హైదరాబాద్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు పూరీ జగన్నాథ రథయాత్ర
Hyderabad, Telangana:హైదరాబాద్ అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఏర్పాటు చేసిన పూరీ జగన్నాథ రథయాత్రను సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పూరీ జగన్నాథుని రథయాత్రలో ఇస్కాన్ ఆలయ అర్చకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. రథయాత్రకు ముందు దిష్టిగుమ్మ డి కాయను చంపి రథయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Rajinikanth Spit: రజనీకాంత్ ముఖంపై ఉమ్మేసిన స్టార్ హీరోయిన్..కల్ట్ క్లాసిక్ చిత్రంలో ఆ నటి ఎవరో తెలుసా?
Hyderabad, Telangana:Rajinikanth Sridevi Spitting: గ్రామీణ జీవనాన్ని వెండితెరపై అత్యంత సహజంగా ఆవిష్కరించి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న దిగ్గజ దర్శకుడు భారతీరాజా. ఆయన మరణానంతరం ఆయన సృష్టించిన అద్భుత చిత్రాలకు సంబంధించిన ఎన్నో అరుదైన జ్ఞాపకాలు సామాజిక మాధ్యమాల్లో మళ్లీ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, భారతీయ సినిమా రంగంలో ముగ్గురు అగ్ర నటులైన రజనీకాంత్, కమల్ హాసన్, శ్రీదేవి తొలిసారిగా కలిసి నటించిన ఒక క్లాసిక్ సినిమాకు సంబంధించిన ఆసక్తికర సంఘటన ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
ప్రముఖ తమిళ గీత రచయిత వైరాముత్తు ఒక సందర్భంలో పంచుకున్న జ్ఞాపకాల ప్రకారం.. ఆ సినిమాలో రజనీకాంత్, శ్రీదేవిల మధ్య చిత్రీకరించిన ఒక సంచలన సన్నివేశం వెనుక పెద్ద కథే ఉంది.
ఆ సీన్ ఏమిటి? ఎందుకు అంత రచ్చ జరిగింది?
సినిమా కథ ప్రకారం.. ఒక కీలక సన్నివేశంలో రజనీకాంత్ పాత్ర కమల్ హాసన్ పాత్రపై దారుణంగా దాడి చేస్తుంది. అది చూసి తట్టుకోలేకపోయిన కథానాయిక శ్రీదేవి, తీవ్ర ఆగ్రహంతో రజనీకాంత్ ముఖంపై ఉమ్మివేయాలి. దర్శకుడు భారతీరాజాకు ప్రతి సన్నివేశం సహజంగా (రియలిస్టిక్గా) ఉండటం ఇష్టం. అందువల్ల ఆ సీన్ను కూడా అలాగే తీయాలనుకున్నారు. కానీ, తోటి నటుడి ముఖంపై నిజంగా ఉమ్మివేయడానికి శ్రీదేవి అస్సలు ఒప్పుకోలేదు. తీవ్రంగా సంకోచించింది.
శ్రీదేవి ఇబ్బంది పడుతుండటంతో చిత్రబృందం మొదట సబ్బు నురుగును ఉపయోగించి ఆ సన్నివేశాన్ని చిత్రీకరించాలని చూసింది. కానీ కెమెరాలో అది ఏమాత్రం సహజంగా అనిపించలేదు. దర్శకుడు భారతీరాజా సంతృప్తి చెందలేదు. సీన్ పండకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో, రజనీకాంత్ స్వయంగా శ్రీదేవికి ధైర్యం చెప్పారు.
"ఇది కథకు చాలా అవసరమైన సన్నివేశం. సినిమాలో ఆ ఎమోషన్ పండాలంటే నా ముఖం మీద నిజంగానే ఉమ్మండి, అస్సలు సంకోచించకండి" అని రజనీకాంత్ శ్రీదేవిని ప్రోత్సహించినట్లు వైరాముత్తు పేర్కొన్నారు.
షూటింగ్ స్పాట్ నుండి వెళ్ళిపోయిన శ్రీదేవి
రజనీకాంత్ అంతలా చెప్పినప్పటికీ, తోటి స్టార్ నటుడిని అలా అవమానించడం ఇష్టం లేక శ్రీదేవి ఆ సన్నివేశంలో నటించడానికి నిరాకరించి, షూటింగ్ స్పాట్ నుండి వెళ్ళిపోయారట. దర్శకుడు భారతీరాజా కూడా ఆమెపై ఒత్తిడి తీసుకురావడానికి ఇష్టపడలేదు.
కానీ, రజనీకాంత్ మాత్రం కథలోని తీవ్రతను, ఆ సన్నివేశానికి ఉన్న ప్రాధాన్యతను దర్శకుడికి వివరించి, శ్రీదేవిని ఒప్పించే ప్రయత్నం చేశారు. చివరకు రజనీకాంత్ ఇచ్చిన నమ్మకం, ప్రోత్సాహంతో శ్రీదేవి తిరిగి వచ్చి ఆ సీన్లో నటించడానికి అంగీకరించారు.
ఎన్నో సంకోచాలు, చర్చల మధ్య ఎట్టకేలకు ఆ సన్నివేశం చిత్రీకరణ పూర్తయింది. సినిమా విడుదలయ్యాక థియేటర్లలో ఈ సీన్కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. భారతీరాజా మార్కు సహజత్వానికి, రజనీకాంత్ నటన పట్ల ఉన్న అంకితభావానికి, శ్రీదేవి పండించిన నటనకు ఈ సన్నివేశం ఒక నిలువెత్తు నిదర్శనంగా ఇప్పటికీ సినీ చరిత్రలో నిలిచిపోయింది.
Also Read: Singer Janaki: భారతీయ సినీ పరిశ్రమలో విషాదం..లెజండరీ సింగర్ జానకమ్మ కన్నుమూత!
Also Read: గాయని ఎస్.జానకి చివరి వీడియో..జానకమ్మ పాదాల చెంత సింగర్ సునీత..ఇరువురి మధుర స్మృతులుa
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Shabad Case: కిరాతకుడు రాజ్కుమార్ ఎలా దొరికాడంటే.. ప్రత్యక్ష సాక్షి సంచలన నిజాలు!
Hyderabad, Telangana:Shabad Case Update: షాబాద్ మండలంలో జరిగిన ఆరుగురి దారుణ హత్యల ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. ఈ మారణహోమానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడు రాజ్కుమార్ను పోలీసులు ఎలా అదుపులోకి తీసుకున్నారనే.. విషయంపై ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. కొత్తూరు మండలం కుమ్మరిగూడెం గ్రామానికి చెందిన బండారు సుధాకర్ అనే వ్యక్తి.. తాను నిందితుడు రాజ్కుమార్ను ప్రత్యక్షంగా చూశానని వెల్లడించారు.
