కోతుల భయంతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Schools Holiday: తెలంగాణలోని ఓ ప్రాంతంలో రేపు స్కూళ్లు, కాలేజ్లకు బంద్ ఉండే అవకాశం ఉంది. జరుగుతున్న రాజకీయంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడడం.. 144 సెక్షన్ పెట్టి ఇతర రాజకీయ పార్టీలను వేధించడంతో పరిస్థితి భయానకంగా మారింది. దీంతో కాంగ్రెస్ దౌర్జన్యాలు.. నీచపు రాజకీయానికి వ్యతిరేకంగా రేపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీతోపాటు సీపీఐ బంద్కు పిలుపునిచ్చాయి. అది ఎక్కడంటే మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి పట్టణంలో. రాజకీయ పార్టీల మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడిన నేపథ్యంలో ఆ బంద్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
Also Read: KCR Birthday Gift: ఐదుకు 5 క్లీన్ స్వీప్ విజయాలు కేసీఆర్ బర్త్ డే కానుక: కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఏం జరిగింది?
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో క్యాతన్పల్లి మున్సిపాలిటీలో అత్యధికంగా వార్డులను బీఆర్ఎస్ పార్టీ, సీపీఐ గెలిచాయి. ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్గా బీఆర్ఎస్, సీపీఐ ఎన్నిక కావాల్సి ఉండగా.. కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అడ్డుకుంటుంది. మెజార్టీ లేకపోయినా మున్సిపాలిటీని సొంతం చేసుకోవాలని కుట్ర.. దౌర్జన్యం.. అధికార బలంతో రాజకీయం చేస్తోంది. దీంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీతోపాటు సీపీఐ కౌన్సిలర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంతో మున్సిపల్ కార్యవర్గం ఎన్నిక రెండు సార్లు వాయిదా పడింది. రెండో రోజు మంగళవారం మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం.. అధికారులకు కూడా వంతపాడడం.. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పని చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ, సీపీఐ క్యాతన్పల్లి బంద్కు పిలుపునిచ్చింది.
Also Read: AP Govt Jobs: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. 1300 ఉద్యోగాల భర్తీకి సిద్ధం
ఈ బంద్ ప్రభావంతో క్యాతన్పల్లిలో ఉన్న స్కూళ్లు, కాలేజ్లు కూడా బంద్ కానున్నాయి. ఎందుకంటే ఇప్పటికే క్యాతన్పల్లి రెండు రోజులుగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసుల కవాతుతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఏదో ఉగ్రవాదులు వచ్చినట్టు పెద్ద ఎత్తున బలగాలు మోహరించగా క్యాతన్పల్లిలో కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది. ఇరు పార్టీల మధ్య తీవ్ర ఘర్షణలు ఏర్పడడంతో ఈ నేపథ్యంలో ఇచ్చిన బంద్తో ఇబ్బందులు ఎదురవుతాయని స్కూళ్లు, కాలేజ్లు బుధవారం పనిచేయకపోవచ్చు.
Also Read: KTR: సమైక్యాంధ్రుల సంచులు మోసిన సన్నాసులకు జాతి తెలియదు: కేటీఆర్
బంద్కు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ దుర్మార్గాలకు వ్యతిరేకంగా రేపు బుధవారం బీఆర్ఎస్, సీపీఐ పార్టీలు కలిసి క్యాతనపల్లి మున్సిపాలిటీ బంద్కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. 22 వార్డులు ఉంటే 7 వార్డులు గెల్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చైర్మన్ ఎలా అవుతారు? అని ప్రశ్నించారు. ఈ దిగజారుడు రాజకీయాలు చూసి ప్రజలు థూ.. అని ఉమ్ముతున్నారని తెలిపారు. 'గెలిచిన వారిని వారి సీట్లలో కూర్చోనివకుండా ఇదేం పద్దతి అని అడుగుతున్నా. కాంగ్రెస్ కార్యకర్తలకంటే అద్వాన్నంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. పోలీసులు కాంగ్రెస్ కండువా వేసుకుని రేవంత్ రెడ్డి పాటకు డాన్సులు చేయండి' అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సూచించారు.
'కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కొందరు తాగి వచ్చి మంత్రి వివేక్ ముందు మా మహిళా సభ్యులను తాకరాని చోట తాకారు.. చెత్తనా కొడుకులు. నువ్వు, నీ కొడుకు కూర్చొని.. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో మా సోదరీమణుల మీద దౌర్జన్యం చేపిస్తావా?' అని మంత్రి వివేక్పై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మంత్రి ఆధ్వర్యంలో ఆడబిడ్డల మీద దౌర్జన్యం జరిగింది.. ఒక్క మునిసిపల్ కౌన్సిల్ కోసం ఇంత దుర్మార్గమా? నువ్వు రిక్వెస్ట్ చేయ్ ఇచ్చి పడేస్తాం. మా ఆడకూతుర్లకంటే మాకు ఈ మున్సిపాలిటీ సీట్ ఎక్కువ కాదు' అని స్పష్టం చేశారు.
టెన్షన్.. హై టెన్షన్
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో హై టెన్షన్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ కౌన్సిలర్లను చైర్మన్ ఎన్నికల్లో పాల్గొననివ్వకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. దీంతోపోలీసులతో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తోపాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gudem Mahipal Reddy Gift To KCR Birthday: తన నియోవజకర్గంలోని ఐదుకు ఐదు మున్సిపాలిటీల విజయాలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు కానుక అని కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆయన కాంగ్రెస్లో చేరి తిరిగి గులాబీ గూటిలోకి వచ్చేశారు. అధికారికంగా చేరకపోయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే తన పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదుకు ఐదు మున్సిపాలిటీలు గెలవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే బుల్లెట్ దిగిందా లేదా? అని సంచలన వ్యాఖ్యలు చేయగా.. తాజాగా ఐదు మున్సిపాలిటీలు కేసీఆర్ బర్త్డే కానుక అని ప్రకటించారు.
