Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad500029

హైదరాబాద్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు పూరీ జగన్నాథ రథయాత్ర

Jul 07, 2024 14:56:36
Hyderabad, Telangana

హైదరాబాద్ అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఏర్పాటు చేసిన పూరీ జగన్నాథ రథయాత్రను సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పూరీ జగన్నాథుని రథయాత్రలో ఇస్కాన్ ఆలయ అర్చకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. రథయాత్రకు ముందు దిష్టిగుమ్మ డి కాయను చంపి రథయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Feb 28, 2026 18:30:56
Amaravathi, Andhra Pradesh:

AP Free Bus Scheme: ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు అమలవుతున్న ఉచిత బస్సుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉచిత బస్సును మహిళలతోపాటు దివ్యాంగులకు కూడా అమలు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా దివ్యాంగులకు సంబంధించి ఉచిత బస్సు అమలు చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దివ్యాంగులకు ఉచిత బస్సు అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: KTR: రెండేళ్లలో రాజధాని హైదరాబాద్‌ను రేవంత్ రెడ్డి కుప్పకూల్చాడు: కేటీఆర్

దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని.. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దివ్యాంగులకు ఉచిత బస్సు అమలు చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకి మంత్రి డీఎస్ బీవీ స్వామి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల దివ్యాంగుల సంక్షేమం కోసం ఇంద్ర ధనస్సులో భాగంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

Also Read: Gold Fruad: మేడమ్‌ పేరిట బంగారు కడ్డీలతో మోసం.. కిలో బంగారంతో ఉడాయింపు

ఈ నేపథ్యంలో స్త్రీ శక్తి పథకంతో దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్త్రీ శక్తి పథకం వర్తించే అన్ని బస్సుల్లోనూ దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సందర్భంగా దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దివ్యాంగుల తరఫున దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ రాష్ట్ర మంత్రి డోలా  బాల వీరాంజనేయస్వామి కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ సందర్భంగా మంత్రి డోలా  బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని తెలిపారు. దివ్యాంగులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.6 వేలు పింఛన్ ఇస్తున్నట్లు గుర్తుచేశారు. దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులు మార్చిలోపు భర్తీ చేస్తామని  మంత్రి వీరాంజనేయ స్వామి చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 28, 2026 17:15:20
Kakinada, Andhra Pradesh:

Vetlapalem Blast Victims: బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాదం రేపింది. పెద్ద ఎత్తున శబ్దాలతో పేలుడు సంభవించడంతో కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఘోర ప్రమాదం సంభవించింది. మొత్తం 23 మంది మృతి చెందగా.. పదుల సంఖ్యలో క్షతగాత్రులకు గురయ్యారు. ఈ ప్రమాదంపై వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు ఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం మృతదేహాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మృతుల కుటుంబాలకు భారీ పరిహారం ప్రకటించారు.

వేట్లపాలెం దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చారు. క్షతగాత్రుల్లో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నారని.. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. విచారణ పూర్తయ్యాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇస్తూ సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు.

వేట్లపాలెం దుర్ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ దుర్ఘటనలో పేలుడు పదార్థాల వద్ద జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్వాహకులు విఫలమయ్యారని తెలిపారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన యాజమాన్యానికి సంబంధించిన ఆస్తులు కూడా జప్తు చేస్తామని.. బాధిత కుటుంబాలకు సాయం చేస్తామని వివరించారు. అనుమతి లేకుండా బాణసంచా తయారు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 28, 2026 16:36:28
Hyderabad, Telangana:

Telangana Industrialization: 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యాచరణ ఉంటుంది. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక లోగో తయారు చేస్తున్నాం. కేంద్రం ఏర్పాటు చేసిన ఏఐ సమావేశం నిర్వహణపై కొన్ని విమర్శలు వచ్చాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రణాళికా బద్ధంగా జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించాం. కోర్ అర్బన్ రీజియన్‌లో చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులు దృష్టిపెట్టాలి' అని రేవంత్ రెడ్డి సూచించారు.

Also Read: KTR: రెండేళ్లలో రాజధాని హైదరాబాద్‌ను రేవంత్ రెడ్డి కుప్పకూల్చాడు: కేటీఆర్

'ప్యూర్ అర్బన్ రీజియన్ 10 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఇక్కడ మాన్యుఫాక్చరింగ్ రంగం విస్తరించాలి. పారిశ్రామికీకరణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉండాలి. దీనిపైన అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. సేవా రంగంలో వస్తున్న పెను మార్పులు గమనంలోకి తీసుకోవాలి. శాఖలపైన ప్రతి ఒక్కరికి సంపూర్ణ అవగాహన ఉండాలి. శాఖలల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జాబితా సిద్ధం చేయాలి.

'ప్రభుత్వ  కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండడానికి వీలు లేదు. ప్రతి శాఖకు సొంత భవనం ఉండాలి. బడ్జెట్ ప్రతిపాదనలో వీటిని చేర్చాలి' అని అధికారులకు సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల పైన ప్రతి శాఖ దృష్టి పెట్టాలి. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. సర్వీస్ సెక్టార్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ఆన్‌లైన్ విధానంలో అన్ని పనులు జరిగేలా చూడాలి. ఈ ఫైల్ విధానం ఉండాలి. నిర్ణీత సమయంలో ఫైల్ క్లియర్ కావాల్సిందే' అని స్పష్టం చేశారు.