నిందితుడిని చూసి షాకయ్యాను..
ప్రత్యక్ష సాక్షి బండారు సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్లో ఘోరానికి ఒడిగట్టిన తర్వాత నిందితుడు రాజ్కుమార్ తప్పించుకునే క్రమంలో కుమ్మరిగూడెం పరిసర ప్రాంతాల్లో తిరిగడని తెలుస్తోంది.. అయితే, తను రోడ్డుపై వెళ్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడని.. అతడే ఆరుగురిని చంపిన కిరాతకుడు రాజ్కుమార్ అని తెలిసి ఒక్కసారిగా షాక్కు గురయ్యాడని బండారు సుధాకర్ తెలిపారు.. ఇంత దారుణానికి ఒడిగట్టి కూడా ఎలాంటి భయం లేకుండా తిరుగుతున్న అతడిని చూసి ఏం చేయాలో తెలియలేదని సుధాకర్ పేర్కొన్నారు.
క్షణాల వ్యవధిలో చుట్టుముట్టిన పోలీసులు..
తాను నిందితుడిని గమనించిన కొద్దిసేపటికే.. ఊహించని విధంగా పోలీసులు అక్కడకు చేరుకున్నారని సుధాకర్ వివరించారు. చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించిన పోలీసులు.. నిందితుడు రాజ్కుమార్కు తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా చుట్టుముట్టారని చెప్పారు. నిందితుడి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు క్షణాల వ్యవధిలోనే రంగంలోకి దిగిన్నట్లు తెలుస్తోంది.
రాజ్కుమార్ కోలుకునే లోపే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని.. అక్కడి నుంచి వాహనంలో తరలించారని ప్రత్యక్ష సాక్షి తెలిపాడు.. కిరాతకుడు పట్టుబడటంతో కుమ్మరిగూడెం సహా పరిసర గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘోర హత్యల నేపథ్యంలో షాబాద్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నిందితుడు రాజ్కుమార్ను కఠినంగా శిక్షించాలని.. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని స్థానికులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో స్థానిక పోలీస్ అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ఉన్నతాధికారులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
TTD: అక్టోబర్ నెల శ్రీవారి దర్శన టికెట్లు, వసతి గదుల కోటా విడుదల.. ఏ రోజు ఏ టికెట్లు అంటే?
Hyderabad, Telangana:TTD October Quota 2026 Released: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆశపడతారు. ఈ నేపథ్యంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రత్యేక దర్శన కోటా టికెట్లను జారీ చేస్తారు. వీటిని ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకోవాలి.. తద్వారా మూడు నెలల తర్వాత దర్శనం చేసుకోవచ్చు. ఇందులో ఆర్జిత సేవలు, సహస్రదీపాలంకరణ, రూ.300 ప్రత్యేక దర్శనం, దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక టోకెన్లు కూడా అందుబాటులో ఉంటాయి. అదే రోజు గదుల కోటా కూడా విడుదల చేస్తారు. కాబట్టి, ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటే దర్శన సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. అక్టోబర్ నెల దర్శన కోట వివరాలను TTD ఈరోజు విడుదల చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీవారి అర్చిత సేవా టికెట్లు, అంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించిన కోటను జూలై 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంచనున్నారు. ఆన్లైన్లో భక్తులు ఈ సేవలను సులభంగా బుక్ చేసుకోవచ్చు. ఈ సేవా టికెట్ల కోసం ఎలక్ట్రానిక్ లాటరీ (Lucky Dip) ప్రక్రియ జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు కొనసాగుతుంది. భక్తులు తమ ఆధార్ కార్డు, పేరు, ఫోన్ నెంబర్ ,ఈమెయిల్ ఐడి ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. లాటరీలో ఎంపికైన వారు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నిర్ణీత సొమ్ము చెల్లిస్తే వారికి టికెట్లు మంజూరు చేయబడతాయి.
అదేవిధంగా, 2026 జూలై 21వ తేదీన తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లు ఉదయం 10 గంటలకు అందుబాటులోకి వస్తాయి. ఈ సమయంలో భక్తులు సులభంగా బుక్ చేసుకోవచ్చు. వర్చువల్ సేవా కోటా వివరాలను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
జూలై 23వ తేదీన ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, మధ్యాహ్నం 11 గంటలకు శ్రీవారి ట్రస్ట్ దర్శన టికెట్లు విడుదలవుతాయి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి వృద్ధులు, దివ్యాంగులు ,దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లను TTD ఆన్లైన్లో అందుబాటులోకి తెస్తుంది. ఈ సమయాన టికెట్లు బుక్ చేసుకుంటే వారు తక్కువ సమయంలోనే స్వామివారిని దర్శించుకోవచ్చు.
చాలామంది ఎదురుచూస్తున్న రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు జూలై 24వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదలవుతాయి. తిరుమలలో గదుల కోటా కూడా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి వస్తుంది. శ్రీవారి అర్చిత సేవలు, దర్శన టికెట్లను కేవలం అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని TTD కోరుతోంది. మధ్యవర్తుల మాటలు నమ్మి డబ్బులు చెల్లించవద్దని, ఎవరైనా అలాంటి వారు కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని హెచ్చరించింది.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల విషయానికి వస్తే.. ఈ ఏడాది అధికమాసం కారణంగా రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి తిరుమల పద్మావతి అతిథి గృహంలో ఇటీవల సమావేశం జరిగింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 8వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రోటోకాల్ మార్పులు చేశారు. ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు, అలాగే వృద్ధులు, దివ్యాంగులు మరియు చిన్న పిల్లల దర్శనాలు రద్దు చేయబడ్డాయి. మాడవీధుల్లో గ్యాలరీలు ఏర్పాటు చేయడం మరియు ప్రసాదాల పంపిణీ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
Also Read: తిరుమల నడక మార్గంలో చిరుత పులి కలకలం..
Also Read: తిరుమల భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ 30 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. కారణాలు ఇవే!
అలిపిరి టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీ..
