హైదరాబాద్ లో వానలు, కూలిన 200 పురాతన వృక్షం, 4 బైకులు ధ్వంసం, ఒకరికి గాయాలు
Hyderabad, Telangana:హైదరాబాద్ టోలిచౌకి గోల్కొండ ఎండి లైన్స్ లోని ఈదురా గాలులతో కూలీనా 200 సంత్సరాల చెట్టు.. చెట్టు కూలడం వల్ల ఓ వ్యక్తి కి తల పై గాయాలయ్యాయి మరియు 4ద్విచక్ర వాహనాలు డామేజ్ అయినాయి. సంఘటన స్థలానికి చేరుకున్న DRF బృందం సహాయక చర్యలు చేపట్టారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
గొర్రెలు కాస్తూనే.. NEETలో 694వ ర్యాంక్ సాధించిన కర్ణాటక విద్యార్థి!
Hyderabad, Telangana:Puttaraju Neet Success Story: పట్టుదలతో పాటు కఠోర శ్రమ, అంకితభావం ఉంటే.. ఎలాంటి పరిస్థితులనైనా.. పేదరికాన్ని అయినా అధిగమించి విజయ తీరాలకు చేరవచ్చని కర్ణాటకకు చెందిన విద్యార్థి పుట్టరాజు నిరూపించాడు.. నిత్యం గొర్రెలను కాస్తూ.. తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో ఆసరాగా నిలుస్తూనే.. నీట్ - NEETలో అత్యుత్తమ ర్యాంకు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఎస్టీ విభాగంలో 694వ ర్యాంకు..
కొప్పళ జిల్లా హనుమనహళ్లి గ్రామానికి చెందిన పుట్టరాజు ఇటీవల నీట్ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో గిరిజన (ఎస్టీ) విభాగంలో 694వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. నీట్ పరీక్షలో 720 మార్కులకు గానూ.. 511 మార్కులు సాధించి.. తన వైద్యుడి కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. పీయూసీ (PUC)లో 98 శాతం మార్కులతో పాసైన రాజు.. తొలి ప్రయత్నంలో నీట్లో ఆశించిన ఫలితం సాధించలేకపోయినా నిరాశ చెందలేదు.. ప్రత్యేక శిక్షణ తీసుకుని.. మలి ప్రయత్నంలో అద్భుత ప్రతిభ కనబరిచి.. విజయాన్ని సాధించాడు.
కష్టాల కడలి దాటి..
పుట్టరాజు ఎంతో కష్టతరమైన జీవితాన్ని గడిపేవాడు.. ఓవైపు చదువుకుంటూనే.. మరోవైపు రోజూ ఉదయాన్నే.. లేచి గొర్రెలకు మేత పెట్టడం.. వాటిని మేపడానికి పొలాలకు తీసుకెళ్లడం, షెడ్డును శుభ్రం చేయడం వంటి పనులన్నీ స్వయంగా చేసేవాడు.. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ.. కష్టపడుతుండటంతో వారికి బాసటగా నిలుస్తూనే.. లభించిన సమయాన్ని పుస్తకాలతో గడిపేవాడు.. ఇటీవల నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వివాదాల వల్ల దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొన్న సమయంలో కొంత నిరాశ ఎదురైనా.. తన లక్ష్యం నుంచి పక్కకు తప్పుకోకుండా దృఢ సంకల్పంతో చదువుకున్నాడు..
తల్లిదండ్రుల ప్రోత్సాహం..
పుట్టరాజు తండ్రి మహాబలేశ్ వ్యవసాయంతో పాటు బోర్వెల్ మరమ్మతు పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుమారుడి ఉన్నత చదువు కోసం ఆయన నిరంతరం ప్రోత్సాహాన్ని అందించేవారు.. తల్లి సావిత్రి తన కుమారుడి భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేసింది. వ్యవసాయ క్షేత్రంలోనే ఒక చిన్న ఇల్లు నిర్మించుకుని నివాసముంటూ.. కుమారుడికి తోడుగా నిలిచారు. కుమారుడు సాధించిన ఈ ఘన విజయంపై తండ్రి మహాబలేశ్ సంతోషం వ్యక్తం చేస్తూ.. నా కొడుకు గొర్రెలు మేపుతూనే కష్టపడి చదివాడు.. ఈ రోజు దేశ స్థాయిలో మంచి ర్యాంకు సాధించి డాక్టర్ కాబోతుండటం.. మా కుటుంబానికే కాకుండా, గ్రామానికి ఎంతో గర్వకారణమని తెలిపారు.
Also Read: ప్రొటెస్ట్ చేయడం ఎందుకు? స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా!!: నీట్ ర్యాంకర్
సమాజ సేవయే లక్ష్యం..
పుట్టరాజు సాధించిన విజయంతో హనుమనహళ్లి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.. గ్రామస్థులు, బంధువులు అతడిని ఘనంగా అభినందించారు. భవిష్యత్తులో మంచి వైద్యుడిగా మారి పేదలకు.. సమాజానికి సేవ చేయడమే తన ప్రధాన లక్ష్యమని పుట్టరాజు తెలిపాడు. పేదరికంతో పాటు వసతుల లేమి సాకులు కావని.. కష్టపడే తత్వం ఉంటే ఆశించిన గమ్యాన్ని చేరుకోవచ్చని పుట్టరాజు జర్నీ నిరూపిస్తోంది.
Also Read: ప్రొటెస్ట్ చేయడం ఎందుకు? స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా!!: నీట్ ర్యాంకర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
WTC Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ షెడ్యూల్ ఖరారు..ఈ సారి ఫైనల్ ఎక్కడ జరుగుతుందంటే?
England:WTC Final 2027 Schedule: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC 2025-27) సైకిల్ ఫైనల్ మ్యాచ్కి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రతిష్టాత్మక టైటిల్ పోరుకు లండన్లోని చారిత్రాత్మక 'ది ఓవల్' (The Oval) మైదానం వేదికగా నిలవనుంది.
ఈ మ్యాచ్ 2027 జూన్ 9 నుండి 13 వరకు జరగనుందని ఐసీసీ అధికారికంగా ధృవీకరించింది. మొదట ఈ ఫైనల్ను 'లార్డ్స్' మైదానంలో నిర్వహించాలని భావించినప్పటికీ, తుది నిర్ణయంలో లార్డ్స్ నుండి 'ది ఓవల్'కు వేదికను మార్చారు.
విశేషాలు, ముఖ్యాంశాలు..
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు 'ది ఓవల్' మైదానం ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండోసారి. గతంలో 2023 WTC ఫైనల్లో ఇక్కడే ఆస్ట్రేలియా, భారత్ను ఓడించి టైటిల్ను కైవసం చేసుకుంది. అయితే 2027 నాటికి టెస్ట్ క్రికెట్ ప్రారంభమై 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, ఈ ఫైనల్ మ్యాచ్ మరింత చారిత్రాత్మక ప్రాధాన్యతను సంతరించుకోనుంది.
ఈ టెస్ట్ ఛాంపియన్షిప్కు సంబంధించిన వరుస ఫైనల్ మ్యాచ్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిర్వహించడం గమనార్హం. 2027, 2029, 2031 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ నిర్వహణ హక్కులను ఐసీసీ ఇప్పటికే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB)కి అప్పగించింది. ప్రస్తుతం జరుగుతున్న WTC (2025-27) సైకిల్లో ఫైనల్ బెర్త్ దక్కించుకోవడానికి మొత్తం 9 జట్లు తీవ్రంగా పోటీపడుతున్నాయి.
"గత రెండేళ్లుగా నిలకడైన ప్రతిభ కనబరిచిన రెండు అత్యుత్తమ టెస్ట్ జట్లు ఈ ఫైనల్లో తలపడతాయి. టెస్ట్ క్రికెట్ 150వ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ జరిగే ఈ 2027 ఫైనల్ ప్రపంచవ్యాప్త అభిమానులకు ఒక అద్భుతమైన అనుభూతిగా మిగిలిపోతుంది" అని ఐసీసీ ఈవెంట్స్, ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ గౌరవ్ సక్సేనా తెలిపారు.
