icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
500029
VVishwaroopaFollow7 Jul 2024, 02:56 pm

హైదరాబాద్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు పూరీ జగన్నాథ రథయాత్ర

Hyderabad, Telangana:

హైదరాబాద్ అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఏర్పాటు చేసిన పూరీ జగన్నాథ రథయాత్రను సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పూరీ జగన్నాథుని రథయాత్రలో ఇస్కాన్ ఆలయ అర్చకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. రథయాత్రకు ముందు దిష్టిగుమ్మ డి కాయను చంపి రథయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Tecno Pova 8: బాబోయ్.. 8,000 mAh బ్యాటరీనా? భారీ ఫీచర్లతో Tecno Pova 8 లాంచ్!

Hyderabad, Telangana:

Tecno Pova 8 Launch In India Telugu News: ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ టెక్నో గురువారం భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీనిని కంపెనీ టెక్నో పోవా 8 స్మార్ట్‌ఫోన్‌ పేరుతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌తో విడుదలైంది. అంతేకాకుండా ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌తో పాటు అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే, ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

టెక్నో పోవా 8 స్మార్ట్‌ఫోన్‌లో 6.76-అంగుళాల ఫుల్ HD+ IPS డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని కంపెనీ ఎంతో శక్తివంతమైన 8,000 mAh బ్యాటరీతో పాటు 45 W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. ఈ టెక్నో పోవా 8 స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించబోతున్నట్లు తెలిపింది.. ఇది గత సంవత్సరం విడుదల చేసిన టెక్నో పోవా 7 స్మార్ట్‌ఫోన్‌కి సక్సెసర్‌గా అందుబాటులోకి తీసుకు వచ్చారు. 

టెక్నో పోవా 8 ధరకి సంబంధించిన వివరాలు..
ఈ స్మార్ట్‌ఫోన్ 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999 కాగా.. 8GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ.31,999తో అందుబాటులోకి వచ్చింది.. టెక్నో పోవా 8 మొబైల్‌ను కంపెనీ తెలుపు, నారింజతో పాటు ఆకుపచ్చ రంగులలో విడుదల చేసింది. 

ఇక టెక్నో పోవా 8 స్పెసిఫికేషన్స్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 381 ppi పిక్సెల్ డెన్సిటీ, 950 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.76-అంగుళాల ఫుల్ HD+ అద్భుతమైన డిస్‌ప్లేను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత టెక్నో HiOS 16 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది. దీనికి మాలి-G610 MC2 GPUతో కూడిన ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌తో అందుబాటులోకి తీసుకువవచ్చింది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. దీని వెనకాలో 50-మెగాపిక్సెల్ సోనీ LYT-600 ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా సెల్ఫీతో పాటు వీడియో కాల్స్ కోసం దీనికి 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా కంపెనీ అందించింది.. ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా యూనిట్ పోర్ట్రెయిట్ మోడ్, వ్లాగ్ మోడ్, డ్యూయల్ వీడియోతో పాటు స్లో మోషన్ వంటి ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.

టెక్నో పోవా 8 మొబైల్ వెనక భాగంలో  అలైవ్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. ఇందులో కంపెనీ గేమింగ్ సమయంలో కెమెరా ప్రసెసర్‌కి చల్లదనం లభించేందుకు ఇందులో 14,689 చదరపు మిల్లీమీటర్ల కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎంతో శక్తివంతమైన 8,000 mAh బ్యాటరీతో పాలు చాలా ప్రత్యేకమైన 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. దీని వల్ల సులభంగా బ్యాటరీ ఫుల్‌ అవుతుంది. ఇవే కాకుండా ఇందులో మరెన్నో ప్రీమియం ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

CM Vijay Divorce Case: విజయ్ దళపతి విడాకులు క్యాన్సిల్.. భర్తతో కలిసుండేందుకు సంగీత అంగీకారం?

Hyderabad, Telangana:

CM Vijay Divorce News: తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ వ్యక్తిగత జీవితం గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్, ఆయన భార్య సంగీత విడిపోతున్నారని.. విడాకుల వరకు వెళ్లారంటూ ప్రచారం సాగింది. అయితే, తాజాగా తమిళనాట ఒక క్రేజీ వార్త హల్‌చల్ చేస్తోంది. విజయ్, సంగీత దంపతులు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి మళ్లీ ఒక్కటయ్యారనేది ఇప్పుడు వైరల్‌గా మారింది.

గతంలో విజయ్ పాల్గొన్న పలు కీలకమైన సినిమా ఈవెంట్స్, రాజకీయ బహిరంగ సభల్లో సంగీత ఎక్కడా కనిపించలేదు. దీనితో వీరిద్దరి మధ్య తీవ్ర మనస్పర్థలు ఉన్నాయని, విడాకుల కేసు కోర్టు వరకు వెళ్లిందని పెద్ద ఎత్తున వదంతులు వచ్చాయి. నటి త్రిషతో విజయ్‌కు ఉన్న సాన్నిహిత్యమే దీనికి కారణమంటూ నెట్టింట ప్రచారం కూడా జరిగింది. అయితే, వాటన్నింటికీ చెక్ పెడుతూ.. ఈ జంట తిరిగి కలిసి జీవించడానికి అంగీకరించిందనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.

విజయ్ దంపతులు మళ్లీ కలవడానికి వారి కుటుంబ సభ్యులే కీలక పాత్ర పోషించారని సమాచారం. ముఖ్యంగా విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ చొరవ తీసుకుని, ఇరుపక్షాలతో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సంగీత లండన్ నుండి చెన్నైకి తిరిగి వచ్చారని, ఈ జంట ప్రస్తుతం కలిసి సమయం గడుపుతున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్.

విజయ్, సంగీత మళ్లీ కలిశారనే వార్తలపై ఇప్పటివరకు సదరు నటుడి నుండి కానీ, ఆయన కుటుంబ సభ్యుల నుండి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇవన్నీ కేవలం సోషల్ మీడియా, అంతర్గత వర్గాల నుండి వస్తున్న ఊహాగానాలు మాత్రమే.