Also Read: KTR: సమైక్యాంధ్రుల సంచులు మోసిన సన్నాసులకు జాతి తెలియదు: కేటీఆర్
పటాన్చెరు డివిజన్ పరిధిలో ఇటీవల నూతనంగా ఎన్నికైన గడ్డపోతారం, జిన్నారం, ఇంద్రేశం మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించి అభినందించిన అనంతరం గూడెం మహిపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'ముందే చెప్పాం.. అమలు చేశాం.. సాధించాం. మీ వెనుక నేనున్నా అభివృద్ధిలో ముందుకు సాగండి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసి మెప్పు పొందండి' అని కొత్త మున్సిపల్ పాలకవర్గాలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. 'పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలలో గులాబీ జెండా ఎగరవేసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు పుట్టినరోజు కానుకగా అందించాం. ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజు' అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సహకరించిన కార్యకర్తలు, సంపూర్ణ నమ్మకంతో ఆశీర్వదించిన ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్పారు.
Also Read: AP Govt Jobs: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. 1300 ఉద్యోగాల భర్తీకి సిద్ధం
'రాజకీయాల్లో గెలుపు ఓటములు అత్యంత సహజం. ప్రజలు నమ్మకంతో గెలిపించిన ప్రజాప్రతినిధులందరూ ఆయా మున్సిపాలిటీల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలి' అని కొత్త పాలకవర్గాలకు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. ప్రతి మున్సిపాలిటీని అభివృద్ధి సంక్షేమాల అంశంలో ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు. తాను ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఐదు మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.15 కోట్ల చొప్పున నిధులు సిద్ధంగా ఉన్నాయని.. అతి త్వరలో ఇందుకు సంబంధించిన పనులకు శంకుస్థాపనలు చేద్దామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
Also Read: KCR Birthday Gift: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ బర్త్డేకు 5 మున్సిపాలిటీలు గిఫ్ట్!
ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై పటాన్చెరు ప్రజలు ఎల్లప్పుడూ తమ నమ్మకాన్ని కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగా ఐదు మున్సిపాలిటీలలోనూ.. బీఆర్ఎస్ పార్టీని నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించారని పేర్కొన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు కార్పొరేషన్ ఎన్నికల్లోను క్లీన్ స్వీప్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Govt Job Notifications: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. దాదాపు 1300 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. త్వరలో బీసీ హాస్టళ్లలో 1,291 మంది పారిశుధ్య సిబ్బంది, 142 మంది కుక్ కమాటీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రకటించారు. రాష్ట్రంలో కొత్తగా 10 ఎంజేపీ బీసీ గురుకులాలను స్థాపించబోతున్నామని, ఆరు గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయబోతున్నట్లు తెలిపారు.
Also Read: KTR: సమైక్యాంధ్రుల సంచులు మోసిన సన్నాసులకు జాతి తెలియదు: కేటీఆర్
బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంగళవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే సీహెచ్ వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి సవిత స్పందిస్తూ సమాధానం ఇచ్చారు. 'బీసీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దనున్నాం. ఇందులో భాగంగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో వారికి అవకాశమిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల కాలంలో డీబీటీ, నాన్ డీబీటీ విధానంలో సముద్రంలో చేపల వేట ఉపశమన పథకం, తల్లికి వందనం, దీపం-2, ఆటో డ్రైవర్ సేవలో, ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా ఫించన్ల కింద 1,59,99,934 మంది బీసీ లబ్ధిదారులకు రూ.31,331.25 కోట్లు అందించాం' అని సవిత వెల్లడించారు.
Also Read: KCR Birthday Gift: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ బర్త్డేకు 5 మున్సిపాలిటీలు గిఫ్ట్!
బీసీలకు ఎన్టీఆర్, చంద్రబాబు రెండు కళ్లలాంటి వారని మంత్రి సవిత ప్రకటించారు. బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని.. 2014-19లోనూ.. ఇప్పుడు బీసీలను అన్ని విధాల ఆదుకోవడానికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆదరణ 1, ఆదరణ 2.0 పథకాలను అమలు చేశామని, త్వరలో ఆదరణ 3.0 పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు సవిత ప్రకటించారు. బీసీలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని.. ప్రతి కుటుంబం నుంచి ఒకరు పారిశ్రామికవేత్త అనే పాలసీ ద్వారా బీసీలకు ఎంఎస్ఎంఈ పార్కుల్లో ప్రాధాన్యమిస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.
Also Read: Manikonda Floods: వర్షం రాలేదు కానీ వరదొచ్చింది.. చెరువుగా మారిన మణికొండ
'పీఎం-యశ్వసీ పథకం కింద 3,05,840 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరేలా రూ.145 కోట్లు విడుదల చేశాం. హాస్టళ్లు, గురుకులాల్లో యూపీఎస్ లు, ఆర్వో ప్లాంట్లు, దోమ తెరలు, వంటగది పాత్రలు వంటి సౌకర్యాలు అందించడానికి రూ.69.33 కోట్లు మంజూరు చేశాం' మంత్రి సవిత వెల్లడించారు. హాస్టళ్లలో 1,291 మంది పారిశుధ్య సిబ్బందిని, 142 మంది అదనపు వంటవారిని, కామాటీ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పులు(ఎంటీఎఫ్) కోసం రూ.420.72 కోట్లు, ట్యూషన్ ఫీజు రీయింబర్స్ మెంట్ (ఆర్టీఎఫ్) కోసం రూ.933.76 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Muhammad Yunus Bangladesh Telugu News: భారత్ను ఉద్దేశించి మరోసారి మహమ్మద్ యూనస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవి నుంచి వైదొలుగుతున్న వేళ.. ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 18 నెలల పాలన ముగింపు సందర్భంగా ఆయన జాతి ఉద్దేశించి ప్రసంగించారు.. అలాగే భారత ఈశాన్య రాష్ట్రాలను ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దౌత్య పరంగా ఇప్పుడు చర్చనీ అంశానికి దారితీసింది.