అలాగే వరుస డబ్ల్యూటీసీ ఫైనల్స్ నిర్వహించడంపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ నీల్ స్నోబాల్ స్పందించారు. "వరుసగా మూడు డబ్ల్యూటీసీ ఫైనల్స్కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం రావడం మాకు దక్కిన గౌరవం. 2023లో 'ది ఓవల్'లో జరిగిన ఫైనల్ ప్రేక్షకులు, ప్రసారకర్తలను విశేషంగా ఆకట్టుకుంది. 2027లో టెస్ట్ క్రికెట్ 150 ఏళ్ల వేడుకల సందర్భంగా జరిగే ఈ మ్యాచ్ మరిన్ని కొత్త రికార్డులను, జ్ఞాపకాలను అందిస్తుందని నమ్ముతున్నాం" అని నీల్ స్నోబాల్ అన్నారు.
Also Read: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్కు జైలు శిక్ష?! ఆ కేసులో అడ్డంగా బుక్కయ్యాడు!
Also Read: కావ్యా పాప కొంపముంచిన పాకిస్థాన్ స్పిన్నర్..రూ.2.45 కోట్లు దండగ..గెలిచే మ్యాచ్ ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Faceboo
'సర్'తో ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర.. అప్రమత్తంగా ఉండాలి: రేవంత్ రెడ్డి
Hyderabad, Telangana:Telangana SIR: 'భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ముందు కొడంగల్ కర్ణాటకలో ఉండేది. సర్ ప్రకియతో గ్రామాల్లో దళితులు, గిరిజనుల ఓట్లు పోయే అవకాశం ఉంది. ఓటు పోతే సంక్షేమ పథకాలు ఆగిపోయే అవకాశం ఉంది' అని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లక్ష్యంగా సర్ ప్రక్రియ జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ను దెబ్బతీయడమే లక్ష్యంగా సర్ ప్రక్రియ ఉందని విమర్శించారు. 'బీజేపీ నాయకుల మధ్య అంతర్గత కొట్లాటలు ఉన్నాయి.
దేశ, రాష్ట్ర పరిణామాలపై హైదరాబాద్లో మీడియాతో రేవంత్ రెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. నీట్ పేపర్ లీక్, సర్ ప్రక్రియ, బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు తదితర అంశాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 'తెలిసీ తెలియక రెండు ఓట్లు ఉన్నాయని అంటున్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని చెప్పండి. కలెక్టర్ అనుమతి తీసుకొని నా గ్రామంలో ఉన్న ఓటును కొడంగల్కు మార్చుకున్నా. గతంలో కొడంగల్ ప్రాంతం కర్ణాటకలోని జిల్లాలో ఉండేది. భాష ప్రయుక్త రాష్ట్రాలు చేసినప్పుడు కొడంగల్ పాలమూరులోకి వచ్చింది. బీజేపీ కుట్ర పూరితంగా ఓట్లు తొలగించే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతంలో అమాయకుల ఓట్లు పోయేలా ఉన్నాయి. సర్ ఉద్దేశం ప్రక్షాళన. కానీ కుట్రపూరితంగా సర్ను వాడుతున్నారు. సర్ పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే' అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లు పోతే కాంగ్రెస్ ఓట్లు పోయినట్టే. అవగాహన లేకపోవడం, సరైన సమయంలో స్పందించకపోవడంతో ఓట్లు పోయే అవకాశం ఉంది. ఓటు హక్కు లేకపోతే పథకాలు పోతాయి. ఓటుహక్కు లేకపోతే ఆధార్ పోతుంది. ఓటుహక్కు లేకపోతే గుర్తింపే ఉండదు కదా? ఓటు హక్కు లేకపోతే సంక్షేమం రాదు' అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
'సర్ ముగిసే వరకు గ్రామాల్లోనే ఉండమని చెప్పా. ఎమ్మెల్యేలకు కావాలనే గట్టిగా చెప్పా. 30 పర్సంటేజ్ కావాల్సి ఉంది. 30 పర్సంటేజ్ చాలా కీలకం. సర్ నాయకులకు సంబంధించింది కాదు.. ప్రజలకు సంబంధించింది' అని రేవంత్ రెడ్డి తెలిపారు. 'హైడ్రా బ్రహ్మాండంగా పని చేస్తుంది. చెరువులను పునరుద్ధరించింది. ప్రభుత్వ భూములను కాపాడింది' హైడ్రాపై ప్రశంసలు కురిపించారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలు రెఫరెండం అన్నాడు.. ఏమైంది? అని ప్రశ్నించారు. పెట్టుబడి పెట్టాడు కాబట్టే రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టామని వివరణ ఇచ్చారు.
నీటిపారుదల శాఖ మంత్రి పదవి నుంచి ఎందుకు తొలగించారో హరీష్ రావు చెప్పాలని రేవంత్ రెడ్డి కోరారు. కేసీఆర్కు తెలియకుండా కాళేశ్వరంలో రూ.వందల కోట్లు తీసుకున్నాడనే హరీశ్ రావును కేసీఆర్ పక్కనపెట్టాడని ఆరోపించారు. 'కన్నెపల్లి పంపుహౌస్ హరీశ్ రావు మంత్రిగా ఉన్నప్పుడు నిర్మాణమైంది. అతి తెలివితో మాట్లాడితే పిచ్చిలేసిందని మెంటల్ ఆస్పత్రిలో హరీశ్ రావుని చేరుస్తారు. కాళేశ్వరంలో గేట్లు ఎత్తి వేయాలని నిపుణులు స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ చెర్మన్ స్వయంగా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాడు. ఈ విషయాన్ని హరీశ్ రావు మాట్లాడటం లేదు' అని రేవంత్ రెడ్డి తెలిపారు.
'దేవాదులలో అన్ని పంపులు పని చేస్తున్నాయి. మేడిగడ్డ దగ్గర కాపర్ డ్యామ్ ఆకాశం నుంచి దిగి రాదు. మరో డ్యామ్ కట్టాలి. 5 మీటర్ల నీళ్లు ఉండాలంటే మేడిగడ్డ గేట్లు దిగాల్సిందే. ఒక్క రోజు మాత్రమే లక్ష క్యూసెక్కుల నీళ్లు మాత్రమే వచ్చాయి. నీళ్లు నిలపకపోతే బ్యారేజులు ఎందుకు కట్టారు. మేడిగడ్డ అంటే ప్రజలు తన్నుతారనే కన్నెపల్లి పంపుహౌస్ గురించి మాట్లాడుతున్నారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ, పీసీ ఘోష్ నివేదిక స్పష్టం ఉంది. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఇచ్చాం' అని రేవంత్ రెడ్డి వివరించారు.
'కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది. ఎన్నికల్లో అవయవదానం చేసి బీఆర్ఎస్ పార్టీ బీజేపీని గెలిపించింది. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలో లోకసభ ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు మెజారిటీ వచ్చింది?' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, సంతోశ్ రావు చుక్క రక్తం ఇచ్చారా అని ఎద్దేవా చేశారు. ఉద్యమంలో విద్యార్థుల రక్తం ధారపోశారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా పేదల రక్తం అమ్ముకుంటున్నారు.
'బీజేపీలో అంతర్గత కలహాలు ఉన్నాయి. బీజేపీ నాయకులకు ఒకరంటే ఒకరికి పడదు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లు ఎక్కడుంటాయో బీజేపీకి తెలుసు. చిన్నచిన్న కారణాలతో ఓట్లు తొలగిస్తున్నారు' అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు రూ.5 లక్షలు ఇవ్వాలని డిసైడ్ అయిందని చెప్పారు. తాము ఏం చేస్తున్నామో అదే చెప్తున్నట్లు ప్రకటించారు. 'ఘోష్ ఇచ్చిన నివేదికను సీబీఐ విచారణ కోసం పంపాం. సీబీఐ ఏదైనా విచారణ చెయ్యొచ్చు. ప్రజలు అధికారం ఇచ్చింది చట్టబద్దమైన పాలన చేయమని' అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆహార కల్తీపై కఠినంగా ఉన్నామని తెలిపారు.
'నచ్చితే నజరానా నచ్చకపోతే జరిమానా నా విధానం కాదు. చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ తప్పులపై విచారణ జరుగుతోంది. నాకు నచ్చలేదని వెంటనే శిక్ష వేయాలా? చార్లెస్ శోభ రాజు, బిల్లా రంగాలు కూడా జైల్లో ఉన్నారు. జైలుకు వెళ్తే ముఖ్యమంత్రులు అవుతారా?' అని చిట్చాట్లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 'ఉద్యోగాలపై చర్చకు నేను సిద్ధం. నోటిఫికేషన్ ఇవ్వాలి.. ప్రశ్నాపత్రం అమ్ముకోవాలనేది బీఆర్ఎస్ పార్టీ విధానం. నోటిఫికేషన్లు ఇచ్చి నియామక పత్రాలు ఇవ్వడం మా విధానం. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశా' అని చిట్చాట్లో రేవంత్ రెడ్డి తెలిపారు.
