హైదరాబాద్ లో వానలు, కూలిన 200 పురాతన వృక్షం, 4 బైకులు ధ్వంసం, ఒకరికి గాయాలు
Hyderabad, Telangana:హైదరాబాద్ టోలిచౌకి గోల్కొండ ఎండి లైన్స్ లోని ఈదురా గాలులతో కూలీనా 200 సంత్సరాల చెట్టు.. చెట్టు కూలడం వల్ల ఓ వ్యక్తి కి తల పై గాయాలయ్యాయి మరియు 4ద్విచక్ర వాహనాలు డామేజ్ అయినాయి. సంఘటన స్థలానికి చేరుకున్న DRF బృందం సహాయక చర్యలు చేపట్టారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
నడిరోడ్డుపై పిల్లల్ని కన్న భారీ పాము.. సోషల్ మీడియాను ఊపేస్తున్న అరుదైన వీడియో!
Hyderabad, Telangana:Giant Snake Video Watch: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో వింతలు, విశేషాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా జంతువులు, పాములకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. తాజాగా అంతర్జాలంలో హల్చల్ చేస్తున్న ఒక వీడియో చూస్తే.. మాత్రం ఎవరైనా సరే ఆశ్చర్యపోవడం ఖాయం. అత్యంత ప్రమాదకరమైన ఒక పాము.. నడిరోడ్డుపై పిల్లలకు జన్మనిస్తున్న అరుదైన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా కొన్ని పాములు గుడ్లు పెట్టి.. వాటిని పొదిగి పిల్లల్ని చేస్తూ ఉంటాయి.. కానీ కొన్ని రకాల అత్యంత విషపూరితమైన పాములు నేరుగా పిల్లలకే జన్మనిస్తాయి.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో సరిగ్గా ఇదే జరిగింది.. ఒక రద్దీగా ఉండే రోడ్డుపైకి వచ్చిన ఓ భారీ సర్పం.. అక్కడ కదలకుండా ఆగిపోయింది.. చూస్తుండగానే అది వరుసగా మూడు పిల్ల పాములకు జన్మనిచ్చింది. అక్కడే అందరూ చూస్తుంగానే ఆ పాము పిల్లలకు జన్మనివ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
రోడ్డుపైనే మూడు పిల్లలు..
ఈ వీడియోలో ఆ పాము నడిరోడ్డుపై కదలకుండా పడుకుని ఉండటం మనం గమనించవచ్చు.. కొద్ది క్షణాల్లోనే అది ఒకదాని తర్వాత ఒకటిగా దాదాపు మూడు పిల్లలను రోడ్డుపైనే ప్రసవించింది... జన్మించిన వెంటనే ఆ బుజ్జి పాములు చకచకా అటు ఇటు పాకడం కూడా మీరు వీడియోలో స్పష్టంగా చూడొచ్చు.. ఈ అద్భుతమైన దృశ్యాలను అక్కడే ఉన్న కొంతమంది స్మార్ట్ఫోన్స్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఊహించని స్థాయిలో వైరల్ అవుతూనే ఉంది.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
కామెంట్లు పెడుతున్న నెటిజన్స్..
ఈ వీడియో సోషల్ మీడియా వేదికల్లోకి రోజుల్లోనే లక్షలాది వ్యూస్, షేర్లతో దూసుకుపోతోంది.. ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. నా జీవితంలో పాము నేరుగా పిల్లల్ని కనడం ఇప్పుడే చూడటం, ప్రకృతి సృష్టి నిజంగా చాలా వింతైనదని కొందరు కామెంట్లు పెడుతుంటే.. అంత ప్రమాదకరమైన పాము నడిరోడ్డుపై పిల్లల్ని కనడం భయానకంగా ఉందని మరికొందరు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సైన్స్ పరంగా ఇవి వైపర్ జాతికి చెందినవి అయ్యి ఉంటాయని.. ఇవి గుడ్లు పెట్టకుండా నేరుగా పిల్లలకే జన్మనిస్తాయని కొందరు విశ్లేషిస్తున్నారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
శివలింగం ఎదురుగా దీపంతో సిగరెట్ వెలిగించిన యువకుడు.. వీడియో!
Hyderabad, Telangana:Youth Lights Cigarette From Diya Video Watch: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కొందరు వ్యూస్ కోసం.. రీల్స్ కోసం ఎంతటి నీచానికైనా ఒడిగడుతున్నారు. తాజాగా సమాజం తలదించుకునేలా.. భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతినేలా ఒక ఘోర అపచారం చోటుచేసుకుంది. ఒక పవిత్ర శివాలయంలో యువకుడు చేసిన వికృత చేష్టకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది.. దీనికి సంబంధించిన వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక యువకుడు శివాలయంలోని గర్భగుడి లేదా ప్రాంగణంలో ఉన్న శివలింగం ముందుకు వెళ్లాడు. అక్కడ స్వామివారికి భక్తితో వెలిగించిన దీపాన్ని చూసి కనీస భయం, భక్తి లేకుండా ప్రవర్తించడం మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. ఆ దీపం కాంతితో తన నోట్లోని సిగరేట్ను వెలిగించాడు. అంతటితో ఆగకుండా.. దైవసన్నిధి అని కూడా చూడకుండా అక్కడే నిలబడి పొగ పీలుస్తూ తీవ్ర అహంకారాన్ని ప్రదర్శించడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు..
మండిపడుతున్న నెటిజన్లు..
ఈ వీడియో సోషల్ మీడియా వేదికలైన ఎక్స్, ఇన్స్టాగ్రామ్లలో పోస్ట్ అయిన కొన్ని గంటల్లోనే లక్షలాది మంది వీక్షించారు. వీడియో చూసిన హిందూ బంధువులు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక తప్పు కాదని.. ముమ్మాటికీ సనాతన ధర్మాన్ని, దేవుడిని అవమానించడమేనని.. ఇలాంటి వారిని వదిలిపెడితే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఒక నెటిజన్ మండిపడ్డారు.
