Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Medchal-Malkajgiri500072

ఆలయ నిర్వాహకులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

Jul 19, 2024 12:40:37
Hyderabad, Telangana
కూకట్ పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నేడు బేగంపేట్ డివిజన్ లో పర్యటించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆషాడ మాస బోనాలకు సంబంధించిన చెక్కులను ఆలయ నిర్వాహకులకు అందజేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేయాలని వారికి సూచించారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Feb 09, 2026 10:12:46
Masapet, Andhra Pradesh:

Bird Flu Cases In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ బర్డ్‌ ఫ్లూ (ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా) కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లాలో కోళ్ల మరణాలకు బర్డ్‌ ఫ్లూయే కారణమని ల్యాబ్ పరీక్షల్లో తేలడంతో రాష్ట్రవ్యాప్తంగా పౌల్ట్రీ రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించింది. అన్నమయ్య జిల్లాలోని సదుం మండలంలో కోళ్లు పెద్ద సంఖ్యలో మరణించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

వైరస్ ఎలా నిర్ధారణ అయింది?
సదుం మండలంలోని పుత్తవారిపల్లె, అమ్మగారిపల్లె గ్రామాల్లో కోళ్లు మృతి చెందడంతో పశుసంవర్ధక శాఖ అధికారులు నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (NIHSAD) కు పంపగా, అక్కడ 'ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా' పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. చనిపోయిన కోళ్లను శాస్త్రీయ పద్ధతిలో లోతైన గోతులు తీసి పాతిపెడుతున్నారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, ఆరోగ్య శాఖలు కలిసి పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. మదనపల్లెలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అనుమానాలు ఉంటే 70139-14401, 93982-62752 నంబర్లకు సంప్రదించవచ్చు.

చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలో కూడా కోళ్లు అనుమానాస్పదంగా మృతి చెందుతున్నాయి. అధికారులు అక్కడి నుంచి కూడా నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. పౌల్ట్రీ రైతులు కఠినమైన 'బయోసెక్యూరిటీ' నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.

బర్డ్ ఫ్లూ పక్షుల నుంచి మనుషులకు సోకడం చాలా అరుదు, కానీ అప్రమత్తంగా ఉండటం అవసరమని వైద్యులు చెబుతున్నారు. చికెన్ లేదా గుడ్లను 100 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద బాగా ఉడికించి తినాలి. సగం ఉడికించిన మాంసం లేదా ఆమ్లెట్లు తినడం ప్రస్తుతానికి మానుకోవాలి. పచ్చి మాంసాన్ని తాకిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.

ప్రస్తుతానికి ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారులు తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని ప్రభుత్వం కోరింది. చనిపోయిన పక్షులు లేదా కోళ్లు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలి.

Also Read: Farewell Party Obscene Dance: స్కూల్లో రికార్డింగ్ డ్యాన్సులు..ఫెయిర్‌వెల్ పార్టీలో అశ్లీల నృత్యాలు..వీడియో వైరల్!

Also REad: EPFO EDLI Scheme: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..ఉచితంగా రూ.7 లక్షలు.. ఎలా పొందాలో తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 09, 2026 09:47:27
Hyderabad, Telangana:

Telangana Municipal Elections: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల్లో మార్పు వస్తోంది. ఈ క్రమంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి యూటర్న్‌ తీసుకున్నారు. కొంత కాలంగా కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉన్న ఆయన మున్సిపల్‌ ఎన్నికల వేళ తిరిగి గులాబీ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన సోదరుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. అతడి చేరికకు సర్వం సిద్ధమైందని.. గూడెం మహిపాల్‌ రెడ్డి తిరిగి గులాబీ గూటికి చేరుతారని చర్చ జరుగుతున్న సమయంలో ఆయన బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: Forensic Lab: నేరగాడే సీఎం కావడంతోనే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రమాదం.. రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న సమయంలో కొత్త లేబర్‌ కోడ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలో ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సమయంలో ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా కాకుండా బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీల్లో గూడెం తన మద్దతుదారులను గెలిపించాలని కోరారు. మూడుసార్లు బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పటాన్‌చెరు ఎమ్మెల్యేగా గూడెం మహిపాల్‌ రెడ్డి గెలుపొందారు.

Also Read: Harish Rao: హామీలు ఎగ్గొట్టిన రేవంత్‌ రెడ్డి అసలైన 'నకిలీ': హరీశ్‌ రావు

2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో కోల్పోయి కాంగ్రెస్‌ వచ్చింది. కొన్ని నెలలకే మహిపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోకి ఫిరాయించారు. అయితే పార్టీలో జరిగిన తర్వాత అతడికి గౌరవం దక్కపోవడం.. తన అనుచరులకు అవకాశాలు రాకపోవడంతో గూడెం మహిపాల్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికితోడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశం ఉండడంతో మహిపాల్‌ రెడ్డి పునరాలోచనలో పడ్డాడు. తిరిగి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: YS Sharmila: నామ్ నరేందర్.. కాం సరెండర్: ప్రధానిపై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు

ఈ క్రమంలోనే ఇటీవల కాంగ్రెస్‌లో చేరి తప్పు చేసినట్లు ఓ సమావేశంలో ప్రకటించారు. అందులో భాగంగా తన సోదరుడిని గులాబీ అధినేత కేసీఆర్‌తో సమావేశమై తిరిగి రావడంపై చర్చించినట్లు సమాచారం. తిరిగి చేర్చుకునేందుకు ససేమిరా అన్నారని దీంతో ఆయన గందరగోళంలో పడినట్లు తెలుస్తోంది. రెంటికి చెడ్డ రేవడిలా పరిస్థితి మారడంతో గూడెం మహిపాల్‌ రెడ్డి భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. తిరిగి చేరేందుకు సిద్ధమవగా మరి బీఆర్‌ఎస్‌ పార్టీ ఆహ్వానం పలుకుతుందా లేదా అనేది తెలియాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 09, 2026 09:41:07
Hyderabad, Telangana:

EPFO EDLI Scheme Benefit: పీఎఫ్ ఖాతాదారులు అందరికీ ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీ జీతం నుండి పీఎఫ్ (PF) కట్ అవుతుంటే, మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా రూ.7 లక్షల వరకు ఉచిత బీమా పొందే హక్కు మీకు ఉంటుంది. చాలా మందికి తెలియని ఈ EDLI (Employees' Deposit-Linked Insurance) పథకం గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన చందాదారుల కోసం అందిస్తున్న ఈ పథకం, ఉద్యోగి అకాల మరణం చెందితే వారి కుటుంబానికి కొండంత అండగా నిలుస్తుంది.

