icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Pawan Kalyan Govinda Namalu: గోవింద నామాలతో వైసీపీ నేతలు పేరడీలు..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం!

Nellore, Andhra Pradesh:

Pawan Kalyan Govinda Namalu News: తిరుమల శ్రీవారిని భక్తిశ్రద్ధలతో కొలుస్తూ ఆలపించే పవిత్ర దైవ నామాలు, భక్తి గీతాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నేతలు పేరడీలుగా మలచి ఆలపించడంపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులో ఇటీవల నిర్వహించిన ఒక నిరసన కార్యక్రమంలో వైకాపా నేతలు వ్యవహరించిన తీరు ధార్మిక విశ్వాసాలను కించపరిచేలా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక 'ఎక్స్'(ట్విట్టర్) వేదికగా ఈ విషయాలను వెల్లడించింది. ఈ ఘటనపై తగిన చట్టపరమైన చర్యలతో ముందుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేసినట్లు పార్టీ పేర్కొంది.

భక్తుల మనోభావాలను దెబ్బతీసే కుట్ర: పవన్ కల్యాణ్
ఈ సందర్భంగా వైకాపా నేతల తీరును తప్పుపడుతూ పవన్ కల్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పార్టీ, కేవలం రాజకీయ లబ్ధి కోసం పవిత్రమైన గోవింద నామాలను పేరడీలుగా మలచడం అత్యంత దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. 

ఇది కోట్ల మంది భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారు వ్యవహరించిన తీరు పూర్తిగా మత విద్వేషాలను రెచ్చగొట్టేలా, కుట్రపూరిత ఆలోచనలతో కూడినదిగా ఉందని ఆయన ధ్వజమెత్తారు.

చట్టపరమైన చర్యలకు ఆదేశం
సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ధార్మిక విశ్వాసాలను అపహాస్యం పాలుజేసే సంస్కృతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. దైవ నామాలు, భక్తి కీర్తనలను కేవలం రాజకీయ విమర్శల కోసం, అపహాస్యం కోసం వాడుకునే విధానాన్ని ప్రతి ఒక్కరూ విడనాడాలని ఆయన హితవు పలికారు. 

ఈ ఘటనకు బాధ్యులైన వారిపై నిబంధనల ప్రకారం చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అప్రమత్తం చేశారు. హిందూ ధర్మం, భక్తుల మనోభావాల పరిరక్షణకు జనసేన పార్టీ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేస్తూ, ఈ వివాదం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Also Read: ఏపీ EAPCET 2026 సీట్ అలాట్‌మెంట్ విడుదల..ఆగస్టు 15లోపు ఈ పని చేయకపోతే సీటు రద్దు!

Also REad: యూపీఐ లావాదేవీలపై భారీగా ఛార్జీలు?! అదనపు ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

స్కూల్ ఫీజుల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 5శాతం మాత్రమే పెంచేందుకు బిల్లు ఆమోదం..!!

BBhoomi6h ago
Lakshmapur, Telangana:

School Fees: పాఠశాల ఫీజుల పెంపునకు సంబంధించి పంజాబ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల ఫీజులను కేవలం 5శాతం మాత్రమే పెంచడానికి అనుమతించిన  బిల్లును రాష్ట్ర అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవకంగా ఆమోదించింది. 'పంజాబ్ రెగ్యులేషన్ ఆఫ్ ఫీస్ ఆఫ్ అన్‌ఎయిడెడ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ (సవరణ) బిల్లు, 2026'కు సోమవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం, రాష్ట్రంలోని అన్‌ఎయిడెడ్ పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలు ప్రతి సంవత్సరం ఫీజులను 5శాతం కంటే ఎక్కువగా పెంచకూడదు.