ఫ్యాన్స్ సంబరాలు
విజయ్ కేవలం నటుడిగానే కాకుండా రాజకీయాల్లోనూ చురుగ్గా రాణిస్తూ, ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ తరుణంలో ఆయన వ్యక్తిగత జీవితం మళ్లీ గాడిన పడిందనే వార్త వినడంతో తలపతి అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు. "మా అన్న కుటుంబం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Also Read: 'పెద్ది' సినిమాకు జాన్వీ ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా? ఒక్క సినిమాకే హీరోకి పోటీగా!

Also Read: బిగ్‌బాస్ హౌస్‌లోకి కాంట్రవర్సీ సింగర్..వివాదాస్పద సెలబ్రిటీలకు గాలం వేస్తున్నారు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Gold Price Crash: భారీగా పడిపోతున్న బంగారం ధరలు..ఇదే జరిగితే గోల్డ్ రేటు కుప్పకూలిపోవడం ఖాయం

Hyderabad, Telangana:

Gold Price Crash News: బంగారం కొనుగోలుదారులకు బులియన్ మార్కెట్ షాకిస్తోంది. గత రెండు వారాలుగా పసిడి, వెండి ధరలు భారీగా క్రాష్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, డాలర్ పరుగు, అమ్మకాల ఒత్తిడి కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఏకంగా ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీని ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా బలంగా పడింది. అయితే ఈ తగ్గుదల ఇలాగే కొనసాగుతుందా? రానున్న రోజుల్లో పసిడి రేట్లు మరింత పతనమవుతాయా? అనే విషయాలపై మార్కెట్ నిపుణుల నుండి ఆసక్తికర అంచనాలు వెలువడుతున్నాయి.

ధరలు కుప్పకూలడానికి కారణాలు..
బంగారం ధరలు కుప్పకూలడం వెనుక అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా యూఎస్ డాలర్ విలువ పెరగడంతో ఇతర కరెన్సీలు ఉపయోగించే దేశాలకు బంగారం కొనుగోలు భారం పెరిగింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ తగ్గింది.

అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను ఎక్కువ కాలం పాటు అధికంగానే ఉంచే అవకాశం ఉందనే వార్తలు ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి. సాధారణంగా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే స్థిరమైన ఆదాయం లేని బంగారం వైపు పెట్టుబడులు తగ్గుతాయి. వచ్చే డిసెంబర్ నాటికి అమెరికా వడ్డీ రేట్లు పెరిగే అవకాశం 70 శాతానికి పైగా ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) ముప్పు మరింత ఎక్కువైంది. ఇది ఆర్థిక మార్కెట్లలో తీవ్ర అనిశ్చితికి దారితీసింది.

కేవలం ఆర్థిక పరమైన అంశాలే కాకుండా, పశ్చిమ ఆసియాలో మళ్లీ మొదలైన యుద్ధ మేఘాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. హోర్ముజ్ జలసంధిలో అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్ కూల్చివేసిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత, అమెరికా ఇరాన్‌పై దాడులకు దిగింది. దీనికి ప్రతీకారంగా జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై, గల్ఫ్‌లోని మరో 21 ప్రాంతాలపై దాడులు లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ ఆందోళనకర పరిస్థితులు పెట్టుబడిదారులు తమ ఆర్థిక వ్యూహాలను, వడ్డీ రేట్ల అంచనాలను పునఃపరిశీలించేలా చేస్తున్నాయి.

ప్రస్తుతం అంతర్జాతీయ గోల్డ్ ఎనలిస్టులు ఒక కీలకమైన మార్క్‌పై కన్నేశారు. వారి విశ్లేషణ ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 4,100 డాలర్ల స్థాయిని తాకవచ్చనే అంచనాలు వేస్తున్నారు. ఒకవేళ ధరలు ఈ మార్క్ కంటే దిగువకు పడిపోతే, పసిడి మార్కెట్‌లో సుదీర్ఘ కాలం పాటు భారీ పతనం కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికైతే మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున, రాబోయే కొద్ది రోజుల్లో బంగారం ధరలు మరికొంత మేర తగ్గే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి.

Also Read: భారీగా పడిపోయిన బంగారం ధరలు..రూ.3,000 తగ్గిన గోల్డ్ రేట్..10గ్రా. ఎంతంటే?

Also Read: వెండి కొనే వారికి బ్యాడ్‌న్యూస్..భారీగా పెరగనున్న వెండి ధరలు..కేంద్రం ఝలక్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Kanchrapara School News: ఆ స్కూల్‌లో రూ.1.77 కోట్లు అక్రమ నగదు..విద్యార్థినుల సిక్ రూమ్‌లో కండోమ్ ప్యాకెట్లు!

Kanchrapara, West Bengal:

Kanchrapara School Cash Seized: విద్యా బుద్ధులు నేర్పాల్సిన పాఠశాలలో కోటి రూపాయల అక్రమ నగదు, కండోమ్ ప్యాకెట్లు దొరికాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలోని సురేంద్రనాథ్ కళాశాల విద్యార్థి సంఘం గదిలో భారీ మొత్తంలో నగదుతో పాటు ఆయుధాలు, గర్భనిరోధక ప్యాకెట్లు లభించిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

బుధవారం అర్ధరాత్రి నిర్వహించిన సోదాల్లో కాంచరపారాలో ఉన్న ఒక ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో రూ.1 కోటికి పైగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం 4 గంటల సమయానికి లెక్కించిన మొత్తం సుమారు రూ. 1.77 కోట్లుగా తేలింది. పాఠశాలలోని విద్యార్థినుల సిక్ రూమ్ (అనారోగ్యంతో ఉన్న విద్యార్థుల కోసం కేటాయించిన గది)లోని ఒక అల్మారాలో కండోమ్ ప్యాకెట్లు కూడా దొరికాయని సమాచారం అందుతోంది.

