హైదరాబాద్లో అక్రమాలకు పాల్పడుతున్న నేరగాళ్లను ఆదుకునేందుకు పోలీసులు ముందడుగు వేశారు.
Hyderabad, Telangana:హైదరాబాద్: హైదరాబాద్లో పెరుగుతున్న నేరాల రేటును దృష్టిలో ఉంచుకుని నగర సీపీ ఆదేశాల మేరకు సౌత్వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ మహ్మద్ అష్ఫాక్ ఈరోజు హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్, ఆసిఫ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్ల జీవితాల్లో మార్పు వచ్చిన తర్వాత వారిపై పెండింగ్లో ఉంటుంది, ప్రభుత్వం వారికి తగిన సహాయం అందించి, వారికి జీవనోపాధి కల్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
భక్తుల రద్దీ.. తిరుమల వెంకటేశ్వర క్షేత్రానికి రాజకీయ ప్రముఖుల తాకిడి
Tirupati Urban, Andhra Pradesh:Tirumala: కలియుగ వైకుంఠవాసుడు కొలువుదీరిన తిరుమల క్షేత్రాన్ని సినీ, రాజకీయ ప్రముఖులు పోటెత్తారు. సాధారణ భక్తులతోపాటు ప్రముఖులు తరలివచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయ ప్రముఖులతోపాటు పలువురు సినీ ప్రముఖులు తిరుమల ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారిని దర్శించుకున్నది ఎవరెవరో తెలుసుకుందాం.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యం జరిగే దివ్య దర్శనాల్లో భాగంగా గురువారం పలువురు ప్రముఖులు వేంకటేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో స్వామివారి దర్శనం అనంతరం వారు ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తిరుమల స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. అనంతరం వీఐపీ దర్శన ఏర్పాట్లలో భాగంగా స్వామివారి సన్నిధికి చేరుకుని వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా.. తీర్థప్రసాదాలు స్వీకరించారు.
మాజీ గవర్నర్ దర్శనం
తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తిరుమల స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన స్వామివారి కృపతో దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
సినీ ప్రముఖులు
సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా తిరుమలలో దర్శనం చేసుకున్నారు. ప్రముఖ నటుడు సాయికుమార్ కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం సాయికుమార్ మాట్లాడుతూ.. 'తిరుమల దర్శనం జీవితంలో అత్యంత పవిత్రమైన అనుభవం' అని తెలిపారు. ప్రముఖ నటుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత రాజేంద్రప్రసాద్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం చేసుకున్న అనంతరం ఆలయ వాతావరణాన్ని ఎంతో ప్రశాంతంగా అనుభూతి చెందినట్లు తెలిపారు. దర్శనం అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. 'ఆయనే పద్మాసనుడు. పద్మ ఇప్పించింది ఆయనే. నా జీవితంలో ఏదీ జరిగినా వారికి చెప్పుకోవటం నాకు అలవాటు. అందుకే స్వామిని దర్శించుకున్నా. నాకు వచ్చిన అవార్డు మీ అందరికీ వచ్చినట్లే' అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
నారా లోకేశ్, పీవీఎన్ మాధవ్
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా.. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కూడా తిరుమల వారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠంలోని కంపార్ట్మెంట్లు 27 క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 10 నుంచి 15 గంటల సమయం పడుతుండగా.. టైమ్ స్లాట్ (ఎస్ఎస్డీ) టోకెన్లు కలిగిన భక్తులకు 6 నుంచి 8 గంటలు సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 2.3 గంటల సమయం పడుతుండగా.. నిన్న ఒక్కరోజే 78,067 మంది భక్తులు స్వామినిదర్శించుకున్నారు. స్వామివారికి 31,158 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీకి రూ.4.39 కోట్లు ఆదాయం లభించింది.
జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి.. ప్రజా జీవితంలో రేవంత్ రెడ్డి @ 20 ఏళ్లు
Midjil, Telangana:Revanth Reddy @ 20 Years: తెలంగాణ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్రెడ్డి రాజకీయ జీవితం ప్రారంభించి రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి. ఒక స్వతంత్ర అభ్యర్థిగా జీవితం ప్రారంభించి అనంతరం రాష్ట్ర అత్యున్నత స్థాయి పదవిని అలంకరించారు. చిన్నగా ప్రారంభమైన అతడి రాజకీయ జీవితం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఉమ్మడి పాలమూరు నుంచి ముఖ్యమంత్రిగా అయిన రెండో వ్యక్తిగా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారు. ఆయన రెండు దశాబ్దాల రాజకీయ చరిత్రపై
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ జడ్పీటీసీ సభ్యుడిగా ఆయన వేసిన తొలి అడుగు.. నేడు ఆయనను రాష్ట్ర అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టింది. ప్రజాప్రతినిధిగా ఆయన ప్రస్థానం ప్రారంభమై ఈనెల జూలై 4 నాటికి సరిగ్గా 20 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా తనకు రాజకీయ జీవితం ఇచ్చిన మిడ్జిల్లో జూలై 4వ తేదీన రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మిడ్జిల్ ప్రజల సమక్షంలోనే ప్రజాప్రతినిధిగా తన జీవితం ప్రారంభించిన రోజును గుర్తుచేసుకోనున్నారు. అప్పట్లో తన గెలుపునకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం కానున్నారు. ప్రజాప్రతినిధి నుంచి సీఎం పీఠం దాకా సాగిన తన కెరీర్ పునాదిగా నిలిచిన మిడ్జిల్ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పనున్నారు. తన రాజకీయ ప్రయాణంలో తనను ప్రజాప్రతినిధిగా తొలిసారి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవాలనే భావనతోనే.. 'మీ బిడ్డను.. మళ్లీ వస్తున్నా... మీ ఆశీర్వాదం, ఆదరణతోనే రాష్ట్రానికి సేవ చేసే అవకాశం వచ్చింది' అనే భావంతో మిడ్జిల్ ప్రజల ముందుకు వస్తున్నారు.
Also Read: మంత్రులపై కేటీఆర్ ఆగ్రహం.. చర్చకు రాకుండా తొడలు కొడితే ప్రయోజనం ఏంటి?
విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసిన రేవంత్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో రేవంత్ రెడ్డి తొలి అడుగు స్వతంత్రంగానే పడింది. ఉమ్మడి రాష్ట్రంలో 2006 పరిషత్ ఎన్నికల్లో మిడ్జిల్ జెడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జూలై 4వ తేదీన విజయం సాధించారు. మరుసటి ఏడాది 2007లో మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి శాసనమండలిలో తొలిసారి అడుగుపెట్టారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరిన రేవంత్రెడ్డి తన సరికొత్త పంథాతో ఆ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగారు.
కొడంగల్ నియోజకవర్గం నుంచి 2009, 2014లో పోటీ చేసి ఎమ్మెల్యేగా రెండుసార్లు విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ శాసనభలో టీడీపీఎల్పీ.. బీఆర్ఎస్ఎల్పీలో విలీనం కావడం.. తెలుగుదేశం మనుగడ ప్రశ్నార్థకం కావడంతో రేవంత్ రెడ్డి ప్లేటు ఫిరాయించి పార్టీ మారారు. వెంటనే టీడీపీకి గుడ్బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని జనాకర్షక నాయకుడిగా రేవంత్ రెడ్డి గుర్తింపు పొందారు. ప్రజల్లో రేవంత్రెడ్డికి వస్తున్న స్పందనను గ్రహించిన అధిష్ఠానం 2018 ఎన్నికలకు ముందు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది. అయితే 2018 ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ కొడంగల్పైన ప్రత్యేక దృష్టి సారించడం, ఇతర పరిణామాల నేపథ్యంలో ఆ ఎన్నికల్లో రేవంత్రెడ్డి ఘోరంగా ఓడిపోయారు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి మాటతప్పారు. అనంతరం2019 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి స్థానంలో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఎంపీగా విజయం సాధించారు.
