icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

AP MLC Governor Quota: ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఖరారు.. సీనియర్ నేతతో పాటు సాధారణ మహిళకు అవకాశం!

Velgapudi, Andhra Pradesh:

AP MLC Governor Quota Candidates: ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో ఆసక్తికరంగా మారిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక ఒక కొలిక్కి వచ్చింది. వైసీపీ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన పండుల రవీంద్రబాబు, జకియా ఖానంల పదవీ కాలం ముగియడంతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. ఈ నేపథ్యంలో సీనియర్ నాయకులతో పాటు సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఇద్దరి పేర్లను ఖరారు చేశారు.

వర్ల రామయ్యకు దక్కిన అవకాశం
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌గా సుదీర్ఘకాలం పార్టీకి సేవలందించిన సీనియర్ నేత వర్ల రామయ్య ఎట్టకేలకు చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం దక్కించుకున్నారు. గడచిన కాలంలో రాజ్యసభ రేసులో పలుమార్లు ఆయన పేరు పరిశీలనలోకి వచ్చినప్పటికీ చివరి నిమిషంలో అవకాశాలు చేజారాయి. తాజాగా ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఖరారు కాగా, భవిష్యత్తులో శాసనమండలి ఛైర్మన్ పదవి కూడా దక్కే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

సాధారణ మహిళకు ఛాన్స్
ఈ ఇద్దరు అభ్యర్థుల ఎంపికలో ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ ఎస్సీ నేత వర్ల రామయ్యకు ఒక స్థానం కేటాయించారు. అనూహ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన బీసీ వర్గ మహిళ, అనంతపురం లోక్‌సభ నియోజకవర్గ అంగన్‌వాడీ సంఘం అధ్యక్షురాలు దళవాయి రమాదేవి పేరును ఖరారు చేసి సంచలనం సృష్టించారు.

ఎన్నికల సమయంలో టికెట్లు దక్కని పలువురు సీనియర్లు ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశపడినప్పటికీ, ప్రభుత్వం మాత్రం ఒక సీనియర్ నేతతో పాటు క్రిందిస్థాయి నుంచి కష్టపడిన ఒక సాధారణ మహిళకు ప్రాధాన్యత కల్పించింది. ఎస్సీ, బీసీ వర్గాలకు సముచిత స్థానం కల్పించిన ఈ ఇద్దరి పేర్లను ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.

Also Read: శ్రావణ మాసం ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన చికెన్, కోడిగుడ్ల ధరలు..

ALso Read: ఏపీలో దారుణం.. భర్తను గొంతుకోసి చంపిన భార్య.. అనుమానంతో చంపి తల వద్ద దీపం పెట్టింది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Bihar Stampede: బీహార్‌లో ఘోర ప్రమాదం..ప్రముఖ ఆలయంలో తొక్కిసలాట..ఏడుగురు మహిళలు దుర్మరణం!

Balgudar, Bihar:

Bihar Stampede Today: భారీగా తరలివచ్చిన భక్తుల రద్దీతో బీహార్‌లోని ప్రసిద్ధ లఖిసరాయ్ అశోక్‌ధామ్ ఆలయం వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పవిత్ర శ్రావణ మాసోత్సవాల సందర్భంగా ఆలయంలో పూజలు చేసేందుకు వచ్చిన భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాటలో కనీసం ఏడుగురు మహిళలు దుర్మరణం చెందినట్లు సమాచారం అందుతోంది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఘటనకు అసలు కారణం ఇదే..
శ్రావణ మాసం కావడంతో సోమవారం తెల్లవారుజామున అశోక్‌ధామ్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అదే సమయంలో రెండు రైళ్లు లఖిసరాయ్ స్టేషన్‌కు చేరుకోవడంతో ప్రయాణికులు, భక్తుల రద్దీ ఒక్కసారిగా విపరీతంగా పెరిగింది. అశోక్‌ధామ్ స్టేషన్ నుంచి ఆలయానికి వెళ్లే మార్గంలో జనసమూహం నియంత్రణ దాటింది. అధిక ఒత్తిడి కారణంగా ఒక వైపు ఉన్న బారికేడింగ్ తెగిపోవడంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారు.

మరోవైపు, క్యూలైన్లలో వేలాది మంది నిలబడి ఉన్న సమయంలో అక్కడే ఉన్న ఒక విద్యుత్ స్తంభం కూలిపోయి దాని నుంచి విద్యుత్ ప్రవహించిందనే వదంతులు ఒక్కసారిగా వ్యాపించాయి. ఈ రూమర్ భక్తులలో తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ప్రాణభయంతో భక్తులు ఒక్కసారిగా పరుగులు తీయడంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది.

అధికారుల స్పందన..
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను తక్షణమే సమీప ఆస్పత్రులకు తరలించారు.