మరికొందరు స్పందిస్తూ.. రీల్స్ పిచ్చితో యువత ఎటు వైపు వెళ్తోందో అర్థం కావడం లేదని.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇలాంటి పవిత్ర స్థలాలను అపవిత్రం చేసేవారిపై కఠిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ, ఏ ప్రాంతంలో జరిగిందనే దానిపై ఇంకా పూర్తి స్పష్టత రానప్పటికీ.. ఈ వీడియో ఆధారంగా సైబర్ క్రైమ్తో పాటు స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. వీడియోలో ఉన్న యువకుడిని గుర్తించి.. అతడిపై కఠినమైన ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయడానికి ఎవరూ సాహసించకూడదంటే.. ఈ యువకుడికి గుణపాఠం చెప్పాల్సిందేనని భక్తులు కోరుతున్నారు.
Also Read: యోగి కాబినేట్ మరో కీలక నిర్ణయం.. ఉత్తర ప్రదేశ్లో జలాలాబాద్కు పేరు మార్పు..
Also Read: ముంబై, పూణెలను ముంచెత్తిన వర్షాలు.. స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Cobra Video: బాబోయ్.. వంటగది సింక్లో నాగుపాము పిల్ల.. వీడియో..
Hyderabad, Telangana:Baby Cobra Viral Video: మనం నివసించే ఇళ్లలోకి అప్పుడప్పుడు కొన్ని పాములు చొరబడి మనల్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తుంటాయి.. ముఖ్యంగా వర్షాకాలంలో పాములు ఆశ్రయం కోసం నివాసాల్లోకి సంచరిస్తూ ఉంటాయి. తాజాగా ఇంటర్నెట్ను కుదిపేస్తున్న ఒక వీడియో చూస్తే.. ఎవరికైనా ఒళ్లు గగుర్పొడవడం ఖాయం.. అత్యంత ప్రమాదకరమైన ఒక చిన్న నాగుపాము పిల్ల (Cobra) నేరుగా ఓ ఇంటి వంటగదిలోకి ప్రవేశించి.. అక్కడ అంట్లు తోమే సింకులో ప్రత్యక్షమైంది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ ఉన్నాయి. దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు షాక్ అయిపోతున్నారు.
అసలేం జరిగిందంటే..?
సాధారణంగా మహిళలు వంటగదిలో ఎక్కువ సమయం గడుపుతుంటారు. ఉదయాన్నే లేచి గిన్నెలు కడగడానికి లేదా వంట చేయడానికి కిచెన్లోకి వెళ్తుంటారు. అలాంటి సమయంలో అక్కడ ఏదైనా పాము కనిపిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి ఘటనే ఈ వీడియోలో చోటుచేసుకుంది.. ఒక ఇంట్లోని వంటగది సింకులో (Kitchen Sink) ఉన్నట్లుండి.. ఒక నాగుపాము పిల్ల దర్శనమిచ్చింది.
ఆ సింకులో అంట్లు తోమే సింకులో ఆ పాము ఆటు ఇటు తిరుగుతూ కనిపించింది.. ఆ చిన్న నాగుపాము పడగ బుసలు కొడుతుండడం కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు.. ఆ ఇంట్లో వారు దీనిని గమనించి.. ధైర్యం చేసి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడం ఆలస్యం.. క్షణాల్లో వేలాది వ్యూస్తో పాటు షేర్లతో దూసుకుపోతోంది. ఈ భయంకరమైన దృశ్యాన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
బాబోయ్.. ఇకపై వంటగదిలోకి వెళ్లేటప్పుడు.. గిన్నెలు కడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ఒకరు కామెంట్ చేయగా.. పాము చిన్నదైనా నాగుపామే కదా.. దాని విషం చాలా ప్రమాదకరం.. వెంటనే స్నేక్ క్యాచర్కు సమాచారం ఇవ్వడం మంచిదని మరొకరు సలహాలు ఇస్తున్నారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
ఈ వీడియో విపరీతంగా వైరల్ అవ్వడం వల్ల కొంతమంది స్నేక్స్ ఎక్పర్ట్స్ కూడా స్పందిస్తూ వస్తున్నారు. కిచెన్ సింక్ అవుట్లెట్ పైపులు, డ్రైనేజీ రంధ్రాల ద్వారా పాములు లోపలికి వచ్చే అవకాశం ఉందని.. కాబట్టి డ్రైనేజీ పైపులకు జాలీలు (Meshes) అమర్చడం చాలా మంచిదని చెబుతున్నారు. వంటగదిలో ఎంగిలి గిన్నెలు రాత్రిపూట అలాగే ఉంచకూడదని.. వాటి వల్ల ఎలుకలు, బొద్దింకలు వస్తాయి. వాటిని తినడానికి పాములు ఇళ్లలోకి ప్రవేశిస్తాయని తెలుపుతున్నారు. ఒకవేళ ఇంట్లో పాము కనిపిస్తే.. స్వయంగా దాన్ని చంపడానికి లేదా పట్టుకోవడానికి ప్రయత్నించకుండా.. వెంటనే అటవీ శాఖ అధికారులకు లేదా స్నేక్ సేవర్స్కు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Saturn Retrograde 2026: మీన రాశిలో శని వక్రీ గమనం.. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండకపోతే కష్టాలు తప్పవు!
Hyderabad, Telangana:Saturn Retrograde 2026 Effect: జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని కర్మఫల ప్రదాతగా భావిస్తూ ఉంటారు.. ఒక వ్యక్తి చేసే మంచి, చెడు పనులను బట్టి శని దేవుడు ఫలితాలను అందిస్తూ ఉంటాడు.. అందుకే శని గ్రహ గమనంలో ఎలాంటి మార్పు వచ్చినా.. దాని ప్రభావం ద్వాదశ రాశులపై స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి.. ఈ క్రమంలోనే రాబోయే ఆగస్టు 20 నుంచి శని దేవుడు తన గమనంలో మార్పులు చేసుకోబోతున్నాడు. మీన రాశిలో శని వక్రీ గమనం ప్రారంభం కావడం వల్ల కొన్ని రాశుల వారికి తీవ్రమైన సవాళ్లతో పాటు ఎంతో మేలు జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మూడు రాశుల వారి జీవితాలపై ప్రభావం పడుతుంది.. అయితే, ఈ ప్రభావంతో ఏయే రాశులు ప్రభావితమవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మీన రాశిలో శని వక్రీ గమనం..
ఆగస్టు 20 నుంచి శని దేవుడు మీన రాశిలో వక్రగతిలో ప్రయాణించడం జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రత్యేకంగా భావిస్తారు.. అయితే, ఈ ప్రభావం కారణంగా రాబోయే కొన్ని నెలల పాటు ఆయా రాశులవారికి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి.. సాధారణంగా శని వక్రగతిలోకి ప్రవేశించడం వల్ల చాలామంది భయపడుతుంటారు. కానీ జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి.. జీవితంలో కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశాలు ఉన్నాయి..
మీన రాశి (Pisces)
శని దేవుడు ఈ రాశిలోనే వక్రగతిలో ఉండడం వల్ల మీన రాశి వారికి పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కార్యాలయంలో అదనపు బాధ్యతలు భరించాల్సి కూడా రావచ్చు.. ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది.. ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం చాలా శ్రేయస్కరమని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
కుంభ రాశి (Aquarius)
కుంభ రాశి వారు తమ ఆర్థిక ప్రణాళికలతో పాటు కుటుంబ బాధ్యతలను కూడా చూసుకోవాల్సి ఉంటుంది.. తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయడం చాలా ముఖ్యం.
సింహ రాశి (Leo)
సింహ రాశి వారికి ఉద్యోగంలో వ్యాపారం లేదా భాగస్వామ్య వ్యవహారాల్లో కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.. పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఇలాంటి సమయంలో ఓపిక కోల్పోకుండా నిదానంగా ముందుకు సాగితే.. కాలక్రమేణా పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. అంతేకాకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
భద్ర రాజయోగం ఎఫెక్ట్.. ఆగస్టు 5 వరకు ఈ 4 రాశుల వారికి తిరుగుండదు.. డబ్బే డబ్బు!
Hyderabad, Telangana:Budha Gochar 2026 Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి అత్యంత కీలకమైన స్థానం ఉంటుంది. బుద్ధి, వాక్చాతుర్యంతో పాటు వ్యాపారం, కమ్యూనికేషన్, తార్కిక సామర్థ్యానికి కారకుడిగా భావించే.. బుధుడు జూన్ నెలలో కర్కాటక రాశిలోకి సంచారం చేసింది.. ఆ తర్వాత జూన్ 29న బుధుడు వక్రగమనాన్ని ప్రారంభించి.. జూలై 7న తిరిగి తన సొంతం రాశి అయిన మిథున రాశిలోకి సంచారం చేసింది. బుధుడి ఈ తిరోగమన సంచారం వల్ల జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన భద్ర రాజయోగం ఏర్పడింది. రాబోయే ఆగస్టు 5 వరకు బుధుడు ఇదే రాశిలో ఉండబోతున్నాడు. ఈ సమయంలో 5 రాశుల వారి జీవితాల్లో ఊహించని అద్భుతమైన మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మకర రాశి
మకర రాశి వారికి ఈ భద్ర రాజయోగం శుభ ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి మీ చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో గత కొంతకాలంగా ఉన్న చిక్కులు, ఇబ్బందులు క్రమంగా తొలగిపోయే ఛాన్స్లు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.. మీ బుద్ధి బలం, వాక్చాతుర్యంతో క్లిష్టమైన పనులను సైతం సులభంగా విజయవంతంగా పూర్తి చేస్తారు.
సింహ రాశి
సింహ రాశి జాతకులకు ఈ రాజయోగం ఉద్యోగ, వృత్తి రంగాలలో అద్భుతమైన మార్పులను తీసుకు వస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన లేదా రావలసిన డబ్బు ఈ సమయంలో మీ చేతికి అందుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. వ్యాపారంలో లాభాల గ్రాఫ్ వేగంగా పెరుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. స్నేహితులతో పాటు తోబుట్టువుల నుంచి పూర్తి సపోర్ట్ కూడా లభిస్తుంది. జీవితంలో కొన్ని శుభవార్తలు మీ మనస్సుకు ఎనలేని ఆనందాన్ని అందిస్తాయి. అలాగే మీ ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది.
మిథున రాశి
మిథున రాశికి అధిపతి బుధ గ్రహమే కావడం వల్ల స్వరాశిలో ఏర్పడిన ఈ భద్ర రాజయోగం ఈ రాశి వారికి అత్యంత సానుకూల ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందని చెబుతున్నారు. సమాజంలో మీ మాటకు గౌరవంతో పాటు గుర్తింపు పెరుగుతాయని జ్యోతిష్యులు నిపుణులు చెబుతున్నారు. వ్యాపార రంగంలో తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు భారీ లాభాలను తెచ్చిపెడతాయి. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి.. ముఖ్యంగా మీడియా, రైటింగ్, బ్యాంకింగ్, మార్కెటింగ్తో పాటు కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది.
తులా రాశి
తులా రాశి వారికి ఈ సమయంలో అదృష్టం పూర్తిగా తోడుటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. పెద్ద పెద్ద సంస్థల నుంచి ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.. ఉన్నత చదువుల కోసం ఆశించే.. విద్యార్థులకు వారు కోరుకున్న విద్యాసంస్థల్లో ప్రవేశం లభించే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షల్లో అద్భుతమైన విజయాలు కూడా సులభంగా సాధిస్తారు. మతపరమైన, ఆధ్యాత్మిక కారణాల వల్ల సుదూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
తిరుమల నడక మార్గంలో చిరుత పులి కలకలం.. భయంతో పరుగులు తీసిన భక్తులు, వైరల్ వీడియో!
Hyderabad, Telangana:Tirumala Leopard Video: సాధారణంగా తిరుమలకు నడకమార్గంలో భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి వస్తుంటారు. అయితే, అప్పుడప్పుడ చిరుత సంచారం కలకలం రేపుతోంది. తాజాగా నిన్న రాత్రి కూడా అలిపిరి మెట్లమార్గంలో చిరుతను చూడగానే భక్తులు భయంతో అరుపులు, కేకలు వేస్తూ అక్కడి నుండి ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ అవాస్తవ పరిస్థితుల్లో వెంటనే అప్రమత్తమైన టీటీడీ భద్రతా సిబ్బంది, అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి, భయాందోళనలో ఉన్న భక్తులను క్షేమంగా, సురక్షితంగా ఇతర ప్రాంతాలకు తరలించారు. ఈ ఉత్కంఠభరితమైన ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. భక్తుల రక్షణ, భద్రత దృష్ట్యా, అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి సదరు ప్రాంతంలో పర్యవేక్షణను, గస్తీని మరింత పటిష్టం చేశారు.
మధుర నగర్ పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమైన మూడు నాగుపాములు.. వీడియో ఇదే..
Hyderabad, Telangana:Cobras In Police Station Viral Video: శాంతిభద్రతలను కాపాడే పోలీస్ స్టేషన్లో ఒక్కసారిగా కలకలం రేగింది.. నిత్యం పబ్లిక్తో పాటు పోలీసుల రాకపోకలతో రద్దీగా ఉండే మధుర నగర్ పోలీస్ స్టేషన్లో శనివారం ఉదయం ఊహించని సంఘటన ఒకటి చోటుచేసుకుంది.. స్టేషన్ ఆవరణలోకి ఎక్కడి నుంచో మూడు నాగుపాము పిల్లలు ఒక్కసారిగా ప్రత్యక్షమవడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.
రోజులాగే పోలీస్ స్టేషన్లో సిబ్బంది తమ విధుల్లో నిమగ్నమై ఉన్నారు.. కొంతమంది బాధితులు తమ ఫిర్యాదులతో స్టేషన్ లోపల వేచి చూస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్ మూలలో నుంచి ఒక చిన్న నాగుపాము పిల్ల బయటకు వచ్చింది.. దాన్ని చూసి సిబ్బంది అప్రమత్తమయ్యే లోపే.. మరో రెండు పాము పిల్లలు కూడా వరసగా బయటకు రావడంతో స్టేషన్ లోపల ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. పాములను చూసిన పోలీసులు.. ఫిర్యాదు చేయడానికి వచ్చినవారు భయంతో బయటకు పరుగులు తీశారు.
పాములు చాలా విషపూరితమైన నాగుపాము రకానికి చెందిన పిల్లలు కావడంతో ఎవరూ వాటిని అడ్డుకునే సాహసం చేయలేకపోయారు. వెంటనే స్టేషన్ అధికారులు అప్రమత్తమై ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ (Friends of Snakes Society)కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే సొసైటీ వారు మధుర నగర్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు.
పోలీస్ స్టేషన్కు చేరుకున్న స్నేక్ సొసైటీ వారు ప్రత్యేక పరికరాల సహాయంతో పాములు ఉన్న ప్రదేశాన్ని పరిశీలించారు. స్టేషన్లో దాక్కున్న మూడు నాగుపాము పిల్లలను వారు ఎంతో చాకచక్యంగా.. సురక్షితంగా పట్టుకున్నారు. ఆ పాము పిల్లలను బంధించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి అత్యంత విషపూరితమైన నాగుపాము (Cobra) పిల్లలని.. వర్షాల కారణంగా లేదా సమీపంలో ఉన్న పొదల నుంచి ఇవి స్టేషన్లోకి వచ్చి ఉండవచ్చని తెలిపారు. పట్టుకున్న ఈ మూడు పాము పిల్లలను సురక్షిత ప్రాంతానికి తరలించి.. అటవీ శాఖ అధికారుల అనుమతితో అడవుల్లో వదిలిపెడతామని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యులు వెల్లడించారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Aishwarya Lekshmi: "పెళ్లి అంటే భయం..కానీ, ఈ వ్యక్తితో బిడ్డను కనాలని ఉంది" హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
Hyderabad, Telangana:Aishwarya Lekshmi Comments On Marriage: ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు హీరోయిన్లు ప్రేమ, పెళ్లి, సహజీవనం వంటి సున్నితమైన విషయాలపై చాలా బాహాటంగా, బోల్డ్గా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా, సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య లక్ష్మి వివాహ వ్యవస్థపై చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.
మలయాళ కుట్టి..టాలీవుడ్ ఎంట్రీ
కేరళలో పుట్టి పెరిగిన ఐశ్వర్య లక్ష్మి తమిళ, మలయాళ చిత్రాల్లో స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సత్యదేవ్ సరసన నటించిన 'గాడ్సే' చిత్రంతో ఈమె టాలీవుడ్కు పరిచయమయ్యారు. ఆ తర్వాత నాని నిర్మించిన 'హిట్-2' సినిమాలోనూ కీలక పాత్రలో మెరిశారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సరసన 'సంబరాల ఏటిగట్టు' అనే క్రేజీ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు.
ఆలోచనలో పడేసిన 'మట్టి కుస్తీ 2'
ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన తాజా తమిళ చిత్రం 'గట్ట కుస్తీ' (తెలుగులో 'మట్టి కుస్తీ 2') బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇందులో భార్యగా, ఒక బిడ్డకు తల్లిగా, రెజ్లర్గా ఆమె చూపించిన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. గతంలో పలుమార్లు తనకు "పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు" అని ప్రకటించిన ఈ 35 ఏళ్ల బ్యూటీ ఈ సినిమా ప్రమోషన్ల సందర్భంగా తన మనసులోని సరికొత్త భావాలను పంచుకున్నారు.
ఐశ్వర్య లక్ష్మి అసలు ఏమన్నారంటే..?
వివాహ బంధంపై తనకున్న భయాలు, అలాగే ఒక తల్లిగా మారాలనే తన కోరికను ఐశ్వర్య లక్ష్మి ఈ విధంగా వ్యక్తపరిచారు. "ఈ రోజుల్లో వివాహ వ్యవస్థలో చాలా సమస్యలు వస్తున్నాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇప్పటికీ నా అభిప్రాయం మారలేదు. కానీ 'గట్ట కుస్తీ 2' షూటింగ్ సమయంలో ఒక అనుభవం నన్ను తీవ్రంగా ఆలోచింపజేసింది. ఆ సినిమాలో ఒక చిన్నారి ఉంది. ఒక తల్లి పాత్ర పోషిస్తూ, నా కెరీర్లో మొదటిసారిగా ఒక బిడ్డతో అంతటి బలమైన బంధాన్ని పంచుకున్నాను. అప్పటినుంచి నాకు కూడా ఒక బిడ్డ కావాలనే కోరిక బలంగా కలిగింది".
"అయితే, నాకు పుట్టబోయే బిడ్డ సంక్షేమాన్ని, బాధ్యతలను నాతో పాటు సమానంగా పంచుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి నా జీవితంలోకి రావాలి. ఒక మంచి తండ్రిగా బాధ్యత తీసుకునే వ్యక్తి దొరికితే.. అతను మమ్మల్ని వదిలి వెళ్లకుండా ఉండేందుకు నేను అన్ని విధాలా ప్రయత్నిస్తాను. నిజానికి నా జీవితంలోకి మరో పురుషుడిని ఆహ్వానించడానికి నాకు కొన్ని వ్యక్తిగత సమస్యలు, భయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు బిడ్డ కోసం ఆ దిశగా ఒక అడుగు వేయడానికి నా మనసులో మార్పులు మొదలవుతున్నాయి" అని నటి ఐశ్వర్య లక్ష్మి అన్నారు.
నెట్టింట వైరల్ అవుతున్న వ్యాఖ్యలు
పెళ్లిపై భయాలు ఉన్నప్పటికీ, ఒక తల్లిగా మారాలనే కోరికను, అందుకోసం తన లైఫ్ పార్ట్నర్ నుండి ఎలాంటి బాధ్యతను ఆశిస్తుందో ఐశ్వర్య లక్ష్మి స్పష్టంగా చెప్పడం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
Also Read: "ఆ స్టార్ హీరోయిన్తో కలిసి బైక్పై ఊరంతా తిరిగేవాళ్లం" వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు
Also Read: 'తబాహీ' సాంగ్లో కియారా అద్వానీ అందాలు అరబోత..ఆ సినిమాకు ఎంత డబ్బు తీసుకుందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Allu Arjun Politics: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..పీకేని కలిసి టీవీకే విజయ్ స్టైల్లో రాజకీయాల్లో అరంగేట్రం!
Hyderabad, Telangana:Amarnath Shivling Melted: అమర్నాథ్లో మంచు శివలింగం అదృశ్యం..అయినా తగ్గని భక్తుల తాకిడి..వారంలో 1.71 లక్షల మంది దర్శనం!
Amarnath Shivling Melted News: 2026లో ఇటీవలే ప్రారంభమైన శ్రీ అమర్నాథ్ యాత్ర ఒక కొత్త రికార్డును నెలకొల్పింది. గడిచే ప్రతి రోజు ఒక కొత్త కోణాన్ని సంతరించుకుంటోంది. 57 రోజుల పాటు సాగనున్న ఈ యాత్రలో మొదటి ఐదు రోజులు మంచు శివలింగం కరుగుతున్నప్పటికీ.. యాత్రికుల సంఖ్య చారిత్రాత్మక స్థాయికి చేరుకుంది.
తొలి రోజుల్లో శివలింగం కరిగిపోయినప్పటికీ, యాత్రికుల సంఖ్య విషయంలో గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడంతో ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర చారిత్రాత్మకంగా నిలిచింది. మంచు శివలింగం కరుగుతున్నా ప్రజలలో విశ్వాసానికి, భక్తికి ఏమాత్రం కొదవ లేదు. కేవలం మొదటి వారంలోనే 1.71 లక్షలకు పైగా యాత్రికులు సందర్శించడం విశేషం.
భక్తుల సంఖ్య పెరుగుతోంది
ఇది గతేడాది ప్రారంభ సంఖ్య కంటే 28% ఎక్కువ కావడం విశేషం. శ్రీ అమర్నాథ్ యాత్ర చరిత్రలో యాత్రికుల సంఖ్యకు సంబంధించిన మునుపటి అన్ని రికార్డులను బద్దలు కొట్టి, ఈ సంవత్సరం యాత్రను చారిత్రాత్మకంగా నిలిపింది. బాబా బర్ఫానీగా పూజించబడే మంచు శివలింగం 2026 మే నెలలో సుమారు 7 అడుగుల ఎత్తులో ఉండేది. కానీ ఈ శివలింగం యాత్ర ప్రారంభమైన మొదటి ఐదు రోజుల్లోనే కరిగిపోయింది. అయినప్పటికీ, ప్రతిరోజూ వేలాది మంది యాత్రికులు యాత్రలోని మూడు ప్రధాన ప్రదేశాలైన శ్రీనగర్ యాత్ర ట్రాన్సిట్ క్యాంప్, బల్తాల్, నుమ్వాన్ యాత్ర బేస్ క్యాంప్లకు చేరుకుంటున్నారు.
పవిత్ర అమర్నాథ్ యాత్ర ప్రారంభమై ఏడు రోజులు గడిచినా, ఒక్క రోజు కూడా పుణ్యక్షేత్రాన్ని సందర్శించే యాత్రికుల సంఖ్య 20,000 కంటే తక్కువగా లేదు. దేశవ్యాప్తంగా మొత్తం ముందస్తు రిజిస్ట్రేషన్లు 4 లక్షలను దాటాయి. ఇప్పటికీ ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది.
