Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad500029

హైదరాబాద్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు పూరీ జగన్నాథ రథయాత్ర

Jul 07, 2024 14:56:36
Hyderabad, Telangana

హైదరాబాద్ అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఏర్పాటు చేసిన పూరీ జగన్నాథ రథయాత్రను సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పూరీ జగన్నాథుని రథయాత్రలో ఇస్కాన్ ఆలయ అర్చకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. రథయాత్రకు ముందు దిష్టిగుమ్మ డి కాయను చంపి రథయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Dec 30, 2025 16:06:01
Podili, Andhra Pradesh:

Podili Police Fight: స్థానిక వ్యాపారితో పోలీసులు ఘర్షణ పడడం ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లారీ అన్ లోడ్ విషయంలో ఎరువుల వ్యాపారితో అతడి కుమారుడిని పొదిలి పోలీసులు తీవ్రంగా కొట్టడం ప్రకాశం జిల్లాలో రచ్చకు దారి తీసింది. బాధితులు తీవ్ర గాయాలవడంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పొదిలిలో బాధితుల తరఫున ఓ సామాజిక సంఘం నాయకులు ఉద్యమం చేపడుతుండడంతో కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రోజురోజుకు వివాదం సద్దుమణకపోవడంతో సీఎం స్పందించారు.

Also Read: BRS Party: నదీ జలాల్లో దొంగకు తాళం ఇచ్చిన రేవంత్‌ రెడ్డి: హరీశ్‌ రావు

ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో స్థానిక వ్యాపారికి, పోలీసులకు జరిగిన ఘర్షణపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. స్థానిక ఎస్ఐ అకారణంగా దాడి చేశారనే వ్యాపారుల ఆరోపణపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పొదిలి పట్టణంలో అవినాష్ అనే వ్యాపారికి, పట్టణ ఎస్సై వేమనకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ నెల 24వ తేదీన సాయంత్రం 5 గంటల సమయంలో షాప్ వద్ద  లారీ నుంచి ఎరువులను దింపే క్రమంలో వెంటనే లారీని అక్కడ నుంచి తొలగించాలని పోలీసులు కోరగా.. ఆ సమయంలో వివాదం రాజుకుంది.

Also Read: Railway Warning: ప్రజలకు రైల్వే శాఖ కీలక విజ్ఞప్తి.. అక్కడ గాలిపటాలు ఎగురవేయవద్దు

తరువాత రోజు క్రిస్మస్ పండగ సందర్భంగా రోడ్లపై రద్దీ కారణంగా ట్రాఫిక్‌ను క్లియర్ చేసే క్రమంలో ఎస్సై, వ్యాపారికి మధ్య మళ్లీ ఘర్షణ జరిగింది. ఈ సందర్భంలో తమపై లాఠీతో దాడి చేశారని అవినాశ్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు ఎస్ఐపై  ఆరోపణలు చేశారు. పోలీసులు దాడికి పాల్పడడంతో పొదిలిలో వ్యాపార వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగాయి. వ్యాపార సంఘాలు ఆందోళనకు దిగడంతోపాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాయి. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపిన జిల్లా ఎస్పీ ఎస్ఐ వేమనను వీఆర్‌కు పంపుతూ రెండు రోజుల కిందట ఆదేశాలు ఇచ్చారు.

Also Read: Schools Holiday: జనవరి 1వ తేదీ అన్నీ స్కూళ్లకు సెలవు.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

అయినా కూడా వర్తక వ్యాపారులు శాంతించకుండా నిరసనలు చేస్తుండడంతో సీఎం చంద్రబాబు స్పందించారు. పొదిలిలో ఘర్షణకు కారణాలు, పోలీసుల చర్యలు, వ్యాపార వర్గాల ఆందోళనపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి వంగలపూడి అనితతో సీఎం చంద్రబాబు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై ఇప్పటికే మంత్రులు, అధికారులు స్పందించారని తెలిపారు. దాడికి పాల్పడిన పోలీస్‌ సబ్ ఇన్‌స్పెక్టర్‌కు ముందుగా ఛార్జ్ మెమో ఇచ్చి వివరణ తీసుకున్నట్లు.. ప్రాథమిక నివేదిక ఆధారంగా ఎస్ఐ వేమనను బదిలీ చేసినట్లు సీఎం చంద్రబాబుకు డీజీపీ వివరించారు.

ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని.. సాధారణ ప్రజల పట్ల వ్యవహరించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని డీజీపీతోపాటు పోలీస్‌ శాఖకు సీఎం చంద్రబాబు సూచించారు. పొదిలి ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీకి సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు, వ్యాపారుల గౌరవానికి భంగం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Dec 30, 2025 13:07:34
Hyderabad, Telangana:

Rashmika Vijay Devarakonda Rome Tour: హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక.. వచ్చే ఏడాది పెళ్లిపీటలెక్కనున్నారనే వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతున్న క్రమంలో వారిద్దరూ ఇప్పుడు విహారయాత్రకు వెళ్లారని సమాచారం. రష్మిక మందన్న ప్రస్తుతం రోమ్ నగరంలో విహరిస్తున్నారు. 

అయితే ఆమె షేర్ చేసిన తాజా ఫోటోలు, వీడియోలు కేవలం పర్యటనకు సంబంధించినవి మాత్రమే కాదు, నటుడు విజయ్ దేవరకొండతో ఆమెకు ఉన్న బంధం గురించి వస్తున్న పుకార్లకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరిలో ఉదయపూర్‌లోని ఒక ప్యాలెస్‌లో వీరిద్దరి వివాహం జరగబోతోందనే వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఈ పోస్ట్ సంచలనంగా మారింది.