'పాత కాలం సర్వర్‌లను అప్డేట్ చేసుకోవాలి. సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి. ఇందులో సాంకేతికతను వినియోగించుకోవాలి. నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందాలి. 30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీపై దృష్టి పెట్టాలి. ఫ్యూచర్ సిటీ దేశ ఆర్ధిక స్థితిని మార్చబోతోంది' అని రేవంత్ రెడ్డి తెలిపారు. 'మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఇక్కడ వచ్చే మార్పులను ప్రజలకు వివరించాలి. డిజిటల్ గవర్నెన్స్‌పై దృష్టి పెట్టాలి. నాణ్యమైన విద్యను అందించడంపై దృష్టి సారించాలి' అని సూచించారు.

'వంద నియోజకవర్గాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్  ప్రారంభించుకోబోతున్నాం. ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేస్తాం. ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య సేవలు మెరుగుపడాలి. ప్రాంతాల వారీగా మెడికల్ డేటా తయారు చేయాలి. ప్రతి సెక్రటరీ తమ శాఖ లల్లో బెస్ట్ ప్రోగ్రామ్‌ను డిజైన్ చేసుకోవాలి' అని తెలంగాణ సీఎం తెలిపారు. 'మార్చి 6 నుంచి 99 రోజుల ప్రణాళిక జూన్ 12వ తేదీ వరకు జరగబోతుంది. జూన్ 2వ తేదీ వరకు ప్రతి ఆఫీస్ పరిశుభ్రంగా కావాల్సిందే. జూన్ 2వ తేదీ తెలంగాణకు పండుగను అంతా ఘనంగా చేసుకోవాలి. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం' అని రేవంత్‌ రెడ్డి వివరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 28, 2026 15:34:20
Tirupati Urban, Andhra Pradesh:

Lunar Eclipse Tirumala SSD Tokens: భారతదేశంలో చంద్రగ్రహణం ప్రభావం తీవ్రంగా ఉండడంతో ప్రముఖ ఆలయాలన్నీ మూసివేయనున్నారు. ఈ క్రమంలో దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల ఆలయం కూడా మూత పడనుంది. ఆలయం మూసివేయనుండగా చంద్ర గ్రహణం కారణంగా మార్చి 1, 2వ తేదీల్లో ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ రద్దు చేశారు. ఆ రెండు రోజులు సర్వదర్శనం టోకెన్లు జారీ చేయమని టీటీడీ ప్రకటించింది. ఇదివరకే టీటీడీ ప్రకటించిన విధంగా మార్చి 3వ తేదీన చంద్ర గ్రహణం కారణంగా శ్రీవారి దర్శనాలకు సంబంధించి తిరుపతిలో జారీ చేసే స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయమని టీటీడీ ప్రకటన విడుదల చేసింది.

Also Read: KTR: రెండేళ్లలో రాజధాని హైదరాబాద్‌ను రేవంత్ రెడ్డి కుప్పకూల్చాడు: కేటీఆర్

మార్చ్ 2, 3వ తేదీలకు సంబంధించిన ‌ఎస్‌ఎస్‌డీ టోకెన్లు ముందురోజు అనగా మార్చి 1, 2వ తేదీల్లో జారీ చేయమని టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ప్రకటన చేశారు. తిరిగి మార్చి 4వ తేది దర్శనానికి సంబంధించిన ఎస్‌ఎస్‌డీ టోకెన్లను మార్చి 3వ తేదీన జారీ చేస్తామని తెలిపారు. మార్చి 3వ తేది వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేశామని వెల్లడించారు. ఈ కారణంగా మార్చి 2వ తేదీన వీఐపీ దర్శన సిఫార్సు లేఖలు స్వీకరించలేమని టీటీడీ తెలిపింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

రుక్మిణి సమేత శ్రీకృష్ణుడి విహరం
తిరుమల వేంకటేశ్వర స్వామి వార్షిక తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా శనివారం మూడో రోజు శ్రీవారు రుక్మిణి సమేత శ్రీకృష్ణుడి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమలలోని స్వామి పుష్కరిణిలో భక్తుల గోవింద నామస్మరణ మధ్య ఈ వేడుక కనువిందుగా సాగింది. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి మాడవీధుల్లో ఊరేగింపుగా వెళ్తూ భక్తులకు అభయమిచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ తెప్పోత్సవం సాగింది. అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు ఆలపించిన సంకీర్తనలు భక్త జనాన్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టీటీడీ అధికారులు, విజిలెన్స్ విభాగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి.

