icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
500029
VVishwaroopaFollow7 Jul 2024, 02:56 pm

హైదరాబాద్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు పూరీ జగన్నాథ రథయాత్ర

Hyderabad, Telangana:

హైదరాబాద్ అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఏర్పాటు చేసిన పూరీ జగన్నాథ రథయాత్రను సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పూరీ జగన్నాథుని రథయాత్రలో ఇస్కాన్ ఆలయ అర్చకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. రథయాత్రకు ముందు దిష్టిగుమ్మ డి కాయను చంపి రథయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Tirumala: తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సేవలో నటి కృతి శెట్టి

Tirupati Urban, Andhra Pradesh:

Tirumala Heavy Rush: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లలో భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో భక్తుల సందడి కనిపిస్తోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు టీటీడీ అధికారులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, అన్నప్రసాదం, పాలు, అల్పాహారం అందిస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. తిరుమలలోని ప్రధాన ప్రాంతాల్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది. 

తిరుమల శ్రీవారిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సినీ నటి కృతి శెట్టి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో వారు దర్శించుకోగా.. వారికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపానికి చేరుకున్న ప్రముఖులకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు.

తిరుమల ఆలయంలో స్వామిని 11వ తేదీన భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకున్నారు. శ్రీవారిని 69,771 మంది భక్తులు దర్శించుకోగా.. వారిలో 25,888 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఒక్కరోజే తిరుమల ఆలయానికి భారీగా హుండీ ఆదాయం లభించింది. రూ.6.94 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది. 4.42 లక్షల లడ్డూ ప్రసాదం విక్రయాలు జరగ్గా.. 2.65 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి 15 నుంచి 20 గంటలు సమయం పడుతోంది.

అవి రద్దు
రెండో శనివారం, ఆదివారంతోపాటు సోమవారం వినాయక చవితి రావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, స్కూళ్లతోపాటు బ్యాంకులకు కూడా సెలవు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. భక్తుల తాకిడి పెరగడంతో టీటీడీ దర్శనాలు త్వరగా అయ్యేలా చర్యలు తీసుకుంటోంది. శ్రీవారిని త్వరితంగా దర్శనం చేసుకునేలా టీటీడీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీఐపీ బ్రేక్‌ దర్శనం, సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేసింది.

0
0
Report
Advertisement

Gynecological Cancer Symptoms: మహిళల్లో పెరుగుతున్న గైనకాలాజికల్ క్యాన్సర్లు..ఈ లక్షణాలుంటే వెంటనే జాగ్రత్త పడండి!

Hyderabad, Telangana:

Gynecological Cancer Symptoms Signs: మహిళల పునరుత్పత్తి వ్యవస్థలోని అండాశయాలు, గర్భాశయం, యోని, గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్), బాహ్య జననేంద్రియ ప్రాంతం (వల్వా) వంటి అవయవాలకు వచ్చే క్యాన్సర్లను స్త్రీ జననేంద్రియ క్యాన్సర్లు అంటారు. వీటిలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) అత్యంత సాధారణమైనది. అంటే ఎక్కువ శాతం మంది మహిళల్లో ఇది కనిపిస్తుంటుంది. కొన్ని రకాల క్యాన్సర్లలో ప్రారంభ దశలో ఎటువంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే స్త్రీల జననేంద్రియాల క్యాన్సర్లపై ఫెర్నాండెజ్ హాస్పిటల్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ స్వాతి దోనూరి అందించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందస్తు గుర్తింపు, స్క్రీనింగ్.. 
లక్షణాలు లేని వారికి కూడా సాధారణ స్క్రీనింగ్ పరీక్షలు సిఫార్సు చేయబడిన ఏకైక స్త్రీ జననేంద్రియ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ మాత్రమే. దీనికోసం పాప్ పరీక్ష (Pap test), హెచ్‌పివి (HPV) పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. హెచ్‌పివి టీకా వేయించుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వార, యోని, వల్వార్ క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అండాశయ, గర్భాశయ క్యాన్సర్లకు సాధారణ స్క్రీనింగ్ పరీక్షలు లేకపోవడంతో, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర లేదా BRCA1, BRCA2 జన్యుపరమైన మార్పులు ఉన్నవారు నిపుణులను సంప్రదించడం అవసరం.

ముఖ్యమైన హెచ్చరిక లక్షణాలు: ఈ క్యాన్సర్లను గుర్తించడానికి క్రింది లక్షణాలను ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదు.

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్
అసాధారణ యోని రక్తస్రావం (ఋతుచక్రాల మధ్యలో, దీర్ఘకాలిక ఋతుస్రావం లేదా మెనోపాజ్ తర్వాత) లైంగిక సంపర్కం సమయంలో లేదా తర్వాత నొప్పి/రక్తస్రావం, దుర్వాసనతో కూడిన యోని స్రావాలు కనిపించవచ్చు.

అండాశయ క్యాన్సర్..
నిరంతర కడుపు ఉబ్బరం లేదా వాపు, త్వరగా కడుపు నిండినట్లు అనిపించడం, గ్యాస్, పొత్తికడుపు లేదా కటి ప్రాంతంలో నొప్పి, తరచుగా లేదా అత్యవసరంగా మూత్రవిసర్జన చేయాల్సి రావడం ప్రధాన లక్షణాలుగా కనిపిస్తాయి.