సిక్ రూమ్‌లో కండోమ్ ప్యాకెట్లు..
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బిజ్‌పూర్ ఎమ్మెల్యే సుదీప్త దాస్ ఇటీవల తన నియోజకవర్గంలోని విద్యాసంస్థల నుండి సమాచార సేకరణ ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలో సదరు పాఠశాలకు సంబంధించిన సమాచారం వారికి అందడంతో.. ఎమ్మెల్యే స్వయంగా అక్కడికి వెళ్లి పోలీసులకు సమాచారం అందించారు.

కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు పాఠశాలకు చేరుకుని సోదాలు ప్రారంభించారు. స్వాధీనం చేసుకున్న నగదు మొత్తాన్ని నిర్ధారించడానికి రాత్రికి రాత్రే అనేక నగదు లెక్కింపు యంత్రాలను అక్కడికి తీసుకువచ్చారు. ఉదయం 4:30 గంటల వరకు లెక్కింపు కొనసాగిందని, మొత్తం నగదు దాదాపు రూ. 1.77 కోట్లుగా తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ ఘటనపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే సుదీప్త దాస్, రాష్ట్రంలో గతంలో జరిగిన అవినీతి సంబంధిత దర్యాప్తుల్లో బయటపడిన నగదు మాదిరిగానే ఈ డబ్బు కూడా ఉందని ఆరోపించారు. పాఠశాల ఆవరణలో ఇంత భారీ మొత్తంలో నగదు ఉండటం తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోందని, ఇది అక్రమాలకు సంకేతం కావచ్చని ఆయన పేర్కొన్నారు.

ప్రిన్సిపాల్ వాదన ఇదే!
ఆ డబ్బు పాఠశాలకు చెందినది కాదని, కాంచరపారా మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కమల్ అధికారి, సుబోధ్ అధికారి, సీనియర్ టీఎంసీ (TMC) నాయకుడు పార్థ భౌమిక్‌లతో సంబంధం ఉన్న లెక్కల్లో చూపని నగదు అని ఎమ్మెల్యే ఆరోపించారు. పాఠశాల ఆవరణలో ఈ డబ్బును దాచి ఉంచారని ఆయన ఆరోపించారు. అయితే, ఈ వార్త ప్రచురించే సమయానికి కమల్ అధికారి, సుబోధ్ అధికారి లేదా పార్థ భౌమిక్ నుండి ఎటువంటి స్పందన లభించలేదు. విచారణ నిమిత్తం అకౌంట్స్ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

ఇదిలా ఉండగా, పాఠశాల ప్రిన్సిపాల్ బికాష్ చంద్ర పాల్ తాము ఎలాంటి తప్పు చేయలేదని ఖండించారు. స్వాధీనం చేసుకున్న నగదు గత కొన్ని నెలలుగా వసూలు చేసిన అడ్మిషన్ ఫీజులని ఆయన పేర్కొన్నారు. ఆ డబ్బు అకౌంట్స్ విభాగానికి చెందినదని, బ్యాంకులో జమ చేయడానికి వేచి ఉందని ఆయన తెలిపారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి గదిలోని అల్మారాలో కండోమ్ ప్యాకెట్లు ఎలా చేరాయో తనకు తెలియదని కూడా ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.

ఆ డబ్బు మూలం గురించి, పాఠశాల ప్రాంగణంలో అంత పెద్ద మొత్తంలో నగదును ఎలా నిల్వ చేశారనే దానిపై తాము దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వారి వాంగ్మూలాల్లో పొంతన లేని విషయాలు వెలుగులోకి రావడంతో, పాఠశాల క్యాషియర్ అభిక్ నాథ్, అసిస్టెంట్ అకౌంటెంట్ సయన్ ఘోష్‌లను విచారణ నిమిత్తం బిజ్‌పూర్ పోలీస్ స్టేషన్ అదుపులోకి తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి.

Also Read: విద్యార్థులకు గుడ్‌న్యూస్..జూన్ 30 వరకు సెలవులు పొడిగింపు..ఇక పండగే పండగ!

Also REad: సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం బిగ్‌షాక్.. నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

India Condemns US Attack: అమెరికా దాడిలో ముగ్గురు భారతీయులు మృతి..అమెరికాపై మండిపడ్డ భారత విదేశాంగ శాఖ!

New Delhi, Delhi:

India Condemns US Attack News: పశ్చిమాసియాలోని ఒమన్ గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్‌పై అమెరికా దళాలు జరిపిన ఘోర దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను భారతదేశం తీవ్రంగా ఖండించింది.

అసలేం జరిగింది?
యూఎస్ సెంట్రల్ కమాండ్ కథనం ప్రకారం.. ఒమన్ తీరంలో ఇరాన్ నుండి చమురును రవాణా చేస్తున్న పలావు జెండా కలిగిన 'MT సెట్టెబెల్లో' అనే చమురు ట్యాంకర్‌ను అమెరికా దళాలు అడ్డుకున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న దిగ్బంధనం నేపథ్యంలో, యూఎస్ దళాలు పదేపదే ఇచ్చిన ఆదేశాలను, హెచ్చరికలను ఆ ఓడ పెడచెవిన పెట్టడంతోనే ఈ దాడి చేయాల్సి వచ్చిందని అమెరికా సైన్యం వాదిస్తోంది.ఈ నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 24 మంది భారతీయులు, ఇద్దరు పాకిస్థానీలు, ఒక ఉక్రేనియన్, ఒక రష్యన్ ఉన్నారు.

ఈ దాడిలో మొదట గల్లంతైనట్లు భావించిన ముగ్గురు భారతీయ నావికులు మరణించినట్లు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ధృవీకరించారు. ఇది అత్యంత 'విషాదకరమైన' నష్టమని ఆయన పేర్కొన్నారు. మరణించిన నావికులను క్రింది విధంగా గుర్తించారు. ఆదిత్య శర్మ (డెక్ క్యాడెట్), శివానంద్ చౌరాసియా (ఇంజన్ ఫిట్టర్), పట్నాల సురేష్‌ (చీఫ్ ఇంజనీర్) మిగిలిన 21 మంది భారతీయ నావికులను సురక్షితంగా రక్షించి తరలించారు.