రీల్స్‌పై టీటీడీ కీలక నిర్ణయం?
పవిత్రమైన తిరుమల ఆలయం.. ఆలయ పరిసరాల్లో రెచ్చిపోతున్న సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, భక్తులపై టీటీడీ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇటీవ‌ల చాలామంది త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం తిరుమ‌ల‌లో అస‌త్య క‌థ‌నాల‌తో రీల్స్ చేసి సోషియ‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఎంతో భ‌క్తితో తిరుమ‌ల పుణ్య‌క్షేత్రానికి వ‌చ్చే భ‌క్తుల మ‌నోభావాలను దెబ్బ‌తినేలా పోస్టు పెట్టేవారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని టీటీడీ హెచ్చ‌రించింది. దీనిపై బోర్డులో ఆమోదం తీసుకుందని తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 28, 2026 14:58:45
Hyderabad, Telangana:

Neopolis Rajashyamala Temple: ఇన్నాళ్లు పేదల భూములపై పడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు గుడులు, పీఠాలపై పడ్డాడని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రేవంత్ రెడ్డి కళ్లు దేవుడి మాన్యాల మీద పడ్డాయి. విశాఖ శారద పీఠం, రాజశ్యామల ఆలయాన్ని కూల్చేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నాడు. పోలీసులు, రెవెన్యూ అధికారులతో భయాందోళనలు సృష్టిస్తున్నారు. రేవంత్ రెడ్డి అల్లుడి క్రషర్ దందా కోసం దేవుడి భూములను లాక్కుంటారా? కేసీఆర్ ఆనవాళ్లు చెరపడం అంటే.. గుళ్లు, గోపురాలు కూల్చడమేనా?' అని ప్రశ్నించారు. ప్రతి ఆలయానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు.

Also Read: KTR: రెండేళ్లలో రాజధాని హైదరాబాద్‌ను రేవంత్ రెడ్డి కుప్పకూల్చాడు: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లతో పాటు ఇప్పుడు దేవాలయాలు, మఠాలను కూల్చేందుకు కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌ హరీశ్‌ రావు మండిపడ్డారు. కోకాపేట్ నియోపోలిస్‌లోని విశాఖ శారద పీఠం, రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని ఖాళీ చేయాలంటూ అధికారులు బెదిరిస్తుండడంతో హరీశ్‌ రావు అక్కడికి చేరుకున్నారు. ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

'వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు రేవంత్ రెడ్డి పాలన తయారైంది. అడ్డగోలు వ్యవహారాలు, అక్రమాలకు పాల్పడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా దేవాలయాలు, మఠాలను కూడా కూల్చే స్థాయికి దిగజారింది' అని మాజీ మంత్రి హరీవశ్‌ రావు మండిపడ్డారు. '2019లో కేసీఆర్ ప్రభుత్వంలో కోకాపేట సర్వే నెంబర్ 240లో విశాఖ శారద పీఠానికి చట్టబద్ధంగా మంత్రివర్గ ఆమోదంతో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించాం' అని గుర్తుచేశారు. 'పీఠం నిర్వాహకులు ప్రభుత్వానికి రూ.కోటి 5 లక్షలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. హెచ్ఎండీఏకు రూ.23 లక్షలు చెల్లించి అనుమతులు, విద్యుత్ కనెక్షన్ అన్నీ తీసుకున్నారు' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.

'తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తా అంటూ.. కేసీఆర్ కట్టిన గుళ్లు, గోపురాలు, మఠాలను కూల్చడమేనా రేవంత్ రెడ్డి ఉద్దేశం. హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చావు, ఖమ్మంలో ఇళ్లు కూల్చి 800 మందిని రోడ్డున పడేశావు. నీ పాలనలో అంతా కూల్చడమే తప్ప, నిర్మాణం లేదా? వాటర్ వర్క్స్ హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ కోసం ఈ స్థలం తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. వాటర్ వర్క్స్ కట్టాలంటే ఈ దేవాలయం స్థలమే దొరికిందా? సరిగ్గా ఈ ఆలయానికి రోడ్డు అవతలే సర్వే నెంబర్ 239, 240 లలో 17 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది కదా, వాటర్ వర్క్స్ అక్కడ కట్టుకోవచ్చు కదా?' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు.

'ఆ 17 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి తన అల్లుడికి, మేనల్లుళ్లకు, వాళ్ల అనుచరులకు భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ అక్రమంగా కట్టబెట్టారు. హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం ఓఆర్ఆర్‌కు కిలోమీటర్‌ లోపల ఎలాంటి క్రషర్లు ఉండకూడదు. కానీ రేవంత్ రెడ్డి తన అల్లుడి కోసం ఇక్కడ ఏకంగా 5 రెడీమిక్స్ ప్లాంట్లు, క్రషర్లు పెట్టించారు. పక్కన ఉన్న బిల్డర్లంతా తన అల్లుడి దగ్గరే కంకర కొనాలని.. లేకపోతే అనుమతులు ఇవ్వమని బెదిరిస్తూ దందా చేస్తున్నారు' అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.

'అల్లుడికి వ్యాపారం చేసుకోవడానికి 17 ఎకరాలు ఇస్తావు కానీ హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే శారద పీఠానికి ఉన్న రెండు ఎకరాలను మాత్రం లాక్కుని కూలుస్తావా? భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే నీ ధర్మమా.. తక్షణమే ఆ అక్రమ క్రషర్లను క్యాన్సిల్ చేయాలి. ఆలయం వద్ద పీఠాధిపతిని, నిర్వాహకులను భయభ్రాంతులకు గురిచేస్తారా..? మంత్రివర్గంలో నిర్ణయం తీసుకునే ముందు పీఠాధిపతులతో మాట్లాడే కనీస సంస్కారం ఈ ప్రభుత్వానికి లేదా?' అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు.