రష్మిక పోస్ట్‌లో విజయ్ ఎక్కడ?
రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో "ఇప్పటివరకు రోమ్" (Rome so far) అంటూ కొన్ని ఫోటోలు, వీడియోలను షేర్ చేశారు. ఇందులో విజయ్ దేవరకొండ నేరుగా కనిపించకపోయినప్పటికీ, అభిమానులు తమ 'డిటెక్టివ్' కళ్లతో కొన్ని ఆసక్తికర విషయాలను కనిపెట్టారు.

> ఒక వీడియోలో రష్మిక డెజర్ట్ తింటూ, మొదటి ముద్దను కెమెరా వెనుక ఉన్న వ్యక్తికి ఎంతో ప్రేమగా తినిపిస్తున్నారు. అది విజయ్ దేవరకొండ అని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.

> మరొక వీడియోలో రష్మిక ప్రార్థన చేస్తూ కొవ్వొత్తి వెలిగిస్తుండగా, పక్కనే మరొక చేయి కొవ్వొత్తిని పట్టుకుని ఉంది. ఆ చేయి విజయ్ దేనని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.

> ఈ ట్రిప్‌లో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా రష్మిక స్నేహితులతో కలిసి కనిపించడం విశేషం. ఇది వీరిద్దరి మధ్య ఉన్న కుటుంబ సంబంధాలను స్పష్టం చేస్తోంది.

సోషల్ మీడియాలో అభిమానుల సందడి
రష్మిక పోస్ట్ చేసిన వెంటనే ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు రచ్చ మొదలుపెట్టారు. "రష్మిక విజయ్ దేవరకొండ.. మీరిద్దరూ కలిసి ఉంటే చూడముచ్చటగా ఉంటుంది" అని రాసుకొచ్చారు. రష్మికను నెటిజన్లు ఇప్పటికే 'దేవరకొండ వారి కోడలు' అని పిలుస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కెరీర్ పరంగా బిజీ బిజీ
ఒకవైపు వ్యక్తిగత జీవితంపై ఇన్ని ఊహాగానాలు వస్తున్నా, రష్మిక తన కెరీర్ లోనూ దూసుకుపోతున్నారు. 'పుష్ప 2'తో భారీ విజయాన్ని అందుకున్న ఆమె, ఇటీవలే 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాతో అలరించారు. పలు భారీ ప్రాజెక్టులలో నటిస్తున్నారు. తాజా రోమ్ వెకేషన్ పోస్ట్‌‌‌లో ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. వచ్చే ఫిబ్రవరిలో ఉదయపూర్ వేదికగా ఈ జంట ఒక్కటి కాబోతున్నారా? లేదా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే!

Also Read: Mega Victory Mass Song: మెగా-విక్టరీ 'మాస్' సాంగ్ వచ్చేసింది..'మన శంకరవరప్రసాద్‌ గారు'లో క్రేజీ పార్టీ సాంగ్!

Also Read: Chicken Vs Mutton Liver: మటన్ లివర్ Vs చికెన్ లివర్..ఏది తినొచ్చు? ఏది తినకూడదు? నిప్పులాంటి నిజం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Dec 30, 2025 12:13:29
Hyderabad, Telangana:

Mega Victory Mass Song Launch: తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ఇద్దరు దిగ్గజ నటులు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఆ హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కలయికలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘మన శంకరవరప్రసాద్‌ గారు’. డైరెక్టర్ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి కథానాయకుడిగా నటిస్తుండగా, వెంకటేశ్‌ ఒక పవర్‌ఫుల్ పాత్రలో మెరవనున్నారు.

మాస్ సాంగ్ అదిరిపోయింది!
సంక్రాంతి పండుగను టార్గెట్ చేస్తూ జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను చిత్ర బృందం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తాజాగా ‘ఆర్ యూ రెడీ’ (Mega Victory Mass Song) మెగా విక్టరీ మాస్ సాంగ్ అనే హుషారైన పాటను విడుదల చేశారు. ఈ పాటలో చిరంజీవి, వెంకటేశ్‌ల మధ్య సాగే బాడీ లాంగ్వేజ్, డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.

ప్రముఖ రచయిత కాసర్ల శ్యామ్ ఈ పాటను రాశారు. "ఏంటి బాసూ సంగతీ.. అదిరిపోద్దీ సంక్రాంతీ.., ఏంటి వెంకీ సంగతీ.. ఇరగతీద్దాం సంక్రాంతీ.." అంటూ సాగే సాహిత్యం మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉంది.

చిరంజీవి మార్కు గ్రేస్, వెంకటేశ్‌ మార్కు టైమింగ్ ఈ పాటలో హైలైట్‌గా నిలిచాయి. ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు ఒకరినొకరు పేరు పెట్టి పిలుచుకుంటూ సందడి చేయడం వెండితెరపై కన్నుల పండుగగా ఉండబోతోంది.

సంక్రాంతి రేసులో 'శంకరవరప్రసాద్‌'
అనిల్ రావిపూడి అంటేనే వినోదానికి కేరాఫ్ అడ్రస్. 'మన శంకరవరప్రసాద్‌ గారు' చిత్రంలో కూడా అటు ఫ్యామిలీ ఎమోషన్స్, ఇటు మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 'మెగా విక్టరీ' మాస్ సాంగ్ చూస్తుంటే, థియేటర్లలో సంక్రాంతి సందడి ముందుగానే వచ్చేసినట్లు కనిపిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవికి ఇది మరో సంక్రాంతి బ్లాక్ బస్టర్ అవుతుందని, వెంకీ తోడవ్వడంతో సినిమా స్థాయి రెట్టింపు అయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జనవరి 12 కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Chicken Vs Mutton Liver: మటన్ లివర్ Vs చికెన్ లివర్..ఏది తినొచ్చు? ఏది తినకూడదు? నిప్పులాంటి నిజం!

