంటూ కత్తితో దాడి చేసిన కోడలు.. వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Hindu Temple Beliefs: నాన్వెజ్ తిని ఆలయానికి వెళ్తున్నారా? హిందూ ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెబుతోంది?
Hyderabad, Telangana:Eating Non Veg Before Temple: హిందూ సంప్రదాయంలో దేవాలయం అత్యంత పవిత్రమైన స్థలం. ఆలయ దర్శనానికి వెళ్లే ముందు స్నానం చేయడం, శుభ్రమైన దుస్తులు ధరించడంతో పాటు సాత్విక ఆహారం తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా మాంసాహారం తిని దేవుడి దర్శనానికి వెళ్లకూడదనే నియమం వెనుక ఉన్న ఆధ్యాత్మిక, మానసిక, శారీరక కారణాలను కొందరు జ్యోతిష్కులు చెబుతున్నారు.
ఆహార రకాలు, తామసిక ఆహార ప్రభావం
హిందూ శాస్త్రాల ప్రకారం మనం తినే ఆహారాన్ని మూడు రకాలుగా విభజిస్తారు. సాత్విక ఆహారం, రాజసిక ఆహారం, తామసిక ఆహారం వంటి రకాలుగా విభజించారు. అందులో సాత్విక ఆహారంలో పండ్లు, పాలు, కూరగాయలు (మనస్సుకు ప్రశాంతతనిస్తాయి) వంటివి వస్తాయి. అలాగే రాజసిక ఆహారంలో మసాలాలు, ఘాటైన ఆహారాలు ఉండగా.. మాంసాహారం, మద్యం మొదలైనవి తామసిక ఆహారం లెక్కలోకి వస్తాయి.
మాంసాహారం తామసిక గుణాన్ని పెంచుతుంది. ఇది తీసుకోవడం వల్ల మనస్సులో బద్ధకం, అలసట, కోపం, అసహనం వంటి భావాలు పెరుగుతాయి. ఆలయం అనేది సానుకూల (పాజిటివ్) శక్తి నిండిన ప్రదేశం కాబట్టి, ప్రశాంతమైన మనస్సుతో ఉన్నప్పుడే అక్కడ ఆధ్యాత్మిక అనుభూతి లభిస్తుంది.
జీర్ణక్రియ, శారీరక చురుకుదనం
మాంసాహారం జీర్ణం కావడానికి శరీరానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల శరీరం బరువుగా అనిపించి, నిద్రమత్తు లేదా అలసట కలుగుతుంది. గుడిలో ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయడానికి లేదా ప్రార్థనలు చేయడానికి శరీరం తేలికగా ఉండటం అవసరం. శాకాహారం తేలికగా జీర్ణమై శరీరాన్ని, మనస్సును చురుగ్గా ఉంచుతుంది.
'అహింసా పరమో ధర్మః'..భక్తి సిద్ధాంతం
హిందూ ధర్మంలో జీవదయ, కరుణలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మాంసాహారం హింసతో కూడుకున్నది కాబట్టి, దేవుని సన్నిధికి వెళ్లేముందు దానికి దూరంగా ఉండటం ద్వారా జీవుల పట్ల కరుణను, భక్తిలో పవిత్రతను కాపాడుకోవచ్చని భావిస్తారు.
గర్భగుడిలోని ఆధ్యాత్మిక శక్తిని పొందడం
ఆలయ గర్భగుడిలో సానుకూల ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ శక్తిని పూర్తిగా అనుభవించాలంటే.. శరీరం (పరిశుభ్రత, సాత్విక ఆహారం), మనస్సు (కోపం, అసూయ వంటి ప్రతికూల ఆలోచనలు లేకుండా ఉండటం) రెండు స్వచ్ఛంగా ఉండాలని పెద్దలు సూచిస్తారు.
ఈ నియమాలు ప్రధానంగా హిందూ మతంలోని విశ్వాసాలు, కుటుంబ సంప్రదాయాలపై ఆధారపడి ఉంటాయి. వీటిని ఖచ్చితంగా పాటించడం లేదా తమ సంప్రదాయాల ప్రకారం నడుచుకోవడం అనేది భక్తుల నమ్మకాన్ని బట్టి ఉంటుంది. ఏదేమైనా, శరీర పరిశుభ్రతతో పాటు మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని, పవిత్ర భావనతో దేవుడిని దర్శించుకోవడమే అంతిమ లక్ష్యం.