'దొంగల్లా దాక్కోవాల్సిన అవసరం పోలీసులకు ఏమొచ్చింది..? ఉదయం స్వాములు పూజలు చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. దేవాలయంలో ఏళ్ల తరబడి జరుగుతున్న పూజలను ఆపే హక్కు, ధైర్యం రేవంత్ రెడ్డికి ఎవరిచ్చారు.. స్వామీజీ వాగ్వాదానికి దిగాక అరగంట తర్వాత పూజకు అనుమతించారు. కేసీఆర్ ఆనవాళ్లని చెప్పి రైతుబంధు, కేసీఆర్ కిట్, ఫీజు రీయింబర్‌మెంట్ బంద్ చేశావు? ఇప్పుడు గుళ్లను కూడా వదులుతలేవు. దేవుని మీద పడ్డవాడు ఎవడూ బాగుపడలేదు.. నీకేదో పోయేగాలం దాపురించింది, ఆ దేవుడి శాపం నీకు తప్పక తగులుతుంది' అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Feb 28, 2026 14:09:09
Samarlakota, Andhra Pradesh:

Modi on Samarlakota Blast: కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన బాణసంచా ప్రమాదంపై దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఘటనపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం ప్రకటించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 

సామర్లకోట మండలం వేట్లపాలెంలోని ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి బాధితులకు కింది విధంగా పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, అలాగే క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం ఒక్కొక్కరికి రూ.50 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. "వేట్లపాలెం పేలుళ్ల వార్త నన్ను కలచివేసింది. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని ప్రధాని పేర్కొన్నారు.

రంగంలోకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ప్రమాద వార్త తెలిసిన వెంటనే తన పర్యటనను మార్చుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేట్లపాలెం చేరుకున్నారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించిన సీఎం, ప్రమాద తీవ్రతను చూసి చలించిపోయారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది? నిబంధనల ఉల్లంఘనలు ఏమైనా ఉన్నాయా? అనే విషయాలపై అధికారులను ఆరా తీశారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 9 మంది క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యల్లో ఎక్కడా జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. ఈ ఘోర ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 21కి చేరినట్లు తాజా సమాచారం. పోలీసులు ఇప్పటివరకు 13 మృతదేహాలను గుర్తించారు.

మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో, పోస్టుమార్టం నిమిత్తం వాటిని కాకినాడ జీజీహెచ్ (GGH) ఆసుపత్రికి తరలించారు. గాయపడిన 9 మందిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాణసంచా కేంద్రాల్లో భద్రతా ప్రమాణాల లోపం ఇంతమంది నిరుపేద కూలీల ప్రాణాలను బలి తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Also Read: Samarlakota Blast: ఏపీలో భారీ పేలుడు..18 మంది దుర్మరణం, చెల్లాచెదురుగా పడిన శరీర భాగాలు!

Also Read: Unseen Friend In Virosh Marriage: విజయ్-రష్మిక ఫోటోల్లో ఆ మూడో వ్యక్తి ఎవరు? వైరల్ అవుతున్న 'అన్‌సీన్ ఫ్రెండ్' పోస్ట్‌లు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 28, 2026 13:46:53
Hyderabad, Telangana:

GHMC Elections BRS Party Planning: రాజధాని హైదరాబాద్‌ని కాంగ్రెస్, రేవంత్ రెడ్డినే కుప్పకూల్చాడు. రెండు సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్లో హైదరాబాద్‌ని దెబ్బ కొట్టారు' అని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి అవినీతి, అక్రమాలు, స్కామ్‌ల వల్లనే హైదరాబాద్‌కి ఈ పరిస్థితి దాపురించిందని వాపోయారు. పారిశుద్ధ్యం నుంచి ప్రజా రవాణా దాకా అన్ని రంగాల్లో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. పారిశ్రామిక ప్రగతి నుంచి వ్యాపార వాణిజ్యాలు అన్నీ నగరంలో క్షీణించాయని మాజీ మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు.

Also Read: Gold Fruad: మేడమ్‌ పేరిట బంగారు కడ్డీలతో మోసం.. కిలో బంగారంతో ఉడాయింపు

హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ, అసెంబ్లీ సమావేశాల్లో హైదరాబాద్‌ నగరానికి సంబంధించి లేవనెత్తాల్సిన అంశాలు విస్తృతంగా చర్చించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం కార్యకలాపాల సమన్వయం కోసం జీహెచ్ఎంసీకి ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్ కోసం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కోసం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికు పార్టీ బాధ్యతలు అప్పగించింది.

Also Read: BRS Party: పేదల ఇళ్లు కూల్చడమే పనిగా పెట్టుకున్న రేవంత్‌ రెడ్డి: కొప్పుల ఈశ్వర్‌

అనంతరం కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర రాజధానిని అంతర్జాతీయ మెట్రో నగరంగా తీర్చిదిద్దాం. కేవలం ఇక్కడి ప్రజలు ఓట్లు వేయలేదన్న ఏకైక కక్షతో, కోపంతో హైదరాబాద్‌కి ఈ దుస్థితి రేవంత్ రెడ్డి తీసుకువచ్చారు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఉన్న నగరాన్ని వదిలిపెట్టి తన రియల్ ఎస్టేట్ కోసం ఫోర్త్ సిటీని, ఫ్యూచర్ సిటీని రేవంత్ రెడ్డి ప్రమోట్ చేస్తున్నాడని మండిపడ్డారు. హైదరాబాద్ నగర ప్రజల అంశాలను, ప్రభుత్వ పక్షపాత వైఖరిని అన్ని విధాలా ఎండగడతామని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు.