Also Read: AP Pension Survey: పెన్షన్ దారులకు ప్రభుత్వం అలర్ట్..త్వరలోనే ఏపీలో మరో సర్వే..ఏం చేయనున్నారంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Dec 30, 2025 12:05:52
Secunderabad, Telangana:

Telangana Government: ఈ స్కీమ్ కింద  2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ట్రాన్స్‌జెండర్లకు 100 శాతం సబ్సిడీతో రుణాలను అందించనున్నారు. అర్హత సాధించిన ప్రతి లబ్ధిదారుడికి గరిష్టంగా రూ.75 వేల వరకు ఆర్థిక సాయం మంజూరు చేస్తారు. ఈ మొత్తం పూర్తిగా సబ్సిడీ రూపంలో ఉండటం వల్ల లబ్ధిదారులు ఎలాంటి తిరిగి చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వం ఈ రుణాన్ని ఒక భరోసాగా అందిస్తూ... స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడానికి ప్రోత్సహిస్తోంది.

ప్రత్యేకంగా ఏదైనా రంగంలో నైపుణ్య శిక్షణ పొందిన వారు లేదా చిన్న స్థాయిలో వ్యాపారం ప్రారంభించాలని ఆసక్తి ఉన్న ట్రాన్స్‌జెండర్లకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా మారనుంది. కిరాణా దుకాణాలు, సేవా రంగం, హస్తకళలు, చిన్న తయారీ యూనిట్లు వంటి కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఈ ఆర్థిక సాయం ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.

దివ్యాంగులు, వయోవృద్ధులు,  ట్రాన్స్‌జెండర్స్ సాధికారిత శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన ట్రాన్స్‌జెండర్లు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అర్హత కలిగి ఉంటారు. అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించిన తర్వాత దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.

హైదరాబాద్ జిల్లాలో ఈ పథకం కింద మొత్తం 30 స్వయం ఉపాధి యూనిట్లను ప్రభుత్వం కేటాయించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్‌లో ఉన్న సంబంధిత కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా, www.wdsc.telangana.gov.in  వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని కూడా అప్లై చేయవచ్చు.

Also Read: Railway stocks: దుమ్మురేపుతోన్న రైల్వే స్టాక్స్.. టికెట్ ఛార్జీల పెంపుతో.. 5 రోజుల్లో 26శాతం లాభాలు..!!

దరఖాస్తులు వచ్చే నెల జనవరి 31వ తేదీలోపు సమర్పించాల్సి ఉంటుంది. అందిన దరఖాస్తులను జిల్లా స్థాయి కమిటీ పరిశీలించి అర్హులైన వారిని తుది ఎంపిక చేస్తుంది. ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు లేదా సందేహాల నివృత్తి కోసం 9640452773 నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

ట్రాన్స్‌జెండర్ వర్గాన్ని ప్రధాన ప్రవాహంలోకి తీసుకురావడం, వారికి ఆర్థిక భద్రత కల్పించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సమాజంలో సమానత్వం, సాధికారత దిశగా ఒక కీలక అడుగుగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Also Read:  Future Metal: బంగారం, వెండి, ప్లాటినం, రాగి కాదు.. భవిష్యత్ అంతా ఈ లోహానిదే..లాభాలే లాభాలు..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
HDHarish Darla
Dec 30, 2025 11:39:17
Hyderabad, Telangana:

Chicken Liver vs Mutton Liver Benefits: మాంసాహార ప్రియుల్లో చాలా మందికి చికెన్, మటన్ కంటే వాటి 'లివర్' (కాలేయం) అంటేనే ఎక్కువ ఇష్టంగా తింటుంటారు. రుచితో పాటు వీటిలో పోషకాలు పుష్కలంగా ఉండటమే దీనికి కారణం. అయితే, చికెన్ లివర్ మంచిదా? లేక మటన్ లివర్ మంచిదా? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం వీటి ఉపయోగాలు, పరిమితులను ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ లివర్ ప్రయోజనాలు
చికెన్ లివర్ తక్కువ ధరలో లభించే అద్భుతమైన పౌష్టికాహారం. ఇందులో ఐరన్, సెలీనియం, విటమిన్ A, B12, ఫోలేట్, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇందులోని సెలీనియం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. 

విటమిన్ A, B12 కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు పరిమితంగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. ఉడికించిన లివర్ తింటే శరీరంలో కొవ్వు తగ్గే అవకాశం ఉంటుంది.

మటన్ లివర్ ప్రయోజనాలు
చాలా మంది రుచి కోసం మటన్ లివర్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. రక్తహీనత (Anemia) సమస్యతో బాధపడేవారికి మటన్ లివర్ ఒక ఔషధంలా పనిచేస్తుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. ఇందులో జింక్, పొటాషియం, కాపర్ ఉండటం వల్ల కణాలకు ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. విటమిన్ B12 పుష్కలంగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి (రోగనిరోధక శక్తి) పెరుగుతుంది.

వీళ్లు తినకపోవడమే మంచిది!
లివర్‌లో పోషకాలు ఉన్నప్పటికీ, అందరికీ ఇది సరిపడదు. ఈ క్రింది సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి. లివర్‌లో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గుండె జబ్బులు ఉన్నవారు లేదా కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు లివర్ తింటే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. 

ఇందులో విటమిన్ A అతిగా ఉండటం వల్ల గర్భధారణ సమయంలో ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు కూడా లివర్‌ను తక్కువగా తీసుకోవాలి.

చివరిగా.. మటన్ లివర్, చికెన్ లివర్.. ఈ రెండూ ఆరోగ్యానికి మేలు చేసేవే. రక్తహీనత ఉన్నవారు మటన్ లివర్‌ను, బరువు తగ్గాలనుకునే వారు లేదా బడ్జెట్‌లో పోషకాలు
కావాలనుకునే వారు చికెన్ లివర్‌ను ఎంచుకోవచ్చు. అయితే, వారానికి ఒకసారి కంటే ఎక్కువగా తీసుకోకపోవడం ఉత్తమం.

