కోతుల భయంతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు
Mothkur, Telangana:మోత్కూర్ పట్టణ కేంద్రంలో కోతుల బెడద రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రజల బెంబేలెత్తిపోతున్నారు. కోతులు గుంపులుగా బయలుదేరి కాలనీలపై విరుచుకుపడుతున్నాయి. ఇళ్లలోకి చొరబడి వీరంగం సృష్టిస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ప్రజలపై దాడులకు దిగుతూ గాయపరుస్తున్నాయి. బయటికి వెళ్లాలంటే కోతుల భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోతుల నియంత్రణ కోసం చర్యలు చేపట్టాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
ఒకే యువకుడితో ముగ్గురు యువతులు పెళ్లి.. శిక్ష పడుతుందా? BNS ఏం చెబుతోంది..
Hyderabad, Telangana:Up Triple Marriage Latest News: ఒకే యువకుడిని ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకేసారి పెళ్లి చేసుకున్న విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగుచూసింది. ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకరి ఇష్టాయిష్టాలతో, పరస్పర అంగీకారంతో జరిగిన ఈ పెళ్లిలో తప్పేముందని కొందరు మద్దతు అంటుండగా.. భారతదేశ చట్టాల ప్రకారం.. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని మరికొందరు స్పష్టం చేస్తున్నారు. అయితే, ఇలా ముగ్గురిని పెళ్లి చేసుకోవడంపై భారత చట్టాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ వివాహంపై వస్తున్న విమర్శలపై ఆ ముగ్గురు యువతుల్లో ఒకరు విలేకరులతో మాట్లాడుతూ.. రామాయణంలో దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలు (కౌసల్య, సుమిత్ర, కైకేయి) ఉన్నప్పుడు లేని అభ్యంతరం.. ఇప్పుడు మేము మా ఇష్టంతో చేసుకుంటే ఎందుకు వస్తోందని ఆమె ప్రశ్నించారు. తాము చిన్నప్పటి నుంచి కలసి పెరిగామని.. పెళ్లి తర్వాత కూడా విడిపోకూడదనే ఉద్దేశంతోనే ఒకే వ్యక్తిని భర్తగా స్వీకరించామని వెల్లడించారు.
హిందూ వివాహ చట్టం ఏం చెబుతోంది?
అయితే, పురాణాల కాలం నాటి పరిస్థితులతో ప్రస్తుత ఆధునిక చట్టాలను పోల్చలేమని చట్ట నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హిందూ వివాహ చట్టం - 1955 (Hindu Marriage Act, 1955) ప్రకారం హిందూ మతంలో ఒకే యువకుడు ముగ్గురును పెళ్లి చేసుకోవడం పూర్తిగా నిషేధించారు. సెక్షన్ 5(i) ప్రకారం.. వివాహం చేసుకునే సమయానికి దంపతుల్లో ఎవరికీ అంతకుముందే వివాహమై బతికి ఉన్న జీవిత భాగస్వామి ఉండకూడదు. ఒక భార్య బతికి ఉండగా.. ఆమెకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండా చేసుకునే రెండో లేదా మూడో పెళ్లికి చట్టపరంగా ఎటువంటి విలువ ఉండదు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం నేరం..
ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త నేర శిక్షా స్మృతి భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం.. ఇది తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. BNS సెక్షన్ 82 ప్రకారం.. మొదటి భాగస్వామి జీవించి ఉండగానే.. ఆ విషయమై స్పష్టమైన సమాచారం ఉండి కూడా మరొకరిని వివాహం చేసుకోవడం చట్టప్రకారం నేరం.. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే సదరు వ్యక్తికి ఏకంగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశముంది. సంబంధిత వ్యక్తులు పరస్పర అంగీకారం అని చెప్తున్నప్పటికీ.. భారత చట్టాల ముందు వ్యక్తిగత అంగీకారం కంటే రాజ్యాంగబద్ధమైన నియమాలే ప్రామాణికంగా ఉంటాయని న్యాయ నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
చెల్లెలు కారణంగానే ముద్రగడ్డ పద్మనాభం మరణం: ముద్రగడ గిరిబాబు సంచలన వ్యాఖ్యలు
Kirlampudi, Andhra Pradesh:Mudragada Giribabu: కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో మృతి చెందడంతో కాపు సమాజం పెద్ద దిక్కు కోల్పోయిన విషయం తెలిసిందే. ముద్రగడ పద్మనాభం ఉద్యమమే కాదు మరణం కూడా వివాదం రాజుకుంది. ముద్రగడ అంత్యక్రియలకు ఆయన కుమార్తె క్రాంతిని రానివ్వకపోవడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై ముద్రగడ పద్మనాభం స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా తన చెల్లెలె క్రాంతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి మరణానికి చెల్లెలు కారణం అని ప్రకటించారు. తన తండ్రిని మానసిక క్షోభకు గురయ్యారని.. దాని కారణంగానే ఆయన మరణించారని ముద్రగడ గిరిబాబు తెలిపారు.