గర్భాశయ / ఎండోమెట్రియల్ క్యాన్సర్..
మెనోపాజ్ తర్వాత అకస్మాత్తుగా రక్తస్రావం కావడం (90% కంటే ఎక్కువ మంది రోగులలో కనిపించే లక్షణం ఇది) లేదా అసాధారణ మచ్చలు కనిపించడం జరుగుతుంది.

యోని క్యాన్సర్..
అసాధారణ యోని రక్తస్రావం లేదా స్రావం, సంభోగం సమయంలో నొప్పి లేదా నిరంతర కటి నొప్పి, యోని లోపల స్పర్శకు తగిలే గడ్డ లేదా ముద్దగా సంభవించవచ్చు.

వల్వార్ క్యాన్సర్..
యోని ముఖద్వారం వద్ద నిరంతర తీవ్రమైన దురద, మంట, సున్నితత్వం, చర్మం రంగు లేదా ఆకృతి మారడం, దద్దుర్లు, మానని పుండ్లు లేదా వ్రణాలు ఏర్పడతాయి.

నివారణ, సూచనలు..
క్రమం తప్పకుండా గైనకాలజికల్ చెకప్‌లు చేయించుకోవడం, శరీరంలో వచ్చే మార్పులను గమనించడం చాలా అవసరం. క్యాన్సర్ శరీరంలో ఇతర భాగాలకు విస్తృతంగా వ్యాపించక ముందే గుర్తించినప్పుడు చికిత్స మరింత ప్రభావవంతంగా ఉంటుంది.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం వైద్యుల సలహాలు సూచనల ప్రకారం పొందుపరిచినది. దీన్ని అనుసరించే ముందు సంబంధిత వైద్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Onion Juice: ఉల్లిపాయ రసం ఎప్పుడైనా తాగారా? ఎన్ని లాభాలో తెలుసా?

Also REad: Money Plant Vastu: ఇంట్లో మనీ‌ప్లాంట్ ఉంటే డబ్బు సమస్య తీరుతుందా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Ganesh Chaturthi 2026: వినాయక చవితికి ఇంట్లో ప్రతిమకు ప్రాణప్రతిష్ట ఎలా చేయాలి? పూజ నుంచి నిమజ్జనం వరకు ఇవి ఖచ్చితంగా చేయాలి!

Hyderabad, Telangana:

Ganesh Chaturthi 2026 Puja Rituals: తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పండుగను భక్తులు ఘనంగా నిర్వహిస్తారు. ప్రజలంతా ఊరూ, వాడ వినాయకుని ప్రతిమను ప్రతిష్టించి.. భక్తి శ్రద్ధలతో 9 లేదా 11 రోజుల పాటు విశేషమైన పూజలందిస్తారు. అయితే ఈ పండుగ నాడు వినాయకుని ప్రాణ ప్రతిష్ట నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి పూజా నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వినాయకుని జననానికి ప్రతీక అయిన గణేశ చతుర్థి పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటారు. పూజకు సంబంధించిన పవిత్రమైన ఆచారాలు విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవడంతో ప్రారంభమవుతాయి. పూజ జరిగే రోజున ఉదయాన్నే కుటుంబ సభ్యులందరూ స్నానం చేసి సిద్ధం కావాలి.

విగ్రహాన్ని తెచ్చేందుకు వెళ్లేటప్పుడు అగరబత్తీలు, ధూపం, హారతి పళ్ళెం, వక్క, తమలపాకు, విగ్రహాన్ని కప్పే వస్త్రం, చందనపు చెక్క పీట కోసం ప్రత్యేక వస్త్రాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. చతుర్థి కంటే ముందే విగ్రహాన్ని తెస్తే, స్వామివారి ముఖాన్ని వస్త్రంతో కప్పి ఉంచి పూజ రోజున మాత్రమే తొలగించాలి.

ప్రతిష్ఠాపన, ప్రాణ ప్రతిష్ఠ..
విగ్రహాన్ని ఇంట్లోకి తీసుకువచ్చేటప్పుడు, నిర్ణీత పీఠంపై ఉంచే ముందు దానిపై పచ్చి బియ్యం చల్లాలి. పీఠంపై బియ్యంతో పాటు వక్క, పసుపు, కుంకుమ, దక్షిణ ఉంచాలి. విగ్రహ ప్రతిష్ఠాపనకు పూజారిని ఆహ్వానించి, ఋగ్వేదంలోని గణేశ సూక్తంలో ఉన్న ప్రాణ-ప్రతిష్ఠ మంత్రాల ద్వారా పవిత్రమైన ప్రాణ ప్రతిష్ఠ ఘట్టాన్ని నిర్వహించాలి. ఈ సమయంలో 'ఓం గం గణపతయే నమః' మంత్రాన్ని జపించాలి. కోరుకుంటే పండితుడి ద్వారా 16 రకాల ఆచారాలతో కూడిన షోడశోపచార పూజ జరిపించుకోవచ్చు.