అమెరికాపై భారత్ తీవ్ర ఆగ్రహం..
ఈ ఘోర దాడిపై భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. న్యూఢిల్లీలోని యూఎస్ ఛార్జ్ డి అఫైర్స్ (CDA)ను విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి పిలిపించి, గట్టిగా నిరసన తెలియజేస్తూ 'డిమార్చే' జారీ చేసింది.

"మేము మా నావికుల సంక్షేమానికి, శ్రేయస్సుకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తాము. ఒమన్ తీరంలో జరిగిన దాడిలో ముగ్గురు భారతీయ పౌరులను కోల్పోవడం అత్యంత బాధాకరం. మా తీవ్ర నిరసనను అమెరికా గమనిస్తుందని ఆశిస్తున్నాము. ఈ ప్రాంతంలో నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడులు ఆగిపోవాలి. చర్చలు, దౌత్యం ద్వారానే శాంతి, స్థిరత్వం సాధ్యమవుతాయి" అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.

షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 8 (సోమవారం) నుండి భారతీయ నావికులున్న మూడు నౌకలపై దాడులు లేదా ప్రమాదాలు జరిగాయి. ప్రస్తుతం వ్యూహాత్మక ప్రాంతమైన హోర్ముజ్ జలసంధిలో భారత జెండా కలిగిన 13 నౌకలు ఉన్నాయని, వాటిలో 562 మంది భారతీయ నావికులు విధులు నిర్వహిస్తున్నారని ముఖేష్ మంగళ్ వెల్లడించారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న అంతర్జాతీయ సంఘర్షణల కారణంగా అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో ప్రయాణిస్తున్న భారతీయ పౌరుల భద్రత ఇప్పుడు తీవ్ర ఆందోళనకరంగా మారింది.

Also Read: భారత నౌకపై అమెరికా సైన్యం దాడి..ముగ్గురు భారతీయులు దుర్మరణం..ఏం జరుగుతోంది?

Also Read: విద్యార్థులకు గుడ్‌న్యూస్..జూన్ 30 వరకు సెలవులు పొడిగింపు..ఇక పండగే పండగ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Peddapalli: రబీ సీజన్‌లో రికార్డు సృష్టించిన పెద్దపల్లి.. 4.29 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం సేకరణ..

Hyderabad, Telangana:

Peddapalli Paddy Procurement: పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా.. రికార్డు స్థాయిలో ధాన్యంతో పాటు మొక్కజొన్న కొనుగోళ్లను పూర్తి చేసిందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందనడానికి.. ఈ రికార్డు స్థాయి కొనుగోళ్లే నిదర్శనమన్నారు. జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రికార్డు స్థాయిలో సేకరణ..
ఈ రబీ సీజన్‌లో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మొత్తం 334 కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో 4 లక్షల 29 వేల 921 మెట్రిక్ టన్ల వరి ధాన్యాన్ని విజయవంతంగా సేకరించారని ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు ఎలాంటి ఆలస్యం లేకుండా.. దళారీల ప్రమేయం లేకుండా దాదాపు 1,018 కోట్ల 65 లక్షల రూపాయలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేశామని వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే.. ఈసారి సుమారు 29 వేల మెట్రిక్ టన్ల ధాన్యం అదనంగా సేకరించామని తెలిపారు.. దీనికి తోడు మార్కెట్ యార్డుల ద్వారా మరో 25 వేల మెట్రిక్ టన్ల మొక్కజొన్నను కూడా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచామన్నారు. ఇటీవలే కురిసిన అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసినా.. రంగు మారినా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని.. చివరి గింజ వరకు కొనుగోలు చేసిందని ఆయన వెల్లడించారు..

రైతుల నిల్వ అవసరాల కోసం..  పెద్దపల్లి నియోజకవర్గంలో 1.70 లక్షల మెట్రిక్ టన్ల సామర్థ్యం గల గోదాముల నిర్మించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలు సిద్ధం చేశామని విజయరమణారావు తెలిపారు. ఇందులో భాగంగా ఎలిగేడు మండలం లాలపల్లిలో 20 వేల మెట్రిక్ టన్ల గోదాము పనులు ఇప్పటికే మొదలయ్యాయని... రాబోయే రోజుల్లో ఓదెల, శ్రీరాంపూర్, పెద్దపల్లి మండలాల్లో టెండర్లు పూర్తి చేసి పనులు మొదలుపెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

బీఆర్ఎస్, బీజేపీలపై ఆగ్రహం..
ఇదే సమయంలో విపక్షాల తీరుపై ప్రభుత్వ విప్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. పెద్దపల్లికి కాలేశ్వరం.. నీటి వల్ల పంటలు పండలేదని.. నెహ్రూ, ఇందిరా గాంధీల కాలం నాటి ఎస్ఆర్ఎస్పీ (SRSP) కెనాల్ నీటి వల్లే ఇక్కడి రైతులకు సాగునీరు అందిందని వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో తీవ్ర లోపాలతో కట్టి.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని... అందుకే ఆ బ్యారేజీలు కుంగిపోయాయని ఆరోపించారు. ప్రాజెక్టులపై అవగాహనతో మాట్లాడాలని.. సలహాలు ఇచ్చేందుకు మాజీ సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీకి రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించినా ప్రతిపక్షాలు భయపడి ముందుకు రావడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

Pawan Kalyan Allu Arjun: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో అల్లు అర్జున్ సీక్రెట్ మీటింగ్..ఏం జరిగిదంటే?

Hyderabad, Telangana:

Pawan Kalyan Allu Arjun Meeting: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిశారు. బుధవారం (జూన్ 10) రాత్రి పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లిన బన్నీ, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇటీవలే పవన్ కల్యాణ్‌కు సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. వైద్యుల సూచన మేరకు సర్జరీ తర్వాత రెండు వారాల పాటు ఆయన విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాలకు తప్ప ఆయన బయటకు రావడం లేదు. పవన్ కల్యాణ్ క్రమంగా కోలుకుంటున్న నేపథ్యంలో, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనను పరామర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ స్వయంగా పవన్ ఇంటికి వెళ్లి, ఆయన హెల్త్ కండిషన్‌తో పాటు కుటుంబ విషయాలను కూడా ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు.