కిర్లంపూడిలోని నివాసంలో ముద్రగడ గిరిబాబు మీడియా సమావేశం నిర్వహించి కీలక విషయాలు తెలిపారు. 'సోదరి క్రాంతి వల్లే నా తండ్రి మానసిక క్షోభకు గురై మృతి చెందారు. నా తండ్రి మరణించక ముందు చెప్పిన విషయాలనే మా కుటుంబం చేసింది' అని వివరించారు. తన తండ్రి మరణించకముందే ఐదు విషయాలు చెప్పినట్లు ముద్రగడ గిరిబాబు తెలిపారు. 'నన్ను కాల్చవద్దు.. పూడ్చాలి. పెద్ద రోజు కానీ చిన్న రోజు చేయరాదు. అంటే దశదిన కర్మ చేయరాదు. తాను చనిపోయినా బొట్టు, గాజులు, పూలు తీయరాదు. పుట్టుకతో వచ్చినవి తీయరాదు. క్రాంతి గాలి కూడా పడొద్దు. ఎప్పటికీ క్షమించకు. దగ్గరకు రానివ్వదు. ప్రభుత్వం ఏమీ ఇచ్చినా స్వీకరించొద్దు. ఎప్పుడూ వారి వద్ద చేయి చాపరాదు' అని ముద్రగడ గిరిబాబు వెల్లడించారు.
ప్రభుత్వం వచ్చే వాటిని అందుకోవద్దని చెప్పినట్లు వైఎస్సార్సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి ముద్రగడ గిరిబాబు తెలిపారు. బతికి ఉన్నప్పుడు అవమానించి అంతిమ సంస్కారాలకు గౌరవం ఇస్తానంటే ఎలా స్వీకరిస్తామని ప్రశ్నించారు. తమ కుటుంబానికి గౌరవం ఇచ్చింది తండ్రి మరణించే వరకు వెన్నంటే ఉన్నది మాజీ సీఎం జగన్ అని తెలిపారు. తన తండ్రి పద్మనాభానికి తమ కుటుంబం ఎన్ని జన్మలు ఎత్తిన రుణపడి ఉంటుందని ప్రకటించారు. 'సోదరి క్రాంతిని దగ్గరకు రానివ్వదని నా తండ్రి చెప్పారని అందుకే రానివ్వలేదు. జనసేన పార్టీకి ఆమె ఎంత ఉపయోగపడుతుందో తెలియదు కానీ పార్టీని మాత్రం ఆమె బాగా ఉపయోగించుకుంటుందని' ముద్రగడ గిరిబాబు తెలిపారు.
తల్లిదండ్రులను బాధపెట్టిన వారిని ఎవరూ కూడా క్షమించరాదని ముద్రగడ గిరిబాబు చెప్పారు. తన తండ్రి చెల్లెలు క్రాంతి వలన చాలా ఆవేదనకు గురయ్యారని.. అలాంటి కూతురును ఎప్పుడూ దగ్గరకు రానివ్వరాదని చెప్పినట్లు వెల్లడించారు.
CM Revanth Reddy Resolution: 21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీలుగా యువత.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రపోజల్ సాధ్యమేనా?
Hyderabad, Telangana:CM Revanth Reddy 21-Age Resolution: 'కమిటీ కుర్రాళ్లు' సినిమాలో చూపించినట్లుగా, ప్రస్తుత జెన్-జీ (Gen-Z) యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేందుకు ఆసక్తి చూపుతోంది. ఇదే కోవలో ఇటీవల కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు యువతలో కొత్త జోష్ నింపాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఒక ప్రతిపాదన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పార్లమెంట్ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం ఉన్న 25 ఏళ్ల కనీస వయస్సు నిబంధనను 21 ఏళ్లకు తగ్గించాలని ఆయన కోరారు. మరి రీల్లో మాదిరిగా రియల్గా ఇది సాధ్యమేనా? ఈ విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం.
సీఎం రేవంత్ రెడ్డి ప్రపోజల్ నేపథ్యం ఏమిటి?
భవిష్యత్తులో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, యువత ఎన్నికల్లో నేరుగా పోటీ చేసేలా అర్హత వయస్సును 21 ఏళ్లకు తగ్గిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డిగ్రీ పూర్తి చేసేసరికి యువత వయస్సు సుమారు 20 ఏళ్లు ఉంటుందని, ఆ వెంటనే వారు రాజకీయాల్లోకి వచ్చి దేశ సేవ చేసే అవకాశం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకోసం తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని, రాజ్యాంగ సవరణ (ఆర్టికల్ 368) ద్వారా ఇది సాధ్యమవుతుందని ఆయన వెల్లడించారు.
ముందున్న సవాళ్లు ఏంటి?
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఆపై రాజ్యాంగ సవరణను ఆమోదింపజేయడం అంత సులువైన విషయం కాదు. ప్రస్తుత రాజకీయాల్లో డబ్బు, కుటుంబ నేపథ్యం, పార్టీ బలమైన మద్దతు కీలకంగా మారుతున్నాయి. పైసా ఖర్చు లేకుండా జాతీయ స్థాయిలో పోటీ చేయడం సవాలుతో కూడుకున్నదే.
వయస్సుతో సంబంధం లేకుండా రాణిస్తున్న యువ నాయకులు ఉన్న ఈ సమాజంలో ప్రస్తుత నిబంధనల ప్రకారమే 25 ఏళ్ల వయస్సులో అనేక మంది యువత చట్టసభల్లో అడుగుపెట్టి సత్తా చాటుతున్నారు.