భారతదేశంలోని సెవెన్ సిస్టర్స్ అభివృద్ధికి బంగ్లాదేశ్ ఒక గేట్వేగా మారుతుందని యునెస్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.. బంగ్లాదేశ్ తన సముద్ర మార్గం ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు, నేపాల్ తో పాటు భూటాన్ లకు గొప్ప ఆర్థిక అవకాశాలను కల్పిస్తుందని.. ఆయన అన్నారు. అయితే మహమ్మద్ యూనస్ ఈ రాష్ట్రాలను భారతదేశ అంతర్భాగంలో ప్రస్తావించకుండా.. సెవెన్ సిస్టర్స్ అని విడిగా సంబోధించడంపై.. భారత విదేశీ వ్యవహారాలనుపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఆ రాష్ట్రాల ప్రత్యేక ఉనికి ఉన్న ప్రాంతాలుగా చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగానే.. యూనస్ తన ప్రసంగంలో ఇలా పేర్కొన్నారని కొందరు విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
అయితే తన వీడ్కోలు ప్రసంగంలో భాగంగా యూనస్ చైనాకు పెద్దపీటవేశారు.. బంగ్లాదేశ్ కు బీజింగ్లో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అలాగే భారత్ వ్యూహాత్మక ప్రయోజనాలకు వ్యతిరేకమైన తీస్తా నది పునరుద్దీకరణ ప్రాజెక్టులలో చైనా సహకారాన్ని ఈ ప్రసంగంలో అతను కొనియాడారు.. బంగ్లాదేశ్ ఇకనుంచి ఏ దేశం పైన ఆధారపడదని.. అలాగే తమది లొంగిపోయే విదేశాంగ విధానం కాదని ఆయన ప్రసంగంలో తెలిపారు..
Also Read: Thief Viral Video: వధూవరులు ఫోటోలు దిగుతుండగా వచ్చి.. దొంగ బ్యాగ్ కొట్టుకెళ్లాడు.. వీడియో..
ఇక యూనస్ ప్రసంగంపై భారత మాజీ విదేశాంగ కార్యదర్శి కాన్వాల్వ్ సింబల్ స్పందించారు.. ఈ ప్రసంగం వింటుంటే యూనస్ తెలితక్కువ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన మండిపడ్డారు.. దేశాన్ని ఉన్నత స్థాయిలో అభివృద్ధి పరచడంలో విఫలమైన యూనస్.. భారత్ ను ఒక విలన్ గా చూపేందుకు ప్రయత్నిస్తున్నారని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మలానీ విమర్శించారు. యూనస్ సమయంలో బంగ్లాదేశ్ భారత్ సంబంధాలు ఊహించని స్థాయిలో దెబ్బతిన్నాయని.. అలాగే హిందువులపై దాడులతో పాటు భారత్ వ్యతిరేక సెంటిమెంట్ పెరగడం వంటి అంశాలు ఈ దేశాల మధ్య దూరాన్ని పెంచుతూ వస్తున్నాయి. ఇప్పుడు కొత్త ప్రధాని తారీక్ రెహమాన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సంబంధాలు మళ్లీ మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: Thief Viral Video: వధూవరులు ఫోటోలు దిగుతుండగా వచ్చి.. దొంగ బ్యాగ్ కొట్టుకెళ్లాడు.. వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jammu And Kashmir Alert Telugu News: జమ్మూ కాశ్మీర్లోని ఆర్ఎస్ పురాలోని జువైనల్ అబ్జర్వర్ హోమ్లో సోమవారం సాయంత్రం ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు బాల ఖైదిలు అక్కడి భద్రతా సిబ్బందిపై దాడి చేసి.. తుపాకీతో కాల్పులు జరిపి మరి తప్పించుకున్నారు. పరారైన వారిలో ఇద్దరు పాకిస్తాన్ కు సంబంధించిన బాల ఖైదీలు కూడా ఉండడంతో సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు..
సోమవారం సాయంత్రం సుమారు ఐదు గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఖైదీలు పక్కా ప్రణాళికలతో కాపలాగా ఉన్న పోలీసులపై దాడికి దిగారు.. ఒక ఖైదీ వద్ద నాటు తుపాకీ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఖైదీల్లోని ముందుగా లోపల కాల్పులు జరిపి.. మిగిలిన పోలీసులను నెట్టేసి మరి బయటికి పారిపోయారు. ఈ ఖైదీలు వసతి గృహం నుంచి బయటికి వచ్చిన వెంటనే వారి దగ్గర ఉన్న తుపాకీతో ఓ వ్యక్తిని బెదిరించి మరి మోటార్ సైకిల్ లాక్కొని పరారయ్యారు.