నైవేద్యం, పూజా ఘట్టాలు..
పూజలో భాగంగా లంబోదరునికి ఎంతో ప్రియమైన 21 గరిక పోచలు (దూర్వా గడ్డి), 21 మోదకాలు, ఎర్రని పూలు సమర్పించి, నుదుటిపై ఎర్ర చందనంతో తిలకం దిద్దాలి. ఆ తర్వాత దేవునికి నైవేద్యంగా కొబ్బరికాయ ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అలాగే స్వామివారి వాహనమైన మూషికం కోసం వేయించిన ధాన్యపు గింజలను ఉంచాలి. శ్రేయస్సు కోసం భక్తులు 108 నామాలు లేదా గణేశ ఉపనిషత్తు పఠించడం ఎంతో మంచిది.

నిమజ్జనం.. 
పవిత్రమైన ఆలోచనలతో, విశాల హృదయంతో పూజిస్తే వినాయకుడు భక్తులకు జ్ఞానం, ఆరోగ్యం, శ్రేయస్సును అనుగ్రహిస్తారు. చివరిగా పూజలన్నీ పూర్తయ్యాక నిమజ్జనం సమయంలో "గణపతి బాప్పా మోరియా లేదా జై బోలో గణేష్ మహారాజ్‌కి.. జై" అని నినదిస్తూ మళ్లీ త్వరగా రావాలని కోరుకుంటూ స్వామివారికి వీడ్కోలు పలుకుతారు.

Also Read: ఆంధ్ర, తెలంగాణలో వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలి? 14 లేదా 15? పండగ సెలవు ఎప్పుడంటే?

Also Read: మీ వీధిలో వినాయక మండపం పెడుతున్నారా? ఒకే క్లిక్‍తో పోలీస్ పర్మిషన్..రూ.1 ఖర్చు లేదు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Tirumala Darshan Cancelled: తిరుమల వెళ్లే భక్తులకు ఊహించని షాక్..సెప్టెంబరు 12, సెప్టెంబరు 13న దర్శనాలు రద్దు!

Tirupati Urban, Andhra Pradesh:

Tirumala VIP Break Darshan Cancelled: కలియుగ దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. దీంతో తిరుమల కొండపై క్యూలైన్లు భక్తులతో పూర్తిగా కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం క్యూలైన్లలో వేచి ఉన్న సామాన్య భక్తులకు స్వామివారి దివ్య దర్శనం కలగడానికి దాదాపు 24 గంటల సుదీర్ఘ నిరీక్షణ సమయం పడుతోంది. కొండపై భక్తుల రద్దీని టీటీడీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

వరుస సెలవుల ప్రభావం..
రాబోయే సెప్టెంబర్ 12వ తేదీ నుండి సెప్టెంబర్ 14వ తేదీ వరకు వరుసగా సెలవులు ఉండటంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మరిన్నింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు ముందస్తుగా అంచనా వేశారు. వేలాదిగా తరలివచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ, వారికి వీలైనంత త్వరగా శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో టీటీడీ కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టింది.

2 రోజుల పాటు వీఐపీ దర్శనాలపై కోత..
సాధారణ భక్తులకు దర్శన సమయాన్ని గరిష్టంగా అందుబాటులో ఉంచేందుకు టీటీడీ క్రింది నిర్ణయాలు ప్రకటించింది. సెప్టెంబర్ 12 శనివారం నాడు ఎలాంటి వీఐపీ సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. అలాగే ఆదివారం అనగా సెప్టెంబరు 13న వీఐపీ బ్రేక దర్శనాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. 

సాధారణంగా ప్రతిరోజూ వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం కేటాయించే ప్రత్యేక సమయాన్ని ఆదివారం నాడు పూర్తిగా సామాన్య భక్తుల దర్శనానికే వినియోగించనున్నారు. దీనివల్ల క్యూలైన్లలో వేచి ఉండే సాధారణ భక్తులను మరింత వేగంగా దర్శనానికి పంపే వీలు కలుగుతుంది.

భక్తులకు టీటీడీ ముఖ్య విజ్ఞప్తి..
తిరుమల యాత్రకు రాబోయే భక్తులు ప్రస్తుత రద్దీ పరిస్థితులను గమనించి, తమ తిరుమల ప్రయాణాన్ని అనుగుణంగా ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. స్వామివారి దర్శనం, వసతి గదుల లభ్యత, ఇతర సేవల వివరాలను ముందుగానే తెలుసుకుని యాత్రను ప్లాన్ చేసుకోవాలని తెలిపారు. 

క్యూలైన్లలో ఉన్న భక్తులు ఓపికతో వ్యవహరిస్తూ, టీటీడీ అధికారులు, సిబ్బంది ఇచ్చే సూచనలను పాటించి సహకరించాలని కోరారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరిస్తూ అందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు టీటీడీ అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని వెల్లడించింది.

Also Read: "జగన్‌కి డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలుసా?" వైఎస్ జగన్‌కు మంత్రి లోకేష్ కౌంటర్!

Also Read: అన్నీ స్కూళ్లు, కాలేజీలకు సెలవు..ఎట్టకేలకు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Nara Lokesh On Jagan: "జగన్‌కి డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలుసా?" వైఎస్ జగన్‌కు మంత్రి నారా లోకేష్ కౌంటర్!