రెండు సంవత్సరాల కాలంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అధఃపాతాళానికి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుపోయారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం తన ఆర్థిక ప్రయోజనాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల కోసం మాత్రమే రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడని, అందుకే హైదరాబాద్ నగరంలో భూములే లక్ష్యంగా అక్రమ సంపాదన కోసమే పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరాన్ని పతనానికి పడగొట్టారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

'రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులు, అనుచరుల కోసం వేల కోట్ల రూపాయలను హైదరాబాద్‌ నుంచి దోచుకోవడానికి హైడ్రా మొదలుకొని పారిశ్రామిక భూముల స్కామ్, టీడీఆర్ పేరిట మరొక కుంభకోణం, ఇలా ఫోర్త్ సిటీ భూముల కుంభకోణం రేవంత్ రెడ్డి 24 నెలలుగా చేసింది రియల్ ఎస్టేట్ వ్యాపారమే' అని కేటీఆర్ విమర్శించారు. కనీసం దోమల నివారణ కూడా చేయలేనంత దుర్మార్గమైన పరిపాలనా వైఫల్యం రేవంత్‌ రెడ్డి పాలనలో ఉందని.. ఎప్పుడూ లేనటువంటి కరెంట్ కోతలు, తాగునీటి ఇబ్బందులు, పారిశుద్ధ్య సమస్యలు అన్ని తిరిగి హైదరాబాద్‌లో దర్శనమిస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్‌ వివరించారు. 

అవగాహన రాహిత్యంతో, అక్రమ సంపాదన లక్ష్యంగా తన భూములకు విలువ తీసుకురావడం కోసం రేవంత్‌ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో ఉన్న సిటీని పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న హైదరాబాద్ నగరంలో మౌలిక వసతుల కల్పన చేయకుండా.. కనీస పౌర సేవలు అందించకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో తిరోగమనంలోకి తీసుకువెళ్తుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 28, 2026 12:13:44
Hyderabad, Telangana:

Karimnagar Rtc Goa Package Telugu: వేసవికాలం సందర్భంగా కరీంనగర్ డిపో2 తమ ప్రయాణికులకు అదిరిపోయే కానుకను సిద్ధం చేసింది.. అతి తక్కువ ధరలోనే ఆధ్యాత్మిక కేంద్రాలతో పాటు విహారయాత్రలకు కలిపి గోవా టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను కరీంనగర్ డిపో మేనేజర్ శ్రీనివాస్ వెల్లడించారు. అతి తక్కువ ధరలోనే మంచి టూర్‌కి వెళ్లాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశమని ఆయన తెలిపారు. అయితే ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన అన్ని రకాల వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ టూర్ లో భాగంగా సందర్శించి ప్రాంతాలకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఈ టూర్ కేవలం గోవాకు మాత్రమే పరిమితం కాకుండా మధ్య మార్గంలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను కూడా కవర్ చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఉడిపి శ్రీకృష్ణమఠంతోపాటు కొల్లూరు మూకాంబిక అమ్మవారి దర్శనం చేయించి.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద శివుని విగ్రహం మురుడేశ్వర్ను కూడా కవర్ చేయబోతున్నట్లు ఈ టూర్ ప్యాకేజీలో పేర్కొన్నారు. అంతేకాకుండా గోకర్ణ క్షేత్ర దర్శనం కూడా చేయించపోతున్నట్లు వెల్లడించారు. 

వీటన్నిటిని చూసుకున్న తర్వాత.. నేరుగా గోవాలోని ప్రముఖ బీచులతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా చూపించబోతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ యాత్ర మార్చి ఆరవ తేదీ నుంచి సాయంత్రం గంటలకు ప్రారంభమవుతుంది. కరీంనగర్ నుంచి ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన బస్సు మొదలవుతుందని డిపో మేనేజర్ తెలిపారు.. యాత్ర ముగించుకొని మార్చి పదవ తేదీన తిరిగి కరీంనగర్ చేరుకుంటుంది. మొత్తం యాత్ర దాదాపు నాలుగు రోజులకు పైగా కొనసాగుతుందని ఆయన వెల్లడించారు..

Also Read:​ Iran-US War News: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ జ్వాలలు.. US నావల్ బేస్‌లపై ఇరాన్ మిస్సైల్ దాడి!

ఇక ఈ యాత్రకు సంబంధించిన టికెట్ ధర వివరాల్లోకి వెళితే.. పెద్దలకు కేవలం రూ.5,500 నుంచి ప్రారంభమవుతున్నట్లు తెలిపారు. దీంతోపాటు పిల్లలకు రూ.4,150 ఉంటుందని డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు.. ఇక బుకింగ్ సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఎవరైతే ఈ యాత్రకు వెళ్లాలనుకుంటున్నారో.. వారు తప్పకుండా ముందుగానే టికెట్లను కరీంనగర్ బస్ స్టేషన్ లో లేదా 9398658062 నంబర్‌ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అతి తక్కువ ధరలోనే టూర్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్న వారికి ఈ ప్యాకేజీ అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు..