భక్తుల సంఖ్య పెరగడం వల్ల అలిపిరి టోల్ గేట్ వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. భక్తుల రద్దీ కారణంగా ఈరోజు టోల్ గేట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్రంగా మారింది. ముఖ్యంగా శని, ఆదివారాల్లో శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడం వల్ల వాహనాలు బారులు తీరుతున్నాయి. ఘాట్ రోడ్డుపై వాహనాలను విడతల వారీగా అనుమతిస్తూ టీటీడీ సిబ్బంది ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నారు. ఈ ట్రాఫిక్ వల్ల తిరుమలకు చేరుకోవడానికి సాధారణ సమయం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. కావున భక్తులు ఓపికతో వ్యవహరించి, ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని TTD సూచించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Cobra Video: బీరువా కింద భారీ కోడెనాగు.. వామ్మో.. వీడియో చూడండి..
Hyderabad, Telangana:Cobra Video Watch Here: ప్రస్తుతం సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులోనూ ముఖ్యంగా వన్యప్రాణులు, ప్రమాదకరమైన పాములకు సంబంధించిన వీడియోలు, రీల్స్ కనిపిస్తే చాలు.. నెటిజన్లు వాటిని చూసేందుకు ఎగబడుతుంటారు. తాజాగా అలాంటి కోవకే చెందిన ఒక కోడెనాగు వీడియో విపరీతంగా హల్ చల్ చేస్తోంది. ఒక ఇంట్లోకి చొరబడిన ఈ భారీ నాగుపాము సృష్టించిన హల్చల్ చూస్తే.. ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే.. అయితే, ఈ వీడియోలో నాగుపాము ఎలా కనిపించింది. ఈ వీడియో వైరల్ అవ్వడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బీరువా కింద కాలనాగు..
సాధారణంగా పాములు జనావాసాల్లోకి వస్తే.. చీకటి ప్రదేశాలు లేదా ఇరుకైన సందుల్లో దాక్కుంటూ ఉంటాయి. ఈ ఘటనలో కూడా ఒక ఇంట్లోని బెడ్రూమ్లోకి చొరబడిన కోడెనాగు.. అక్కడున్న ఒక భారీ బీరువా కింది భాగంలోకి దూరి దాక్కుంది. ఇంట్లోని వారు గమనించి చూసేసరికి అత్యంత ప్రమాదకరమైన నాగుపాముగా కనిపించింది.. దీంతో వారు స్నేక్ క్యాచర్స్కి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే స్నేక్ క్యాచర్స్ అక్కడికి చేరుకున్నారు.
అయితే, ఆ పామును సురక్షితంగా పట్టుకోవడానికి వారు ప్రయత్నిస్తుండగా.. ఆ కోడెనాగు ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి గురైన్నట్లు ఈ వీడియోలో మీరు గమనించవచ్చు. బీరువా కింద నుంచే తన భారీ పడగ విప్పి.. బుసలు కొట్టడం ప్రారంభించింది. ఆ విజువల్స్ చూస్తుంటేనే ఆ పాము ఎంతటి ప్రమాదకరమైనదో అర్థమవుతోంది. అలాగే స్నేక్ క్యాచర్ ఆ పామును బయటకు తీసేందుకు స్టిక్ సాయంతో ప్రయత్నించాడు. ఆ సమయంలో ఏమాత్రం తగ్గని ఆ కోడెనాగు.. మెరుపు వేగంతో ముందుకు దూసుకొచ్చి నేరుగా స్నేక్ క్యాచర్పైనే దాడి చేసేందుకు ప్రయత్నించింది.
నిపుణుడైన ఆ స్నేక్ క్యాచర్ సమయస్ఫూర్తితో వెనక్కి తప్పుకోవడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే ఆ విషసర్పం కాటుకు గురి కావాల్సి వచ్చేది. పాము ఆగ్రహాన్ని చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయంతో అక్కడి నుంచి బయటికి వెళ్లిన్నట్లు కూడా సమాచారం. ఈ మొత్తం ఘటనను ఇంట్లోని వారు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనికి లక్షలాది వ్యూస్, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Airtel 200 Recharge: ఎయిర్టెల్ వినియోగదారులకు గుడ్న్యూస్..రూ.200 రీఛార్జ్తో అన్లిమిటెడ్ కాల్స్, ఇంటర్నెట్..ఉచిత ఓటీటీలు!
Hyderabad, Telangana:Airtel 200 Recharge Benefits: భారతీయ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ వినియోగదారులకు గుడ్న్యూస్ చెప్పింది. రూ.200 విలువైన కొత్త ప్రీపెయిడ్ యాడ్-ఆన్ ప్యాక్ను ప్రవేశపెట్టింది. కేవలం 28 రోజుల చెల్లుబాటుతో 30 జీబీ డేటాను అలాగే ఎంటర్టైన్మెంట్ ప్రయోజనాలతో పాటు అన్లిమిటెడ్ 5జీ డేటాను అందిస్తుంది. అదనపు డేటా మరియు ప్రీమియం OTT కంటెంట్ను పొందాలనుకునే వినియోగదారుల కోసం ఈ ప్యాక్ రూపొందించబడింది.
డేటా యాడ్-ఆన్ సదుపాయం..
ఈ యాడ్-ఆన్లో 28 రోజుల పాటు చెల్లుబాటు అయ్యే 30 GB హై-స్పీడ్ డేటా ఉంటుంది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. ఎయిర్టెల్ అపరిమిత 5G డేటాను కూడా అందిస్తోంది. దీనిని కేవలం 5G నెట్వర్క్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే, ప్లాన్కు సంబంధించిన సాధారణ డేటా కోటాతో సంబంధం లేకుండా అదనంగా ఉపయోగించుకోవచ్చు. రిలయన్స్ జియో ఇటీవల తన రూ.200 'మెగా కంటెంట్ యాడ్-ఆన్'ను 'OTT పాస్'గా మార్చింది. ఇందులో 15 OTT యాప్లకు యాక్సెస్, అపరిమిత 5G డేటా, 30GB డేటా లభిస్తాయి.
జియో హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్..
ఈ ప్యాక్ ప్రయోజనాల్లో భాగంగా, వినియోగదారులకు రూ.149 విలువైన 28 రోజుల జియో హాట్స్టార్ లభిస్తుంది. దీని ద్వారా మొబైల్ పరికరాలలో లైవ్ స్పోర్ట్స్, సినిమాలు, హాట్ స్టార్ స్పెషల్స్, ఇతర వినోద కంటెంట్ను వీక్షించవచ్చు.
ఈ ప్యాక్లో 28 రోజుల పాటు 'ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ప్లే ప్రీమియం' (Airtel Xstream Play Premium) సేవలు కూడా ఉన్నాయి. దీని ద్వారా ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ప్లే ప్లాట్ఫారమ్ ద్వారా సోనీ లీవ్, లయన్స్గేట్ ప్లే, ఆహా ప్రీమియమ్, చౌపల్, సన్ నెక్ట్స్ వంటి 18కి పేగా ఓటీటీ ప్లాట్ఫారమ్లను యాక్సెస్ చేయవచ్చు.
