Back
జనసేన పార్టీ
Pallantla, Andhra Pradesh
జనసేన పార్టీ సీనియర్ నాయుకులు మెగా కుటుంభ అభిమాని, కొవ్వూరు మున్సిపాల్టీ జనసేన పార్టీ తరుపున ఎన్నికల్లో ధైర్యంగా నిలబడ్డ కొటే చంద్రరావు గార్కి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు
15
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
Gollet, Telangana:
క్రీడా గ్రామమైన గోలేటి టౌన్షిప్ లో శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పురుషుల జట్టును ఎంపిక చేసినట్టు ఉమ్మడి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్. తిరుపతి తెలిపారు. పురుషుల జట్టు కే. సిద్ధార్థరాజ్, ఏం. తిరుపతి, పి.పవన్ కుమార్,కే.అరుణ్,జి.గోపాల్,పి.శ్రీకాంత్,టి. దిలీప్ కుమార్, పి.దేవరాజ్,ఎం. సూర్య కుమార్, ప్రేమ్ కుమార్, సిహెచ్ గోపాలకృష్ణ, సిహెచ్.వరుణ్ ఎంపిక అయ్యారు.
0
Report
Gollet, Telangana:
ఆసిఫాబాద్ కొమరం భీమ్ జిల్లాలోని పలు మండలాలలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్ తో పాటు పలు గ్రామాలలోని దేవాలయాల్లో ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా మహిళలు తమ కుటుంబాలను చల్లగా చూడాలని కోరుకుంటూ పూజ కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ మహత్యం గురించి వివరిస్తూ భక్తి గీతాలాపన, భజన కార్యక్రమాలు చేపట్టారు. పారిశ్రామిక ప్రాంతమైన గోలేటి టౌన్షిప్ లోని కోదండ రామాలయంలో ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు.
8
Report
Pallantla, Andhra Pradesh:
కొవ్వూరు : 15-08-2025: కొవ్వూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం వద్ద "79 వ స్వాతంత్ర దినోత్సవం"లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, వేడుకలు జరుపుకున్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు గాయత్రి వెంకటేశ్వరావు గారి ఆధ్వర్యంలో, పార్టీ పాలకవర్గ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు, శ్రేయోభిలాషులు మొదలగు వారు.
15
Report
Gollet, Telangana:
గోలేటి గ్రామపంచాయతీ పరిధిలోని రేకులగూడెంలో వరదలు బీభత్సం సృష్టించాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి మానేపల్లి కుంట నిండి మత్తడి దుంకడంతో భారీ వరద వచ్చింది ప్రభావిత ప్రాంతాలైన దుబ్బ గూడెం, అంబేద్కర్ నగర్, రేకులగూడెం తదితర ప్రాంతాలలో వరద ప్రభావం అధికంగా ఉంది రేకులగూడెం పెట్రోల్ బంకు, స్థానిక ప్రభుత్వ పాఠశాల వద్ద వరద నీరు ముంచెత్తింది. ఇటీవల వచ్చిన వరదలతో అక్కడి టేకం స్వరూప ఇల్లు కూలిపోయింది. అధికారులు సర్వే చేసి న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
15
Report
Gollet, Telangana:
రెబ్బెన మండలంలో గత రాత్రి సుమారు పది గంటలకు ప్రారంభమైన ముసురు వాన నిరవదికంగా కూరుస్తూనే ఉంది. ఉదయం పూట వివిధ పనులకు వె ళ్లే వారికి ముసురు వాన ఆటంకంగా మారింది. భారీ వర్షంతో మండలంలో ని వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. గత మూడు రోజుల క్రితం కురిసిన అతి భారీ వర్షానికి మండలంలోని పలువురి ఇండ్లు దెబ్బు తిన్నాయి. అలాగే గోలేటి కి చెందిన యన్నం . శ్రీ నివాస రావు కు చెందిన పశువులు మృతి చెందాయి. ఎడ తెరిపి లేని వానలలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని మండల వాసులు భయ పడుతున్నారు.
15
Report
Tadepalligudem, Andhra Pradesh:
పశ్చిమగోదావరిజిల్లా
తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండల పరిధిలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు..
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
స్వాతంత్ర్య సమరయోధుల పోరాట పటిమను
భావితరం పౌరులు నాటి త్యాగధనులను స్మరించుకోవాలన్నారు.