Jana Nayagan Remuneration: తమిళనాడు సీఎం విజయ్ చివరి సినిమా 'జన నాయగన్'..ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే?
Hyderabad, Telangana:Jana Nayagan Vijay Salary: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు 'దళపతి' విజయ్ నటించిన ఆఖరి చిత్రం 'జన నాయగన్' నేడు (జూలై 23) గ్రాండ్గా థియేటర్లలోకి వచ్చింది. తొలి షో నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోగా, ప్రపంచవ్యాప్తంగా విజయ్ అభిమానులు థియేటర్ల వద్ద బాణాసంచా కాలుస్తూ పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ భారీ ప్రాజెక్ట్ కోసం విజయ్తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
విజయ్ ఆల్ టైమ్ రికార్డ్ పారితోషికం!
తమిళ మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. తన చివరి చిత్రం 'జన నాయగన్' కోసం విజయ్ ఏకంగా రూ.220 కోట్ల నుంచి రూ.275 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది నిజమైతే భారతీయ సినిమా చరిత్రలోనే ఒక నటుడు తీసుకున్న అత్యధిక రెమ్యూనరేషన్లలో ఇది ఒకటిగా నిలవడం ఖాయం. ఒక సాదాసీదా నటుడిగా ప్రస్థానం ప్రారంభించి, 30 ఏళ్ల నటనా జీవితానికి రికార్డు స్థాయి విజయం, రాజకీయ ప్రవేశంతో వీడ్కోలు పలకడం విశేషం.
మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
దర్శకుడు హెచ్. వినోద్ రూ.25 కోట్లు (ఆయన కెరీర్లోనే ఇది అత్యధికం), సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ రూ.13 కోట్లు, కథానాయిక పూజా హెగ్డే రూ.6 కోట్లు, విలన్/కీలక పాత్రలో బాబీ డియోల్ రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లు, ప్రకాష్ రాజ్ రూ.5 కోట్లు, ప్రియమణి రూ.3 కోట్లు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ రూ.3 కోట్లు, నరైన్ రూ.2.5 కోట్లు, మమితా బైజు రూ.60 లక్షల నుండి రూ.2 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు కోలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి.
అడ్వాన్స్ బుకింగ్స్లోనే వసూళ్ల సునామీ!
వివాదాలు, వాయిదాల ఆందోళనల నడుమ విడుదలైన ఈ 'జన నాయగన్' సినిమాకు తమిళనాడు వ్యాప్తంగా 1,000కి పైగా స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. ఇది విజయ్ చివరి సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కేవలం ముందస్తు టికెట్ బుకింగ్ల ద్వారానే ఈ సినిమా రూ.40 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది.
Also Read: 'ఓం భీమ్ బుష్' హీరోయిన్ ఆయేషా ఖాన్ అరెస్ట్..నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లిన ముంబై పోలీసులు!
Also Read: Divya Bharathi: సుడిగాలి సుధీర్ హీరోయిన్ హాట్ ఘాటు అందాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
67W ఫాస్ట్ ఛార్జింగ్తో Xiaomi కొత్త పవర్ బ్యాంక్ లాంచ్.. ధర ఎంతంటే?
Hyderabad, Telangana:New Mi Power Bank Price: ప్రముఖ దిగ్గజ టెక్ సంస్థ షావోమి (Xiaomi) భారతీయ వినియోగదారుల కోసం ఒక శక్తివంతమైన, అత్యంత అద్భుతమైన పవర్ బ్యాంక్ను మార్కెట్లోకి విడుదల చేసింది. Xiaomi Power Bank 5i 20000mAh పేరుతో ఈ పవర్బ్యాంక్ జూలై 23న భారతదేశంలో అధికారికంగా లాంచ్ అయ్యింది. అత్యంత భారీ బ్యాటరీ కెపాసిటీతో పాటు వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన ఈ పవర్ బ్యాంక్ స్మార్ట్ఫోన్లతో పాటు ల్యాప్టాప్లను కూడా ఛార్జ్ చేసే ప్రత్యేకమైన సామర్థ్యం కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.
67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్..
ఈ కొత్త పవర్ బ్యాంక్ ప్రధాన ఆకర్షణ దీని 67W టర్బో ఫాస్ట్ ఛార్జింగ్ (Turbo Fast Charging) సపోర్ట్గా భావించవచ్చు.. ఇది స్మార్ట్ఫోన్లు మాత్రమే కాకుండా టైప్-సి (USB-C) పోర్ట్ ఉన్న ల్యాప్టాప్లతో పాటు టాబ్లెట్లను అత్యంత వేగంగా ఛార్జ్ చేస్తుందని కంపెనీ తెలిపింది.. షావోమి 15 స్మార్ట్ఫోన్ను కేవలం 30 నిమిషాల్లో 67 శాతం వరకు ఛార్జ్ చేస్తుందని కంపెనీ స్పష్టం తెలిపింది. అంతేకాకుండా, యాపిల్ ఐఫోన్ 15తో పాటు ఐఫోన్ 16 సిరీస్, ఆండ్రాయిడ్ ఫోన్లకు ఎంతగానో సహాయపడుతుంది.
డిజిటల్ డిస్ప్లే..
ఈ పవర్ బ్యాంక్లో వైర్లు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా.. ఇన్బిల్ట్ USB-C కేబుల్ను కూడా అందిస్తోంది.. అత్యంత అద్భుతమైన టీపీయూ (TPU) మెటీరియల్తో తయారైన ఈ కేబుల్.. సులభంగా పట్టుకోవడానికి ల్యాన్యార్డ్ (Lanyard)గా కూడా వినియోగించవచ్చు.. ఇందులో ఉన్న డిజిటల్ డిస్ప్లే స్క్రీన్, బ్యాటరీ శాతం ఎంత ఉందో సులభంగా తెలుసుకోవచ్చు.
ఒకేసారి మూడు డివైజ్లకు ఛార్జింగ్ సపోర్ట్..
ఈ పవర్ బ్యాంక్లో మూడు పోర్టులు ఇన్బిల్ట్ USB-C కేబుల్, వేరే USB-C పోర్ట్తో పాటు ఒక USB-A పోర్ట్లు లభిస్తున్నాయి. దీని ద్వారా ఒకేసారి మూడింటిన్నీ ఛార్జ్ చేసుకునే సపోర్ట్ లభిస్తుంది. అలాగే స్మార్ట్ వాచ్లతో పాటు బ్లూటూత్ ఇయర్ బడ్స్ వంటి చిన్న పరికరాలను ఛార్జ్ చేయడానికి ప్రత్యేకమైన లో-కరెంట్ (Low-current) మోడ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది..
ఈ పవర్ బ్యాంక్ను రీఛార్జ్ చేయడానికి కూడా 65W ఫాస్ట్ ఇన్పుట్ సపోర్ట్ లభిస్తుంది. దీనివల్ల కేవలం 2.5 గంటల్లోనే పవర్ బ్యాంక్ పూర్తి స్థాయిలో ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా దీని ఎనర్జీ రేటింగ్ 74.37Whగా ఉండడం వల్ల అంతర్జాతీయ విమాన ప్రయాణాలు చేసే క్రమంలో కూడా సులభంగా క్యారీ చేయోచ్చు. కాబట్టి ప్రయాణాల్లో హ్యాండ్ లగేజీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్లవచ్చని కంపెనీ తెలిపింది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
సెక్యూరిటీ ఫీచర్స్..
వినియోగదారుల సెక్యూరిటీ దృష్టిలో పెట్టుకుని.. కంపెనీ ఇందులో ఓవర్ వోల్టేజ్, షార్ట్ సర్క్యూట్తో పాటు ఎన్నో రకాల ప్రత్యేకమైన ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ షావోమి పవర్ బ్యాంక్ 5i ప్రముఖ ఈ కామర్స్ అమెజాన్, షావోమి అధికారిక వెబ్సైట్తో పాటు రీటైల్ స్టోర్లలో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bhogapuram Airport Slogan: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ వేళ బంపరాఫర్..చిన్న పనికి లక్ష రూపాయలు!
