ఖమ్మంలో ప్రత్యక్షమైన లేడీ ఆఘోరీ
Mahabubabad, Telangana:ఖమ్మం జిల్లా మధిరలో లేడీ ఆఘోరీ ప్రత్యేక్షం అయింది. ఓ ప్రవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె చేరుకుని ప్రత్యేక పూజలు చేసింది. ఇదే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని హాజరైయ్యారు. ఈ క్రమంలో ఆఘోరీ కాళ్లు మొక్కిన నందిన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ నేపాథ్యంలో స్థానికులు ఆఘోరీతో సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
RTC Bus Driver: రీల్స్ చూస్తూ ఆర్టీసీ బస్ డ్రైవింగ్.. సస్పెండ్
Madanapalle, Arikela, Andhra Pradesh:RTC Bus Driver Watch Insta Reels While Driving Watch Viral VideoMouse Theft Gold: దొంగ ఎలుక.. బంగారం దుకాణంలో చోరీ
Tumakur, Karnataka:Mouse Theft Gold Ornaments In Jewellery Shop Video Goes ViralTelangana: దేశంలో పెట్టుబడులకు తెలంగాణ సురక్షిత స్థానం: రేవంత్ రెడ్డి
Hyderabad, Telangana:Invest Telangana: 'పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ సురక్షిత స్థానం. తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టాలి' అని తెలంగాణ ముఖ్యమంత్రి ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులకు రక్షణగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. 'తెలంగాణ సంస్కృతి తమకు పెద్ద ఆస్తి. హైదరాబాద్లో అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టిన దానికి రెట్టింపు ఆదాయం వస్తుంది. పారిశ్రామికవేత్తలు తమకు ఏం కావాలో చెబితే ఆ వసతులు కల్పిస్తాం' అని పెట్టుబడిదారులను తెలంగాణ సీఎం ఆకర్షించారు.
భారత పరిశ్రమల సమాఖ్య, ఉత్తర భారత ప్రతినిధులను హైదరాబాద్లో ముఖ్యమంత్రి కలిశారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రితో సమావేశమైన ప్రతినిధులు తమ ఆలోచనలు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ పారిశ్రామిక విధానాలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని, మంచి ప్రతిపాదనలతో వచ్చిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తున్నామని వివరించారు. 30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ఫార్చ్యూన్ 500 కంపెనీల పెట్టుబడులు పెట్టాలనేది తమ ఆకాంక్ష అని తెలిపారు.
'డిసెంబర్లో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో 175 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్ -2047 పాలసీని గ్లోబల్ సమ్మిట్లో ప్రకటించాం. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతంగా ఉందని.. అది 10 శాతంగా ఉండాలన్నదే మా లక్ష్యం' అని తెలంగాణ సీఎం తెలిపారు. ఐటీ శాఖ మంత్రి ప్రతి రెండు నెలలకోసారి, తాను ప్రతి మూడు నెలలకు ఒకసారి అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణను మీ సొంత ప్రాంతంగా భావించాలని సీఐఐ ప్రతినిధులకు సూచించారు.
దేశంలోని మెట్రో నగరాలు ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగుళూరు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ ఆ మహానగరాల పరిస్థితులు రావొద్దన్న ఉద్దేశంతో సంస్కరణలు తీసుకువచ్చాం. సర్వీస్ సెక్టర్, మాన్యుఫ్యాక్చర్ రంగం, వ్యవసాయ రంగానికి, వ్యవసాయ ఆధార పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలంగాణ సీఎం వివరించారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు ఇవ్వడంతో పాటు ఇతర వసతులు కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
వరంగల్, ఆదిలాబాద్లో ఎయిర్ పోర్టుల నిర్మాణాలకు కేంద్రం నుంచి అనుమతి తెలిపిందని, 7 బుల్లెట్ ట్రైన్లను కేంద్రం ప్రకటిస్తే 3 తెలంగాణకు వచ్చాయని తెలంగాణ సీఎం గుర్తుచేశారు. శంషాబాద్ నుంచి చెన్నై, శంషాబాద్ నుంచి పూణె, శంషాబాద్ నుంచి బెంగళూరు బుల్లెట్ ట్రైన్లు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోటీ పడి చైనా ప్లస్ 1 కంట్రీగా తెలంగాణను నిలపడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 2037 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతామని తెలిపారు.
'ఏఐ సునామీతో వైట్ కాలర్ జాబ్లు పోతుండడంతో నైపుణ్యాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాం. రాష్ట్రంలోని ఐటీఐలను ఏటీసీలుగా మార్చిన నేపథ్యంలో వాటిల్లో శిక్షణ పొందిన వారికి 100 శాతం ఉద్యోగాలు పొందారు. జీసీసీల్లో 200 కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయని, అమెజాన్ డేటా సెంటర్ల పై రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెడుతోందన్నారు. అదాని రూ.35 వేల కోట్లు డేటా సెంటర్పైన పెట్టుబడి పెడుతోంది' అని ముఖ్యమంత్రి వివరించారు.