14
Report
Bhimavaram, Andhra Pradesh:
పశ్చిమగోదావరిజిల్లా భీమవరంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు..ఈసందర్భంగా జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం స్వాతంత్ర సమరయోధులను సత్కరించారు మంత్రి..ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్మాన్ నయిం అస్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
14
Report
Bhimavaram, Andhra Pradesh:
నేడు శ్రావణమాసం నాల్గవ ఆఖరి శుక్రవారం కావడంతో పశ్చిమగోదావరి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన భీమవరం గ్రామదేవత శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సుమారు 1000 మందిక మహిళలు పాల్గొని వరలక్ష్మి వ్రతం పూజలు భక్తి శక్తులతో నిర్వహించారు.
14
Report
Eleti Padu, Andhra Pradesh:
79 వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ శ్రీ వాసవి శాంతి ధామ్ నందు 92 అడుగుల పంచలోహ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు
తివర్ణ పతాకంతో భారతమాతగా భక్తులకు దర్శనమిచ్చిచారు.
అటు శ్రావణమాసం ఆఖరి శుక్రవారం ఇటు స్వాతంత్ర దినోత్సవం కావడంతో ఆలయ ప్రాంగణంలో అమ్మవారిని భక్తితో పాటు దేశభక్తిని కూడా పెంపొందించే విధంగా అలంకరణ చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
14
Report
Manchili, Andhra Pradesh:
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు "స్త్రీ శక్తి పథకం" ప్రవేశపెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ అన్నారు. శుక్రవారం భీమవరం కొత్త బస్టాండ్ ఆవరణలో "స్త్రీ శక్తి" కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు.
14
Report
Gollet, Telangana:
రెబ్బెన మండలంలోని పలు గ్రామాలలో 79 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రజలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు మండల కేంద్రమైన రెబ్బెనతోపాటు గోలేటి గంగాపూర్ నంబాల ఎడవెల్లి కిష్టాపూర్ కొమరవెల్లి నారాయణపూర్ తదితర గ్రామాల్లో అధికారులు ప్రజలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గోలేటి టౌన్షిప్ లో సింగరేణి అధికారులతో పాటు పలు యూనియన్ల నాయకులు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
14
Report
Penugonda, Andhra Pradesh:
పశ్చిమగోదావరిజిల్లా పెనుగొండమండలం ములపర్రు ది. హిందూ ముస్లిం వ్యవసాయ సహకార సంఘం త్రీ సభ్య కమిటి సభ్యులు, కమిటి చైర్మన్ గుత్తుల లోకేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేదికలు నిర్వహించారు. ఇకార్యక్రమంలో కూటమి నాయకులు గ్రామస్తులు, సహకార సంఘం సిబ్బంది తదితరులు పాల్గొని జాతీయ జెండా వందనం చేశారు.
14
Report
Tadepalligudem, Andhra Pradesh:
పార్టీలకు అతీతంగా జనసేన కుటుంబంలో అందరికీ స్థానం కల్పిస్తామని రాష్ట్ర విప్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు.పెంటపాడు గ్రామానికి చెందిన వైసీపీ నేతలు దాసరి శ్రీనివాస్, దాసరి కోట సత్యం, సత్యనారాయణ రెడ్డి సహా 50 మందికి పైగా అనుచరులు జనసేనలో చేరారు.స్థానిక యలమపేటలో జరిగిన కార్యక్రమంలో బొలిశెట్టి కండువా కప్పి వారిని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి జనసైనికుని సుఖదుఖాల్లో పక్కన ఉంటామని అన్నారు.
14
Report
Palakollu, Andhra Pradesh:
రాష్ట్రంలో సాగునీటి సంఘాల ద్వారా జలవనరుల నిర్వహణపై సాగునీటి వినియోగదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన వర్చువల్ సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం నుండి పాల్గొన్నారు ఏపీ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు..ఈసందర్భంగా మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబుకు జలవనరుల శాఖ పనితీరును వివరించారు.ఇటీవల ఏర్పాటైన్ నీటి సంఘాల్లో రైతుల్ని భాగస్వామ్యం చేశామని జలవనరుల శాఖకు కేటాయించిన నిధులు, జరిగిన, జరుగుతున్న పనులపై వర్షాలు నేపథ్యంలో తీసుకొంటున్న చర్యలు పై సిఎంకు వివరించారు.
14
Report