ప్రస్తుతం పంజాబ్ లో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా బిల్లును రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్ లో సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఏకగ్రీవకంగా ఆమోదం పొందింది. రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలు ప్రతి ఏడాది 5శాతం మాత్రమే ఫీజులు పెంచాలి. దీంతో ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులకు భారీగా ఉపశమనం లబిస్తుందని ముఖ్యమంత్రి భగవంత్ మన్ అన్నారు. ఈ నిర్ణయం అన్ని రకాల ఫీజులకు వర్తిస్తుంది. ట్యూషన్ ఫీజులు, అభివృద్ధి ఫీజులు, వార్షిక రుసుములు, యాక్టివిటీ ఛార్జీలు, స్మార్ట్ క్లాస్ ఫీజులు, టెక్నాలజీ ఛార్జీలు, రవాణా ఛార్జీలు, ల్యాబ్ ఫీజులు, లైబ్రరీ ఫీజులు, పరీక్షల ఛార్జీలు మొదలైనవాటిని కేవలం ఐదు శాతం మాత్రమే పెంచాలి.

 ఇతర ఫీజులు వసూలు చేసినట్లయితే, వాటిని ఐదు శాతానికి మించి పెంచకూడదు. ప్రస్తుతం పంజాబ్‌లో 7,800 వరకు ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, వాటిలో 32 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతి సంవత్సరం, విద్యా సంస్థలు తమ ఇష్టానుసారం ఫీజులను పెంచుతున్నాయి. దీనివల్ల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  భారీ ఫీజుల నుంచి తల్లిదండ్రులను విముక్తి చేసేందుకు ఈ బిల్లును ప్రభుత్వం రూపొందించింది.  ఒకవేళ అదనపు ఫీజులు వసూలు చేసినా.. వాటిని యాజమాన్యం నుండి తిరిగి రాబట్టడం జరుగుతుంది. ఈ నిర్ణయం ప్రకారం, మూడేళ్ల కాలంలో ఫీజులు 15 శాతానికి మించి పెరగకూడదు.

Also Read:ఎస్‌బీఐలో 1,538 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో భారీ నోటిఫికేషన్.. దరఖాస్తు వివరాలు ఇవే..!!

Also Read:ఏమిటీ 'సావోజీ మటన్'? ఒకే ఒక్క కామెంట్‌తో రగిలిన వివాదం.. మహారాష్ట్రలో ఎందుకీ తీవ్ర దుమారం..?

Also Read:  రోజూ ఈ గింజలు తింటే కిలో మటన్ తినంత బలం..!!

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

కేంద్రానికి పసిడి పంట.. బంగారంపై దిగుమతి సుంకం పెంపు.. కేంద్రానికి రూ.10,463 కోట్ల ఆదాయం..!!

BBhoomi7h ago
Lakshmapur, Telangana:

Gold: మన దేశంలో ఏడాది పొడవునా బంగారం కొనుగోళ్లు కొనసాగుతాయి. అయితే, పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా, భారతదేశం తన విదేశీ మారక నిల్వలను గణనీయంగా తగ్గించుకోవలసి వచ్చింది. ఫలితంగా, బంగారం, వెండి కొనుగోళ్లను నియంత్రించేందుకు, భారతదేశం ఈ విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని గణనీయంగా పెంచింది. ఈ సుంకాల పెంపు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం సమకూరింది. మే 13వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ మధ్య కాలానికి, బంగారం, వెండి, ప్లాటినం వంటి లోహాలపై కస్టమ్స్ సుంకంగా రూ.10,463 కోట్లు వసూలు అయినట్లు పార్లమెంటుకు తెలియజేశారు. దీనికి సంబంధించిన ఒక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. ఆహార, ఎరువుల ధరలు కూడా పెరిగాయి. పర్యవసానంగా, విదేశీ మారక నిల్వలను పరిరక్షించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాలను పెంచడం ఈ చర్యలలో ఒకటి. ఈ లోహాలపై దిగుమతి సుంకాలను పెంచడం ద్వారా దిగుమతుల కొనుగోళ్లను తగ్గించడమే ప్రభుత్వ వ్యూహం. దీనిలో భాగంగా, మే 13న, బంగారం, వెండిపై 6శాతంగా ఉన్న కస్టమ్స్ సుంకాన్ని 15శాతానికి పెంచారు. ప్లాటినంపై 6.4శాతంగా ఉన్న సుంకాన్ని 15.4శాతానికి పెంచారు.