పోలీసులందించిన సమాచారం ప్రకారం.. తప్పించుకున్న వారిలో స్థానికుడు కరంజిత్ సింగ్ తో పాటు పాకిస్తాన్ కు చెందిన మహమ్మద్ సునావుల్లా, అహసాన్ అన్వర్ ఉన్నారట.. వీరిపై గతంలో కొన్ని ప్రత్యేకమైన కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. జువైనల్ హోమ్ లోపలికి తుపాకీ ఎలా వచ్చిందని అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు.. ఇదిలా ఉంటే.. ఆ ఖైదీలు ప్రవీణ్ అనే హెడ్ కానిస్టేబుల్ పై తుపాకీతో దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో పక్కనే ఉన్న స్పెషల్ పోలీస్ ఆఫీసర్ వినయ్ కుమార్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
Also Read: Thief Viral Video: వధూవరులు ఫోటోలు దిగుతుండగా వచ్చి.. దొంగ బ్యాగ్ కొట్టుకెళ్లాడు.. వీడియో..
ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యా.. ముఖ్యంగా డిజిపి నలిన్ ప్రభాత్, ఐజి బీమ్ స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాంబార్ జిల్లాతో పాటు జాతీయ రహదారి వైపు వెళ్లే మార్గాల్లో చెక్పోస్టుల ఏర్పాటుకు ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో గాలింపు చర్యలను కూడా ముమ్మరం చేశారు. అయితే ఇందులో ఇద్దరు పాకిస్తాన్ దేశానికి చెందిన వారు కావడంతో వారు సరిహద్దు దాటే అవకాశాలు ఉన్నాయని భావించి బిఎస్ఎఫ్ ను కూడా అప్రమత్తం చేశారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేకమైన ఉన్నతాధికారుల బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.
Also Read: Thief Viral Video: వధూవరులు ఫోటోలు దిగుతుండగా వచ్చి.. దొంగ బ్యాగ్ కొట్టుకెళ్లాడు.. వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KCR 72nd Birthday: 'తెలంగాణ మట్టితో మమేకమైన వారికి, ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వారికి, ఆత్మగౌరవ పోరాటంలో కలిసి నడిచిన వారికి మాత్రమే జాతి అంటే ఏంటో, జాతి గౌరవం అంటే ఏంటో తెలుస్తుంది' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. సమైక్యాంధ్రుల సంచులు మోసిన సన్నాసులకు జాతి తెలియదు, నీతి తెలియదని పరోక్షంగా రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారుల మీదికి తుపాకీ తీసుకొని పోయిన జాతి ద్రోహులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
Also Read: KCR Birthday Gift: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ బర్త్డేకు 5 మున్సిపాలిటీలు గిఫ్ట్!
బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ వేడుకలు తెలంగాణతోపాటు దేశ, విదేశాల్లో ఘనంగా జరిగాయి. హైదరాబాద్లో జరిగిన తన తండ్రి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. 'ఏ జాతి నీది? ఏ జాతికి జాతిపిత' అని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్పై అవాకులు చెవాకులు పేలిన రేవంత్ రెడ్డిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు.
'రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి మాది. జల్, జంగల్, జమీన్ అని కొట్లాడిన కొమురం భీముడి జాతి మాది. అస్తిత్వం కోసం అమరులైన సమ్మక్క సారలమ్మల జాతి మాది. కోటల మీద జెండా ఎగరేసిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న జాతి మాది. భూస్వాముల దోపిడీ మీద పోరాడిన దొడ్డి కొమురయ్య జాతి మాది. బరిలో బందూక్ పట్టి దేశ్ముఖ్లను తరిమికొట్టిన వీరనారి చాకలి ఐలమ్మ జాతి మాది. సామాజిక విప్లవకారుడు భాగ్యరెడ్డి వర్మ జాతి మాది' అని మాజీ మంత్రి కేటీఆర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.
Also Read: Manikonda Floods: వర్షం రాలేదు కానీ వరదొచ్చింది.. చెరువుగా మారిన మణికొండ
'సిపాయిల తిరుగుబాటు బావుటా ఎగరేసిన తుర్రేబాజ్ ఖాన్ జాతి మాది. ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే ఉప్పుపాతర వేస్తామన్న కాళోజీ జాతి మాది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన దాశరథి జాతి మాది. 1952లో గైర్ ముల్కీ గో బ్యాక్ అని నెత్తుటి త్యాగాలు చేసిన విద్యార్థి అమరవీరుల జాతి మాది. 1969లో కర్కశ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటం చేసి 369 మంది అసువులు బాసిన యువ కిశోరాల జాతి మాది. మలిదశ ఉద్యమంలో ఢిల్లీ మెడలు వంచిన తెలంగాణ జాతి మాది. అణువణువునా ఆత్మగౌరవం తొణికిసలాడే జాతి మాది. నీతి ఉన్న, రీతి ఉన్న తెలంగాణ జాతి మాది' అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
Also Read: Seethakka: వెన్నుపోటుదారులను వదల.. కాంగ్రెస్ రెబెల్స్కు సీతక్క మాస్ వార్నింగ్!