Also REad: AP Pension Survey: పెన్షన్ దారులకు ప్రభుత్వం అలర్ట్..త్వరలోనే ఏపీలో మరో సర్వే..ఏం చేయనున్నారంటే?

Also Read: Bank Holiday: రేపు బ్యాంకులు బంద్?!..డిసెంబరు 31, న్యూఇయర్ హాలీడే..ఆర్బీఐ ఏం చెప్పిందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Dec 30, 2025 09:43:53
Nunna, Vijayawada, Andhra Pradesh:

AP Pension Survey IVRS: ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ పథకం అమలుపై క్షేత్రస్థాయిలో నిజానిజాలను తెలుసుకోవడానికి కూటమి సర్కార్ ఐవీఆర్ఎస్ (IVRS) విధానంలో ఒక భారీ సర్వేను నిర్వహించబోతున్నారు. కేవలం అనర్హులను ఏరివేయడమే కాకుండా, పింఛన్ల తొలగింపుపై జరుగుతున్న రాజకీయ ప్రచారాలకు చెక్ పెట్టడం కూడా ఈ సర్వే ప్రధాన ఉద్దేశం.

సర్వే ఎలా జరుగుతుంది?
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పింఛన్ లబ్దిదారులందరికీ ప్రభుత్వం నుండి నేరుగా ఫోన్ కాల్ వస్తుందట. ఇది ఒక ఆటోమేటెడ్ కాల్. అందులో పింఛన్ పంపిణీకి సంబంధించి లబ్దిదారులను మూడు ముఖ్యమైన ప్రశ్నలు అడుగుతారట. 

ఆ మూడు ప్రశ్నలు ఇవే ఉండొచ్చని అంచనా..
1) ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీలో ఎవరైనా డబ్బులు ఆశిస్తున్నారా లేదా అవినీతి ఉందా?

2) ప్రతి నెలా 1వ తేదీన పింఛన్ మీ ఇంటి వద్దకే అందుతోందా?

3) పింఛన్ అందించే సచివాలయ అధికారి లేదా వాలంటీర్ ప్రవర్తన సంతృప్తికరంగా ఉందా?

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానం 'అవును/బాగుంది' అయితే 1 నొక్కాలి. 'లేదు/బాగోలేదు' అయితే 2 నొక్కాలి. ఈ విధంగా పెన్షన్ సర్వే పూర్తి కానుంది.

లబ్దిదారులు ఇచ్చే సమాధానాలను ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకోనుంది. ఒకవేళ అవినీతి జరుగుతోందని లేదా ఇంటి వద్ద పింఛన్ ఇవ్వడం లేదని ఫిర్యాదులు వస్తే, సంబంధిత సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. పింఛన్ల సంఖ్యను తగ్గించారనే విమర్శలకు ఈ సర్వే ద్వారా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది. ఎంతమందికి పింఛన్ అందుతుందో డేటా రూపంలో తేలిపోనుంది.

లబ్దిదారులకు సూచన
ఈ సర్వే ద్వారా కొత్త ఏడాదిలో పింఛన్ పంపిణీ విధానంలో ప్రభుత్వం మరిన్ని కీలక మార్పులు చేసే అవకాశం ఉంది. కాబట్టి లబ్దిదారులు తమకు వచ్చే ఫోన్ కాల్స్‌ను నిర్లక్ష్యం చేయకుండా, వాస్తవ పరిస్థితులను బట్టి సరైన సమాధానాలు చెప్పాలని అధికారులు కోరుతున్నారు.

Also Read: Bank Holiday: రేపు బ్యాంకులు బంద్?!..డిసెంబరు 31, న్యూఇయర్ హాలీడే..ఆర్బీఐ ఏం చెప్పిందంటే?

Also Read: Priyanka Singh: "జబర్దస్త్ షో నుంచి గెంటేశారు..అతనే ప్రేమతో అండగా ఉన్నాడు" ప్రియాంకా సింగ్ ఆవేదన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Dec 30, 2025 09:04:06
Hyderabad, Telangana:

Bank Holiday On New Year: కొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతున్న వేళ, సంవత్సరం చివరి రోజైన డిసెంబర్ 31, 2025 (బుధవారం) నాడు బ్యాంకులు పని చేస్తాయా లేదా అని చాలా మంది కస్టమర్లు సందిగ్ధంలో ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక హాలిడే క్యాలెండర్ ప్రకారం దీనిపై స్పష్టత వచ్చేసింది.

డిసెంబర్ 31న బ్యాంకులు తెరిచే ఉంటాయా?
అవును, డిసెంబర్ 31న దేశవ్యాప్తంగా (ముఖ్యంగా ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో) బ్యాంకులు యథావిధిగా పని చేస్తాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా RBI ఎటువంటి అధికారిక బ్యాంకు సెలవును ప్రకటించలేదు. సాధారణంగా జాతీయ సెలవులు, రాష్ట్ర పండుగలు, ఆదివారాలతో పాటు ప్రతి నెలలోని 2వ, 4వ శనివారాల్లో మాత్రమే బ్యాంకులు మూసివేతగా ఉంటాయి. డిసెంబర్ 31 ఈ జాబితాలో లేదు.

అందుబాటులో ఉండే సేవలు
సంవత్సరం చివరి రోజైనప్పటికీ, బ్యాంకింగ్ బ్రాంచ్ స్థాయిల లో ఈ క్రింది సేవలు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు, చెక్కుల క్లియరెన్స్, ఖాతా అప్‌డేటింగ్, కస్టమర్ సర్వీస్ డెస్క్ సేవలు వంటివి అందుబాటులో ఉంటాయి. సంవత్సరం చివరి రోజు కావడంతో బ్యాంకుల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి, అత్యవసర పనులు ఉన్నవారు ఉదయాన్నే బ్యాంకును సందర్శించడం ఉత్తమం.