బంగారం, వెండి దిగుమతులపై సుంకాలను పెంచడం ద్వారా ప్రభుత్వం గణనీయమైన ఆదాయాన్ని సమకూర్చుకుంది. మే 13 నుంచి ఆగస్టు 2 మధ్య, బంగారంపై సుంకంగా రూ.10,040 కోట్లు, వెండిపై రూ.328 కోట్లు, ప్లాటినంపై రూ.95 కోట్లు వసూలు అయ్యాయి. ఈ మూడు లోహాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ.10,463 కోట్లు అని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే, పెంచిన సుంకం ద్వారా వచ్చిన అదనపు ఆదాయాన్ని మాత్రం వెల్లడించలేదు.  మే 13 నుంచి జూన్ 30 మధ్య 161 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. బంగారం, వెండి స్మగ్లింగ్‌కు పాల్పడినందుకు 116 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. బంగారం, వెండి దిగుమతులను నియంత్రించి, కరెంట్ ఖాతా లోటును సమతుల్యం చేసేందుకే సుంకాలు పెంచినట్లు తెలుస్తోంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం గణనీయమైన ఆదాయాన్ని ఆర్జించింది.

ఆగస్టు 10న హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 380 తగ్గి, రూ. 1,51,970కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 తగ్గి రూ.1,39,300కి చేరింది.

Also Read:ఎస్‌బీఐలో 1,538 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో భారీ నోటిఫికేషన్.. దరఖాస్తు వివరాలు ఇవే..!!

Also Read:ఏమిటీ 'సావోజీ మటన్'? ఒకే ఒక్క కామెంట్‌తో రగిలిన వివాదం.. మహారాష్ట్రలో ఎందుకీ తీవ్ర దుమారం..?

Also Read:  రోజూ ఈ గింజలు తింటే కిలో మటన్ తినంత బలం..!!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Hardik Pandya Trade: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా కొనసాగింపు! ఐపీఎల్ ట్రేడింగ్‌లో షాకింగ్ నిర్ణయం!

Hyderabad, Telangana:

Hardik Pandya Trade 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్ హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై గత కొంతకాలంగా గందరగోళం కొనసాగుతోంది. ముంబై ఫ్రాంచైజీని పాండ్యా వీడనున్నాడని సమాచారం అందుతున్న నేపథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) లేదా చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లోకి మారనున్నాడని ప్రచారం సాగుతోంది. అయితే, 'క్రిక్‌బజ్' నివేదిక ప్రకారం ముంబై ఇండియన్స్ అతన్ని వేరే జట్టుకు బదిలీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది.

కోల్‌కతా, చెన్నై ఫ్రాంఛైజీలతో చర్చలు!
గత కొన్ని వారాలుగా హార్దిక్ పాండ్యా కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్‌కింగ్స్ జట్లు పోటీ పడుతున్నాయని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమేనని తేలింది. 

మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా జట్టు హార్దిక్‌పై ఆసక్తి చూపుతున్నప్పటికీ, తమ కీలక ఆటగాళ్లను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. మరోవైపు, తమ జట్టు కోచ్ నియామకం పూర్తయిన తర్వాతే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని చెన్నై సూపర్‌కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కోల్‌కతా, చెన్నై టీమ్స్‌తో జరుగుతున్న ప్రాథమిక దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

ముంబై ఇండియన్స్ ప్రదర్శన-హార్దిక్ గణాంకాలు
2024లో ముంబై ఇండియన్స్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్ కెప్టెన్సీ జట్టుకు పెద్దగా కలిసిరాలేదు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టు, 2024లో చివరి స్థానంలో నిలవగా, 2026 సీజన్‌లో తొమ్మిదవ స్థానానికి పరిమితమైంది. కేవలం 2025లో మాత్రమే జట్టు 'క్వాలిఫైయర్ 2' వరకు వెళ్లగలిగింది.