ఒక్క రూపాయి ప్రీమియం కట్టక్కర్లేదు!
సాధారణంగా ఏదైనా బీమా కావాలంటే మనం ప్రీమియం కట్టాలి. కానీ, ఈ EDLI పథకం ప్రత్యేకత ఏంటంటే.. ఈ బీమా కోసం ఉద్యోగి తన జేబు నుండి ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. బీమాకు కావాల్సిన పూర్తి ప్రీమియంను మీ కంపెనీ లేదా యజమాని మాత్రమే చెల్లిస్తారు. మీ పీఎఫ్ ఖాతా ఓపెన్ అయిన వెంటనే, మీరు ఆటోమేటిక్‌గా ఈ ఇన్సూరెన్స్ పరిధిలోకి వచ్చేస్తారు. దీనికోసం వేరే దరఖాస్తు చేయనక్కర్లేదు.

ఒకవేళ ఉద్యోగి సర్వీసులో ఉన్నప్పుడు మరణిస్తే, నామినీ ఈ డబ్బును పొందవచ్చు. మరణ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, నామినీ బ్యాంక్ వివరాలు తప్పనిసరి. EDLI ఫారం 5 IF పూర్తి చేసి ఈపీఎఫ్‌ఓ కార్యాలయంలో ఇవ్వాలి. క్లెయిమ్ చేసిన 30 రోజుల్లోపు డబ్బు సెటిల్ చేయాలి. ఆలస్యమైతే ఈపీఎఫ్‌ఓ 12% వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది.

నామినేషన్ ముఖ్యం!
మీకు ఏదైనా జరిగినప్పుడు మీ కుటుంబం ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఇ-నామినేషన్ పూర్తి చేయడం తప్పనిసరి. నామినీ ఉంటేనే ఈ ప్రక్రియ సులభంగా ముగుస్తుంది. నామినీ లేకపోతే భార్య/భర్త లేదా 25 ఏళ్ల లోపు పిల్లలు దీనికి అర్హులు.

Also Read: Farewell Party Obscene Dance: స్కూల్లో రికార్డింగ్ డ్యాన్సులు..ఫెయిర్‌వెల్ పార్టీలో అశ్లీల నృత్యాలు..వీడియో వైరల్!

Also Read: EPFO Wage Limit Hike: ఉద్యోగులకు జాక్‌పాట్..ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన! పెరగనున్న కనీస పెన్షన్?!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 09, 2026 07:44:26
Parvatipuram, Andhra Pradesh:

Farewell Party Obscene Dance Video: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన పాఠశాల ప్రాంగణం అశ్లీల నృత్యాలకు వేదికైంది. పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుకల్లో నైతిక విలువలను గాలికొదిలేసి, రికార్డింగ్ డ్యాన్సులను ఏర్పాటు చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపింది. పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యా వ్యవస్థను అపహాస్యం చేసేలా జరిగిన ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వీడ్కోలు వేడుకల్లో అశ్లీలత
కురుపాం మండలం నీలకంఠపురం బాలుర ఆశ్రమ పాఠశాలలో రెండు రోజుల క్రితం పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు పరీక్షల పట్ల అవగాహన కల్పించాల్సిన చోట, వార్డెన్ చంద్రశేఖర్ ఏకంగా రికార్డింగ్ డ్యాన్సులను ఏర్పాటు చేశారు. వార్డెన్ సమక్షంలోనే అర్ధరాత్రి వరకు అశ్లీల నృత్యాలు సాగాయి. విద్యార్థులతో కలిసి నృత్యకారిణులు తైతక్కలాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ వీడియోలు కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు తక్షణమే స్పందించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన డీడీ విజయశాంతి, బాధ్యుడైన వార్డెన్ చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై మాజీ మంత్రి, వైసీపీ నేత పుష్ప శ్రీవాణి స్పందిస్తూ విద్యా వ్యవస్థలో ఇలాంటి ధోరణి సరికాదని ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు.

పరీక్షల సమయంలో విద్యార్థులను చదువుపై ఏకాగ్రత పెంచేలా ప్రోత్సహించాల్సింది పోయి, ఇలాంటి అశ్లీల ప్రదర్శనలు నిర్వహించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో క్రమశిక్షణ ఎటు పోతోందని వారు ప్రశ్నిస్తున్నారు.

సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. పాఠశాలల్లో కేవలం చదువు మాత్రమే కాదు, సంస్కారవంతమైన వాతావరణం ఉండాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

Also Read: Pakistan Demand ICC: భారత్‌తో ఆడేందుకు పాక్ 'కండీషన్స్'.. ఐసీసీ ముందు పాకిస్థాన్ 3 వింత డిమాండ్లు!

Also Read: EPFO Wage Limit Hike: ఉద్యోగులకు జాక్‌పాట్..ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన! పెరగనున్న కనీస పెన్షన్?!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 09, 2026 07:09:18
Hyderabad, Telangana:

PCB Demands ICC Revenue Share: టీ20 ప్రపంచకప్ 2026లో భారత్-పాక్ హై-వోల్టేజ్ మ్యాచ్‌పై నెలకొన్న ఉత్కంఠ కొత్త మలుపు తీసుకుంది. మొన్నటి వరకు "భారత్‌తో ఆడేదే లేదు" అని భీష్మించుకూర్చున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB), ఇప్పుడు మెత్తబడినట్లు తెలుస్తోంది. అయితే, మ్యాచ్ ఆడేందుకు ఐసీసీ (ICC) ముందు పాక్ మూడు వింతైన డిమాండ్లను ఉంచినట్లు సమాచారం.

మ్యాచ్ బహిష్కరిస్తే ఐసీసీ నుండి ఎదురయ్యే కఠిన చర్యలకు భయపడిన పీసీబీ, ఇప్పుడు 'బేరసారాల' పర్వానికి తెరలేపింది. తమను ఒప్పించాలంటే ఈ మూడు డిమాండ్లు నెరవేర్చాలని కోరుతోంది.

ఐసీసీ రెవెన్యూలో అధిక వాటా
భారత్-పాక్ మ్యాచ్‌ల వల్ల ఐసీసీకి వేల కోట్ల ఆదాయం వస్తోందని, అందులో తమకు ఇచ్చే వాటాను పెంచాలని పాక్ డిమాండ్ చేస్తోంది. భారత జట్టు క్రేజ్ వల్ల వచ్చే లాభాల్లో తమకు పెద్ద పీట వేయాలని పీసీబీ కోరడం విశేషం.