2021 జూలై 7వ తేదీన టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. పార్టీ పగ్గాలు అందుకున్న రేవంత్రెడ్డి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయతీరానికి చేర్చారు. 2023 డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ముఖ్యమంత్రి పీఠం వరకూ సాగిన రేవంత్రెడ్డి ప్రస్థానంలో మిడ్జిల్ జడ్పీటీసీ అభ్యర్థిగా ఆయన సాధించిన తొలి విజయం ప్రత్యేకమనే చెప్పవచ్చు. ఆ ప్రత్యేకతను మరోమారు గుర్తు చేసుకునేందుకు రేవంత్రెడ్డి జూలై 4న మిడ్జిల్లో పర్యటించనున్నారు.
రేపు మిడ్జిల్ పర్యటన
మిడ్జిల్ పర్యటనకు రానున్న రేవంత్ రెడ్డి మొదట ఊరుకొండ ఆలయాన్ని సందర్శించనున్నారు. తన తొలి రాజకీయ ప్రయాణంలో వెంట నడిచిన అనుచరులు, ఆత్మీయులు, ముఖ్య నాయకులు, ఆనాటి పెద్దలతో కలిసి 'ఆత్మీయ విందు' చేస్తారు. మిడ్జిల్ సమీపంలో ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేస్తారు. ఈ సంధర్భంగా మిడ్జిల్ మండలంపై వరాల జల్లు కురుపించే అవకాశం ఉంది. ఇప్పటికే మిడ్జిల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేసిన విషయం తెలిసిందే.
జగిత్యాల ప్రగతి పథం.. చల్గల్లో కేంద్రీయ విద్యాలయం.. ఎమ్మెల్యే సంజయ్ కీలక ప్రకటన..!
Jagtial, Telangana:Jagtial Kendriya Vidyalaya Latest News: జగిత్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, ముఖ్యంగా కేంద్రీయ విద్యాలయం (KV) ఏర్పాటుకు తాము చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మోతే రోడ్డులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల విమర్శలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
గత ఎనిమిది నెలలుగా కేంద్రీయ విద్యాలయం జగిత్యాలకు తీసుకురావడానికి నిరంతరం శ్రమిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ ప్రక్రియల వల్ల కొంత ఆలస్యం జరగడం వాస్తవమేనని.. అయితే, దీన్ని రాజకీయం చేస్తూ.. కొందరు ఇష్టారాజ్యంగా మాట్లాడటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో పండ్ల మార్కెట్ కొరకు వాలంతరి భూమిని కేటాయించినప్పుడు.. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేసినప్పటికీ స్థల మార్పిడిలో తీవ్ర ఆలస్యమైందనే విషయాన్ని మీడియా మిత్రులు, అధికారులు గమనించాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గుర్తుచేశారు. వాటర్ అండ్ ల్యాండ్ రీసెర్చ్ సంస్థ (వాలాంతరి) అనేది ఒక అటానమస్ సంస్థ అని.. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహజ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల శాస్త్రవేత్తల శిక్షణ నిమిత్తం ఆ భూమి కేటాయింపులో కొంత జాప్యం జరిగిందని వివరించారు. కొందరు పూర్తి అవగాహన లేకుండా తెలిసి తెలియక మాట్లాడుతున్నారని విమర్శించారు.
నేడు క్యాబినెట్ ఆమోదం..
కేంద్రీయ విద్యాలయం తాత్కాలిక నిర్వహణ కొరకు పాత ఎస్పీ కార్యాలయాన్ని కేవీ డిప్యూటీ డైరెక్టర్, డీఈఓ, కలెక్టర్తో పాటు కరీంనగర్ కేవీ ప్రిన్సిపాల్ సందర్శించి ఆమోదం తెలిపారని సంజయ్ కుమార్ వెల్లడించారు. శాశ్వత భవన నిర్మాణం కోసం చల్గల్లో 5 ఎకరాల భూమికి కలెక్టర్ అడ్వాన్స్ పొసెషన్ ఇచ్చారని తెలిపారు. పూర్తి స్థాయి కేటాయింపులకు క్యాబినెట్ ఆమోదం అవసరం కాబట్టి.. ఈరోజు జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం రానుందని.. మంత్రి కూడా దీనికోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని చెప్పారు. కేవీ కోసం తాను చేసిన ప్రయత్నాలకు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
దళితుడు మంత్రిగా ఉండడం కొందరికి ఇష్టం లేదు..
జగిత్యాల అభివృద్ధికి మంత్రి లక్ష్మణ్ కుమార్ విశేషంగా కృషి చేస్తున్నారని.. అయితే, ఒక దళితుడు మంత్రిగా ఉండడం ఒక సీనియర్ నాయకునికి ఇష్టం లేదని.. అందుకే సర్కార్ను దింపుతాం, నాకు మంత్రి అయ్యే అర్హత ఉందంటూ అహంకారంతో మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మండిపడ్డారు. విమర్శలు ఎప్పుడైనా నిర్మాణాత్మకంగా ఉండాలి కానీ.. ఇలా వ్యక్తిగత కక్షలతో ఉండకూడదని హితవు పలికారు. చల్గల్లో రూ.50 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని 7 ఎకరాలు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కొరకు, 5 ఎకరాలు కేంద్రీయ విద్యాలయం కొరకు కేటాయించడం జరిగిందన్నారు. మంత్రులు, ఎంపీతో కలిసి జగిత్యాల ప్రగతికి కట్టుబడి ఉంటానని, వాలాంతరిలో వ్యవసాయ అభివృద్ధికి కేంద్ర నిధుల కోసం ఎంపీ సహకారం కోరతామని తెలిపారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
ప్రోటీన్ అనుకుంటే క్యాన్సర్ ముప్పు.. కరీంనగర్ కల్తీ మీల్మేకర్ ప్యాకెట్లపై అధికారుల నిర్లక్ష్యం?
Hyderabad, Telangana:Karimnagar Adulterated Meal Maker Scam: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్లపై.. అధికారులు దాడులు చేయడం ఒకెత్తయితే.. అప్పటికే మార్కెట్లోకి చేరిన విషాన్ని వెలికి తీయడం మరో ఎత్తు.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం దేశరాజు పల్లి శివారులో ఓ ఫ్యాక్టరీ పై బుధవారం పోలీసులతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడి చేసి భారీ కల్తీ సోయా చంక్స్ (మీల్మేకర్) పట్టుకున్న సంగతి తెలిసిందే.. అయితే ఫ్యాక్టరీని సీజ్ చేసి చేతులు దులుపుకున్న అధికారులు.. అప్పటికే మార్కెట్లోకి సరఫరా అయిన కల్తీ నిల్వలను స్వాధీనం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి..
VS బ్రాండ్ పేరుతో మార్కెట్లో విక్రయాలు..