Also Read:​ Iran-US War News: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ జ్వాలలు.. US నావల్ బేస్‌లపై ఇరాన్ మిస్సైల్ దాడి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 28, 2026 12:00:31
Hyderabad, Telangana:

Israel-iran War Latest Telugu News: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి.. ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య గత కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్న ప్రచ్చన్న యుద్ధం శనివారం బహిరంగ యుద్ధం గా మారింది. అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్ దళాలు ఇరాన్లోని పాలు ప్రధాన నగరాలపై బాంబులతో ఊహించని స్థాయిలో విరుచుకుపడుతున్నాయి.. ఈ బీకర దాడుల్లో దక్షిణ ఇరాన్లోని హార్మోజ్గాన్ ప్రావిన్స్‌లో ఉన్న మినాబ్ (Minab) నగరంలో ఒక ప్రాథమిక పాఠశాల పూర్తిగా కూలిపోయింది..

ఇజ్రాయిల్ వైమానిక దళం మినాబ్ నగరంలోని సైనిక స్థావరాలే లక్ష్యంగా  దాడులు చేస్తూ వస్తోంది. అయితే, ఈ సమయంలో ఒక మిస్సైల్ అక్కడ ఉన్న ఎలిమెంటరీ గర్ల్స్ స్కూల్‌ను నేరుగా తాకడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భాగంగా పాఠశాల భవనం పూర్తిగా నేలమట్టమై దాదాపు 24 మందికి పైగా విద్యార్థులు మరణించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా శితిలాల కింద మరికొంతమంది విద్యార్థులు చిక్కుకున్నట్లు సమాచారం. ఈ దాడి నుంచి కొంతమంది విద్యార్థులు తప్పించుకున్నారు..

ఘటనా స్థలం వద్ద పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.. తమ పిల్లల కోసం తల్లిదండ్రులు చేస్తున్న ఆర్తనాధాలతో మినాబ్ నగరం దద్దరిల్లిపోయింది.. పిల్లలు చదువుకునే పాఠశాలలే లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం అమానుషం అంటూ స్థానికులు కూడా ఊహించని స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి తల్లిదండ్రులు చేరుకొని శిథిలాల కింద ఉన్న పిల్లలను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు..

Also Read:​ Iran-US War News: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ జ్వాలలు.. US నావల్ బేస్‌లపై ఇరాన్ మిస్సైల్ దాడి!

ఇరాన్ అను సామర్థ్యాన్ని దెబ్బతీయటమే లక్ష్యంగా ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుతో పాటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ను ప్రకటించారు. టెహ్రాన్, ఇస్ఫహాన్, కరాజ్ వంటి ప్రధాన నగరాల్లో క్షిపణుల కేంద్రాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి.. దీనికి ప్రతి చర్యక ఇరాన్ కూడా ఇజ్రాయిల్ పై ప్రత్యేకమైన డ్రోన్ల ఎదురుదాడిని ప్రారంభించినట్లు తెలుస్తోంది. అలాగే వారి దగ్గర ఉన్న శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణులతో కూడా ఎదురుదాడిని ప్రారంభించింది.. అయితే ఈ స్కూల్ పై జరిగిన దాడుల నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కొన్ని స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి..

Also Read:​ Iran-US War News: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ జ్వాలలు.. US నావల్ బేస్‌లపై ఇరాన్ మిస్సైల్ దాడి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
HDHarish Darla
Feb 28, 2026 10:48:23
Samarlakota, Andhra Pradesh:

Samarlakota Blast News: కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోదావరి కెనాల్ సమీపంలో ఉన్న 'సూర్యశ్రీ ఫైర్ వర్క్స్' బాణసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా సంభవించిన భారీ విస్ఫోటంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా శ్మశానవాటికను తలపిస్తోంది.

ప్రమాద తీవ్రత - భయానక దృశ్యాలు
పేలుడు ధాటికి వచ్చిన శబ్దం సుమారు 5 కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందంటే ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పక్క గ్రామంలోని ఒక ప్రైవేటు పాఠశాల భవనం స్లాబ్‌కు పగుళ్లు వచ్చేంతగా ప్రకంపనలు వచ్చాయి. మరణించిన 18 మందిలో ఎక్కువ మంది మహిళా కూలీలే ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. మరో 8 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.

విస్ఫోటం ఎంత ధాటిగా జరిగిందంటే.. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ఘటనాస్థలిలో శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉండటం స్థానికులను కలచివేస్తోంది.

కారణం అదేనా?
అడపా నాని కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ఈ పరిశ్రమలో, అనుమతించిన పరిమితికి మించి నిల్వ ఉంచిన బాణసంచా నిల్వల వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం
ప్రస్తుతం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు హోం మంత్రి వంగలపూడి అనిత హుటాహుటిన ఘటనాస్థలికి బయలుదేరారు. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ఈ ఘోర ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. బాణసంచా తయారీలో నిబంధనల ఉల్లంఘనలే ఈ విస్ఫోటానికి కారణమనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించే అవకాశం ఉంది.

Also Read: Unseen Friend In Virosh Marriage: విజయ్-రష్మిక ఫోటోల్లో ఆ మూడో వ్యక్తి ఎవరు? వైరల్ అవుతున్న 'అన్‌సీన్ ఫ్రెండ్' పోస్ట్‌లు!