RTC Bus Driver: సెల్ఫోన్ చూస్తూ బస్ డ్రైవింగ్.. వీడియో వైరల్ కావడంతో డ్రైవర్ సస్పెండ్
Madanapalle, Andhra Pradesh:Viral News: విధి నిర్వహణలో ఆదర్శంగా ఉండే ఆర్టీసీ డ్రైవర్ తీవ్ర నిర్లక్ష్యం వహించాడు. పదుల సంఖ్యలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సు డ్రైవర్ బాధ్యతగా ఉండాల్సి ఉండగా ప్రమాదకరంగా బస్సు నడిపాడు. సెల్ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయగా.. ఆ వీడియో వైరల్గా మారింది. నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఎట్టకేలకు అతడిని ఆర్టీసీ అధికారులు విధుల నుంచి తొలగించారు. ఈ వీడియో వైరల్గా మారింది. ఈ సంఘటన ఏపీలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన కలకలం రేపింది. మదనపల్లి నుంచి చిత్తూరుకు వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు (ఏపీ39 యూవీ 9691)ను డ్రైవర్ నిర్లక్ష్యం ప్రదర్శించాడు. బస్సు నడుపుతూనే డ్రైవర్ సెల్ఫోన్లో నిమగ్నమై డ్రైవింగ్ చేశాడు. ప్రయాణికులు వారిస్తున్నా వినిపించుకోలేదని తెలుస్తోంది. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
బస్సు డ్రైవర్ మొబైల్ ఫోన్ చూస్తూ ప్రమాదకరంగా బస్సు నడపడాన్ని గమనించిన ఓ ప్రయాణికుడు తన సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించాడు. అనంతరం అది సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. పలమనేరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో ఈ సంఘటన చోటుచేసుకుందని తెలిసింది. ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టి డ్రైవింగ్ చేస్తూనే సెల్ఫోన్ ఉపయోగించడంపై ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైరల్గా మారిన ఈ వీడియోపై అధికారులు స్పందించారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సంబంధిత డ్రైవర్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఆదర్శంగా ఉండాల్సిన ఆర్టీసీ డ్రైవర్లు ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని విధి నిర్వహణ సమయంలో సెల్ఫోన్లు ఉపయోగించకుండా కఠిన చర్యలు అమలు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఈ సమాచారం తెలుసుకున్న ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించారని తెలుస్తోంది. మొబైల్ ఫోన్ చూస్తూ బస్సు నడిపిన ఘటనపై ఆర్టీసీ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. ఆర్టీసీ అధికారులతో చర్చించి సంబందించిన ఆర్టీసీ డ్రైవర్ను వెంటనే సస్పెండ్ చేయించారని తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
HYDRAA: ఐపీఎస్ను పదవి నుంచి తొలగించడం కోర్టు ధిక్కార శిక్ష కాదు.. హైడ్రా కమిషనర్ వివరణ
Hyderabad, Telangana:HYDRAA vs High Court: తెలంగాణ హైకోర్టు ప్రాంగణాలలో తీవ్ర ఆందోళన కలిగించే ఒక విషయం జరుగుతోంది. అది కేవలం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రవర్తన మాత్రమే కాదు. ఆయన పదేపదే న్యాయపరమైన ఆదేశాలను ధిక్కరించడం సమర్థించరానిది. చట్టం అనుమతించిన అత్యంత తీవ్రమైన చట్టపరమైన పరిణామాలకు అర్హమైనది అయినప్పటికీ... ఇది ఆందోళన కలిగించే విషయం. చాలా తక్కువ పరిశీలనకు గురైనది ఏమిటంటే కోర్టు ఆదేశాలను ఐచ్ఛికంగా పరిగణించిన ఒక ఏజెన్సీపై స్పష్టంగా ఆందోళన వ్యక్తం చేస్తూ జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ స్వయంగా రాజ్యాంగ హద్దులను దాటారా లేదా అనేది. నిరంతర ఉల్లంఘనలతో ఎంతగా రెచ్చగొట్టినప్పటికీ.. ఏ న్యాయమూర్తి కూడా చట్టబద్ధంగా ఆ హద్దులను దాటకూడదు.
వాస్తవాలు సుస్పష్టంగా ఉన్నాయి. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని లోతుకుంట గ్రామంలో ఉన్న 40 ఎకరాల ప్రైవేట్ భూమిలోకి అమలులో ఉన్న న్యాయ ఉత్తర్వులను బేషరతుగా ధిక్కరిస్తూ హైడ్రా అధికారులు ప్రవేశించారని ఆరోపిస్తూజజ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పలు ధిక్కార పిటిషన్లను దాఖలు చేసింది. రిట్ అప్పీల్తో సహా పలు విచారణల ద్వారా ఆ ఆస్తి ప్రైవేట్ భూమి అనే విషయాన్ని సమర్థించారు. ప్రభుత్వ మద్దతుతో స్పష్టంగా ధైర్యం పుంజుకున్న హైడ్రా పదేపదే తిరిగి వస్తూనే ఉంది. కమిషనర్ దాఖలు చేసిన అఫిడవిట్లు అనాలోచితంగా, అసంపూర్ణంగా, చిత్తశుద్ధితో కూడిన, సకాలంలో క్షమాపణ లేకుండా ఉన్నాయని కోర్టు అభివర్ణించింది. ఏ విధంగా చూసినా, ఇది అత్యంత తీవ్రమైన ధిక్కారం. జస్టిస్ అనిల్ కుమార్ యొక్క తీవ్ర ప్రతిస్పందన పూర్తిగా అర్థం చేసుకోదగినదే. రాజకీయ అండతో పనిచేసే ఏజెన్సీలు కోర్టు ఉత్తర్వులను కేవలం సూచనలుగా పరిగణించినప్పుడు ఏ కోర్టు కూడా సరిగ్గా పనిచేయలేదు. కానీ ఈ పరిష్కార మార్గం రాజ్యాంగ పరిధిలోనే ఉండాలి.
న్యాయమూర్తి అనిల్ కుమార్ జారీ చేసిన రెండు ఆదేశాలు: ఒకటి పదవి నుంచి తొలగించాలని ఆదేశించడం. మరొకటి సైన్యాన్ని మోహరించాలని ఆదేశించడం. పరిశీలన అవసరమైన తీవ్రమైన రాజ్యాంగపరమైన ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.
తొలగింపు ఆదేశం - ఒక న్యాయపరిధి ప్రశ్న
హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ను తొలగించి ఆయన స్థానంలో తగిన వ్యక్తిని నియమించాలని న్యాయమూర్తి అనిల్ కుమార్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇది రాజ్యాంగ్యానికి సంబంధించిన ఒక ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తుతుంది. ఆ అధికారి ప్రవర్తన ఎంత బలంగా న్యాయపరమైన ప్రతిస్పందనను కోరినప్పటికీ అది ఇక్కడ అప్రధానం.
