AP Cabinet Expansion: ఏపీలో కేబినెట్ విస్తరణకు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతమున్న కేబినెట్ లో కొందరు మంత్రులకు ఉద్వాసన పలికి వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇచ్చే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈసారి జరిగే విస్తరణలో సీరియర్లు, పలు సమీకరణాలు కుదిరేలా విస్తరణ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కీలకంగా ఉన్న సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణను మంత్రివర్గంలోకి తీసుకునే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కాపులంతా జనసేన వైపు ఉన్నారు. దాంతో సీనియర్ నేత కన్నాను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా కాపులను తమవైపు తిప్పుకోవచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నారని తెలుస్తోంది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో పరిచయం అక్కర్లేని పేరు కన్నా లక్ష్మీనారాయణ. నాలుగు దశాబ్ధాలుగా రాజకీయ జీవితంలో ఉన్నారు ఆయన.. కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో మంత్రిగానూ పనిచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2024 ఎన్నికల ముందు టీడీపీలో చేరిన ఆయన సత్తెనపల్లి నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సాధించారు. గతంలోనే మినిస్టర్ ఇస్తామని హామీ ఉన్నా.. విస్తృత ప్రచారం జరిగినా.. చివరి నిమిషంలో కన్నాకు నిరాశ ఎదురైంది. కానీ ప్రస్తుతం మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కన్నాకు మంత్రి పదవి ఇవ్వాలనే మోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది. అయితే మంత్రివర్గం రేసులో పత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఈసారి మాజీ మంత్రి కన్నా రేసులో ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. కొత్తగా జరిగే విస్తరణలో మాజీమంత్రి కన్నాకు బెర్త్ ఖరారు అయినట్టు ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం కూటమి కేబినెట్లో 24 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో చాలామంది కొత్తవారే. టీడీపీలో ఎంతోమంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ.. వారిని పక్కన పెట్టిన సీఎం చంద్రబాబు.. సామాజిక సమీకరణాల దృష్ట్యా కొత్తవారికి అవకాశం ఇచ్చారు. కానీ కొత్తగా మంత్రులుగా అవకాశం దక్కినా నేతలు.. అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదని సీఎం చంద్రబాబు గుర్తించారు. ఇటీవల మంత్రుల పనితీరుపై నిర్వహించిన సర్వేలోనూ ఇదే విషయం స్పష్టమైందట. దాంతో వారికి కొద్దిరోజులు చాన్స్ ఇచ్చారు. పనితీరు మార్చుకుని.. పాలనపై దృష్టి సారించాలని హెచ్చరించారు. అయినప్పటికీ కొందరు పనితీరు అస్సలు మారలేదని తెలుస్తోంది. అందుకే వారిని తప్పించి.. సీనియర్ నేతలకు అవకాశం ఇచ్చే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ పేరును ఫైనల్ చేశారని ప్రచారం సాగుతోంది.
మరోవైపు కాపులను తమవైపు తిప్పుకోవడం ద్వారా జనసేనకు కూడా చెక్ పెట్టొచ్చని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట. ప్రస్తుతం ఏపీలో కాపులంతా జనసేన వైపే ఉన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో కాపులు పూర్తిగా దూరం అవుతారని భావనలో చంద్రబాబు ఉన్నారట. అందుకే కన్నా లాంటి నేతకు మంత్రి పదవి కల్పిస్తే.. కాపులను తమవైపు తిరుగుతారని భావిస్తున్నారట. అయితే రాష్ట్ర కేబినెట్లో ఇప్పటికే చాలా మంది కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులు ఉన్నారు. ఇప్పుడు మరో కాపు నేతకు మంత్రి పదవి ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు రెడీ అయ్యారని తెలుస్తోంది. దాంతో పదవులన్నీ కాపులకే ఇస్తే.. తమ పరిస్థితి ఏంటని మరికొందరు నేతలు ప్రశ్నిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. మొత్తంమీద కన్నా లక్ష్మీనారాయణకు మంత్రి పదవి త్వరలోనే ఖాయమని సత్తెనపల్లి తెలుగు తమ్ముళ్లు జోరుగా ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తోంది.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Mahalaxmi Raja Yoga Effect On Zodiac Telugu: కుజుడు చంద్రుని అనుకూల స్థానం ఎంతో శక్తివంతమైన రాజయోగాన్ని సృష్టిస్తుంది. ఇది ఆకస్మిక ఆర్థిక లాభాలతో పాటు ప్రమోషన్లు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా మార్చి 16వ తేదీన గ్రహాలకి అధిపతి, ధైర్యానికి కారకుడైన కుజుడు, మనసుకు కారకుడైన చంద్రుడు సంయోగం చేయబోతున్నాయి. దీంతో ఎంతో శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడబోతోంది. సాధారణంగా ఈ రాజయోగానికి ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మహాలక్ష్మి రాజయోగం ఏర్పడడం కారణంగా కొన్ని రాశుల వారికి అపారమైన ధన లాభాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. ఆయారాశుల వారికి అన్ని రకాల సమస్యలు ఎంతో సులభంగా పరిష్కారం అవుతాయి.. దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టే వారికి చాలా అనుకూలంగా ఈ సమయం మారుతుంది. అయితే, మార్చి 16వ తేదీ నుంచి మహాలక్ష్మి రాజయోగంతో అత్యధిక లాభాలు పొందబోయే రాశులేవో తెలుసుకుందాం.
ఈ రాశులవారికి లాభాలే, లాభాలు!