Vijayawada, Andhra Pradesh:

Nara Lokesh On YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నిర్వహణపై మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఓ వీడియో విడుదల చేశారు. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి వ్యత్యాసం జగన్‌కు తెలుసా ఘాటుగా ప్రశ్నించారు. వైకాపా ఐదేళ్ల పాలనలో భర్తీ చేసిన టీచర్ పోస్టుల సంఖ్య సున్నా అని ఎద్దేవా చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు తొలి సంతకంతో 16 వేల టీచర్ పోస్టులను భర్తీ చేశామని మంత్రి నారా లోకేష్ గుర్తుచేశారు. డీఎస్సీని అడ్డుకోవడానికి వైకాపా నాయకులు సుమారు 300 కేసులు వేసినా కోర్టులు ప్రభుత్వాన్ని తప్పుపట్టలేదని తెలిపారు.  ఉపాధ్యాయులపై ఒత్తిడి తెస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన ఆయన, త్వరలోనే కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు.

ఉపాధ్యాయ నియామకాలపై నిలదీత..
మాజీ సీఎం జగన్‌ను సూటిగా ప్రశ్నిస్తూ, డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి మధ్య ఉన్న తేడా తెలుసా అని లోకేశ్ నిలదీశారు. వైకాపా ఐదేళ్ల పాలనలో భర్తీ చేసిన టీచర్ పోస్టుల సంఖ్య సున్నా అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మొదటి సంతకం డీఎస్సీ ఫైల్‌పైనే చేశారని, తద్వారా ప్రజా ప్రభుత్వం 16 వేల పోస్టులను భర్తీ చేసిందని వివరించారు.

న్యాయస్థానాల తీర్పులు - వైకాపా కేసులు..
డీఎస్సీ ప్రక్రియను నిలిపివేయడానికి వైకాపా నేతలు సుమారు 300 కేసులు వేసినా కోర్టుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి తీర్పులు రాలేదని చెప్పారు. వైకాపా ఎమ్మెల్సీ సీబీఐ విచారణ కోరుతూ వేసిన పిటిషన్‌ను కూడా న్యాయస్థానం తిరస్కరించిందని పేర్కొన్నారు. విద్యాశాఖ అధికారులు విలేకరుల సమావేశం నిర్వహించి, జగన్ చేసిన ప్రతీ ఆరోపణకూ ఆధారాలతో సహా జవాబు ఇచ్చారని వెల్లడించారు.

ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులపై ఒత్తిడి తెస్తున్నారని, దాడులకు పాల్పడుతున్నారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఉపాధ్యాయుల జోలికి వస్తే ఉపేక్షించేది లేదని, వారిపై తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. భవిష్యత్ నోటిఫికేషన్.. 
మూడేళ్ల క్రితం స్కిల్ డెవలప్‌మెంట్ కేసు పేరుతో చంద్రబాబును అర్ధరాత్రి అరెస్టు చేసి 53 రోజులు జైల్లో బంధించారని, మూడేళ్ల లీగల్ ప్రాసెస్ ముగిశాక ఆయనకు క్లీన్ చిట్ వచ్చిందని గుర్తుచేశారు. ఎలాంటి అవినీతి జరగలేదని రెగ్యులేటరీ ఏజెన్సీలు తేల్చేశాయని చెప్పారు. యువగళం పాదయాత్రలో నిరుద్యోగుల కష్టాలను చూశానని, అందుకే ప్రతి ఏటా 3 వేల పోస్టులతో ఐదేళ్లలో 30 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. అదేవిధంగా త్వరలోనే తదుపరి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నామని లోకేశ్ స్పష్టం చేశారు.

Also Read: మహిళలకు బిగ్ గుడ్‌న్యూస్.. ఇకపై ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం! సీఎం కీలక ప్రకటన!

Also Read: రేపు స్కూళ్లకు సెలవు ఉందా లేదా? సెప్టెంబరు 11న ఆంధ్ర, తెలంగాణల్లో పరిస్థితి ఇదే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Bigg Boss Charan Elimination: బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించని ట్విస్ట్..ఆర్జే చరణ్ మిడ్ వీక్ ఎలిమినేషన్..ట్విస్ట్ వెనుక కారణం ఏంటి?

Hyderabad, Telangana:

Bigg Boss 10 Charan Elimination: బుల్లితెర పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మొత్తం 16 మంది కంటెస్టెంట్లతో అత్యంత కోలాహలంగా ప్రారంభమైంది. వీరిలో 10 మంది సెలబ్రిటీలు (దేబ్జానీ మోదక్, త్రిగుణ్, సింగర్ ఝాన్సీ, యాంకర్ సుధీర్ రెడ్డి, అమన్ మసూద్, చైత్రా రాయ్, రాం ప్రసాద్, షాలిని, టెంపర్ వంశీ, సృష్టి వ్యాకరణం, జబర్దస్త్ నరేష్, నటుడు కృష్ణుడు, యాంకర్ వర్షిణి, రోహిత్ నాయుడు, ముఖేష్ గౌడ) కాగా, ఆరుగురు సాధారణ ప్రజల (కామనర్స్) కేటగిరీ నుంచి ఎంపికయ్యారు. తొలి రోజు నుంచే హౌస్‌మేట్స్ మధ్య నామినేషన్ల వేడి, తీవ్ర వివాదాలు మొదలయ్యాయి. అయితే ఊహించని రీతిలో బిగ్ బాస్ వీకెండ్ దాకా ఆగకుండా మిడ్ వీక్‌లోనే ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి బిగ్ షాక్ ఇచ్చారు.