'ఢిల్లీకి సలాం కొట్టి బతికే సామంతులం మేము కాదు. నిటారుగా నిలబడ్డ వెన్నుముక ఉన్న తెలంగాణ భూమి పుత్రులం, ఆ జాతి మాది.. సామంతుల జాతి కాదు స్వతంత్రుల జాతి మాది. బానిసకు ఒక బానిస జాతి కాదు, గిరి గీసి కొట్లాడే తెగువ ఉన్న కేసీఆర్ జాతి మాది. ఢిల్లీ కీ ఇస్తే ఎగిరే కీలుబొమ్మల జాతి కాదు మాది. అధిష్టానం ఆడిస్తే ఆడే తోలుబొమ్మల జాతి కాదు మాది. తెగువ ఉన్న, పౌరుషం ఉన్న భూమి పుత్రుల జాతి మాది. కిరాయి వాళ్ల పంచన చేరి కిరాయి బతుకు బతికే జాతి కాదు మాది. సోయి ఉన్న, సొంత శక్తి ఉన్న జాతి మాది' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
'ఏ జాతి నీది? ఏ జాతికి జాతిపిత?' అని అడిగిన సన్నాసికి ఇవన్నీ చెప్తున్న.. తెలంగాణలో రెండే జాతులు ఉన్నాయి. ఒకటి తెలంగాణ వాదుల జాతి, రెండోది తెలంగాణ ద్రోహుల జాతి' అని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 'మాది ఫైటర్ల జాతి, మీది ట్రెయిటర్ల (ద్రోహుల) జాతి. మాది కేసీఆర్ లాంటి ఫైటర్ల జాతి, నీది ట్రెయిటర్ల జాతి' అని వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ మీద, తెలంగాణ జాతి మీద, జాతి గౌరవం మీద ఎవరు పడితే వారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Manjeera Water Pipeline Burst: హైదరాబాద్లో ఆకస్మికంగా వరద వచ్చింది. ఐటీ ప్రాంతం వారు నివసించే మణికొండలో అకస్మాత్తుగా వరద రావడంతో ఆ ప్రాంతం మొత్తం చెరువును తలపించింది. మోకాల్లోతు నీళ్లు చేరడంతో మణికొండవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేసవికాలం ప్రారంభమవుతున్న సమయంలో భారీ వరద ముంచెత్తడం ఏమిటంటే.. హైదరాబాద్కు తాగునీరు అందించే మంజీరా పైపులైన్ ఒక్కసారిగా పేలిపోయింది. పైపులైన్ పేలడంతో వరద ముంచెత్తింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: KCR Birthday Gift: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ బర్త్డేకు 5 మున్సిపాలిటీలు గిఫ్ట్!
రంగారెడ్డి జిల్లా మణికొండలో మంజీరా నీటి పైప్లైన్ సోమవారం అర్ధ రాత్రి పేలిపోయింది. అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో మణికొండ పైప్లైన్ రోడ్డులో భారీ శబ్దంతో మంజీరా నీటి పైప్లైన్ పేలడంతో ఐదు నిమిషాల్లోనే అపార్ట్మెంట్ల సెల్లార్లలో నీరు నిండిపోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన హైడ్రా, విపత్తు నిర్వహణ బృందాలు చర్యలు చేపట్టాయి. మణికొండ పైప్లైన్ రోడ్డులో ఈ ప్రమాదం జరగడంతో మంజీరా నీరంతా వృథాగా పోయింది.
Also Read: Seethakka: వెన్నుపోటుదారులను వదల.. కాంగ్రెస్ రెబెల్స్కు సీతక్క మాస్ వార్నింగ్!
లక్షలాది లీటర్ల మంజీరా నీరు పోటెత్తడంతో మణికొండలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఐదు నిమిషాల వ్యవధిలోనే దాదాపు ఆరు అడుగుల మేర నీరు అపార్ట్మెంట్ సెల్లార్లలోకి చేరింది. అపార్ట్మెంట్లలో పార్క్ చేసిన దాదాపు 7 నుంచి 8 కార్లు, ద్విచక్ర వాహనాలు నీటిలో మునిగిపోయి భారీగా దెబ్బతిన్నాయి. సెల్లార్లో ఉన్న వస్తువులు, విద్యుత్ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. సమాచారం అందిన వెంటనే హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) బలగాలు, అగ్నిమాపక శాఖ, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పైప్లైన్ నీటిని వెంటనే నిలిపివేసి, సెల్లార్లలో ఉన్న నీటిని తోడే ప్రక్రియను ప్రారంభించారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు కానీ, స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అధికారులు తక్షణమే స్పందించడంతో కొంత ప్రమాదం తప్పింది.
Also Read: India vs Pakistan: పాకిస్థాన్ దిమ్మతిరిగింది.. టీ20 ప్రపంచకప్లో టీమిండియా హ్యాట్రిక్ విజయం
నీటి సరఫరాకు ఆటంకం
భారీ పైపులైన్ పేలిపోవడంతో హైదరాబాద్లో తాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడింది. హైదరాబాద్కు తాగునీటి సరఫరా అందించే మంజీరా పైపులైన్ పగిలిపోవడంతో మణికొండతోపాటు చుట్టు పక్కల పరిసరాల ప్రాంతాల్లో వారం రోజుల పాటు తాగునీటి సరఫరాకు ఇబ్బంది ఎదురవుతుందని సమాచారం. అధికారులు తక్షణమే మంజీరా పైపులైన్ మరమ్మత్తులు ప్రారంభించినా.. కూడా ఆ పనులు అయ్యేందుకు సమయం పడుతుందని.. ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Huge Cobra Video Watch: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.. వాటిల్లో కొన్ని మనకు ఫన్నీగా అనిపిస్తే..మరికొన్ని మాత్రం ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటాయని మనందరికీ తెలుసు. అయితే అప్పుడప్పుడు ఇంటర్నెట్లో కొన్ని పాములకు సంబంధించిన వీడియోలు కూడా హల్చల్ చేస్తూ ఉంటాయి. ఇలాంటి వీడియోలు చూస్తే ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే.. ఈ పాముల వీడియోలు నిత్యం ఒకటో రెండో తప్పకుండా వైరల్ అవుతూనే ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వ్యక్తి కాలుకు అత్యంత భారీ నాగుపాము చుట్టుకొని ఉండడానికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ వీడియోలో ఒక వ్యక్తి కూర్చొని ఉండడం మీరు గమనించవచ్చు. అతని కాలుకు ఒక పొడవైన నాగుపాము గట్టిగా చుట్టేసుకొని ఉండటం కూడా మీరు చూడొచ్చు. సాధారణంగా మనకు చిన్న పాము కనిపిస్తేనే.. కేకలు వేస్తూ మరి అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటాం.. అలాంటిది ఈ వ్యక్తి కాలుకు అత్యంత ప్రమాదకరమైన భారీ నాగుపాము చుట్టుకొని ఉండడం చూస్తుంటే.. ఆ పరిస్థితి ఊహించడానికి భయానకారంగా ఉంటుంది. అయితే ఈ వీడియోలో మాత్రం ఆ వ్యక్తి ఏమాత్రం కంగారు పడకుండా.. చాలా ప్రశాంతంగా ఉండడం ఆశ్చర్యమేస్తోంది..