దేశరాజు పల్లి ఫ్యాక్టరీ నుంచి విఎస్ బ్రాండ్ అని బ్రాండ్ పేరుతో ఈ కల్తీ మీల్మేకర్ మార్కెట్లోకి విడుదలైనట్లు సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ హోటల్స్ తో పాటు రిటైల్ కిరాణ దుకాణాలకు ఈ కల్తీ ప్యాకెట్లు ఇప్పటికే చేరిపోయాయి.. బ్రాండెడ్ ప్యాకెట్ల లోని కాకుండా బస్తాల కొద్దీ విడిగా కూడా వీటిని విక్రయించినట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీ పై దాడి జరిగి 24 గంటలు గడుస్తున్నప్పటికీ.. దుకాణాల్లో ఉన్న ఈ నిల్వలను రికవరీ చేసేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలుగుతోంది..
కిడ్నీ, లివర్ పై ప్రభావం..
ఫ్యాక్టరీని పట్టుకుంటే సరిపోతుందా? అప్పటికే దుకాణాలకు చేరిన కల్తీ మీల్మేకర్ మేము కొనుక్కుని తింటే మా ఆరోగ్యాల పరిస్థితి ఏంటి? అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా శాఖాహారులు ప్రోటీన్ కోసం ఎక్కువగా వీటిని వినియోగిస్తూ ఉంటారు. అయితే ఈ ఫ్యాక్టరీలో నాసిరకం పదార్థాలతో పాటు ప్రమాదకరమైన రసాయనాలు, రంగులు కలిపి కృత్రిమంగా చంక్స్ తయారుచేసినట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి కల్తీ ఆహారాన్ని తినడం వల్ల జీర్ణకోశ సంబంధిత సమస్యలు రావడమే కాకుండా కిడ్నీ, లివర్ పై ఊహించని స్థాయిలో ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారి తీసే ప్రమాదం కూడా కనిపిస్తోంది.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
తక్షణమే రికవరీ చేయాలని డిమాండ్..
పట్టణంలోని సూపర్ మార్కెట్ల నుంచి పల్లెల్లోని చిన్నచిన్న కిరాణా కొట్టుల వరకు విఎస్ బ్రాండ్ నిల్వలు ఇంకా చలామణిలో ఉన్నాయని.. ప్రజలు తెలియక వీటిని కొనుగోలు చేస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పందించి ప్రత్యేకమైన బృందాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాలని.. మార్కెట్లో ఉన్న సరుకును తక్షణమే సీజ్ చేయడంతో పాటు.. ప్రజలు ఈ బ్రాండ్ కలిగిన వాటిని కొనుగోలు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజాసంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
ఉపాధి ఆశ చూపి ఘోరం.. ఒంటిపై బంగారం లాక్కొని బావిలో పడేసిన దుర్మార్గుడు!
Hyderabad, Telangana:Karimnagar Crime News: ఉపాధి ఆశ చూపిన ఓ కిరాతకుడు నమ్మకద్రోహానికి పాల్పడ్డాడు.. పని ఇప్పిస్తానని నమ్మించి.. ఓ అమాయక మహిళను నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి.. ఆమె మెడలో ఉన్న బంగారాన్ని దోచుకోవడమే కాకుండా.. సాక్ష్యం లేకుండా చేయాలని కుట్రతో బావిలోకి తోసేసిన దారుణ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో వెలుగు చూసింది. మృత్తుతో పోరాడి.. ప్రాణాలతో బయటపడ్డ ఆ మహిళ ఉదాంత స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తుంది..
నమ్మించి తీసుకెళ్లి.. నట్టేట ముంచాడు..
పోలీసులతో పాటు స్థానికులందించిన కథనం ప్రకారం.. కరీంనగర్ నగరానికి చెందిన ఓ మహిళ కొద్దిరోజులుగా పని కోసం వెతుకులాడుతోంది.. దీనిని ఆసరాగా చేసుకున్న ఒక గుర్తు తెలియని వ్యక్తి.. ఆమెకు మంచి పని ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి నమ్మించాడు.. అతని మాటలను నిజమని నమ్మిన సదరు మహిళ.. అతను చెప్పిన చోటుకు వెళ్ళింది. పథకం ప్రకారం ఆ వ్యక్తి ఆమెను నుస్తులాపూర్ శివారులోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.
చుట్టుపక్కల ఎవ్వరూ లేరని నిర్ధారించుకున్నాక.. ఆ కిరాతకుడు తన అసలు రూపాన్ని బయట పెట్టాడు.. మహిళపై ఒక్కసారిగా దాడి చేసి ఆమె మెడలో ఉన్న అర్థతులం బంగారు గొలుసును బలవంతంగా లాక్కున్నాడు.. అంతటితో ఆగకుండా ఆమె గట్టిగా కేకలు వేస్తే ఎక్కడ దొరికిపోతానో అనే భయంతో.. పక్కనే ఉన్న ఒక పాడుబడిన వ్యవసాయ బావిలోకి ఆమెను నెట్టేసి అక్కడి నుంచి పరారయ్యాడు..
బావిలోనే 24 గంటల నరకయాతన..
బావిలో పడిపోయిన బాధితురాలు తీవ్రభయాందోళనకు గురయ్యింది.. లోతైన ఆ భావించి పైకి రావడం సాధ్యం కాకపోవడంతో పాటు చుట్టుపక్కల జనాలు లేకపోవడంతో ఆమె పెట్టిన కేకలు ఎవరికి వినిపించలేదు.. దాదాపు 24 గంటల పాటు ఆమె నీటిలో.. ఆ చీకటి బావిలోనే ప్రాణాల కోసం కొట్టుమిట్టాడింది.. ఆకలితో పాటు దాహం, భయంతో నరకయాతన అనుభవించింది.. అయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా ప్రాణాలను నిలబెట్టుకుంది..
రక్షించిన బావి యజమాని..
మర్రిశెట్టి రోజు ఉదయం బావి యజమాని తన పొలానికి వచ్చి.. బావి వైపు వెళ్లక లోపలి నుంచి మహిళ ములుగుతున్న శబ్దం వినిపించింది. అనుమానంతో లోపలికి తొంగి చూడగా.. ఒక మహిళ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతూ కనిపించింది.. వెంటనే సదరు యజమాని గ్రామంలోని స్థానికులకు సమాచారం అందించాడు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
రంగంలోకి పోలీసులు..
ఈ ఘోర ఉదాంతం పై సమాచారం అందుకున్న తిమ్మాపూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.. బాధితురాలి ప్రథమక చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.. అనంతరం ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.. అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి ఒంటరిగా నిర్మానుష ప్రాంతాలకు వెళ్ళవద్దని.. మహిళలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని.. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేకమైన బృందాలను రంగంలోకి దించామని పోలీసులు తెలిపారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Tamil Nadu Deputy CM: డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యేందుకు త్రిషకు తొలగిన అడ్డంకి..రాజకీయాలకు దూరంగా లారెన్స్!