ద్వైపాక్షిక సిరీస్‌ల పునరుద్ధరణ
అన్నిటికంటే ఆశ్చర్యకరమైన డిమాండ్ ఇది. గత పదేళ్లుగా నిలిచిపోయిన భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్‌లను మళ్లీ ప్రారంభించాలని పీసీబీ పట్టుబడుతోంది. ఒకవైపు మ్యాచ్ ఆడబోమని చెబుతూనే, మరోవైపు సిరీస్‌లు కావాలని కోరడం వారి ద్వంద్వ వైఖరిని సూచిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

'హ్యాండ్‌షేక్' ప్రోటోకాల్
ఖేల్ రత్న లేదా స్పోర్ట్స్‌మన్‌షిప్ పేరుతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చింది. మ్యాచ్‌కు ముందు, తర్వాత భారత ఆటగాళ్లు తప్పనిసరిగా పాక్ ఆటగాళ్లకు కరచాలనం చేయాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని కోరుతోంది. మైదానంలో ఆటగాళ్ల మధ్య ఉండే ఉద్రిక్తతలను తగ్గించేందుకే ఈ ప్రతిపాదన అని వారు చెబుతున్నారు.

పాకిస్థాన్ పెట్టిన ఈ షరతులపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), ఐసీసీ ఎలా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలో భారత ప్రభుత్వం అనుమతి లేకుండా బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆదాయం వాటా విషయంలో ఇతర సభ్య దేశాలు అంగీకరిస్తాయా అనేది సందేహమే.

కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌ను అడ్డుపెట్టుకుని పాక్ తన పాత డిమాండ్లను నెరవేర్చుకోవాలని చూస్తోంది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగే ఈ మ్యాచ్ భవితవ్యం ఇప్పుడు ఐసీసీ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.

Also Read: EPFO Wage Limit Hike: ఉద్యోగులకు జాక్‌పాట్..ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన! పెరగనున్న కనీస పెన్షన్?!

Also Read: Bomb Threat Schools Delhi: ఢిల్లీలో బాంబు కలకలం..పార్లమెంటు, 9 పాఠశాలలకు బెదిరింపులు..రంగంలోకి బాంబు స్క్వాడ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 09, 2026 06:53:35
Hyderabad, Telangana:

EPFO Salary Hike 2026: ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), ఉద్యోగుల రాష్ట్ర బీమా కార్పొరేషన్ (ESIC) పరిధిలోని వేతన పరిమితిని పెంచడంతో పాటు, కనీస పెన్షన్ పెంపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. దీనిపై కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ విషయమై సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రైవేట్ ఉద్యోగుల సామాజిక భద్రతను పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనివల్ల జీతాలు, పదవీ విరమణ ప్రయోజనాల్లో భారీ మార్పులు రానున్నాయి.

వేతన పరిమితి పెంపు (Salary Limit Hike)
ప్రస్తుతం EPFO, ESIC పథకాలకు వర్తించే గరిష్ట వేతన పరిమితి నెలకు రూ.15,000గా ఉంది. పెరిగిన జీవన ప్రమాణాల దృష్ట్యా ఈ పరిమితిని రూ.21,000కు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది అదనపు కార్మికులు ఈ పథకాల పరిధిలోకి వస్తారు. తద్వారా వారి పీఎఫ్ (PF) ఖాతాలో జమ అయ్యే మొత్తం పెరుగుతుంది.

EPS-95 కనీస పెన్షన్ పెంపు
ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS-95) కింద ప్రస్తుతం రిటైర్డ్ ఉద్యోగులకు అందుతున్న కనీస పెన్షన్ చాలా తక్కువగా ఉంది. కనీస పెన్షన్ నెలకు రూ.1,000 మాత్రమే. ఈ మొత్తాన్ని రూ.3,000 నుండి రూ.7,000 వరకు పెంచాలని కార్మిక సంఘాలు, ప్రభుత్వం మధ్య చర్చలు జరిగాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

కేవలం నగదు ప్రయోజనాలే కాకుండా, ఉద్యోగుల ఆరోగ్య బీమా సంస్థ (ESIC) సేవలను దేశవ్యాప్తంగా మరింత విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మెరుగైన వైద్య సదుపాయాలు, బీమా సౌకర్యాలు అందేలా కొత్త గైడ్ లైన్స్ విడుదల కానున్నాయి.

కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన సమావేశాల్లో కనీస వేతనం నిర్ణయించడం, పెన్షన్ పెంపు వంటి అంశాలపై సానుకూల స్పందన లభించింది. మోడీ ప్రభుత్వం త్వరలో తీసుకోబోయే ఈ నిర్ణయం ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఒక 'జాక్‌పాట్' వంటిదని నిపుణులు అభివర్ణిస్తున్నారు.

వేతన పరిమితి పెంపు వల్ల చేతికి వచ్చే జీతం స్వల్పంగా తగ్గినా, దీర్ఘకాలంలో పీఎఫ్, పెన్షన్ రూపంలో భారీ మొత్తంలో పొదుపు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుండి వచ్చే తుది నోటిఫికేషన్ కోసం ఉద్యోగులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

Also Read: Bomb Threat Schools Delhi: ఢిల్లీలో బాంబు కలకలం..పార్లమెంటు, 9 పాఠశాలలకు బెదిరింపులు..రంగంలోకి బాంబు స్క్వాడ్!

Also Read: Indian Railways Liquor Rules: రైలులో మద్యం తీసుకెళ్లొచ్చా? ఎన్ని బాటిళ్లు తెచ్చుకోవచ్చు..చట్టం ఏం చెబుతుంది?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 09, 2026 06:33:52
New Delhi, Delhi:

Bomb Threat Delhi Schools Today: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. సోమవారం ఉదయం పార్లమెంటుతో పాటు ఢిల్లీలోని సుమారు 9 ప్రముఖ పాఠశాలలకు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. "ఢిల్లీ ఖలిస్తాన్ అవుతుంది" అనే హెచ్చరికతో వచ్చిన ఈ మెయిల్స్ భద్రతా బలగాలను ఉలిక్కిపడేలా చేశాయి.