వృషభ రాశి
మహాలక్ష్మి రాజయోగం వృషభరాశి వారికి గణనీయమైన ఫలితాలను అందించబోతోంది. ముఖ్యంగా జీవితంలో ఆర్థిక పరిస్థితులు చాలావరకు మెరుగుపడతాయి. వ్యాపారాల్లో గణనీయమైన లాభాలు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వ్యక్తులకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కొత్త ప్రణాళికలతో సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అలాగే కుటుంబంలో ఆనందం విపరీతంగా పెరిగే ఛాన్సులు ఉన్నాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందించబోతోంది. ఉద్యోగాలు చేసే వ్యక్తులకు ప్రమోషన్స్ లభించడమే కాకుండా గణనీయంగా జీతాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు స్నేహితుల సపోర్టుతో మానసిక సమస్యల నుంచి విముక్తి పొందుతారు. అలాగే విపరీతంగా ఆనందం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాత ప్రణాళికల్లో.. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
వృశ్చిక రాశి
కుజుడు చంద్రుడి అద్భుతమైన సంయోగంతో ఏర్పడిన మహాలక్ష్మి రాజయోగంతో వృశ్చిక రాశి వారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా కెరీర్ పరంగా సానుకూలమైన మార్పులు ప్రారంభమవుతాయి. అలాగే సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ సమయంలో సరైన నిర్ణయాలు కూడా తీసుకుని అద్భుతమైన ముందడుగు వేస్తారు. కుటుంబంలో ఈ సమయంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.
ధనస్సు రాశి
మహాలక్ష్మి రాజయోగంతో ధనస్సు రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉండబోతోంది. వ్యాపారాలు లాభసాటిగా మారుతాయి. కుటుంబ జీవితంలో ఏవైనా అపార్ధాలు ఉంటే ఈ సమయంలో పూర్తిగా పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా కొన్ని రకాల నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా.. ఎంతో ఓపికగా ఉంటూ.. ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా పొందుతారు. అలాగే పెద్ద సమస్యల నుంచి ఉపశమనం కలగబోతోంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bill Gates: మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మరోసారి అంతర్జాతీయ వార్తల్లో చర్చకు దారి తీశారు. బాలలపై లైంగిక నేరాల కేసుల్లో నిందితుడు జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్ స్టీన్ ఫైల్ బయటకు పొక్కడంతో బిల్ గేట్స్ గతంలో చేసిన తప్పులను ఒప్పుకోవాల్సిన పరిస్ధితి వచ్చింది. దివంగత ఆర్థికవేత్త.. లైంగిక నేర కేసుల్లో నిందితుడిగా నిలిచిన Jeffrey Epsteinతో గతంలో తనకు ఉన్న పరిచయంపై ఆయన బహిరంగంగా స్పందిస్తూ తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ‘Bill & Melinda Gates Foundation’ సిబ్బందితో నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో గేట్స్ ఈ అంశంపై స్పష్టంగా మాట్లాడారు. ఎప్స్టీన్తో గడపడం తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పిదమని.. ఆ నిర్ణయం సంస్థ విలువలకు విరుద్ధమైందని ఆయన అంగీకరించారు.
సమావేశంలో భావోద్వేగానికి లోనైన గేట్స్.. నా నిర్ణయం వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించాలి. ఈ విషయానికి పూర్తి బాధ్యత నాదే అని అన్నారు. ఫౌండేషన్ ప్రతిష్ఠ ఎంతో కీలకమని, ఇటువంటి వివాదాలు దాతలు, భాగస్వాములు, సిబ్బందిపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్స్టీన్తో సంబంధం కొనసాగించడం ఒక తీవ్రమైన తీర్మాన దోషమని, ఆ సమయంలో తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు తనకు విచారం ఉందని చెప్పారు.
Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు అలర్ట్.. ఫిబ్రవరి 26వ తేదీ గురువారం ధరలు ఎలా ఉన్నాయో చూడండి..!!
ఇటీవల United States Department of Justice విడుదల చేసిన పత్రాల్లో ఎప్స్టీన్కు సంబంధించిన ఈమెయిల్ ముసాయిదాలు బయటకు రావడంతో వివాదం మళ్లీ ముదిరింది. వాటిలో గేట్స్పై పరోక్షంగా కొన్ని ఆరోపణలు ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను గేట్స్ ఖండిస్తూ తాను ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనలేదని స్పష్టం చేశారు. ఎప్స్టీన్తో ఉన్న పరిచయం తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్ఠకు భంగం కలిగించిందని, కానీ అక్రమ చర్యలకు తాను పాల్పడలేదని తెలిపారు.
ఫౌండేషన్ తరఫున ఎప్స్టీన్ లేదా అతని అనుబంధులతో ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదని సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఇదిలా ఉండగా, ఢిల్లీలో జరిగిన AI ఇంపాక్ట్ సమ్మిట్–2026లో గేట్స్ పాల్గొనాల్సి ఉన్నప్పటికీ అనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన హాజరు కాలేదని తెలియజేశారు. ఎప్స్టీన్ ఫైల్స్లో పలువురు ప్రముఖుల పేర్లు బయటపడటంతో ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా మరింత చర్చనీయాంశమైంది.