Gudepuvalasa, Andhra Pradesh:Bhogapuram Airport Slogan News: విజయనగరం జిల్లాలో నిర్మించిన 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం' (భోగాపురం ఎయిర్పోర్ట్) ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి విద్యార్థుల కోసం ఒక విశేషమైన పోటీని ప్రకటించారు. ఎయిర్పోర్ట్ ప్రాముఖ్యతను తెలుపుతూ ఆకట్టుకునే తెలుగు స్లోగన్ రూపొందించిన విద్యార్థికి రూ.1,00,000 (రూ.లక్ష) నగదు బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు.
పోటీ వివరాలు & దరఖాస్తు విధానం..
అర్హత: 6వ తరగతి నుండి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులు మాత్రమే పాల్గొనడానికి అర్హులు.
కంటెంట్ శైలి: స్లోగన్ కేవలం తెలుగులో మాత్రమే ఉండాలి. ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధి, విమానాశ్రయ ప్రాముఖ్యత, భవిష్యత్తు ఆశయాలను ప్రతిబింబించేలా ఉండాలి.
చివరి తేదీ: జులై 25, సాయంత్రం 5:00 గంటల లోపు పంపాల్సి ఉంటుంది.
సబ్మిషన్ వివరాలు: మీ స్లోగన్తో పాటు పేరు, చదువు, చిరునామా, మొబైల్ నంబర్లను జత చేసి క్రింది మార్గాల ద్వారా పంపవచ్చు.
వాట్సాప్ నంబర్: 9440749687
ఈ-మెయిల్ ఐడీ: airportslogan@gmail.com
అయితే ప్రభుత్వం, అధికారులు ఎంపిక చేసిన ఒకే ఒక్క ఉత్తమ స్లోగన్కు రూ.1 లక్ష నగదు బహుమతి లభిస్తుంది.
ప్రారంభోత్సవ ఏర్పాట్లు వేగవంతం
విమానాశ్రయ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి స్వయంగా ఆహ్వానించగా, ప్రధాని కూడా అంగీకరించారు. మరోవైపు అమరావతి సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులు ఉత్తరాంధ్ర జిల్లాల (శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, పార్వతీపురం మన్యం) అధికారులతో సమీక్ష నిర్వహించారు. జనసమీకరణ, రవాణా, భోజన, పార్కింగ్ వసతులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆగస్టు 1న ప్రారంభోత్సవం ఉండటంతో, లబ్ధిదారులకు పింఛన్లు కూడా ఒకరోజు ముందుగానే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Also REad: వైసీపీ నేత సీదిరి అప్పలరాజు అరెస్ట్! కొడుకు కోసం కటకటాల్లోకి మాజీ మంత్రి!
Also Read: Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nokia నుంచి అత్యంత దృఢమైన ఫోన్.. Nokia 123 Shield ఫీచర్లు ఇవే..
Hyderabad, Telangana:Nokia 123 Shield Phone Launch Soon: మొబైల్ దిగ్గజ బ్రాండ్ నోకియా హెచ్ఎమ్డీ (HMD Global) మార్కెట్లోకి సరికొత్త ఫీచర్ ఫోన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది.. నోకియా 123 షీల్డ్ (Nokia 123 Shield) పేరుతో అత్యంత ధృడమైన డిజైన్తో ఈ ఫోన్ను ప్రపంచ మార్కెట్లో విడుదల చేసింది. ఇది చూడడానికి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇందులో ధూళి, వాటర్, సెక్యూరిటీని అందించే ప్రత్యేక రేటింగ్తో పాటు భారీ బ్యాటరీ లైఫ్ను అందించేలా దీనిని తయారు చేశారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అత్యంత ధృడమైన డిజైన్..
పేరుకు తగ్గట్టుగానే.. ఈ ఫోన్ ఎంతో పటిష్టమైన బాడీ మెకింగ్తో అందుబాటులోకి వచ్చింది. కఠినమైన పరిస్థితుల్లో కూడా పాడవ్వకుండా.. పనిచేసేలా దీనికి IP65 రేటింగ్ అందించిన్నట్లు కంపెనీ తెలిపింది.. అంటే ధూళితో పాటు దుమ్ము, వర్షపు నీరు లేదా నీటి చుక్కలు పడినా ఈ ఫోన్ ఏమాత్రం పాడు కాకుండా ఉంటుంది. పొలం పనులు చేసేవారు.. ప్రయాణాలు ఎక్కువ చేసేవారు, రఫ్ వాడకం కోరుకునే వారికి ఇది సరైనదిగా భావించవచ్చు..
19 రోజుల బ్యాటరీ బ్యాకప్..
ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ సామర్థ్యమే.. ఇందులో 1,750 mAh సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 19 రోజుల పాటు స్టాండ్బై అందిస్తుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది. అంతేకాకుండా నిరంతరాయంగా 27.9 గంటల పాటు మాట్లాడే సామర్థ్యాన్ని కూడా అందిస్తోంది.. ఆధునిక USB Type-C పోర్ట్ను అందించడమే కాకుండా వేగవంతమైన ఛార్జింగ్ చేసుకునే ప్రత్యేకమైన సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
డిస్ప్లే, ప్రాసెసర్ స్పెసిఫికేషన్లు
ఈ మొబైల్ 2.4-అంగుళాల క్యూవీజీఏ (QVGA) డిస్ప్లేను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా 320x240 పిక్సెల్స్ రెసల్యూషన్తో అందుబాటులోకి వచ్చింది. ఇది యూనిసోక్ (Unisoc SC6531E) ప్రాసెసర్పై ఇది పనిచేస్తుంది. ఇందులో 4MB ర్యామ్, 4MB ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.. మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజ్ను 32GB వరకు పెంచుకునే సదుపాయం ఉంది.
కెమెరాతో పాటు ఇతర ఫీచర్లు..
నోకియా 123 షీల్డ్ ఫోన్లో వెనుక వైపు LED ఫ్లాష్తో కూడిన కెమెరా కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.. చీకటి సమయంలో ఇది టార్చ్ లైట్లా కూడా అద్భుతంగా ఉపయోగపడుతున్నట్లు కంపెనీ తెలిపింది.. వీటితో పాటు వైర్లెస్ ఎఫ్ఎమ్ రేడియో, 3.5mm ఆడియో జాక్, బ్లూటూత్ (Bluetooth) కనెక్టివిటీ ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ ఫోన్ మందం 15 మిల్లీమీటర్లు కాగా.. బరువు కేవలం 108 గ్రాములు మాత్రమే ఉంటుంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ధర వివరాలు..
కంపెనీ ఈ ఫోన్ను అత్యంత బడ్జెట్ ధరలోనే అందుబాటులోకి తెస్తున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎమ్డీ గ్లోబల్ అధికారిక వెబ్సైట్లో దీని స్పెసిఫికేషన్లను అందుబాటులో ఉన్నప్పటికీ.. ధర, భారత మార్కెట్లో అమ్మకాల తేదీలను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ఆగస్టులో ఈ 5 రాశుల వారికి రాజయోగం.. ధన వర్షంతో పాటు ఊహించని అదృష్టం!
Hyderabad, Telangana:August Lucky Zodiac Signs: అతి త్వరలోనే ఆగస్టు నెల మొదలు కాబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ నెల చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ నెలలో సూర్యుడు, కుజుడితో పాటు బుధుడు, చంద్రుడు, శుక్రుడు, రాహువు అనే ఆరు ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మార్చుకోనున్నాయి. ఈ పెద్ద గ్రహ సంచారాలు 12 రాశుల వారి జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ 31 రోజులలో ముఖ్యంగా ఐదు రాశుల వారి అదృష్టం ఊహించని స్థాయిలో లభించబోతోంది.. చాన్నాళ్లుగా నిలిచిపోయిన పనులు పూర్తవ్వడమే.. కాకుండా ఉద్యోగం, వ్యాపారాల్లో వీరు అద్భుతమైన పురోగతి లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.. ఆ అదృష్ట రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆగస్టులో గోల్డెన్ టైమ్ పొందే అదృష్ట రాశులు ఇవే..