రూ.200 ప్లాన్ వివరాల ప్రకారం.. ఇందులో ఉన్న 30 GB డేటా కోటా పూర్తయిన తర్వాత, అదనపు డేటా వినియోగానికి ఎంబీకి 50 పైసల చొప్పున ఛార్జీలు వర్తిస్తాయి. ఒకే రీఛార్జ్తో తమ డేటా పరిమితిని పెంచుకోవాలని, OTT స్ట్రీమింగ్ ఎంపికలను విస్తరించుకోవాలని కోరుకునే ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఈ యాడ్-ఆన్ రూపొందించబడినట్లు కనిపిస్తోంది.
కంపెనీ దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ, ఈ రూ. 200 డేటా ప్యాక్ ఇప్పుడు ఎయిర్టెల్ వెబ్సైట్, 'ఎయిర్టెల్ థాంక్స్' (Airtel Thanks) యాప్తో సహా సంస్థ యొక్క డిజిటల్ ప్లాట్ఫారమ్లలో అందుబాటులోకి వచ్చింది.
Also REad: అమర్నాథ్లో శివలింగం అదృశ్యం..అయినా తగ్గని భక్తుల తాకిడి..1.71 లక్షల మంది దర్శనం!
Also Read: స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..30 ఏళ్ల నాటి జ్ఞాపకంతో కంటతడి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
జలప్రళయం.. వరదల్లో కొట్టుకొచ్చిన 900 కింగ్ కోబ్రాలు.. వీడియో ఇదే..
Hyderabad, Telangana:900 Venomous King Cobras Video Watch: దక్షిణ చైనాను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి.. ప్రవహిస్తుండటంతో వందలాది గ్రామాలు జలమయమయ్యాయి. అయితే, ఈ జలప్రళయం కేవలం వరద నీటిని మాత్రమే కాదు.. ప్రజల ప్రాణాలను గుప్పిట్లో పెట్టే భయంకరమైన విపత్తును కూడా వెంటబెట్టుకొచ్చింది.. ప్రాంతీయంగా ఉన్న ఒక భారీ స్నేక్ ఫార్మ్ వరద ఉధృతికి పూర్తిగా దెబ్బతినడంతో.. అందులోని దాదాపు 900కు పైగా విషసర్పాలు ఒక్కసారిగా నీటితో పాటు బయిటికి వచ్చాయి.
వీధుల్లోకి కోబ్రాలు..
ఫార్మ్ నుంచి తప్పించుకున్న వందలాది పాములు వరద నీటితో పాటు సమీపంలోని గ్రామాలు, నివాస ప్రాంతాలతో పాటు వీధుల్లోకి చేరాయి. వీటిలో అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన కింగ్ కోబ్రాలు కూడా ఉండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు, ఎటు వైపు నుంచి ఏ పాము వచ్చి దాడి చేస్తుందో తెలియక జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. వీధులు, ఇళ్ల పైకప్పులు, చెట్ల కొమ్మలపై పాములు దర్శనమిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో జనం ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు.
అధికారుల హెచ్చరిక..
పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉందని.. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని.. వరద నీటిలో అస్సలు నడవకూడదని సూచిస్తున్నారు. ఈ భయానక వాతావరణంలో అప్పుడే విషాదాలు మొదలయ్యాయి. గ్రామంలోకి చొరబడిన ఒక విషసర్పం కాటుకు గురైన ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది.. వరద ఉధృతికి రోడ్లన్నీ పూర్తిగా కొట్టుకుపోవడం, రహదారులు మూసుకుపోవడంతో ఆమెను సకాలంలో ఆస్పత్రికి తరలించడం సాధ్యం కాలేదని అధికారులు వెల్లడించారు. వైద్య సాయం అందకముందే ఆమె మరణించింది. ఈ ఘోరంలో మరికొందరు కూడా పాము కాటుకు గురయ్యారని.. వారిని రక్షించి ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
రంగంలోకి ప్రత్యేక బృందాలు..
ఈ విపత్తును ఎదుర్కొనేందుకు చైనా ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. తప్పించుకున్న 900 పాములను వెతికి పట్టుకునేందుకు వన్యప్రాణి నిపుణులు, ప్రత్యేక శిక్షణ పొందిన స్నేక్ క్యాచర్స్ బృందాలను రంగంలోకి దించారు. పాము కాటు బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో.. సమీపంలోని అన్ని ఆస్పత్రులకు తగినంత యాంటీ వెనమ్ నిల్వలను అత్యవసరంగా సరఫరా చేశారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
కాళీ మాత గుడి కూల్చివేతలో ఘోర ప్రమాదం.. ఉద్యోగి దుర్మరణం.. వీడియో!
Hyderabad, Telangana:Ancient Kali Mata Temple Collapses Video: ఉత్తరప్రదేశ్లోని చందౌలి జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. ఒక పురాతన కాళీ మాత ఆలయం కూల్చే క్రమంలో గోపురం ఒక్కసారిగా రోడ్డుపై కూలిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (PWD) ఉద్యోగి బల్దేవ్ యాదవ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలు సోషల్ మీడియాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి..
అధికారుల నిర్లక్ష్యమే..
అధికార సమాచారం ప్రకారం.. ఈ ఆలయ కూల్చివేత పనుల సమయంలో అధికారులు, కాంట్రాక్టర్లు కనీస రక్షణ నిబంధనలను పాటించలేదని తెలుస్తోంది. అత్యంత రద్దీగా ఉండే రోడ్డు పక్కన ఉన్న భారీ గోపురాన్ని కూల్చేటప్పుడు ట్రాఫిక్ను మళ్లించకపోవడంతో పాటు ఎలాంటి రక్షణ బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ఉల్లంఘన, ప్రజా భద్రతపై అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దర్యాప్తుకు ఆదేశించిన ప్రభుత్వం..
ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు.. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.. బాధ్యులైన అధికారులపై, పర్యవేక్షకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా.. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టినప్పటికీ.. శిథిలాల కింద నలిగిపోయిన బల్దేవ్ యాదవ్ను కాపాడుకోలేకపోయారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
సోషల్ మీడియాలో వీడియో వైరల్..
ఆలయ గోపురం ఒక్కసారిగా కుప్పకూలి రోడ్డుపై పడుతున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారడంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్యపు పనుల వల్ల ఇంకెంత మంది ప్రాణాలు బలికావాలంటూ ప్రజలు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైన ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
కళ్లముందే మునిగిపోయారు.. బోటు ప్రమాదంపై షాకింగ్ నిజాలు!