Also Read: Gold Silver Rate: బంగారం.. వెండిపై చైనా కీలక ప్రకటన.. ధరలు భారీగా తగ్గే అవకాశం..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Punarvika Treatment: అత్యంత అరుదైన వ్యాధి. ఆ వ్యాధి సోకితే దాదాపు ప్రాణం పోయినట్టే. కానీ ఒకే ఒక ఇంజెక్షన్తో తిరిగి ప్రాణం పోసుకోవచ్చు. కానీ ఆ ఇంజెక్షన్ ధర రూ.16 కోట్లు. అంత ఖరీదైన ఇంజెక్షన్ వేసుకోవడం మధ్యతరగతికి చాలా కష్టం. ఇక పేద కుటుంబాలకైతే అది కల.. ఇక ప్రాణం పోయినట్టే. అయితే మానవతామూర్తులు స్పందించడంతో ప్రాణాంతక వ్యాధికి గురయిన ఓ పేదింటి బిడ్డ తిరిగి ప్రాణం పోసుకోనుంది. బోసి నవ్వులతో తిరిగి ప్రపంచాన్ని చూడనుంది. ఆ పాపకు ఏపీ మంత్రి నారా లోకేశ్ భారీ విరాళం ప్రకటించడం మరింత విశేషం.
Also Read: TDP: గోదారోళ్ల ప్రేమాప్యాయతల్లో మునిగిన నారా లోకేశ్.. ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంప్రదాయం
ఎస్ఎంఏ టైప్ 1 కండరాల క్షీణత వ్యాధితో ఏపీకి చెందిన చిన్నారి పునర్విక బాధపడుతోంది. రూ.16 కోట్లు విలువైన ఇంజెక్షన్ విదేశాల నుంచి తీసుకువస్తే పాప బతికే అవకాశం ఉంది. చిన్నారి తల్లిదండ్రులు తమ పాప కష్టాన్ని సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. ఒక్కొక్కరూ తలచుకుంటే తమ పాప చికిత్సకు కావాల్సిన డబ్బులు సులభంగా సాధ్యమయని తెలిపారు. సహాయం కోసం అర్జించారు. తమ రక్తం పంచుకుని పుట్టిన పాపకు పునర్జన్మ ఇవ్వాలని ప్రాధేయపడడంతో సోషల్ మీడియాలో 'సేవ్ పునర్విక' అని ట్రెండింగ్ మొదలైంది. ప్రతి ఒక్క నెటిజన్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పునర్విక ప్రాణం కోసం తపించారు. వారికి చేతనైనా సహాయం చేశారు.
పునర్విక తల్లిదండ్రుల వీడియో చూసి పెద్ద ఎత్తున ప్రజలు ఆర్థికంగా అండగా నిలిచారు. ఒక్క తెలంగాణ, ఏపీ మాత్రమే కాకుండా దేశ, విదేశాల నుంచి పునర్విక వైద్య ఖర్చుల కోసం ప్రజలు, నెటిజన్లు ఆన్లైన్లో చెల్లించారు. చికిత్సకు కావాల్సిన రూ.16 కోట్లలో మానవత్వం ఉన్న ప్రజల ద్వారా రూ.10 కోట్లు సమకూరాయి. ఇంకా రూ.6 కోట్లు రావాల్సి ఉండగా అవి కూడా ఇచ్చేందుకు ప్రజానీకం సిద్ధంగా ఉంది. అయితే ఆ డబ్బును తాను ఇస్తానని ఏపీ మంత్రి నారా లోకేశ్ ముందుకువచ్చారు.
పునర్విక తల్లిదండ్రులు చేసిన వీడియోకు నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. పాప పునర్విక చికిత్సకు అవసరమైన 6 కోట్లు ఇస్తానంటూ లోకేష్ పోస్టు చేశారు. ఇప్పటికే రూ.10 కోట్లు విరాళాలుగా ప్రజల నుంచి సేకరణ చేశారని.. మిగిలిన రూ.6 కోట్ల బాధ్యత తనదేనని లోకేష్ హామీ ఇచ్చారు. పునర్వికకు పూర్తి చికిత్స అందేలా చూస్తానని.. ధైర్యంగా ఉండాలని పాప తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. పాప చికిత్స కోసం ఉదారంగా విరాళాలు ఇచ్చిన వారందరికీ ఈ సందర్భంగా నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
పునర్విక కుటుంబం
కర్నూలు జిల్లా వెల్దూర్తికి చెందిన సూర్యకుమార్, పుష్పవతి దంపతులకు 12 మే 2025న పునర్విక జన్మించింది. అయితే ఆరు నెలలు దాటినా పాప కదలికలు లేవు. పాకడం.. గెంతడం వంటివి పునర్విక చేయకపోవడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు కారణం బయటపడింది. ప్రాణాంతక స్పైనల్ మాస్క్యూలర్ ఆట్రోఫీ (ఎస్ఎంఏ) వ్యాధి ఉందని వైద్యులు నిర్ధారించారు.
ఎస్ఎంఏ అంటే?
ఇది అత్యంత అరుదైన వ్యాధి. ఈ వ్యాధి సోకితే కండరాల బలహీనత తీవ్రంగా ఉంటుంది. జీవచ్ఛవంలా మారుతారు. కొన్నిసార్లు ప్రాణాంతకంగా ఉంటుంది. జోల్గెన్స్మా ఇంజెక్షన్ ఈ వ్యాధికి నివారణగా పనిచేస్తుంది. కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ ఇదే. గతంలో కూడా ఇలాంటి వ్యాధి బారినపడితే సోషల్ మీడియా, ప్రజలు కలిసి ఆ ఇంజెక్షన్ కావాల్సిన డబ్బులు సర్దుబాటు చేశారు. తాజాగా పునర్విక విషయంలో కూడా అదే జరగడంతో ప్రపంచంలో ఇంకా మానవత్వం ఉందని నిరూపితమైంది.
SMA Type-1 is a rare and devastating genetic condition that weakens a child’s muscles and slowly takes away the ability to move, breathe and live normally. Yet little Punarvika from Kurnool, AP, is a true braveheart - fighting this battle with extraordinary courage.