మేష రాశి (Aries)
మేష రాశి వారికి ఆగస్టు నెల ఎంతో అద్భుతంగా ఉండబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగస్తులకు తమ పైఅధికారులు, బాస్ నుండి పూర్తి సహకారం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు అద్భుతమైన అవకాశాలు కూడా కలుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ లభించే బలమైన అవకాశాలు ఉన్నాయి.
తులా రాశి (Libra)
తులా రాశి వారు ఈ నెలలో ప్రతి రంగంలోనూ సానుకూల ఫలితాలను పొందుతారు. చదువులో, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్తలు కూడా సులభంగా అందుకుంటారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించి.. కుటుంబంలో ఆనందోత్సవాల వాతావరణం నెలకొంటాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా ఉన్న సమస్యలు కూడా పరిష్కారం కాబోతున్నాయి.
సింహ రాశి (Leo)
సింహ రాశి వారికి ఈ నెల అత్యంత శుభప్రదంగా ఉండబోతోంది.. పని ప్రదేశంలో సహోద్యోగుల నుంచి పూర్తి సపోర్ట్ లభించి.. కెరీర్లో పురోగతి వేగంగా లభించే ఛాన్స్లు కూడా కనిపిస్తున్నాయి. పాత మిత్రులను కలవడం వల్ల మనస్సు సంతోషంగా కూడా మారుతుంది.. విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉండే ఛాన్స్లు కూడా కనిపిస్తున్నాయి.
కుంభ రాశి (Aquarius)
కుంభ రాశి వారికి ఈ నెల పెద్ద ఊరటను అందిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు నెమ్మదిగా పూర్తి కావడం ప్రారంమవుతాయి. జీవన భాగస్వామి నుంచి పూర్తి సహకారం లభించి బంధం బలపడుతుంది. ఈ సమయంలో ఆహ్లాదకరమైన దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి..
వృశ్చిక రాశి (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ సమయం ఎంతో ఫలప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దాంపత్య జీవితం మరింత మధురంగా మారబోతోంది. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మానసిక ప్రశాంతత లభించి.. రోజులు ప్రశాంతంగా ముందుకు సాగుతాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
శ్రావణ మాసంలో శని దేవుడి కీలక మార్పు.. ఈ రాశుల వారికి డిసెంబర్ వరకు హెచ్చరిక!
Hyderabad, Telangana:Saturn Retrograde 2026 Effect On Zodiac: నవగ్రహాల్లో న్యాయాధిపతిగా భావించే.. శనిదేవుడి గమనంలో కీలక మార్పు జరగబోతోంది.. 2026 జూలై 27న శని గ్రహం మీన రాశిలో వక్ర గమనం ప్రారంభమవుతుంది. ఈ వక్ర సంచారం డిసెంబర్ 11 వరకు సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మరోవైపు, జూలై 30 నుంచి పవిత్ర శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది.. శ్రావణ మాసంలో శని వక్ర గమనం చేపట్టడం జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో నాలుగు రాశుల వారు ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో తప్పకుండా ఓర్పుతో వ్యవహరించడం చాలా మంచిది. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారు తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
మేష రాశి వారికి శని వక్రగమనంలో వెళ్లడం కారణంగా వృత్తి, ఉద్యోగ రంగాల్లో తీవ్రమైన పని ఒత్తిడి పెరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. హఠాత్తుగా అదనపు బాధ్యతలు భుజాన పడటం వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కార్యాలయంలో ఉన్నతాధికారులతో అభిప్రాయ భేదాలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి.. వ్యాపారస్తులు ఈ సమయంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం కాదని నిపుణులు సూచిస్తున్నారు. పెట్టిన పెట్టుబడులు లేదా రావాల్సిన డబ్బులు నిలిచిపోయే ఛాన్స్లు కనిపిస్తున్నాయి. అనవసర వాదనలకు, తగాదాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది..
కర్కాటక రాశి:
కర్కాటక రాశి జాతకులకు ఈ కాలం ఆర్థిక, కుటుంబ పరంగా కొన్ని ప్రతికూల ఫలితాలను అందించే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. ఊహించని రీతిలో ఖర్చులు పెరిగి బడ్జెట్ తలకిందులవుతుందని నిపుణులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు.. మానసిక ఆందోళనలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దు. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు..
మకర రాశి:
శని అధిపతిగా ఉన్న మకర రాశి వారికి ఈ వక్ర గమనం వ్యాపార రీత్యా కష్టకాలాన్ని అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. లాభదాయకంగా కనిపిస్తున్న ఒప్పందాలు కూడా చివరి నిమిషంలో చేతిదాటిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరికీ అప్పులు ఇవ్వకూడదని నిపుణులు తెలుపుతున్నారు. మాట్లాడేటప్పుడు మాట తీరుపై నియంత్రణ అవసరం. ప్రతి ఆర్థిక నిర్ణయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోవడం మేలని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మీన రాశి:
శని మీన రాశిలోనే వక్ర గమనం చేయడం వల్ల ఈ రాశి వారిపై ప్రభావం కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. చేతికి అందివచ్చిన ప్రాజెక్ట్లు చివరి క్షణంలో నిలిచిపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తాయి. ఊహించని భయాలు, నిద్రలేమి, మానసిక అశాంతి వంటి సమస్యలు ఎదురవుతాయి. కోర్టు, చట్టపరమైన వ్యవహారాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.. ఈ సమయంలో ఆర్థికండా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
ఈ రోజు నుంచే గోల్డెన్ డేస్.. శని-శుక్రుల శుభ దృష్టితో ఈ రాశుల వారికి బంపర్ జాక్పాట్!
Hyderabad, Telangana:Shadashtak Yoga 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనాలతో పాటు వాటి దృష్టికి ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.. ముఖ్యంగా జూలై 23వ తేది వీటికి చాలా ప్రత్యేకమైనదిగా భావించవచ్చు. ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన గ్రహం కదలికలు జరిగాయి. సంపద, వైభవం, సౌందర్యానికి కారకుడైన శుక్రుడు.. న్యాయానికి, కర్మఫలానికి అధిపతియైన శని గ్రహం ఒకదానికి ఒకటి.. 150 డిగ్రీల కోణంలోకి రాబోతున్నాయి. దీని కారణంగా షడాష్టక దృష్టి యోగం ఏర్పడుతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు..
సాధారణంగా జ్యోతిష్య నిపుణులు షడాష్టక యోగాన్ని ప్రతికూలంగా భావిస్తారు. అయితే, శని, శుక్ర గ్రహాల మధ్య స్నేహభావం ఉండడం వల్ల.. ఈ అరుదైన యోగం ప్రతికూలతలకు బదులుగా అపారమైన శుభ ఫలితాలను అందిస్తుంది.. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశులవారికి ఈ రోజు నుండి అదృష్టం లభించి.. ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలు కూడా తొలగిపోతాయి.
ఈ రాశులవారికి బంపర్ జాక్ఫాట్..
వృషభ రాశి
వృషభ రాశికి అధిపతి శుక్రుడే కావడం వల్ల ఈ రాశి వారికి రాజయోగం పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగంలో ఊహించని పురోగతి లభిస్తుంది. పైఅధికారులతో సంబంధాలు కూడా మెరుగుపడతాయి.. పదోన్నతి లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అకస్మాత్తుగా ధనలాభం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. భోగభాగ్యాలు పెరిగి జీవితం సౌకర్యవంతంగా మారుతుంది.
మిథున రాశి
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ యోగ ప్రభావంతో సజావుగా పూర్తవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు లభించి.. ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి కలుగుతుంది.. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
తులా రాశి
తులారాశి వారికి నేటి నుంచి సువర్ణ కాలం మొదలవుతుంది.. అదృష్టం పూర్తిగా మీ వైపే ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది. సమాజంలో హోదా.. గౌరవ ప్రతిష్టలు విసరీతంగా పెరుగుతాయి. వ్యాపారాలు వేగంగా విస్తరిస్తారు. మీ సరైన ఆలోచనలు, నిర్ణయాలు మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టే ఛాన్స్లు కూడా ఉన్నాయి.