ఫ్యాన్ వార్స్‌కు చెక్ పడినట్లేనా?
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో 'మెగా వర్సెస్ అల్లు' అభిమానుల మధ్య తీవ్రమైన వార్ నడుస్తోంది. రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయంటూ నెట్టింట ప్రచారం జరుగుతున్న తరుణంలో, అల్లు అర్జున్ తాజా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు కుటుంబాల మధ్య ఎలాంటి కోల్డ్ వార్ లేదని, ఇవన్నీ కేవలం పుకార్లేనని సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు.

మెగా, అల్లు హీరోలు ఇప్పటికీ ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు. ఒకరి సినిమాలను మరొకరు సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ స్వయంగా పవన్‌ను కలవడంతో.. ఇప్పటికైనా ఈ సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్‌కు ఎండ్ కార్డ్ పడుతుందని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్స్ తమ తమ రంగాల్లో బిజీగా గడుపుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హీరోగా తన సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి.. పూర్తిస్థాయిలో రాష్ట్ర పరిపాలనపై దృష్టి పెట్టారు. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. అట్లీ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ (సుమారు రూ. 800 కోట్లు) చిత్రం 'రాకా' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. దీనితో పాటు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నారు.

Also Read: మెగాస్టార్ సినిమాలో కన్నడ బ్యూటీకి ఛాన్స్..బాలయ్య హీరోయిన్‌ను పక్కకి నెట్టిన బ్యూటీ!

Also Read: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది! ఈసారి 'దశావతారమే' అంటూ నాగ్ వీడియో రిలీజ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Venomous Snake Video: బాబోయ్.. షూలో ప్రమాదకరమైన కాలనాగు.. వీడియో ఇదే..

Hyderabad, Telangana:

 Venomous Snake Video Watch Now: ప్రకృతిలో జీవించే వన్యప్రాణులు, ముఖ్యంగా పాములు మన నివాస ప్రాంతాల్లోకి సంచారం చేసినప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో.. ఊహించుకుంటేనే కొంత భయం కలుగుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేసే ఒక అత్యంత అరుదైన వీడియో వైరల్‌ అవుతోంది. మనం నిత్యం ధరించే బూట్లలో పాములు దూరి కూర్చుంటే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.. ఈ వీడియో.. ఒక నల్లటి షూలో నక్కి ఉన్న అత్యంత ప్రమాదకరమైన పాము.. నెమ్మదిగా బయటకు వచ్చి.. పడగవిప్పిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. అయితే, ఈ షాకింగ్‌కి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఇంటర్నెట్‌లో రోజుకు లక్షలాది వీడియోలు అప్‌లోడ్ అవుతూ ఉంటాయి.. వాటిలో కొన్ని మాత్రమే నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తాయి. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియో కేవలం ఆకర్షించడమే కాదు.. చూసే ప్రతి ఒక్కరి గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తోంది.. ఈ వీడియోలో ఒక నల్లటి షూ కనిపిస్తుంది. మొదటి చూపులో అందులో ఏముందో ఎవరికీ అర్థం కాదు.. కానీ, కొద్ది సెకన్ల వ్యవధిలోనే ఆ షూ లోపలి భాగం నుంచి ఒక నల్లటి ఆకారం కదలడం మొదలవుతుంది. దీనిని క్లియర్‌గా గమనిస్తే.. అది ఒక అత్యంత విషపూరితమైన పాము అని స్పష్టమవుతుంది. షూ లోపల చాలా హాయిగా.. ఎవరికీ కనిపించకుండా చుట్టలు చుట్టుకుని కూర్చున్న ఆ పాము, బయట జరుగుతున్న కదలికలను గమనించి నెమ్మదిగా తన తలను పైకి లేపింది.

 
 
 
 
 

షూ నుంచి బయటకు వచ్చి.. 
అయితే, షూ లోపల ఉన్న పాము కేవలం తల అటుఇటు కదిలించడమే కాకుండా.. నెమ్మదిగా తన శరీరాన్ని బయటకు లాగడం ప్రారంభించింది. సగం శరీరాన్ని పైకి లేపి.. తన పడగను విప్పి భీకరంగా బుసలు కొట్టడం మొదలు పెట్టింది.. ఆ సమయంలో అక్కడ ఉన్నవారు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. లేదా ఆ షూలో కాలు పెట్టేందుకు ప్రయత్నించి ఉన్నా.. తప్పకుండా కాటేసి ఉండేది.. అయితే, పాము పడగవిప్పి కెమెరా వైపు చూస్తున్న దృశ్యం నెటిజన్ల మైండ్ బ్లాక్ చేస్తోంది.

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

ఊహించని స్థాయిలో వైరల్.. 
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ రీల్‌కు ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్‌బుక్‌లలో ఊహించని స్పందన లభిస్తోంది. ఈ వీడియో చూసిన చాలా మంది ఇకపై నేను షూస్ వేసుకునే ముందు వందసార్లు చెక్ చేసుకుంటాను బాబోయ్.. అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ఇది కేవలం వీడియో కాదు.. మన ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక హెచ్చరిక.. అని మరొకరు కామెంట్లు చేస్తున్నారు. ఇలా చాలా మంది సోషల్ మీడియా వినియోగదారలు కామెంట్స్‌ చేస్తూ వస్తున్నారు. 

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

  

0
0
Report

Indian Sailors Died: భారత నౌకపై అమెరికా సైన్యం దాడి..ముగ్గురు భారతీయులు దుర్మరణం..ఏం జరుగుతోంది?

Dibab, Muscat Governorate:

Indian Sailors Died In Oman: ఒమన్ తీరంలోని భారత నౌకపై అమెరికా దాడి చేసింది. ఈ దాడిపో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇరాన్ చమురుపై కొనసాగుతున్న దిగ్బంధనాన్ని ఉల్లంఘించిందనే ఆరోపణలతో, ఒమన్ తీరంలో పలావు జెండా కలిగిన చమురు ట్యాంకర్‌పై అమెరికా సెంట్రల్ కమాండ్ అత్యంత కచ్చితమైన ఆయుధాలతో దాడి చేయడంతో ఈ ప్రాణనష్టం జరిగింది.