— Lokesh Nara (@naralokesh) February 25, 2026
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Water Gun Panipuri Video Viral: భారతదేశంలో స్ట్రీట్ ఫుడ్ కున్న క్రేజ్ ఎంతో ఇంతో కాదు.. అందులోనూ పానీ పూరి అంటే ఇష్టపడని వారు ఉండరు.. సాధారణంగా పానీ పూరి షాప్ దగ్గర ఆ బండి వ్యక్తి ప్లేట్లో పానీపూరిని పెట్టి.. అందులో రసం పోయడం మనం తరచుగా చూస్తూ ఉంటాం.. కానీ ముంబైలో ఒక పానీ పూరి షాప్ వద్ద.. అందర్నీ ఆశ్చర్యపరిచేలా కొత్త ప్రయత్నం చేశాడు. ఆ పానీపూరీలమ్మే వ్యక్తి నేరుగా పానీపూరీలో రసం నింపకుండా.. ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్య పోవడం ఖాయం. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఏముందో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ముంబై కి చెందిన సాక్షి గదవే అనే ఒక ఫుడ్ లాకర్ ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి వెరైటీ పానీపూరి వీడియోను పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియోకు అద్భుతమైన క్యాప్షన్ ఇచ్చి పోస్ట్ చేయడం విశేషం. ఇది పానీపూరి కానీ.. ఇది కాంబ్యాట్ ఎడిషన్ అని క్యాప్షన్ రాసి పోస్ట్ చేసింది. ఈ వీడియోలు ఆ పానీ పూరి అమ్ముతున్న వ్యక్తి నలుపు రంగు దుస్తులను ధరించి.. హాలీవుడ్ సినిమా మాట్రిక్స్ స్టైల్లో కనిపించడం మీరు చూడొచ్చు. చేతిలో ఒక రంగురంగుల పెద్ద వాటర్ గాని పట్టుకొని.. అందులో పానీపూరి రసాన్ని నింపి నేరుగా తమ కస్టమర్స్ కి నోట్లో పోసేందుకు రెడీ ఉండడం వీడియోలో చూడొచ్చు..
అయితే పానీ పూరి కొనుగోలు చేసిన వారు ముందుగా.. పూరిని సిద్ధం చేసుకోగానే.. అతను తన వాటర్ గంతో గురి చూసి పానీపూరీలో ఆ రసాన్ని షూట్ చేస్తున్నారు. కొంతమంది పానీపూరి లవర్స్ అయితే.. నోటిలోకి ఆ రసాన్ని స్ప్రే చేయించుకోవడం మీరు చూడొచ్చు. ఈ సరికొత్త ప్రయోగం చూసి అక్కడున్న కొంతమంది ఆశ్చర్య పోతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగదారులు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు.. కొంతమంది ఇది జెన్-జీ (Gen-Z) తరానికి తగ్గ పానీ పూరీ బండి అని కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు ఇదొక వినూత్నమైన స్టార్టప్ ఐడియా అని ప్రశంసించడం విశేషం..
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
అయితే ఈ వినూత్న ఐడియాపై కొంతమంది సానుకూలంగా స్పందించడమే కాకుండా.. విమర్శల వర్షం కూడా కురిపిస్తున్నారు. ప్లాస్టిక్ వాటర్ గన్ ఉపయోగించడం వల్ల ఫుడ్ సేఫ్టీ దెబ్బతింటుందని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతలేని ప్లాస్టిక్ గండ్లను వాడటం వల్ల పానీపూరీలో రసాయనాలు కలిసే అవకాశాలు ఉన్నాయని.. దీని కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు రావచ్చని హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా.. ముంబై స్వీట్ ఫుడ్ లో ఈ గన్ పానిపూరి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది..
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Emotional Viral Video: కుటుంబ బంధాల్లో ఉండే స్వచ్ఛమైన ప్రేమ అనేది కొన్ని సందర్భాల్లో బయటికి వస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాలు వస్తేనే మనుషులు అనేది ఏంటని తెలుస్తుంది. అయితే బంధాల్లో ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగదారుల మనసు గెలుచుకుంటుంది. అనారోగ్యంతో ఉన్న తన వృద్ధ తండ్రికి ఒక కుమార్తె ఎంతో ఓపికగా.. ఏ మాత్రం కసురుకోకుండా సేవ చేస్తున్న తీరు చూసి సోషల్ మీడియా వినియోగదారులు బాగోద్వేగానికి గురవుతున్నారు.
ఇటీవలే పోల్ సమ్ అని ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియో అందరి మనసును దోచుకుంటుంది.. ఈ వీడియోలో ఒక కుమార్తె తన తండ్రికి దుస్తులు వేయడం మీరు చూడొచ్చు. ఆ వృద్ధుడు చాలా అనారోగ్య సమస్యతో బాధపడుతూ.. వదలలేని స్థితిలో ఉన్నప్పటికీ ఆమె ఏమాత్రం అసహ్యించకుండా ఎంతో సున్నితంగా ఆయనకు స్వెటర్ వేస్తూ ఉండడం మీరు చూడొచ్చు. సాధారణంగా ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు.. వారి దగ్గరికి వెళ్లేందుకే ఇష్టపడరు. అలాంటిది ఆ యువతి తండ్రి పై ఉన్న ప్రేమతో ఎంతో ఓపికతో స్వెటర్ వేస్తూ వేస్తూ ఉండడం ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారులకు బాగోద్వేగం తెప్పిస్తోంది.