Tamil Nadu:Tamil Nadu Deputy CM Trisha: తమిళనాడు సీఎం విజయ్ పార్టీ విజయం సాధించిన తర్వాత తాను పోటీ చేసిన రెండో స్థానం తిరుచ్చీ నుంచి ఇప్పుడు ఎవరు బరిలో దిగనున్నారనే విషయం ఇప్పుడు ఆసక్తి నెలకొంది. నిన్న మొన్నటి వరకు నటుడు, నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ తిరుచ్చీ అసెంబ్లీ స్థానానికి టీవీకే పార్టీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే తాను ప్రస్తుతం మరికొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటానని లారెన్స్ ప్రకటన తర్వాత ఆ స్థానంలో త్రిష పోటీ చేసే అవకాశం ఉందని టీవీకే నేతలు అంటున్నారు. ఒకవేళ ఆ స్థానంలో ఆమె గెలిస్తే.. డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది.Ayodhya Mandir Funds Theft: అయోధ్య రాముడి నిధుల గోల్మాల్..నిందితుల ఇళ్లు కూల్చివేతకు యోగి ప్రభుత్వం ఆదేశం!
Ayodhya, Uttar Pradesh:Ayodhya Mandir Funds Theft News: అయోధ్య రామమందిర నిర్మాణానికి దేశవిదేశాల నుంచి భక్తులు సమర్పించిన విరాళాల సొమ్మును స్వాహా చేసిన నిందితులపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఈ భారీ కుంభకోణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కార్.. నిందితుల అక్రమాస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు, వారు అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను కూల్చివేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈ నిధుల దుర్వినియోగం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న లవ్ కుశ్ మిశ్రాకు ఇప్పటికే గట్టి షాక్ తగిలింది. అయోధ్య-లక్నో జాతీయ రహదారి సమీపంలో అతను కొనుగోలు చేసిన వివాదాస్పద స్థలంలో నిర్మిస్తున్న రెండంతస్తుల నివాస భవనానికి అయోధ్య అభివృద్ధి సంస్థ (ADA) అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేని, అక్రమ సంపాదనతో నిర్మిస్తున్న ఈ భవనాన్ని త్వరలోనే కూల్చివేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న రామాలయ నిధులను వ్యక్తిగత ఆస్తుల కోసం మళ్లించడాన్ని యోగి ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది.
ఐదేళ్ల ట్రస్టు నిధులపై సిట్ ఆడిట్..
ఈ కుంభకోణం మూలాలను, ఇందులో ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే విషయాన్ని పూర్తిగా వెలికితీసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) రంగంలోకి దించింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు గడిచిన ఐదేళ్లలో అందిన నిధులు, విరాళాలపై సిట్ అధికారులు ప్రస్తుతం ముమ్మరంగా ఆడిట్ నిర్వహిస్తున్నారు.
ట్రస్టుకు వచ్చిన నగదు, ఆన్లైన్ విరాళాలు, వాటి ఖర్చులకు సంబంధించిన ప్రతి రికార్డును అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. భక్తుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్వామివారి సొమ్మును సొంతానికి వాడుకున్న ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని యోగి సర్కార్ స్పష్టం చేసింది. ఈ పరిణామం యూపీతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.
Also Read: నీట్-2026 విద్యార్థులకు అలర్ట్..రీ-ఎగ్జామ్ ఫలితాలను విడుదల చేసేది ఆరోజే!
ALso Read: ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు..త్వరలోనే భారీగా పెరగనున్న జీతాలు..ఎంత పెరుగుతాయంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
NEET UG Result 2026: నీట్-2026 విద్యార్థులకు అలర్ట్..రీ-ఎగ్జామ్ ఫలితాలను విడుదల చేసేది ఆరోజే!
New Delhi, Delhi:Re-NEET UG Result 2026: మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ వివాదాల కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జూన్ 21న నిర్వహించిన నీట్ యూజీ 2026 రీజన్ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై 20 లోగా ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కసరత్తు చేస్తుందని సమాచారం అందుతోంది. రాబోయే విద్యా సంవత్సరానికి ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు, త్వరగా ఫలితాలను ప్రకటించాలని ఎన్టీఏ లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తోంది.
జూన్ 21వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ కు దేశవ్యాప్తంగా 20 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 5440 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అలాగే విదేశాల్లో ఏర్పాటు చేసిన 14 కేంద్రాల్లో విద్యార్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. జూన్ 25వ తారీఖున తాత్కాలిక కీని విడుదల చేసి, జూన్ 28 వరకు అభ్యంతరాల స్వీకరణకు ఎన్టీఏ అవకాశం కల్పించింది.
ఫలితాల తర్వాత తదుపరి ప్రక్రియ..
NTA త్వరలోనే ఫైనల్ ఆన్సర్ కి నీ విడుదల చేయనుంది. అది వచ్చిన వెంటనే తొలి ఫలితాలను ప్రకటిస్తారు. ఫలితాలు విడుదలైన వెంటనే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (ఎంసీసీ) కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. నీట్ యూజీ పరీక్షలు అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కౌన్సిలింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. విద్యార్థులు మెరిట్ ర్యాంకులు ఆధారంగా దేశంలో వివిధ వైద్య కళాశాలలో సీట్లు కేటాయించడం జరుగుతుంది.
గతేడాది 2025లో మే 4 జరిగిన పరీక్ష ఫలితాలు జూన్ 14లో విడుదలవగా.. జూలై 21 నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఏడాది కూడా అదే తరహాలో స్టడీ సైకిల్ గా పెట్టుకొని అధికారులు శ్రమిస్తున్నారు.
Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు..త్వరలోనే భారీగా పెరగనున్న జీతాలు..ఎంత పెరుగుతాయంటే?
Also Read: తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్..వారంలో రెండు రోజులు సెలవులు..ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ఉపాధి హామీ స్థానంలో వీబీ జీ రాం జీ.. ఆంధ్రప్రదేశ్లో అట్టహాసంగా ప్రారంభం
Koduru, Andhra Pradesh:ఉపాధి హామీ చట్టం స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీ జీ రాం జీ) చట్టం ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేశారు. ఈ పథకాన్ని కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ప్రారంభించారు. వీబీ జీ రాం జీ చట్టంలో గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ప్రజల అభివృద్ధితోపాటు రైతుల కోసం ప్రత్యేక కార్యాచరణ ఉంటుందని ప్రజాప్రతినిధులు వెల్లడించారు.
ఏపీలోని తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పరిధిలోని ముక్కావారిపల్లెలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేతుల మీదుగా వీబీ జీ రాం జీ పథకాన్ని ప్రారంభించారు. వీజీ జీ రాం పథకంలో భాగంగా ఫారం పాండ్కు శుంకుస్థాపన చేశారు. అనంతరం వీబీ జీ రాం జీ పథకం కింద కలప ఉత్పత్తి చేసే టేకు, మద్ది, వేప, యూకలిప్టస్ తదితర 10 రకాల మొక్కలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాటి నీళ్లు పోశారు. పచ్చదనం పెంపుతో పర్యావరణ పరిరక్షణతోపాటు పంచాయతీల ఆదాయం పెంచేందుకు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణలో కలప ఉత్పత్తి, వుడ్ బ్యాంకుల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
అనంతరం సభా ప్రాంగణానికి సమీపంలో ఏర్పాటుచేసిన మ్యాజిక్ డ్రెయిన్ నమూనాను చూపించి ఆ కాన్సెప్ట్ను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు అధికారులు వివరించారు. మురుగునీటి నిర్వహణలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన వినూత్న ఆవిష్కరణ 'ఈ మ్యాజిక్ డ్రెయిన్' మొత్తం మూడు లేయర్లలో నిర్మాణాన్ని ప్రదర్శించారు. మ్యాజిక్ డ్రెయిన్లలో ఎర్త్ వర్క్, మొదటి లేయర్లో 30 సెంటీమీటర్ల మందంతో వేసిన 100 ఎంఎం కంకర, రెండో లేయర్లో వేసిన 40 ఎంఎం కంకర, మూడో లేయర్లో వేసిన 20 ఎంఎం కంకరతో నింపనున్నట్టు వివరించారు. మ్యాజిక్ డ్రెయిన్ పని తీరును కేంద్ర మంత్రి, సీఎం వీక్షించారు.