నకిలీ బాంబు బెదిరింపులు మెట్రో నగరాల్లో నిత్యకృత్యంగా మారుతున్న తరుణంలో, తాజా ఘటన తల్లిదండ్రులు మరియు అధికారులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

లక్ష్యంగా చేసుకున్న పాఠశాలలు
సోమవారం ఉదయం 8:30 నుండి 9:00 గంటల మధ్య కనీసం తొమ్మిది విద్యా సంస్థలకు ఈ బెదిరింపు ఈమెయిల్స్ అందాయి. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని లోరెటో కాన్వెంట్, రోహిణిలోని వెంకటేశ్వర్ గ్లోబల్ స్కూల్, బాల్ భారతి, CM శ్రీ స్కూల్, శ్రీనివాసపురి.. న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని కేంబ్రిడ్జ్ స్కూల్, సాదిక్ నగర్‌లోని ది ఇండియన్ స్కూల్, INAలోని DTEA స్కూల్, న్యూ రాజిందర్ నగర్‌లోని మానవ్ స్థలి స్కూల్ వంటి స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. 

బెదిరింపు ఇమెయిల్‌లోని సారాంశం
'ఖలిస్తాన్ నేషనల్ ఆర్మీ' పేరుతో వచ్చిన ఈ ఇమెయిల్‌లో అత్యంత వివాదాస్పదంగా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయి: "మధ్యాహ్నం 1:11 గంటలకు పేలుడు జరుగుతుంది. ఢిల్లీ ఖలిస్తాన్ అవుతుంది. అఫ్జల్ గురు జ్ఞాపకార్థం ఈ దాడి చేస్తున్నాం" అని అందులో పేర్కొన్నారు. ఈ వారం చివరలో, అంటే ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 1:11 గంటలకు పార్లమెంటు భవనంలో కూడా పేలుడు సంభవిస్తుందని నిందితులు హెచ్చరించారు.

రంగంలోకి భద్రతా బలగాలు
సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక దళం, బాంబు నిర్వీర్య దళం పాఠశాలలకు చేరుకున్నాయి. ముందస్తు జాగ్రత్తగా విద్యార్థులను, సిబ్బందిని వెంటనే పాఠశాల ప్రాంగణం నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రతి మూలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని, ప్రాథమికంగా ఇవి నకిలీ బెదిరింపులుగా కనిపిస్తున్నాయని పోలీసులు తెలిపారు.

ఢిల్లీలో ఇలాంటి బెదిరింపులు రావడం ఇది మొదటిసారి కాదు. జనవరి 29న ఐదు పాఠశాలలకు ఇలాగే ఈమెయిల్ బెదిరింపులు వచ్చాయి, అవి అబద్ధమని తర్వాత తేలింది. అలాగే అంతకుముందు జనవరి 28న ద్వారకా కోర్టు సముదాయానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది.

నిపుణుల హెచ్చరిక
పదేపదే వస్తున్న ఈ నకిలీ బెదిరింపుల మూలాన్ని కనిపెట్టేందుకు పోలీసులు సైబర్ సెల్ సాయంతో దర్యాప్తు చేస్తున్నారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Also Read: Indian Railways Liquor Rules: రైలులో మద్యం తీసుకెళ్లొచ్చా? ఎన్ని బాటిళ్లు తెచ్చుకోవచ్చు..చట్టం ఏం చెబుతుంది?

Also Read: England Vs Nepal Match: ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించిన నేపాల్.. తృటిలో చేజారిన అద్భుత విజయం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 09, 2026 05:54:41
Hyderabad, Telangana:

Indian Railways Liquor Carrying Rules: రైలు ప్రయాణంలో మద్యం బాటిళ్లను వెంట తీసుకెళ్లడం అనేది చాలా మంది ప్రయాణికుల్లో ఉండే ఒక పెద్ద సందేహం. సాధారణంగా రైల్వే స్టేషన్లు, రైళ్లను బహిరంగ ప్రదేశాలుగా పరిగణిస్తారు. అయితే, రైళ్లలో మద్యం రవాణాకు సంబంధించి రైల్వే చట్టాలతో పాటు ఆయా రాష్ట్రాల ఎక్సైజ్ నిబంధనలు కూడా వర్తిస్తాయి.

 అయితే ఈ విషయంలో చట్టం ఏం చెబుతోంది? ప్రయాణికులు ఎదుర్కొనే ఇబ్బందులు ఏమిటి? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. రైల్వే చట్టం 1989 ప్రకారం నేరుగా మద్యం రవాణాపై స్పష్టమైన నిషేధం లేనప్పటికీ, కొన్ని కీలక నిబంధనలు ప్రయాణికులను ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది.

రాష్ట్ర చట్టాలదే పైచేయి
రైలులో మద్యం తీసుకెళ్లడం అనేది మీరు ఎక్కడ ప్రయాణం మొదలుపెట్టారు? ఎక్కడికి వెళ్తున్నారు? అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మద్యం అనేది రాష్ట్ర పరిధిలోని అంశం. కాబట్టి ప్రయాణికుడు ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వెళ్లేటప్పుడు ఆయా రాష్ట్రాల ఎక్సైజ్ నిబంధనలను పాటించాలి. కొన్ని రాష్ట్రాలు నిర్దిష్ట పరిమితి వరకు అనుమతిస్తే, మరికొన్ని రాష్ట్రాలు అసలు అనుమతించవు.

భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మద్యంపై పూర్తి నిషేధం ఉంది. ఇక్కడికి మద్యం తీసుకెళ్లడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. గుజరాత్, బీహార్, నాగాలాండ్, లక్షద్వీప్. ఒకవేళ మీ రైలు ఈ రాష్ట్రాల గుండా వెళ్తున్నప్పుడు మీ దగ్గర మద్యం ఉంటే, అది వేరే రాష్ట్రంలో కొన్నదైనా సరే, ఆ రాష్ట్ర ఎక్సైజ్ అధికారులు మిమ్మల్ని అరెస్టు చేసే అధికారం కలిగి ఉంటారు. బీహార్ వంటి రాష్ట్రాల్లో ఇవి అత్యంత కఠినమైన శిక్షలకు దారితీస్తాయి.

రైల్వే పరిధిలో మద్యం సంబంధిత నిబంధనలు అతిక్రమిస్తే ఈ క్రింది చర్యలు ఉంటాయి. 6 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. రూ.500 నుండి రూ.1,000 వరకు జరిమానా విధిస్తారు (కొన్నిసార్లు జైలు, జరిమానా రెండు ఉండవచ్చు). మద్యం నిషేధిత రాష్ట్రాల్లో పట్టుబడితే భారీ జరిమానాతో పాటు సుదీర్ఘ చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ముఖ్య విషయాలు..
రైలులో లేదా ప్లాట్‌ఫారమ్‌పై మద్యం సేవించడం పూర్తిగా నిషేధం. సీలు వేసిన బాటిల్ అయినప్పటికీ, సంబంధిత రాష్ట్ర ఎక్సైజ్ అనుమతి లేనిదే రవాణా చేయడం రిస్క్‌తో కూడుకున్న పని. పండుగలు, సెలవు దినాల్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) తనిఖీలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

చట్టపరమైన ఇబ్బందులు పడకుండా ఉండాలంటే రైలు ప్రయాణాల్లో మద్యాన్ని వెంట తీసుకెళ్లకపోవడమే ఉత్తమం. ముఖ్యంగా మీరు వెళ్లే మార్గంలో మద్యం నిషేధిత రాష్ట్రాలు ఉంటే అది మరింత ప్రమాదకరం.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవడం ఉత్తమం. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: England Vs Nepal Match: ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించిన నేపాల్.. తృటిలో చేజారిన అద్భుత విజయం!