హైకోర్టుకు ఉండే 'కోర్టు ధిక్కార చర్యల' అధికారానికి రాజ్యాంగ పునాది అయిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 215 ఇలా పేర్కొంటోంది: "ప్రతి హైకోర్టు ఒక 'కోర్ట్ ఆఫ్ రికార్డ్' (రికార్డుల న్యాయస్థానం)గా ఉంటుంది. తనను తాను ధిక్కరించినందుకు శిక్షించే అధికారంతో సహా అటువంటి న్యాయస్థానానికి ఉండే అన్ని అధికారాలను కలిగి ఉంటుంది. 'కోర్టు ధిక్కార చట్టం, 1971'లోని సెక్షన్ 12(1) ప్రకారం.. ఈ చట్టంలో లేదా మరే ఇతర చట్టంలోనైనా ప్రత్యేకంగా పేర్కొన్న విధంగా తప్ప కోర్టు ధిక్కారానికి గరిష్టంగా ఆరు నెలల సాధారణ కారాగార శిక్ష లేదా రూ.2 వేల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
రాజ్యాంగం ఏం చెబుతోంది..?
సెక్షన్ 12(2) ఇంకా ఇలా.. 'ప్రస్తుతం అమలులో ఉన్న ఏ చట్టంలోనైనా ఏమున్నప్పటికీ తనను తాను ధిక్కరించినందుకు లేదా తన పరిధిలోని కింది కోర్టును ధిక్కరించినందుకు సబ్-సెక్షన్ (1)లో పేర్కొన్న దానికంటే మించిన శిక్షను ఏ కోర్టు కూడా విధించకూడదు'. కోర్టు ధిక్కార చట్టం, 1971లో లేదా మరే ఇతర భారతీయ చట్టంలో కోర్టు ధిక్కారానికి శిక్షగా ఒక ప్రభుత్వ అధికారిని చట్టబద్ధమైన లేదా కార్యనిర్వాహక పదవి నుంచి తొలగించాలని ఆదేశించే అధికారం ఏ కోర్టుకూ లేదు. చట్టం నిర్దేశించే శిక్షలు కేవలం కారాగారవాసం, జరిమానా మాత్రమే. పదవి నుంచి తొలగించడం అనేది కోర్టు ధిక్కారానికి సంబంధించిన శిక్షా విధానం కాదు. ఇది చట్టపరమైన పరిధికి పూర్తిగా వెలుపల ఉన్న అంశం.
రాజ్యాంగపరమైన అడ్డంకి కూడా అంతే స్పష్టంగా ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(1)లో 'కేంద్ర లేదా అఖిల భారత లేదా రాష్ట్ర సివిల్ సర్వీస్లో సభ్యుడిగా ఉన్న లేదా కేంద్రం లేదా రాష్ట్రం కింద సివిల్ పదవిని నిర్వహిస్తున్న ఏ వ్యక్తినైనా.. వారిని నియమించిన అధికారి కంటే తక్కువ స్థాయి అధికారి తొలగించకూడదు లేదా పదవి నుంచి తీసివేయకూడదు. హైకోర్టు అనేది ఐపీఎస్ అధికారిని నియమించే అధికారం కలిగిన సంస్థ కాదు. ప్రభుత్వ ఉద్యోగిని.. ముఖ్యంగా ఐపీఎస్ పదవిలో నియమితులైన వారిని లేదా రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం ద్వారా నియమితులైన వారిని తొలగించడం అనేది ఒక కార్యనిర్వాహక చర్య. కోర్టు ధిక్కార అధికార పరిధిని ఉపయోగించడం ద్వారా ఆ చర్య న్యాయపరమైన చర్యగా మారిపోదు. సుప్రీంకోర్టు వర్సెస్ ఉత్తరప్రదేశ్ కేసులో సరిగ్గా ఈ నిర్మాణాత్మక సరిహద్దును ప్రస్తావించింది.
భూసేకరణ, నష్టపరిహారం, సమగ్ర పునరావాసం కోసం అవసరమైన భారీ మూలధనాన్ని ఇది పూర్తిగా మినహాయించింది. ఈ విస్మరణ ప్రైవేట్ కన్సల్టెన్సీలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రాజెక్ట్ బడ్జెట్ను భారీగా పెంచి చూపించారనే ఆరోపణలకు ఆజ్యం పోసింది. మూసీ రివర్ఫ్రంట్ ప్రాజెక్ట్లో అత్యంత రాజకీయ సున్నితమైన అంశం. నదీ తీరాల్లో నివసిస్తున్న వేలాది పేద, మధ్యతరగతి కుటుంబాల నివాసాలకు ఇది కలిగించే ప్రత్యక్ష ముప్పు. మూసీ నదీ గర్భం వెంబడి దూకుడుగా కూల్చివేత చర్యల కోసం హైడ్రా సిబ్బందిని మోహరించడం విస్తృతమైన ప్రజా ఆందోళనకు, రాజకీయ వ్యతిరేకతకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిబంధనలు జారీ చేయమని బలవంతం చేయడానికి ప్రయత్నించిన అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులను రాజ్యాంగ ధర్మాసనం పక్కనపెట్టింది.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందన
'రెండేళ్ల కాలంలో హైడ్రా కమిషనర్గా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21,48A ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు రక్షించా. మార్కెట్లో వీటి విలువ రూ.1.50 లక్షల కోట్లు. ఆరు చెరువులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాం. మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. బడా బాబులు ఆక్రమించిన వందల చెరువులు, పార్కులు, వేల ఎకరాల ప్రభుత్వ భూములను హైడ్రా రెండేళ్లల్లో వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి అప్పగించింది. నిజాయితీగా నిర్భయంగా.. నిబద్ధతతో పని చేస్తాం కాబట్టే హైడ్రాకు ధైర్యం' అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. భూ మాఫియా , భూ కబ్జాదారులు తప్పుడు సమాచారంతో న్యాయస్తానాలను తప్పు దోవ పట్టిస్తున్నారు. లోతుకుంట భూమి విషయంలో దాదాపు రూ.10 వేల కోట్ల భూమిని శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టేయాలని చూసింది. అనుమతి లేకుండా 2,500 కోట్ల సంవత్సరాల హెరిటేజ్ గుట్టలను బ్లాస్టింగ్ చేస్తూ.. వందల చెట్లను విచ్చలవిడిగా విధ్వంసం చేసింది' అని వివరించారు.