ఈ ఘటనపై లఖిసరాయ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (DM) శైలేంద్ర కుమార్ మాట్లాడుతూ.. "ఉదయం సమయంలో రెండు రైళ్లు రావడంతో జనసమూహం అసాధారణ రీతిలో పెరిగింది. బారికేడింగ్ తెగిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది" అని తెలిపారు. 

అలాగే ఎస్‌డిపిఓ శివం కుమార్ మాట్లాడుతూ.. విద్యుదాఘాత వదంతుల వల్ల తొక్కిసలాట జరిగిందా అనే కోణంతో పాటు అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతున్నామని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని స్పష్టం చేశారు. పవిత్ర శ్రావణ వేళ జరిగిన ఈ పెను ప్రమాదం స్థానికంగా తీవ్ర విషదాన్ని నింపింది.

Also Read: వందేమాతరం వివాదం..కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై పోలీస్ కేసు నమోదు!

Also Read: Karur Stampede Govt Job: కరూర్ తొక్కిసలాట బాధితులకు సుప్రీంకోర్టులో ఊరట..ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం పట్ల హర్షం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Irumudi Pre-Release Event: "బల్లగుద్ది చెప్తున్నా..ఈ సినిమా అందరికి నచ్చుతుంది" ఇరుముడి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరో రవితేజ!

Hyderabad, Telangana:

Irumudi Pre Release Event Speech: మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఇరుముడి' ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేయగా.. తాజాగా విడుదలైన 'మల్లెపూల పల్లకి' పాట ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చింది.

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న 'మల్లెపూల పల్లకి' సాంగ్
అయ్యప్ప భక్తుల్లో అత్యంత ప్రత్యేకమైన స్థానం ఉన్న ఒరిజినల్ 'మల్లెపూల పల్లకి' పాటలోని భక్తి భావాన్ని అలాగే ఉంచుతూ.. 'ఇరుముడి' కోసం సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ దీనికి మోడరన్ మ్యూజికల్ టచ్ ఇచ్చారు.

పవర్‌ఫుల్ బీట్స్, డప్పు రిథమ్స్‌తో పాటను చాలా ఎనర్జిటిక్‌గా తీర్చిదిద్దారు. ఒరిజినల్ పాటకు తన వాయిస్‌తో ప్రాణం పోసిన డప్పు శ్రీను, ఈసారి కూడా తన గాత్రంతో రా, డివోషనల్ ఫీల్‌ను తీసుకువచ్చారు. అయ్యప్ప స్వామి భక్తుడి గెటప్‌లో రవితేజ వేసిన మాస్ డ్యాన్స్ మూవ్స్, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖుల మాటలు..
ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరో రవితేజ మాట్లాడుతూ.. "ఇది ఒక మంచి ఎమోషనల్ రైడ్. ఇందులో నటించిన ప్రతి ఒక్కరి క్యారెక్టర్ మైండ్‌లో ఉండిపోతుంది. ముఖ్యంగా సాయికుమార్ గారిని ఒక డిఫరెంట్ వేలో చూస్తారు. బల్లగుద్ది చెబుతున్నా.. ఈ సినిమా మీకు తెగ నచ్చేస్తుంది, ఒక డిఫరెంట్ రవితేజను థియేటర్లలో చూస్తారు" అని అన్నారు.

దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.."ఇది తెలుగు సినిమాల్లో వచ్చిన మోస్ట్ ఇంటెన్స్ అండ్ సీరియస్ ఫ్యామిలీ డ్రామా. చివరి 40 నిమిషాలు మిమ్మల్ని ఒక ఇంటెన్స్ డ్రామాలో ముంచేస్తుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక గొప్ప ఎమోషనల్ అనుభూతిని మిగుల్చుతుంది" అని వెల్లడించారు.

"అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ఒక భక్తుడి బ్యాక్‌గ్రౌండ్‌లో సాగే థ్రిల్లర్ ఇది. అద్భుతమైన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుంది." - నిర్మాత రవిశంకర్ 

సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ.. "రవితేజ కెరీర్‌లో ఇదొక మెమొరబుల్ మూవీ అవుతుంది. యాక్షన్, సెంటిమెంట్, మాస్ మూమెంట్స్ అన్నీ బ్యాలెన్స్ చేస్తూ మ్యూజిక్ అందించాను. థియేటర్లలో ప్రేక్షకులు దీనిని బాగా ఎంజాయ్ చేస్తారు" అని అన్నారు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు..
ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తుండగా.. తన భార్య పాత్రలో ప్రియా భవానీ శంకర్, కూతురి పాత్రలో బేబీ నక్షత్ర కనువిందు చేయనున్నారు. అలాగే సినిమాలో సాయికుమార్, అజయ్ ఘోష్, శ్వాసిక తదితరులు కీలక పాత్రలో పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తుండగా.. శివ నిర్వాణ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం వహించారు. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిచగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్, విష్ణుశర్మ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైనర్‌గా సాహి సురేష్ వ్యవహరించారు. ఈ సినిమా ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది. 

Also Read: విరాట్ కోహ్లీకి ఈ టాలీవుడ్ హీరోయిన్ మరదలు అవుతుంది..ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా?