అయితే, ఈ వీడియోలో పాము మాత్రం.. అతని కాలును ఏమాత్రం విడిచిపెట్టకుండా అలాగే పట్టుకొని ఉంది.. ఆ వ్యక్తి తన కాలును నెమ్మదిగా కదిలిస్తున్నప్పటికీ.. పాము మాత్రం అలాగే కదలకుండా ఉండిపోయింది.. దీన్ని చూస్తుంటే ఆ వ్యక్తి ఒక స్నేక్ క్యాచర్ అయి ఉండచ్చని.. నేటిజన్లు భావిస్తున్నారు. అందుకే అంత ప్రమాదకరమైన పాము అతని కాలుకు చుట్టుకుని ఉన్నప్పటికీ భయపడకుండా చాలా నిశ్శబ్దంగా.. నెమ్మదిగా కాలును కదుపుతూ ఉండిపోతున్నాడు..
ఏది ఏమైనా ఇలాంటి ప్రమాదకరమైన పాముల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.. ఎంత స్నేక్ క్యాచర్ అయినప్పటికీ.. అది ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో.. ఎప్పుడు దాడి చేస్తుందో అనే విషయం ఎవరికీ తెలియదు.. కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు కూడా ఇదే చెబుతున్నారు. ఇలాంటి సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మేలని వారంటున్నారు.. అయితే, ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు అతని ధైర్యాన్ని మెచ్చుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు.
Also Read: Thief Viral Video: వధూవరులు ఫోటోలు దిగుతుండగా వచ్చి.. దొంగ బ్యాగ్ కొట్టుకెళ్లాడు.. వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Japan Baby Monkey Video: ప్రకృతి సృష్టించిన విపత్తుల్లో కొన్నిసార్లు మనస్సును కదిలించే ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి.. తాజాగా జపాన్లోని ఇచికావా సిటీలో ఉన్న జూలో వెలుగు చూసిన ఒక దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది.. పుట్టిన కొద్దిసేపటికి తల్లి వదిలేసిన ఓ కోతి పిల్ల.. తల్లి ప్రేమను పొందడానికి.. కోతి బొమ్మను హత్తుకొని ఆడుకుంటున్న దృశ్యాలు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇప్పుడు ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
పంచ్ అనే మకాక్ జాతికి చెందిన కోతి పిల్ల 2025 సంవత్సరంలో జన్మించింది.. దురదృష్టవశాత్తూ.. ఈ పిల్ల కోతిని పుట్టిన కొద్దిసేపటికి దాని తల్లి వదిలేసి వెళ్లిపోయింది.. అప్పటినుంచి జూకీపర్లు ఈ బుజ్జి కోతి పిల్లను అల్లారుముద్దుగా కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నారు. కొంతమంది జూ కీపర్లు స్వయంగా తమ పిల్లలుగా భావించి.. పెంచుకుంటున్నారు. అయితే అమ్మలేని లోటు ఆ పిల్లలు ఒత్తిడిని పెంచకుండా ఉంచేందుకు.. జూ కీపర్లు ఆ పిల్ల కోతికి దాని తల్లిలా కనిపించి ఒక బొమ్మ అందించారు..
ఈ క్రమంలోని ఆ పంచ్ పిల్ల కోతి.. తన తల్లిలా భావించే బొమ్మకు ఎంతో దగ్గర అయింది.. ఆ బొమ్మని తన తల్లిలా భావిస్తూ తింటున్నప్పుడు.. నిద్రపోతున్నప్పుడు.. దాన్ని పక్కనే ఉంచుకోవడం ప్రారంభించింది. చివరకు ఆ బుజ్జి కోతి ఇతర కోతులతో ఆడుకోవడానికి వెళ్తున్నప్పుడు కూడా ఆ బొమ్మను తనతో పాటే తీసుకెళ్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఎక్స్ ఖాతాల్లో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. జపాన్లోనైతే ఈ వీడియో పెద్ద సంచలనంగా మారింది.. ఒక వీడియోలు పంచ్ ఆ బొమ్మను గట్టిగా కౌగిలించుకొని నిద్రపోవడం చూసి సోషల్ మీడియా వినియోగదారులు కన్నీరు మున్నీరవుతున్నారు.
Also Read: Thief Viral Video: వధూవరులు ఫోటోలు దిగుతుండగా వచ్చి.. దొంగ బ్యాగ్ కొట్టుకెళ్లాడు.. వీడియో..
అయితే, గత కొద్ది రోజుల నుంచి ఆ కోతి పిల్ల బొమ్మను వదిలిపెట్టి ఉండలేకపోవడంతో జూ అధికారులు ఇతర మకాక్ కోతుల గుంపులో నెమ్మదిగా అలవాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.. జనవరి నెల నుంచి ఈ కోతి పిల్ల ఇతర కోతులతో కలవడం ప్రారంభించినప్పటికీ.. కొత్త వాతావరణం లో భయం వేసినప్పుడల్లా.. అక్కడి నుంచి పరుగున వెళ్లి తన బొమ్మ తల్లిని హత్తుకుంటుంది. " ఆ పంచ్ కోతి పిల్ల.. ఇతర కోతులతో స్నేహం చేసినప్పటికీ.. తనకు నచ్చని సమయాల్లో.. ఇతర కోతులు దాడి చేస్తున్న సమయంలో తల్లి గుర్తుకు వచ్చినప్పుడు ఆ బొమ్మ దగ్గరికే వెళుతోందని.." జూవర్గాలు చెబుతున్నాయి..
Also Read: Thief Viral Video: వధూవరులు ఫోటోలు దిగుతుండగా వచ్చి.. దొంగ బ్యాగ్ కొట్టుకెళ్లాడు.. వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
High Professional Thief Viral Video Watch: రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఓ వివాహ వేడుకలు ఎవరు ఊహించని ఒక దొంగతనం జరిగింది.. దొంగ సూటు.. బూటు ధరించి.. రాజ్యసం ఉట్టిపడేలా అతిధి రూపంలో వచ్చి.. అందరూ కల్లప్పగించి చూస్తుండగానే వధువు హ్యాండ్ బ్యాగ్ను అత్యంత సులభంగా దొంగిలించి అక్కడి నుంచి పరారయ్యాడు.. ఆ బ్యాగులు సుమారు నాలుగు లక్షల పైగా విలువ చేసే నగదుతో పాటు బంగారు ఆభరణాలు ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ ప్రొఫెషనల్ దొంగకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ ఘటన ఫిబ్రవరి 7వ తేదీన జైపూర్ లోని చందన వన్ మ్యారేజ్ గార్డెన్లో జరిగినట్లు తెలుస్తోంది.. అయితే రాత్రి పది గంటల సమయంలో వధువు వరుడు స్టేజిపై ఉండి.. ఎంతో ఆనందంగా బంధుమిత్రులతో కలిసి ఫోటోలకు ఫోజులిస్తున్నారు.. ఈ సమయంలో అందరి దృష్టి ఫోటోలపైనే ఉంది.. ఇంతలోనే సూట్ ధరించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఎంతో నిశ్శబ్దంగా నెమ్మదిగా స్టేజ్ పైకి వెళ్ళాడు.. వధువు పక్కనే ఉన్న ఆమె హ్యాండ్ బ్యాగ్ను సింపుల్ గా తీసుకొని.. ఎవరికి అనుమానం రాకుండా తన బ్లేజర్ లోపల దాచుకున్నాడు.. ఇలా చేసిన క్షణాల్లోనే అతను జనాల్లో నుంచి కనిపించకుండా మాయమైపోయాడు..
చివరగా..
వధువు ఫోటోషూట్ అయిన తర్వాత తన బ్యాగు కనిపించకపోవడంతో.. వెంటనే ఆమె తమ కుటుంబ సభ్యులకు తెలియజేస్తుంది.. అక్కడే ఉన్న బంధువులతో కలిసి ఆ పెళ్లి వేదికను మొత్తం వెతుకుతారు.. అయితే, వారి ఎంత వెతికినప్పటికీ ఫలితం లేకపోవడంతో.. వెంటనే వారు అక్కడే ఉన్న కెమెరా మాన్ తో వారు తీసిన వీడియో రికార్డులను పరిశీలిస్తారు.. అందులో ఒక వ్యక్తి తన హ్యాండ్ బ్యాగ్ను సింపుల్గా పట్టుకొని వెళుతున్న దృశ్యాలు చూసి అందరూ షాక్ అవుతారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఘటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది. వీడియో చూస్తుంటే ఆ దొంగ ఎంతో అనుభవం ఉన్నవాడిలా.. ఈ పని చేసినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ ఘటనపై వరుడు సోదరుడు నితిన్ సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీడియో ఆధారంగా దొంగను గుర్తించే పనిలో పడ్డారు. అంతేకాకుండా కొంతమంది పోలీస్ అధికారులు సూచించిన వివరాల ప్రకారం.. పెళ్లిలు వంటి రద్దీగా ఉండే వేడుకల్లో విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే ఇలాంటి ప్రొఫెషనల్ దొంగలు ఇదే ఆసరాగా చేసుకుని లక్షల రూపాయల విలువైన వస్తువులను దోచేస్తున్నారని వారి తెలిపారు..
Also Read: మూడేళ్ల బాలుడిపై అంగన్వాడీ టీచర్ దాష్టీకం.. అల్లరి చేస్తున్నాడని కన్ను పోయేలా దారుణం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Mancherial Latest Telugu News: మంచిర్యాల జిల్లాలోని క్యాతంపల్లి మున్సిపాలిటీ వేదికగా రాజకీయం ఒక్కసారిగా ఊహించని స్థాయిలో వేడెక్కింది.. అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష BRS శ్రేణుల మధ్య పోటాపోటీ నినాదాలు.. పోలీసుల జోక్యంతో మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. అయితే, ఈ సమయంలో పోలీసులంతా కాంగ్రెస్ కార్యకర్తలు లాగా వ్యవహరిస్తున్నారని బిఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు..
అసలు విషయం ఇదే..
క్యాతంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 21వ వార్డుకు చెందిన BRS కౌన్సిలర్ అభ్యర్థి స్వర్ణలత మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే సమయంలో ఆమెను ఒక్కసారిగా పోలీసులు అడ్డుకున్నారు.. అయితే, ఆమెపై కేసు నమోదు కావడంతో లోపలికి వెళ్లను ఇవ్వకపోవడంతో అక్కడ ఈ వివాదం ప్రారంభమైంది.. అయితే, వెంటనే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోవా లక్ష్మీతో పాటు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వెంటనే అక్కడికి చేరుకోవడంతో పాటు పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు.