'అదే నేను చేసిన తప్పు'
'సేవ్ ద రాక్స్ సొసైటీ, పర్యావరణవేత్తలతోపాటు స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది. ఎక్కడో 3 కిలోమీటర్ల అవతల ఉందని చెబుతూ లేని భూమిని చూపిస్తూ ఈ బిల్డర్ 120 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి వచ్చి ఆక్రమించి నా మీద కోర్టు ధిక్కరణ కేసు వేశారు. నా మీద 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. వాటిని వేసింది బడా భూ కబ్జా దారులే' అని రంగనాథ్ వెల్లడించారు. బతుకమ్మ కుంట చెరువును మింగేయాలని చూసిన ఒకరు, లోతుకుంటలో రూ.వేల కోట్ల ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసిన ఇంకొకరు, సామాన్యుల ప్లాట్లు కొట్టేసి బడా కాంప్లెక్స్లు కట్టాలని చూస్తున్న సంధ్యా శ్రీధర్ రావు, వేల సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ప్లాట్స్ను కొట్టేయాలని చూసిన నల్ల మల్లా రెడ్డి, క్రిమినల్ మాఫియాగా చెలామణి అవుతూ రూ.వేల కోట్ల విలువైన సామాన్యుల ప్లాట్స్, ప్రభుత్వ భూములు ఆక్రమించిన ముఖీం.. వీరందరికీ నేను హైడ్రా కమిషనర్గా అడ్డు పడడటమే నేను చేసిన తప్పు' అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. వారందరూ వేసిన కేసులే తన మీద ఉన్న 63 కోర్ట్ ధిక్కార కేసులు అని వివరణ ఇచ్చారు. వాటిని తాను చట్టపరంగానే ఎదుర్కుంటానని ప్రకటించారు. 'నాకు న్యాయస్థానాలు అంటే పూర్తి నమ్మకం. చట్టాలపై గౌరవంతో పని చేస్తూ వస్తున్నా. గతంలో.. ఇప్పుడు, మున్ముందు ప్రభుత్వాలు ఏ బాధ్యతలు అప్పగించినా నేను నా వైపు నుంచి వంద శాతం ఫలితాలు ఇవ్వటమే లక్ష్యంగా ఉంటా. అలాగే పని చేస్తున్నా, భవిష్యత్తులో కూడా అదే నిబద్ధతతో పని చేస్తా' అని ఓ ప్రకటనలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు.
Narsampet: పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో హరీశ్ రావు కన్నీళ్లు
Narsampet, Telangana:Ex Minister Harish Rao Gets Emotional And Tears In Peddi Sudarshan Reddy Last Journey Watch Videoరాఖీ హబ్గా పెద్దపల్లి.. తెలంగాణలోనే తొలి అతిపెద్ద యూనిట్గా రికార్డు..
Hyderabad, Telangana:Wholesale Rakhi Market: అక్కచెల్లెళ్ల ప్రేమానురాగాలకు ప్రతీకే రాఖీ పండుగ.. ఇక ఈ పండగకు వేళైంది.. ఒకప్పుడు రాఖీల కోసం కలకత్తా, గుజరాత్, రాజస్థాన్ వైపు చూసిన తెలంగాణ రాఖీ డిస్టీబ్యూటర్స్.. ఇప్పుడు ఉత్తరాదికే గట్టి పోటీనిస్తోంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రాఖీ ప్రొడక్షన్ యూనిట్ రాష్ట్రంలోనే తొలి అతిపెద్ద రాఖీ హబ్గా అవతరించి రికార్డు సృష్టించింది. పండగకు ముందే ఈ ప్రాంతంలో ఒక సందడి వాతావరణం నెలకొంది. ఇది ఇప్పుడు దక్షిణ భారతంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.
ఒకప్పుడు కేవలం వ్యవసాయ పనులు, బీడీ కార్మిక రంగానికే పరిమితమైన స్థానిక మహిళలు.. ఇప్పుడు నైపుణ్యం కలిగిన రాఖీ డిజైనర్లుగా మారి తమ జీవితాలను పునర్నిర్మించుకుంటున్నారు. ఈ ఎస్ఆర్ఆర్ కేంద్రం ద్వారా దాదాపు 2,500 నుంచి 3,000 మంది మహిళలు ప్రత్యక్షంగా.. పరోక్షంగా గౌరవప్రదమైన జీవనోపాధి పొందుతున్నారు. ఆరోగ్యానికి హాని కలిగించని ఈ పని ద్వారా సొంత ఊరిలోనే ఉంటూ ఆర్థికంగా బాగా ఎదుగుతున్నారని ఇక్కడి మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
లక్ష రకాల డిజైన్లు..
ఈ ఏడాది పండుగ సీజన్ కోసం సుమారు లక్షకు పైచిలుకు సరికొత్త డిజైన్లతో లక్షలాది రాఖీలు సిద్ధమయ్యాయి. రూపాయి మొదలుకుని వేల రూపాయల విలువ చేసే డిజైనర్, ట్రెండీతో పాటు సాంప్రదాయక రాఖీలు కొలువుదీరాయి. వ్యాపారులను ఆకట్టుకునేలా భారీ డిస్ ప్లే సెంటర్ను ఏర్పాటు చేయడంతో తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి హోల్సేల్ వ్యాపారులు కొనుగోళ్ల కోసం ఇక్కడికి క్యూ కడుతున్నారు.
గతంలో మేం రాఖీల కోసం కలకత్తా వెళ్లేవాళ్లం.. కానీ ఇప్పుడు మన పెద్దపల్లిలోనే అంతకంటే అద్భుతమైన డిజైన్లు హోల్సేల్ ధరలకే లభిస్తున్నాయి. నాణ్యత, మోడల్స్ చాలా బాగున్నాయని హోల్సేల్ వ్యాపారులు అంటున్నారు. మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న పెద్దపల్లి ఎస్.ఆర్.ఆర్ రాఖీ తయారీ కేంద్రం, జిల్లా పేరును జాతీయ స్థాయిలో మారుమోగేలా చేస్తోంది. వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న ఈ రాఖీ హబ్.. తెలంగాణ పారిశ్రామిక నైపుణ్యానికి ఒక అద్భుతంగా మారింది.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
12 ఏళ్ల బంధం.. ఒక్క మోసంతో రోడ్డుకెక్కిన సంసారం.. వీడియో..