అలాగే ఈ వీడియోలు ఆయన నడవడానికి ఇబ్బంది పడుతుంటే.. తన చేతులను పట్టుకుని ఆసరాగా నిలిచి బెడ్ వరకు తీసుకెళ్లడం కూడా మీరు చూడొచ్చు. ఆయన పడుకోవడానికి వీలుగా దిండ్లను సర్దడంతోపాటు తండ్రిని జాగ్రత్తగా కూర్చోబెట్టడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అయితే ఈ సమయంలో ఆమెను ఆమెను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..
A touching human scene of a girl documenting her care for her sick father and her daily attention to preparing him 🥺❤️ pic.twitter.com/AOkWkpFB93
— Wholesome (@wholesome_X_) February 24, 2026
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
ఈ వీడియో పై సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.. కుమార్తె చూపే ప్రేమ, సున్నితమైన స్పర్శ నిజమైన మానవత్వం అని కొంతమంది కామెంట్లు చేస్తే.. మరి కొంతమంది ఇలాంటి సందర్భాల్లో తండ్రిని చూసుకోవడం మాకు కన్నీళ్లు తెప్పిస్తోందని.. మరి కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ దృశ్యాలను చూసి కన్నీరు పెట్టుకున్నారని మరికొందరు కామెంట్లలో తెలుపుతున్నారు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు పిల్లలు వారికి అండగా నిలవడమే జీవితంలో అత్యంత విలువైన విషయమని ఈ వీడియో మరోసారి గుర్తు చేసింది..
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jagtial Latest Telugu News: జగిత్యాల పట్టణంలోని కళాచీ వాడలో అంబేద్కర్ విగ్రహం తొలగింపు ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. గుర్తుతెలియని కొంతమంది దుండగులు అర్ధరాత్రి వేళ విగ్రహాన్ని తొలగించడంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న మాజీమంత్రి ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి వెంటనే స్పందించి ఘటన స్థలానికి చేరుకున్నారు. అసలు అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరి తొలగించారు? అసలు అక్కడ ఏం జరిగింది? మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఘటనను జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. స్థానిక ప్రజలతో కలిసి స్వయంగా అంబేద్కర్ విగ్రహాన్ని అదే స్థానంలో తిరిగి ప్రతిష్టించారు.. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.. అయితే ఈ సందర్భంగా అక్కడికి పెద్ద ఎత్తున దళిత సంఘాల నాయకులతో పాటు స్థానికులు ప్రభుత్వంతో పాటు దుండగులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్ధరాత్రి ఎవరూ లేనిది చూసి అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడానికి తప్పుపట్టారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం అంటే అది కేవలం ఒక కులానికో.. మతానికో జరిగిన అవమానం కాదని.. అది యావత్ భారత జాతికి అగౌరపరచడమేనని.. ఆయన మండిపడ్డారు.. ప్రపంచవ్యాప్తంగా భారత ఖ్యాతిని పెంచడానికి.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, నేటి దేశ అభివృద్ధికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మూలమని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన దుండగులను తీవ్రంగా హెచ్చరించారు.
Also Read: Tirupati Crime News: అయ్యయ్యో కసాయి తల్లి.. ప్రియుడి కోసం కన్నకొడుకును కడతేర్చిన తల్లి!
రాజకీయాలకు అతీతంగా కళాచీ వాడ ప్రజలతో తమకు దశాబ్దాల అనుబంధం ఉందని.. ఇలాంటి నీచమైన ఘటనలు పునరావృతం కాకూడదని ఆయన తెలిపారు. ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులను.. వారిని ప్రోత్సహించిన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఉక్కు పాదం మోపాలని ఆయన కోరారు.. ఏది ఏమైనా అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం అది దేశానికే పెద్ద అవమానమని కొంతమంది స్థానికులు తెలుపుతున్నారు.
Also Read: Tirupati Crime News: అయ్యయ్యో కసాయి తల్లి.. ప్రియుడి కోసం కన్నకొడుకును కడతేర్చిన తల్లి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nandamuri Balakrishna Minister Post News: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో నందమూరి బాలకృష్ణకు చోటు దక్కబోతుందా? నందమూరి, మెగా కుటుంబాలకు క్యాబినెట్లో సమాన ప్రాధాన్యత దక్కనుందా? అన్న అంశాలపై పొలిటికల్ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
బాలకృష్ణ మంత్రి పదవిపై ప్రచారం
హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు (హ్యాట్రిక్) విజయం సాధించిన నందమూరి బాలకృష్ణకు ఈసారి మంత్రి పదవి ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. ఎన్టీఆర్ కాలం నుండి హిందూపురం నందమూరి కుటుంబానికి కంచుకోట.
అక్కడ తిరుగులేని విజయం సాధించిన బాలయ్యకు పాలనలో భాగస్వామ్యం కల్పించాలని నియోజకవర్గ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అయితే నందమూరి కుటుంబానికి టీడీపీలో ప్రాధాన్యత తగ్గింది అనే విమర్శలకు చెక్ పెట్టాలంటే బాలకృష్ణను మంత్రివర్గంలోకి తీసుకోవడం ఒక మార్గమని విశ్లేషకులు భావిస్తున్నారు.
బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వడంలో కొన్ని సాంకేతిక, రాజకీయ ఇబ్బందులు కూడా ఉన్నాయట. ఇప్పటికే బావ చంద్రబాబు ముఖ్యమంత్రిగా, అల్లుడు నారా లోకేష్ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు బాలయ్యకు కూడా పదవి ఇస్తే "కుటుంబ పాలన" అంటూ విపక్షాలు విమర్శించే అవకాశం ఉంది. గతంలో లోకేష్ కోసం బాలయ్య తన అవకాశాన్ని వదులుకున్నారనే చర్చ కూడా ఉంది.