మకర రాశి
మకర రాశి వారికి ఈ యోగం ఊహించని ధనయోగాన్ని అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పూర్వీకుల ఆస్తులు కలసిరావడం లేదా పాత పెట్టుబడుల నుంచి భారీగా లాభాలు రావడం ప్రారంభమవుతాయి. నాడీ సంబంధిత మానసిక ఒత్తిళ్లకు స్వస్తి చెప్పి.. ప్రశాంతంగా ఉండాల్సిన సమయమిది. అంతేకాకుండా అన్ని పనులు మీకు చాలా అనుకూలంగా మారుతాయి.
కుంభ రాశి
వృత్తి పరంగా కుంభ రాశి వారికి ఇది అత్యంత అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. స్టాక్ మార్కెట్, షేర్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు కలుగుతాయి. వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు చేతికి అందుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఎప్పటినుంచో వేధిస్తున్న అనేక సమస్యలు సులభంగా తొలగిపోతాయి..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Ayesha Khan Arrest: 'ఓం భీమ్ బుష్' హీరోయిన్ ఆయేషా ఖాన్ అరెస్ట్..నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లిన ముంబై పోలీసులు!
Mumbai, Maharashtra:Ayesha Khan Arrested: ఇటీవలే విడుదలైన 'ధురందర్' సినిమాతో పాటు తెలుగులో 'ఓం భీమ్ బుష్' చిత్రంలో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అయేషా ఖాన్. తాజాగా ఈమెను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అయేషా స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
తనను పోలీసులు వ్యాన్లోకి ఈడ్చుకెళ్లి ఎక్కించారని ఆవేదన వ్యక్తం చేస్తూ "నేను ఎలాంటి నినాదాలు చేయలేదు, ఏ నిరసనలోనూ పాల్గొనలేదు. కేవలం శాంతియుతంగా రోడ్డుపై నిలబడి ఉన్నాను. మరి నన్నెందుకు అరెస్టు చేశారు?" అని ఆమె పోలీసుల చర్యను ప్రశ్నించారు.
ఘటనకు సంబంధించిన ముఖ్యాంశాలు..
రోడ్డుపై ప్రశాంతంగా నిలబడి ఉన్నప్పటికీ తనను అదుపులోకి తీసుకున్నారని, తీవ్ర భయాందోళనకు గురికావడంతో తన చేతులు వణుకుతున్నాయని అయేషా వీడియోలో తెలిపారు. మొదట పోలీసులు తన సోదరుడిని, స్నేహితులను అదుపులోకి తీసుకోవడంతోనే తాను రోడ్డుపై వేచి ఉన్నానని, అసలు గొడవకే దిగనప్పుడు ఏ ప్రాతిపదికన అరెస్టు చేశారని నిలదీశారు.
నలుగురు మహిళా పోలీసులు తనను బలవంతంగా వ్యాన్లోకి లాక్కెళ్లారని ఆరోపించారు. తాము ఐదుగురి కంటే ఎక్కువ మంది లేమని, అలాంటప్పుడు ట్రాఫిక్కు అంతరాయం కలిగించారనే నెపంతో కేసు పెట్టడం సరికాదని వాపోయారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలని అడిగినా అధికారులు సమాధానం ఇవ్వలేదని చెప్పారు.
పోలీసు వ్యాన్ లో విద్యార్థుల ఆందోళన
ఆయేషా షేర్ చేసిన వీడియోల్లో ఆమెతో పాటు కొందరు విద్యార్థులు కూడా పోలీసు వ్యాన్లో కనిపించారు. ఎలాంటి కారణం లేకుండానే తమను పట్టుకున్నారని ఒక విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు గణితం ప్రాక్టికల్ పరీక్ష ఉందని, సమయానికి వెళ్లకపోతే తన భవిష్యత్తు దెబ్బతింటుందని వాపోయాడు. విద్యార్థుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై కూడా అయేషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుల్లితెర రియాలిటీ షోలు, మ్యూజిక్ వీడియోల ద్వారా క్రేజ్ సంపాదించిన అయేషా ఖాన్.. 'ధురందర్' చిత్రంతో మరింత పాపులర్ అయ్యారు. ఈ ఘటనతో ఆమె అభిమానులు, సోషల్ మీడియా నెటిజన్లు ముంబై పోలీసుల ప్రవర్తనపై విమర్శలు గుప్పిస్తూ వివరణ కోరుతున్నారు. అయితే, ఈ ఆరోపణలపై గానీ, ఆమెను అదుపులోకి తీసుకోవడానికి గల కారణాలపై గానీ ముంబై పోలీసుల నుండి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Also Read: 52 ఏళ్ల వయసులోనూ ఐశ్వర్యారాయ్ జీరో సైజ్లో..స్లిమ్ అవతారంలో ఐశ్వర్య లుక్ అదిరిపోయేలా
Also Read: Divya Bharathi: సుడిగాలి సుధీర్ హీరోయిన్ హాట్ ఘాటు అందాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
సంఘాలు వద్దు.. చందాలు కట్టం.. ఉపాధ్యాయ సంఘాలకు బిగ్ షాక్ ఇచ్చేలా టీచర్ల సంచలన తీర్మానం..!!
Secunderabad, Telangana:Boycott by Telangana Teachers Associations: గత కొన్ని దశాబ్దాలుగా ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడుతున్నామని.. చెప్పుకుంటున్న సంఘాలకు ఇప్పుడు సొంత సభ్యుల నుంచే ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. మీ సంఘాలు మాకు వద్దు.. మీ సభ్యత్వం అసలే వద్దు అటూ ప్రభుత్వ పాఠశాలల టీచర్లు బాహాటంగానే తిరుగుబాటు బావుటాను ఎగురవేస్తున్నారు. ఇక నుంచి ఏ సంఘానికి వార్షిక సభ్యత్వం ఫీజులు చెల్లించమంటూ పాఠశాలల వారీగా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తుండటం ఇప్పుడు సంచలనంగా మారింది. రాష్ట్రంలో దాదాపు 1.10 లక్షల మందికి పైగా ఉపాధ్యాయులున్నారు. వీరంతా పీఆర్టీయూ, యూటీఎఫ్, టీపీటీఎఫ్, ఎస్టీయూ, డీటీఎఫ్ వంటి వివిధ సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. ఏటా ఈ సంఘాలకు సభ్యత్వ రుసుము చెల్లిస్తూనే ఉన్నారు. కొంతకాలంగా ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో ఈ సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
టీచర్లు లేవనెత్తుతున్న ప్రశ్నలు ఇవే:
• సుమారు ఆరు డీఏలు పెండింగ్ లో ఉన్నా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాధించడంలో సంఘాలు ఎందుకు వెనకబడి ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు. కొత్త పీఆర్సీ ఫిట్మెంట్ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ పొందలేక పోవడం. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేసి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) పునరుద్ధరించాలనే ప్రధాన డిమాండ్ గాలికొదిలేశారా? అని యూనియన్ నేతలను ప్రశ్నిస్తున్నారు.
• క్షేత్రస్థాయిలో గట్టి పోరాటాలు చేయాల్సింది పోయి, కేవలం వినతిపత్రాలకే సంఘ నాయకులు పరిమితమవుతున్నారని టీచర్లు మండిపడుతున్నారు. మరికొందరేమే సొంత పైరవీలు చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల వనపర్తి, మెదక్, ఆది లాబాద్ వంటి జిల్లాల్లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమావేశమై ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒకే స్కూల్లో వేర్వేరు సంఘాలకు చెందిన టీ చర్లు ఉన్నప్పటికీ, అందరూ ఏకతాటిపైకి వచ్చి.. ఏ సంఘానికీ చందా కట్టం అని తీర్మానించారు.
ఇతర శాఖల్లోనూ చర్చ:
ఒక పాఠశాలలో మొదలైన ఈ తీర్మానాల పరంపర ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రాష్ట్రమంతటా పాకుతోంది. ఒక స్కూల్ టీచర్లు చేసిన తీర్మానం కాపీలు చూ సి, ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమవు తున్నారు. ఇది కేవలం ఉపాధ్యాయ రంగంతోనే ఆగిపోకుండా, ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగ సంఘాల్లోనూ కలవరం పుట్టిస్తోంది. సభ్యత్వ రుసుం నిలిపివేస్తే సంఘాల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని నాయకులు ఆందోళన చెందుతున్నారు. సం ఘాల నాయకులు ప్రభుత్వం వద్ద తమ వ్యక్తిగత పనుల కోసం పాకులాడుతున్నారు తప్ప, సాధారణ ఉపాధ్యాయుడి కష్టాలను పట్టించుకోవడం లేదు అనేది మెజారిటీ టీ చర్ల వాదన. ఇప్పటికైనా సంఘాలు తమ పంథాను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: సీపీఎస్ రద్దు కోసం జన జాగరణ యాత్ర..ఆగస్టు 23న హైదరాబాద్లో మహా సభ..!!