ఇక వ్యక్తిగత ప్రదర్శన విషయానికి వస్తే, 2024 నుంచి హార్దిక్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ప్రతి సీజన్‌లోనూ అతను 25 కంటే తక్కువ సగటుతో 225 పరుగుల కంటే తక్కువే చేశాడు. అలాగే అతని స్ట్రైక్ రేట్ కూడా 150 లోపే ఉంది. బౌలింగ్ పరంగా మాత్రం అతను మొత్తంగా 29 వికెట్లు పడగొట్టగలిగాడు.

ఫిట్‌నెస్‌పై దృష్టి
2026 IPL సీజన్ ముగిసిన తర్వాత ఆటకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా, ప్రస్తుతం బెంగళూరులోని 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' (CoE)లో శిక్షణ పొందుతున్నాడు. తన పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించే దిశగా ఆయన వేగంగా అడుగులు వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ, రాబోయే సీజన్‌లో హార్దిక్ ముంబై ఇండియన్స్ జట్టులోనే కొనసాగుతాడా లేదా అన్నదానిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Also Read: క్రికెట్ ప్రపంచకప్ 2027 రేసు నుంచి ఆ రెండు టీమ్స్ ఔట్?! టీమ్ఇండియా పరిస్థితి ఏంటంటే?

Also Read: యశస్వి జైస్వాల్‌తో స్టార్ హీరోయిన్ డేటింగ్ రూమర్స్..స్పందించిన మృణాల్ ఠాకూర్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

AP EAPCET 2026: ఏపీ EAPCET 2026 సీట్ అలాట్‌మెంట్ విడుదల..ఆగస్టు 15లోపు ఈ పని చేయకపోతే సీటు రద్దు అవుతుంది!

PPINEWZ7h ago
Vijayawada, Andhra Pradesh:

AP EAPCET 2026 Seat Allotment: ఆంధ్రప్రదేశ్‌లో EAPCET 2026 (ఎంసెట్) కౌన్సెలింగ్‌కు సంబంధించిన తొలి దశ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు అధికారులు ఫలితాలను విడుదల చేశారు. కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులు అధికారిక AP EAPCET Website ద్వారా తమ అలాట్‌మెంట్‌ వివరాలను సులభంగా చెక్ చేసుకోవచ్చు. మెరిట్ ర్యాంక్, వెబ్ ఆప్షన్లు, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా ఈ సీట్లు కేటాయించబడ్డాయి.

సీట్లు పొందిన విద్యార్థులు నిర్దేశిత గడువులోగా తగిన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు ఆన్‌లైన్ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌తో పాటు కేటాయించిన కాలేజీలో నేరుగా ఫిజికల్ రిపోర్టింగ్‌ చేయడం తప్పనిసరి. ఈ రిపోర్టింగ్‌ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు AP SCHE Portal ద్వారా తెలుసుకోవచ్చు.

ఫలితాలు చెక్ చేసుకునే విధానం..
1) ముందుగా అధికారిక AP EAPCET Website ఓపెన్ చేయాలి.

2) హోమ్‌పేజీలో ఉండే 'Candidate Login' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

3) లాగిన్ వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి.

4) స్క్రీన్‌పై కనిపించే సీట్ల కేటాయింపు ఫలితాన్ని పరిశీలించి, అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు, నిబంధనలు..
సీటు పొందిన అభ్యర్థులు ఆన్‌లైన్, ఫిజికల్ రిపోర్టింగ్‌లను పూర్తి చేయాలి. ఈ ప్రక్రియకు సంబంధించి విద్యార్థులు Andhra Pradesh State Council of Higher Education సూచనలను పాటించవలసి ఉంటుంది. ఒకవేళ గడువులోగా ఈ రెండు విధానాలను పూర్తి చేయకపోతే కేటాయించిన సీటు రద్దు కానుంది. అంతేకాకుండా, తదుపరి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం కూడా కోల్పోవాల్సి వస్తుంది.

తొలి దశలో సీట్లు సాధించిన విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. కాబట్టి విద్యార్థులు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే రిపోర్టింగ్‌ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షల నిర్వహణ, కౌన్సెలింగ్, ఇతర అధికారిక సమాచారం కోసం విద్యార్థులు ఎల్లప్పుడూ AP EAPCET Official Portalను మాత్రమే సందర్శించాలి. సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక వదంతులను నమ్మవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Also Read: Srisailam Dam Gates: కృష్ణానదికి పోటెత్తిన వరదనీరు..శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత!

Also Read: మహిళా ఎస్సైపై దురుసు ప్రవర్తన..ఆముదాలవలస వైసీపీ నేత చింతాడ రవికుమార్ అరెస్ట్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Gajakesari Rajayogam: ఆగస్టు 11న అరుదైన రాజయోగం..ఈ నాలుగు రాశులకు రాజయోగాలతో అదృష్టం!

Hyderabad, Telangana:

Gajakesari Rajayogam August 11: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఆగస్టు 11న కర్కాటక రాశిలో ఒక అరుదైన గ్రహ సంయోగం జరగనుంది. దీని ఫలితంగా హంస, శశి ఆదిత్య, గజకేసరి, బుధాదిత్య రాజయోగాలు ఏకకాలంలో రూపుదిద్దుకోనున్నాయి. ఈ నాలుగు శక్తివంతమైన రాజయోగాల ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆదాయం పెరిగి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఆ రాశుల వివరాలు ఇప్పుడు చూద్దాం.

1) వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ కాలం చాలా శుభప్రదంగా ఉంటుంది. కొత్త కెరీర్ పురోగతికి మార్గం సుగమమవుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి పొందే అవకాశాలున్నాయి. వ్యాపారంలో ఆర్థిక లాభాలు పెరిగి, ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. పెట్టుబడులు కలిసి రావడంతో పాటు, విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది.

2) కర్కాటక రాశి
ఈ నాలుగు రాజయోగాల ప్రభావం కర్కాటక రాశిపై అత్యధికంగా ఉంటుంది. పనిలో పై అధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడటంతో ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా బలపడుతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. పాత ఆర్థిక లావాదేవీలలో విజయాలు సాధిస్తారు.

3) తులా రాశి
తులా రాశి వారికి రాబోయే కాలంలో అనేక శుభవార్తలు అందనున్నాయి. కెరీర్‌లో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపార భాగస్వామ్యాలు లాభసాటిగా మారుతాయి. ఈ సమయంలో భూమి, ఆస్తి, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

4) కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ రాజయోగాల ఏర్పాటు ఒక వరంలాంటిది. ఉద్యోగాలు మారాలనుకునే వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఎక్కడైనా నిలిచిపోయిన లేదా చిక్కుకుపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. ఆర్థికంగా ఎదుగుదల కనిపిస్తుంది.

(గమనిక: ఇక్కడ పేర్కొన్న సమాచారం కేవలం జోతిష్య శాస్త్రం ఆధారం, వారివారి నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీన్ని పాటించే ముందు సంబంధిత జోతిష్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also REad: ఈ నెల 13 నుంచే శ్రావణం: శివుడికి వీటితో అభిషేకం చేస్తే ఇంట్లో కనక వర్షమే..!

Also Read: నేటి రాశి ఫలాలు10 ఆగస్టు 2026.. ఈ రాశుల వారికి తిరుగులేని విజయం, మీ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Peddi: డీసీఎం పైనుంచి కింద పడిపోతే పెద్ది సుదర్శన్‌ రెడ్డి కాపాడాడు: హరీశ్‌ రావు భావోద్వేగం

Nallabelli, Telangana:

 Harish Rao Emotional Speech: నాడు ఉద్యమంలో నాకు దెబ్బ తగిలితే ఏ ఆసుపత్రిలో చేర్పించాడో.. అదే ఆసుపత్రిలో పెద్దిని విగతజీవిగా చూస్తానని కలలో కూడా ఊహించలేదంటూ మాజీ మంత్రి హరీశ్‌ రావు భావోద్వేగానికి లోనయి కంటతడి పెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి కోసం, ముఖ్యంగా నర్సంపేటకు మెడికల్ కాలేజీ, దేవాదుల నీళ్లు సాధించిన ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డిదేనని ప్రకటించారు. ప్రాణాలు, ఆస్తులు లెక్కచేయకుండా సమైక్యవాదులను ఎదిరించిన నిస్వార్థ పోరాట యోధుడు, గొప్ప తెలంగాణ ఉద్యమకారుడు సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు.

జ్ఞాపకాలు పదిలం
నల్లబెల్లిలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ, సంస్మరణ సభ నిర్వహించగా.. బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు పెద్ది కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం పెద్ది సుదర్శన్‌ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం భావోద్వేగ ప్రసంగం చేశారు. పెద్ది భౌతికంగా లేకపోయినా ఆయన జ్ఞాపకాలు పదిలం.. ఆయన కుటుంబానికి, నర్సంపేట ప్రజలకు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

రెండున్నర దశాబ్దాల అనుబంధం
'పెద్ది సుదర్శన్ రెడ్డితో నాకు రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం ఉంది. కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఆయనతో కలిసి అనేక పోరాటాల్లో, ఉద్యమాల్లో, ఉప ఎన్నికల్లో నేను పనిచేశా. తెలంగాణ కోసం ప్రాణాలు, ఆస్తులు, పదవులు ఏవీ లెక్కచేయకుండా పోరాడిన నిస్వార్థ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. మానుకోట సంఘటన, పరకాల, స్టేషన్ ఘనపూర్ ఉప ఎన్నికలు ప్రతి చోటా పెద్ది సుదర్శన్ రెడ్డి పోరాట స్ఫూర్తి, ఆయన కష్టం ముందుండేది' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు వివరించారు.

అభివృద్ధి కోసం ఎంతో తపన
సమైక్యవాదులు తెలంగాణ గడ్డ మీద అడుగుపెడుతుంటే వారి బుల్లెట్లను, రాళ్లను కూడా లెక్కచేయకుండా ముందుండి అడ్డుకున్న పోరాట యోధుడు పెద్ది సుదర్శన్‌ రెడ్డి అని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్ రావు కొనియాడారు. తెలంగాణ వచ్చే వరకు రాష్ట్ర సాధన కోసం పోరాడాడు.. రాష్ట్రం వచ్చాక నర్సంపేట అభివృద్ధి కోసం ఎంతో తపన పడ్డాడని తెలిపారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ ఆయన పోరాట స్ఫూర్తిని గుర్తించిన కేసీఆర్ కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశం కల్పించారని గుర్తుచేశారు. రామప్ప, పాకాల, లక్నవరం చెరువులకు దేవాదుల నీళ్లను అందించాలని కేసీఆర్‌ను కోరి మరి సాధించాడని మాజీ మంత్రి హరీశ్ రావు జ్ఞాపకం చేసుకున్నారు. పెద్ది అభ్యర్థన మేరకే కేసీఆర్ ఆనాడు దేవాదుల నీటిని విడుదల చేశారని చెప్పారు.

రాత్రింబవళ్లు తండ్లాడాడు
'చెరువులకు దేవాదుల నీళ్లు వస్తున్నాయంటే అది ముమ్మాటికీ పెద్ది సుదర్శన్ రెడ్డి కృషే. తన ప్రాంత రైతులు రెండు పంటలు పండించుకోవాలని రాత్రింబవళ్లు తండ్లాడాడు. కేసీఆర్ ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలకు గోదావరి జలాలను అందించాడు. రాష్ట్రంలో జిల్లా కేంద్రం కాని చోట మెడికల్ కాలేజీ సాధించిన ఏకైక నియోజకవర్గం నర్సంపేట. కేసీఆర్ ఆలోచనతోపాటు ఈ ప్రాంతం మీద పెద్ది సుదర్శన్ రెడ్డికి ఉన్న ప్రేమ వల్లే ఇది సాధ్యమైంది' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు.

అదే చివరి కార్యక్రమం
కాకతీయ రెడ్డి రాజులు కట్టిన దేవాలయం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేస్తే దానికి వ్యతిరేకంగా చేసిన నిరసనే నేను, పెద్ది కలిసి చేసిన చివరి కార్యక్రమం అని మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. అదే మా ఇద్దరి కలయికలో చివరిది అవుతుందని తాను కలలో కూడా అనుకోలేదని గుర్తుచేసుకున్నారు. 'గతంలో మేమిద్దరం బియ్యాల జనార్దన్ సార్ ఇంట్లో కిరాయికి ఉండేవాళ్లం. నేను, పెద్ది దాదాపు నెల 40 రోజుల పాటు ఆ ఇంట్లో కలిసి ఉన్నాం. పరకాల, ఘనపూర్ ఉపఎన్నికల సమయంలో బాధ్యతలను భుజాన వేసుకుని పార్టీని గెలిపించుకున్నాం. అప్పుడు ఆయనకు అన్నం, నిద్ర, ఆకలి అనేవే ఉండేవి కావు' అని పెద్దితో ఉన్న అనుబంధాన్ని హరీశ్‌ రావు వివరించారు.

ప్రతిక్షణం తపన
'మాకు తెలంగాణ కావాలి, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకోవాలని ప్రతిక్షణం తపనపడ్డ గొప్ప ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్‌ రెడ్డి. అలాంటి నాయకుడిని కోల్పోవడం కేవలం నర్సంపేటకు, ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాదు.. యావత్ తెలంగాణ రాష్ట్రానికి, బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు' అని హరీశ్‌ రావు ఆవేదన చెందారు. పెద్ది సుదర్శన్ రెడ్డి లేని మీటింగ్‌లో అది కూడా నర్సంపేట గడ్డ మీద నేను పాల్గొంటానని ఎప్పుడూ ఊహించలేదని కంటతడి పెట్టారు.

'తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఒక అమరవీరుడి అంతిమ యాత్రలో పాల్గొంటున్నప్పుడు పోలీసులతో జరిగిన తోపులాటలో నేను డీసీఎం పైనుంచి కింద పడిపోయా. అప్పుడు నన్ను పెద్ది సుదర్శన్ రెడ్డి ఏ ఆసుపత్రిలో అయితే చేర్పించి ప్రాణాలు కాపాడాడో.. అదే ఆసుపత్రిలో ఆయనను నేను చివరిచూపు చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు' అని హరీశ్‌ రావు కన్నీరు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను భయపెట్టినా, ప్రలోభపెట్టినా, ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా ఆయన తలొగ్గలేదని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ అక్రమాల మీద అదే పాత ఉద్యమ స్ఫూర్తితో చివరి శ్వాస దాకా కొట్లాడాడని గుర్తుచేశారు.

అదే ఆసుపత్రిలో చివరిచూపు
'తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఒక అమరవీరుడి అంతిమ యాత్రలో పాల్గొంటున్నప్పుడు పోలీసులతో జరిగిన తోపులాటలో నేను డీసీఎం పైనుంచి కింద పడిపోయా. అప్పుడు నన్ను పెద్ది సుదర్శన్ రెడ్డి ఏ ఆసుపత్రిలో అయితే చేర్పించి ప్రాణాలు కాపాడాడో.. అదే ఆసుపత్రిలో ఆయనను నేను చివరిచూపు చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు' అని హరీశ్‌ రావు కన్నీరు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను భయపెట్టినా, ప్రలోభపెట్టినా, ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా ఆయన తలొగ్గలేదని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ అక్రమాల మీద అదే పాత ఉద్యమ స్ఫూర్తితో చివరి శ్వాస దాకా కొట్లాడాడని గుర్తుచేశారు.

0
0
Report
Advertisement

రెండేళ్లలో కేసీఆర్‌ మళ్లీ సీఎం.. మెడికల్‌ కాలేజీకి పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు పెడతాం: కేటీఆర్

Nallabelli, Telangana:

Peddi Sudarshan Reddy Memorial Meeting: పెద్ద పదవులు చేపట్టకపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు పెద్ది సుదర్శన్‌ రెడ్డి అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. 'పెద్ది సుదర్శన్‌రెడ్డి అంతిమయాత్రకు ఓరుగల్లు మొత్తం కదిలివచ్చింది. ఉద్యమ బిడ్డకు ఉద్యమ గడ్డ ఇచ్చిన గౌరవమిది' అని తెలిపారు. రెండేళ్లలో కేసీఆర్‌ మళ్లీ సీఎం.. పెద్ది ఆశయాల మేరకు నర్సంపేట మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. నర్సంపేట వైద్య కళాశాలకు పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు పెడతామని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రకటన చేశారు.

నల్లబెల్లిలో సంస్మరణ సభ
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదిన కర్మ సందర్భంగా నల్లబెల్లిలో సంస్మరణ సభ నిర్వహించారు. పెద్ది సుదర్శన్‌ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన కేటీఆర్‌ అనంతరం ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. 'పెద్ది సుదర్శన్‌రెడ్డి పెద్ద పెద్ద పదవులు అలంకరించకపోయినా.. తెలంగాణ ఉద్యమానికి, ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా పోరాటాలకు నాయకత్వం వహించిన మహోన్నత ప్రజా నాయకుడు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ కొనియాడారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి అంతిమయాత్రకు ఓరుగల్లు గడ్డ మొత్తం కదిలివచ్చిందని.. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా 12 గంటల పాటు లక్షలాది మంది ప్రజలు తరలిరావడం ఆయన వారి గుండెల్లో సంపాదించుకున్న అపారమైన స్థానానికి సజీవ సాక్ష్యమని ప్రకటించారు. ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడికి ఉద్యమ బిడ్డగా, ఆ ఉద్యమ గడ్డ ఇచ్చిన అత్యున్నత గౌరవం ఇది అని బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు.

అంతటి భారీ జనసందోహం
'పెద్ది సుదర్శన్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి లేదా మాజీ మంత్రి కాకపోయినా.. పదిసార్లు ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఆయన అంతిమయాత్రకు అంతటి భారీ జనసందోహం రావడం ఆయనలోని ఉద్యమ బలానికి, నిబద్ధతకు నిదర్శనం' అని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఎంతకాలం బతికామన్నది కాదని.. ఎలా బతికామన్నదే ముఖ్యం అనే సూక్తికి పెద్ది జీవితమే ఉదాహరణ అని తెలిపారు. లక్షలాది మంది జనం మధ్య సాగిన ఆయన చివరి ప్రయాణమే ఆయన సార్థక జీవితానికి అసలైన కొలమానం అని మాజీ మంత్రి కేటీఆర్‌ కొనియాడారు.

ఇంటింటికీ పైపులైన్‌ ద్వారా గ్యాస్‌
నర్సంపేట నియోజకవర్గానికి పెద్ది సుదర్శన్‌రెడ్డి చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. ఒక్కసారే ఎమ్మెల్యేగా పనిచేసినా కరోనా మహమ్మారి, తీవ్ర ఆర్థిక సంక్షోభం వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా నర్సంపేటలో ఇంటింటికీ పైపులైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫరా కార్యక్రమాన్ని అమలుచేశారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్‌, వ్యవసాయ మంత్రులను ఒప్పించి నర్సంపేట రైతుల కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టును పట్టుబట్టి సాధించి అసాధారణ అభివృద్ధిని సాధించారని కేటీఆర్‌ వెల్లడించారు.

మెడికల్‌ కాలేజీకి పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు
రెండేళ్లలో కేసీఆర్‌ నాయకత్వంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. పెద్ది ఆశయాలకు అనుగుణంగా నర్సంపేటను అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నర్సంపేటలో త్వరలోనే ఏర్పాటుచేయనున్న మెడికల్‌ కాలేజీకి పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు పెడతామని ప్రకటన చేశారు. పెద్ది భార్య స్వప్న, వారి పిల్లలు, కుటుంబసభ్యులకు కేసీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎల్లప్పుడూ కొండంత అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం నర్సంపేట మట్టిలో.. పాకాల జలాల్లో పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు నిలిచిపోతుందని కేటీఆర్‌ వెల్లడించారు.

 

0
0
Report
Advertisement
Advertisement
Back to top