నందమూరి vs మెగా ఫ్యామిలీ
ఈ సమీకరణంలో మెగా బ్రదర్ నాగబాబు ఎంట్రీ మరో ఆసక్తికర మలుపు. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఆయనను ఎమ్మెల్సీగా కూడా చేశారు.
మెగా కుటుంబం నుండి పవన్ కల్యాణ్ (డిప్యూటీ సీఎం), నాగబాబు (మంత్రి కాబోతున్నారని సీఎం ప్రకటించారు) ఇద్దరూ క్యాబినెట్లో ఉంటే.. నందమూరి కుటుంబం నుండి కేవలం లోకేష్ మాత్రమే ఉండటం అసమతుల్యతకు దారితీయవచ్చు. అందుకే నందమూరి అభిమానులను సంతృప్తి పరచడానికి బాలకృష్ణకు బెర్త్ ఖాయం చేసే అవకాశం కనిపిస్తోంది.
బాలకృష్ణ ప్రస్తుతం తన సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్నారు. ఒకవేళ మంత్రి పదవి ఖాయమైతే, త్వరగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. మెగా, నందమూరి కుటుంబాల మద్దతును పూర్తిస్థాయిలో కూడగట్టడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి కూటమిని మరింత బలోపేతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ 'డబుల్ ఫ్యామిలీ' స్కెచ్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి.
Also Read: Srikakulam Diarrhea News: భారీగా పెరిగిన డయేరియా కేసులు..ముగ్గురు మృతి, 76 మంది తీవ్ర అనారోగ్యం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rain On Wedding Day Hindu Tradition: పెళ్లి సీజన్ మొదలైందంటే చాలు.. ఊరూ వాడా కళ్యాణ భాజాల మోత మోగుతుంది. హిందూ సంప్రదాయంలో వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, అది నూరేళ్ల బంధం. అయితే, కొన్నిసార్లు వివాహం జరుగుతున్న సమయంలో అనుకోకుండా వర్షం కురుస్తుంటుంది. ఇలా పెళ్లి రోజు వర్షం పడటం అదృష్టమా? లేక అశుభమా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.
శ్రేయస్సు, అదృష్టానికి చిహ్నం
పెళ్లి రోజు వర్షం కురవడం చాలా శుభప్రదం అని పండితులు చెబుతున్నారు. వర్షం అనేది ఆకాశం నుండి కురిసే ఆశీర్వాదం వంటిది. ఇది నూతన వధూవరుల జీవితాల్లోకి అదృష్టాన్ని, శ్రేయస్సును తీసుకువస్తుందని నమ్ముతారు.
ప్రకృతిలో వర్షం భూమిని ఎలా శుద్ధి చేస్తుందో, అలాగే వివాహ సమయంలో పడే వర్షం ఆ జంటకి సంబంధించిన గతంలోని నెగటివిటీని కడిగివేసి, వారి కొత్త జీవితాన్ని స్వచ్ఛంగా ప్రారంభిస్తుందని భావిస్తారు. ఇది రాబోయే కాలంలో వారి మధ్య సంతోషాన్ని పెంచుతుందని అర్థం.
బలమైన బంధం
ఒక సామెత ప్రకారం.. తడిచిన ముడి విప్పడం చాలా కష్టం. అదేవిధంగా, వర్షంలో జరిగిన వివాహ బంధం కూడా చాలా బలంగా ఉంటుందని, ఆ దంపతులు కలకాలం విడదీయరాని బంధంతో కలిసి ఉంటారని విశ్వసిస్తారు.
అలాగే వర్షం పడితే భూమి పులకించి పంటలు ఎలా పండుతాయో, అలాగే పెళ్లి రోజు వర్షం పడటం ఆ జంటకు సంతాన ప్రాప్తిని, సిరి సంపదలను కలిగిస్తుందని సంప్రదాయాలు చెబుతున్నాయి. పిల్లాపాపలతో ఆ ఇల్లు కలకలలాడుతుందని దీని అర్థం.
ముఖ్య గమనిక: ఈ సమాచారం పూర్తిగా మత విశ్వాసాలు, పండితుల అభిప్రాయాలపై ఆధారపడి అందించబడింది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. వర్షం వల్ల పెళ్లి పనులకు కొంత ఆటంకం కలిగినా, ఆధ్యాత్మికంగా మాత్రం ఇది ఒక మంచి శకునంగానే పరిగణించవచ్చు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.
Also Read: Srikakulam Diarrhea News: భారీగా పెరిగిన డయేరియా కేసులు..ముగ్గురు మృతి, 76 మంది తీవ్ర అనారోగ్యం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tirupati Incident Telugu Latest News: సమాజం తలదించుకునేలా.. ఓ కన్నతల్లి ప్రవర్తించిన ఘటన ఇప్పుడు తీవ్ర సంచలనం రేపింది. తన వివాహేతర సంబంధానికి బిడ్డ అడ్డొస్తుందని భావించి.. రెండు సంవత్సరాలు కలిగిన కన్న బిడ్డను అత్యంత కిరాతకంగా హతమార్చింది.. ఈ ఘటన ఇప్పుడు తిరుపతిలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ ఆ కసాయి తల్లి బిడ్డను ఎలా చంపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తిరుపతికి చెందిన ఆశలత అనే ఓ మహిళలకు 2 సంవత్సరాల దుర్గ అనే కుమార్తె ఉంది. అయితే, ఆశలత ఇప్పటికే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన ప్రియుడితో కలిసి జీవించేందుకు ఆ చిన్నారి అడ్డుగా ఉందని భావించింది.. ఈ క్రమంలోనే చిన్నారిని వదిలించుకోవాలని నిర్ణయం తీసుకుంది. పాపను చంపేసి.. ఎవరికీ తెలియకుండానే గుట్టుచప్పుడు కాకుండా పూడ్చి పెట్టేసింది..