Hyderabad, Telangana:Wife Caught Red-handed With Lover Video: నమ్మకం.. ఏ సంబంధానికైనా అసలైన పునాది.. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఒక్కటిగా నిలబెట్టేది ఆ నమ్మకమే.. కానీ, ఒక్క చిన్న మోసం.. 12 సంవత్సరాల నాటి సుదీర్ఘ అనుబంధాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా మార్చేస్తుంది. సరిగ్గా ఇలాంటి ఒక ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో వెలుగుచూసింది. 12 ఏళ్ల పాటు కలసి ప్రయాణించిన ఒక జంట.. దారుణమైన పరిస్థితిలో రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. అంతేకాకుండా ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగింది?
స్థానికులు అందించిన వివరాల ప్రకారం.. అయితే, తన భాగస్వామి తనను మోసం చేస్తోందనే అనుమానంతో ఇంటి దగ్గరే సీక్రెట్గా అక్కడే ఉండి చూశాడు.. అనుమానం కాస్త నిజమవుతూ.. ఆ భాగస్వామి వేరొక వ్యక్తితో బహిరంగంగా దొరిపోయింది.. గత కొంత కాలంగా భర్తకు తెలియకుండానే వేరే ఒకరిని ప్రేమించింది. అంతేకాకుండా ఈ ప్రేమ కాస్త ఇంటి వరకు వచ్చేలా చేసింది. అయితే, భర్తలేని సమయంలో ఆ మహిళ ఇంటి వద్దకే రావడంతో తన భర్త వారి ఇద్దిరినీ పట్టుకున్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఘటనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
తీవ్ర ఆగ్రహానికి గురైన బాధితుడు నడిరోడ్డుపైనే వారిని నిలదీశారు.. ప్రశాంతంగా మాట్లాడుకోవాల్సిన సమస్య కాస్తా రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. చూస్తుండగానే చుట్టుపక్కల జనాలు గుమిగూడడంతో పాటు ఒకరినొకరు నిందించుకోవడంతో పాటు కొట్టుకోవడం వల్ల వీధులు ఆందోళనకరంగా మారాయి. 12 ఏళ్ల కాలంలో పెంచుకున్న ప్రేమాభిమానాలు, పంచుకున్న జ్ఞాపకాలు అన్నీ ఆ ఒక్క క్షణంలో తుడిచిపెట్టుకుపోయాయి.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
సుదీర్ఘమైన బంధాలు కూడా ఎంత ఇంత త్వరగా విచ్ఛిన్నమవుతున్నాయో ఇది స్పష్టం చేస్తోంది. సంబంధాలలో విశ్వాసం లోపిస్తే.. ఎంతటి సుదీర్ఘ అనుబంధమైనా ఒక్క క్షణంలో కూలిపోతుందనడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష నిదర్శనమని భావించవచ్చు. ఎలాంటి బంధంలోనైనా మనస్పర్థలు రావడం సహజం.. భాగస్వామి ప్రవర్తనలో తేడా అనిపించినా.. లేదా బంధం నుంచి బయటకు రావాలనుకున్నా ప్రత్యక్షంగా మాట్లాడుకోవడమే ఉత్తమమైన మార్గం..
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
CWG 2026 Boxing: కామన్వెల్త్ గేమ్స్లో ఫైనల్కు చేరిన మరో భారత అథ్లెట్..బంగారు పతకం వేటలో బాక్సర్ ప్రీతి పవార్!
Hyderabad, Telangana:CWG 2026 Boxing Final Match: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026 పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. టోర్నమెంట్లో తొమ్మిదవ రోజు జరిగిన ఉత్కంఠభరితమైన సెమీఫైనల్ బౌట్స్లో భారత బాక్సర్లు అదరగొట్టగా, మహిళల 54 కేజీల విభాగంలో ప్రపంచ నంబర్ 3 బాక్సర్ ప్రీతి పవార్ అద్భుత విజయంతో ఫైనల్లోకి ప్రవేశించారు.
ఏకపక్ష పోరులో ఘన విజయం
కామన్వెల్త్ గేమ్స్ మహిళల 54 కేజీల విభాగం సెమీఫైనల్ పోరులో ప్రీతి పవార్ జాంబియాకు చెందిన కేథరీన్ మ్వాపెతో తలపడ్డారు. అత్యుత్తమ టెక్నిక్ కనబరిచిన ప్రీతి 5-0 ఏకగ్రీవ నిర్ణయంతో ఘన విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించారు. U-22, ఎలైట్ స్థాయిలలో రెండుసార్లు ఆసియా ఛాంపియన్గా నిలిచిన ప్రీతి, ఈ మ్యాచ్లోనూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.
మొదటి రౌండ్ ప్రారంభంలో ఇద్దరూ హోరాహోరీగా పంచ్లు విదిలించినా.. ప్రీతి తన అద్భుతమైన బ్యాక్హ్యాండ్, ఓవర్హ్యాండ్ లెఫ్ట్, పదునైన జాబ్లతో పట్టు సాధించారు. దీంతో జాంబియా క్రీడాకారిణి తొలి స్టాండింగ్ ఎయిట్-కౌంట్ను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత రెండో రౌండ్లో మ్వాపె దూకుడు ప్రదర్శించే ప్రయత్నం చేసినా, ప్రీతి తన అద్భుతమైన ఫుట్వర్క్, వేగవంతమైన కాంబినేషన్లు, లెఫ్ట్ అప్పర్కట్తో విజృంభించారు. ఈ రౌండ్లో మ్వాపెకు మరో రెండు స్టాండింగ్ కౌంట్లు లభించాయి.
చివరిగా మూడో రౌండ్లో రింగ్ను ఎంతో సమర్థవంతంగా ఉపయోగించుకున్న ప్రీతి, ప్రత్యర్థి దూకుడికి తగినట్లుగా ఆడుతూ గట్టి బాడీ షాట్తో మెప్పించారు.
ఐదుగురు న్యాయనిర్ణేతలు (జడ్జీలు) మూడు రౌండ్లలోనూ ప్రీతికే పూర్తి మార్కులు కేటాయించారు. జడ్జీల స్కోర్లు వరుసగా 30-25, 30-25, 30-26, 30-24, 30-25గా నమోదయ్యాయి.
ఫైనల్ పోరు ఎవరితో?