ఈ వారం ప్రారంభంలో ఒమన్ తీరంలో అమెరికా దళాలు ఒక నౌకపై దాడి చేయడంతో, మొదట గల్లంతైనట్లుగా భావించిన ముగ్గురు భారతీయ నావికులు మరణించారని షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. దీనిని ఒక "విషాదకరమైన" నష్టంగా అభివర్ణిస్తూ, గల్లంతైన ముగ్గురు నావికుల మృతదేహాలను వెలికితీసినట్లు మంత్రి చెప్పారు.

ఒమన్ గల్ఫ్‌లో అమెరికా సైన్యం దాడికి గురైనప్పుడు, పలావు జెండా కలిగిన 'సెట్టెబెల్లో' అనే చమురు ట్యాంకర్‌లో 24 మంది భారతీయులు, నలుగురు విదేశీయులతో సహా మొత్తం 28 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఇద్దరు పాకిస్థానీలు, ఒక ఉక్రేనియన్, ఒక రష్యన్ ఉన్నారు. తమ ఆదేశాలను పాటించడంలో విఫలమైందని, ఇరాన్ నుండి చమురును తీసుకువస్తోందని ఆరోపిస్తూ ఆ నౌకపై దాడి చేసినట్లు అమెరికా సైన్యం తెలిపింది.

ఓడ నుంచి 21 మంది భారతీయ నావికులను రక్షించినప్పటికీ.. డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ అనే ముగ్గురు నావికులు గల్లంతయ్యారని తొలుత వార్తలు వచ్చాయి.

"ఇది మన సముద్రయాన కుటుంబానికి తీరని లోటు. ఈ కష్ట సమయంలో మోదీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తుంది. వారి కుటుంబ సభ్యులకు మద్దతు ఇవ్వడానికి పూర్తిగా కట్టుబడి ఉంది. దాడి నుంచి బయటపడిన సిబ్బందితో పాటు మృతదేహాలను వెంటనే స్వదేశానికి రప్పించాలని.. మృతుల పార్థివ దేహాలను అంత్యక్రియల కోసం త్వరతగతిన తీసుకురావాలని అధికారులను ఆదేశించాను" అని షిప్పింగ్ మంత్రి సరస్బానంద సోనోవాల్ తెలిపారు. 

దాడిపై భారత్ ఖండన..
నౌకలోని మిగిలిన నావికులతో స్థిరమైన నెట్‌వర్క్ కనెక్షన్‌ను ఏర్పాటు చేయడంలో నౌక యాజమాన్య సంస్థ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇరాన్ చమురుపై కొనసాగుతున్న దిగ్బంధనాన్ని ఉల్లంఘించిందనే ఆరోపణలతో, ఒమన్ తీరంలో ఒక చమురు ట్యాంకర్‌పై అమెరికా సెంట్రల్ కమాండ్ దళాలు అత్యంత కచ్చితమైన క్షిపణులతో దాడి చేయడంతో ఈ ప్రాణనష్టం జరిగింది. హోర్ముజ్‌ను దాటేందుకు ఆ నౌక ప్రయత్నించగా, అమెరికా నౌకాదళం జరిపిన దాడిలో 24 మంది భారతీయులు మరణించారని భారత్ ఈ ఘటనను ఖండించింది.

భారత్ నిరసన..
ఈ దాడిపై "తీవ్ర నిరసన" తెలియజేయడానికి భారత్, న్యూఢిల్లీలోని వాషింగ్టన్ రాయబార కార్యాలయ అధికారుల్ని పిలిపించిందని ఒక సీనియర్ భారత ప్రభుత్వ అధికారి ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు. ప్రపంచ ఇంధన సరఫరాలకు కీలకమైన జలమార్గమైన గల్ఫ్‌లోని హోర్ముజ్ జలసంధి, ఫిబ్రవరి చివరిలో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ప్రారంభమైన మధ్యప్రాచ్య యుద్ధం మొదలైనప్పటి నుండి దాదాపు పూర్తిగా దిగ్బంధించారు.

ఇటీవలి వారాలుగా అమల్లో ఉన్న కాల్పుల విరమణ సమయంలో జరిగిన చర్చలు, ఈ జలసంధిని తిరిగి తెరిచే ఒప్పందాన్ని కుదర్చడంలో విఫలమయ్యాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ ఈ నౌకా రవాణా మార్గాన్ని దిగ్బంధించగా, ఏప్రిల్ నుండి అమెరికా కూడా దానికి పోటీగా తనదైన దిగ్బంధనాన్ని అమలు చేస్తోంది.

Also Read: మొసలి కడుపులో బంగారపు ఉంగరాలు, 6 జతల

ALso Read: మరికొద్ది రోజుల్లో ప్రపంచంలో ప్రళయం..ఒడ్డుకు చేరిన 'దేవుని

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Python Kiss Video: పాము ముక్కును కరిచేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో చూడండి!

Hyderabad, Telangana:

Python Kiss Gone Wrong Viral Video Watch Now: నేటి డిజిటల్‌ యుగంలో లైకులతో పాటు వ్యూస్‌ కోసం యువత ఎలాంటి సాహసాలకైనా వెనక అడుగు వేయడం లేదు.. కొంతమంది కొన్ని సందర్భాల్లో పిచ్చి చేష్టలు చేస్తూ.. ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో హల్చల్‌ చేస్తున్న ఒక వీడియో నెటిజన్లను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఒక యువతి అత్యంత ప్రమాదకరమైన పాముతో పరాచకాలు ఆడబోయి.. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

అసలేం జరిగిందంటే..?
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక యువతి చేతిలో అత్యంత పొడవైన ప్రమాదకరమైన పామును పట్టుకుని కనిపిస్తుంది. సాధారణంగా పాములను చూస్తేనే ఆమడదూరం పరుగెత్తే.. ఈ రోజుల్లో.. ఆమె మాత్రం దాన్ని చాలా సాధారణంగా చేతితో పట్టుకుని ఉండడం మీరు చూడొచ్చు. అంతటితో ఆగకుండా.. కెమెరా వైపు చూస్తూ.. ఆ పాముకు ముద్దు పెట్టేందుకు ప్రయత్నించింది. ఆమె తన ముఖాన్ని పాము నోటి దగ్గరకు తీసుకుని రావడంతో.. ఆ మరుక్షణమే ఊహించని ప్రమాదం జరిగింది.