చిన్నారి దుర్గ కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన అమ్మమ్మ, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు దర్యాప్తులో భాగంగా ఈ దారుణం వెలుగులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది. ఈ కేసు నమోదు చేసిన ఈస్ట్ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితురాలు ఆశలత కదలికలపై నిఘా ఉంచగా.. ఆమె ఫోన్ సిగ్నల్ ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల శైలిలో విచారించగా.. తనే స్వయంగా.. బిడ్డను చంపి పూడ్చి పెట్టిన్నట్లు ఆమె నేరాన్ని అంగీకరించింది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
దీంతో నిందితురాలు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఏర్పేడు మండలం పాపానాయుడు పేట సమీపంలోని ప్రవహించే సర్ణముఖి నది ఒడ్డున చిన్నారి మృతదేహాన్ని పూడ్చి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి.. పంచనామా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఆశలతను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించే ప్రక్రియలో ఉన్నారు. ఈ హత్యలో ఆమె ప్రియుడి పాత్ర ఎంతవరకు ఉంది? అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vijay Rashmika Wedding Unseen Pics: టాలీవుడ్ మోస్ట్ టాక్డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా వీరి వివాహ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
ఉదయ్పూర్లో సందడి
ఉదయ్పూర్లోని ప్రతిష్టాత్మకమైన ఐటీసీ మెమెంటోస్ (ITC Mementos) హోటల్లో వీరి ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఫిబ్రవరి 24న నిర్వహించిన సంగీత్ ఈవెంట్ కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఎంతో ఉత్సాహంగా సాగింది.
వైరల్ అవుతున్న 'ప్రేమ జ్ఞాపకాలు'
పెళ్లి వేదిక వద్ద అతిథుల మొబైల్ ఫోన్లు, వీడియోలపై కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ, ఒక ప్రత్యేక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. హోటల్ ప్రాంగణంలో విజయ్, రష్మికల ఏడేళ్ల ప్రేమ ప్రయాణానికి సంబంధించిన అరుదైన ఫోటోలను ప్రదర్శనకు ఉంచారు.
వీరిద్దరూ కలిసి విదేశాలకు వెళ్ళినప్పటి ఫోటోలతో పాటు, 'గీత గోవిందం' షూటింగ్ సమయంలో బస్సులో దిగిన ఐకానిక్ ఫోటో కూడా ఈ గ్యాలరీలో ఉండటం విశేషం. షూటింగ్ స్పాట్స్లో వారు గడిపిన క్షణాల నుంచి నేటి వరకు వారి బంధం ఎలా బలపడిందో ఈ ఫోటోలు ప్రతిబింబిస్తున్నాయి.
పెళ్లి ఏర్పాట్లలో ప్రత్యేకతలు
ఈ వివాహాన్ని అత్యంత గోప్యంగా ఉంచేందుకు ఇరు కుటుంబాలు కొన్ని కఠిన నియమాలను పాటిస్తున్నాయి. వివాహ ఆచారాలు జరుగుతున్నప్పుడు ఎలాంటి వీడియోలు తీయకుండా నిషేధం విధించారు. పెళ్లి వేదికపై డ్రోన్ కెమెరాలు ఎగురవేయడానికి అనుమతి లేదు. ఈ రాయల్ వెడ్డింగ్లో భోజనాల విషయానికి వస్తే.. పక్కా సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ వంటకాలకు పెద్దపీట వేస్తున్నారు.
పెళ్లి వేడుకల ప్రైవసీ దెబ్బతినకుండా ఉండేందుకు, వివాహం ముగిసే వరకు హోటల్లో యూట్యూబర్లకు ఎలాంటి బుకింగ్స్ ఇవ్వడం లేదని సమాచారం. రేపు జరగనున్న ఈ పెళ్లి వేడుకతో విజయ్, రష్మికలు అధికారికంగా దంపతులు కానున్నారు. వీరిద్దరి 'కొత్త జీవితం' కోసం అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read: AP Housing Scheme: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త..ఇళ్ల స్కీమ్ డబ్బులు అకౌంట్లో పడేది ఆరోజే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
iQOO Z11x: దిమ్మతిరిగే ఫీచర్స్తో iQOO Z11x ఫోన్ త్వరలో లాంచ్.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు!
Iqoo Z11x Launch Date In India Telugu: ప్రీమియం ఫీచర్స్తో ప్రాముఖ్యత స్మార్ట్ఫోన్ కంపెనీ iQOO నుంచి మార్కెట్లోకి అద్భుతమైన మొబైల్ విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ కంపెనీ iQOO Z11x పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ముఖ్యంగా ఇది ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్తో లాంచ్ చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్ఫోన్ను కంపెనీ ఇటీవలే చైనాలో కూడా విడుదల చేసింది. గ్లోబల్ మార్కెట్లో త్వరలోనే లాంచ్ చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Geekbenchలో ఇప్పటికే ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన మోడల్ నెంబర్ కూడా కనిపించింది. ఇది I2507 మోడల్ నంబర్తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో అభిషేక్ యాదవ్ (@yabhishekhd) అనే టిప్ స్టార్ ఫీచర్స్ను లీక్ చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఈ స్మార్ట్ఫోన్ ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 7400 చిప్సెట్ ప్రాసెసర్తో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది Mali-G615 MC2 GPUతో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది..