Also Read: భూమిపై మోస్ట్ మిస్టీరియస్ ప్లేస్..సూర్యుడికి అత్యంత దగ్గర
Also Read: ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ 10 పాములు ఇవే
Also Read: ప్రపంచాన్ని షేక్ చేస్తున్న వింత మద్యం.. బ్రాందీ, విస్కీ కాదు.. అత్యధికంగా తాగేది దీనినే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
రోడ్డు ప్రమాదానికి హత్యానేరమా? సీదిరి అప్పలరాజు అరెస్ట్ను ఖండించిన మాజీ సీఎం వైఎస్ జగన్
Palasa, Andhra Pradesh:Seediri Appalaraju Arrest: రోడ్డు ప్రమాదాన్ని కూడా రాజకీయ కక్షసాధింపు కోసం ఆయుధంగా మార్చుకునే స్థాయికి చంద్రబాబు ప్రభుత్వం నీచంగా దిగజారిపోయిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదం ఘటనలో హత్యానేరం మోపడాన్ని తీవ్రంగా ఖండించారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బీసీ నాయకుడు సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నడుపుతూ పొరపాటున రోడ్డు ప్రమాదానికి కారకుడు అయితే దీనిపై మాజీ మంత్రి అప్పలరాజు అరెస్ట్ చేయడం అన్యాయం అని ప్రకటించారు.
కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదం కేసులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేయడంపై 'ఎక్స్' వేదికగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సెక్షన్లు కాకుండా.. హత్యానేరం అభియోగాలు మోపి పిల్లాడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ఇప్పుడు అతడి తండ్రి అప్పలరాజుని కూడా అరెస్టు చేయడం చూస్తే, ఒక వైఎస్సార్సీపీ నాయకుడి కుటుంబాన్ని రాజకీయంగా వేధించడమే చంద్రబాబు లక్ష్యంగా మారింది' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. సీదిరి అప్పలరాజు చేసిన అసలు తప్పేమిటి? చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడమా? పలాస ప్రజల తరఫున నిలబడటమా? ఒక డాక్టర్గా మంచి పేరు సంపాదించి సేవ చేయడమా? అని చంద్రబాబుపై ప్రశ్నలు సంధించారు.
'రాజకీయ అజెండాను చంద్రబాబు ఎల్లో మీడియాతో రాయించడం.. ఆ తర్వాత పోలీసులు దాన్ని కేసుగా మార్చడం, రాష్ట్రంలో అమలవుతున్న కొత్త చట్టవ్యవస్థ ఇదే. టీడీపీ నాయకులు, మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరులతో జరిగిన రోడ్డు ప్రమాదాలన్నింటికీ ఇదే వర్తింపజేస్తారా?' అని చంద్రబాబును మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. టీడీపీ నాయకుడి కుటుంబ సభ్యుడు వాహనం నడుపుతూ ప్రమాదం చేశాడనే ఆరోపణలు వస్తే అతడిని.. వారి కుటుంబంలోని ఇతర సభ్యులను కూడా ఇలాగే అరెస్టు చేస్తారా? అని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తున్న నాయకులను కేసుల్లో ఇరికించి వారి గొంతునొక్కాలన్నదే ఈ అరెస్టుల వెనుక కనిపిస్తున్న కుట్ర అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపణలు చేశారు.
ఒక రోడ్డు ప్రమాదాన్ని కూడా రాజకీయ కక్షసాధింపుకోసం ఆయుధంగా మార్చుకునే స్థాయికి @ncbn గారి ప్రభుత్వం నీచంగా దిగజారిపోయింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బీసీ నాయకుడు, మాజీమంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు, 18 ఏళ్ల పిల్లాడు, బైక్ నడుపుతూ, పొరపాటున రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడన్న…
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 22, 2026
'సీదిరి అప్పలరాజు సామాన్య మత్స్యకార కుటుంబం నుంచి తన సొంత ప్రతిభతో ఎదిగిన వ్యక్తి. చదువుల్లో రాణించి వైద్యుడిగా ఎదిగి, ఎంతోమందికి వైద్యసేవలు అందించి ప్రాణాలు కాపాడారు' అని మాజీ సీఎం వైఎస్ జగన్ వివరించారు. అలాంటి వ్యక్తిని తప్పుడు అభియోగాలతో నేరస్తుడిగా చిత్రీకరించాలని చూడటం అత్యంత దుర్మార్గం అని ఖండించారు. 18 ఏళ్ల పిల్లాడు బైక్ నడుపుతూ పొరపాటున గొర్రెల కాపరిని ప్రమాదవశాత్తూ యాక్సిడెంట్ చేస్తే అది హత్య ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. 18 ఏళ్ల పిల్లాడు యాక్సిడెంట్ చేస్తే అతడి తండ్రికి ఎలా సంబంధం ముడిపెడతారు? ఇది అన్యాయం కాదా? అని చంద్రబాబును వైఎస్ జగన్ నిలదీశారు.
అరెస్టులతో వైఎస్సార్సీపీని భయపెట్టలేరు అని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రజల కోసం పోరాడే ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుందని ప్రకటించారు. అధికారం శాశ్వతం కాదని.. ప్రతి తప్పుడు కేసు, చేయిస్తున్న ప్రతి అక్రమ అరెస్టు, అధికార దుర్వినియోగం వీటన్నింటికి ప్రజలు తప్పక గుణపాఠం చెప్తారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హెచ్చరించారు.
ఉద్రిక్తతల వేళ మోదీ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ మూడు డిమాండ్లు.. అవి ఏమిటంటే?
New Delhi, Delhi:Dharmendra Pradhan Resign: నీట్ పరీక్ష పేపర్ లీక్పై పోరాటం చేస్తు0న్న విద్యార్థులపై పోలీసులు అమానుషంగా లాఠీఛార్జ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఖండించారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక దేశంలో 152 సార్లు పేపర్లు లీకేజ్లు జరిగాయని ప్రకటించారు. అన్ని సార్లు పేపర్ లీకేజీలు జరిగితే ఒక్కరికి కూడా శిక్ష పడలేదని చెప్పారు. నిరసనలు తప్ప విద్యార్థులు చేసిన నేరం ఏమిటని ప్రశ్నించారు. భారతదేశంలో విద్యా వ్యవస్థను మోదీ నాశనం చేశారని ఆరోపించారు. ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఎన్డీఏ సర్కారు పబ్లిక్ సెక్టార్లను ప్రైవేటీకరిస్తోందని చెప్పారు.
నీట్ విద్యార్థుల కోసం న్యూఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జంతర్ మంతర్లో చోటుచేసుకున్న ఉద్రిక్తత పరిస్థితులు, లాఠీచార్జ్లపై వీడియోలు చూపించి పోలీసుల దమనకాండను ఖండించారు. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా విద్యార్థులు న్యాయం, జవాబుదారీతనం కోరుతూ తమ గళాన్ని వినిపిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మూడు డిమాండ్లు చేశారు.
రాహుల్ మూడు డిమాండ్లు
1. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి.
2. విద్యార్థులపై దాడి చేసిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుని బాధ్యులను శిక్షించాలి.
3. విద్యార్థులకు జరిగిన అన్యాయంపై ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి.
మోదీ ప్రభుత్వం 152 ప్రశ్నపత్రాల లీకులు జరిగాయని.. వాటి వలన 7.5 కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమయ్యారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. అయితే వీటిలో ఒక్కరికి కూడా శిక్ష పడలేదని చెప్పారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని.. విద్యార్థులకు నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని రాహుల్ చెప్పారు.
We fully support the students' demands. The Opposition, as a whole, 100 percent supports these demands.