2024 పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 25 ఏళ్ల వయస్సులోనే పుష్పేంద్ర సరోజ్ (సమాజ్వాది పార్టీ), ప్రియా సరోజ్, శాంభవి చౌదరి (ఎల్జెపి), సంజనా జాతవ్ (కాంగ్రెస్) వంటి యువ నాయకులు ఎంపీలుగా ఎన్నికై అందరి దృష్టిని ఆకర్షించారు.
అలాగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో.. బీహార్లో మైథిలి ఠాకూర్, హర్యానాలో ఆదిత్య సూర్జేవాలా, తెలంగాణలో మైనంపల్లి రోహిత్, ఒడిశాలో ఉపాసనా మోహపాత్ర వంటి యువత 25-26 ఏళ్ల వయస్సులోనే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.
సాధ్యమేనా? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
డబ్బు, రాజకీయ వ్యవస్థ ప్రభావం ఎంత ఉన్నప్పటికీ.. ప్రజల మద్దతు, నిజాయితీ, సరికొత్త ఆలోచనలు ఉంటే గెలవడం అసాధ్యమేమీ కాదు. సోషల్ మీడియా రాకతో యువతకు ప్రచారం చేయడం మరింత సులువయ్యింది. 1988లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18కి తగ్గించిన చరిత్ర మన దేశంలో ఉంది.
ఒకవేళ భవిష్యత్తులో చట్టసభల్లో పోటీ చేసే వయస్సును 21 ఏళ్లకు తగ్గిస్తూ రాజ్యాంగ సవరణ జరిగితే.. జెన్-జీ యువత భారీ సంఖ్యలో రాజకీయాల్లోకి వచ్చి దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక పాత్ర పోషించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Also Read: అరుణాచలం క్షేత్రంలో తీవ్ర విషాదం..మోక్షమార్గంలో ఇరుక్కొని ఆంధ్రప్రదేశ్ భక్తుడు మృతి
Also Read: Bala Krishna Health: హీరో బాలకృష్ణ ఆరోగ్యం ఎలా ఉందంటే? హెల్త్ బులిటిన్ విడుదల చేసిన ఆస్పత్రి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్ మోసలు.. అప్రమత్తంగా ఉండాలన్న CP సజ్జనర్..
Hyderabad, Telangana:Indiramma Housing Scheme: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ప్రక్రియను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించే ప్రమాదముందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ VC సజ్జనర్ ప్రజలను హెచ్చరించారు. లబ్ధిదారుల నుంచి రూ.10,000 లబ్ధిదారుల ముందస్తు డిపాజిట్ చెల్లించే ప్రక్రియ ప్రారంభం కావడంతో.. కేటుగాళ్లు నకిలీ కాల్స్తో పాటు అపరిచిత లింకులతో రెచ్చిపోయే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు.
దళారులను నమ్మవద్దు..
ఈ పథకంలో ఎలాంటి దళారులు లేదా మధ్యవర్తులకు తావులేదని సీపీ తెలిపారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని వెల్లడించారు. డబ్బులు ఇస్తే కచ్చితంగా ఇల్లు ఇప్పిస్తాం.. అని చెప్పే ఇతరుల మాటలను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మవద్దని ఆయన సూచించారు. నిబంధనల ప్రకారం.. చెల్లించిన ఈఎండీ డబ్బులు సెక్చూర్గానే ఉంటాయని.. ఒకవేళ ఇల్లు కేటాయించకపోతే ఆ మొత్తాన్ని దరఖాస్తుదారుడి ఒరిజినల్ బ్యాంకు ఖాతాకే ప్రభుత్వం నేరుగా తిరిగి జమ చేస్తుందని వివరించారు.
ఈ రోజే ఆఖరు తేదీ.. వెంటనే డబ్బులు కట్టకపోతే ఇల్లు రద్దవుతుంది అంటూ.. లబ్ధిదారులను భయపెట్టి, తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలా చేసి.. నగదు బదిలీ చేయించుకోవడమే సైబర్ నేరగాళ్ల ప్రధాన వ్యూహమని సీపీ వివరించారు. వాట్సాప్ లేదా మెసేజ్ల ద్వారా వచ్చే ఏవైన లింకులను క్లిక్ చేసి.. ఎల్.పి.కె (APK) ఫైళ్లను ఇన్స్టాల్ చేస్తే.. ఫోన్ హ్యాక్ అయి.. బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయని హెచ్చరించారు.
అలాగే ప్రభుత్వ పోర్టళ్లను పోలిన నకిలీ వెబ్సైట్లను సృష్టించి మోసగించే అవకాశం ఉందని తెలిపారు. సాయం చేస్తామనే నెపంతో ఎనీడెస్క్, టీమ్వ్యూర్ వంటి స్క్రీన్ షేరింగ్ యాప్లను డౌన్లోడ్ చేయించి బ్యాంకు వివరాలు కాజేస్తారని పేర్కొన్నారు. పిన్ అనేది కేవలం ఇతరులకు డబ్బులు చెల్లించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ప్రభుత్వ రీఫండ్ చేసిన డబ్బులు స్వీకరించడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ పిన్ నమోదు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. అపరిచిత వ్యక్తులకు ఆధార్ కార్డు ఫొటోలు, బ్యాంక్ వివరాలు, ఓటీపీలు ఎప్పుడూ పంచుకోవద్దని తెలిపారు.
Also Read: Revanth Reddy: కేటీఆర్ బర్త్డేపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. 'బర్త్డే దావత్ అడగాలి'
సందేహాలు ఉన్నాయా?
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా.. పరిష్కారం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా 040-24603572 అనే హెల్ప్లైన్ నంబర్ను అందుబాటులోకి తెచ్చింది. ఒకవేళ పొరపాటున ఎవరైనా సైబర్ మోసానికి గురైతే.. తక్షణమే సొమ్మును ఫ్రీజ్ చేసేందుకు 1930 ఉచిత హెల్ప్లైన్కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
Also Read: Revanth Reddy: కేటీఆర్ బర్త్డేపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. 'బర్త్డే దావత్ అడగాలి'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం నిలకడ...
Warangal, Telangana:Narsampet Ex Mla Passes Away Fake News: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం సురక్షితంగా ఉందని, ఆయన ఆరోగ్యంపై వస్తున్న అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని హనుమకొండలోని రోహిణి హాస్పిటల్ సుపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్ రెడ్డి, పార్టీ శ్రేణులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తి నిలకడగా ఉందనీ.. అభిమానులు, నియోజకవర్గ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేశారు.
న్యూమోనియాతో ఇబ్బంది..
ఇటీవల న్యూమోనియా కారణంగా పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్య సమస్యల బారిన పడ్డారు. ఆరోగ్య పరిస్థితి కొద్దిగా క్షీణించడంతో వైద్యులు వెంటనే స్పందించి సిపిఆర్ (CPR) నిర్వహించారు. ప్రాథమిక చికిత్సల అనంతరం ఆయనకు హార్ట్ బీట్ మెరుగుపడింది.. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ప్రాణాపాయం ఏమీ లేదని, అభిమానుల ఆశీస్సులతో ఆయన క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
అసత్య ప్రచారాలు నమ్మవద్దు..
సామాజిక మాధ్యమాల్లో, కొన్ని వేదికలపై పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై రకరకాల పుకార్లు వ్యాపిస్తున్నాయని.. ఇవన్నీ కేవలం వదంతులు మాత్రమేనని పార్టీ ముఖ్య నాయకులు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక వార్తలను విశ్వసించి.. ఎవరూ అధైర్యపడవద్దని, ఆసుపత్రి యాజమాన్యం లేదా కుటుంబ సభ్యుల నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే అధికారిక సమాచారంగా తీసుకోవాలని కోరారు.
త్వరలోనే ప్రజల మధ్యకు..
నర్సంపేట నియోజకవర్గ ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.. ప్రజల ప్రేమ, అభిమానుల ఆత్మీయత, పార్టీ కార్యకర్తల కోరికల మేరకు ఆయన త్వరలోనే కోలుకుని ప్రజల మధ్యకు వస్తారని తెలిపారు. నియోజకవర్గ సంక్షేమం, నర్సంపేట ప్రగతి కోసం ఎప్పటిలాగే తన సేవా కార్యక్రమాలను మరింత ఉత్సాహంతో కొనసాగిస్తారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి.
Also Read: Revanth Reddy: కేటీఆర్ బర్త్డేపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. 'బర్త్డే దావత్ అడగాలి'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
ఆగస్టు 7న శక్తివంతమైన నవపంచమ రాజయోగం.. ఈ 4 రాశుల వారికి తిరుగులేని ధనలాభం!
Hyderabad, Telangana:Navapanchama Rajayoga Effect On Zodiac: కొన్ని గ్రహాల కదలికలు మానవ జీవితాలపై చూపే ప్రభావం ఎంతో అద్భుతమైనదిగా భావిస్తారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒక అరుదైన, అత్యంత శక్తివంతమైన గ్రహం కదలికలు చేయబోతోంది. గ్రహరాజు అయిన సూర్యుడు, న్యాయదేవుడైన శని భగవానుడి కలయిక జరగబోతోంది. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన నవపంచమ దృష్టి యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు రాబోతున్నాయి.
రాబోయే ఆగస్టు 7 ఉదయం 8:11 గంటలకు సూర్య-శనులు పరస్పరం 120 డిగ్రీల కోణంలోకి రావడం వల్ల ఈ శక్తివంతమైన యోగం ఏర్పడబోతోంది.. ఈ సమయం 4 రాశుల వారి జీవితాల్లో వస్తున్న సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.. ఇన్నాళ్లూ పడ్డ కష్టాలకు, వేదనలకు ప్రతిఫలంగా... అపారమైన ధనయోగం, కొండంత ఆనందం రాబోతున్నాయి..
ఈ రాశులవారికి బంఫర్ లాభాలు..
మకర రాశి (Capricorn)
మకర రాశి వారికి ఈ రాజయోగం చాలా అద్బుతంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి తీపి కబురు అందుతుంది.. ప్రభుత్వ సంబంధిత పనుల్లో అద్భుత విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి.. రాబడి గణనీయంగా పెరిగి బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరుగుతుంది.. దాంపత్యం, ప్రేమ బంధాలు మెరుగుపడతాయి..