అనంతరం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో సాధించిన విజయాల సమాహారంతో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని అతిథులు తిలకించారు. మోడల్ పంచాయతీలు, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పంచాయతీలు, జియో ట్యాగింగ్ వంటి పారదర్శక విధానాలతో సాధించిన ప్రగతిని అతిథులంతా వీక్షించారు. అనంతరం వేదిక మీద ఏర్పాటు చేసిన వీబీ జీ రాంజీ శిలాఫలకాన్ని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవిష్కరించారు. లబ్దిదారులైన ఉపాధి శ్రామికులకు వీబీ జీ రాం జీ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం ఓపీఈడీ బుక్లెట్ను ఆవిష్కరించగా.. అనంతరం పోర్టల్ను ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్, సమాచార ప్రసార, గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ మంత్రులు సత్యకుమార్ యాదవ్ , అనగాని సత్యప్రసాద్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి రోహిత్ కన్సాల్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ కృష్ణ తేజ తదితరులు ఉన్నారు.
AP Capital Issue: 12 ఏళ్లు గడుస్తున్నా ఏపీ రాజధానిపై నో క్లారిటీ! రాజధాని లేకపోవడానికి కారణం వాళ్లేనా?
Vijayawada, Andhra Pradesh:AP Capital Issue News: ఆంధ్రప్రదేశ్ పునవ్యవస్థీకరణ జరిగి 2014 నుంచి ఇప్పటివరకు 12 ఏళ్లు గడుస్తున్నా రాష్ట్రానికి ఒక ఖచ్చితమైన, పూర్తిస్థాయి రాజధాని నగరం రూపుదిద్దుకునే మార్గం కుదరలేదు. రాజకీయ అస్థిరత ప్రభుత్వాలు మారినప్పుడల్లా మారిన విధానాలు, వ్యూహాత్మక లోపాలే ప్రధాన కారణాలుగా వస్తున్నాయి. దీనికి ఏ ఒక్కరిని బాధ్యులు చేయడం కంటే, రెండు వేరువేరు ప్రభుత్వాల పరస్పర అభివృద్ధి నిర్ణయాలను విశ్లేషించాల్సి ఉంటుంది.
టీడీపీ ప్రభుత్వం (2014-19)
ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రపంచ స్థాయి మెగాసిటీగా నిర్మించాలని సంకల్పించారు. దాదాపు 33 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించడం ఒక రికార్డు. అయితే సింగపూర్ మాస్టర్ ప్లాన్, గ్రాఫిక్స్, అంతర్జాతీయ డిజైన్ చుట్టూ కథ నడపడంతో ప్రాజెక్టు ప్రారంభం కావడానికి చాలా సమయం పట్టింది.
తాత్కాలిక భవనాలకే పరిమితం..
ఐదేళ్ల కాలంలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి తాత్కాలిక భవనాలను నిర్మించినప్పటికీ.. శాశ్వత రాజధాని నిర్మాణ పనులు పునాదులు దశలోనే ఉండిపోయాయి. 2019 నాటికి కనీసం ఒక ఐకానిక్ భవనం కూడా పూర్తి కాకపోవడం ప్రతికూలంగా మారింది.
వైసీపీ మూడు రాజధానుల ప్రయోగం (2019-2024)
2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం, చంద్రబాబు కలలో ప్రాజెక్టు అయినా అమరావతిని పూర్తిగా పక్కన పెట్టింది. అమరావతిలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. అందులో విశాఖ నుంచి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి నుంచి లెజిస్లెటివ్ క్యాపిటల్, కర్నూలు నుంచి జ్యూడిషల్ క్యాపిటల్.. ఈ విధంగా మూడు రాజధానులు అంశాన్ని వైసీపీ ప్రతిపాదించింది.
ఈ నిర్ణయం వల్ల అమరావతి పనులు పూర్తిగా ఆగిపోయాయి. అటు విశాఖలోను పనులు సాగలేదు. భూములు ్ఇచ్చిన రైతులు కోర్టుకు వెళ్ళటం, హైకోర్టు తీర్పులు, సుప్రీంకోర్టు స్టేలతో ఐదేళ్ల కాలం చట్టపరమైన వివాదాలకు సరిపోయింది. దీనివల్ల ఏపీ రాజధాని లేదని గందరగోళం ఏర్పడింది.
కేంద్ర ప్రభుత్వ వైఖరి..
విభజన చట్టం ప్రకారం రాజధాని ఏర్పాటుకు కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉంది. అయితే అమరావతి ప్రారంభంలో కొంత నిధులు ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదు. రాష్ట్రంలో రాజధాని మార్పు వివాదం నడుస్తున్న కూడా కేంద్రం అది రాష్ట్ర పరిధిలోని అంశం అని పేర్కొంటూ తటస్థంగా ఉండిపోయింది.
ప్రస్తుత పరిస్థితి..
2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. 'ఏకైక రాజధాని అమరావతి' ప్రాజెక్టు మళ్ళీ పట్టాలెక్కించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి నిధుల సమీకరణం తో పాటు పనులు మళ్లీ ఊపందుకుంటున్నాయి. అయితే ఇదే క్రమంలో ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్.. మరోసారి 'మావిగన్' (మచిలీపట్నం - విజయవాడ - గుంటూరు) అంటూ రాజధాని మార్పు చేయాలని సంకల్పిస్తున్నారు. ఇదే నినాదంతో తాము ఎన్నికలకు వెళ్తామని అంటున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే మళ్లీ రాజధానిని మారుస్తుందా? కూటమి ప్రభుత్వం వచ్చినా ఎన్నేళ్లకు రాజధాని పనులు పూర్తవుతాయనేది ప్రతి ఏపీ పౌరుడిలో తొలుస్తున్న ప్రశ్న.
చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒక ప్రభుత్వం తెచ్చిన ప్లాన్ ను, తర్వాత ప్రభుత్వం రద్దు చేయడం.. ఆపై మళ్ళీ ప్రభుత్వం మారి పాత ప్లాన్కే రావటం వల్ల దశాబ్ద కాలం వృథా అయ్యింది. ఈ రాజకీయ ప్రాంతాలు, పాలసీల్లో స్థిరత్వం లేకపోవడమే ఏపీ రాజధానికి ఆలస్యం కావడానికి అసలు కారణం.
Also Read: అమరావతి Vs మావిగన్.. జగన్ 'మావిగన్' సవాలుపై ఘాటుగా స్పందించిన సీఎం చంద్రబాబు..
Also Read: డిప్యూటీ సీఎంను దూషించిన కేసులో ప్రశ్న రావణ్కు బెయిల్..గంటలోనే మరో ట్విస్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Oppo రెనో 16 సిరీస్ ఎంట్రీ.. ఫీచర్లు, ధరల పూర్తి వివరాలు!