డిజిటల్ బ్యాంకింగ్ - 24/7 అందుబాటు
ఒకవేళ మీరు బ్యాంకుకు వెళ్లలేకపోయినా, ఈ క్రింది ఆన్‌లైన్ సేవలు ఏవైనా అంతరాయం లేకుండా పని చేస్తాయి. UPI లావాదేవీలైన ఫోన్ పే, గూగుల్ పే వంటి సేవలతో పాటు ఆన్‌లైన్ ఫండ్ ట్రాన్స్‌ఫర్‌లలో NEFT, RTGS, IMPS సేవలు సహా నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు అందుబాటులో ఉంటాయి. మొబైల్ యాప్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యథాతధంగా కొనసాగుతాయి.

తదుపరి సెలవు ఎప్పుడు?
నూతన సంవత్సర వేడుకల తర్వాత, దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేతగా ఉండే తదుపరి ప్రధాన జాతీయ సెలవుదినం జనవరి 26, 2026 (గణతంత్ర దినోత్సవం)గా ఉండనుంది. అయితే, స్థానిక పండుగలను బట్టి ఆయా రాష్ట్రాల్లో సెలవులు మారవచ్చు.

Also REad: Priyanka Singh: "జబర్దస్త్ షో నుంచి గెంటేశారు..అతనే ప్రేమతో అండగా ఉన్నాడు" ప్రియాంకా సింగ్ ఆవేదన!

Also REad: 8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..రాకెట్ వేగంతో జీతాల పెంపు..ఎవరికి ఎంత పెరుగుతుందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Dec 30, 2025 08:37:47
Hyderabad, Telangana:

Priyanka Singh Jabardasth: బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ షో 'జబర్దస్త్' ఎంతో మంది సామాన్యులను స్టార్లుగా మార్చింది. ఈ షో ద్వారా లేడీ గెటప్స్‌తో పాపులర్ అయ్యి, ఆ తర్వాత శస్త్రచికిత్స చేయించుకుని అబ్బాయి నుండి అమ్మాయిగా మారిన ప్రియాంక సింగ్ (సాయి తేజ) ప్రయాణం అందరికీ తెలిసిందే. అయితే, ఆమె జబర్దస్త్ నుండి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? ఆ సమయంలో ఆమె ఎదుర్కొన్న కష్టాలేంటి? అనే విషయాలపై ప్రియాంక ఇటీవల మనసు విప్పారు.

"షో నేను మానలేదు.. వాళ్లే గెంటేశారు!"
జబర్దస్త్ నుండి తప్పుకోవడంపై నటి ప్రియాంక సింగ్ సంచలన నిజాలు బయటపెట్టారు. తాను సర్జరీ చేయించుకుని పూర్తిగా అమ్మాయిగా మారిన తర్వాత, షోలో ఇతర లేడీ గెటప్ ఆర్టిస్టులు ఉండటం వల్ల షోకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమోనని నిర్వాహకులు భావించారట. వారు ఆ విషయం చెప్పగానే, తానూ ఏమాత్రం వాదించకుండా, తన వస్తువులు సర్దుకుని అక్కడి నుండి వెంటనే బయటకు వచ్చేశానని ఆవేదనగా గుర్తు చేసుకున్నారు.

అనారోగ్యం..మంచానికే పరిమితం
షో నుండి బయటకు వచ్చిన పది రోజులకే ప్రియాంక జీవితంలో మరో విషాదం ఎదురైంది. ఆమె తీవ్రమైన ఆర్థరైటిస్ బారిన పడి, దాదాపు ఏడాది కాలం పాటు కదలలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యారు. కెరీర్ లేక, ఆరోగ్యం సహకరించక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ సమయంలో ఆమెకు ఒక 'దేవుడు' అండగా నిలిచారని ఆమె చెప్పుకొచ్చింది.

ఆపద్బాంధవుడు నాగబాబు..
ఆ క్లిష్ట పరిస్థితుల్లో మెగా బ్రదర్ నాగబాబు తనకు అండగా నిలిచారని ప్రియాంక కృతజ్ఞతగా తెలిపారు. నాగబాబు గారు ప్రతి నెలా మందుల కోసం, ఖర్చుల కోసం డబ్బులు పంపించేవారని ఆమె చెప్పారు. కేవలం డబ్బు ఇవ్వడమే కాకుండా, ప్రతిరోజూ ఫోన్ చేసి ఆమె యోగక్షేమాలు అడుగుతూ ధైర్యం చెప్పేవారట. నాగబాబు సలహాతోనే తాను మళ్ళీ కోలుకుని మా టీవీ, జీ తెలుగు షోలలో అవకాశాలు దక్కించుకున్నానని ప్రియాంకా సింగ్ వెల్లడించారు.

బిగ్ బాస్ ప్రయాణం & వ్యక్తిగత జీవితం
నాగబాబు ప్రోత్సాహంతో మళ్ళీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న ప్రియాంకకు బిగ్ బాస్ సీజన్ 5 లో అవకాశం వచ్చింది. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళేటప్పుడు తన వయస్సు 24 ఏళ్లని, లోకం తెలియని అమాయకత్వంతో వెళ్లానని ఆమె చెప్పుకొచ్చారు. ఇప్పటికీ తాను నటించిన ఎపిసోడ్‌లను ఒక్కటి కూడా చూడలేదని ఆమె అనడం విశేషం.

గత 14 ఏళ్లుగా ప్రతి శుక్రవారం జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్తానని.. లలితా సహస్రనామం పఠిస్తూ, పబ్‌లు, పార్టీలకు దూరంగా చాలా సాధారణ జీవితం గడుపుతున్నానని ప్రియాంక తెలిపారు. మళ్ళీ జన్మంటూ ఉంటే తన తండ్రికి మంచి కూతురిగా పుట్టాలని ప్రియాంక ఆకాంక్షించారు.

Also Read: 8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..రాకెట్ వేగంతో జీతాల పెంపు..ఎవరికి ఎంత పెరుగుతుందంటే?