మంచు శివలింగం అదృశ్యం..
బాబా (అమర్నాథ్ శివ్ బాబా) పూర్తిగా అదృశ్యమయ్యారని ఇటీవలే సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే దేవుడు అదృశ్యమవ్వలేదని.. ఇప్పుడు కూడా ఉన్నాడని భక్తులు నమ్ముతున్నారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారత భద్రతా దళాలు.. జమ్మూ కశ్మీర్ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
57 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగి ఈ యాత్ర ఆగస్టు 28 అనగా రక్షా బంధన్ రోజున అమర్ నాథ్ యాత్ర ముగుస్తుంది. భౌతికంగా అక్కడ మంచు ఏర్పడినప్పటికీ గుహలో పరమ పవిత్రమైన మంచు శివలింగం కరగదని భక్తులు చెబుతున్నారు.
జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈరోజు బల్తాల్ బేస్ క్యాంప్ను సందర్శించి, కొనసాగుతున్న శ్రీ అమర్నాథ్ యాత్రను సమీక్షించి, యాత్రికులతో ముచ్చటించారు. యాత్ర సురక్షితంగా, సజావుగా సాగేలా చూసేందుకు పోలీసులు, సైన్యం, ఇతర భద్రతా సంస్థలతో సహా పరిపాలనా యంత్రాంగం కలిసికట్టుగా పనిచేసిందని లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా తెలిపారు. యాత్రికులు ఆహ్లాదకరమైన అనుభూతితో తిరిగి వెళ్లేలా ప్రతి ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు.
బాబా ఎందుకు అదృశ్యమయ్యారు?
కాశ్మీర్లో శీతాకాలంలో సుదీర్ఘకాలం పాటు పొడి వాతావరణం నెలకొనడమే శివలింగం వేగంగా కరిగిపోవడానికి కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ శీతాకాలంలో కాశ్మీర్ లోయలో ఊహించిన దానికంటే చాలా తక్కువ హిమపాతం నమోదైంది. దీనివల్ల, మంచు కేంద్రకం స్థిరంగా ఉండటానికి అవసరమైన, తక్కువ నీరు, తక్కువ ఉష్ణోగ్రతలతో కూడిన చల్లని వాతావరణం గుహ లోపల, వెలుపల ఉన్న పగుళ్లకు చేరలేకపోయింది.
అంతేకాకుండా జూలై ఆరంభంలో హిమాలయాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు ఉండటంతో, గుహ పైన, లోపల ఉన్న మంచు కరిగి, భవిష్యత్తులో అది తిరిగి గడ్డకట్టే అవకాశం లేకుండా పోయింది. ప్రతిరోజూ ఆ ఇరుకైన గుహ గదికి వచ్చే 20,000 మందికి పైగా సందర్శకుల శరీర వేడి, శ్వాస వేడి, శారీరక కదలికల వల్ల అక్కడి సున్నితమైన వాతావరణం పూర్తిగా మారిపోవడంతో పరిస్థితి మరింత దిగజారి, బాబా అదృశ్యం కావడానికి దారితీసిందని నిపుణులు చెబుతున్నారు.
ALso Read: కరూర్ తొక్కిసలాట కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం..నియామక పత్రాలను సీఎం విజయ్ అందజేత!
Also Read: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్..ప్రతినెలా అకౌంట్లోకి రూ.2 వేలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mahesh Babu Cap Cost: హీరో మహేశ్ బాబు పెట్టుకున్న క్యాప్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Hyderabad, Telangana:Mahesh Babu Cap Price: సూపర్ స్టార్ మహేశ్ బాబు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు. ఈసారి ఆయన నటిస్తున్న భారీ సినిమా 'వారణాసి'తో పాటు, ఆయన ధరించిన ఒక ఖరీదైన క్యాప్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.నవోదయలో 6th Class అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల.. ఉచిత విద్యకు సువర్ణావకాశం!
Hyderabad, Telangana:Navodaya Vidyalaya 6th Class Admission: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ప్రతిష్టాత్మక విద్యాసంస్థ జవహర్ నవోదయ విద్యాలయం (JNV)లో ప్రవేశాలకు ప్రత్యేకమైన నోటిఫికేషన్ విడుదలైంది. కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఆరో తరగతి (6th Class)లో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ బ్రహ్మానంద రెడ్డి గురువారం ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రత్యేకమైన అర్హాతల వివరాలను కూడా తెలిపారు.
ముఖ్యమైన తేదీలు ఇవే..
నవోదయ ప్రవేశ పరీక్షకు సంబంధించి షెడ్యూల్ను ప్రిన్సిపల్ ఈ సందర్భంగా ప్రకటించారు.. దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 31ని నోటిఫికేష్లో పేర్కొన్నారు. అర్హతతో పాటు ఆసక్తి గల విద్యార్థులు గడువు ముగిసేలోగా ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని ఆయన సూచించారు. చివరి నిమిషంలో వచ్చే సాంకేతిక ఇబ్బందులను అధిగమించడానికి వీలైనంత త్వరగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.