Hyderabad, Telangana:Oppo Reno 16 Series Launched: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో (Oppo) భారతీయ మొబైల్ ప్రియుల కోసం మరో సరికొత్త సిరీస్ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. మార్కెట్లో తనదైన ముద్ర వేస్తూ.. ఒప్పో రెనో 16 (Oppo Reno 16)తో పాటు ఒప్పో రెనో 16సి (Oppo Reno 16c) మోడళ్లను అధికారికంగా లాంచ్ చేసింది.. అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో శక్తివంతమైన బ్యాటరీ, అద్భుతమైన కెమెరా సెటప్తో ఈ ఫోన్లు వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందాయి. అయితే, ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
బడ్జెట్ ధరలోనే ప్రీమియం ఫీచర్లు..
భారత మార్కెట్లో ఒప్పో రెనో 16 సిరీస్ ప్రారంభ ధర రూ.46,999తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. మోడల్స్ వారీగా ధరల వివరాల్లోకి వెళితే.. ఒప్పో రెనో 16సి 5జీ (Oppo Reno 16c 5G) స్మార్ట్ఫోన్ 8GB + 128GB వేరియంట్ ధర రూ.46,999 కాగా.. ఇక రెండవ వేరియంట్ 8GB + 256GB స్టోరేజ్ కలిగిన ధర రూ.49,999 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే టాప్ ఎండ్ 12GB + 256GB వేరియంట్ ధర రూ.55,999తో అందుబాటులోకి రాబోతోంది. ఇక ఒప్పో రెనో 16 (Oppo Reno 16) స్మార్ట్ఫోన్ ధర వివరాల్లోకి వెళితే.. దీని 8GB + 256GB వేరియంట్ ధర రూ.61,999 కాగా.. 12GB + 256GB వేరియంట్ ధర రూ. 67,999తో అందుబాటులోకి రాబోతోంది..
అదిరిపోయే లాంచ్ ఆఫర్లు..
ఈ సరికొత్త స్మార్ట్ఫోన్లు జూలై 9 నుంచి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్కార్ట్తో పాటు ఒప్పో ఈ-స్టోర్, ప్రధాన రిటైల్ అవుట్లెట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఇవి స్టారీ వైట్, స్టెల్లార్ పర్పుల్, ట్విలైట్ వయొలెట్ రంగులలో లభించబోతున్నాయి. లాంచ్ ఆఫర్లలో భాగంగా ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులు, యూపీఐ లావాదేవీలపై 10 శాతం వరకు క్యాష్బ్యాక్, 18 నెలల వరకు జీరో డౌన్ పేమెంట్ ఈఎంఐ, రూ. 5,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, 180 రోజుల స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ను ఒప్పో కంపెనీ అందిస్తోంది.
కళ్లు చెదిరే డిస్ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్..
రెనో 16 మోడల్ 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో కూడిన 6.32 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది.ఇక రెనో 16సి మోడల్ 1,400 నిట్స్ బ్రైట్నెస్తో 6.57 అంగుళాల FHD+ AMOLED స్క్రీన్ను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ రెండు ఫోన్లు కూడా 120Hz రీఫ్రెష్ రేట్ను సపోర్ట్ చేస్తాయి. ప్రాసెసర్ విషయానికొస్తే.. రెనో 16లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 జెన్ 4 చిప్సెట్తో పాటు రెనో 16సిలో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఇవి లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ ఓఎస్ 16 (ColorOS 16) పై రన్ అవుతాయి.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ఒప్పో ఫోన్లు కెమెరాలకు పెట్టింది పేరు.. కాబట్టి ఈ సిరీస్లో కూడా కెమెరాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన్నట్లు తెలుస్తోంది. రెనో 16 ఫోన్ వెనుక భాగంలో OIS సపోర్ట్తో కూడిన 50MP సోనీ LYT-600 ప్రధాన కెమెరా, 50MP అల్ట్రావైడ్, 50MP టెలిఫోటో కెమెరాలను అందించారు. అదేవిధంగా రెనో 16సి మోడల్లో 50MP ప్రధాన, 50MP టెలిఫోటో కెమెరాలతో పాటు 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉంది. ఇక సెల్ఫీల కోసం రెండు ఫోన్లలోనూ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించడం విశేషం.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
క్రాంతి కుమార్ కుటుంబానికి అండగా ఉంటా.. న్యాయం చేస్తా: మాజీ సీం వైఎస్ జగన్
Vijayawada, Andhra Pradesh:Kranthi Kumar Death Case: 'కృష్ణలంక పీఎస్ పరిధిలో నెల వ్యవధిలో రెండు మరణాలు. ఒకటి లాకప్డెత్.. మరొకటి ఆత్మహత్య. అక్కడ సీసీ టీవీ ఫుటేజ్ కూడా లేదు. పోలీస్ స్టేషన్లలో తప్పనిసరిగా ఉండాల్సిన సీసీ కెమెరా ఫుటేజ్ మాయమైపోయింది. ఒక రిమాండ్ రిపోర్టులో నెల రోజుల ఫుటేజ్ లేదన్నారు. మే 1 నుంచి జూన్ 1 వరకు లేదని. మరో దాంట్లో 18 నెలల నుంచి ఫుటేజ్ లేదన్నారు' అని మాజీ సీఎం వైఎస్ జగన్ వివరించారు. ఎవరు పడితే వారు అలా సీసీ కెమెరాల ఫుటేజ్ తీసేయొచ్చా? మరి బ్యాకప్ ఉండదా? అని ప్రశ్నలు సంధించారు. అంటే ఒక పద్ధతి ప్రకారం పోలీస్ స్టేషన్లలో చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నారని ఆరోపించారు. 'పోలీస్ స్టేషన్లో కొడుతున్నారు. చంపుతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేసినా, పట్టించుకోవడం లేదు. చెత్తబుట్టలో వేస్తున్నారు' అని విమర్శించారు.
కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు, పోలీసుల వేధింపులు తాళలేక సెల్ఫీ వీడియోలో మరణ వాంగ్మూలం మాదిరిగా అన్ని వివరాలు చెప్పి ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. విజయవాడ, కృష్ణలంకలో ఉన్న క్రాంతికుమార్ ఇంటికి వెళ్లిన వైఎస్ జగన్, ఆయన భార్య, పిల్లలు, తండ్రిని కలిసి ఓదార్చారు. పోలీసులు క్రాంతికుమార్ను ఏ విధంగా వేధించారనేది చెప్పిన వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. 'క్రాంతికుమార్ కుటుంబం చాలా పేదరికంలో ఉందని.. ఇక్కడ హృదయ విదారకరమైన పరిస్థితి కనిపిస్తోందన్నారు. చాలా పేదరికంలో బతుకుతున్న వారిని, ఈ వ్యవస్థ చిన్నాభిన్నం చేసింది' అని ఆవేదన వ్యక్తం చేశారు. 'క్రాంతికుమార్ ఒక టాక్సీ డ్రైవర్. 8 ఏళ్ల కిందట ఏవో చిన్న కేసులు ఉంటే వాటిని కూడా కొట్టేశారు. శిక్ష కూడా పడలేదు. అయినా క్రాంతికుమార్ను రోజూ పోలీస్ స్టేషన్కు రమ్మని 3 నెలలు వేధించారు. ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు' అని వివరించారు.
'నీచ స్థాయికి పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది. క్రాంతికుమార్ ఏ నేరం చేయకపోయినా, పోలీసులు ఎందుకు స్టేషన్కు పిలిపించారు. తనను 3 నెలల నుంచి రోజూ స్టేషన్కు పిలిపించి వేధించారని, హింసించారని క్రాంతికుమార్ తన మరణ వాంగ్మూలం (వీడియో రికార్డింగ్)లో చెప్పారు. పోలీసులు బలవంతపెట్టి తనతో చేయించకూడని పనులు చేయించారని ఆ వీడియోలో పేర్కొన్నాడు' అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెల్లడించారు.