హౌస్‌లో నిర్వ‌హించిన ప్రత్యేక టాస్క్, హౌస్‌మేట్స్ మెజారిటీ ఓటింగ్ ఆధారంగా కామనర్ కంటెస్టెంట్ చరణ్ మహాదేవ్ హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. అగ్నిపరీక్షను అధిగమించి హౌస్‌లోకి ప్రవేశించిన చరణ్ ప్రయాణం కేవలం నాలుగు రోజుల్లోనే అర్ధాంతరంగా ముగిసిపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.

టాస్క్‌లో వైఫల్యం.. హౌస్‌మేట్స్ ఓటింగ్
బిగ్ బాస్ ఇచ్చిన ఓ ప్రత్యేక టాస్క్‌లో పాల్గొన్న నామినేటెడ్ సభ్యుల్లో, చివరి రౌండ్‌కు వచ్చేసరికి జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్, కామనర్ చరణ్ నిలిచారు. ఈ ఇద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేసే బాధ్యతను బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌కే అప్పగించారు. హౌస్‌మేట్స్ నిర్వహించిన ఓటింగ్‌లో ఎక్కువ మంది ఆటో రామ్ ప్రసాద్‌కు మద్దతుగా ఓటు వేయడంతో, మెజారిటీ నిర్ణయం మేరకు చరణ్ ఎలిమినేట్ కాక తప్పలేదు.

ఎమోషనల్ అయిన చరణ్..
హౌస్ నుండి నిష్క్రమించే సమయంలో చరణ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. హౌస్‌మేట్స్ గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం తనకు ఇష్టం లేదని, అందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే తన కోరిక అని వెల్లడించాడు. కేవలం నాలుగు రోజుల్లోనే ఒకరి సామర్థ్యాన్ని అంచనా వేసి ఎలిమినేట్ చేయడం సరైంది కాదని వీక్షకుల నుంచి సానుభూతి వ్యక్తమవుతోంది. ఆటపై సరైన అవగాహన లేకపోవడం, ఫిజికల్ టాస్కుల్లో మందకొడిగా ఉండటం, ఒంటరిగా గడపడం చరణ్‌కు మైనస్‌గా మారాయని నెటిజన్లు భావిస్తున్నారు.

హౌస్‌లో వాతావరణం గరంగరం..
చరణ్ నిష్క్రమణతో బిగ్ బాస్ హౌస్‌లో నూతన సమీకరణాలు మొదలయ్యాయి. సెలబ్రిటీలు, కామనర్ల మధ్య వ్యూహాలు మారుతుండగా, ప్రస్తుతం హౌస్‌లో త్రిగుణ్, రోహిత్ నాయుడు మధ్య తలెత్తుతున్న విభేదాలు, వాదోపవాదాలు ఆటను మరింత వేడెక్కిస్తున్నాయి.

Also Read: "జైలులో 30 సార్లు నగ్నంగా నిలబెట్టారు" తీహార్ జైలు ఘోర అనుభవాలపై హీరోయిన్ ఆవేదన!

Also Read: Rashi Singh: 'రంభ ఊర్వశి మేనక' హీరోయిన్ ఒరిజినల్ గెటప్ ఇదే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

VIP Break Darshan: వరుసగా నాలుగు రోజుల సెలవులు.. తిరుమల వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

Tirupati Urban, Andhra Pradesh:

Tirumala VIP Break Darshans Cancelled: వరుస సెలవులు వస్తుండడంతో తిరుమల క్షేత్రానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతుండడంతో దర్శనానికి సమయం పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో వీఐపీ బ్రేక్‌ దర్వనాలతోపాటు సిఫారసు లేఖలను రద్దు చేస్తూ టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇది దృష్టిలో ఉంచుకుని భక్తులు తిరుమలకు రావాలని సూచించారు.

తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. భారీగా భక్తుల రద్దీ పెరుగుతుండడంతో క్యూలైన్లలో అన్నీ క్యూలైన్లు నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. దర్శనం కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. సెప్టెంబర్ 12 నుంచి 14వ తేదీ వరకు వరుస సెలవులు ఉండడంతో ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేసింది. రద్దీ దృష్ట్యా టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. సెప్టెంబర్ 12వ తేదీన శనివారం సిఫార్సు లేఖలు స్వీకరణ ఉండదని ప్రకటించింది.

ఇక అంతేకాకుండా  సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాన్ని సామాన్య భక్తులకు కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. సామాన్య భక్తులకు మరింత సులభంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన ఏర్పాట్లపై టీటీడీ చర్యలు చేపట్టింది. టీటీడీ నిర్ణయానికి భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. రద్దీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భక్తులు తమకు సహకరించాలని టీటీడీ అధికారులు సూచనలు చేశారు. 