వృషభ రాశి (Taurus)
వృషభ రాశి వారికి ఇక తిరుగుండదు.. సుదీర్ఘకాలంగా మీరు పడుతున్న శ్రమకు ఫలాలు అందే అద్భుత ఘట్టంగా భావించవచ్చు.. ఉద్యోగంలో పదోన్నతి.. జీతంలో ఊహించని పెరుగుదల మీ ఆర్థిక పరిస్థితులను పూర్తిగా మార్చేస్తాయి. సరికొత్త ఆదాయ మార్గాలు కూడా లభిస్తాయి. అనుబంధాల్లో ప్రేమ, ఆప్యాయతలు రెట్టింపవుతాయి. పాత ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభించి పరిపూర్ణమైన మనశ్శాంతి సమకూరుతుంది.
సింహ రాశి (Leo)
సింహ రాశి వారికి ఈ యోగం అద్బుతమైన అవకాశాలను అందిస్తుంది. నిలిచిపోయిన పనులు వేగవంగా పూర్తవుతాయి. కార్యాలయాల్లో కొత్త బాధ్యతలు లభించి సమాజంలో మీ గౌరవం విపరీంతగా పెరుగుతుంది. నిర్ణయాత్మక శక్తి పెరిగి క్లిష్ట పరిస్థితులను సైతం సులభంగా ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ బంధంలో నమ్మకం పెరిగి బంధం మరింత బలపడుతుంది. విద్యార్థులకు ఇది అద్భుతమైన సమయంగా భావించవచ్చు..
తులా రాశి (Libra)
తులా రాశి వారికి కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి ఊహించని ధనలాభాలు కూడా కలుగుతాయి. కళాత్మక, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి ఆర్థికంగా బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రేమికుల జీవితం ఒక అందమైన మలుపు తిరిగి కొత్త వెలుగులు నింపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
ఎమ్మెల్యే, ఎంపీగా పోటీకి వయస్సు 21 ఏళ్లకు తగ్గిస్తాం.. జెన్జీ తరానికి తెలంగాణ సీఎం తీపి కబురు
Hyderabad, Telangana:Hyderabad: 'ఈ దేశం జెన్ జీది. దేశ భవిష్యత్తే యువతరం భవిష్యత్తు. దేశం భవిష్యత్తు బాగుంటే యువతరం భవిష్యత్తు బాగుంటుంది. ప్రజాస్వామిక వాదులంతా దిక్కులు పిక్కటిల్లేలా యువతకు మద్దతు ఇచ్చారు. జంతర్ మంతర్ నుంచి జెన్జీ పార్లమెంటుకు వెళ్లాలి' అని రేవంత్ రెడ్డి సూచించారు. 61 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు నుంచి 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకి తగ్గించారు. 73,74 రాజ్యాంగ సవరణతో స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి 21 ఏళ్లకు తగ్గించారు. అసెంబ్లీ, పార్లమెంట్కు పోటీ చేసే వయస్సును 21 ఏళ్లకు తగ్గిస్తాం' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
కేంద్ర మంత్రిగా ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయడంతోపాటు నీట్ విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా హైదరాబాద్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'జెన్ జీ యువత 56 ఇంచుల ఛాతిని ఓడించి విద్యా శాఖ మంత్రి రాజీనామా వరకు తెచ్చారు. కానీ ఇది సరిపోదు. నీట్ పరీక్ష పత్రాలు లీక్ కావడంతో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు. పోరాటంలో విద్యార్థులపైన పెట్టిన కేసులను ఎత్తివేయలేదు' అని తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. 'కేంద్ర ప్రభుత్వం పరీక్షా నిర్వహణలో విఫలం కావడంతో అనేక మంది విద్యార్థుల నష్టపోయారు. భారతదేశ యువత సాధించిన విజయాన్ని కాంగ్రెస్ ఖాతాలో రాసుకోదల్చుకోలేదు' అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
'ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జెన్ జీ పోరాట ఫలితం. పోరాటానికి నరేంద్ర మోదీ తలవంచి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించాడు. ఈ విజయం మీది. రాజీనామాతో సరిపెట్టుకోకుండా అక్రమ కేసులను తొలగించడానికి, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు సాయం కోసం ఈ ర్యాలీ చేపట్టాం' అని రేవంత్ రెడ్డి వివరించారు. విద్యార్థుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. 'ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఎమ్మెల్యే, ఎంపీగా పోటీచేసే వయసు 21 ఏళ్లుగా ఉండాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం' అని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. పార్లమెంటులో ఈ బిల్లును ఆమోదించేలా కృషి చేస్తామని తెలిపారు. జెన్ జీ యువత విద్యాశాఖ , ఐటీ శాఖల మంత్రులుగా ఉంటే దేశం ముందుకు పోతుందని పేర్కొన్నారు.
దేశ భవిష్యత్తుకు కీలకమైన జెన్ జీ ఆశయాలకు అనుగుణంగా యువత చట్టసభల్లో అడుగుపెట్టడానికి వీలుగా శాసనసభ, లోక్సభకు పోటీ చేసే కనీస వయో పరిమితిని 25 ఏళ్ల నుంచి 21 కి తగ్గించాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు డిమాండ్ చేశారు. పార్లమెంట్లో ఇందుకు అవసరమైన చట్టాన్ని సవరించాలని… pic.twitter.com/oIudduC9PV
— Telangana CMO (@TelanganaCMO) July 25, 2026
'ప్రపంచానికి జెన్ జీ గళం వినిపించాలి.. ఆ దిశగా మేం పనిచేస్తాం. పార్లమెంటులో ఒక్క శాతంలోపే జెన్ జీ ప్రాతినిధ్యం ఉంది. 30 శాతం ఉన్న జెన్ జీలకు చట్టసభల్లో అవకాశం కల్పించాల్సి ఉంది. 21 ఏళ్ల వయసులో యువతీయువకులు చట్టసభలకు పోటీ చేసే అవకాశం ఉండాలి' అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈడీ, సీబీఐ లాంటి వాళ్లతో అక్రమ కేసులు పెట్టి రాజకీయ పార్టీలను లొంగదీసుకునే ప్రయత్నం చేశారని మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీని, కేంద్రాన్ని గుండె ధైర్యంతో లాఠీలు, తూటాలకు ఎదురొడ్డి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించారని యువతరంపై ప్రశంసలు కురిపించారు. ఈ సునామీ ఇంతటితో ఆగోద్దని యువతరానికి సూచించారు.