'ఇది రాజధాని విజయవాడలో జరిగింది. కూతవేటు దూరంలో ముఖ్యమంత్రి నివాసం, పోలీస్ కమిషనర్ ఆఫీస్ ఉంది. డీజీపీ ఆఫీస్ ఉంది. హోం మంత్రి ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది. తన కొడుకు ఆత్మహత్య తర్వాత ఆ వీడియోను ఆయన తండ్రి పోలీస్ కమిషనర్కు చూపినా పట్టించుకోలేదు. ఏ చర్య తీసుకోలేదు' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వివరించారు. మరి తప్పు చేసిన వారిని ఎందుకు రక్షిస్తున్నారని ప్రశ్నించారు. 'ఇక్కడ రాజధానిలో ఒక రాకెట్ నడిపిస్తున్నారు. సీఐ నాగరాజుకు సీపీ ప్రొటెక్షన్. సీపీకి డీజీపీ ప్రొటెక్షన్. డీజీపీకి సీఎం ప్రొటెక్షన్ ఇస్తున్నారు' అని తీవ్ర ఆరోపణలు చేశారు.
'ఇంత జరిగినా కేసు నమోదు చేయలేదు. నిజానికి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి. ఆ కుటుంబానికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి, న్యాయ సహాయం మొదలు, అన్ని రకాలుగా వారికి మా పార్టీ తరపున అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అవసరమైతే కోర్టులో కూడా పోరాడతామని వైఎస్ జగన్ ప్రకటించారు. భార్య, చిన్నారులు ఉన్న వ్యక్తిని బెదిరించి, మానసికంగా వేధించడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
iPhone చరిత్రలోనే బిగ్గెస్ట్ బ్యాటరీ.. iPhone 18 Pro లీక్స్ చూశారా!
Hyderabad, Telangana:iPhone 18 Pro Max Leaks Latest News: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ (Apple) తన ప్రతిష్టాత్మక ఐఫోన్ సిరీస్లో ఎప్పటికప్పుడు సరికొత్త సిరీస్లతో వినియోగదారులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. తాజాగా వైరల్ అవుతున్న లీక్ల ప్రకారం... యాపిల్ త్వరలో మార్కెట్లోకి రాబోతున్న ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ (iPhone 18 Pro Max) బ్యాటరీ విభాగంలో సరికొత్త రికార్డు సృష్టించబోతున్నట్లు తెలుస్తోంది. యాపిల్ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ ఐఫోన్లోనూ లేనంత అతిపెద్ద బ్యాటరీని ఈ మోడల్లో అందించబోతున్నట్లు ప్రముఖ టిప్స్టర్లతో పాటు చైనా సప్లై చైన్ వర్గాలు సంచారాన్ని లీక్ చేశాయి..
బ్యాటరీ సామర్థ్యం ఎంత ఉండబోతోంది?
గత మోడల్ అయిన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్లో 5,088mAh బ్యాటరీని అందించిన సంగతి తెలిసిందే..రాబోయే ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్లో అంతకంటే శక్తివంతమైన బ్యాటరీని అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. లీక్ అయిన వివరాల ప్రకారం.. గ్లోబల్ వేరియంట్లో ఏకంగా 5,100mAh నుంచి 5,200mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది.. అయితే, చైనా మార్కెట్ కోసం విడుదల చేసే వేరియంట్లో మాత్రం దాదాపు 5,000mAh బ్యాటరీ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. స్మార్ట్ఫోన్ హిస్టరీలోనే ఐఫోన్ నుంచి రాబోతున్న అత్యధిక బ్యాటరీ బ్యాకప్ కలిగిన ఫోన్గా ఇది నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
సరికొత్త 2nm A20 ప్రో చిప్సెట్..
ఈ భారీ బ్యాటరీ సామర్థ్యంతో పాటు, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్లో యాపిల్ అత్యాధునిక 2 నానోమీటర్ (2nm) సాంకేతికతతో తయారు చేసిన A20 ప్రో (A20 Pro Chip) ప్రాసెసర్తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సరికొత్త చిప్సెట్ ఫోన్ పనితీరును అద్భుతంగా మెరుగుపరచడమే కాకుండా.. బ్యాటరీ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. దీనివల్ల వినియోగదారులకు గతంలో ఎప్పుడు లేని విధంగా అత్యుత్తమ బ్యాటరీ లైఫ్ లభిస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే హెవీ గేమింగ్, 4K వీడియో రికార్డింగ్ చేసినా కూడా బ్యాటరీ సుదీర్ఘ కాలం పాటు వస్తుంది..
డిజైన్ వివరాలు..
సాధారణంగా బ్యాటరీ సైజ్ పెరిగితే ఫోన్ మందం (Thickness) కూడా విపరీతంగా పెరుగుతుంది. అయితే, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ విషయంలో యాపిల్ తన ఇంటర్నల్ డిజైన్లో కొన్ని కీలక మార్పులు చేస్తున్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి.. దీనివల్ల ఫోన్ మందం పెరగకుండా కేవలం 8.75mm ప్రొఫైల్తోనే.. పాత మోడల్ అంతే స్లిమ్గా ఉంటునే.. పెద్ద బ్యాటరీని అడ్జస్ట్ చేయనున్నారు. కానీ, భారీ బ్యాటరీ, అధునాతన కెమెరా సెటప్ కారణంగా ఫోన్ బరువు స్వల్పంగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది సుమారు 240 గ్రాముల వరకు ఉండవచ్చని లీక్లు చెబుతున్నాయి.
డిస్ప్లే, ఇతర ఫీచర్లు..
ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్లో 6.9-ఇంచుల భారీ LTPO OLED డిస్ప్లేను అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ను సపోర్ట్ చేస్తుంది. డిజైన్ పరంగా వెనుక వైపు గ్లాస్ ఫినిషింగ్తో పాటు రీలోకేటెడ్ సెల్ఫీ కెమెరా, పంచ్-హోల్ డిస్ప్లే డిజైన్ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Siri AI) ఫీచర్లు మరింత వేగంగా పనిచేయడానికి ఇందులో 12GB వరకు ర్యామ్తో తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
లాంచ్, ధర వివరాలు..
సాధారణంగా యాపిల్ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో తన కొత్త ఐఫోన్ సిరీస్ను లాంచ్ చూస్తూ ఉంటుంది.. అదే విధంగా ఈ ఐఫోన్ 18 సిరీస్ను కూడా ఈ ఏడాది సెప్టెంబర్లో గ్రాండ్గా విడుదల చేయబోతున్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. విడిభాగాల ధరలు పెరుగుతున్నప్పటికీ.. యాపిల్ ఈ ఫ్లాగ్షిప్ సిరీస్ ధరలను గత ఏడాదితో పోలిస్తే.. పెద్దగా పెంచకుండా, దాదాపు అదే ధరల్లో అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోందని సమాచారం.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Amaravati Vs Mavigun: అమరావతి Vs మావిగన్.. జగన్ 'మావిగన్' సవాలుపై ఘాటుగా స్పందించిన సీఎం చంద్రబాబు..