ఆక్టోపస్‌ విన్యాసాలు
తిరుమలలో లడ్డూ కౌంటర్ల వద్ద ఆక్టోపస్ సిబ్బంది విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. భక్తుల రద్దీని క్రమబద్ధీకరిస్తూ.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం, లడ్డూ ప్రసాదం కోసం భక్తులను సిబ్బంది సమన్వయం చేస్తున్నారు. లడ్డూ కౌంటర్ల వద్ద భారీగా భక్తుల రద్దీ ఉండటంతో ఆక్టోపస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. క్యూలైన్లను క్రమబద్ధీకరిస్తూ.. భక్తులకు అవసరమైన సూచనలు చేస్తూ రద్దీ నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. ఆక్టోపస్ సిబ్బంది సమన్వయంతో లడ్డూ కౌంటర్ల వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

0
0
Report
Advertisement

Hyderabad Traffic: గణేశ్‌ ఉత్సవాలపై హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ పోలీసుల కీలక నిర్ణయం.. ఏమిటంటే?

Hyderabad, Telangana:

Ganesh Navratri Utsav: వినాయక చవితి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానుండడంతో అత్యంత వైభవంగా జరిగే హైదరాబాద్‌లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే గణేశ్‌ విగ్రహాలు తీసుకువస్తూ 'ఆగమన్‌' పేరిట సరికొత్త కార్యక్రమాన్ని నిర్వాహకులు పెద్ద ఎత్తున చేస్తున్నారు. నవరాత్రుల పాటు గణనాథుడు భక్తుల విశేష పూజలు.. సేవలు పొందనుండడంతో హైదరాబాద్‌ గల్లీ గల్లీ భక్తి పారవశ్యంలో మునిగిపోనుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

గణేష్ ఉత్సవాల వేళ రవాణా ఏర్పాట్లపై ట్రాఫిక్‌ పోలీసులు సమావేశమయ్యారు. సమన్వయంతో గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేద్దామని ఆర్టీసీ అధికారులతో ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారులు సూచించారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులతో ట్రాఫిక్‌ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ సమీక్ష చేశారు. రాబోయే గణేష్ ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో రద్దీని నియంత్రించి.. ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలపై దృష్టి సారించాలని సమావేశంలో నిర్ణయించారు.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఉన్నతాధికారులతో గురువారం ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించగా.. ఈ సమావేశంలో ట్రాఫిక్ విభాగపు డీసీపీలు, ఏసీపీలు, పోలీస్ స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు (ఎస్‌హెచ్‌ఓస్‌), ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పండుగ సమయంలో ప్రజా రవాణా వ్యవస్థ, ట్రాఫిక్ నిర్వహణ సమర్థవంతంగా అమలయ్యేలా చూడటానికి ఈ అంశాలపై ప్రధానంగా చర్చించారు.

ఈ సందర్భంగా సమావేశంలో జాయింట్ సీపీ జోయల్ డేవిస్ మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సుల రాకపోకలను క్రమబద్ధీకరించాలని, ట్రాఫిక్ మళ్లింపులకు అనుగుణంగా బస్సు మార్గాలను సవరించాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన సమయంలో భక్తుల రవాణా సౌకర్యాల కోసం ట్రాఫిక్ పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని సూచించారు. గణేశ్‌ ఉత్సవాలు, నిమజ్జన వేడుకల సమయంలో నగర ప్రజలకు సురక్షితంగా, సౌకర్యవంతమైన రవాణా సేవలను అందించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్, టీజీఎస్ఆర్టీసీ సంయుక్తంగా కృషి చేస్తాయని అధికారులు వెల్లడించారు.

సమన్వయ వ్యవస్థ
టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల మధ్య నిరంతర సమన్వయం ఉండాలి
సులభతర ప్రయాణం
సాధారణ ప్రయాణికులు, భక్తులకు ఇబ్బంది కలగకుండా వాహనాల రాకపోకలను సజావుగా నిర్వహించాలి.
ప్రత్యేక నిఘా
వినాయక విగ్రహాల ఊరేగింపు, నిమజ్జన మార్గాలు, ప్రధాన జంక్షన్లు, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలి.

0
0
Report

బంగారు రంగులో మెరిసిపోతున్న నాగుపాము.. వైరల్ వీడియో చూస్తే షాక్!

Hyderabad, Telangana:

 Golden Cobra Video Watch Here: ప్రకృతి ఒడిలో దాగి ఉన్న వింతలతో పాటు విశేషాలకు సంబంధించిన వీడియోలను అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి.. ముఖ్యంగా అరుదైన పాములకు సంబంధించిన వీడియోలు క్షణాల్లో విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు నెటిజన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా నలుపుతో పాటు గోధుమ రంగుల్లో కనిపించే నాగుపాములను మనం తరచుగా చూస్తూ ఉంటాం.. కానీ ఎప్పడూ చూడని రీతిలో గోల్డెన్‌ కలర్‌లో గోల్డెన్ కోబ్రా (Golden Cobra) అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన షార్ట్‌ వీడియో క్లిప్‌లో అరుదైన నాగుపాము కెమెరా ముందు చేసిన విన్యాసాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.. అత్యంత ప్రశాంతంగా కనిపిస్తూనే.. ఒక ప్రొఫెషనల్ మోడల్‌లా కెమెరా వైపు చూస్తూ పాము ఇచ్చిన స్టిల్స్‌ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. భయంకరమైన విషసర్పమే అయినప్పటికీ.. ఆ పాము కదలికలు ఎంతో ముద్దుగా ఉండడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు.