: LoP Shri @RahulGandhi pic.twitter.com/c0isuuVnll
— Congress (@INCIndia) July 22, 2026
ఒకప్పుడు ప్రపంచంలో అత్యుత్తమ విద్యా వ్యవస్థల్లో ఒకటిగా పేరొందిన భారత విద్యా వ్యవస్థ ఇప్పుడు అక్రమాలతో నిండిన వ్యవస్థగా మారిందని మోదీ పాలనపై లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తెలిపారు. పదేళ్లలో 152 ప్రశ్నాపత్రాల లీక్లు జరగ్గా.. నెలకు దాదాపు ఒకటి చొప్పున జరుగుతున్నట్టేనని పేర్కొన్నారు. లీక్ల ప్రభావంతో 7.5 కోట్ల మంది విద్యార్థులు, వారి కుటుంబాలపై పడిందని.. వారంతా మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందినవారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
పేద, మధ్య తరగతి ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తున్నారని.. వారి ఆశలను పూర్తిగా అవమానిస్తున్నారని మోదీ పాలనపై రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. 'కొందరు వ్యక్తులు లేదా ఒక వర్గం భారతదేశ విద్యా వ్యవస్థను, దేశంలో అత్యంత విలువైన సంపదైన విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏం చేసింది?' అని ప్రశ్నించారు. ఒక్క శిక్ష కూడా పడలేదని చెప్పారు. విద్యా వ్యవస్థ అక్రమాలతో నిండిపోయిందనేది ఒక్క విషయమే కాదని.. సామాన్య ప్రజలకు అందని స్థాయిలో ఖరీదుగా కూడా మారిందని తెలిపారు.
pic.twitter.com/qzDPYdNdoxThe Congress Party, the entire Opposition, and LoP Shri Rahul Gandhi stand firmly with the students and their demands.
— Congress (@INCIndia) July 22, 2026
చంద్రబాబు పాలనలో దళారులదే రాజ్యం.. పొగాకు రైతులకు అండగా ఉంటా: వైఎస్ జగన్
Tadepalli, Andhra Pradesh:YS Jagan With Farmers: 'చంద్రబాబు పాలనలో అంతా దళారులదే రాజ్యం. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఆక్వాది అదే స్థితి. వ్యాపారులంతా సిండికేట్. ఎక్కడికక్కడ దోపిడీ పర్వం. సీజన్ ముగుస్తున్నా పొగాకు కొనుగోళ్లు లేవు. ఇప్పటి వరకు కొన్నది కేవలం 16.5 శాతమే' అని మాజీ సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అత్యధికంగా కేజీ రూ.411. 2023–24లో సగటు ధర కేజీ రూ.289 పలికింది. అది అత్యుత్తమ ధర అని నాడు కేంద్రం రిపోర్ట్' అని వైఎస్ జగన్ గుర్తుచేశారు. పొగాకు రైతులకు అండగా, తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. పొగాకు రైతుల సమస్యలపై గట్టిగా పోరాడుతామని.. ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని.. పొగాకు రైతులెవరూ ధైర్యం కోల్పోవద్దని రైతులకు మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పొగాకు రైతులతో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. నెల్లూరు, ప్రకాశం, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో పొగాకు సాగు చేస్తున్న ముఖ్య రైతులు రైతుల అభిప్రాయాలు, వారి సమస్యలు తెలుసుకున్న అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక ప్రసంగం చేశారు. సమస్యలపై పోరాడతామని, అండగా, తోడుగా ఉంటామని ఆయన పొగాకు రైతులకు భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో ప్రభుత్వ తీరుతో పొగాకు రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని, వారికి తాము అండగా, తోడుగా నిలుస్తామని, వారి సమస్యలపై పోరాడుతామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆ దిశలోనే 10 రోజుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి.. పొగాకు రైతులను కలుసుకోనున్నట్లు తెలిపారు. సీజన్ ముగుస్తున్నా ఇప్పటికీ పొగాకు కొనుగోళ్లు లేవని ఇప్పటివరకు 20 శాతం కొనుగోళ్లు కూడా జరగలేదని చెప్పారు.
'అసలు టుబాకో బోర్డు ఎందుకు పెట్టారు? రైతులకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో వ్యాపారులను ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి.. ఆ ప్లాట్ఫామ్లో వివిధ రకాల వ్యాపారులు పార్టిసిపేట్ చేస్తే, ఒక పోటీ వాతావరణం ఏర్పడుతుందని, తద్వారా రైతులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో టుబాకో బోర్డు ఏర్పాటు జరిగింది' అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వెఎస్ జగన్ తెలిపారు. 'చంద్రబాబు అధికారంలోకి వస్తూనే సిండికేట్లో అందరికీ కొమ్ములు వస్తాయి. సిండికేట్ మొత్తం ఏకమై చంద్రబాబునాయుడు చెప్పేది చెబుతూ ఉంటాడు. మనం చేసేది మనం చేస్తుంటాం అన్న ధైర్యంతో ఉంటారు. ఈ ఒక్క పంటే కాదు. ఏ పంట పరిస్థితి అయినా అంతే. దళారీలే వ్యవస్థను నడుపుతున్నారు' అని వైఎస్ జగన్ వివరించారు.
వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో పొగాకు అమ్మకం సజావుగా జరిగేది. కానీ.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అమ్మకం మందగించడంతో పంట నాశనం అవుతోంది. కందుకూరులోని రెండు పొగాకు బోర్డుల్ని మీరు సందర్శిస్తే.. మాకు న్యాయం జరుగుతుంది జగనన్నా!
-వెంకటేశ్వర రెడ్డి గారు, కందుకూరు పొగాకు రైతు… pic.twitter.com/SfFMZlSIcC
— YSR Congress Party (@YSRCParty) July 22, 2026
చంద్రబాబు చెప్పిన తర్వాత కూడా రేట్లు ఇంత దారుణంగా ఉన్న పరిస్థితి ఏమిటి? అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. కంపెనీలపై చంద్రబాబు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? అని నిలదీశారు. ఇంతవరకు ఎన్ని కేసులు పెట్టారు? ఎన్ని లైసెన్సులు సస్పెండ్ చేశారు? ఎంత మందిని బ్లాక్లిస్టులో పెట్టారు? అంటే ఇంతవరకు లైసెన్సులు సస్పెండ్ చేసింది లేదు అని గుర్తుచేశారు. చంద్రబాబు ఏ రకమైన భయాన్ని కలిగించకుండా.. మార్క్ఫెడ్ను రంగంలోకి రానివ్వకుండా మొత్తం అడ్డుకుంటే రైతులకు ఏ రకంగా లాభం జరుగుతుంది? అని ప్రశ్నించారు.
'రైతులు ఎప్పుడు నష్టపోకూడదు. రైతు చల్లగా ఉంటేనే రాష్ట్రం బాగు పడుతుంది. రాష్ట్రం బాగుండాలి అంటే రైతు ముఖంలో చిరునవ్వు ఉండాలి అని చెప్పి.. రైతు పక్షపాత ప్రభుత్వంగా మనం వచ్చినప్పుడు మాత్రమే మార్పులు జరిగాయి' అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. రైతులకు ఆశలు పూర్తిగా సన్నగిల్లిపోయాయి. రైతులకు ఈ ప్రభుత్వం తోడుగా లేదనేది తెలియడంతో దళారీల వ్యవస్థ సిండికేట్గా మారి రైతులందరినీ పూర్తిగా నష్టపరుస్తోంది' అని వివరించారు.
'రైతులకు తోడుగా నిలుస్తాం. ప్రభుత్వాన్ని మేలుకొలిపే కార్యక్రమం చేయగలిగినంత చేస్తాం. రైతులకు నిజంగా మంచి జరగాలన్నా, శాశ్వత మంచి జరగాలన్నా, మనం ఏదైనా చేయాలంటే మూడేళ్లు ఓపిక పట్టాల్సిందే' అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. అన్ని రకాలుగా రైతులకు తోడుగా ఉండే కార్యక్రమం చేస్తామని.. ఏయే జిల్లాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారో.. అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా నిలబడుతుందని ప్రకటించారు. వారం, పది రోజుల్లో నా పర్యటన కూడా ఉంటుంది. ఈసారి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గోపాలపురంలో.. జంగారెడ్డిగూడెంలో పర్యటిస్తా' అని ప్రకటించారు. 'చంద్రబాబు ప్రభుత్వం నిద్ర నటిస్తోంది. నిద్రపోయే వాళ్లను లేపొచ్చు. కానీ నిద్ర నటించే వాళ్లను లేపడం కష్టం' అని వైఎస్ జగన్ తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ప్రయత్నిస్తామని హెచ్చరించారు.