Also Read: Samsung 183 Ltr Refrigerator: అమెజాన్ సమ్మర్ ధమాకా.. రూ.23,000 శామ్‌సంగ్ ఫ్రిజ్..ఇప్పుడు కేవలం రూ.15 వేలకే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
AMAruna Maharaju
Feb 09, 2026 01:59:59
Hyderabad, Telangana:

Hyderabad Power Cut Today: హైదరాబాద్ నగర వాసులకు ముఖ్య గమనిక. నేడు నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. విద్యుత్ లైన్ల నిర్వహణ, ఫీడర్ల మరమ్మతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా యూసుఫ్‌గూడ, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు తమ పనులను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచించారు. నగరంలో విద్యుత్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు మరియు రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, పాతబడిన విద్యుత్ తీగలను మార్చడం, ట్రాన్స్‌ఫార్మర్ల నాణ్యతను తనిఖీ చేయడం వంటి పనులను విద్యుత్ శాఖ చేపడుతోంది. 

ఇందులో భాగంగా వివిధ ఫీడర్ల వద్ద మరమ్మతులు అవసరం కావడంతో, ఆయా ప్రాంతాల్లో సరఫరాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. ఈ అంతరాయం రెండు విడతలుగా ఉండనుంది. మొదటి విడత కోతలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటాయి. ఉదయం వేళలో పనులు ప్రారంభమయ్యే సమయం కావడంతో.. జవహర్‌నగర్, కళ్యాణ్‌ నగర్, మధురానగర్ ఈ నివాస ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుండి విద్యుత్ ఉండదు.

ఇక రెండవ విడత కోతలు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉండనున్నాయి. అలాగే మధ్యాహ్నం భోజన సమయం తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో పనులు కొనసాగుతాయి. పంజాగుట్ట  బాటా షోరూమ్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ (ఠాణా) ప్రాంతం మరియు హిమాలయా బుక్ డిపో పరిసరాల్లో సాయంత్రం వరకు విద్యుత్ ఉండదు. అంతేకాకుండా సాయిబాబా ఆలయ ప్రాంతం, పాత టెలిఫోన్ ఎక్ఛేంజ్ ఏరియాతో పాటు ద్వారకాపురి కాలనీ, సిద్ధార్థ నగర్, వెంగళరావు నగర్, మధురానగర్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ కోతలు అమలవుతాయి.

అయితే మరమ్మతులు నిర్ణీత సమయం కంటే ముందే పూర్తయితే, వెంటనే సరఫరా పునరుద్ధరిస్తామని విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. అయితే, వాతావరణ పరిస్థితులు లేదా ఇతర సాంకేతిక ఇబ్బందుల వల్ల స్వల్పంగా సమయం మారే అవకాశం ఉండవచ్చని కూడా పేర్కొన్నారు.

Also Read: School Holiday: స్కూల్ విద్యార్థులకు బంపర్ న్యూస్.. ఈ వారంలో వరుసగా 4 రోజులు సెలవులు..!  

Also Read: Today Rashi Phalalu: నేటి రాశి ఫలాలు.. ఈరోజు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. కోటిశ్వరులవ్వడం ఖాయం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 08, 2026 19:29:03
Sangareddy, Telangana:

Municipal Elections: 'గల్లీల్లో పారే మురుగు నీరు కన్నా.. రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చే మురికి మాటలు మరింత కంపు కొడుతున్నాయి. కమీషన్ల కోసం రూ.40,000 కోట్లు కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి ఉన్నాయి కానీ ఉద్యోగులు, పేదలకు ఇవ్వడానికి రేవంత్ దగ్గర డబ్బులు లేవు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం గులాబీ జెండానే ఎగురుతోందని జోష్యం చెప్పారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, కోహీర్, నర్సాపూర్, మెదక్.. మున్సిపాలిటీ ఏదైనా గెలిచేది కారు గుర్తేనని హరీశ్‌ రావు ప్రకటించారు.

Also Read: YS Sharmila: నామ్ నరేందర్.. కాం సరెండర్: ప్రధానిపై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డిలో బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు కీలక ప్రసంగం చేశారు. 'మోసం చేసిన వాళ్లకు ఓటేస్తామా? అన్నం పెట్టిన కేసీఆర్‌కు ఓటేస్తామా? హామీల పేరుతో జనాలకు సున్నం పెట్టిన రేవంత్ రెడ్డికి ఓటేద్దామా? ప్రజలు ఆలోచించుకోవాలి' అని విజ్ఞప్తి చేశారు. 'తెలంగాణ సాధిస్తానంటే సాధించి చూపించింది కేసీఆర్ రూ.2000 పింఛన్ ఇస్తానంటే ఇచ్చింది కేసీఆర్. కల్యాణలక్ష్మి కింద రూ.లక్ష, కేసీఆర్ కిట్ కింద రూ.13,000 ఇచ్చి చూపించింది కేసీఆర్. ఇదీ అసలు నాయకుడి లక్షణం' అని వివరించారు.