IMD Rain Alert: దేశంలో భారీ వర్షాల హెచ్చరిక.ఈ 3 రాష్ట్రాలకు 'రెడ్ అలర్ట్'..ఐఎండీ సూటిగా వార్నింగ్!
Hyderabad, Telangana:IMD Heavy Rain Alert: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింత ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. వర్షాల తీవ్రత ఏమాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) కీలక హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఈ 3 రాష్ట్రాలకు 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
వివిధ రాష్ట్రాల్లో వర్షాల తీవ్రత
మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్లో తీవ్రమైన వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్లో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. ఉదాహరణకు, పాటన్ జిల్లాలోని సంతల్పూర్ ప్రాంతంలో గత 24 గంటల్లో ఏకంగా 390 మింటీలటర్ల (390 mm) అత్యధిక వర్షపాతం నమోదైంది. అదే జిల్లాలోని రాధన్పూర్, డియోడార్ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడ్డాయి. అలాగే ఛత్తీస్గఢ్, కొంకణ్-గోవా ప్రాంతాల్లోనూ వర్షాల జోరు కొనసాగనుంది.
వీటితో పాటు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం-మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ (గంగానది పరివాహక ప్రాంతం), హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాలు (నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర), ఉత్తరాఖండ్, పశ్చిమ రాజస్థాన్లలోనూ పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈదురుగాలులు, ఉరుములు
అండమాన్-నికోబార్ దీవులతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
భారీ వర్షాలకు అసలు కారణం ఏమిటి?
వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ వివరించింది. ప్రస్తుతం నైరుతి రాజస్థాన్పై ఓ అల్పపీడన ప్రాంతం కొనసాగుతోంది. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే 2-3 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉంది. ఈ రెండు అల్పపీడన వ్యవస్థలను కలుపుతూ మధ్య భారతదేశం మీదుగా రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. దీనికి తోడు ఉత్తర భారతదేశంపై పశ్చిమ విక్షోభం కూడా చురుగ్గా కదులుతుండటంతో వర్షాలు జోరందుకున్నాయి.
ఆకస్మిక వరదల ముప్పు!
రాబోయే 24 గంటల్లో గుజరాత్లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలతో పాటు జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లోని పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే నేల పూర్తిగా తడిసిపోవడంతో, మరింత వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన అప్రమత్తతతో ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also REad: అరుణాచలం క్షేత్రంలో తీవ్ర విషాదం..మోక్షమార్గంలో ఇరుక్కొని ఆంధ్రప్రదేశ్ భక్తుడు మృతి
Also Read: కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే..కేంద్రమంత్రికి ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Shreyas Iyer: జింబాబ్వేపై భారీ విజయం.. టీ20 ప్రపంచకప్ తర్వాత తొలి సిరీస్ నెగ్గిన భారత్!
Harare, Harare Province:Team India Clinch T20 Series: టీ20 ప్రపంచకప్ తర్వాత జరిగిన ఐర్లాండ్, ఇంగ్లండ్తో సిరీస్లు కోల్పోయిన భారత జట్టు.. జింబాబ్వేతో జరుగుతున్న సిరీస్లో సత్తా చాటింది. మూడు మ్యాచ్ల సిరీస్లో వరుసగా రెండింటిలో విజయం సాధించిన టీమిండియా సిరీస్ను కైవసం చేసుకుంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత జట్టు తొలి టీ20 సిరీస్ను గెలవడం విశేషం. రెండో మ్యాచ్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు గొప్ప విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.
Game set and match ✅
A comprehensive and dominant 9⃣0⃣-run victory for #TeamIndia 🥳👏
With that they clinch the #ZIMvIND T20I series by 2⃣-0⃣ with one game to play 🏆
Scorecard ▶️ https://t.co/Z8UUziVx8d pic.twitter.com/0hfpuJ6aCx
— BCCI (@BCCI) July 25, 2026
CJP Protest Ends: విద్యార్థుల డిమాండ్లకు మోదీ సర్కార్ అంగీకారం..నిరసన విరమించిన సీజేపీ..కేంద్రం కీలక హామీ!
New Delhi, Delhi:CJP Protest Ends Today: నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో విద్యార్థుల ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం సహా విద్యార్థుల పలు డిమాండ్లను నెరవేర్చేందుకు మోదీ సర్కార్ అంగీకరించింది. దీంతో ఆందోళనలను విరమించేందుకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిర్ణయించింది. ఇదే విషయమై తాజాగా మంత్రులతో సమావేశమైన సీజేపీ ప్రతినిధులు ఈ విషయాన్ని మీడియాకు వివరించారు.CJP Next Target: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత.. బొద్దింకల పార్టీ టార్గెట్ వీరిపైనే!