Hyderabad, Telangana:Boat Tragedy Telugu News Latest: ఆనందంగా సాగుతున్న విహారయాత్రలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. సరదాగా గడుపుదామని వెళ్లిన పర్యాటకులను మృత్యువు బోటు రూపంలో కబళించింది.. వియత్నాంలో శనివారం జరిగిన ఒక ఘోర స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయ పర్యాటకులు మరణించారు. ప్రమాద సమయంలో బోటులో మొత్తం 36 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.. నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయిన ఈ దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ప్రత్యక్ష సాక్షులు చెబుతుంది ఇదే..
ఈ ఘోర ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కొందరు పర్యాటకులు ఆ భయానక క్షణాలను గుర్తుచేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం... "మేమంతా ఎంతో ఉత్సాహంగా ఆ స్పీడ్ బోట్ ఎక్కాం.. మొత్తం 36 మంది ప్రయాణికులం ఉన్నాం.. అదొక క్లోజ్డ్ బోట్.. బోట్ ప్రయాణం ప్రారంభమైన కేవలం మూడు నిమిషాలకే ఒక్కసారిగా ఒక భారీ అల బోటును బలంగా ఢీకొట్టింది. అంతే.. చూస్తుండగానే బోటు ఒక్కసారిగా తలకిందులైపోయింది." అని ఆయన వివరించారు.
ముందు కూర్చున్న వారు సేఫ్..
బోటు తిరగబడిన సమయంలో లోపల ఉన్న పర్యాటకులు ప్రాణాల కోసం ఎలా కొట్టుమిట్టాడారో సాక్షులు వివరించారు. బోటు ముందు భాగంలో కూర్చున్న సుమారు 20 మంది పర్యాటకులు, ప్రమాదం జరగగానే అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారని.. అక్కడే ఉన్న విండోస్ గుండా ఎలాగోలా బయటకు దూకేసి ప్రాణాలు దక్కించుకున్నారన్నారు.
బోటు వెనుక భాగంలో కూర్చున్న వారు మాత్రం బయటకు రాలేకపోయారని.. బోటు క్లోజ్డ్ మోడల్ కావడంతో.. క్షణాల వ్యవధిలో నీరు లోపలికి చేరిపోయిందని.. వెనుక వైపు ఉన్నవారికి బయటకు రావడానికి ఎలాంటి దారి లేకపోవడంతో వారు లోపలే చిక్కుకుపోయి.. ఊపిరాడక నీట మునిగి ప్రాణాలు కోల్పోయారన్నారు. అలా 15 మంది భారతీయులు జలసమాధి అయ్యారన్నారని వారు వివరించారు.
Also Read: వియత్నాంలో బోటు బోల్తా.. భారతీయ పర్యాటకులపై విషాదం, 15 మంది దుర్మరణం
రెస్క్యూ ఆపరేషన్..
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు, రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. నదిలో మునిగిపోయిన వారి మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన మరికొందరిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విహారయాత్రకు వెళ్లిన తమ వారు శవాలై ఇంటికి వస్తుండటంతో బాధితుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు, మృతుల గుర్తింపు ప్రక్రియను వియత్నాం అధికారులు వేగవంతం చేశారు. భారత రాయబార కార్యాలయం కూడా స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ.. బాధితులకు అవసరమైన సాయాన్ని అందిస్తోంది.
Also Read: వియత్నాంలో బోటు బోల్తా.. భారతీయ పర్యాటకులపై విషాదం, 15 మంది దుర్మరణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
సువర్ణ త్రికోణ రాజయోగం ఎఫెక్ట్.. రాబోయే 6 నెలలు ఈ 4 రాశుల వారికి తిరుగులేదు..
Hyderabad, Telangana:Suvarna Trikona Rajayogam 2026 Effect: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల స్థితులతో పాటు వాటి కదలికలు మానవ జీవితంలో హెచ్చుతగ్గులకు దారి తీస్తాయని మనందరికీ తెలుసు.. ఈ 2026 సంవత్సరంలో రాబోయే 6 నెలలు అత్యంత కీలకం కాబోతోంది.. ఎందుకంటే కర్మఫల దాతగా భావించే.. శని దేవుడు, దేవగురువు అయిన బృహస్పతి ఒక ప్రత్యేకమైన కోణంలోకి రాబోతోంది. దీని వల్ల అరుదైన సువర్ణ త్రికోణ రాజయోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ రెండు శక్తివంతమైన గ్రహాల శుభ దృష్టి ప్రభావం వల్ల రాబోయే 6 నెలలు 4 రాశుల వారికి గేమ్ ఛేంజర్గా మారబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరి అదృష్టం పూర్తిగా మారిపోతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు..
శని-గురు గ్రహాల అద్భుతమైన యోగం..
జ్యోతిష్య శాస్త్రంలో శని భగవానుడిని కర్మఫల ప్రదాతగా.. న్యాయ దేవుడిగా చెప్పుకుంటారు. మరోవైపు దేవగురువు బృహస్పతి అదృష్టం, ఐశ్వర్యం, జ్ఞానానికి కారకుడిగా భావిస్తారు. ఈ రెండు గ్రహాలు ఒక నిర్దిష్ట కోణంలో ఒకదానికొకటి త్రికోణ సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు.. గోల్డెన్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. అంతేకాకుండా దీనిని రాజయోగంగా కూడా భావిస్తారు. దీని కారణంగా ఏర్పడిన ప్రభావం కొన్ని రాశులవారికి ప్రత్యక్ష, సానుకూల ప్రభావం ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి, ఆత్మవిశ్వాసంపై స్పష్టంగా కనిపిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
ఈ అదృష్ట యోగం వల్ల ఈ కింది రాశులవారికి బంపర్ లాభాలు..
సింహ రాశి (Leo)
సింహ రాశి వారిపై దేవగురువు బృహస్పతి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో రాబోయే 6 నెలలు అద్భుతంగా ఉండబోతోంది.. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ సమయంలో భారీ లాభాలు కలుగుతాయి. నూతన ఆదాయ మార్గాలు కూడా సులభంగా లభిస్తాయి.
వృషభ రాశి (Taurus)
వృషభ రాశిలో జన్మించిన వారికి ఈ సమయం కెరీర్ పరంగా అద్భుతం జరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొత్త ఆదాయ వనరులు కూడా ఎంతో సులభంగా లభిస్తాయి.. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు ఎలాంటి అడ్డంకులు లేకుండా సులువుగా పూర్తవుతాయి.