Also Read: Forensic Lab: నేరగాడే సీఎం కావడంతోనే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రమాదం.. రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌

'సంగారెడ్డి పట్టణ అభివృద్ధి కేసీఆర్ హయాంలోనే జరిగింది. రూ.34 కోట్లతో ఇంటింటికి తాగునీళ్లు ఇచ్చి అక్కచెల్లెళ్ల కష్టాలు తీర్చాం. చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు రోడ్లు, లైట్లు, డివైడర్లు  అభివృద్ధి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లయింది. సంగారెడ్డిలో ఎక్కడైనా ఒక్క రూపాయి పని చేశారా?' అని ప్రశ్నించారు. ఎన్నికల కోసం శాంక్షన్లు, టెండర్లు లేకుండా కొబ్బరికాయలు కొట్టి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

Also Read: Harish Rao: బూతుల రేవంత్‌ రెడ్డికి పోలింగ్ బూత్‌లో  బుద్ధి చెప్పాలి: హరీశ్ రావు

'రేవంత్ రెడ్డిది కమీషన్ల ప్రభుత్వం. రూ.95 వేల కోట్ల టెండర్లు పిలిచి డబ్బులు ఇవ్వడానికి ఉన్నాయి. రూ.40,000 కోట్లు కాంట్రాక్టర్లకు, మిత్రుకు కమీషన్లు తీసుకోవడానికి డబ్బులు ఉన్నాయి కానీ.. రిటైర్డ్ ఉద్యోగులకు, పీఆర్సీ, డీఏ బకాయిలు ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవా?' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు కమీషన్లు ఇస్తారు.. రిటైర్డ్ ఉద్యోగులు కమీషన్లు ఇవ్వరని వాళ్లకు ఇవ్వడం లేదా? అని నిలదీశారు. 'రుణమాఫీ పేరుతో దేవుళ్ల మీద ఒట్టేసి మోసం చేశారు. ఆగస్టు 15 కల్లా చేస్తానన్నాడు.. ఇప్పుడు ఏ ఊర్లో చూసినా రైతులు ఆందోళన చేస్తున్నారు. నేను సవాల్ చేస్తున్నా.. రేవంత్ రెడ్డి నువ్వు ఏ ఊరికైనా రా.. లేదా కొడంగల్ కు రమ్మన్నా వస్తా.. రుణమాఫీ పూర్తిగా జరిగిందో లేదో తేల్చుకుందాం' అని రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌ రావు సవాల్‌ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 08, 2026 16:20:04
Hyderabad, Telangana:

England Vs Nepal Match Result: ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్-సి మ్యాచ్‌లో పెను సంచలనం తృటిలో తప్పింది. పవర్‌హౌస్ ఇంగ్లాండ్‌ను పసికూన నేపాల్ గడగడలాడించింది. చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో ఇంగ్లాండ్ కేవలం 4 పరుగుల స్వల్ప తేడాతో బయటపడింది. ఓడినా కూడా ప్రపంచ క్రికెట్ అభిమానుల హృదయాలను నేపాల్ గెలుచుకుంది.

ముంబై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో నేపాల్ ప్రదర్శన చూసి క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. అసోసియేట్ దేశమైనా, ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు దీటైన పోటీని ఇచ్చింది.

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నేపాల్ బౌలర్ల ధాటికి స్టార్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్, జాస్ బట్లర్ త్వరగానే పెవిలియన్ చేరారు. జాకబ్ బెథెల్ (55) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. 

ఇన్నింగ్స్ చివరలో విల్ జాక్స్ కేవలం 18 బంతుల్లోనే 39* పరుగులు చేసి స్కోరును 184/7 కి చేర్చాడు. దిపేంద్ర సింగ్ ఐరీ (2/23), నందన్ యాదవ్ (2 వికెట్లు) అద్భుతమైన స్పెల్స్‌తో ఇంగ్లీష్ బ్యాటర్లను కట్టడి చేశారు.

నేపాల్ వీరోచిత పోరాటం
185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ ఏ దశలోనూ తగ్గలేదు. ఓపెనర్లు ఆసిఫ్ షేక్, కుశల్ భుర్తేల్ జట్టుకు బలమైన పునాది వేశారు. కెప్టెన్ రోహిత్ పౌడెల్ (39), ఆల్‌రౌండర్ దిపేంద్ర సింగ్ ఐరీ (44) ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా ఐరీ ఆడిన రివర్స్ స్వీప్‌లు, ఇన్నోవేటివ్ షాట్లు వాంఖడే స్టేడియాన్ని హోరెత్తించాయి. చివరి ఓవర్‌లో విజయానికి 10 పరుగులు అవసరం కాగా, ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ సామ్ కరన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. దీంతో నేపాల్ 180/6 వద్ద ఆగిపోయింది.

రికార్డులు
టీ20 ప్రపంచకప్ చరిత్రలో నేపాల్ సాధించిన అత్యధిక స్కోరు (180/6) ఇదే. ఇంగ్లాండ్ వంటి అగ్రశ్రేణి జట్టును ఓటమి అంచు వరకు తీసుకెళ్లిన నేపాల్ టీమ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

అనుభవం లేకపోయినా, అద్భుతమైన పోరాట పటిమను కనబరిచిన నేపాల్, భవిష్యత్తులో పెద్ద జట్లకు ముప్పుగా మారుతుందని నిరూపించింది. ఇంగ్లాండ్ విజయం సాధించినప్పటికీ, ఈ మ్యాచ్ 'నేపాల్ రైజ్'ను ప్రపంచానికి చాటిచెప్పింది.

Also Read: Samsung 183 Ltr Refrigerator: అమెజాన్ సమ్మర్ ధమాకా.. రూ.23,000 శామ్‌సంగ్ ఫ్రిజ్..ఇప్పుడు కేవలం రూ.15 వేలకే!

Also Read: Gold Silver Price Prediction: మహిళలకు తీపికబురు..లక్షకు పైగా దిగివచ్చిన వెండి ధర...భారీగా తగ్గిన బంగారం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 08, 2026 15:43:37
Hyderabad, Telangana:

Amazon Samsung Refrigerator: అమెజాన్ సమ్మర్ సేల్‌లో భాగంగా మధ్యతరగతి వినియోగదారులకు శామ్సంగ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న Samsung 183 లీటర్, 4 స్టార్, డిజిటల్ ఇన్వర్టర్ రిఫ్రిజిరేటర్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది.

వేసవి కాలం మొదలవుతున్న తరుణంలో కొత్త ఫ్రిజ్ కొనాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. అత్యుత్తమ రేటింగ్ ఉన్న ఈ శామ్సంగ్ మోడల్‌పై ధర తగ్గింపుతో పాటు అదనపు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

అమెజాన్ 'లిమిటెడ్ టైమ్ డీల్' ద్వారా లభిస్తున్న ప్రయోజనాలు ఇవే! ఈ ఫ్రిజ్ అసలు ధర రూ.22,999 కాగా.. ప్రస్తుతం 30% డిస్కౌంట్‌తో రూ.15,990కే అందుబాటులో ఉంది. ఆర్డర్ చేసే సమయంలో అదనంగా రూ.1,000 కూపన్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. దీంతో ధర మరింత తగ్గుతుంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.1,500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. బడ్జెట్ ఇబ్బంది ఉన్న వారికి నెలకు కేవలం రూ.562 నుండి ప్రారంభమయ్యే 'నో కాస్ట్ ఈఎంఐ' సౌకర్యం కూడా ఉంది.