New Delhi, Delhi:New Education Minister: కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే..కేంద్రమంత్రికి ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు!
New Delhi, Delhi:New Education Minister Pralhad Joshi: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత విద్యాశాఖ మంత్రిగా మరొకరికి బాధ్యతలు అప్పగించారు.
ప్రస్తుతం కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రిగా సేవలు అందిస్తున్న ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖకు సంబంధించిన అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే ప్రధానమంత్రి సలహా మేరకు, కేంద్ర మంత్రివర్గం నుండి ధర్మేంద్ర ప్రధాన్ సమర్పించిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించినట్లు ప్రభుత్వం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ఆయన ప్రస్తుతం నిర్వహిస్తున్న శాఖలతో పాటు విద్యాశాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన కొద్ది గంటలకే ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం.
ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీతో పాటు అలాగే నూతన, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రిగా ఉన్న జోషికి ఇప్పుడు విద్యాశాఖ బాధ్యతలు కూడా అప్పగించారు.
64 ఏళ్ల జోషి 2004 నుండి కర్ణాటకలోని ధార్వాడ్ లోక్సభ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు 2019-2024 మధ్య కాలంలో బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు.
రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఇలా పేర్కొన్నారు. "భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 75లోని క్లాజ్ (2) ప్రకారం, ప్రధానమంత్రి సలహా మేరకు, కేంద్ర మంత్రివర్గం నుండి ధర్మేంద్ర ప్రధాన్ సమర్పించిన రాజీనామాను రాష్ట్రపతి తక్షణమే అమల్లోకి వచ్చేలా ఆమోదించారు. అలాగే, ప్రధానమంత్రి సలహా మేరకు, క్యాబినెట్ మంత్రి ప్రహ్లాద్ జోషికి ఆయన ప్రస్తుత శాఖలతో పాటు విద్యాశాఖ బాధ్యతలను కూడా అప్పగించాలని రాష్ట్రపతి ఆదేశించారు" అని ఆ ప్రకటన తెలిపింది.
ప్రధాన్ రాజీనామా తర్వాత జోషి 'X' (ట్విట్టర్) వేదికగా ఇలా స్పందించారు. "శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ దశాబ్దాల పాటు సాగిన అద్భుతమైన రాజకీయ ప్రస్థానాన్ని కలిగి ఉన్నారు. దేశాభివృద్ధి పట్ల ఆయనకున్న అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అని జోషి పోస్ట్ చేశారు.
"ఆయన హయాంలో విద్యా రంగంలో 100కు పైగా చిన్న, పెద్ద సంస్కరణలతో పాటు NEP 2020 (జాతీయ విద్యా విధానం) విజయవంతంగా అమలు చేయడం జరిగింది. అన్నింటికంటే దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ శ్రీ ప్రధాన్ తీసుకున్న ఈ రాజీనామా నిర్ణయం, దేశాభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని ఏమాత్రం ఆపదు" అని పేర్కొన్న జోషి.. "దేశాభివృద్ధి క్రమంలో మా మార్గాలు మళ్లీ కలుస్తాయి" అని కామెంట్ చేశారు.
Also Read: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..అసలు ఎవరీ ధర్మేంద్ర, ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి?
Also Read: ముఖేష్ అంబానీ మనవడు చదువుతున్న స్కూల్ ఏది? ఫీజు ఎంతంటే షాక్ అవ్వాల్సిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
విద్యార్థుల అన్నీ డిమాండ్లకు కేంద్రం ఓకే.. పోరాటం ముగిసిందని కాక్రోచ్ పార్టీ ప్రకటన
New Delhi, Delhi:Jantar Mantar Turn To Silence: నీట్ పేపర్ లీక్ అంశంపై నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గడగడలాడించిన కాక్రోచ్ జనతా పార్టీ తన ఉద్యమానికి ముగింపు పలికింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయడంతో దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. దీనికితోడు మిగిలిన డిమాండ్లకు కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంతో కాక్రోచ్ పార్టీ తన పోరాటాన్ని ముగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంతో చేసిన చర్చలు సఫలమయ్యాయి. విద్యార్థులపై నమోదు చేసిన కేసులు ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.
Also Read: జెన్జీ ఉద్యమంతో దేశం గర్విస్తోంది.. విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ హ్యాట్సఫ్
క్షేమంగా ఇళ్లకు..
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనను విరమిస్తున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు ప్రకటించారు. డిమాండ్లను కేంద్రం అంగీకరించడంతో తమ నిరసనను విరమిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లాలని కోరిన కాక్రోచ్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు.
కేంద్ర మంత్రులతో చర్చలు పూర్తి..
న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్తో కాక్రోచ్ జనతా పార్టీ చర్చలు ముగిశాయి. ఢిల్లీతో సహా దేశంలోని అన్నీ రాష్ట్రాల్లో విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. భవిష్యత్తులోనూ కేసుల పేరుతో విద్యార్థులను వేధించమని ప్రకటించింది. విద్యాశాఖలో సంస్కరణలు చేపడతామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా హామీ ఇచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమ ప్రధాన డిమాండ్ నెరవేరిందని కాక్రోచ్ పార్టీ తెలిపింది.