కుంభ రాశి (Aquarius)
ఈ సువర్ణ త్రికోణ రాజయోగం వల్ల కుంభ రాaశివారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది.. వీరి జీవితంలో పురోగతి కూడా లభిస్తుంది. కెరీర్ లేదా వ్యాపారంలో పెద్ద విజయాలు కూడా పొందుతారు. అంతేకాకుండా రాబోయే 6 నెలల ఈ అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
వృశ్చిక రాశి (Scorpio)
శనిదేవుని ఆశీస్సులతో ఈ రాశివారికి తప్పకుండా ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది.. ఆఫీసులో మీకుంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కూడా లభిస్తుంది. గతంలో మీరు తీసుకోవడానికి భయపడిన కఠినమైన చర్యాలు ఈ సమయంలో ధైర్యంగా తీసుకుంటారు.. అవి మీకు లాభదాయకంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Vastu Tips: సంపాదన నిలవడం లేదా? ఇంట్లో ఈ కుబేర దిశను శుభ్రంగా చేయండి చాలు..
Hyderabad, Telangana:North Direction Vastu Tips: ప్రస్తుత చాలా మంది ఎంత కష్టపడి సంపాదించినా.. చేతిలో రూపాయి నిలవడం లేదని.. అప్పుల బాధలు వెంటాడుతున్నాయని ఆందోళన చెందుతుంటారు. రాత్రింబవళ్లు కష్టపడి సంపాదన డబ్బు సులభంగా ఖర్చయిపోతుంటే.. దానికి ఇంట్లోని వాస్తు దోషాలే ప్రధాన కారణమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల ప్రకారం.. మనం నివసించే ఇంట్లోని ప్రతి దిశకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఇది మన జీవితంతో పాటు ఆర్థిక స్థితిని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని దూరం చేసి.. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి.. అప్పుల ఊబి నుంచి శాశ్వతంగా బయటపడటానికి వాస్తు శాస్త్రంలో కొన్ని అద్భుతమైన, సులువైన చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ దిశ కుబేరుడి స్థానం..
వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇంట్లోని ఉత్తర దిశ అత్యంత పవిత్రమైనది పరిగణిస్తారు.. దీనిని సంపదకు అధిపతి అయిన కుబేరుడి స్థానంగా భావిస్తారు. ఒకవేళ మీ ఇంట్లో ఉత్తర దిశలో పాత విరిగిపోయిన ఫర్నిచర్తో పాటు చెత్తాచెదారం లేదా పనికిరాని వస్తువులు పేరుకుపోయి ఉంటే.. అది మీ ఆర్థిక పురోగతిని పూర్తిగా అడ్డుకుంటుందని నిపుణులు తెలుపుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఉత్తర దిశను ఎల్లప్పుడూ శుభ్రంగా, ప్రశాంతంగా, కాస్త ఖాళీగా ఉంచాల్సి ఉంటుంది. ఈ ప్రదేశంలో బరువైన వస్తువులు లేదా పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను ఉంచడం వల్ల కుటుంబంపై అప్పుల భారం విపరీతంగా పెరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి, వెంటనే మీ ఇంటి ఉత్తర భాగాన్ని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని తీసుకురావడమే కాకుండా.. కుబేర దేవుని ఆశీస్సులతో ఆదాయానికి కొత్త మార్గాలు లభింస్తాయి..
అప్పుల విముక్తికి గోడల రంగులు కూడా కీలకం..
కేవలం శుభ్రత మాత్రమే కాదు.. అప్పుల బాధల నుంచి ఉపశమనం పొందడానికి ఉత్తర దిశలోని గోడల రంగులపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వాస్తు శాస్త్రం సూచిస్తోంది.. ఈ పవిత్రమైన మూలలోని ఉన్న గోడలకు లేత నీలం (Light Blue) లేదా ఆకుపచ్చ (Green) రంగులు వేయడం చాలా శుభప్రదమని శాస్త్రం సూచిస్తోంది.. ఈ రంగులు మనసుకు ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా.. సంపదను ఆకర్షించడానికి ఎంతగానో సహాయపడుతుంది..
దీంతో పాటు, ఉత్తర దిశలో ఒక గాజు పాత్రలో (Glass Bowl) స్వచ్ఛమైన నీటిని ఉంచడం లేదా గోడకు అందమైన జలపాతం (Water Fall) లాంటి పెయింటింగ్ లేదా చిత్రాన్ని తగిలించడం వల్ల అద్భుతమైన సానుకూలమైన ఫలితాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇంట్లో చేసే ఈ చిన్న చిన్న మార్పులు మీ వాస్తు దోషాలన్నింటినీ తొలగిస్తాయి. దీనివల్ల మీ పొదుపు పెరగడమే కాకుండా.. పాత అప్పులన్నీ చాలా సులభంగా తిరిపోతాయని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
కలలో బంగారం, తెలుపు వస్తువులు, దేవుడు కనిపిస్తే నిజంగానే అదృష్టమా?
Hyderabad, Telangana:Dream Astrology News: నిద్రపోతున్నప్పుడు కలలు రావడం అనేది ఒక సహజమైన ప్రక్రియ.. అయితే, ప్రతి కలకు ఒక నిర్దిష్ట అర్థం లేదా భవిష్యత్తుకు సంబంధించిన సంకేతం ఉంటుందని అనుకోవడం పొరపాటేనని జ్యోతిష్య నిపుణులు తెలుపుతున్నారు. చాలా కలలు మన ఆలోచనలు, కోరికలు, మనస్తత్వాన్ని సూచిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.. అయినప్పటికీ, స్వప్న శాస్త్రం ప్రకారం.. కొన్ని ప్రత్యేకమైన కలలు మన భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ముందుగానే సూచిస్తాయి. ఆయా కలల వెనుక ఉన్న అర్థంతో పాటు స్వభావాన్ని బట్టి శుభ, అశుభ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం.. వివిధ వస్తువులు కలల్లో కనిపిస్తే.. కలిగే ఫలితాలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
తెల్లని వస్తువులు లేదా దుస్తులు కనిపిస్తే..
కలలో తెల్లటి పక్షి లేదా తెల్లని దుస్తులు, ముత్యాలు కనిపించినా లేదా మీ చుట్టూ తెల్లటి వస్తువులు ఉన్నట్లు అనిపించినా అది అత్యంత శుభప్రదంగా స్వప్న శాస్త్రం పరిగణిస్తుంది.. ఈ కలలు మీ జీవితంలో సానుకూల మార్పులు రాబోతున్నాయని సూచిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలు లేదా మానసిక ఆందోళనల నుంచి త్వరలోనే విముక్తి లభిస్తుందని దీని అర్థాన్ని సూచిస్తుంది.. అంతేకాకుండా పెద్ద వివాదాలు తొలగిపోయి జీవితంలో ప్రశాంతత, ఆనందం విపరీతంగా లభిస్తుంది.