ALso Read: Prabhas Fauzi New Poster: 'ఫౌజీ' కొత్త పోస్టర్..ఒకవైపు గాంధీ, మరోవైపు ప్రభాస్ మాస్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Sonia Gandhi Vande Mataram: వందేమాతరం వివాదం..కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై పోలీస్ కేసు నమోదు!

Delhi, Delhi:

Sonia Gandhi Vande Mataram Case: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని జాతీయ కాంగ్రెస్ కార్యాలయంలో 'వందేమాతరం' గీతాలాపన వేళ తీవ్ర వివాదం చెలరేగింది. వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అమర్యాదగా ప్రవర్తించారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తాయి. ఇప్పుడు ఈ పరిణామాలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. జాతీయ గేయాన్ని అవమానించారనే ఆరోపణలతో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై కర్ణాటకలో బీజేపీ నేతలు అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మంగళూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు
ఢిల్లీలోని ఏఐసీసీ (కాంగ్రెస్) ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ గేయం (వందేమాతరం) పాడుతున్న సమయంలో సోనియా గాంధీ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. వందేమాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించారంటూ కర్ణాటకలోని మంగళూరు ఉర్వా పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నాయకులు ఆదివారం ఫిర్యాదు దాఖలు చేశారు.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన తర్వాత వందేమాతరం గీతాలాపన జరుగుతుండగా వేదికపై ఉన్న సోనియా గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడుతూ, గీతాన్ని మధ్యలోనే ఆపేయాలన్నట్లుగా సైగలు చేశారనే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే సోనియా గాంధీ చేసిన ఈ ప్రవర్తనపై సర్వత్రా విమర్శలకు దారితీసింది. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు మరో విషయంపై సోనియా గాంధీ మాట్లాడారని.. జాతీయ గీతం ఆపేయాలంటూ వచ్చిన వ్యాఖ్యలను వారు తప్పుబట్టారు. అయితే వందేమాతరం పాడే సమయంలో అలా కదలాడి, మాట్లాడాల్సిన అవసరం ఏమిటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జాతీయ గేయాన్ని పూర్తిగా పాడకుండా అడ్డుకోవాలని సోనియా సూచించారని, కాంగ్రెస్‌కు జాతీయ చిహ్నాలపై కనీస గౌరవం లేదని బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాల్వియా ఎక్స్ వేదికగా తీవ్రంగా విమర్శించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపాటు
రాజస్థాన్‌లోని చిత్తౌర్‌గఢ్ సభలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలోనే జాతీయ గేయాన్ని ఆపేయాలని పార్టీ అధ్యక్షుడికి సోనియా గాంధీ చెప్పడం వారి సిగ్గుమాలిన చర్యలకు, దురహంకారానికి అద్దం పడుతోందని ఆయన దుయ్యబట్టారు.

కాంగ్రెస్ పార్టీ వివరణ
మరోవైపు బీజేపీ చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ వర్గాలు పూర్తిగా ఖండించాయి. వందేమాతరం గీతాన్ని ఆపేయాలని సోనియా గాంధీ ఎలాంటి సైగలు చేయలేదని స్పష్టం చేశాయి. వేదికపై ఎక్కువసేపు నిలబడలేక ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూర్చోవడానికి వెంటనే ఒక కుర్చీ ఏర్పాటు చేయాలని మాత్రమే సోనియా కోరారని కాంగ్రెస్ నాయకులు వివరణ ఇచ్చారు.

Also Read; శ్రావణ మాసం ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన చికెన్, కోడిగుడ్ల ధరలు..

ALso Read: మరో వివాదంలో హీరో అల్లు అర్జున్.. స్వాతంత్ర్య దినోత్సవ పోస్ట్ డిలీట్..ఏం జరిగిందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Vande Bharat Accident: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం..వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని యువ నర్స్ మృతి!

Secunderabad, Telangana:

Vande Bharat Moulali Incident: తల్లిదండ్రులతో కలిసి సాగిన ఆ సంతోషకరమైన ప్రయాణం క్షణాల వ్యవధిలోనే తీరని విషాదంగా మారింది. గమ్యస్థానానికి చేరుకున్న వెంటనే జరిగిన అనూహ్య ప్రమాదం ఓ యువతి ప్రాణాలను బలితీసుకుంది. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ సమీపంలోని మౌలాలిలో చోటుచేసుకున్న ఈ రైలు దుర్ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అసలేం జరిగింది?
తెలంగాణలోని జనగాంకు చెందిన 20 ఏళ్ల మానేపల్లి మానస వృత్తిరీత్యా నర్సుగా పనిచేస్తున్నారు. ఆదివారం (ఆగస్టు 16న) మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆమె తన తల్లిదండ్రులతో కలిసి గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి మౌలాలి చేరుకున్నారు. మౌలాలి రైల్వే ఎల్‌సీ గేట్ నంబర్-6 సమీపంలోని అప్‌లైన్ వద్ద రైలు దిగిన మానస.. ప్లాట్‌ఫామ్ మారేందుకు పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

అదే సమయంలో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు అతివేగంగా వస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఆమెను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మానస తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కళ్లముందే కుమార్తె విగతజీవిగా పడిపోవడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు వర్ణనాతీతం.