ఈ వీడియోలో పామె బంగారు వర్ణంలో మెరిసిపోతున్న పడగ కలిగి ఉండడం మీరు చూడొచ్చు. అత్యంత ముఖ్యమైన అంశం ఆ పాము శరీర రంగు, పడగ భాగం అత్యంత అద్భుతంగా ఏ పాముకు లేని విధంగా ఉండడం మీరు గమనించవచ్చు. పాము శరీరం మొత్తం ఒక రకమైన పసుపు, బంగారు వర్ణంలో మెరుస్తూ కనిపిస్తోంది.. ముఖ్యంగా పడగ విప్పినప్పుడు వెనుక భాగంలో ఉన్న ఆకృతితో పాటు దాని పైనున్న గోల్డ్‌ కలర్‌ మెరుపులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే అది పడగ విప్పి గాల్లో నిటారుగా నిలబడిన తీరును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు..

Also Read: 20 ఏళ్ల వయస్సును తగ్గించుకున్న 68 ఏళ్ల వ్యక్తి.. ఎలా సాధ్యం ఇది?

వన్యప్రాణి నిపుణుల అందించిన సమాచారం ప్రకారం.. ఇలాంటి అరుదైన రంగుల్లో పాములు కనిపించడం ప్రకృతిలో చాలా అరుదని వారు తెలుపుతున్నారు.. పిగ్మెంటేషన్ లోపం కారణంగా కొన్ని పాముల్లో చర్మానికి సహజసిద్ధమైన రంగు మారి ఇలా పసుపుతో పాటు బంగారు రంగుల్లో కనిపిస్తాయని వారు చెబుతున్నారు. ఈ రకమైన నాగుపాములు అడవుల్లో జీవించడం చాలా కష్టం.. ఎందుకంటే వాటి రంగు శత్రువులకు సులభంగా కనిపించేలా చేస్తుందని.. ఆ తర్వాత అవి వాటిపై దాడి చేసి చంపేస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

 
 
 
 
 

Also Read: 20 ఏళ్ల వయస్సును తగ్గించుకున్న 68 ఏళ్ల వ్యక్తి.. ఎలా సాధ్యం ఇది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

  

0
0
Report

IND Vs BAN Asia Cup: నేడు భారత్ Vs బంగ్లాదేశ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్..ఆసియా కప్‌ ట్రోఫీకి చేరువలో టీమ్ఇండియా..

Dubai, Dubai:

IND Vs BAN Asia Cup Semi Final: మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్‌లో అత్యంత ఉత్కంఠభరితమైన సెమీ-ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు, నిగర్ సుల్తానా నేతృత్వంలోని బంగ్లాదేశ్ జట్టుతో తలపడేందుకు సిద్ధంగా ఉంది. ఈ టోర్నీలో భారత్ వరుస విజయాలతో అత్యంత బలంగా కనిపిస్తుండగా, బంగ్లాదేశ్‌పై తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది. బంగ్లాదేశ్ జట్టును ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టాలని భారత్ పట్టుదలతో ఉంది. ఈ కీలకమైన మ్యాచ్ సెప్టెంబర్ 10న రాత్రి 8:00 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభం కానుండగా, సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, SonyLIV యాప్‌లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

గ్రూప్ దశలో టీమ్ఇండియా విజయవిహారం
గ్రూప్ దశలో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనను నమోదు చేసింది. తమ గ్రూప్ మ్యాచ్‌లలో థాయిలాండ్, హాంకాంగ్, సాంప్రదాయ ప్రత్యర్థి పాకిస్థాన్‌లను భారీ తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమానమైన ప్రతిభను కనబరిచిన భారత్, మరో ఆసియా కప్ ట్రోఫీని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

బంగ్లాదేశ్ ప్రదర్శన, హెడ్-టు-హెడ్ రికార్డు
మరోవైపు బంగ్లాదేశ్ జట్టు ప్రదర్శన అంత గొప్పగా లేదు. గ్రూప్-బిలో శ్రీలంక తర్వాత రెండో స్థానంలో నిలిచి సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించింది. గత గణాంకాలను పరిశీలిస్తే, ఈ ఫార్మాట్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్లు ఇప్పటివరకు 24 సార్లు ముఖాముఖి తలపడగా, భారత్ ఏకంగా 21 మ్యాచ్‌లలో విజయం సాధించి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది.

మ్యాచ్ సమయం..
ఈ కీలకమైన సెమీ-ఫైనల్ మ్యాచ్ గురువారం, సెప్టెంబర్ 10న యూఏఈ (UAE)లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.

లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ వివరాలు
ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే అభిమానుల కోసం టీవీలో Sony Sports Network ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో చూడాలనుకునే వారు SonyLIV యాప్, వెబ్‌సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్‌ను పొందవచ్చు.