సెమీఫైనల్లో అజేయ ప్రదర్శనతో విజయం సాధించిన భారత క్రీడాకారిణి ప్రీతి పవార్, స్వర్ణ పతకం కోసం జరగనున్న ఫైనల్ మ్యాచ్లో కెనడా క్రీడాకారిణి స్కార్లెట్ డెల్గాడోతో తలపడనున్నారు.
Also Read: కామన్వెల్త్ గేమ్స్లో సత్తా చాటిన నీరజ్ చోప్రా..ఫైనల్లో అడుగుపెట్టిన భారత అథ్లెట్లు!
Also REad; రహానే కెప్టెన్సీలో భారత్ ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు..కానీ, చివరికి అతడ్ని పక్కన పెట్టారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ఆఫీస్లో స్కూటీ నడిపిన CEO.. ఇప్పుడు ఈ బాస్ ఫుల్ వైరల్..
Hyderabad, Telangana:CEO Rides Scooty Video Watch: సాధారణంగా కార్పొరేట్ కంపెనీల్లో టార్గెట్లు పూర్తయినప్పుడు కేక్ కట్ చేయడం.. గ్రాండ్ పార్టీ ఇవ్వడం లేదా ఆఫీస్ మెయిల్ ద్వారా అభినందనలు తెలపడం మనం తరచుగా చూస్తూ ఉంటాం.. అయితే, ప్రముఖ రియల్ ఎస్టేట్, హోమ్ సర్వీసెస్ ప్లాట్ఫామ్ నోబ్రోకర్ (NoBroker) CEO మాత్రం తమ సక్సెస్ను ఎవరూ ఊహించని రీతిలో జరుపుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఆఫీస్ లోపలే స్కూటీ రైడ్..
నోబ్రోకర్ కో-ఫౌండర్తో పాటు సీఈఓ అమిత్ కుమార్ అగర్వాల్ (Amit Kumar Agarwal) తన ఆఫీస్ కారిడార్లోనే ఒక న్యూ స్కూటీపై జాలీ రైడ్ చేస్తూ కనిపించారు. కంపెనీకి చెందిన ప్యాకేర్స్ అండ్ మూవర్స్ (Packers And Movers) విభాగం ఊహించిన దానికంటే అద్భుతమైన క్వార్టర్లీ టార్గెట్ను సాధించినందుకు ఈ ప్రత్యేక వేడుకను జరుపుకుంటారు. ఆఫీస్లోనే సీఈఓ స్వయంగా స్కూటీ నడుపుతుంటే.. అక్కడే ఉన్న ఉద్యోగులు ఆనందంతో ఈలలు వేస్తూ.. చప్పట్లతో ఆనందంలో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియోను CEO స్వయంగా ఎక్స్ వేదికగా పంచుకోగా.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
When people invest their time, effort… pic.twitter.com/VrlZbCIdBx
— Amit Kumar Agarwal (@AmitKumarA) July 21, 2026
ఈ మూడు నెలల్లో బాగా వర్క్ చేసిన ఉద్యోగులకు గిఫ్ట్స్ అందించినప్పటికీ.. ఈ స్కూటీ రైడ్ మాత్రం ఆకర్షణగా నిలిచింది. టార్గెట్ సాధించిన స్టార్ పెర్ఫార్మర్కు ఈ స్కూటీని ప్రధాన బహుమతిగా అందించారు. కేవలం వేదికపై బహుమతి ఇవ్వడం కంటే.. CEO స్వయంగా దానిని ఆఫీస్లో నడిపి ఉద్యోగులలో సరికొత్త ఉత్సాహాన్ని నింపడం అందరినీ ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా CEO అమిత్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఉద్యోగులు తమ శ్రమను, సమయాన్ని చాలా వరకు ఆఫీసుల్లోనే గడిపి.. అద్భుతమైన సక్సెస్ సాధించినప్పుడు.. ఆ సంతోషాన్ని కేవలం ఒక ఫార్మల్ అవార్డు వేడుకకే పరిమితం చేయకూడదని.. సరదాగా ఉద్యోగులతో కలసిపోతూ వారిని ప్రోత్సహించడమే నిజమైన గుర్తింపు అని పేర్కొన్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
నెటిజన్ల ప్రశంసల వర్షం..
ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడమే కాకుండా.. కొద్ది రోజుల్లోనే వేలాది వ్యూస్తో పాటు కామెంట్లు వచ్చాయి. ఇలాంటి ప్రాక్టికల్, ఫ్రెండ్లీ సీఈఓ ఉంటే ఉద్యోగులకు పని చేయడం భారం అనిపించదని.. లీడర్షిప్ అంటే ఇలాగే ఉండాలి.. ఇది కదా ఉద్యోగులకు ఇచ్చే నిజమైన బూస్టప్.. అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
మీ ఓటు గాల్లో కలిసిపోయిందా?.. తెలంగాణలో 40 లక్షల ఓట్లు ASD లిస్ట్లోకి, చెక్ చేసుకోండిలా..!!
Secunderabad, Telangana:Election Commission 40 Lakh Votes Removal: తెలంగాణలో చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ప్రక్రియలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 లక్షల ఓట్లను సేకరించేందుకు వీలు లేనివిగా అంటే అన్ కలెక్టబుల్ గా నిర్దారిస్తూ.. వాటిని ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు ఎన్నికల అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
ఎన్నికల సంఘం అధికారులు నిర్వహించిన సర్వేలో భాగంగా 100శాతం ఓట్ల లెక్కింపు పత్రాలను పంపిణీ చేశారని అధికారులు చెబుతున్నారు. అయితే, కొన్ని పత్రాలు ఇంకా తిరిగి రాలేదు. వాటిని వసూలు చేయలేనివిగా పరిగణిస్తున్నారు. ఓట్ల లెక్కింపు పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియకు గడువు ఇంకా ముగియకపోయినా, వసూలు చేయలేనివిగా గుర్తించిన ఓట్లను అధికారులు ముందుగానే ఎలా తొలగిస్తారని ప్రశ్నిస్తూ ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం కార్యాలయం ముందు నిరసన తెలిపాయి. రాష్ట్రంలోని మొత్తం 33,826,448 ఓటర్లలో సుమారు 76.72శాతం (25,950,506) ఓట్లను ఇప్పటివరకు డిజిటలైజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఏఎస్డీ (గైర్హాజరు, బదిలీ, మరణం) కేటగిరీ కింద తొలగించిన ఓట్ల సంఖ్యలో ఆకస్మిక పెరుగుదల అనేక ఆందోళనలను రేకెత్తించింది. రెండు వారాల క్రితం, ఏఎస్డీ కింద కేవలం 13 లక్షల ఓట్లు మాత్రమే నమోదైనట్లు ఈసీ డాష్బోర్డ్ చూపించగా, కేవలం రెండు వారాల్లోనే ఈ సంఖ్య 40 లక్షలకు పెరిగింది.
అనేక కీలక నియోజకవర్గాల్లో 20శాతం నుంచి 28శాతం ఓట్లు వసూలు చేయలేని జాబితాలోకి వెళ్లడం గమనార్హం.
ఉప్పల్: అత్యధికంగా 28శాతం ఓట్లు
పశ్చిమ వరంగల్: 26శాతం ఓట్లు
సికింద్రాబాద్: 24శాతం ఓట్లు
మంచిర్యాల: 23శాతం ఓట్లు
సికింద్రాబాద్ కంటోన్మెంట్: 22శాతం ఓట్లు
కుత్బుల్లాపూర్: 21శాతం ఓట్లు
కరీంనగర్: 20శాతం ఓట్లు
చాలా మంది ఓటర్లకు ఇంకా వారి ఓట్ల లెక్కింపు పత్రాలు అందలేదని, వారిని ఓటు వేయడానికి అర్హులు కానివారిగా నమోదు చేస్తున్నారని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. పూర్తిస్థాయి ధృవీకరణ లేకుండా ఏఎస్డీ జాబితా ఆధారంగా ఓట్లను తొలగించడానికి బూత్ లెవెల్ ఏజెంట్ (బీఎల్ఏ) సంతకం అవసరం ఉంటుంది. అయితే, అధికారులు తప్పుడు సమాచారంతో బీఎల్ఏలపై ఒత్తిడి తెస్తున్నారని, ఓటర్లు ఆ చిరునామాలో లేరని పేర్కొంటూ పత్రాలపై సంతకాలు చేయమని బలవంతం చేస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి.
Also Read: మీ సమస్యలు నాకు వదిలేయండి.. ముందు పిల్లల భవిష్యత్తుపై పోరాడండి
Also Read: ఒక్కో విద్యార్థిపై రూ. 1.08 లక్షల ఖర్చు.. అయినా ప్రైవేట్ వైపేనా
Also Read: ఆ పరిచయమే కొంపముంచిందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
గ్యాస్ ఆదా చేసేందుకు పాకిస్తానీ కుర్రాడి మైండ్ బ్లోయింగ్ ఐడియా.. వీడియో..
Hyderabad, Telangana:Pakistani Tea Vendor Viral Video Watch: సాధారణంగా వీధి వ్యాపారులు తక్కువ ఖర్చుతో కూడిన వినూత్న ఆలోచనలు సోషల్ మీడియాలో నెటిజన్లను తరచూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. తాజాగా పాకిస్తాన్కు చెందిన ఒక టీ వ్యాపారి చేసిన వింత ప్రయోగం ప్రస్తుతం ఇంటర్నెట్ను ఊపేస్తోంది. వేర్వేరుగా గ్యాస్ పొయ్యిలను ఉపయోగించకుండా.. కేవలం ఒకే కడాయిలో ఒకే సమయంలో పకోడీలతో పాటు వేడి వేడి టీ తయారు చేస్తూ అందరినీ షాక్కి గురిచేశాడు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోసల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది.
పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్కు చెందిన ఒక వ్యాపారి.. ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. సాయంత్రం పూట వేడి వేడి పకోడీలు తింటూ.. కప్పు అల్లం టీ తాగడం చాలామందికి అలవాటు. అయితే, వీటిని తయారు చేయడానికి సాధారణంగా రెండు వేర్వేరు స్టవ్లతో పాటు గ్యాస్ సిలిండర్ అవసరమవుతాయి. కానీ ఈ వ్యాపారి గ్యాస్ ఆదా చేయడంతో పాటు సమయాన్ని ఆదా చేసేందుకు ఒక సరికొత్త మార్గాన్ని వెతికాడు..
పెద్ద కడాయిలో నూనె పోసి.. పకోడీలను వేయిస్తున్న సమయంలో.. ఆ కాగుతున్న నూనె మధ్యలో టీ తయారు చేసే ఒక చిన్న పాత్రను పెట్టి... నూనె నుంచి వచ్చే విపరీతమైన వేడికి టీ పాత్రలోని పాలతో పాటు టీ పొడి క్షణాల్లో మరిగిపోవడం మీరు చూడొచ్చు.. ఒక్క చుక్క నూనె కూడా టీలో పడకుండా.. అటు పకోడీలు వేగుతుండగానే.. ఇటు వేడి టీ సిద్ధమైపోయింది.
సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం..
ఈ వింత దృశ్యాన్ని అక్కడున్న ఒక వ్యక్తి వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్గా మారింది. లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించి.. అతని స్కిల్కి ఫిదా అవుతున్నారు. ఇది కదా అసలైన ప్రాక్టికల్ ఇంజనీరింగ్.. గ్యాస్ బిల్లు తగ్గించుకోవడానికి ఇంతకంటే మంచి ఐడియా ఉండదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇవేకాకుండా చాలా మంది వింత వింత కామెంట్స్ కూడా చేస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gulabi Sadi పాటకి స్టేజ్ను షేక్ చేసిన బ్యూటీ.. వీడియో చూశారా?