Vijayawada, Andhra Pradesh:Amaravati Vs Mavigun News: ఆంధ్రప్రదేశ్ రాజధాని చుట్టూ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అమరావతికి ప్రత్యామ్నాయంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన 'మావిగన్' (మచిలీపట్నం - విజయవాడ - గుంటూరు) కాన్సెప్ట్ ఇప్పుడు రాష్ట్రంలో కొత్త చర్చకు తెరలేపింది. ఈ నేపథ్యంలో జగన్ విసిరిన సవాల్పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు.
జగన్ సవాల్ ఏమిటి?
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమరావతి రాజధాని నిర్మాణాన్ని జగన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతిలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. దానికి బదులుగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ 'మావిగన్' అనే సరికొత్త మెగా సిటీని రాజధానిగా జగన్ ప్రతిపాదించారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో 'మావిగన్ వర్సెస్ అమరావతి' అనే అంశాన్నే తమ ప్రధాన అజెండాగా మారుస్తామని, ప్రజలు ఏ రాజధానిని కోరుకుంటున్నారో ఎన్నికల్లోనే తేల్చుకుంటామని చంద్రబాబుకు జగన్ బహిరంగ సవాల్ విసిరారు. అమరావతి కంటే మావిగన్కే ప్రజల మద్దతు లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్..
తిరుపతిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు, జగన్ విసిరిన సవాల్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ వైఖరిని ఎండగడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
రోజుకో మాట - నిలకడలేని రాజకీయం: "ఆ గొడ్డలి పార్టీ నేతలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వారికి ఓ విధానం లేదు, రోజుకో మాట మాట్లాడుతుంటారు. ఎన్నికలకు ముందు అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులంటూ 'మూడు ముక్కలాట' ఆడారు. ఇప్పుడు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత మళ్లీ 'మావిగన్' అంటూ కొత్త నాటకానికి తెరలేపారు" అని చంద్రబాబు ఆక్షేపించారు.
దేవతల రాజధాని అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం అమరావతి మాత్రమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. "మన రాజధాని ఎప్పటికీ అమరావతే. అది దేవతల రాజధాని, ప్రజా రాజధాని. ఇందులో ఎలాంటి సందేహాలు లేవు" అని తేల్చిచెప్పారు.
రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికే ప్రతిపక్షం ఇలాంటి కొత్త ప్రతిపాదనలు చేస్తోందని చంద్రబాబు కొట్టిపారేశారు. జగన్ సవాల్ను తిప్పికొడుతూ, తమ ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయడానికే కట్టుబడి ఉందని సీఎం పునరుద్ఘాటించారు. ఈ పరిణామాలతో ఏపీలో 'రాజధాని' రాజకీయం మున్ముందు మరింత ముదిరేలా కనిపిస్తోంది.
ALso Read: చంద్రబాబుపై మరోసారి ధ్వజమెత్తిన వైఎస్ జగన్..రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగమంటూ ఆరోపణ!
Also Read: డిప్యూటీ సీఎంను దూషించిన కేసులో ప్రశ్న రావణ్కు బెయిల్..గంటలోనే మరో ట్విస్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
మంత్రులపై కేటీఆర్ ఆగ్రహం.. చర్చకు రాకుండా తొడలు కొడితే ప్రయోజనం ఏంటి?
Hyderabad, Telangana:KTR Challenge: మంత్రి జూపల్లి కోసం తెలంగాణ భవన్లో కుర్చీ వేసి వేచి చూసినా.. శాలువాతో సిద్ధంగా ఉన్నా ఆయన రాలేదు. గన్పార్క్ వద్ద చర్చకు రావడానికి కూడా నేను సిద్ధం. మేము అక్కడికి వెళ్దామని బయల్దేరితే పోలీసులను పెట్టి అరెస్టు చేస్తున్నారు. ఇక్కడ వేచి ఉంటే వాళ్లు తోక ముడిచారు. కాంగ్రెస్ మంత్రులు అక్కడ కూర్చుని తొడలు కొడితే ప్రయోజనం ఏమిటి?' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశ్నించారు.
హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద గన్పార్క్కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కార్యాలయంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'గన్పార్క్ వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం. మంత్రి జూపల్లితో చర్చ కోసం గన్పార్క్ బయలుదేరితే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కంచన్బాగ్కు వెళ్లి అక్కడ అరెస్ట్ అయిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను పరామర్శిద్దామని అనుకుంటే గేటు నుంచి అడుగు బయట పెట్టకుండా భారీగా పోలీసులను మోహరించారు' అని తెలిపారు.
'అక్కడ కూర్చుని మంత్రులు సవాళ్లు విసరడం.. ఇక్కడ పోలీసులతో మమ్మల్ని అడ్డుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం. చర్చించడానికి దమ్ము లేకనే రేవంత్ రెడ్డి, మంత్రులు వెన్నుచూపి పారిపోతున్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 'సంక్షేమ శాఖలో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని హరీశ్ రావు ఆరోపిస్తే గన్పార్క్కి మేము వస్తున్నాం, దమ్ముంటే రండి అని ముగ్గురు కాంగ్రెస్ మంత్రులు సవాల్ చేశారు. ఆ సవాల్ను స్వీకరించి హరీష్ రావు బయలుదేరితే వాస్తవాలు బయట పడితే, ప్రజల ముందు పరువు పోతుందనే భయంతో పోలీసులను పంపించి అడ్డుకున్నారు' అని మంత్రుల తీరుపై అహసనం వ్యక్తం చేశారు.
'బీఆర్ఎస్ పార్టీ నాయకులతో బహిరంగ చర్చకు కూడా రాలేని కాంగ్రెస్ పిరికిపందలు, చేతకాని దద్దమ్మలు చర్చలకు సిద్దమని సవాళ్లు ఎందుకు వేయాలి?' మంత్రుల తీరుపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలకు మేమే వారికి ఎక్కువ అని తెలిపారు. 'తెలంగాణ భవన్కి వస్తానని ఫోజులు కొట్టమన్నది ఎవరు మళ్లీ గన్పార్క్ అని లొకేషన్ మార్చామన్నది ఎవరు? నీకంటే పోలీస్ వాళ్ల ఎస్కార్ట్ ఉంది. కానీ మమ్మల్ని ఏమో బైటకి పోతే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు.
'పోలీసులని ఎవరు పంపుతున్నారు.. ముఖ్యమంత్రా, లేదా మంత్రులా. చర్చలని మీరే పిలుస్తారు. మళ్లీ పారిపోయేది మీరే! చేతకాని వెధవలు ఎవరో ప్రజలు చూస్తున్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. నిద్ర పోయేవాడిని లేపొచ్చు.. నిద్రని నటించేవాడిని ఎక్కడ లేపగలం అని మంత్రుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. 'రేవంత్ రెడ్డికి ప్రజాక్షేత్రంలో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ధైర్యం లేదు. గతంలో రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించి మేము ప్రెస్క్లబ్కు వెళ్తే రాకుండా మొహం చాటేసి పారిపోయాడు. మరోసారి తెలంగాణ అప్పులపై రేవంత్ రెడ్డి సవాల్ విసిరితే మేము సిద్దమని చెప్పాం.. మళ్లీ రాకుండా తోక ముడిచి పారిపోయాడు. మధ్యలో సందట్లో సడేమియా అని జూపల్లి దూరి తెలంగాణ భవన్కు వస్తానని డైలాగులు వేశాడు' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