కలలో దేవుళ్లు కనిపిస్తే..
ఒక వ్యక్తి రోజులో తప్పకుండా కొన్ని సార్లైన భగవంతుడి నామస్మరణ చేస్తూ.. పూజలు లేదా జపాలు చేస్తూ ఉంటారు. కాబట్టి రాత్రి వేళల్లో దేవుడికి సంబంధించిన కలలు రావడం సర్వసాధారణం.. ఉదాహరణకు, శ్రీకృష్ణుడు లేదా దుర్గాదేవిని క్రమం తప్పకుండా ఆరాధించే వారికి కలలో ఆ దేవుళ్ల దర్శనం కలిగే అవకాశాలు కూడా లభిస్తాయి.. ఇది మన Subconscious mind ప్రతిచర్య మాత్రమేనని.. ప్రతిసారీ దీనిని దైవం సంకేతంగా లేదా భవిష్యత్తు సూచికగా భావించలేమని నిపుణులు సూచిస్తున్నారు.
బంగారం, వెండి, ఆభరణాలు..
రోజువారీ ఆలోచనల్లో ఆభరణాలు లేకపోయినప్పటికీ.. అకస్మాత్తుగా కలలో బంగారం, వెండి, నగలు లేదా డబ్బు కనిపిస్తే.. మాత్రం కాస్త జాగ్రత్త వహించల్సి ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. స్వప్న శాస్త్రం ప్రకారం.. ఇటువంటి కలలు భవిష్యత్తులో వస్తే.. ఆరోగ్య సమస్యలను లేదా ఉద్యోగ, వ్యాపార రంగాలలో వచ్చే సవాళ్లను సూచిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో మీ ఆరోగ్యం పట్ల.. అలాగే పని చేసే చోట అదనపు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
కలలో రకరకాల వంటకాలు, స్వీట్లు లేదా ఇతర ఆహార పదార్థాలు కనిపిస్తే.. అది స్థాన చలనాన్ని సూచిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. అంటే, భవిష్యత్తులో ఉద్యోగం, వ్యాపారం లేదా ఇతర కారణాల వల్ల మీరు.. తప్పకుండా ఒక ప్రస్తుతం నుంచి మరో ప్రాంతానికి మారాల్సి వస్తుంది. సాధారణంగా ఇల్లు వదిలి దూర ప్రాంతాలకు వెళ్లి పనిచేసే అవకాశం వచ్చే ముందు ఇటువంటి కలలు ఎక్కువగా వస్తాయని నమ్ముతారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
నో ఎంట్రీ.. అమెరికా జోక్యం ముగిసేవరకు హార్ముజ్ బంద్.. ఇరాన్ సంచలన ప్రకటన!
Hyderabad, Telangana:Iran Closes Strait of Hormuz: ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం మరింత తీవ్రతరంగా మారుతోంది. తాము పేర్కొన్న మార్గాల్లో కాకుండా వేరే దారిలో వెళ్తున్న నౌకను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని ఇరాన్ ఇటీవలే స్పష్టతనిచ్చింది. అంతేకాకుండా, హార్ముజ్ జలసంధిని తాము పూర్తిగా మూసివేసినట్లు ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ఘటన వల్ల అమెరికా తమపై దాడులు చేసే క్రమంలో పరిణామాలు అత్యంత తీవ్రంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై కూడా దాడులు చేస్తామని ఇరాన్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో అమెరికా సైనిక జోక్యం పూర్తిగా అంతమయ్యే వరకు హార్మజ్ జలసంధి మూసివేత కొనసాగుతుందని ఇరాన్ స్పష్టం చేసింది.
దాడులు పెంచిన అమెరికా..
మరోవైపు, ఇరాన్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో అమెరికా పర్యవసానంగా భీకర దాడులను ప్రారంభించింది. నౌకలపై దాడులు చేయడం మరియు జలసంధి మూసివేత నిర్ణయం నేపథ్యంలో ఇరాన్ పై అమెరికా సైనిక చర్యలు చేపట్టింది. ఈ వారంలోనే ఇది మూడవ దాడి అని యుఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఖేష్మ్ ఐలాండ్, బందర్ అబ్బాస్, సిర్కిక్ వంటి ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయని ఇరాన్ లోని స్థానిక వార్తా సంస్థలు కూడా సమాచారాన్ని అందించాయి. ఈ ఉద్రిక్తతల వల్ల ఇరాన్ గల్ఫ్ దేశాలపై కూడా దాడులు చేసే అవకాశం ఉందని కనిపిస్తోంది, ఇరు దేశాల మధ్య పరస్పర విమర్శలు తీవ్రమవుతున్నాయి.
ఇరాన్కు 24 గంటల గడువు..
ఈ ఉద్రిక్తతల మధ్య, నిన్న ఇరాన్కు అమెరికా 24 గంటల గడువు విధించిందని అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. నౌకలపై కాల్పులు ఆపేయాలని, తాము చేసిన తప్పులను బహిరంగంగా అంగీకరించాలని అమెరికా ఇరాన్కు అల్టిమేటం జారీ చేసింది. హార్ముజ్ జలసంధిని తక్షణమే తెరిచి ఉంచాలని, అక్కడ నౌకల రాకపోకలపై ఎటువంటి ఫీజులు వసూలు చేయబోమని ఇరాన్ ప్రకటించాలని అమెరికా కోరుతోంది. ఒకవేళ ఇరాన్ ఈ షరతులకు నిరాకరిస్తే, పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని హెచ్చరించింది.
హార్ముజ్ జలసంధిలో తాము సూచించిన మార్గాల ద్వారానే నౌకలు వెళ్లాలనడానికి ఇరాన్కు ఎలాంటి అధికారిక అనుమతి లేదని యుఎస్ సెంట్రల్ కమాండ్ తేల్చి చెప్పింది. హార్ముజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలో లేదని, మే నెల ప్రారంభం నుండి ఈ మార్గం ద్వారా దాదాపు 800కు పైగా వాణిజ్య నౌకలు, 380 రవాణా నౌకలు ప్రయాణించాయని, ఈ రవాణా ప్రక్రియలో అమెరికా దళాలు కూడా సహాయపడ్డాయని పేర్కొంది.
భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్..
యూఎస్, ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధం కారణంగా భారత్ కూడా ఇబ్బందుల్లో పడింది. హార్ముజ్ జలసంధిలోని ఒమన్ కారిడార్ మార్గం ద్వారా మన దేశానికి రావలసి ఉన్న క్రూడ్ ఆయిల్ నౌకను ఇరాన్ వెనక్కి పంపేసింది. అమెరికా సూచించిన మార్గాల ద్వారా కాకుండా, తాము నిర్దేశించిన మార్గాల్లోనే ప్రయాణించాలని ఇరాన్ హెచ్చరించింది. హార్ముజ్ ప్రాంతంపై ఆధిపత్యం కోసం అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ పోరు భారత్కు పెద్ద తలనొప్పిగా మారింది.
Also Read: అమెరికా క్షిపణి దాడులతో వణికిపోయిన ఇరాన్.. చాబహార్లో కరెంట్ కట్, బ్రిడ్జ్ క్లోజ్!
Also Read: అలీ ఖమేనీ పార్థివ దేహాన్ని ఇరాక్ ఎందుకు తీసుకెళ్తున్నారు? అంత్యక్రియలకు భారత్ నుంచి వెళ్లేది ఎవరంటే?
హార్ముజ్ జలసంధి మూతపడితే..
హార్ముజ్ జలసంధి పూర్తిగా మూతపడితే అంతర్జాతీయంగా ముప్పు ఏర్పడుతుంది. ఒకవేళ జలసంధి మూసివేత కొనసాగితే, అది భారతదేశంతో పాటు ఇతర సహ ఇతర దేశాలకు కూడా తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి మూతపడితే, క్రూడ్ ఆయిల్, ఎల్పీజీ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. గత ఐదు నెలల ఇబ్బందుల నుండి నెమ్మదిగా కోలుకుంటున్న భారత్కు ఇది పెద్ద దెబ్బ అవుతుంది. దీనివల్ల దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడమే కాకుండా, గృహ అవసరాలకు వాడే ఎల్పీజీ ధరలు కూడా ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది. ఇటీవలె రెండు నౌకలపై దాడులు జరిగిన నేపథ్యంలో, సీజ్ ఫైర్ గురించి ట్రంప్ మాట్లాడారు.. మాట్లాడటం సమయం వృథా చేయడమే అని ఆయన విమర్శించారు. ఆయన వ్యాఖ్యల వెంటనే అమెరికా ఇరాన్పై దాడులకు దిగింది. ఇరాన్ నాయకులు మోసగాళ్లు, అబద్ధాలకోరులని ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Vietnam Boat Accident: వియత్నాంలో ఘోర ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి..ఇద్దరు తెలుగోళ్లు!
Hyderabad, Telangana:Singer Janaki: భారతీయ సినీ పరిశ్రమలో విషాదం..లెజండరీ సింగర్ జానకమ్మ కన్నుమూత!
Hyderabad, Telangana:Singer Janaki Passed Away: భారతీయ సుప్రసిద్ధ గాయని ఎస్.జానకీ కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆమె మైసూరులో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జానకి మనవరాలు ఇన్ స్టా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో సంగీత ప్రపంచం అంతా ఒక్కసారిగా మూగబోయినట్లైంది. సింగర్ ఎస్ జానకీ అభిమానులు, సహచరులు తీవ్రదిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.S.Janaki Last Video: గాయని ఎస్.జానకి చివరి వీడియో..జానకమ్మ పాదాల చెంత సింగర్ సునీత..ఇరువురి మధుర స్మృతులు!
Hyderabad, Telangana:Singer S.Janaki Last Video: ఏడు దశాబ్దాల పాటు తన అమృత గాత్రంతో కోట్లాది మంది శ్రోతలను మైమరపించిన ప్రఖ్యాత గాయని, గానకోకిల ఎస్.జానకి (జానకమ్మ) భౌతికంగా మనకు దూరమయ్యారు. అయితే, ఆమె జీవిత చరమాంకంలోనూ సంగీతాన్ని ఎంతగానో ప్రేమించారనడానికి నిదర్శనంగా నిలిచిన ఒక అపురూపమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది.
జానకమ్మ పాదాల చెంత సునీత..
ఇటీవల చెన్నైలోని జానకమ్మ నివాసానికి ప్రముఖ గాయని సునీత వెళ్లారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ జానకమ్మ తనను చూడటానికి వచ్చిన సునీతను ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఆ సమయంలో సునీత.. జానకమ్మ పాదాల చెంత కూర్చొని ఎంతో మధురంగా పాటలు పాడారు.
సింగర్ సునీత పాడుతున్నంత సేపూ జానకమ్మ ముఖంలో ఒక తెలియని తృప్తి, ఆనందం కనిపించాయి. అనారోగ్యాన్ని సైతం మర్చిపోయి చిరునవ్వుతో చప్పట్లు కొడుతూ, సునీతను ఎంతో ఉత్సాహంగా అభినందించారు.
కన్నీరు పెట్టిస్తున్న దృశ్యాలు
సంగీత ప్రపంచంలోని ఇద్దరు అద్భుతమైన గాయనుల మధ్య జరిగిన ఈ భావోద్వేగ భరితమైన సంభాషణ, ఆత్మీయ కలయికకు సంబంధించిన విజువల్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. "చివరి క్షణం వరకు ఆమె పాటలతోనే బతికారు.. పాటలతోనే ప్రయాణం ముగించారు" అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ముగిసిన అమృత గాత్ర ప్రస్థానం
ఈ మధురమైన సంఘటన జరిగిన కొన్ని రోజులకే జానకమ్మ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. తమ గుండెల్లో నిలిచిపోయే వేలాది పాటలను అందించిన జానకమ్మ ఇకలేరనే వార్తను అభిమానులు, సంగీత కళాకారులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా.. సునీత పాడిన పాటను వింటూ ఆమె చప్పట్లు కొట్టిన ఆ 'చివరి వీడియో' మాత్రం అందరినీ కదిలిస్తోంది. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో జానకమ్మ వదిలివెళ్లిన శూన్యం ఎప్పటికీ పూడ్చలేనిది. ఆమె పాడిన పాటలు ఉన్నంత కాలం జానకమ్మ ప్రతి ఒక్కరి హృదయాలలో జీవించే ఉంటారు.
Also Read: రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ? ఫ్యాన్స్తో భారీ ప్లానింగ్..ముహూర్తం కూడా ఫిక
Also Read: 'మళ్లీ రావా' చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా? ఆ క్యూట్ పిల్ల కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్గా.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