Also Read: Anantapur Kajjikayalu Dispute: అత్తగారింట్లో కజ్జికాయల రభస..100కు ఫోన్ చేసిన చిన్నల్లుడు..పోలీసుల ఎంట్రీతో చివరికి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 28, 2026 10:32:10
Hyderabad, Telangana:

Virosh Wedding Unseen Friend: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ వేడుకలో నూతన వధూవరులతో పాటు ఫోటోల్లో కనిపిస్తున్న ఆ 'మూడవ వ్యక్తి' ఎవరా అని నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు. 

టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరి 26న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే ఈ పెళ్లి ఫోటోల్లో నూతన జంట పక్కనే ఒక వింత వ్యక్తి కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

ఎవరా మూడో వ్యక్తి?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలను 'అన్‌సీన్ ఫ్రెండ్' అనే ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. ఈ వ్యక్తి కొన్ని చోట్ల మంత్రాలు చదువుతున్నట్లు, మరికొన్ని చోట్ల నూతన జంటను ఆశీర్వదిస్తున్నట్లు కనిపిస్తున్నాడు.పెళ్లి తర్వాత విజయ్, రష్మికలు వెళ్తున్న వింటేజ్ కారులో కూడా ఈ వ్యక్తి వారి మధ్యలోనే కూర్చుని ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అసలు విషయం ఏంటంటే..
ఈ 'అన్‌సీన్ ఫ్రెండ్' తన అద్భుతమైన ఫోటోషాప్ నైపుణ్యంతో సెలబ్రిటీల ఫోటోల్లో తాను కూడా ఉన్నట్లు క్రియేట్ చేస్తూ ఫన్నీ పోస్ట్‌లు పెడుతుంటారు. విజయ్-రష్మిక పెళ్లి ఫోటోల్లో కూడా అలాగే డిజిటల్ ఎడిటింగ్ ద్వారా తనను తాను జొప్పించి, సరదాగా అభినందనలు తెలిపారు.

వివాహం అనంతరం రష్మిక తన భర్త విజయ్ గురించి సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. "నా భర్త విజయ్ దేవరకొండ నాకు నిజమైన ప్రేమ, శాంతి అంటే ఏంటో నేర్పించారు. నా కలలకు ధైర్యాన్ని ఇచ్చి, నన్ను ఎప్పుడూ నమ్మారు. ఆయన భార్య కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా ప్రతి విజయం, ఆనందం ఇప్పుడు ఆయనతో పంచుకోవడం వల్ల మరింత ప్రత్యేకంగా మారింది" అని రాసుకొచ్చింది.

ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "అసలు ఆ కారులో అతనికి చోటు ఎలా దొరికింది?" అని కొందరు సరదాగా కామెంట్ చేస్తుంటే, మరికొందరు ఎడిటింగ్ నైపుణ్యాన్ని మెచ్చుకుంటున్నారు. మొత్తానికి 'విరోష్' పెళ్లి ఫోటోలు ఈ మూడో వ్యక్తి పుణ్యమా అని మరింత వైరల్ అయ్యాయి.

Also Read: Anantapur Kajjikayalu Dispute: అత్తగారింట్లో కజ్జికాయల రభస..100కు ఫోన్ చేసిన చిన్నల్లుడు..పోలీసుల ఎంట్రీతో చివరికి!

Also Read; Sangeetha Vijay Net Worth: విజయ్ Vs సంగీత: కోట్ల రూపాయల సామ్రాజ్యం..విడాకుల వేళ వెలుగులోకి ఆసక్తికర విషయాలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 28, 2026 10:06:32
Hyderabad, Telangana:

Bujji Bahubali In New York City: సాధారణంగా పుట్టే శిశువులు కేవలం 2.5 నుంచి 3.5 కిలోల బరువు ఉంటారు.. అలాగే ఒక్కొక్కరికి కొన్ని సందర్భాల్లో 2.0 నుంచి 2.5 కిలోల బరువు ఉన్న శిశువులు కూడా జన్మిస్తూ ఉంటారు. కానీ న్యూయార్క్ లోని ఒక బలబీముడు జన్మించాడు. ఏకంగా 5.9 కిలోల బరువుతో పుట్టిన ఈ చిన్నారిని చూసి డాక్టర్లతో పాటు సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంత బరువుతో జన్మించడం చూసి కొంతమంది ఇది అసాధ్యమని అంటున్నారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలంటే మనం ఎప్పుడు తెలుసుకుందాం..

న్యూయార్క్‌లోని ఇతాకాలో ఉన్న కాయుగా మెడికల్ సెంటర్లో టెర్రికా, షాన్ అనే ఇద్దరు దంపతులకు ఈ జంబో బాబు జన్మించాడు. పుట్టినప్పుడే ఈ బాబు సాధారణ శిశువుల కంటే రెట్టింపు బరువుతో ఉండడంతో.. అతనికి నవజాత శిశువుల బట్టలు ఏమాత్రం సరిపోవటం లేదని వైద్యులు తెలిపారు.. ప్రస్తుతానికి ఈ బుజ్జి బాహుబలి కి ఆరు నెలల వయస్సు కలిగిన పిల్లల దుస్తులతో పాటు డైపర్లతోనే సరిపెట్టడం విశేషం.. ఈ బుజ్జి బాబు అందరూ శిశువులకంటే అద్భుతమైన శరీర ఆకృతిని కలిగి ఉన్నాడు. 