Also Read: 55-inch Smart TV Deals: కొత్త ఏడాదిలో ఇంటికే థియేటర్ తెచ్చుకోండి..రూ.25,000లకే 55-inch స్మార్ట్‌టీవీ..కళ్లు చెదిరే ఆఫర్లు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Dec 30, 2025 07:25:08
Hyderabad, Telangana:

8th Pay Commission Fitment Factor: దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల నిరీక్షణకు తెరపడనుంది. 8వ వేతన సంఘం (8th Pay Commission) అమల్లోకి వస్తే జీతాలు ఏ స్థాయిలో పెరుగుతాయనే దానిపై ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ వేతన సవరణ, 2026లో కొత్త రూపు దాల్చనుంది.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్: అసలు లెక్క ఇదే!
కొత్త జీతాన్ని నిర్ణయించే కీలకమైన అంశం 'ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్'. ప్రస్తుత ప్రాథమిక వేతనాన్ని (బేసిక్ పే) ఈ ఫ్యాక్టర్‌తో గుణించడం ద్వారా కొత్త బేసిక్ పే ఖరారవుతుంది. గతంలో 7వ వేతన సంఘంలో భాగంగా ఇచ్చిన ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. అయితే ప్రస్తుతం రాబోయే 8వ వేతన సంఘంలో భాగంగా దీన్ని 1.92 నుండి 3.68 మధ్య ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మీ జీతం ఎంత పెరగొచ్చు? 
ఉదాహరణకు ప్రస్తుతం కనిష్ట ప్రాథమిక వేతనం రూ. 18,000 ఉన్న ఉద్యోగికి, వేర్వేరు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ల ప్రకారం జీతం ఎలా మారుతుందో కింద టేబుల్‌లో వివరణ చూడండి.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంచనా కొత్త ప్రాథమిక వేతనం (అంచనా)
1.92 అయితే ₹34,560
2.57 అయితే ₹46,260
2.86 అయితే ₹51,480
3.68 అయితే ₹66,240

ప్రతి ఉద్యోగి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే? ప్రాథమిక వేతనం పెరిగితే, దానిపై ఆధారపడి ఉండే కరువు భత్యం (DA), ఇంటి అద్దె భత్యం (HRA) కూడా భారీగా పెరుగుతాయి.

పెన్షనర్లకు కూడా పండగే!
పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇది శుభవార్త. ఎందుకంటే పెన్షన్ మొత్తం చివరిగా తీసుకున్న బేసిక్ పేపై ఆధారపడి ఉంటుంది. ప్రాథమిక వేతనం పెరిగినప్పుడు, పెన్షనర్ల నెలవారీ ఆదాయం కూడా అదే నిష్పత్తిలో పెరుగుతుంది. కొత్త వేతన సంఘం అమల్లోకి వచ్చినప్పుడు డీఏను సున్నా (0) కు రీసెట్ చేసి, ఆ తర్వాత ద్రవ్యోల్బణం ప్రకారం మళ్లీ పెంచుకుంటూ వెళ్తారు.

అమలు ఎప్పటి నుండి?
కేంద్ర ప్రభుత్వం నుండి ఇంకా అధికారిక నోటిఫికేషన్ వెలువడనప్పటికీ, చారిత్రక పరిణామాల ప్రకారం 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుండి అమలులోకి రావాలి. ఒకవేళ ఆమోదం పొందడంలో జాప్యం జరిగినా, ఉద్యోగులకు ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం పెరిగిన జీతాలను బకాయిల (Arrears) రూపంలో చెల్లిస్తుంది.

చివరిగా.. 8వ వేతన సంఘం కేవలం జీతాల పెంపు మాత్రమే కాదు, పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా ఉద్యోగుల ఆర్థిక భద్రతను పెంచే ఒక ముఖ్యమైన ముందడుగు. దీనివల్ల మధ్యతరగతి ఉద్యోగుల కొనుగోలు శక్తి పెరిగి, ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభిస్తుంది.

Also Read: 55-inch Smart TV Deals: కొత్త ఏడాదిలో ఇంటికే థియేటర్ తెచ్చుకోండి..రూ.25,000లకే 55-inch స్మార్ట్‌టీవీ..కళ్లు చెదిరే ఆఫర్లు!

Also Read: Prabhas Billa Actress: ప్రభాస్ సినిమాలో గ్లామర్ క్వీన్..12 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ..బాంబు పేల్చిన హీరోయిన్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Dec 30, 2025 06:55:59
Hyderabad, Telangana:

55-inch Smart TV Offers: ఈ కొత్త ఏడాదికి పెద్ద స్క్రీన్ టీవీని మీ ఇంట్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం. వచ్చే ఏడాది నుండి ఎలక్ట్రానిక్స్ ధరలు పెరిగే అవకాశం ఉండటంతో వల్ల ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో ప్రస్తుతం సోనీ, TCL, రియల్‌మీ వంటి అగ్ర బ్రాండ్‌లపై ఏకంగా 74 శాతం వరకు భారీ తగ్గింపులను అందిస్తోంది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఒకప్పుడు చిన్న టీవీలు వచ్చే ధరకే ఇప్పుడు 55 అంగుళాల (55-inch) అల్ట్రా HD టీవీలు లభిస్తున్నాయి. టాప్ డీల్స్ వివరాలు ఇక్కడ చూడండి:

టాప్ బ్రాండ్‌లు - అదిరిపోయే ఆఫర్లు

బ్రాండ్ & మోడల్ అసలు ధర ఆఫర్ ధర డిస్కౌంట్ కీలక ఫీచర్లు
Foxsky QLED Ultra HD ₹98,990 ₹24,999 74% Google Android TV, 30W స్పీకర్లు
TCL LED Smart TV ₹93,999 ₹32,990 64% 2 ఏళ్ల వారంటీ, ఎక్స్ఛేంజ్ ఆఫర్
Realme TechLife QLED ₹65,399 ₹27,999 57% బెస్ట్ కలర్ డెప్త్, ఎక్స్ఛేంజ్ ఆఫర్
Sony Bravia LED ₹91,900 ₹57,990 36% ప్రీమియం క్వాలిటీ, 40W పవర్ ఫుల్ సౌండ్

బెస్ట్ డీల్స్ వివరాలు ఇలా ఉన్నాయి..
ఫాక్స్‌స్కీ (Foxsky) 55-inch QLED: ప్రస్తుతం మార్కెట్లో అత్యంత తక్కువ ధరలో లభిస్తున్న QLED టీవీ ఇదే. దీని అసలు ధరలో కేవలం నాలుగో వంతు ధరకే ఇప్పుడు సొంతం చేసుకోవచ్చు. బడ్జెట్ తక్కువ ఉన్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్.

TCL (టీసీఎల్) 55-inch LED: మంచి వారంటీ కోరుకునే వారికి ఇది సరైన ఛాయిస్. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా దీనిపై మరో రూ. 6,500 వరకు అదనంగా తగ్గించుకోవచ్చు.

రియల్‌మీ (Realme) QLED: తక్కువ ధరలో సినిమాటిక్ అనుభూతిని ఇచ్చే క్వాంటం డాట్ (QLED) టెక్నాలజీ ఇందులో ఉంది. మంచి పిక్చర్ క్వాలిటీ కోసం దీనిని ఎంచుకోవచ్చు.

సోనీ బ్రావియా (Sony Bravia): బ్రాండ్ వాల్యూ, ఆడియో క్వాలిటీ ముఖ్యం అనుకునే వారికి సోనీ ఎప్పుడూ టాప్ లో ఉంటుంది. దీని 40W స్పీకర్లు విడిగా హోమ్ థియేటర్ అవసరం లేకుండానే అద్భుతమైన సౌండ్ ఇస్తాయి.

సేవింగ్ టిప్స్..
బ్యాంక్ ఆఫర్లు: క్రెడిట్ కార్డ్‌ల వాడకం ద్వారా మరో రూ. 1,500 నుండి రూ. 3,000 వరకు తక్షణ తగ్గింపు పొందవచ్చు.

ఎక్స్ఛేంజ్: మీ పాత టీవీని ఎక్ఛేంజ్ ఆఫర్ ద్వారా కొత్త టీవీతో మార్చుకోవడం వల్ల మీరు అదనంగా రూ. 6,000 పైగా తగ్గింపు పొందే అవకాశం ఉంది.

Also Read: School Holiday: విద్యార్థులకు గుడ్‌న్యూస్..స్కూళ్లకు 9 రోజులు సెలవులు..ఎప్పుడూ లేనంతగా ఈ సంక్రాంతికి భారీ సెలవులు!

Also REad: Bangladesh Hindu: బంగ్లాదేశ్‌లో హిందువులపై ఆగని హింస..వార్నింగ్ ఇచ్చిన మోదీ సర్కార్..2,900 కేసులపై నివేదిక!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Dec 30, 2025 04:37:16
Secunderabad, Telangana:

Former prime minister and BNP chairperson Khaleda Zia:  బంగ్లాదేశ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఒక శకానికి ముగింపు పలికింది. దేశ తొలి ప్రధాని.. మూడుసార్లు ప్రధానిగా చేసిన బేగం ఖలీదా జియా ఢాకాలోని ఎవర్ కేర్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. బేగం ఖలీదా జియా మరణంతో బంగ్లాదేశ్ ఒక్కసారిగా మూగబోయింది. ఇక.. బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రను చూసినట్లయితే.. గత కొన్ని దశాబ్దాలుగా ఆ దేశ రాజకీయాలను ప్రధానంగా ఇద్దరు మహిళలు శాసించారు. ఒక వైపు బంగాబందు కుమార్తెగా పేరొందిన షేక్ హసీనా.. మరోవైపు ఉక్కు మహి, ప్రజాస్వామ్య తల్లిగా గుర్తింపు తెచ్చుకున్న బేగం ఖలీదా జియా.. వీరిద్దరి మధ్య జరిగిన రాజకీయ పోటీ, విభేదాలు, ఘర్షణలు, బంగ్లాదేశ్ రాజకీయాలకు దిశానిర్దేశం చేశాయి. 

బేగం ఖలీదా జియా 1945 ఆగస్టు 15న అప్పటి అవిభక్త బెంగాల్‌లోని జల్పైగురిలో జన్మించారు. ఈ ప్రాంతం ఇప్పుడు భారత్ లో ఉంది. ఆమె కుటుంబం తరువాత బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్‌కు వలస వెళ్లి అక్కడే స్థిరపడింది. 1959లో కేవలం 15 ఏళ్ల వయస్సులోనే.. పాకిస్తాన్ సైన్యంలో కెప్టెన్‌గా పనిచేస్తున్న జియావుర్ రెహమాన్‌ను ఖలీదా జియా  వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఖలీదా పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. ఒక సాధారణ గ్రుహిణిగా అన్ని బాధ్యతలు నిర్వర్తించారు.వారికి ఇద్దరు కుమారులు.. తారిక్ రెహమాన్, అరాఫత్ రెహమాన్ (కోకో)..వారి పెంపకమే ఆమె జీవితంగా సాగింది.

అయితే.. జియావుర్ రెహమాన్ జీవితం బంగ్లాదేశ్ చరిత్రలో కీలక మలుపు అని చెప్పవచ్చు. ఆయన 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో కీలక పాత్ర పోషించారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి 1977లో దేశ అధ్యక్షుడయ్యారు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో.. 1981 మే 30న చిట్టగాంగ్‌లో జరిగిన ఓ సైనిక తిరుగుబాటు ప్రయత్నంలో జియావుర్ రెహమాన్ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన ఖలీదా జియా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.