 
 
 
 
 

యువతి ప్రవర్తనతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ పాము.. క్షణాల వ్యవధిలో మెరుపు వేగంతో ఆమె ముఖంపై దాడి చేసింది.. నేరుగా ఆమె ముక్కు భాగాన్ని నోటితో గట్టిగా కరిచేసింది.. ఊహించని ఈ దాడితో సదరు యువతి త్రీవ భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. నొప్పితో విలవిలలాడుతూ.. ఆ పామును అక్కడే విసిరేసి.. ముక్కు పట్టుకుని అక్కడి నుంచి పరుగులు తీయడం మీరు క్లియర్‌గా వీడియోలో చూడొచ్చు.

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

నెటిజన్ల ఆగ్రహం..
ఈ వీడియోను సోషల్ మీడియా  ప్లాట్‌ఫారమ్స్‌లో అప్‌లోడ్ అయిన కొద్ధిరోజులకే లక్షలాది వ్యూస్‌తో పాటు వేలాది కామెంట్లతో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. ఇది కేవలం పిచ్చితనమే.. ప్రమాదకరమైన పాములతో ఇలాంటి ఆటలు అస్సలు ఆడొద్దని.. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్స్‌ చేస్తూ వస్తున్నాయి. అలాగే లైకుల కోసం ప్రాణాలను పణంగా పెట్టకండి.. అని మరికొందరు హెచ్చరిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఆ పాము విషపూరితమైనది కాకపోవడం వల్లే ఆమె బతికిపోయి ఉంటుందని.. లేకపోతే.. ప్రాణాలు పోయేవని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలిదు కానీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం వైరల్‌గా మారింది.

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

 

 

0
0
Report

Honor X80 Pro Max: మొబైల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సంచలనం.. 11,000mAh బ్యాటరీతో Honor X80 Pro Max లాంచ్‌?

Hyderabad, Telangana:

Honor X80 Pro Max with 11,000mAh Battery: ప్రస్తుతం వస్తున్న అన్ని బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌లో బ్యాటరీ లైఫ్ అనేది ఒక పెద్ద సవాలుగా మారింది. రోజుకు రెండుసార్లు ఛార్జింగ్ పెట్టుకునే రోజులకు చెక్ పెడుతూ.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ Honor సరికొత్త సంచలనానికి తెరలేపబోతున్నట్లు తెలుస్తోంది. చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ లీక్‌ చేసిన సమాచారం ప్రకారం.. హానర్ సంస్థ తన పాపులర్ ఎక్స్-సిరీస్‌లో అత్యంత పవర్‌ఫుల్ మోడల్ Honor X80 Pro Maxను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ ఏకంగా 11,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించబోతున్నట్లు తెలుస్తోంది.

ఒకసారి ఛార్జ్ చేస్తే మూడు రోజులు ఫిక్స్..
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న రెడ్‌మీతో పాటు షియోమి, హువావే వంటి దిగ్గజ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లలో గరిష్టంగా 5,000mAh నుంచి 6,000mAh బ్యాటరీలతో మాత్రమే విడుదల చేశాయి. కానీ హానర్ X80 ప్రో మాక్స్ వీటన్నింటికీ రెట్టింపు పవర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే లీక్‌ అయిన వివరాల ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్‌ను సాధారణగా వినియోగిస్తే దాదాపు 4 నుంచి 5 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంది. అలాగే ఇంత పెద్ద బ్యాటరీని సులభంగా ఛార్జ్‌ చేసేందుకు ఎంతో అద్భుతమైన 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. ఈ అద్భుతమైన బ్యాటరీ కేవలం గంటన్నర లోపే ఫుల్ ఛార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి..

అద్భుతమైన డిస్‌ప్లే.. 
కేవలం బ్యాటరీ మాత్రమే కాకుండా... ఈ స్మార్ట్‌ఫోన్‌ డిస్ల్పే కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ హానర్ X80 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్ 6.8 ఇంచుల ఫ్లాట్ అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లేను అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది అద్భుతమైన ఇది 2788×1280 పిక్సెల్స్ (1.5K) రిజల్యూషన్‌తో పాటు 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుందని లీక్‌ అయిన వివరాలు క్లియర్‌గా చెబుతున్నాయి. ఇది చాలా తక్కువ బెజెల్స్ (Narrow Bezels)తో పాటు గుండ్రటి మూలలతో (Rounded Corners) ఈ ఫోన్ ప్రీమియం ల్యాండ్‌స్కేప్ లుక్‌ను కలిగి ఉండబోతున్నట్లు లీక్‌ అయిన ఫోటోలు చెబుతున్నాయి.