అదే సమయంలో అదే ఆసుపత్రిలో మరో శిష్యు కూడా జన్మించింది. అయితే, ఆ శిశువు బరువు కేవలం 1.8 కిలోలు మాత్రమే ఉంది. ఈ ఇద్దరు శిశువులను పక్కపక్కనే పడుకోబెట్టి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. 5.9 కిలోల బరువు బాబుతో పాటు పక్కనే 1.8 కిలోల శిశువు చాలా చిన్నదిగా కనిపించడం చూసి సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా కామెంట్లు చేస్తూ వస్తున్నారు. కొంతమంది అయితే ఈ బాబుకు జంబో బాబు అని కూడా పేరు పెట్టారు.. ఇక మరికొంతమంది అయితే.. బాహుబలి బాబు అని పిలుస్తున్నారు.

Also Read:​ Iran-US War News: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ జ్వాలలు.. US నావల్ బేస్‌లపై ఇరాన్ మిస్సైల్ దాడి!

బాబు బరువును చూసి అందరూ ఆశ్చర్య పోయినప్పటికీ చరిత్రలో ఇంతకంటే భారీ బరువుతో పుట్టిన శిశువులు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రపంచ రికార్డు ప్రకారం 1955లో ఇటలీలో ఒక శిశువు ఏకంగా 9.97 కిలోల బరువుతో జన్మించి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ఇంతకంటే తక్కువ బరువున్న  శిశువులు కూడా జన్మించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు నమోదైన అత్యంత బరువైన శిశువుగా అదే కొనసాగుతూ వస్తోంది. ఏది ఏమైనా న్యూయార్క్‌లో పుట్టిన ఈ బుజ్జి బాహుబలి ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అలాగే తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు అధికారులు కూడా తెలిపారు.

Also Read:​ Iran-US War News: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ జ్వాలలు.. US నావల్ బేస్‌లపై ఇరాన్ మిస్సైల్ దాడి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 28, 2026 09:50:48
Hyderabad, Telangana:

Iran-US War Telugu News: ఇరాన్, ఇజ్రాయిల్ అమెరికా కూటమి మధ్య ఉద్రిక్తతలు చివరి దశకు చేరుకున్నాయి. ఇరాన్ పై ఇజ్రాయిల్ ముందస్తు దాడులు ప్రారంభించగా.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాండ్లు భారీ సైనిక చర్యలు ఉంటాయని ప్రకటించారు. ఈ పరిణామం లో మధ్య ప్రాచుర్యం మొత్తం యుద్ధక్షేత్రంగా మారింది. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియక గందరగోళం ఏర్పడింది. అలాగే ఇప్పటికే మిడిల్ లిస్టులో కొన్ని దేశాల్లో యుద్ధ జ్వాలలు కూడా ప్రారంభమయ్యాయి. 

తమ దేశంపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఇరాన్ ప్రతీకార చర్యలు చేపట్టింది.. ఖతార్‌తో పాటు బహ్రెయిన్‌లోని అమెరికా నావికాదళ స్థావరాలను (US Naval Bases) లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులను సంధించింది.. అయితే, దీనికి సంబంధించిన సమాచారం అధికారికంగా ఇంకా ఇరాన్ వెల్లడించలేదు. కానీ మిడిలిస్ట్ లోని కొన్ని వార్త సంస్థలు మాత్రం ఈ సమాచారాన్ని కొద్ది గంటల క్రితమే బయటికి వెల్లడించాయి..

ఖతార్‌లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్ వైపు వచ్చిన మిస్సైల్స్‌ను రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఇక బహ్రెయిన్‌లోని అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై కూడా దాడికి ప్రయత్నం జరిగినట్లు సమాచారం.. ఇదిలా ఉంటే పరిస్థితి తీవ్రతను గమనించిన ఖతార్ పాలకులు తక్షణమే నేషనల్ ఎమర్జెన్సీ ని కూడా ప్రకటించారు. తదుపరి దాడులు జరిగే అవకాశం ఉందన్న నికావర్గాల హెచ్చరికలతో తమ వైమానిక మార్గం పూర్తిగా మూసివేసినట్లు ప్రకటించింది. అలాగే అమెరికా ఎంబసీలు తమ సిబ్బందిని సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలని కూడా ఆదేశించింది.

మరోవైపు ఇరాన్ అను కేంద్రాలతో పాటు మిస్సైల్ తయారీ కేంద్రాల లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులు దాడులు కొనసాగిస్తూ వస్తోంది. ఖతార్‌తో పాటు పలు ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతూ వస్తోంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ యుద్ధం వల్ల ప్రపంచ ఇంధన సరఫరా పై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ ఇప్పటికే క్రషింగ్ రిటాల్యుయేషన్ ఉంటుందని హెచ్చరించడంతో గల్ఫ్ దేశాలని హై అలర్ట్ లో ఉన్నాయి.

Also Read:​ రష్మిక టూ శ్రీలీల సౌత్ యంగ్ బ్యూటీలు ఏం చదువుకున్నారో తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
sidebar-img
Advertisement
Back to top