Also Read: ఆగస్టులో ఈ 5 రాశుల వారికి రాజయోగం.. ధన వర్షంతో పాటు ఊహించని అదృష్టం!
Also Read: శ్రావణ మాసంలో శని దేవుడి కీలక మార్పు.. ఈ రాశుల వారికి డిసెంబర్ వరకు హెచ్చరిక!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
కిచెన్ స్పాంజ్తో ప్రాణాంతక వ్యాధులు.. క్యాన్సర్, లివర్ ఇన్ఫెక్షన్ల ముప్పు..
Hyderabad, Telangana:Kitchen Sponge Health Risks: ఇంట్లో వంట చేయడం ఎంత ముఖ్యమో.. వంట పాత్రలను శుభ్రంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం.. అయితే, పాత్రలను తోమడానికి మీరు వాడే కిచెన్ స్పాంజ్ (Kitchen Sponge) మీ ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతోందని మీకు తెలుసా?. అవును మీరు చదువుతుంది నిజమే.. రోజూ మనం వాడే ఈ చిన్న స్పాంజ్ వల్ల ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ప్రముఖ వైద్యులు తెలుపుతున్నారు.
టాయిలెట్ సీట్ కంటే 200 రెట్లు ప్రమాదకరం..
డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కిచెన్ స్పాంజ్లో ఉండే బాక్టీరియా, క్రిములు టాయిలెట్ సీట్ కంటే దాదాపు 200 రెట్లు ఎక్కువగా ఉంటాయట.. నిత్యం నీటితో నాని.. తేమగా ఉండే స్పాంజ్ వాతావరణం మైక్రోస్కోపిక్ క్రిములు వేగంగా పెరగడానికి అత్యంత అనుకూలమైనదిగా మారుతుంది.. మనం పాత్రలు కడిగేటప్పుడు ఈ క్రిములు గిన్నెలకు, ప్లేట్లకు అంటుకుంటాయి. ఆ తర్వాత మనం అదే పాత్రల్లో ఆహారం తిన్నప్పుడు.. ఆ క్రిములు నేరుగా కడుపులోకి చేరుతూ ఉంటాయి.
క్యాన్సర్, లివర్ సమస్యలు..
ఈ బాక్టీరియా శరీరంలోకి చేరడం వల్ల కేవలం సాధారణ కడుపునొప్పి, విరేచనాలు, ఇన్ఫెక్షన్లు మాత్రమే కాకుండా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కడుపు, జీర్ణశయాంతర ఇన్ఫెక్షన్లు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆహారం ద్వారా లోపలికి వెళ్లే బాక్టీరియా జీర్ణవ్యవస్థను పాడుచేస్తుందని వారు చెబుతున్నారు. దీర్ఘకాలికంగా ఈ క్రిములు శరీరంలోకి చేరడం వల్ల కాలేయం (Liver)పై తీవ్ర ప్రభావం పడి లివర్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. నిరంతరం హానికరమైన మైక్రో-ఆర్గానిజమ్స్ శరీరంలోకి వెళ్లడం వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Also Read: కొత్తిమీర కాడలు పారేస్తున్నారా? వంటల్లో ఈ 5 అద్భుతమైన మార్గాల్లో వాడేయండి!
ఈ హెల్త్ రిస్క్ నుంచి తప్పించుకోవడానికి నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు.. కిచెన్ స్పాంజ్ను నెలల తరబడి వాడకూడదని వారు తెలుపుతున్నారు. ప్రతి వారం కచ్చితంగా కొత్త స్పాంజ్ను వినియోగించాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు.. సింథటిక్ స్పాంజ్ కంటే పురాతన కాలం నుంచి వాడుతున్న కొబ్బరి పీచు (Coconut Coir) చాలా మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది సహజ సిద్ధమైనది, తేమను త్వరగా పీల్చుకోదు.. క్రిములు చేరే అవకాశం చాలా తక్కువ ఉంటుందని వారు తెలుపుతున్నారు.
Also Read: కొత్తిమీర కాడలు పారేస్తున్నారా? వంటల్లో ఈ 5 అద్భుతమైన మార్గాల్లో వాడేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