రైల్వే పోలీసుల దర్యాప్తు
గోల్కొండ ఎక్స్‌ప్రెస్ నుంచి దిగిన మానస రైలు పట్టాలు దాటడానికి కారణం ఏమిటి? వందేభారత్ వస్తున్న విషయాన్ని ఆమె గమనించలేదా? అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై సికింద్రాబాద్ రైల్వే పోలీసులు క్రైమ్ నంబర్ 418/2026 కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

ప్రాథమికంగా ఇది ప్రమాదవశాత్తు జరిగినట్లు భావిస్తున్నప్పటికీ, అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడేవారి ప్రాణాలు కాపాడే నర్సు వృత్తిలో ఉన్న మానస, ఇలా రైలు ప్రమాదంలో దుర్మరణం చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Also Read: ఏపీలో దారుణం.. భర్తను గొంతుకోసి చంపిన భార్య.. అనుమానంతో చంపి తల వద్ద దీపం పెట్టింది!

Also Read: Balapur Ganesh Theme: ఈసారి బాలాపూర్ గణేష్‌కు పూరీ జగన్నాథ్ ఆలయం థీమ్..ఎలా ఉండబోతుందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

AP Rains: రేపు ఆంధ్రప్రదేశ్‌కు అక్కడక్కడ భారీ వర్షాలు.. ఎక్కడెక్కడో తెలుసా?

Nuzendla, Andhra Pradesh:

AP Rain Alert: ఎల్‌నినో ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడగా.. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏపీలో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితుల్లో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో రేపు, ఎల్లుండి వర్షాలు పడతాయని తెలిపింది. అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు ప్రకటించారు.

వాయవ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ - ఉత్తర ఒడిశా తీరప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. స్పష్టమైన అల్పపీడనంగా  బలపడి కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయవ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో వాయవ్య, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తరాంధ్ర తీరప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

రేపు సోమవారం, ఎల్లుండి మంగళవారం వరకు గంటకు 40 నుంచి 60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగసిపడే అవకాశం ఉందని హెచ్చరించింది. మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లరాదని సూచనలు చేసింది. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు తక్షణమే తీరానికి తిరిగి రావాలని సూచించింది. వీటి ప్రభావంతో రేపు సోమవారం  శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ  పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.

అంతేకాకుండా మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, మార్కాపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని వాతవరణ శాఖ వెల్లడించింది. మంగళవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈదురుగాలులు, పిడుగులు పడే ప్రమాదం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

0
0
Report

Konda Surekha: మళ్లీ కొండా సురేఖ డుమ్మా.. రేవంత్‌ రెడ్డిపై ఇంకా చల్లారని అసంతృప్తి

Parkal, Telangana:

Warangal Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో ఇంకా భేదాభిప్రాయాలు తారస్థాయిలో ఉన్నాయి. క్షేత్రస్థాయిలోనే కాదు అత్యున్నత పదవుల్లో ఉన్న వారి మధ్య కూడా విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర స్థాయిలో లుకలుకలు ఉన్నాయి. పరకాల బహిరంగ సభతో అవి మరింత ముదిరాయని స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి హాజరైన సభకు కీలక శాఖకు మంత్రి అయిన కొండా సురేఖ డుమ్మా కొట్టారు. రేవంత్‌ రెడ్డిపై కొండా దంపతులు ఇంకా అసంతృప్తి.. ఆగ్రహంతో ఉన్నారని మరోసారి రుజువైంది.

ములుగురు జిల్లాలో రేవంత్ రెడ్డి విస్తృత స్థాయి పర్యటన చేశారు. మేడారం సమ్మక్క, సారక్క ఆలయాన్ని సందర్శించడమే కాకుండా ములుగు జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని సీఎం హోదాలో రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. ఇక అనంతరం పరకాలలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇది కొండా సురేఖ నియోజకవర్గం పక్కన ఉన్నదే. కానీ ఏ కార్యక్రమంలోనూ కొండా సురేఖ పాల్గొనలేదు. రేవంత్‌ రెడ్డి కార్యక్రమానికి ఆమె దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది.

దేవాదాయ శాఖకు చెందిన కార్యక్రమంలో కూడా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ హాజరుకాలేదు. మేడారం జాతర పనుల పరిశీలనకు వచ్చిన రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధిత శాఖ మంత్రిగా కొండా సురేఖ డుమ్మా కొట్టడంతో చర్చనీయాంశంగా మారింది. మేడారం జాతరతోపాటు మరికొన్ని అంశాలపై రేవంత్‌ రెడ్డితోపాటు పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కొండా సురేఖకు విబేధాలు కొనసాగుతున్నాయి. రేవంత్‌ రెడ్డి, పొంగులేటిపై కొండా సురేఖ కుమార్తె గతంలో బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక జిల్లాలో ఉన్న మరో మంత్రి సీతక్కతో కూడా కొండా సురేఖకు విభేదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

కొండా సురేఖకు షాకిచ్చిన రేవంత్ రెడ్డి
వరంగల్ జిల్లా పర్యటనకు దూరమైన కొండా సురేఖ దంపతులకు బహిరంగ సభ వేదికగా రేవంత్ రెడ్డి షాకిచ్చే ప్రకటన చేశారు. పరకాల నియోజకవర్గంలో తమ కుమార్తె కొండా సుష్మితను పోటీ చేయాలని కొండా దంపతులు ప్రయత్నాలు చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి మరోసారి రేవూరి ప్రకాశ్‌ రెడ్డి పోటీ చేస్తాడని.. తిరిగి గెలిపించాలని రేవంత్‌ రెడ్డి పిలుపునివ్వడంతో కొండా దంపతులకు కౌంటర్‌ ఇచ్చారు. తన కూతురు సుష్మితను పరకాలలో బరిలోకి దింపాలని కొండా సురేఖ పలుమార్లు బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తనతో భేదాభిప్రాయాలు పెట్టుకున్న కొండా సురేఖకు రాజకీయంగా ఇలా రేవంత్ రెడ్డి దెబ్బతీశారని చర్చ జరుగుతోంది.

0
0
Report
Advertisement

KCR Assembly: అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్‌ రావాలి.. సలహాలు ఇవ్వాలి: రేవంత్ రెడ్డి

Parkal, Telangana:

Telangana Assembly Session: సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను నిర్వహిస్తామని.. అనుభవజ్ఞులైన ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణ తొలి సీఎం కె. చంద్రశేఖర్ రావు సభకు హాజరుకావాలని మరోసారి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీకి హాజరై అభివృద్ధి, సంక్షేమంపై చర్చించి.. తమకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. 'రక్తం పంచుకున్న సోదరికి సాయం చేయాల్సి వస్తుందని ఇంటి నుంచి బయటికి గెంటేసిన చరిత్ర కేటీఆర్‌ది. కొడుకుకు బుద్ధి చెప్పాల్సిన కన్న తండ్రి కళ్లున్న ధృతరాష్ట్రుడిలా మారిపోయాడు' అని కేసీఆర్‌, కేటీఆర్‌లపై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. పదేళ్లు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను బలి తీసుకున్నారని విమర్శించారు.

ప్రజా పాలన- ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి దాదాపు రూ.424 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువకులను కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని.. అలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి  సూచించారు. ప్రజా ప్రభుత్వం రైతు, మహిళ, యువతకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ ఒక్కటొక్కటిగా అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతోందని చెప్పారు. విడతల వారీగా ప్రభుత్వంలోని ఖాళీలన్నీ భర్తీ చేస్తామని పునరుద్ఘాటించారు. నిరుద్యోగ యువకుల కలలను సాకారం చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందని హామీ ఇచ్చారు. 

ప్రగతి నివేదన
'32 నెలల్లో ధాన్యం  కొనుగోలు చేసి 90 వేల కోట్లు రైతులకు చెల్లించాం. రైతు భరోసా, రైతు రుణమాఫీ చేసి రైతును రాజును చేయాలని ప్రయత్నిస్తున్నాం. రెండున్నరేళ్లలో రైతుల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేశాం. సున్నా వడ్డీ రుణాలు అందించాం. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకున్నాం. యూనిఫాం కట్టు పనిని మహిళా స్వయం సంఘాలకు అప్పగించాం. సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు జరుపుకునేలా ప్రోత్సహించాం' అని తెలంగాణ సీఎం వెల్లడించారు. 'మేం 72 వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకం పూర్తి చేశాం. పోలీస్ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. నిరుద్యోగుల భవిష్యత్ కోసమే వయసు సడలించాం' అని వెల్లడించారు. 

'నిరుద్యోగులు రాజకీయ పట్టీలు మాయ మాటలకు మోసపోవద్దు. ప్రతీ ఆరునెలలకు ఉద్యోగ ఖాళీలను గుర్తించి భర్తీ చేస్తాం. ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మాది.. పరీక్షలకు సిద్ధం కావాల్సిన బాధ్యత మీది' అని పేర్కొన్నారు. రైతులు, ఆడబిడ్డలు, నిరుద్యోగుల కోసమే తాము పనిచేస్తున్నట్లు తెలిపారు. 'ఆనాడు అధికారం అనుభవించారు ప్రతిపక్షంలో కార్యకర్తల రక్తాన్ని ప్రైవేటు ఆసుపత్రులకు అమ్ముకుంటున్న రక్తపిపాసులు' అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

'కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన కుటుంబానికే లాభం. ప్రజా పాలనతో ప్రజలకు లాభం. ఎవరు ముఖ్యమంత్రి అయితే ఎవరికి లాభం అయిందో లెక్కలతో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం' అని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. 2029లో రెట్టింపు మెజారిటీతో ఇక్కడి ఎమ్మెల్యేలను గెలిపించాలని పిలుపునిచ్చారు. తమది సామాన్యుల కోసం పనిచేసే ప్రభుత్వం అని.. ఎంతైనా కష్టపడి సమస్యలను పరిష్కరిస్తానని ప్రకటించారు. మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చినా ఏం చేయలేరని ప్రకటించారు. ఈ బహిరంగ సభలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి , దనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి , బలరాం నాయక్ , కడియం కావ్య, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

0
0
Report

KTR Call: కల్యాణలక్ష్మి రద్దుకు రేవంత్‌ రెడ్డి కుట్ర.. రేపు ధర్నాలకు కేటీఆర్‌ పిలుపు

Baddipadaga, Telangana:

Kalyana Lakshmi And Shaadi Mubarak: కల్యాణలక్ష్మి- షాదీ ముబారక్ పథకంపై హైకోర్టు స్టే విధించడంతో ఆ పథకాలు రద్దవుతాయనే ఆందోళనలు సర్వత్రా నెలకొంది. ఎన్నికల్లో తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన అది ఇవ్వకుండా ఏకంగా ఆ పథకాన్ని ఏకంగా రద్దు చేస్తోందని బీఆర్‌ఎస్‌ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రను అడ్డుకోవాలని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో బీఆర్‌ఎస్ పార్టీ నిరసనలు చేయాలని సూచించారు. హైకోర్టు తీర్పు సాకుతో పేదింటి ఆడబిడ్డల భరోసాను ఎత్తివేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

కల్యాణ లక్ష్మి అంశంలో హైకోర్టు లో కౌంటర్ వేయకుండా కాంగ్రెస్ కుట్ర చేసిందని రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ రెడ్డి, మంత్రుల అవినీతి అంశాల్లో కోట్ల రూపాయలు చెల్లించి ప్రైవేటు లాయర్లను పెట్టుకునే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ అంశంలో ఎందుకు కౌంటర్ వెయ్యలేదని ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు పేరుతో కల్యాణ లక్ష్మిని పూర్తిగా రద్దు చేసే ప్రయత్నం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆడబిడ్డలు, వారి కుటుంబాల తరఫున బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తోందని తెలిపారు. ఆడబిడ్డల తులం బంగారం అడుగుతున్నందుకే పూర్తిగా కల్యాణ లక్ష్మిని ఎత్తగొట్టే కుట్ర అని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకాల రద్దు చేస్తారనే వార్తల నేపథ్యంలో ఆదివారం బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర జనరల్ బాడీ సభ్యులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రేపు నిర్వహించాల్సిన ఆందోళనలపై కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఈ పథకాలను ఎత్తివేసేందుకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోందని తెలిపారు. ఈ కుట్రను అడ్డుకోవడంతోపాటు కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు నిరసన కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రకటించారు.

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కేవలం ఒక సంక్షేమ పథకం మాత్రమే కాదని తెలంగాణ పేద కుటుంబాల ఆడబిడ్డల భవిష్యత్తు, ఆత్మగౌరవంతో ముడిపడిన కార్యక్రమాలు అని మాజీ మంత్రి కేటీఆర్‌ వివరించారు. ఆడబిడ్డ పెళ్లి ఆర్థిక భారంగా గుర్తించిన కేసీఆర్ 2014 అక్టోబర్ 2న కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకాలను ప్రారంభించారని గుర్తుచేశారు. రూ.51 వేల ఆర్థిక సహాయంతో ప్రారంభమైన ఈ పథకాన్ని దశలవారీగా రూ.75,116కు, అనంతరం రూ.1,00,116కు పెంచారని వెల్లడించారు. కేసీఆర్ హయాంలో సుమారు 13 లక్షల మంది ఆడబిడ్డల కుటుంబాలకు రూ.13 వేల కోట్ల మేర ఆర్థిక సహాయం అందిందని.. కరోనా వంటి సమయంలోనూ పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచిందని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గుర్తుచేశారు.

అయితే ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మితో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని బలోపేతం చేయాల్సింది పోయి దానినే రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని కేటీఆర్ విమర్శించారు. కల్యాణలక్ష్మి కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఆడబిడ్డ ఇప్పుడు ఎన్నికల హామీ ప్రకారం తులం బంగారం కూడా డిమాండ్ చేస్తుండటంతో, ఆ ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెళ్లిళ్లు జరిగి చాలా కాలం గడిచినా.. కొందరికి పిల్లలు పుట్టినా కూడా తమకు రావాల్సిన కల్యాణలక్ష్మి సహాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్‌ వివరించారు. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌కు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న అన్ని అర్హులైన దరఖాస్తులను వెంటనే పరిష్కరించి ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ డిమాండ్ చేశారు.

0
0
Report
Advertisement

Nag Panchami 2026: నాగుల పంచమి.. పూజా విధానం, పొరపాటున కూడా రేపు చేయకూడని నాలుగు పనులు ఏంటో తెలుసా..?

Hyderabad, Telangana:

Nag Panchami 2026 date puja Vidhi kaal sarp remedy: మనం శ్రావణ మాసంలో అత్యంత పవిత్రమైన నాగుల పంచమిని రేపు అంటే సోమవారం రోజున ఆగస్టు 17న జరుపుకుంటున్నాం. శ్రావణ మాసం పంచమి తిథి రోజున నాగుల పంచమిగా చెప్తారు.ఈ మాసం శివ, కేశవులకు అత్యంత ప్రీతికరమైందని చెప్తారు. రేపుసోమవారం కూడా కలిసి రావడం మరో విశేషంగా చెప్తున్నారు. నాగుల పంచమి రోజున ముఖ్యంగా బ్రాహ్మీమూహుర్తంలో నిద్రలేవాలి.ఉతికిన వస్త్రాల్ని ధరించుకొవాలి.

ఆ తర్వాత దీపారాధన చేయాలి. దగ్గరలోని గుడిలోకి వెళ్లి జంటనాగుల్ని పూజించుకొవాలి. పుట్టకు పూజలు చేయాలి. సుబ్రహ్మణ్యుడ్ని ఆరాధించుకొవాలి. సోమవారం రోజున నాగపంచమి రావడంతో శివుడికి పంచామృత అభిషేకంచేయించుకొవాలి. దీని వల్ల కాలసర్పదోషాలుఅన్ని పోతాయి. నవ నాగుల స్తోత్రాలను చదవాలి.

నెయ్యితో దీపారాధన చేయాలి. యథాశక్తి షోడషోపచారాలతో పూజలు చేయించుకొవాలి. ఆతర్వాత పండ్లు లేదా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టాలి.

నాగ పంచమి రోజున చేయకూడని నాలుగు పనులు..

నాగుల పంచమి రోజున పొరపాటున కూడా భూమిని తవ్వడం చేయకూడదు, అదే విధంగా కడయిలో వేయించడం వంటివి చేయకూడదు. కత్తిని, సూదిదారంను, కత్తెరను రేపు ఒక్కరోజు అస్సలు ఉపయోగించకూడదు.  కేవలం చేతిలో కట్ చేసే కూరగాయలు. అంటే చిక్కుడు, గోరుచిక్కుడును వండుకొవాలి.

Read more: Nag Panchami 2026: నాగ పంచమివేళ మరో అద్భుతం.!. ఈ రోజు తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఏమిటంటే..?..

ఆవాలు, జీలకర్రల్ని ఉపయోగించకూడదు. ఇక నిజమైన పాము మీద అస్సలు పాలు పోయకూడదు. వాటిని పాలను జీర్ణం చేసుకునే శక్తి ఉండదని నిపుణులు చెప్తుంటారు. ఈ పనులు మాత్రం తప్పినిసరి అవాయిడ్ చేయాలి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Shocking Incident: ఫ్రెండ్స్‌తో బెడ్‌ షేర్‌ చేసుకోమంటున్నాడు.. ప్రముఖ డాక్టర్‌పై భార్య సంచలన ఆరోపణలు

PPINEWZ15h ago
Hyderabad, Telangana:

Rajendranagar Police: కోటి ఆశలతో డాక్టర్‌ను పెళ్లి చేసుకున్న ఆ యువతి కాపురం పెట్టాక అతడి నిజ స్వరూపం తెలిసి విస్తుపోయింది. ప్రేమగా చూసుకోవాల్సిన భర్త తనను అతడి స్నేహితులతో పక్క పంచుకోవాలని చెప్పడంతో దిగ్భ్రాంతి చెందింది. పెళ్లయిన ఏడు రోజులకే అతడ నరకం చూపించడంతో కాళ్ల పారాణి ఆరకముందే ఆమె పోలీస్‌ స్టేషన్‌ గడప తొక్కింది. తన భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన తెలంగాణలోని హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో కండ్రగుంట శ్రీనివాస రావు వైద్య నిపుణుడు. ఏడు రోజుల కిందట ఓ యువతితో వివాహమైంది. డాక్టర్‌ అయిన భర్త కావడంతో ఎన్నో ఆశలతో.. జీవితం బాగుంటుందని ఆశపడిన భార్యకు కాపురం పెట్టిన తర్వాత భర్తలోని నీచుడు బయటపడ్డాడు. అతడి స్నేహితుడితో తనను పడుకోవాలని కట్టుకున్న భార్యను వేధింపులకు గురి చేశాడు. అంతేకాకుండా అతడిపై బెడ్‌ పంచుకోకుంటే విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు.

ఇక అంతేకాకుండా తనతోపాటు పని చేసే తోటి మహిళ ఉద్యోగులకు న్యూడ్ వీడియో కాల్స్, న్యూడ్ ఫొటోస్ పంపుతున్నట్లు భార్య తీవ్ర ఆరోపణలు చేశారు. తన భర్తకు ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆమె ఫిర్యాదులో ఆరోపించారు. తన భర్త డాక్టర్ శ్రీనివాస్ మానసికంగా , శారీరకంగా వేధించారని ఫిర్యాదులో ఆమె వాపోయారు. ఈ విషయాలు బయటకు చెప్పినా.. తల్లిదండ్రులకు చెపితే తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు బాధితురాలు వెల్లడించారు.

 డాక్టర్ శ్రీనివాస్‌కి ఆయన తల్లిదండ్రులు, అతడి సోదరుడు కూడా వేధింపులకు గురిచేశారని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. అదనపు కట్నం తీసుకురావాలని విచక్షణరహితంగా దాడి చేసినట్లు భాదితురాలు ఫిర్యాదు చేశారు. తమను ప్రశ్నిస్తే 100 మందిని తీసుకొచ్చి నీ అంతు, మీ తమ్ముడు అంతు చూస్తానని బెదిరించినట్లు శ్రీనివాస్ అన్న వెంకటేశ్‌పై బాధితురాలు ఆరోపణలు చేశారు. తనకు.. తన కుటుంబసభ్యులకు భర్త, వారి కుటుంబసభ్యుల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు భయాందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటిని తాళలేక బాధితురాలు రాజేంద్రనగర్ జోన్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు 6 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే విచారణకు రావాలని పదుల సంఖ్యలో ఫోన్లు చేసినా నిందితుడు నుంచి స్పందన లేదని పోలీసులు చెబుతున్నారు.

0
0
Report

RK Roja: దేశంలోనే చంద్రబాబు లాంటి డర్టీ పొలిటీషియన్ ఎవరూ లేరు: ఆర్‌కే రోజా

Tirupati, Andhra Pradesh:

YSR Congress Party: 'దేశంలోనే చంద్రబాబు లాంటి డర్టీ పొలిటీషియన్ ఎవరూ లేడని.. ఓటుకు నోటు పరిచయం చేసింది చంద్రబాబే' మాజీ మంత్రి ఆర్‌కే రోజా డిమాండ్‌ చేశారు. వైస్రాయ్‌ హోటల్‌లో సొంత మామ ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరించిన సంస్కృతి చంద్రబాబుదే అని గుర్తుచేశారు. 'స్వాతంత్ర్య దినోత్సవం సాక్షిగా చంద్రబాబు మహిళలను మోసం చేశారు. మహిళలను బస్సులో ఎక్కించుకొని తిప్పుకొని, ఆఖరికి అన్నం పెట్టకుండా పంపించాడు. మహిళలను చంద్రబాబు అవమానించారు, వారికి క్షమాపణ చెప్పాలి' అని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకురాలు ఆర్‌కే రోజా డిమాండ్‌ చేశారు. 

'చంద్రబాబుకు రెండెకరాల ఉంటే తమ్ముడికి ఒకేకరా పోతే ఇక ఒక ఎకరా ఉండేది. ఇప్పుడు రూ.లక్షల కోట్లు చంద్రబాబుకు ఎలా వచ్చింది?' అని మాజీ మంత్రి ఆర్‌కే రోజా ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని చెప్పారు. 'నగరిలో పిల్లికి కూడా భిక్షం పెట్టని ఎమ్మెల్యే భాను. ఇసుక, మట్టి తమిళనాడు, కర్ణాటకకు తరలించి అక్రమ సంపాదన సంపాదిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు గాలి భానుకి సహకరిస్తున్నారు' అని తీవ్ర ఆరోపణలు చేశారు.

'మద్యం దుకాణాల పేరుతో బెల్టు పెట్టీ యువతను మత్తుకు బానిస చేస్తున్నారు. ఆ మత్తులో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి' అని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకురాలు ఆర్‌కే రోజా విమర్శించారు. కుప్పంలో గంజాయిని పెంచి పోషిస్తున్నారని.. హోం మంత్రి ఉన్న నియోజకవర్గంలో గంజాయి సాగు చేస్తున్నారని ఆరోపించారు. మహిళల చేతిలో చావు దెబ్బ తింటారని హెచ్చరించారు. కారు గ్యారేజీలో ఉండాలి.. ఆడది వంటగదిలో ఉండాలి అన్న కోడెల ఏమయ్యాయో చూశామని మాజీ మంత్రి ఆర్‌కే రోజా గుర్తుచేశారు.

'చంద్రబాబు కన్నా చిన్న వాడు వైఎస్‌ జగన్ ఇచ్చిన హామీలన్నీ 98 శాతం నెరవేర్చారు. అమరావతిలో అనవసరంగా డబ్బులు పెడుతూ, దోచుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారు' అని వైఎస్సార్‌సీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్‌కే రోజా హెచ్చరించారు.

0
0
Report
Advertisement
Advertisement
Back to top