జట్ల వివరాలు (స్క్వాడ్స్)
భారత జట్టు:
స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), భారతీ ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, నందిని శర్మ, రేణుకా సింగ్ ఠాకూర్, ప్రతీకా రావల్, రాధా యాదవ్.

బంగ్లాదేశ్ జట్టు: దిలారా అక్టర్, జువైరియా ఫెర్దౌస్, శోభనా మోస్తరీ, నిగర్ సుల్తానా (కెప్టెన్/వికెట్ కీపర్), షర్మిన్ అక్తర్, షోర్నా అక్టర్, ఫహిమా ఖాతున్, నహిదా అక్తర్, రబెయా ఖాన్, సుల్తానా ఖాతున్, మరుఫా అక్టర్, ఫర్జానా ఈస్మిన్, శంజిదా అక్టర్ మేఘ్లా.

Also Read: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు చేసిన ఇషాన్ కిషన్..రికార్డు క్రియేట్ చేసిన యువ కెప్టెన్!

Also Read: రేపే భారత్ Vs పాకిస్థాన్ మధ్య పోరు..ఆసియా కప్‌ 2026లో దుబాయ్‌లో హై-వోల్టేజ్ మ్యాచ్!
 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Ishan Kishan 350 Runs: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు చేసిన ఇషాన్ కిషన్..రికార్డు క్రియేట్ చేసిన యువ కెప్టెన్!

Hyderabad, Telangana:

Ishan Kishan 350 Runs Duleep Trophy: చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియం వేదికగా సౌత్ జోన్‌తో జరిగిన 2026 దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ప్రదర్శనతో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఈ ఎడమచేతి వాటం వికెట్ కీపర్ - బ్యాటర్ మొదటి ఇన్నింగ్స్‌లో 344 బంతుల్లో 270 పరుగులు చేసి, తన జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగుల భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 

అనంతరం సౌత్ జోన్ జట్టును 336 పరుగులకే ఆలౌట్ చేసిన ఈస్ట్ జోన్, 372 పరుగుల భారీ ఆధిక్యాన్ని పొందింది. రెండవ ఇన్నింగ్స్‌లోనూ తన అత్యుత్తమ ఫామ్‌ను కొనసాగించిన కిషన్, వేగంగా ఆడుతూ 98 బంతుల్లో 80 పరుగులు సాధించాడు.

2023లో భారత జట్టుకు దూరమై, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన అనంతరం, తన మనస్తత్వాన్ని మార్చుకుని దేశవాళీ క్రికెట్‌లో కష్టపడి తిరిగి వన్డే, టీ20 జట్లలో స్థానం సంపాదించాడు. అతిగా ఆలోచించడం మాని, కేవలం పరుగులు చేయడంపైనే దృష్టి పెట్టడమే ఈ ఘనతకు కారణమని కిషన్ వెల్లడించాడు.

ఈ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఈ మ్యాచ్‌లో మొత్తం 350 పరుగులు సాధించడం ద్వారా, దులీప్ ట్రోఫీ చరిత్రలోనే ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా కిషన్ ఘనత వహించాడు. దీనితో పాటు 1987 అక్టోబర్‌లో భిలాయిలో జరిగిన మ్యాచ్‌లో వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ తరఫున రమణ్ లాంబా నెలకొల్పిన 320 పరుగుల సుదీర్ఘ రికార్డును కూడా అతను అధిగమించాడు.

ఈ చారిత్రాత్మక విజయం అనంతరం మాట్లాడిన కిషన్.. తన కెరీర్‌లో ఎదురైన క్లిష్ట సమయం గురించి పంచుకున్నాడు. 2023లో భారత జట్టు తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడినప్పటికీ, ఊహించని పరిణామాల వల్ల అతడు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌పై పూర్తి దృష్టి సారించిన కిషన్, 2025-26 రంజీ ట్రోఫీలో సెంచరీలు సాధించాడు.

అంతేకాకుండా, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రెండు సెంచరీలతో కలిపి మొత్తం 517 పరుగులు చేసి జార్ఖండ్ జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ అద్భుతమైన దేశవాళీ ప్రదర్శనలతో అతడు తిరిగి బీసీసీఐ కాంట్రాక్ట్‌ను సాధించడమే కాకుండా, భారత వైట్-బాల్ (వన్డే, టీ20) జట్లలో కూడా చోటు దక్కించుకున్నాడు.

తనలో వచ్చిన ఈ మార్పు గురించి కిషన్ వివరిస్తూ.. "మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, అతిగా ఆలోచించకపోవడం, అనవసరమైన అంచనాలను పక్కన పెట్టడం వల్ల ఈ ఫలితాలు వచ్చాయి" అని తెలిపాడు. కేవలం మైదానంలోకి దిగి పరుగులు చేయడం, జట్టును గెలిపించడంపైనే తన దృష్టి ఉందని అతడు స్పష్టం చేశాడు.

Also Read: డబుల్ సెంచరీతో అలరించిన ఇషాన్ కిషన్..31 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..

Also REad: రేపే భారత్ Vs పాకిస్థాన్ మధ్య పోరు..ఆసియా కప్‌ 2026లో దుబాయ్‌లో హై-వోల్టేజ్ మ్యాచ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top