iQOO Z11x స్మార్ట్ఫోన్ కొన్ని డేటాబేస్లో V2547A మోడల్ నంబర్తో అందుబాటులో ఉంచిన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్ 6.76-అంగుళాల పూర్తి HD+ టచ్స్క్రీన్ డిస్ల్పేను కలిగి ఉంటుంద. అంతేకాకుండా ఈ సిరీస్లో iQOO Z11 టర్బో స్మార్ట్ఫోన్ను ఇటీవలే కంపెనీ చైనాలో ప్రారంభించిన్నట్లు తెలుస్తోంది. అలాగే దీనిని కంపెనీ మొత్తం నాలుగు స్టోరేజ్ వేరియంట్స్లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇందులో హై ఎండ్ వేరియంట్ 16GB+1TB స్టోరేజ్తో లభించబోతోంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ఈ iQOO Z11 టర్బో స్మార్ట్ఫోన్ అద్భుతమైన 6.59-అంగుళాల 1.5K AMOLED డిస్ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ 16 ఆధారంగా OriginOS 6 ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది. అలాగే ఇది వెనక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇది 200-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అదనంగా ఈ స్మార్ట్ఫోన్ వెనక భాగంలో 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు ఎంతో శక్తివంతమైన 7,600mAh బ్యాటరీ ప్యాక్తో అందుబాటులోకి రాబోతోంది. అలాగే 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ను కూడా కలిగి ఉంటుంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AC Power Consumption: వేసవి కాలం వస్తోందంటే చాలు.. అందరి చూపు ఏసీల వైపు వెళ్తుంది. అయితే, ఏసీ ఇచ్చే చల్లని గాలి ఎంత హాయిగా ఉంటుందో, వచ్చే కరెంటు బిల్లు అంతకంటే ఎక్కువగా భయపెడుతుంది. అందుకే కొత్త ఏసీ కొనే ముందు లేదా వాడుతున్న ఏసీ బిల్లు తగ్గించుకోవాలంటే కొన్ని లెక్కలు తప్పనిసరి. 1 టన్ను ఏసీ ఎంత కరెంటును వినియోగిస్తుందో, బిల్లును ఎలా ఆదా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
1 టన్ను ఏసీ గంటకు ఎంత ఖర్చు?
సాధారణంగా ఏసీ వినియోగం అనేది దాని రకాన్ని బట్టి మారుతుంది. నాన్-ఇన్వర్టర్ ఏసీ గంటకు సగటున 0.9 నుండి 1.5 యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తుంది. ఇన్వర్టర్ ఏసీ అయితే గది ఉష్ణోగ్రతను బట్టి కంప్రెసర్ వేగాన్ని సర్దుబాటు చేస్తుంది కాబట్టి గంటకు 0.6 నుండి 1.2 యూనిట్ల లోపే ఖర్చవుతుంది.
కరెంటు బిల్లు లెక్క ఇలా..
మీ ఏసీ గంటకు సగటున 1 యూనిట్ కరెంటును వాడుతుందని అనుకుందాం. యూనిట్ ధర రూ.8 అనుకుంటే.. 1 గంట ఖర్చు రూ.8 ఉంటుంది. రోజుకు 8 గంటలు వాడితే రూ.64.. ఈ విధంగా నెలవారీ ఖర్చు (30 రోజులకు) సుమారు రూ.1,920 ఉంటుంది.
BEE స్టార్ రేటింగ్ (3 Star, 5 Star) ఎంత ఎక్కువగా ఉంటే విద్యుత్ ఆదా అంత ఎక్కువగా ఉంటుంది. ఏసీని 18°C దగ్గర నడిపితే కంప్రెసర్ నిరంతరం పనిచేసి బిల్లు ఎక్కువగా వస్తుంది. దీనిని 24°C - 26°C మధ్య ఉంచడం వల్ల కరెంటు ఆదా అవుతుంది. గది కిటికీలు, తలుపులు సరిగ్గా మూసి ఉండాలి. గాలి బయటకు వెళ్తుంటే ఏసీపై ఒత్తిడి పెరిగి కరెంటు ఎక్కువగా కాలుతుంది. ఏసీ ఫిల్టర్లను రెగ్యులర్గా శుభ్రం చేయకపోతే గాలి రాక కంప్రెసర్ కష్టపడాల్సి వస్తుంది.
AC కొనే ముందు ఇవి తప్పక చూడండి
1) గది పరిమాణానికి తగ్గట్టుగా ఏసీని ఎంచుకోవాలి. పెద్ద గదిలో చిన్న ఏసీ పెడితే గది చల్లబడదు, పైగా బిల్లు విపరీతంగా వస్తుంది.
2) ఎక్కువ గంటలు ఏసీ వాడే వారు ఇన్వర్టర్ ఏసీని ఎంచుకోవడం ఉత్తమం.
3) స్మార్ట్ ఫీచర్లు: టైమర్, స్లీప్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్న ఏసీలు విద్యుత్ ఆదాకు తోడ్పడతాయి.
4) చివరిగా ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ను కూడా తక్కువ స్పీడ్లో నడపడం వల్ల చల్లని గాలి గది అంతా త్వరగా వ్యాపించి, ఏసీపై భారం తగ్గుతుంది.
Also Read: AP Housing Scheme: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త..ఇళ్ల స్కీమ్ డబ్బులు అకౌంట్లో పడేది ఆరోజే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook