కోతుల భయంతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు
Mothkur, Telangana:మోత్కూర్ పట్టణ కేంద్రంలో కోతుల బెడద రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రజల బెంబేలెత్తిపోతున్నారు. కోతులు గుంపులుగా బయలుదేరి కాలనీలపై విరుచుకుపడుతున్నాయి. ఇళ్లలోకి చొరబడి వీరంగం సృష్టిస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ప్రజలపై దాడులకు దిగుతూ గాయపరుస్తున్నాయి. బయటికి వెళ్లాలంటే కోతుల భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోతుల నియంత్రణ కోసం చర్యలు చేపట్టాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
KKR vs PBKS Abandoned: కలకత్తాకు భారీ షాక్.. పంజాబ్తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు
Kolkata, West Bengal:KKR vs PBKS Match Abandoned: కొత్త ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన తర్వాత సత్తా చాటాలని చూస్తున్న కలక్తా నైట్రైడర్స్కు పరిస్థితులు సహకరించడం లేదు. రెండు మ్యాచ్ల్లో సత్తా చాటినా ఫలితం మాత్రం నిరాశ ఎదురవగా.. సొంత గడ్డపై పంజాబ్ కింగ్స్ను చిత్తు చేసి తొలి విజయాన్ని పొందాలనుకుంటే వర్షం రూపంలో అడ్డంకి ఏర్పడింది. ఏకధాటిగా మూడు గంటలకు పైగా వర్షం పడడంతో జరగాల్సిన మ్యాచ్ రద్దయ్యింది. ఈ సీజన్లో వర్షం కారణంగా రద్దయిన తొలి మ్యాచ్ ఇదే. మ్యాచ్ రద్దు కలకత్తాకు తీవ్ర నిరాశ మిగిల్చగా.. వరుస విజయాలతో జోరు మీదున్న పంజాబ్ కింగ్స్కు పాయింట్ల పట్టికలో మరో ముందడుగు వేసింది.
Also Read: Uppal Stadium: ఉప్పల్ స్టేడియంలో అధ్వానం.. ఖర్చీఫ్లతో తుడుచుకున్న ప్రేక్షకులు
ఐపీఎల్-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా సోమవారం సాయంత్రం కోల్కతా నైట్రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన కలకత్తా నైట్రైడర్స్ భారీ ఇన్నింగ్స్ నమోదు చేయాలని మైదానంలోకి దిగింది. మ్యాచ్ ఆరంభమైన కాసేపటికే వర్షం ప్రారంభమైంది. ఎంతకీ వర్షం ఆగకపోవడంతో మ్యాచ్ను రిఫరీలు రద్దు చేశారు. అయితే అప్పటికే బ్యాటింగ్కు దిగిన కలకత్తా 3.4 ఓవర్లు ఆడి 2 వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది. ఫిన్ అలెన్ (6), కామెరూన్ గ్రీన్ (4) అతి తక్కువ పరుగులకే ఔటయ్యారు. క్రీజులో కెప్టెన్ అజింక్యా రహనే (6), అంగ్క్రిష్ రఘువంశీ (7) ఉన్నారు. ఆరంభమే కలకత్తా బౌలర్లు పైచేయి సాధించారు. వేసిన రెండు ఓవర్లలోనే క్సేవియర్ బార్ట్లెట్ రెండు వికెట్లు తీసి కలకత్తాకు భారీ షాక్ ఇచ్చాడు. హర్ష్దీప్ రెండు ఓవర్లు వేసి 16 పరుగులు ఇచ్చాడు.
Also Read: RCB vs CSK: ఐపీఎల్ 2026లో ఆర్సీబీ డబుల్ ధమాకా.. చెన్నై హ్యాట్రిక్ ఓటమి
మొదట తేలికపాటి వర్షం పడడంతో తగ్గిపోతుందని.. తిరిగి మ్యాచ్ ప్రారంభమవుతుందని క్రికెట్ అభిమానులు భావించారు. కొన్ని నిమిషాల్లోనే మోస్తరు నుంచి భారీ వర్షంగా మారింది. దాదాపు రెండున్నర గంటల తర్వాత వర్షం తెరపనిచ్చింది. అయితే భారీ వర్షం కారణంగా పిచ్ మొత్తం తడిసి ముద్దయ్యింది. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో ఓవర్లు కుదించి ఆడించే పరిస్థితి కూడా లేకపోయింది. దీంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. మ్యాచ్ రద్దు కారణంగా ఇరు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. 5 పాయింట్లతో పట్టికలో పంజాబ్ కింగ్స్ అగ్రస్థానానికి చేరుకోగా.. కలకత్తాకు ఒక పాయింట్తో ఖాతా తెరిచింది.
Also Read: Sathankulam case: లాక్డౌన్లో కిరాణ దుకాణం తెరిచారని వేధింపులు.. 9 మంది పోలీసులకు ఉరిశిక్ష
రద్దవడమే మంచిది..
వర్షం కారణంగా మ్యాచ్ రద్దవడాన్ని ఒకవిధంగా కలకత్తా అభిమానులు మంచి పరిణామమే అని భావిస్తున్నారు. ఎందుకంటే మూడు ఓవర్లు కూడా పూర్తి కాకముందే రెండు వికెట్లు కోల్పోవడంతో తర్వాతి మ్యాచ్ పరిస్థితి ఏమిటో అర్థమైంది. వర్షం రాకుండా మ్యాచ్ కొనసాగి ఉంటే ఇది కూడా ఓటమి చవిచూసేవారమని.. వర్షం రావడం మంచికే అని అభిప్రాయపడుతున్నారు. మ్యాచ్ రద్దవడంతో ఒక పాయింట్ అయినా వచ్చిందని కలకత్తా అభిమానులు సంతోషిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Amaravati Gazette Notification: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి..అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రప్రభుత్వం!
Amaravathi, Andhra Pradesh:Amaravati Gazette Notification News: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై గత కొన్నేళ్లుగా నెలకొన్న సందిగ్ధతపై ఇప్పుడు తెరపడింది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిర్ధారిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి నుంచే ఇక పరిపాలన మొత్తం జరగనుంది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో.. ఓ చారిత్రాత్మక ఘట్టంగా నిలవనుంది. అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ.. 'ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) 2026' చట్టం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ బిల్లు-2026 పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత.. సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్కు చేరింది. ఆ తర్వాత తాజాగా కేంద్ర న్యాయశాఖ అమరావతి రాజధానిపై గెజిట్ నోటిఫికేషన్ను రిలీజ్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీతో పాటు పార్లమెంట్లోని ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లుపై భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తర్వాత ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఇకపై అమరావతి ఉండనుంది.
ఏప్రిల్ 1, 2వ తేదీల్లో పార్లమెంట్లోని లోక్సభ, రాజ్యసభ సభలు ఆమోదం తెలిపాయి. అయితే ఈ బిల్లుపై ఉభయసభల్లో సుమారు 5 గంటల పాటు చర్చ జరిగింది. అయితే ఈ సవరణ బిల్లులో ఎలాంటి సవరణలు లేకుండానే ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అమరావతి రాజధానికి చట్టబద్ధత రావడం పట్ల ఆ ప్రాంత రైతులు సంబరాలు చేసుకున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడికి పాదయాత్రగా వెళ్లి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
అమరావతిని రాజధానిగా చట్టబద్దత వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు వేగవంతం కావడంతో పాటు, అంతర్జాతీయ సంస్థల నుంచి నిధుల సేకరణకు అనుకూలంగా మారనుంది. పెట్టుబడుల రాకకు పూర్తిస్థాయి భరోసా లభించినట్లు అవుతుందని అధికారులు చెబుతున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగానికి.. ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడం వల్ల రైతుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అమరావతి రాజధానికి సుదీర్ఘ కాలం పాటు సాగిన పోరాటానికి ఇది విజయం అని వారంతా భావిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసిన అమరావతి గెజిట్ నోటిఫికేషన్లో కొన్ని కీలక అంశాలను పొందుపరిచారు. గత ప్రభుత్వం హయంలో చర్చకు వచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనను పక్కన పెట్టడమే కాకుండా అమరావతిని పూర్తిస్థాయి.. పరిపాలన, న్యాయ, శాసన రాజధానిగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినట్లు అయ్యింది. అదే విధంగా సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) భూములను మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేసేందుకు పూర్తిస్థాయిలో అనుమతులు దక్కినట్లే. ఈ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా గతంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐకానిక్ భవనాలైన హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ వంటి మౌలిక సదుపాయల కల్పన కోసం జెట్ స్పీడ్లో ప్రారంభించేందుకు మార్గం సుగమం అయ్యింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sathankulam case: లాక్డౌన్లో కిరాణ దుకాణం తెరిచారని వేధింపులు.. 9 మంది పోలీసులకు ఉరిశిక్ష
Sathankulam, Tamil Nadu:Madurai Court Awards Death Penalty: కరోనా సమయంలో లాక్డౌన్ ఉండగా దుకాణం తెరచి ఉంచారని కిరాణ దుకాణం నిర్వహిస్తున్న తండ్రీ కొడుకులను పోలీస్ స్టేషన్లో వేధింపులకు గురిచేసి వారి మృతికి కారణమైన పోలీసులపై మధురై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. లాకప్ డెత్ కేసును తీవ్రంగా పరిగణించిన మధురై న్యాయస్థానం అమాయకులైన ఇద్దరి ప్రాణం తీసిన పోలీసులకు మరణశిక్ష విధించింది. తండ్రీ కొడుకులను చిత్రహింసలకు గురిచేసిన వారికి ఉరిశిక్ష వేయడం సంచలనం సృష్టించింది.
Also Read: DJ Dispute: గంగమ్మ జాతరలో చిచ్చుపెట్టిన డీజే.. వేట కొడవళ్ల దాడిలో ఒకరి మృతి
తమిళనాడు మధురై అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 2020లో తండ్రీకొడుకులైన జయరాజ్, బెన్నిక్స్ కస్టోడియల్ మరణానికి కారణమైన తొమ్మిది మంది పోలీసులకు మరణ శిక్ష విధిస్తూ తీర్పునివ్వడం సంచలనం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఇన్స్పెక్టర్ శ్రీధర్, సబ్-ఇన్స్పెక్టర్లు రఘు గణేష్, బాలకృష్ణన్తోపాటు హెడ్ కానిస్టేబుళ్లు మురుగన్, సమిదురై, కానిస్టేబుళ్లు ముత్తుర, సెల్లాదురై, థామస్ ఫ్రాన్సిస్, వేలుముత్తుకు కోర్టు ఉరిశిక్ష విధించింది. దాదాపు 6 ఏళ్ల పాటు విచారణ జరగ్గా.. ఈ కేసులో సీబీఐ కీలక సాక్ష్యాధారాలు, ఫోరెన్సిక్ రిపోర్టులను కోర్టుకు సమర్పించింది. వాటిని పరిశీలించిన అనంతరం సమగ్ర విచారణ చేసిన ధర్మాసనం తీవ్రమైన శిక్ష విధించింది.ఈ కేసు 5 సంవత్సరాలుగా మధురై జిల్లా క్రిమినల్ మేజిస్ట్రేట్ కోర్టులో పెండింగ్లో ఉండగా.. జడ్జి ముత్తుకుమారన్ ఏప్రిల్ 9వ తేదీన శిక్ష వేస్తూ తీర్పునిచ్చారు.
Also Read: RCB vs CSK: ఐపీఎల్ 2026లో ఆర్సీబీ డబుల్ ధమాకా.. చెన్నై హ్యాట్రిక్ ఓటమి
కేసు చరిత్ర
కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తుండగా.. 2020 జూన్ నెలలో లాక్డౌన్ దేశవ్యాప్తంగా ఉంది. తమిళనాడులోని శాంతకుళంలో జయరాం, అతడి కుమారుడు బెన్నిక్స్ కిరాణ దుకాణం నిర్వహించేవారు. అయితే లాక్డౌన్ సమయంలో కిరాణ దుకాణం ఎందుకు తెరిచావని స్థానిక పోలీసులు తండ్రీ కొడుకులను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. స్టేషన్లో పోలీసు అధికారులు తీవ్ర ఆగ్రహంతో తండ్రి ఎదుట కొడుకు బెన్నిక్స్ బట్టలు విప్పి అతడిపై దాడి చేశారు. అయితే వారికి ఎలాంటి నేర చరిత్ర లేకుండా తీవ్రంగా దాడి చేసి హింసించారు. శాంతకుళంలో విచారణ నిమిత్తం పోలీసు అధికారులు తీసుకెళ్లిన తండ్రీకొడుకులైన జయరాజ్, బెన్నిక్స్ మరణం యావత్ తమిళనాడును కుదిపేసింది.
Also Read: Uppal Stadium: ఉప్పల్ స్టేడియంలో అధ్వానం.. ఖర్చీఫ్లతో తుడుచుకున్న ప్రేక్షకులు
కోర్టు తీవ్ర వ్యాఖ్యలు
ఉరిశిక్ష విధిస్తూ కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. 'ఈ కేసు చాలా అరుదైనది. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే ఇంతటి దారుణానికి ఒడిగట్టడం దారుణం. పోలీస్ స్టేషన్లో మరణించడం చాలా హేయమైనది. తండ్రీకొడుకులను నిర్దాక్షిణ్యంగా కొట్టడాన్ని క్రూరమైనదిగా పరిగణించాలి. పోలీసు అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడం క్రూరమైనదిగా భావించాలి'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Harish Rao: భూమి చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడు: భూకబ్జాలపై హరీశ్ రావు ఆగ్రహం
Koheda, Telangana:Koheda Fruit Market: 'రాజకీయాల కోసం రాలేదు...రైతుల కోసం ఇక్కడకు వచ్చాం. సమస్య కాంగ్రెస్ పార్టీ కాదు రైతుల సమస్యలు. ఏ ప్రభుత్వం అయిన రైతుల కోసం చేయాలి కానీ దళారుల కోసం పని చేయద్దు' అని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీశ్ రావు హితవు పలికారు. 'దళారుల కోసం కాకుండా రైతుల కోసం ఆలోచన చేయాలి' అని రేవంత్ రెడ్డికి సూచించారు. రైతుల భవిష్యత్తు కోసం ఆలోచన చేసి కోహెడలో అంతర్జాతీయ స్థాయిలో ఫ్రూట్ మార్కెట్ పెట్టాలని కేసీఆర్ ఆలోచన చేశారని గుర్తుచేశారు.
Also Read: DJ Dispute: గంగమ్మ జాతరలో చిచ్చుపెట్టిన డీజే.. వేట కొడవళ్ల దాడిలో ఒకరి మృతి
'అనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు రైతులకు సహాయం చేయాలని అన్నప్పుడు నేను రూ.10 కోట్లు మంజూరు చేయించా. ఇక్కడ 200 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో ఫ్రూట్ మార్కెట్ కట్టాలని ఇక్కడ స్థలం కేటాయించారు. మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్న నిరంజన్ రెడ్డి రూ.350 కోట్లు మంజూరు చేయించగా ఇంకా బ్యాంకులోనే ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కన్సల్టెంట్ ద్వారా దీనిని మ్యాపింగ్ చేయించాం. భవిష్యత్తులో ఇక్కడే పూల మార్కెట్, ఫిష్ మార్కెట్లు రావాలని ఆలోచన చేశాం' అని వివరించారు.
Also Read: RCB vs CSK: ఐపీఎల్ 2026లో ఆర్సీబీ డబుల్ ధమాకా.. చెన్నై హ్యాట్రిక్ ఓటమి
'అంతర్జాతీయ మార్కెట్ కోసం అధికారులు వివిధ రాష్ట్రాల్లో పర్యటన చేసి అధ్యయనం చేశారు. భూ సేకరణ కూడా పూర్తి అయింది. లక్షలాది రైతుల కోసం ఈ ఆలోచన చేశాం. కొన్ని రకాల ఫ్రూట్స్ వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ తెస్తారు. దానికి అనుగుణంగా ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే మార్కెట్ను ప్లాన్ చేశాం. ఈ భూమిని మాయం చేసే కుట్ర చేస్తున్నారు' అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. 'ఇక్కడ రూ.3 వేల కోట్ల విలువైన భూమి పరిశ్రమల శాఖకు బదిలీ చేసి వారికి నచ్చినవారికి కట్టబెట్టే ప్రయత్నం నడుస్తోంది. ఇప్పటికే దీనిపై కన్ను వేశారు అంట. లీలా హోటల్లో సమావేశాలు కూడా జరిపారు అంట' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
Also Read: Uppal Stadium: ఉప్పల్ స్టేడియంలో అధ్వానం.. ఖర్చీఫ్లతో తుడుచుకున్న ప్రేక్షకులు
'దిల్ భూముల సంగతి మనకు తెలియదా? దిల్(దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్) భూముల్లో మాకు వాటా ఉంటుంది అని ఏపీ ప్రభుత్వం అంటుంది. దిల్ భూమిలో పంచాయతీ నడుస్తోంది. ఆ భూమిలో 50 ఎకరాల వరకు రైతులు సాగు చేసుకుంటున్నారు. అక్కడ మార్కెట్ పెడుతున్నారని చెబుతున్నారు. అందులో మా భూమిలో పోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. కిరికిరి భూమితో అయ్యేది కాదు పోయేది కాదు' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
'ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ కట్టాలని ప్లాన్ చేసింది మార్కెటింగ్ శాఖ. మార్కెటింగ్ మంగళం.. భూమి మాత్రం కథం. సూర్యుడు చుట్టూ భూమి తిరిగితే భూమి చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతాడు. ఈ భూమిపై రేవంత్ రెడ్డి కన్ను పడింది. రైతుల పక్షాన ఉంటావా? దళారుల పక్షాన ఉంటావా రేవంత్?' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. వేలాది మంది ఈ మార్కెట్పై జీవనాధారం కొనసాగిస్తున్నారు. నీ కమీషన్ల కోసం రైతులను కూడా వదిలిపెట్టవా? అని నిలదీశారు.
'కబ్జాలకు కాదేది అన్నట్టు ఉంది ఈ ప్రభుత్వం తీరు. ఈ భూమి మార్కెటింగ్ శాఖకు చెందిన భూమి. పండ్ల మార్కెట్పై రేవంత్ రెడ్డి కన్ను పడింది' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు ఆరోపించారు. 'పంట మార్పిడి అంటున్నావు మరి పండ్ల రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. వారికి అన్ని రకాలుగా వసతులు కల్పించాలని కానీ ఇవన్నీ కాదని ఏదో చేస్తాను అంటున్నాడు. ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ కట్టే వరకు బిఆర్ఎస్ పార్టీ పోరాటం ఉంటుంది' అని స్పష్టం చేశారు.
'ఈ ప్రభుత్వం భూములు తప్ప ఇంకోటి కాదు. కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టింది. ఎక్కడ పడితే అక్కడ భూములను నిషేధిత జాబితాలో పెట్టి రేవంత్ రెడ్డి రైతుల ఉసురు తీస్తున్నాడు. దేవుడి పేరు చెప్పి కూడా ఈ ప్రభుత్వంలోని పెద్దలు వసూలు చేస్తున్నారు. దేవుడి పేరు చెప్పి వసూలు చెప్తే దేవుడు తగిన శాస్త్రి చేస్తాడు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'తుమ్మల నాగేశ్వరరావు రైతు పక్షపాతి...నిజమైన రైతు బిడ్డ గా రైతులకు అండగా నిలవాలి. రేవంత్ రెడ్డితో పట్టుపట్టి ఈ భూమిలోనే రైతులకు ఫ్రూట్ మార్కెట్ కట్టాలి' అని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ కట్టే వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని హామీ ఇస్తున్నామని తెలిపారు. దిల్ భూముల్లో భూములున్న వారికి కూడా మా పార్టీ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నట్లు హరీశ్ రావు చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Liquor Price Hike: మందు బాబులకు షాకింగ్ న్యూస్..కొండెక్కిన మద్యం ధరలు..ఎంత పెరిగిందంటే?
Hyderabad, Telangana:Telangana Liquor Price Hike: తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా మద్యం ధరలు పెంచేందుకు ప్లాన్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. గ్యాస్ కొరత, సీసాల ఉత్పత్తి తగ్గడం వంటి కారణాలతో బీరు సీసాల ధరలు పెంచేందుకు రంగం సిద్ధమైందట!DJ Dispute: గంగమ్మ జాతరలో చిచ్చుపెట్టిన డీజే.. వేట కొడవళ్ల దాడిలో ఒకరి మృతి
Nagarajupeta, Andhra Pradesh:Kadapa Crime News: కుర్రాళ్ల మధ్య జరిగిన చిన్నపాటి వివాదం చినికి చినికి గాలివానగా మారి ఒక ప్రాణం పోయే స్థాయికి చేరుకుంది. జాతరలో ఏర్పాటుచేసిన డీజేలో ఓ పాట విషయమై ఇరువర్గాల మధ్య వివాదం రాజుకుంది. మాటామాట పెరగడంతో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. గొడవ తెల్లారి మరింత ముదిరింది. ఇంటి వద్ద దాడి చేసి గాయపర్చగా.. అనంతరం చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్దకు వెళ్లి మరి వేటకొడవళ్లతో దాడి చేశారు. ఒకరి ప్రాణం తీశారు. మరికొందరిని తీవ్రంగా గాయపర్చిన సంఘటన కడప పట్టణంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Sunrisers: నరాలు తెగే ఉత్కంఠలో లక్నో విజయం.. సొంతగడ్డపై పోరాడి ఓడిన సన్రైజర్స్
కడప నగరంలోని ఆలంఖాన్ పల్లెలో గంగమ్మ జాతర జరిగింది. ఈ జాతరలో అర్ధరాత్రి పూట డీజే డ్యాన్స్ విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. మాటామాట పెరగడంతో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో పెద్ద దస్తగిరి, చిన్న సిద్ధయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలతో ఉన్న వీరిద్దరినీ చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే కక్షతో రగిలిపోతున్న ప్రత్యర్థి వర్గం బాధితులను వదిలిపెట్టలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని అక్కడకు వెళ్లారు. సమయం కోసం వేచి చూస్తుండగా ఎక్స్రే కోసం పెద్ద దస్తగిరి, చిన్న సిద్దయ్య బయటకు వచ్చారు.
Also Read: Salary Hike: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో శుభవార్త.. ఇదే జరిగితే పర్స్ ఫుల్
అక్కడే కాపు కాస్తున్న ప్రత్యర్థి వర్గం వెంట తెచ్చుకున్న కొడవళ్లు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. బాధితులు రిమ్స్ ఆస్పత్రిలోకి పరుగెత్తి కుప్పకూలారు. ఆస్పత్రి ప్రాంగణం రక్తసిక్తమైంది. ప్రత్యర్థులు విచక్షణారహితంగా దాడి చేయడంతో పెద్ద దస్తగిరి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బాధితుడు చిన్న సిద్ధయ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆలంఖాన్ పల్లె గంగమ్మ జాతరలో మొదలైన చిన్న గొడవ.. ఒకరి ప్రాణం తీసే వరకు వెళ్లడంతో ఆ గ్రామం ఉలిక్కిపడింది. ఈ సంఘటనతో కడప నగరం ఒక్కసారిగా కలకలం ఏర్పడింది.
ఆస్పత్రి వంటి సురక్షిత ప్రాంతంలో ఈ సంఘటన జరగడం విస్మయానికి గురి చేస్తోంది. పోలీస్ అవుట్ పోస్ట్ ఉండే రిమ్స్ ప్రాంగణంలోనే ఈ హత్య జరిగితే పోలీసులు ఏం చేస్తున్నారనే సందేహం వ్యక్తమవుతోంది. హత్య జరిగిన తర్వాత కడప తాలుకా, రిమ్స్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. జాతర గొడవే ఈ హత్యకు దారితీసిందా? లేక పాత కక్షలు ఏవైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Retirement Planning: ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త..రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.50,000 పెన్షన్..ఏం చేయాలంటే?
Hyderabad, Telangana:50000 Pension After Retirement: ఉద్యోగులు తమ పదవీకాలం తర్వాత రిటైర్మెంట్ అవ్వక తప్పదు. అయితే పదవీ విరమణ అనే ఆలోచన చాలా మందిని ఆందోళనకు గురి చేస్తుంది. పదవీ విరమణ తర్వాత నెలవారీ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అన్నదే పెద్ద ప్రశ్న ఉద్యోగులు అందర్ని తొలచివేస్తుంది. కానీ సరైన ప్రణాళికతో.. మీరు రిటైర్మెంట్ తర్వాత కూడే అదే విధమైన నెలవారీ జీతాన్ని పొందే అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత కూడా నెలకు సుమారు రూ.50,000 పొందాలనుకునే వారు ఇప్పుడే తగినట్టుగా ప్లాన్ రెడీ చేసుకోవాలి. మీరు 25 ఏళ్ల వయస్సులో ఎంత ఎక్కువగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. రాబోయే రోజుల్లో అంత ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. దీనిని సాధారణంగా చక్రవడ్డీ అని పిలుస్తారు. దీని వల్ల మీకు మీరు పెట్టిన పెట్టుబడిపై అధికంగా లభించే వడ్డీని కల్పిస్తుంది. రోజులు గడిచే కొద్దీ ఇది పెద్ద మొత్తాన్ని ఉద్యోగులకు సమకూరుస్తుంది.
అయితే మీ పెట్టుబడిని కేవలం ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా గోల్డ్ రూపంలో పెట్టుబడి పెట్టడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండకపోవచ్చు. ఎందుకంటే పెరుగుతున్న ద్రవ్యోల్బణం వాటి రాబడిని మరింత తగ్గిస్తుంది. అందువల్ల.. మీరు మీ డబ్బును వివిధ రంగాలలో, వివిధ రూపాల్లో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఎన్పీఎస్, పీపీఎఫ్ వంటి సురక్షితమైన పెట్టుబడులను ఎంచుకోండి.
ఈక్విటీ పెట్టుబడులు దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇస్తుంది. అయితే పీపీఎఫ్, ఎన్పీఎస్ మీ డబ్బును సురక్షితంగా నిలుపుతాయి. ఉదాహరణకు మీ వద్ద రూ.1.5 కోట్లు ఉంటే.. మీరు ఈ డబ్బును మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. తద్వారా మీరు ప్రతి నెలా రూ.50,000 విత్డ్రా చేసుకోవచ్చు. అంటే.. మీరు రిటైర్ అయిన తర్వాత కూడా నెలవారీ అంత పెద్ద మొత్తంలో పెన్షన్ పొందవచ్చు. ఈ పద్ధతిని సాధారణంగా సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (SWP) అని అంటారు. ఈ పద్ధతిలో అయితే మీ డబ్బు పెట్టుబడిలోనే ఉంటుంది. మీకు నెలవారీ ఆదాయం కూడా లభిస్తుంది.
అయితే మీకు వచ్చే రాబడితో పాటు మీరు పన్ను సంబంధిత అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం ఎంతో ముఖ్యం. మీ NPS పెట్టుబడిలో కొంత భాగం పన్ను రహితంగా ఉంటుంది. అదేవిధంగా మీరు ముందుగా ట్యాక్స్ వివరాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం శ్రేయస్కరం. మీరు సరైన సమయంలో సరైన పద్ధతిలో పెట్టుబడి పెడితే, పదవీ విరమణ తర్వాత కూడా సౌకర్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు.
(గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అందించాము. దీనిని పెట్టుబడి సలహాగా పరిగణించరాదు. దయచేసి ఏవైనా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు సరైన ఆర్థిక నిపుణుడి సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
RCB vs CSK: ఐపీఎల్ 2026లో ఆర్సీబీ డబుల్ ధమాకా.. చెన్నై హ్యాట్రిక్ ఓటమి
Bengaluru, Karnataka:CSK Hattrick Defeat In IPL 2026: డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2026లో జోరు కనబరుస్తోంది. ఈ సీజన్లో ఆడిన రెండో మ్యాచ్లో కూడా విజయం సాధించగా.. చెన్నై సూపర్ కింగ్స్ ఓటముల్లో హ్యాట్రిక్ నమోదు చేసింది. 3 వికెట్ల నష్టానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 250 భారీ స్కోర్ సాధించగా.. చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లకు 207 పరుగులు చేసి పోరాటం ముగించింది. బ్యాటింగ్, బౌలింగ్లో బెంగళూరు అదరగొడితే.. చెన్నై అన్నింటిలో విఫలమై హ్యాట్రిక్ పరాజయాన్ని మూటగట్టుకుంది.
Also Read: Uppal Stadium: ఉప్పల్ స్టేడియంలో అధ్వానం.. ఖర్చీఫ్లతో తుడుచుకున్న ప్రేక్షకులు
చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన నిర్ణీత 20 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 250 పరుగులు సాధించింది. టిమ్ డేవిడ్ బ్యాటింగ్తో దుమ్మురేపాడు. టాపార్డర్ గొప్ప ప్రారంభం చేయగా.. డేవిడ్ చెలరేగి ఆడి 25 బంతుల్లోనే 70 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఫోర్లు 3 మాత్రమే కొట్టగా.. 8 సిక్సర్లతో స్ట్రైక్ రేట్ 280తో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 28 పరుగులకే ఔటవగా.. ఫిల్ సాల్ట్ 30 బంతుల్లో 46 పరుగులు చేసి రాణించాడు. దేవదత్ పడిక్కల్ 29 బంతుల్లో 50 స్కోర్ చేసి అర్ధ సెంచరీ నమోదు చేశాడు. రజత్ పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 19 బంతుల్లోనే 48 పరుగులు చేసి కొద్దిలో అర్ధ శతకాన్ని కోల్పోయాడు. చెన్నై బౌలర్లు మరోసారి తేలిపోయారు. చెన్నై బౌలింగ్ చూస్తే అసలు బౌలర్ వికెట్ తీయాలనే విషయాన్ని మరచినట్టు కనిపిస్తోంది. అన్షుల్ కంబోజ్, జేమీ ఓవర్టన్, శివమ్ దూబే తలా ఒక్కో వికెట్ తీసినా పరుగులు మాత్రం భారీగా ఇచ్చారు.
Also Read: Sunrisers: నరాలు తెగే ఉత్కంఠలో లక్నో విజయం.. సొంతగడ్డపై పోరాడి ఓడిన సన్రైజర్స్
బౌలర్లు విఫలమవడంతో బెంగళూరు విధించిన భారీ లక్ష్యాన్ని చెన్నై బ్యాటర్లు ఛేదించలేక 19.4 ఓవర్కు చేతులెత్తేశారు. 207 పరుగులు చేసి సూపర్ కింగ్స్ ఆలౌటైంది. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమవగా.. ఆఖరులో ఆల్రౌండర్ నిలదొక్కుకోవడంతో ఓటమి అంతరం తగ్గింది. సంజూ శామ్సన్ 9 పరుగులకే మళ్లీ నిరాశపర్చగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా 7 పరుగులకే ఔటయ్యాడు. గత మ్యాచ్లో అద్భుతంగా ఆడిన ఆయుశ్ మాత్రమే ఈసారి ఒక్క పరుగే చేసి వెనుదిరిగాడు. క్లిష్ట సమయంలో సర్ఫరాజ్ ఖాన్ అద్భుతంగా ఆడి 25 బంతుల్లో 50 పరుగులు చేసి ఆశలు రేకిత్తించాడు. కార్తీక్ శర్మ (6), శివమ్ దూబే (18) తక్కువ పరుగులు చేయగా.. ప్రశాంత్ వీర్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. ఓటమి ఖాయం చేసుకున్నా కూడా ఏమాత్రం బెరుకు లేకుండా 29 బంతుల్లో 43 పరుగులు చేశాడు. జేమీ ఓవర్టన్ కూడా 37 పరుగులు చేసి గెలుపు ఆశలను సజీవం చేశాడు. తర్వాత వచ్చిన బ్యాటర్లు అన్షూల్ కంబోజ్ (19), నూర్ అహ్మద్ (8), మ్యాట్ హెన్రీ (2) కొన్ని పరుగులు జోడించినా విజయానికి కావాల్సిన స్కోర్ రాలేదు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్కు మూడో ఓటమి తప్పలేదు. బ్యాటర్ల మాదిరి బెంగళూరు బౌలర్లు కూడా నిప్పులు చెరిగారు. భారత సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ వేసి 3 వికెట్లు తీశాడు. జాకోబ్ డఫ్పీ, అభినందన్ సింగ్, కృనాల్ పాండ్యా తలా రెండేసి వికెట్లు తీయగా.. సుయాష్ శర్మ ఒక వికెట్ తీశాడు.
తొలి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. రెండో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. రెండు విజయాలతో రాయల్ చాలెంజర్స్ పాయింట్ల పట్టికలో టాప్లో నిలవగా.. వరుసగా మూడు ఓటములతో చెన్నై చివరి స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఒకప్పటి అగ్ర జట్టు ఈ సీజన్లో కూడా ఇంతటి పేలవ ప్రదర్శన కనబరుస్తుండడంతో చెన్నై అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. మాజీ కెప్టెన్ ధోనీ లేకపోవడం.. అతడి సలహాలు, వ్యూహం కరువవడంతోనే ఇలా జరుగుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Custard Apple For Diabetic: షుగర్ వ్యాధిగ్రస్తులు సీతాఫలం తినొచ్చా? తింటే ఏంటి..తినకపోతే ఏం జరుగుతుంది?
Hyderabad, Telangana:Custard Apple For Diabetic Patients: మనందరికీ సీతాఫలం అంటే ఏంటో తెలిసిన సంగతే. చాలా మంది దీన్ని ఇష్టంగా తింటుంటారు. చలికాలంలో ఈ పండు ఎంతో రుచిగా ఉంటుంది. అయితే మధుమేహం ఉన్న రోగులు ఈ సీతాఫలాన్ని తినొచ్చా అనే ప్రశ్న అందరిలోనూ ఉంటుంది. సీతాఫలంలో నేచురల్ షుగర్ ఉంటుంది కాబట్టి.. షుగర్ వ్యాధిగ్రస్తులు దీన్ని తినే ముందు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఫలాన్ని తినొచ్చా లేదా అనే సందేహాలకు వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
మధుమేహ వ్యాధిగ్రస్తులు సీతాఫలాన్ని తినేముందు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. అయితే దీన్ని పూర్తిగా తినడం మానేయాల్సిన అవసరం లేదు. కానీ సరైన మోతాదులో అది కూడా సరైన సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిదట. ఈ పండులో విటమిన్ సి, విటమిన్ ఎ, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.
ఈ పండు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడం సహా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా ఇందులోని పొటాషియం, మెగ్నీషియం రక్తపోటు(బీపీ)ను నియంత్రించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. సీతాఫలంలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ముఖ్యంగా, రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రిస్తుంది.
అయితే సీతాఫలంలో సహజ చక్కెర కొద్దిగా ఎక్కువగా ఉంటుందనే విషయం షుగర్ వ్యాధిగ్రస్తులు గమనించాల్సిన విషయం. ఈ నేపథ్యంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని రోజూ తినడం మంచిది కాదు. దానికి బదులుగా రెండు మూడు రోజులకు ఒకసారి మాత్రమే కొద్దిగా సీతాఫలం ముక్కలను తినడం మేలు. అది ఖాళీ కడుపుతో కంటే భోజనం తిన్న తర్వాత దీన్ని తీసుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరగదు.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎల్లప్పుడూ వైద్యుని సలహాతోనే తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ఎందుకంటే మనలో కొందరి శరీర తీరు ఒకేలా ఉండదు. కొందరైతే సీతాఫలం తిన్న వెంటనే వారి రక్తంలో షుగర్ లెవల్ అమాంతం పెరిగిపోతాయి. అలాగే కొందరిలో షుగర్ లేవల్ పెద్దగా వ్యత్యాసం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో సీతాఫలం తినాలనుకునే వారు తినే ముందు ఒకసారి.. తిన్న తర్వాత మరోసారి షుగర్ లెవల్ టెస్ట్ చేయిస్తే..మీ శరీర తీరు గురించి ఇట్టే తెలిసిపోతుంది.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్య నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Uppal Stadium: ఉప్పల్ స్టేడియంలో అధ్వానం.. ఖర్చీఫ్లతో తుడుచుకున్న ప్రేక్షకులు
Hyderabad, Telangana:Fans Wipe Chairs: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమై ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుండగా.. హైదరాబాద్లో తొలి మ్యాచ్ జరిగింది. సొంత జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరగడంతో పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఉప్పల్ స్టేడియానికి వచ్చారు. జరిగిన తొలి మ్యాచ్కు ఏర్పాట్లు చేయడంలో హైదరాబాద్ క్రికెట్ సంఘంతోపాటు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించింది. ఎంతలా అంటే కుర్చీలు కూడా తుడవలేనంతా అధ్వానంగా ఏర్పాట్లు ఉన్నాయి. దీంతో ప్రేక్షకులు తమ కుర్చీలను ఖర్చీఫ్లతో తుడుచుకోవాల్సి వచ్చింది.
Also Read: Sunrisers: నరాలు తెగే ఉత్కంఠలో లక్నో విజయం.. సొంతగడ్డపై పోరాడి ఓడిన సన్రైజర్స్
క్రికెట్ అంటే క్రేజీ ఉండే హైదరాబాద్లో ఐపీఎల్ పుణ్యాన ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్లు ఉన్నాయి. సన్రైజర్స్ సొంత జట్టు కావడంతో హైదరాబాద్లో మ్యాచ్లు జరుగుతున్నాయి. లేదంటే ప్రభుత్వం, హైదరాబాద్ క్రికెట్ సంఘం వ్యవహార శైలికి ఒక్క మ్యాచ్ కూడా జరగదు. తాజాగా జరిగిన తొలి మ్యాచ్కు కూడా సక్రమంగా ఏర్పాట్లు చేయలేదు. హెచ్సీఏ, కాంగ్రెస్ ప్రభుత్వం మ్యాచ్కు చేయాల్సిన ఏర్పాట్లు పూర్తి నిర్లక్ష్యం వహించింది.
Also Read: Gajwel Bandh: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆఫీస్పై కాంగ్రెస్ గూండాల దాడి.. రేపు గజ్వేల్ బంద్
అతికష్టంగా టికెట్లు పొందిన క్రికెట్ అభిమానులు స్టేడియంలో లోపలకు వెళ్లాక అక్కడ ఉన్న పరిస్థితి చూసి ఓరినాయనో అని అనుకోవాల్సిన పరిస్థితి. కుర్చీలన్నీ దుమ్ముతో నిండిపోయి ఉన్నాయి. ఎలా కూర్చోవాలి అని సంశయం వ్యక్తం చేశారు. మ్యాచ్ చూడాలనే ఇష్టంతో వచ్చిన ప్రేక్షకులు ప్రభుత్వాన్ని.. హెచ్సీఏను తిట్టేసుకుని తమ కుర్చీలు తుడుచుకుని కూర్చున్నారు. ఖర్చీఫ్లు.. టిష్యూలతో సీట్లు తుడుచుకుని మ్యాచ్ను వీక్షించారు. ఇక స్టేడియంలోకి సన్ గ్లాసెస్ అనుమతించకపోవడంతో ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందే ఎండాకాలం.. పైగా మధ్యాహ్నం సమయంలో మ్యాచ్ ఉండడంతో సన్గ్లాసెస్కు అనుమతించాలని విజ్ఞప్తి చేసినా భద్రతా సిబ్బంది అనుమతించలేదు. ఇక చేసేదేమి లేక సన్ గ్లాసెస్ బయటే పడేసి క్రికెట్ అభిమానులు స్టేడియం లోపలకు వెళ్లారు. ఇక స్టేడియం లోపలికి వెళ్లడం.. పార్కింగ్ వంటి వాటితో ప్రేక్షకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఐపీఎల్ మ్యాచ్లకు ముందే ఏర్పాట్లు చేయాల్సి ఉండగా హెచ్సీఏతోపాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించడాన్ని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం కుర్చీలు కూడా తుడవలేరా? అని ప్రశ్నించారు. ప్రేక్షకులు ఖర్చీఫ్లతో కుర్చీలు తుడుచుకుంటున్న వీడియోలు వైరల్గా మారాయి. వేల రూపాయలు ఖర్చు పెట్టి టికెట్ కొన్నా తమ సీట్లు తామే తుడుచుకోవాల్సిన పరిస్థితి అని ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా విలువైన సన్గ్లాసెస్ వృథాగా బయట పడేయాల్సి వచ్చిందని వాపోతున్నారు. తొలి మ్యాచ్ లోపాలు సరిచేసుకుని మిగతా మ్యాచ్లకు అయినా సరైన ఏర్పాట్లు చేయాలని క్రికెట్ ప్రేమికులు కోరుతున్నారు. ఉప్పల్ స్టేడియంలో మళ్లీ ఏప్రిల్ 13వ తేదీన మ్యాచ్ ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Etela Rajender On KCR: "KCRనే ఎదిరించినోడ్ని..గీళ్లకు భయపడతానా?" ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు!
Hyderabad, Telangana:Etela Rajender On KCR News: తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్నే ఎదిరించినోడిని.. ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదని ఆయన అంటున్నారు.Gajwel Bandh: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆఫీస్పై కాంగ్రెస్ గూండాల దాడి.. రేపు గజ్వేల్ బంద్
Gajwel, Telangana:KCR Camp Vandalise By Congress Goons: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడి చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు బీభత్సం సృష్టించి అద్దాలు పగలగొట్టి.. ఫర్నీచర్ను ధ్వంసం చేయడానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా రేపు గజ్వేల్ బంద్కు పిలుపునిచ్చింది.
Also Read: Sunrisers: నరాలు తెగే ఉత్కంఠలో లక్నో విజయం.. సొంతగడ్డపై పోరాడి ఓడిన సన్రైజర్స్
ఈ బంద్కు సంబంధించిన వివరాలను మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫొటో పెట్టాలని ఎక్కడా లేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఇంట్లో నరేంద్ర మోదీ ఫొటో ఉందా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇంట్లో ప్రధాని మోదీ ఫొటో ఉందా? అని నిలదీశారు.
'గజ్వేల్ క్యాంప్ కార్యాలయంలోకి రావడానికి వారికి ఏమి హక్కు ఉంది. గజ్వేల్ 50 సంవత్సరాల ముందుకు కేసీఆర్ అభివృద్ధి చేశారు. కాంగ్రెస్ వచ్చాక గజ్వేల్లో ఒక్క నిధులు మంజూరు కాలేదు. రౌడీ రాజకీయాలు చేస్తున్నారు. గజ్వేల్ పోలీస్ స్టేషన్కు 200 మీటర్ల దూరంలోనే క్యాంప్ కార్యాలయంపై దాడి జరిగితే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు. సిద్దిపేటలో జరిగిన ముఖ్యమంత్రి కార్యక్రమం లో హరీష్ రావు ఫొటో పెట్టలేదు. ప్రజా పాలన అంటున్నారు కానీ చేసేది గుండాల పాలన' అని విమర్శించారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా ఏప్రిల్ 6వ తేదీ సోమవారం గజ్వేల్ బంద్కు పిలుపునిస్తున్నట్లు ,డ. పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రకటించారు.
Also Read: Salary Hike: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో శుభవార్త.. ఇదే జరిగితే పర్స్ ఫుల్
అనంతరం మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 'గజ్వేల్ నియోజకవర్గాన్ని కేసీఆర్ ఆదర్శంగా నిలిపారు. మూడు పర్యాయాలు ఇక్కడి నుండి గెలవడం మామూలు కాదు. భగవాన్ స్వరూపం లాంటి వ్యక్తిపై చిటికెలు వేయడం సరికాదు' అని కాంగ్రెస్ శ్రేణుల తీరును ఖండించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపియాలని కాంగ్రెస్ గూండాలకు సవాల్ చేశారు. ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి కేసీఆర్ అని ప్రశంసించారు. క్యాంప్ కార్యాలయంలో రేవంత్ ఫొటో పెట్టాలని జీవో ఉందా అని ప్రశ్నించారు. ఫొటోలు పెడితే అభిమానం ఉండదు ప్రజలకు అభివృద్ధి చేస్తే అభిమానం వస్తదని కాంగ్రెస్ నాయకులకు మాజీ ఎమ్మెల్యే పద్మ హితవు పలికారు.
'ప్రజాస్వామ్యం పేరెత్తితే కేసులు పెట్టే పరిస్థితి. తెలంగాణలో కాళేశ్వరం లాంటి ఎన్నో ప్రాజెక్టులను కేసీఆర్ నిర్మించారు. ప్రతిపక్షాల మీద ఉన్న శ్రద్ధ ప్రజలపై ఉంటే ఎంతో అభివృద్ధి చేసేవాళ్లు. రాబోయే రోజుల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు పద్మా దేవేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ను ఒక్క మాట అంటే ప్రజలు మిమ్మల్ని చెదరించుకుంటారని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Traffic Challan: ట్రాఫిక్ చలాన్పై బిగ్ అలర్ట్.. పెండింగ్ చలాన్ ఉంటే మీకు చుక్కలే
Hyderabad, Telangana:Pending Traffic Challan Risks: వాహనదారులకు ట్రాఫిక్ చలాన్పై బిగ్ అలర్ట్. చలాన్ చెల్లించకపోతే ఏమీ కాదని భారీగా పెండింగ్ చలాన్లు ఉంచితే మాత్రం చిక్కులు ఎదుర్కొనవలసిందే. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా చలాన్లు పడుతుంటాయి. ఆ చలాన్లు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ వాహనం విక్రయించాలనుకున్న సమయంలో చలాన్ కారణంగా విక్రయించలేకపోవచ్చు.
Also Read: Sunrisers Hyderabad: సన్ రైజర్స్కు సొంత గడ్డపై భారీ షాక్.. ఆఫీస్ ముందు తెలంగాణ క్రికెటర్ల ధర్నా
ప్రస్తుతం దేశంలో అత్యాధునిక ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థలు వచ్చాయి. వాహనాల రాకపోకలు సక్రమంగా చేయడమే కాకుండా ప్రమాదాలు నివారించడానికి ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ పని చేస్తుంది. అంతేకాకుండా వాహనదారుల ప్రాణాలు కూడా ఎంతో విలువైనవిగా భావించి సేఫ్టీ చర్యలు చేపడుతోంది. వాటిలో భాగంగా హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించాలి.. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అంతేకాకుండా సిగ్నళ్ల వద్ద తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి.. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంపింగ్, మద్యం సేవించి వాహనం నడపడం వంటి జాగ్రత్త చర్యలు ట్రాఫిక్ పోలీస్ పాటిస్తోంది. వీటిని ఉల్లంఘించిన వారిపై చలాన్లు వేస్తూ వారి నుంచి జరిమానా వసూలు చేస్తోంది. బాధ్యతగా ఉండాల్సిన వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించడంతో చలాన్తో జరిమానా వేస్తున్నారు. అయితే ఈ చలాన్ను వాహనదారులు పట్టించుకోవడం లేదు.
Also Read: Salary Hike: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో శుభవార్త.. ఇదే జరిగితే పర్స్ ఫుల్
ట్రాఫిక్ చలాన్లు ఒక్కో వాహనంపై దాదాపు ఐదుకు మించి ఎక్కువ ఉన్నాయని అర్థమవుతోంది. ముఖ్యంగా ఏపీతోపాటు తెలంగాణలో భారీగా వాహనదారుల చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. తాము ఉల్లంఘించిన ట్రాఫిక్ నిబంధనలపై విధించిన చలాన్ను వాహనదారులు చెల్లించడం లేదు. దీంతో భారీగా పెండింగ్ చలాన్లు పేరుకుపోతున్నాయి. ఈ పెండింగ్ చలాన్లపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ పెట్టి చర్యలు తీసుకుంటున్నారు.
అయితే ట్రాఫిక్ చలాన్ పెండింగ్లో ఉంటే ఏం జరుగుతుంది? ఎవరు అడుగుతారులే అని నిర్లక్ష్యం వహిస్తుంటారు. పెండింగ్ చలాన్లు ఉండడం ఎప్పటికైనా వాహనదారుడికి ఇబ్బందే. ట్రాఫిక్ పోలీస్పరంగా పెండింగ్ చలాన్ తప్పించుకున్నా వేరే విధంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అవసరం ఉండి మీ వాహనాన్ని ఇతరులకు విక్రయించాలనుకుంటే పెండింగ్ చలాన్లు చూస్తున్నారు. పెండింగ్ చలాన్ అధికంగా ఉంటే కొనాలనుకునేవారు మీ వాహనాన్ని కొనలేరు. అంతేకాకుండా ఇన్స్రెన్స్ పొందాలనుకున్నా.. రెన్యువల్ చేసుకోవాలన్నా పెండింగ్ చలాన్లు ఇన్సురెన్స్ సంస్థలు చూస్తున్నాయి.
Also Read: CSK vs PBKS: చెన్నై వరుసగా రెండో ఓటమి.. అద్భుత ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ రెండో విజయం
వాహనంపై వెళ్తున్న సమయంలో పొరపాటున ట్రాఫిక్ పోలీసులకు చిక్కారంటే ఇక మీ వాహనం సీజ్ అవుతుంది. న్యాయస్థానం ద్వారా తిరిగి వాహనం పొందాల్సి ఉంటుంది. పెండింగ్ చలాన్లు కట్టడమే కాకుండా న్యాయస్థానం చుట్టూ తిరగాల్సి ఉంటుంది. చలాన్ పడిన వెంటనే చెల్లిస్తే చిన్న మొత్తంలో అవుతుంది. అదే భారీగా పేరుకుపోయిన చలాన్లు ఉంటే తర్వాత పోలీసుల ద్వారా చెల్లించాల్సి వస్తే అది భారీగా ఉంటుంది. అందుకే ఎప్పటి సమస్యను అప్పుడే పరిష్కరించుకోవాలని అంటారు. సమస్య చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరించుకోవాలి. ఈరోజు తక్కువలో ఉన్నప్పుడే చలాన్లు చెల్లిస్తే భవిష్యత్లో భారీగా ఉండవు. అన్నింటికన్నా ముఖ్యమైనది అసలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ఎలాంటి గొడవ ఉండదు. సురక్షితంగా ప్రయాణం చేయడంతోపాటు చలాన్ల బాధ కూడా ఉండదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Sunrisers: నరాలు తెగే ఉత్కంఠలో లక్నో విజయం.. సొంతగడ్డపై పోరాడి ఓడిన సన్రైజర్స్
Hyderabad, Telangana:Sunrisers Hyderabad: సొంత గడ్డ ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్కు తీవ్ర నిరాశ ఎదురైంది. నరాలు తెగే ఉత్కంఠ పోరులో ప్రత్యర్థి లక్నో సూపర్ జియాంట్స్ పోరాడి విజయం సాధించింది. బంతి బంతికి ఫలితం తారుమారు అవుతున్న వేళ ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. గట్టి పోటీ ఇచ్చిన లక్నో సూపర్ జియాంట్స్కు ఆఖరి రెండో బంతికి గెలిచింది. తక్కువ స్కోర్ అయినా కూడా సన్రైజర్స్ గొప్ప పోరాట పటిమ కనబర్చింది.
ఉప్పల్ స్టేడియంలో వేదికగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. సొంత గడ్డపై 300 పరుగులు చేద్దామని భారీ ప్రణాళికతో బరిలోకి దిగగా లక్నో బౌలర్లు ఆ అవకాశం కల్పించలేదు. తొలి ఓవర్ నుంచి బౌలర్లు ప్రతాపం చూపించడంతో సన్రైజర్స్ టాపార్డర్ కుప్పకూలింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ వరుసగా ఔటయిన వేళ హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి గొప్పగా ఆడారు. వందలోపే స్కోర్ ముగించాలని లక్నో వేసిన వ్యూహాన్ని తమ బ్యాట్తో వీరిద్దరూ ఛేదించారు.
Also Read: Salary Hike: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో శుభవార్త.. ఇదే జరిగితే పర్స్ ఫుల్
ఓపెనర్లుగా దిగిన ట్రావిస్ హెడ్ ఏడు పరుగులకు ఔటవగా.. అభిషేక్ శర్మ డకౌట్తో నిరాశపర్చాడు. షమీ వేసిన బంతికి ఇద్దరూ చిక్కడంతో భారీ షాక్ తగిలింది. అనంతరం కెప్టెన్ ఇషాన్ కిషన్ భారీ స్కోర్ చేస్తాడనుకున్న వేళ ఒక్క పరుగుకే ఔటవడంతో సన్రైజర్స్ హైదరాబాద్ కష్టాల్లో పడింది. తొలిసారి సన్రైజర్స్ తరఫున బరిలోకి దిగిన లియాన్ లివింగ్స్టోన్ 14 పరుగులు మాత్రమే చేసి ఔటయిన వేళ హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి గ్రౌండ్లోకి దిగారు.
Also Read: Sunrisers Hyderabad: సన్ రైజర్స్కు సొంత గడ్డపై భారీ షాక్.. ఆఫీస్ ముందు తెలంగాణ క్రికెటర్ల ధర్నా
వరుస వికెట్లతో జోష్ మీదున్న లక్నో బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వరాదని భావించిన ఈ ఇద్దరూ బ్యాటర్లు స్ట్రైక్ మారుస్తూ పరుగులు తీశారు. గ్రౌండ్లో పాతుకుపోయిన కొన్ని నిమిషాల తర్వాత అసలైన ఆట మొదలుపెట్టారు. పరస్పరం సహకరించుకుంటూ క్లాసెన్, నితీశ్ స్కోర్ను పెంచారు. అనంతరం ఫోర్లు, సిక్సర్లతో చెలరేగుతూ ఆడిన క్లాసెన్ 41 బంతుల్లో 62 పరుగులు చేశారు. వాటిలో ఐదు ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అదే స్థాయిలో నితీశ్ కుమార్ రెడ్డి దుమ్మరేపి 33 బంతుల్లో 56 పరుగులు చేసి అర్ధ సెంచరీ చేశాడు. తగ్గేదేలా అని ప్రత్యర్థికి బ్యాట్తో సవాల్ చేయగా.. ప్రిన్స్ యాదవ్ ఔట్ చేశాడు. కొద్దిసేపు క్లాసెన్ గ్రౌండ్లో నిలిచి ఉన్నా అవేశ్ ఖాన్కు దొరికిపోయి మైదానం వీడాడు. ఆ తర్వాత వచ్చిన హర్ష్ దుబే (0), శివాంగ్ కుమార్ (5), హర్షల్ పటేల్ (4) వరుసగా ఔటవగా.. అనికేత్ వర్మ (2) నాటౌట్గా నిలిచాడు.
బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే ఉప్పల్ స్టేడియంలో లక్నో బౌలర్లు చెలరేగడం ఆసక్తికరంగా మారింది. గత సీజన్లో అత్యధిక స్కోర్లతో తమ రికార్డులను తామే తిరగరాసుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ సొంత గడ్డలో 300 పరుగులు సాధించాలని లక్ష్యం పెట్టుకోగా.. లక్నో బౌలర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. వాటిలో సగం కూడా అతికష్టంగా చేయనిచ్చారంటే లక్నో బౌలర్లు ఎ స్థాయిలో ప్రతాపం చూపారో అర్థమవుతోంది. ముఖ్యంగా షమీ బౌలింగ్ గురించి చెప్పుకోవాలి. దూకుడు మీద ఉన్న బ్యాటర్లను తొలి ఓవర్.. ఆ తర్వాత మూడో ఓవర్లో ఔట్ చేసి సన్రైజర్స్ అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేశాడు. అంతేకాకుండా చాలా పొదుపుగా 4 ఓవర్లు వేసిన షమీ 9 పరుగులు మాత్రమే ఇచ్చాడంటే బ్యాటర్లను ఎలా చెడుగుడు ఆడాడో అర్థమవుతోంది. ఇక ప్రిన్స్ యాదవ్, అవేశ్ ఖాన్ అదే స్థాయిలో బౌలింగ్ వేసి తలా రెండేసి వికెట్లు తీశారు. సిద్దార్థ్, దిగ్బేశ్ రాఠి ఒక్కో వికెట్ తీసి స్కోర్ బోర్డును నియంత్రించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Fuel Crisis Holidays: స్కూళ్లు, ఆఫీసులకు వారానికి 2 సెలవులు..ఇకపై శని, ఆదివారాలు అన్నీ బంద్..యుద్ధం వల్ల దేశంలో తీవ్ర ప్రభావం!
Namarjung, Gandaki Province:Nepal 2 Weekend Holidays: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కొద్దిమేర ఇంధన కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇరాన్-ఇజ్రాయెల్ సంఘర్షణల కారణంగా హోర్మూజ్ జలసంధి మూతపడిన కారణంగా ప్రపంచ ఇంధన వాణిజ్యానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై శని, ఆదివారాలను రెండు రోజులు సెలువులుగా ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది.
తాజాగా నేపాల్లోని కాఠ్మండులోని ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన క్యాబినేట్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంధన కొరత నేపథ్యంలో సరఫరాను సులభతరం చేయడం సహా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు దేశ వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలను ఏప్రిల్ 6 నుంచి కొత్త వారాంతపు సెలవులను పాటించాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
పెట్రోలియం సరఫరాలో కొనసాగుతున్న అంతరాయాల కారణంగా దేశవ్యాప్తంగా శని, ఆదివారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి సస్మిత్ పోఖరేల్ తెలిపారు. విద్యాసంస్థలు మినహా ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై పనిదినాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని ఆయన అన్నారు.
ఇంధన కొరత నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ఆధారిత వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు అవసరమైన చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను సిద్ధం చేయాలని కూడా క్యాబినెట్ నిర్ణయించింది. పశ్చిమాసియాలో ఘర్షణలు తీవ్రతరం కావడం వల్ల ఇంధన సరఫరాలో అనిశ్చితి నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రతినిధి తెలిపారు. సంప్రదాయ ఇంధన వాహనాలను బదులుగా విద్యుత్ వాహనాలుగా మార్చడాన్ని ప్రోత్సహించడం వల్ల ఇంధన పొదుపు చేయోచ్చని నేపాల్ ప్రభుత్వం యోచిస్తుంది.
ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా నిలిచిపోయిన క్రమంలో తీరప్రాంతం లేని నేపాల్ దేశానికి ఇంధన కొరత తీవ్రత మరింత పెరిగింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ (ఎన్ఓసి) చేసిన తాజా సవరణతో.. కాఠ్మండు లోయలో పెట్రోల్ ధర లీటరుకు 202 నేపాలీ రూపియా చేరడంతో నేపాల్లో పెట్రోలియం ధరలు సర్వకాలీన గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు డీజిల్, కిరోసిన్ ధరలు కూడా లీటరుకు 182 నేపాలీ రుపియాకు పెరిగాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