Hyderabad, Telangana:College Student Dance Viral Video: కాలేజ్ జీవితం అంటేనే ఉత్సాహం, సరదా, మరుపురాని జ్ఞాపకాలు.. ఇక క్యాంపస్లో ఏదైనా ఈవెంట్, ఫ్రెషర్స్ డే లేదా వార్షికోత్సవం వచ్చిందంటే చాలు.. విద్యార్థుల సంతోషానికి అవధులు ఉండవు.. తమలో ఉన్న ఆనందాన్ని వేదికపై సందడి చేయడానికి ఇదొక అద్భుతమైన అవకాశంగా భావిస్తారు. తాజాగా ఇలాంటి ఒక కాలేజ్ ఈవెంట్కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఒక విద్యార్థిని చేసిన అద్భుతమైన డాన్స్కు ఇప్పుడు వైరల్గా మారాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ఈ వీడియోలో ఇది ఒకటి.. ఒక కళాశాల విద్యార్థిని ఇటీవల ఎంతో వైరల్ అయిన మరాఠీ-పాప్ లవ్ సాంగ్ గులాబీ సాడీ (Gulabi Sadi) పాటపై ఊపేసే రేంజ్లో డాన్స్ వేసింది. పాట ప్రారంభం కాగానే.. ఆ విద్యార్థిని ఎంతో అద్భుతంగా స్టేజ్ పైకి వచ్చి.. తన డ్యాన్స్ను మొదలుపెట్టడం మీరు చూడొచ్చు.. ఆమె ఇచ్చిన అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్, డైనమిక్ ఎనర్జీకి అక్కడున్న వారు కేకలు వేశారు.
డ్యాన్స్ చేస్తున్నంత వరకు ఆ విద్యార్థిని ఎనర్జీ ఎక్కడా తగ్గకపోవడం ఈ డాన్స్ ప్రధాన విశేషంగా భావించవచ్చు. పాట ట్యూన్కు అనుగుణంగా ఆమె చేసిన ప్రతి మూవ్మెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం డాన్స్ చేయడమే కాకుండా ముఖంలోఎక్స్ప్రెషన్స్తో ఆ పాటను జీవించేలా చేసింది.. సభలో ఉన్న తోటి విద్యార్థులు, అధ్యాపకులు సైతం ఆమె పర్ఫార్మెన్స్కు ఫిదా అయిపోయి నిలబడి చప్పట్లు, ఈలలతో ప్రోత్సహించడం మీరు చూడొచ్చు.. చాలామంది తమ మొబైల్ ఫోన్లలో ఈ డ్యాన్స్ను రికార్డ్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో షేర్ చేశారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
ఈ వీడియో ఇన్స్టాగ్రామ్తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అతి తక్కువ సమయంలోనే లక్షలాది వ్యూస్, వేలాది లైకులతో దూసుకుపోతోంది. ఇలాంటి ప్రతిభకు తగిన గుర్తింపు లభించాలి.. ఎక్స్ప్రెషన్స్ మాత్రం వేరే లెవెల్.. నిజమైన టాలెంట్ అంటే ఇదే.. అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఒక వ్యక్తిలో ప్రతిభ, ఆత్మవిశ్వాసం ఉంటే.. అది ప్రపంచానికి తెలియడానికి ఎక్కువ సమయం పట్టదని ఈ వీడియో మరోసారి నిరూపించింది.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sugarcane Juice Tips: వర్షాకాలంలో చెరకు రసం ఎక్కువగా తాగుతున్నారా? డాక్టర్లు చెప్పిన కీలక హెచ్చరికలు ఇవే!
Hyderabad, Telangana:Sugarcane Juice Sideeffects: వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ, గాలిలో ఉండే తేమ వల్ల తరచూ దాహం వేస్తుంటుంది. ఈ సమయంలో రోడ్డు పక్కన కనిపించే చల్లని చెరకు రసం తాగాలని చాలామంది ఆసక్తి చూపుతారు. చెరకు రసంలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలతో పాటు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా డీహైడ్రేషన్ను నివారిస్తుంది. అయితే, వర్షాకాలంలో రోడ్డు పక్కన లభించే చెరకు రసం తాగడం ఆరోగ్యానికి సురక్షితమేనా? నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ చూద్దాం.
వర్షాకాలంలో చెరకు రసం వల్ల కలిగే నష్టాలు
వర్షాకాలంలో వాతావరణం బ్యాక్టీరియా, వైరస్ల వృద్ధికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే తీవ్ర అనారోగ్యాలు చుట్టుముట్టే అవకాశం ఉంది.
తీవ్రమైన ఇన్ఫెక్షన్లు: పరిశుభ్రత లేని పరిసరాల్లో, ఈగలు ముసిరే ప్రదేశాలలో విక్రయించే చెరకు రసం తాగడం వల్ల కలరా, టైఫాయిడ్, కామెర్లు, డయేరియా వంటి జీర్ణకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
కలుషితమైన ఐస్ వాడకం: రసంలో కలిపే ఐస్ క్యూబ్స్ స్వచ్ఛమైన నీటితో తయారు చేయకపోతే, వాటిలోని బ్యాక్టీరియా కారణంగా గొంతు నొప్పి, జలుబు, ఇతర ఇన్ఫెక్షన్లు వస్తాయి.
శుభ్రత లోపించడం: చెరకు రసం తీసే యంత్రాలు, గ్లాసులను శుభ్రంగా కడగకపోతే వాటిపై పేరుకుపోయే బ్యాక్టీరియా వల్ల రోగనిరోధక శక్తి తగ్గి త్వరగా జబ్బుల బారిన పడతారు.
ఈ సీజన్లో పాటించవలసిన ముందస్తు జాగ్రత్తలు
1) వీధి పక్కన కాకుండా, అత్యంత శుభ్రంగా ఉండే ప్రదేశాలలో అప్పటికప్పుడు (ఫ్రెష్గా) తీసిన చెరకు రసాన్ని మాత్రమే ఎంచుకోవాలి.
2) వర్షాకాలంలో చెరకు రసంలో ఐస్ క్యూబ్స్ వేయించుకోకుండా తాగడమే శ్రేయస్కరం.
3) చెరకు రసం తీసిన కొద్ది నిమిషాల్లోనే తాగేయాలి. ఎక్కువసేపు నిల్వ ఉంచితే అది ఆక్సీకరణం చెంది అనారోగ్యానికి దారితీస్తుంది.
4) మధుమేహం (షుగర్) లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారు ఈ సీజన్లో చెరకు రసానికి దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ తీసుకోవాలంటే వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి.
పోషకాలు నిండిన చెరకు రసం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, వర్షాకాలంలో దాని తయారీలో పాటించే శుభ్రతపైనే మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సీజన్లో సురక్షితంగా ఉండండి!
Also REad: Apple Pickle: ఆపిల్ పండుతో పచ్చడి ఎలా చేయాలో మీకు తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