ఈ ఫ్రిజ్ ఎందుకు ప్రత్యేకమైనది? (కీ ఫీచర్లు)
కేవలం ధర మాత్రమే కాదు, ఫీచర్ల పరంగా కూడా ఇది బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. ఇది వోల్టేజ్ హెచ్చుతగ్గులకు అనుగుణంగా పని చేస్తూ విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది. దీని కంప్రెసర్‌పై ఏకంగా 20 ఏళ్ల వారంటీని కంపెనీ ఇస్తోంది. ఎనర్జీ సేవింగ్‌లో ఇది మేటి. తక్కువ కరెంటు బిల్లుతో ఎక్కువ కూలింగ్ అందిస్తుంది.

ఫ్రిజ్ కింద ఉండే అదనపు డ్రాయర్‌లో ఉల్లిపాయలు, బంగాళదుంపలు వంటి చల్లదనం అవసరం లేని వస్తువులను భద్రపరుచుకోవచ్చు.'కామెల్లియా పర్పుల్' కలర్, ఫ్లోరల్ డిజైన్ మీ కిచెన్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.

తక్కువ ధరలో బ్రాండెడ్, నాణ్యమైన రిఫ్రిజిరేటర్ కావాలనుకునే వారికి ఈ శామ్సంగ్ 183 లీటర్ల మోడల్ సరైన ఛాయిస్. అయితే ఇది లిమిటెడ్ టైమ్ డీల్ మాత్రమే, కాబట్టి స్టాక్ ముగిసేలోపే నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

Also Read: Gold Silver Price Prediction: మహిళలకు తీపికబురు..లక్షకు పైగా దిగివచ్చిన వెండి ధర...భారీగా తగ్గిన బంగారం!

Also Read: Telangana Municipal Elections: తెలంగాణలో మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. భారీగా నగదు పట్టివేత..ఎన్ని కోట్లు సీజ్?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 08, 2026 15:24:49
Hanamkonda, Telangana:

Forensic Lab Fire Accident: ఓటుకు నోటు కేసు సాక్ష్యాధారాలను చెరిపేందుకే రేవంత్‌ రెడ్డి ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం కుట్ర చేశాడని మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఎఫ్ఎస్‌ఎల్ ప్రమాదం ముమ్మాటికీ కుట్రనే అని ప్రకటించారు. ఓటుకు నోటు సాక్ష్యాధారాలను శాశ్వతంగా తొలగించేందుకే ఈ ప్రమాదం అనే నాటకమని ఆరోపించారు. ఎఫ్ఎస్‌ఎల్ ప్రమాదంపైన అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు. నేరగాడే ముఖ్యమంత్రి కావడంతోనే ఇలాంటి దుర్మార్గమైన సంఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

Also Read: YS Sharmila: నామ్ నరేందర్.. కాం సరెండర్: ప్రధానిపై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు

హన్మకొండలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ అగ్నిప్రమాదంపై స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు రేవంత్‌ రెడ్డి మంటలు పెట్టారని ఆరోపించారు. ఢిల్లీలో ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులు ఏమైనా దీని వెనుక ఉన్నారా అనే విషయం నిగ్గుతేల్చాలి అని మాజీ మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డి పాత్రపైన నిష్పాక్షిక విచారణ జరగాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: Harish Rao: బూతుల రేవంత్‌ రెడ్డికి పోలింగ్ బూత్‌లో  బుద్ధి చెప్పాలి: హరీశ్ రావు

'ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో రేవంత్ రెడ్డితో పాటు వేలాది మంది ఘోరమైన నేరస్తుల కేసుల తాలూకు సాక్ష్యాలు దగ్ధమయ్యాయి. వారంతా ఈరోజు సమాజంలో స్వేచ్ఛగా తిరిగే అవకాశం లభిస్తుంది. రేవంత్ రెడ్డికి, బడే భాయ్ (బీజేపీ)కి సంబంధం లేకుంటే ఈ అంశంపై విచారణకు ఆదేశించాలి' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కోరారు. తెలంగాణ ప్రజలు ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక కుట్రగా భావిస్తున్నారు

'అగ్ని ప్రమాదానికి కారణం ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రే కుట్ర చేసి సాక్ష్యాధారాలను దగ్ధం చేశారు' అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 'ఓటుకు నోటు కేసు దాదాపు ముగింపు దశకు వచ్చి శిక్ష పడుతుందన్న కారణంగానే హోం శాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ ప్రమాదం వెనుక ఉన్నారు' అని తెలిపారు. ఇదే అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి లాంటి ఒక క్రిమినల్, దొంగ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడంతో అనేక దుర్మార్గాలను తెలంగాణ ప్రజలు రెండేళ్లు చవిచూస్తున్నారని వివరించారు. అలాంటి వరుస సంఘటనల్లో భాగంగానే తాజాగా ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం జరిగిందని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Also Read: KT Rama Rao: తెలంగాణకు కాంగ్రెస్‌, బీజేపీలు చేసిందేమీ లేదు: కేటీఆర్‌

'ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి ఆ కేసులోని ఆధారాలన్నింటినీ భద్రపరిచిన ఫోరెన్సిక్ లాబొరేటరీని కుట్రపూరితంగా ఆధారాలన్నీ ధ్వంసం చేసేటట్టు అగ్ని ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారు. మూడు అంతస్తుల భవనంలో జరిగిన ప్రమాదాన్ని, మొదటి అంతస్తులో ఉన్న అగ్నికీలలను ఆర్పడానికి మూడున్నర గంటల సమయం పట్టింది అంటే ఇంతకు మించి కుట్ర అనడానికి వేరే విషయం అవసరం లేదు' అని కేటీఆర్‌ వివరించారు. ఈ ప్రమాదం జరిగిన తీరుపై కేటీఆర్ అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. 

'అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఫోరెన్సిక్ ల్యాబ్‌లో చలికాలం అగ్ని ప్రమాదం జరగడం, 24 గంటలు ఉద్యోగులు ఉండాల్సిన చోట ఉద్యోగులు ఎవరూ లేరని చెప్పడం, నిన్న ప్రమాదం పెద్దగా జరగలేదని చెప్పిన ప్రభుత్వం ఈరోజు మొత్తం 2015 నుంచి పదేళ్ల పాటు అనేక కేసులకు సంబంధించిన సాక్ష్యాధారాలు పూర్తిగా దగ్ధమయ్యాయని ప్రకటించడం చూస్తుంటే ఇది కచ్చితంగా రేవంత్ రెడ్డి చేయించిన పనే' అని మాజీ మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 08, 2026 13:25:58
Hyderabad, Telangana:

Venomous Snake Viral Video Watch: ప్రస్తుతం చాలా పాములు అడవుల్లో నుంచి జనాలు తిరిగే ప్రదేశాల్లోకి సంచారం చేస్తున్నాయి. ముఖ్యంగా చాలామంది వాటిని చంపకుండా రక్షించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో భాగంగానే కొంతమంది స్నేక్యాచెస్ వీటిని పట్టుకోవడంలో ఎంతగానో సహాయపడుతున్నారు. అయితే, కొంతమంది స్నేక్ క్యాచర్స్ ప్రతిరోజు మూడు నుంచి నాలుగు పాములను పట్టుకుంటున్నారు. ఇలా పట్టుకున్న పాములను అడవిలో సురక్షితంగా వదిలేస్తున్నారు. తాజాగా ఓ స్నేక్ క్యాచర్ ఇలా వదిలేస్తున్న పాములను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఈ షార్ట్ వీడియో వైరల్‌గా మారింది. 

KP SNAKE EXPRT అనే ఛానల్ నుంచి పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి వివిధ గ్రామాల్లో పట్టుకున్న పాములను డబ్బాలో బంధించి.. ఓ సురక్షితమైన అడవిలో వదిలి పెడుతున్న దృశ్యాలను షేర్ చేశారు. ఇక ఈ వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి ప్లాస్టిక్ డబ్బాలో ఏడు నుంచి పది వరకు అత్యంత ప్రమాదకరమైన పాములతో పాటు గుడ్లు గుడ్లను భద్రపరిచి ఉండడం చూడొచ్చు. అయితే, ఆ వ్యక్తి డబ్బాను పట్టుకొని ఓ సురక్షితమైన ప్రదేశంలో దాని మూతాను విప్పడం మీరు చూడొచ్చు. 

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

ఆ వ్యక్తి ఆ మూతను విప్పుతూ పాములన్నింటినీ.. ఎంతో నెమ్మదిగా ఆ నిర్మానుష్య ప్రదేశంలో వదిలిపెట్టేసాడు. అయితే, ఇందులో ఆశ్చర్యం ఏంటంటే.. అందులో నుంచి చిన్న చిన్న గుడ్లు కూడా బయటికి పడ్డాయి. వీటిని బాగా పరిశీలించి చూస్తే.. ఇవి పాము గుడ్లుగా తెలుస్తోంది. ఇందులోనే ఉన్న కొన్ని పాములు ఆ డబ్బాలు గుడ్లను పెట్టినట్లు సమాచారం. అయితే, ఆ డబ్బాలో నుంచి పాములను బయటికి వేయగానే.. అక్కడి నుంచి అవన్నీ సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపోయాయి. 

ఇక ఆ డబ్బా బోర్లించిన తర్వాత పాములు వెళ్ళిపోగా.. గుడ్లు మాత్రం అక్కడే ఉండిపోవడం మీరు వీడియోలో చూడొచ్చు. అయితే ఇందులో కొన్ని చిన్న పిల్లలు మాత్రం చాలా నెమ్మదిగా వాకుతూ సురక్షితమైన ప్రదేశానికి వెళ్లడం మీరు క్లియర్‌గా ఈ వీడియోలో చూడొచ్చు. ఈ పాములన్ని విషపూరితమైన కావా అన్న విషయాలు తెలియనప్పటికీ.. ఇందులో ఉన్న కొన్ని పాములు మాత్రం అత్యంత ప్రమాదకరమైనవని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ షార్ట్ వీడియో ఓ ప్రముఖ స్నేక్ క్యాచర్ కు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 08, 2026 13:15:18
Hyderabad, Telangana:

Two Cobras Video Watch Now: ప్రకృతిలోని కొన్ని భయంకరమైన దృశ్యాలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కూడా నెటిజన్లను ఊహించని స్థాయిలో వణికిస్తోంది. ఈ వీడియోను "KP SNAKE EXPRT" అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన రెండు కింగ్ కోబ్రాలు ఒక రోడ్డుపై పూసలు కొడుతూ కనిపించడం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయిపోతున్నారు. రోడ్డుపై ఇలా ప్రమాదకరమైన రెండు తాగు పాములు ఉండడం ఏంటని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఎక్కడ జరిగిందో? ఈ వీడియోని ఎవరు తీశారో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ షార్ట్ వీడియోలో రెండు ప్రమాదకరమైన నాగు పాములు పడగవిప్పి గాల్లోకి లేచి ఓ రోడ్డుపై నిలబడి ఉండడం మీరు చూడొచ్చు. ఈ పాములను చూస్తుంటే దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తోంది. అంతేకాకుండా ఆ పాములు భయంకరంగా శబ్దం చేయడం కూడా మీరు చూడొచ్చు. రెండు పాములు ఒకదాని ముందు మరొకటి నిలబడి ఉండటం.. అలాగే శబ్దం చేయడం చూస్తుంటే ఈ రెండు పాములు అతిధారణంగా దాడి చేసుకునే అవకాశాలు ఉన్నాయని వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు. పాములు ఒకదానిపై ఒకటి దాడి చేసుకునే క్రమంలో ఇలా సంకేతాలు ఇచ్చుకుంటాయని వారి తెలుపుతున్నారు.

ఈ రెండు ప్రమాదకరమైన కింగ్ కోబ్రాలు ఒకదానికొకటి పోటీగా ఉన్నట్లుగా.. ఎవరు పై చేయి సాధిస్తారనే రీతిలో ఒకదానిపై ఒకటి దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియో చూస్తే తెలుస్తుంది. పాములు బుసలు కొడితే ఏ జంతువైనా కాస్త భయపడుతూ ఉంటుంది. కానీ రెండు ఎదురెదురుగా ఒకదానికొకటి పాములే ఉండడంతో ఏమాత్రం భయపడలేకపోయాయి. అంతేకాకుండా ఆ పాములు కొద్దిసేపు అలాగే ఎదురెదురుగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

ఈ వీడియో షార్ట్ వీడియో అయినప్పటికీ.. దాదాపు 3.5 కోట్ల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వీడియోను లక్షలాదిమంది లైక్ చేసి.. వేల సంఖ్యలో కామెంట్లు చేసినట్లు మీరు చూడొచ్చు. సాధారణంగా చాలామంది పాములకు సంబంధించిన ఆశ్చర్యపరిచే వీడియోలు చూడడమే కాకుండా షేర్ కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా వీడియోలు భారీ మొత్తంలో వ్యూస్ సంపాదిస్తున్నాయని సమాచారం.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
Advertisement
Back to top