నవోదయ విద్యాలయాల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించిన పాఠశాలల్లో ప్రస్తుతం 5వ తరగతి చదువుకోవాల్సి ఉంటుంది. గతంలో ఐదో తరగతి ఉత్తీర్ణులైన వారు లేదా చదువు మధ్యలో ఆపేసిన వారు ఈ పరీక్షకు అర్హులు కారని కూడా అధికార నోటిఫికేషన్లో వెల్లడించారు. అంతేకాకుండా ఒక విద్యార్థి నవోదయ ప్రవేశ పరీక్షకు హాజరుకావడం జీవితంలో ఇదే మొదటిసారి అయి ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల వికాస శాఖ ఆధ్వర్యంలో నడిచే.. నవోదయ విద్యాలయాల్లో సీటు సాధిస్తే విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుంది. ఇక్కడ 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పూర్తి ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తారు. ఇందులో సీటు సాధించిన వారికి ఉచిత హాస్టల్తో పాటు పౌష్టికాహారం, యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ అందిస్తారు. సీబీఎస్ఈ (CBSE) సిలబస్తో కూడిన డిజిటల్ తరగతులు, అత్యుత్తమ ప్రయోగశాలలు అందుబాటులో ఉంటాయి.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారని.. సరైన సమాచారం లేక ఇలాంటి గొప్ప అవకాశాలను కోల్పోతుంటారని ప్రిన్సిపల్ బ్రహ్మానంద రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చొరవ తీసుకుని అర్హులైన విద్యార్థుల చేత దరఖాస్తు చేయించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రవేశ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం కోసం నవోదయ విద్యాలయ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చని ఆయన స్పష్టం చేశారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Kodali Nani UAPA Case: వైసీపీ నేత కొడాలి నానికి బిగ్ షాక్! ప్రశ్న రావణ్కు పూర్తి మద్దతు..చిక్కుల్లో మాజీ మంత్రి!
Vijayawada, Andhra Pradesh:Kodali Nani Comments UAPA Case: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత సున్నితంగా మారాయి. మీడియా సమావేశాల్లోనూ నేతలు చేసే చిన్నపాటి వ్యాఖ్యలు కూడా తృటిలో పోలీస్ కేసుల వరకు వెళ్తున్నాయి. తాజాగా యూట్యూబర్ 'ప్రశ్న' రావణ్ అరెస్ట్ వ్యవహారంపై స్పందిస్తూ, అతనికి సంఘీభావం తెలిపిన వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన్ను తీవ్ర చిక్కుల్లోకి నెట్టాయి.
విజయవాడ వన్టౌన్ పీఎస్లో ఫిర్యాదు
దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన 'ఉపా'(UAPA) చట్టాన్ని 'ఉప్మా చట్టం', 'ఇడ్లీ చట్టం' అంటూ కొడాలి నాని హేళన చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చట్టాలపై కనీస గౌరవం లేకుండా మాట్లాడిన కొడాలి నానిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఉమ్మడి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి విజయవాడ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో రాతపూర్వక ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై కూడా నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని సదరు ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. ఈ అంశాలపై కేసు నమోదు చేసి, ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
అసలు కొడాలి నాని ఏమన్నారంటే..?
ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో కొడాలి నాని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. "దాదాపు ఏడాది కాలంగా పవన్ కళ్యాణ్ను ప్రశ్నిస్తున్నందుకే ప్రశ్న రావణ్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. మా పార్టీని 'గొడ్డలి పార్టీ' అని చంద్రబాబు విమర్శిస్తుంటే.. ప్రజలు మాత్రం మీ కూటమిని 'బూడిద పార్టీ' అని పిలుస్తున్నారు. ప్రశ్న రావణ్ను ఏదో ఒక ఉప్మా చట్టమో, ఇడ్లీ చట్టమో తెచ్చి జైల్లో పెట్టారు. అతను మాట్లాడిన మాటలు ఈరోజు కొత్తగా అన్నవి కావు".
"నిజానికి రావణ్ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి, లోకేష్, బాలకృష్ణ, చంద్రబాబులకే అనుకూలంగా పనిచేశారు. అందుకే ఆయన ఎప్పుడూ టీడీపీ నేతలను విమర్శించలేదు. కానీ ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా వింగ్ కావాలనే అసత్య ప్రచారాలు చేస్తూ రావణ్ను వైసీపీ ఖాతాలో వేసే ప్రయత్నం చేస్తోంది. గతంలో మా ప్రభుత్వంపై ఆయన ఎన్నో విమర్శలు చేసినా, జగన్ మోహన్ రెడ్డి గారు కానీ, మా నేతలు కానీ భరించామే తప్ప.. ఆయనపై ఎప్పుడూ అక్రమ కేసులు పెట్టలేదు, అణచివేయలేదు" అని నాని పేర్కొన్నారు.
నేతల మాటల తీరుపై ప్రజల్లో చర్చ
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు మంత్రులు, నేతలు వాడిన భాష వల్లే ఆ పార్టీ అధికారానికి దూరమైందనే చర్చ ప్రజల్లో ఇప్పటికీ నడుస్తోంది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఇలాంటి భాషా సంస్కృతిపై స్పందిస్తూ.. "రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలి, దుర్భాషలాడితే చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయి" అని హెచ్చరించారు.
"నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది" అనే సామెతను రాజకీయ నాయకులు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజమే అయినా.. హద్దులు దాటి నోరు జారితే మాత్రం ఊచలు లెక్కపెట్టక తప్పదనే హెచ్చరికను ఈ తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
Also Read: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..రేపటి నుంచి వరుసగా 3 రోజులు సెలవులు..పండగే పండగ!
Also Read: గర్ల్స్ హాస్టల్ గదిలో విషాదం..పడుకున్న విద్యార్థుల్ని కాటేసిన పాము..ఒకరు మృతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
SIR: ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం: మంత్రి అడ్లూరి!
Hyderabad, Telangana:Minister Adluri Laxman Kumar: భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన SIR ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ పరిధిలోని ఐదవ వార్డులో శనివారం జరుగుతున్న సర్ ప్రక్రియను మంత్రి స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారుల పనితీరును అడిగి తెలుసుకుంటూ.. ఓటర్ల నమోదు సరళిని పర్యవేక్షించారు.
ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం..
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ BR అంబేద్కర్ మనకు ప్రసాదించిన అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కు అని కొనియాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి.. మనకు నచ్చిన మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి రాజ్యాంగం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటర్ల జాబితాలో సవరణలు.. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను విజయవంతం చేయడం వల్లే ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆయన స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ..