భర్త మరణంతో ఆమె ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అప్పటి వరకు వంటింటికే పరిమితమైన జియా.. భర్త మరణంతో  బయటి ప్రపంచాన్ని చూసింది. ఆయన స్థాపించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) కూడా పతన అంచున నిలిచింది. పార్టీ కార్యకర్తల ఒత్తిడి, ప్రజల మద్దతుతో ఖలీదా 1982లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1984లో BNP అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి బంగ్లాదేశ్ సైనిక పాలకుడు హుస్సేన్ మహమ్మద్ ఎర్షాద్‌కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమానికి ఆమె నాయకత్వం వహించారు.

ఎర్షాద్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో ఖలీదా జియా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక సార్లు గృహ నిర్బంధానికి గురయ్యారు. అయినప్పటికీ వెనక్కి తగ్గలేదు. చివరకు 1990లో ఎర్షాద్ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత జరిగిన 1991 సాధారణ ఎన్నికల్లో BNP విజయం సాధించడంతో ఖలీదా జియా బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారు.

ఆమె తొలి పదవీకాలంలో ఆర్థిక సంస్కరణలు.. ఎగుమతుల పెరుగుదల, తాత్కాలిక ప్రభుత్వ (కేర్‌టేకర్ గవర్నమెంట్) వ్యవస్థ అమలు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తరువాత కొంతకాలం రాజకీయ ఒడిదుడుకుల తర్వాత 2001లో మళ్లీ అధికారంలోకి వచ్చారు. అయితే, ఈ రెండో పదవీకాలం అవినీతి ఆరోపణలు, కుటుంబ రాజకీయాలు, మత ఛాందసవాదులపై చర్యలు వంటి అంశాలతో తీవ్ర వివాదాలకు లోనైంది.

ఇదే సమయంలో షేక్ హసీనా–ఖలీదా జియా మధ్య శత్రుత్వం మరింత తీవ్రమైంది. గత మూడు దశాబ్దాలుగా బంగ్లాదేశ్ రాజకీయాలు ఈ ఇద్దరి చుట్టూనే తిరిగాయి. వీరి మధ్య పోరును ప్రజలు  బేగంల యుద్ధంగా పిలిచేవారు. తొలుత ఎర్షాద్‌ను కూలదోసేందుకు కలిసి పనిచేసిన ఈ ఇద్దరూ.. తర్వాత తీవ్ర రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. భర్త, తండ్రి హత్యలు, కుటుంబ వారసత్వాలు ఈ వైరాన్ని మరింత పెంచాయి.

Also Read: Railway stocks: దుమ్మురేపుతోన్న రైల్వే స్టాక్స్.. టికెట్ ఛార్జీల పెంపుతో.. 5 రోజుల్లో 26శాతం లాభాలు..!!

2008 తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖలీదా జియాపై అనేక అవినీతి కేసులు నమోదయ్యాయి. 2018లో ఆమె జైలుకు వెళ్లారు. తీవ్ర అనారోగ్య కారణాలతో తర్వాత బెయిల్‌పై విడుదలై గృహ నిర్బంధంలో ఉన్నారు. 2024లో విద్యార్థుల ఉద్యమంతో షేక్ హసీనా అధికారాన్ని కోల్పోయిన తర్వాత పరిస్థితులు మారాయి. ఖలీదా జియాపై ఉన్న కేసులు ఎత్తివేశారు. తాత్కాలిక ప్రభుత్వం ఆమెకు VVIP భద్రత కల్పించింది. అయితే అప్పటికే ఖలీదా జియా ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. లివర్ సిర్రోసిస్, కిడ్నీ వైఫల్యం, డయాబెటిస్, గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో ఆమె తీవ్రంగా బాధపడుతున్నారు. వెంటిలేటర్, డయాలసిస్ సహాయంతో చికిత్స పొందినా.. శరీరం చివరకు తట్టుకోలేకపోయింది.

ఈ నేపథ్యంలో ఆమె మరణానికి ఐదు రోజుల ముందు.. డిసెంబర్ 25న.. పెద్ద కుమారుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల ప్రవాస జీవితం తర్వాత లండన్ నుంచి బంగ్లాదేశ్‌కు తిరిగొచ్చాడు. రాజకీయ వేధింపుల కేసులతో 2008 నుంచి విదేశాల్లో ఉన్న తారిక్, అక్కడి నుంచే BNPని నడిపించాడు. అతని రాకకు లక్షలాది మంది మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. ఆసుపత్రిలో ఉన్న తల్లిని కలిసిన తర్వాత పార్టీ బాధ్యతలు చేపట్టాడు.

డిసెంబర్ 30, 2025 ఉదయం బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. ఢాకాలోని ఎవర్‌కేర్ ఆసుపత్రిలో 80 ఏళ్ల వయసులో బేగం ఖలీదా జియా తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం ఒక వ్యక్తి మరణం మాత్రమే కాదు… బంగ్లాదేశ్ ప్రజాస్వామ్య ప్రయాణంలో ఒక కీలక అధ్యాయానికి ముగింపు. ఇప్పుడు అందరి చూపూ తారిక్ రెహమాన్‌పైనే ఉంది. ఫిబ్రవరి 2026 ఎన్నికల్లో BNP బలమైన పోటీదారుగా నిలవనుంది. తల్లి రాజకీయ వారసత్వాన్ని తారిక్ ముందుకు తీసుకెళ్లగలడా? అస్థిరత, ఆర్థిక సంక్షోభం, హింసతో పోరాడుతున్న బంగ్లాదేశ్‌కు ఆయన నాయకత్వం దిశానిర్దేశం చేయగలదా? అనే ప్రశ్నలకు రాబోయే రోజులు సమాధానం చెప్పనున్నాయి.

Also Read:  Future Metal: బంగారం, వెండి, ప్లాటినం, రాగి కాదు.. భవిష్యత్ అంతా ఈ లోహానిదే..లాభాలే లాభాలు..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
Advertisement
Back to top