Cockroach Janta Party withdraws its nationwide agitation with immediate effect
All demands of the Cockroach Janta Party have been accepted by the government:
1. Maximum possible compensation for families of NEET paper leak-related suicides
2. All FIRs by Central govt and…
— Cockroach is Back (@Cockroachisback) July 25, 2026
Also Read: Dharmendra Pradhan: నా ప్రియమైన బొద్దింకలకు అభినందనలు.. ప్రకాశ్ రాజ్ ట్వీట్ వైరల్
అన్నీంటికి కేంద్రం అంగీకారం
విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు తెలిపారు. నాలుగు రోజుల్లోగా కేసులు ఉపసంహరిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని వెల్లడించారు. ఇక నీట్ పేపర్ లీక్తో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని కేంద్రం చెప్పినట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని డిమాండ్లకు అంగీకరించిన నేపథ్యంలో ఆందోళనను విరమిస్తున్నట్లు ప్రకటించారు. కాక్రోచ్ పార్టీ ఆందోళన విరమణతో జంతర్ మంతర్ వద్ద ఉన్న విద్యార్థులు తిరుగుముఖం పట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ మెట్రో స్టేషన్ను తిరిగి తెరవడం విశేషం. అత్యంత రద్దీగా ఉండే ఈ మెట్రో స్టేషన్ను విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు మూసివేశారు.
Rajasthan Doctor Case: డాక్టర్కి వయాగ్రా ట్యాబ్లెట్స్ ఇచ్చిన లేడీ నర్సు..మత్తులో రూ.2 కోట్లు కాజేసిన మాయాలేడి!
Degana, Rajasthan:Rajasthan Doctor Extortion Case: సాటి మనిషిని నమ్మలేని ఈ రోజుల్లో, ఓ నర్సు చేసిన హైటెక్ క్రైమ్ స్టోరీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడిని నర్సు బ్లాక్మెయిల్ చేసి, ఏకంగా రూ.2 కోట్లు వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నేపథ్యం, బ్లాక్మెయిల్ పర్వం
బార్మర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కమల (అలియాస్ కమలేష్) అనే మహిళ నర్సుగా పనిచేస్తోంది. అదే ఆసుపత్రికి చెందిన 65 ఏళ్ల వృద్ధ వైద్యుడిని టార్గెట్ చేసిన ఆమె, ఆయనకు సంబంధించిన కొన్ని అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలను రహస్యంగా తన ఫోన్లోకి మార్చుకుంది. ఆపై ఆ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని, అత్యాచారం కేసులో ఇరికిస్తానని, చివరికి ప్రాణాలు తీస్తానని బెదిరింపులకు దిగింది. పరువు పోతుందనే భయంతో ఆ డాక్టర్ ఆమె డిమాండ్లకు తలొగ్గాల్సి వచ్చింది.
హైటెక్ పంథాలో డిజిటల్ అరెస్ట్!
ఈ దందాను నర్సు కమల అత్యంత వ్యూహాత్మకంగా నడిపించింది. వృద్ధ వైద్యుడిని తన గుప్పిట్లో ఉంచుకునేందుకు, ఆయనకు లైంగిక సామర్థ్యాన్ని పెంచే వయాగ్రా మాత్రలను బలవంతంగా వేయించినట్లు విచారణలో తేలింది. ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాల ద్వారా ఆ డాక్టర్ను ఆమె నిరంతరం పర్యవేక్షించేది.
డాక్టర్ కదలికలపై నిఘా ఉంచేందుకు ప్రత్యేకంగా ఒక చిన్న మొబైల్ ఫోన్, సిమ్ కార్డును ఇచ్చి.. దానిని రోజులో 24 గంటలూ ఆన్లోనే ఉంచాలని తీవ్రంగా బెదిరించేది. ఇలా భయభ్రాంతులకు గురిచేసి సదరు వైద్యుడి నుంచి విడతలవారీగా దాదాపు రూ.2 కోట్లను ఆమె కాజేసింది.
పోలీసుల ఎంట్రీ, అరెస్ట్
బాధిత వైద్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు డిజిటల్ ఆధారాలు సేకరించి, నిందితురాలు కమలను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. విచారణలో భాగంగా నర్సు బ్యాంక్ ఖాతాలు, అక్రమంగా వసూలు చేసిన నగదు, ఆస్తులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
శుక్రవారం కోర్టులో హాజరుపరిచే సమయంలో నర్సు కమల మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించింది. తనపై పోలీసులు మోపిన కేసులన్నీ బూటకమని, ఆ డాక్టర్ ఎలాంటివాడంటే.. వందలాది మంది మహిళా రోగులపై లైంగిక దాడికి పాల్పడిన ఘరానా నేరస్థుడని ఆరోపించింది. అయితే, నర్సు చేస్తున్న ఈ ఆరోపణలను పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. నిందితురాలు విచారణకు సహకరించడం లేదని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు స్పష్టం చేశారు.
Also Read: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..అసలు ఎవరీ ధర్మేంద్ర, ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి?
Also REad: ముఖేష్ అంబానీ మనవడు చదువుతున్న స్కూల్ ఏది? ఫీజు ఎంతంటే షాక్ అవ్వాల్సిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