రాష్ట్రంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఎలాంటి లోపాలు లేకుండా.. దిగ్విజయంగా పూర్తి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని మంత్రి అడ్లూరి తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు.. క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ ఎలా సాగుతుందో స్వయంగా తెలుసుకోవడానికే తాను ఇక్కడికి వచ్చినట్లు పేర్కొన్నారు. అధికారులు ఇంటింటికీ వచ్చినప్పుడు ప్రజలు వారికి పూర్తిస్థాయిలో సరైన సమాచారాన్ని అందించి సహకరించాలని కోరారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల మార్గదర్శకాలకు అనుగుణంగా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఓటరు నమోదు కార్యక్రమంలో అంకితభావంతో పనిచేస్తున్న అధికారులను.. సిబ్బందిని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రజలు కూడా తమ వివరాలను సకాలంలో అందించి.. ఈ సర్ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Karur Stampede Govt Job: కరూర్ తొక్కిసలాటలో చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం..నియామక పత్రాలు అందజేసిన సీఎం విజయ్!
Karur, Tamil Nadu:Karur Stampede Govt Job News: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ రాష్ట్రంలో జరిగిన కరూర్ తొక్కిసలాట యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అయితే తాజాగా ఆ తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సమావేశం అయ్యారు. ఈ విషాదాన్ని మానని గాయంగా అభివర్ణించిన ఆయన..బాధితుల కుటుంబాలకు శాశ్వత ఉద్యోగాలు కల్పించే ప్రక్రియను మద్రాసు హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతుందని ఆయన తెలిపారు. వారిలో కొందరికి సీఎం విజయ్ కారుణ్య నియామక పత్రాలను అందజేశారు.
గత ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో, కరూర్లో జరిగిన టీవీకే (TVK) ఎన్నికల ప్రచార ర్యాలీలో ఈ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 41 మంది మరణించారు. ప్రస్తుతం ఈ విషాదంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటన తర్వాత, తమిళనాడు ప్రభుత్వం ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా (పరిహారం) ప్రకటించగా, టీవీకే అదనంగా రూ.20 లక్షల పరిహారాన్ని అందించింది. ప్రభుత్వ పునరావాస చర్యల్లో భాగంగా, బాధితుల కుటుంబాల్లోని అర్హులైన వారికి కారుణ్య నియామక పత్రాలను అందించేందుకు ముఖ్యమంత్రి కరూర్ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో సీఎం విజయ్ 32 బాధిత కుటుంబాల నుండి ఒక్కొక్కరికి చొప్పున నియామక పత్రాలను అందజేశారు. లబ్ధిదారుల విద్యా అర్హతలకు అనుగుణంగా ఉద్యోగాలు కల్పించారు.
బాధిత కుటుంబాలకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ విచారణ జరుపుతున్న సమయంలోనే ఈ కార్యక్రమం జరిగింది. ప్రస్తుతానికి లబ్ధిదారులకు తాత్కాలిక నియామకాలు మాత్రమే ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
సభను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం విజయ్.. కరూర్ విషాదం కలిగించిన బాధ తనను ఎప్పుడూ వీడలేదని భావోద్వేగానికి లోనయ్యారు. "నా హృదయంలో నిలిచిపోయే కరూర్ సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జీవితంలో మనిషి ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా, హృదయంలోని గాయాలను, బాధను ఎప్పటికీ మర్చిపోలేరు. అనేక కష్టాలు, మానసిక వేదనలను అధిగమించి నేను ఈ రోజు మీ ముందు నిలబడ్డాను" అని ఆయన అన్నారు.
"కరూర్ దుర్ఘటన నాకు తీవ్ర మానసిక వేదనను కలిగించింది. కరూర్లో నేను నా సోదరసోదరీమణులను, నా అమాయక పిల్లలను కోల్పోయాను. ఆ ఘటన నా హృదయంలో మానని గాయంగా మిగిలిపోయింది. కరూర్ ఘటనకు సంబంధించి నాపై నిందలు మోపారు. కానీ నేను ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. ఇలాంటి దుర్ఘటనలకు శాశ్వత పరిష్కారం చూపాలని నేను దృఢ సంకల్పంతో ఉన్నాను" అని ముఖ్యమంత్రి విజయ్ అన్నారు.
ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై రాజకీయ విమర్శలు గుప్పిస్తూ.. 'పార్టీ నిధి' (party fund) అనే పదం ప్రస్తావనకు రాగానే ప్రతిపక్ష సభ్యులు శాసనసభ నుండి వాకౌట్ చేశారని ముఖ్యమంత్రి విజయ్ ఆరోపించారు. గతంలో ప్రభుత్వ శాఖలలో కోట్ల రూపాయల అవినీతి ఉండేదని పేర్కొన్న ఆయన, తన పాలనలో ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండితనం, అవినీతి గణనీయంగా తగ్గాయని ప్రజలు విశ్వసిస్తున్నారని స్పష్టం చేశారు.
ఎన్నికల హామీలను నెరవేర్చడంలో తన ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ముఖ్యమంత్రి మరోసారి పునరుద్ఘాటించారు. మాజీ ముఖ్యమంత్రి సి.ఎన్. అన్నాదురై (అరిగ్నర్ అన్నా) జయంతి సందర్భంగా, నవజాత శిశువులకు వారి మేనమామ తరఫున బంగారు ఉంగరాన్ని బహూకరించే పథకాన్ని ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.
రాష్ట్ర ఇటీవలి చరిత్రలో అత్యంత దారుణమైన ప్రజా దుర్ఘటనలలో ఒకదాని వల్ల సర్వస్వం కోల్పోయిన కుటుంబాలకు దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ప్రభుత్వం పేర్కొంది. చివరగా లబ్ధిదారులకు నియామక పత్రాలను అందజేయడంతో ఈ కార్యక్రమం ముగిసింది.
Also Read: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..రేపటి నుంచి వరుసగా 3 రోజులు సెలవులు..పండగే పండగ!
Also Read: వినియోగదారులకు కీలక అలర్ట్.. రూ.100 కరెన్సీ నోట్పై ఆర్బీఐ కీలక ప్రకటన..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