పవర్‌ఫుల్ ప్రాసెసర్.. 
ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ వేగంగా ఉండేందుకు కంపెనీ ఇందులో ఎంతో శక్తివంతమైన క్వాల్కమ్ సంస్థకు చెందిన సరికొత్త స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 (Snapdragon 6 Gen 5) ప్రాసెసర్‌ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది 4nm ఆర్కిటెక్చర్‌పై పని చేస్తుంది. కాబట్టి గేమింగ్‌కు, మల్టీటాస్కింగ్‌కు అద్భుతంగా సూట్ అవుతుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. అలాగే వాటర్ రెసిస్టెన్స్, కింద పడినా పగలకుండా ఉండేందుకు ఇందులో కంపెనీ.. కంపెనీ డ్రాప్-రెసిస్టెంట్ సపోర్ట్‌ కూడా అందుబాటులో ఉంది. ఇందులో చాలా అద్బుతమైన ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ ఫీచర్ కూడా ఉంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

మార్కెట్లోకి విడుదల అప్పుడే?
ఈ హానర్‌కు సంబంధించిన బేస్‌ వేరియంట్‌ హానర్ X80 స్మార్ట్‌ఫోన్‌ 10,000mAh బ్యాటరీతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని కంపెనీ  జూన్ చివరి వారంలో లాంచ్ చేసే అవకాశం ఉందని లీక్‌ అయిన వివరాలు తెలుపుతున్నాయి. ఈ మొబైల్‌ సిరీస్‌కి సంబంధించిన ప్రో మాక్స్ మోడల్ ప్రస్తుతం డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉందని.. దీనిని త్వరలోనే కంపెనీ గ్లోబల్‌ మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి లాంచ్‌ అయితే, మొబైల్‌ మార్కెట్‌లో సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశాలు ఉన్నాయి. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Hyderabad Real Estate: కుత్బుల్లాపూర్, మేడ్చల్, శామీర్‌పేటలో ఇళ్ల స్థలాల రేట్లకు రెక్కలు.. ఇన్వెస్టర్లకు కోట్లు కురిపిస్తున్న భూములు..!!

BBhoomi1d ago
Secunderabad, Telangana:

Hyderabad Real Estate: హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతోంది. గతంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చుట్టూ తిరిగినటువంటి రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు క్రమంగా హైదరాబాద్లోని తూర్పు ప్రాంతాల్లో కూడా విస్తరించి ఇన్వెస్టర్లకు బంగారం లాంటి లాభాలను అందిస్తోంది. హైదరాబాద్ నగరానికి తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి మేడ్చల్ రంగారెడ్డి జిల్లా ప్రాంతం ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి ఒక బెస్ట్ డెస్టినేషన్ గా మారింది అని చెప్పవచ్చు. హైదరాబాద్ నగరానికి పడమర వైపు ఉన్నటువంటి కోకాపేట గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలు ఇప్పటికే దాదాపు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన నేపథ్యంలో, ఇప్పుడు విస్తరణ మొత్తం కూడా హైదరాబాద్ నగరానికి తూర్పు వైపు ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కేంద్రంగా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాను అభివృద్ధి చేసేందుకు అనేక పారిశ్రామిక క్లస్టర్లను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో పాటు భవిష్యత్తులో రాబోతున్న రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోంది. 

తాజాగా రాష్ట్ర ప్రభుత్వం భూముల ధరలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం ద్వారా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో భూముల ధరలు అమాంతం పెరిగాయి.  ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) కనెక్టివిటీ, వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాల కారణంగా ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు ఒక చక్కటి డెస్టినేషన్ గా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను భారీగా సవరించి అమల్లోకి తీసుకురావడంతో రిజిస్ట్రేషన్ ఖర్చులు గణనీయంగా పెరుగుతున్నాయి. 

క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ ధరలకు ప్రభుత్వ మార్కెట్ విలువలను దగ్గర చేయాలనే ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ శాఖ 25%, 50%, 75%, 100% శ్లాబుల ప్రకారం కొత్త ధరలను నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ ఫీజుల శాతంలో మార్పులు లేకపోయినా, భూముల విలువలు పెరగడంతో, కస్టమర్లు చెల్లించాల్సిన మొత్తం భారీగా పెరగనుంది.

కుత్బుల్లాపూర్, మేడ్చల్, శామీర్‌పేటలో భారీ పెంపు
మేడ్చల్ జిల్లాలో అత్యధిక డిమాండ్ ఉన్న కుత్బుల్లాపూర్, మేడ్చల్, శామీర్‌పేట సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో భూముల ధరలు అత్యధికంగా పెరిగాయి. కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్, గాజులరామారం, సూరారం, కొంపల్లి ప్రాంతాల్లో మార్కెట్ విలువలు 50 శాతం నుంచి 100 శాతం వరకు పెరిగాయి. కొంపల్లి పరిసరాల్లో చదరపు గజం విలువ రూ.20,000 నుంచి రూ.25,000 వరకు చేరగా, చింతల్, గాజులరామారం ప్రాంతాల్లో రూ.15,000 నుంచి రూ.18,000 వరకు నమోదైంది.

మేడ్చల్ ఎస్‌ఆర్‌వో పరిధిలోని మేడ్చల్ టౌన్, అత్వెల్లి, గుండ్లపోచంపల్లి ప్రాంతాల్లో 75 శాతం నుంచి 100 శాతం వరకు పెంపు జరిగింది. జాతీయ రహదారి-44, ఓఆర్‌ఆర్ వెంబడి ఉన్న కమర్షియల్ స్థలాల ధరలు దాదాపు రెట్టింపు కాగా, ప్లాట్ల ధరలు చదరపు గజానికి రూ.18,000 నుంచి రూ.22,000కు పైగా నిర్ణయించారు.

శామీర్‌పేటలో రియల్ మార్కెట్ జోరు
ఓఆర్‌ఆర్ కనెక్టివిటీ, కొత్త విల్లా ప్రాజెక్టుల ప్రభావంతో శామీర్‌పేట, తూంకుంట, అలియాబాద్ ప్రాంతాల్లో వ్యవసాయ, నివాస భూముల విలువలు 75 శాతం నుంచి 100 శాతం వరకు పెరిగాయి. హెచ్‌ఎండీఏ పరిధిలోని వ్యవసాయ భూముల కనీస విలువను ఎకరాకు రూ.10 లక్షలుగా ప్రభుత్వం ఖరారు చేసింది. అభివృద్ధి, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుంటే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రాష్ట్రంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న రియల్ ఎస్టేట్ హబ్‌గా కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read:  ఉద్యోగులకు అలర్ట్.. మీ అకౌంట్‌లో PF Interest ఇంకా పడలేదా? అసలు కారణం ఇదే..!!

Also Read: LPG Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. మళ్లీ పెరిగిన వంటగ్యాస్

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top