BRS అభ్యర్థులను భయభ్రాంతులను గురి చేసేందుకు ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నారని వారు మండిపడ్డారు.. అంతేకాకుండా పోలీసులు కాకి దుస్తుల్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల వ్యవహరిస్తున్నారని.. ప్రజాస్వామ్య బద్దంగా పోటీ చేస్తున్న అభ్యర్థులపై అక్రమ కేసులు పెడితే, అసలు ఊరుకోమని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ హెచ్చరించారు.
Also Read: మూడేళ్ల బాలుడిపై అంగన్వాడీ టీచర్ దాష్టీకం.. అల్లరి చేస్తున్నాడని కన్ను పోయేలా దారుణం..!
అయితే, ఇదే సమయంలో ఖతంపల్లి ఫ్లై ఓవర్ మీదుగా వెళుతున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ను BRSకు సంబంధించిన కార్యకర్తలు అడ్డుకున్నారు.. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. అలాగే వారు రోడ్డుపై బైఠాయించారు.. దీంతో అటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య ఒక పెద్ద వాగ్వాదమే చోటుచేసుకుంది.. గో బ్యాక్ వివేక్ వెంకటస్వామి అంటూ టిఆర్ఎస్ శ్రేణులు.. జై కాంగ్రెస్ అంటూ ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు నినాదం చేయడంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది.
Also Read: మూడేళ్ల బాలుడిపై అంగన్వాడీ టీచర్ దాష్టీకం.. అల్లరి చేస్తున్నాడని కన్ను పోయేలా దారుణం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Praying Dead Body In House Since 4 Days: ఏసు కాపాడతాడు.. ప్రాణం పోస్తాడు.. ప్రార్థనలు చేస్తున్నామంటూ హైదరాబాద్లో ఓ కుటుంబం వింతగా ప్రవర్తించింది. కూకట్పల్లిలోని రామకృష్ణ నగర్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కుటుంబం డెడ్ బాడీని ఇంట్లోనే నాలుగు రోజులుగా పెట్టి ప్రార్థనలు చేస్తున్నారు. 40 ఏళ్ల క్రితం ఏసురత్నం హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డాడు. ఏఎస్ఐగా పనిచేసి ఆయన పదవీ విరమణ కూడా పొంది మృతి చెందాడు. అయితే ప్రస్తుతం ఆయన భార్య శమంతకమణి, ఇద్దరు కుమార్తెలు సునీత, శైలజ కుమారుడు జయరాజులు కూడా ఉన్నారు.
అయితే వారం రోజులుగా చిన్న కుమార్తె శైలజ అనారోగ్యం బారిన పడింద. ఈ నేపథ్యంలో స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే ఆమె రక్తహీనతతో బాధపడింది. కుటుంబ సభ్యులను రక్తం ఎక్కించాలని వైద్యులు సూచించినా.. పరిశుద్ధమైన రక్తం మాత్రమే ఎక్కించాలంటూ వారు నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. దీంతో శైలజ ఈ నెల 13వ తేదీన చనిపోయింది. అయితే మృతదేహాన్ని కూడా అదే రోజు ఇంటికి తీసుకువెళ్లిపోయారు. కానీ అప్పటి నుంచి నేటి వరకు ఆమె అంత్యక్రియలు మాత్రం నిర్వహించలేరు. ఆ మృతదేహాన్ని రిఫ్రిజిరేటర్ పేటికలో అలాగే పెట్టి ఇంట్లోనే పెట్టుకొని తలుపులు బిగించుకొని ఉన్నారు.
ఇక ఎప్పటి మాదిరిగానే ఇంటి నుంచి బయటకు వెళ్తూ వస్తున్నారు . అయితే ఈ విషయం తెలిసిన స్థానికులు అంత్యక్రియలు చేయడం లేదు ఏంటని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానం చెబుతున్నారు. మేము ప్రార్థనలు చేస్తున్నాం.. యేసు కాపాడుతాడు.. అంత్యక్రియలు మా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాం. అడగడానికి మీరు ఎవరు? అంటూ వారు అపార్ట్మెంట్ వాసులతో గొడవలకు దిగారు. దీంతో దుర్వాసన కూడా ఇంట్లోంచి ఎక్కువగా రావడంతో స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకా సోమవారం సమాచారం అందుకున్న పోలీసులు ఆ కుటుంబం వద్దకు వచ్చి ఆరా తీయగా కాసేపు ఎంతకీ తలుపులు తీయకుండా అలాగే ఉన్నారు . వారితో కూడా వాగ్వాదానికి దిగారు. అయితే చివరికి పోలీసులకు అంత్యక్రియలు జీహెచ్ఎంసీ వారికి అప్పగిస్తామని హెచ్చరించడంతో ఇక ఆ మృతదేహాన్ని తీసుకొని సొంతూరు వెళ్లారు. అయితే ఆ కుటుంబం కాస్త వింతగా ప్రవర్తిస్తుందని.. ఆ ముగ్గురు పిల్లలకు 40 ఏళ్లు పైబడినా ఎవరూ వివాహం చేసుకోకుండా తల్లి వద్దే ఉంటున్నారని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ఎవరితో మాట్లాడారని మానసిక ఆరోగ్యంతో కూడా బాధపడుతున్నారని సమాచారం. అయితే, చనిపోయిన శైలజ కూడా మానసికంగా పరిస్థితి బాగా లేకపోవడం వల్ల అలా జరిగిందన్నారు.
Also Read: ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. టైమ్ టేబుల్ పీడీఎఫ్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి..!
Also Read: మూడేళ్ల బాలుడిపై అంగన్వాడీ టీచర్ దాష్టీకం.. అల్లరి చేస్తున్నాడని కన్ను పోయేలా దారుణం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Mars And Mercury Transit Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడితో పాటు బుధుల సంచారం చాలా ప్రభావవంతమైందిగా భావిస్తారు. ధనిష్ట నక్షత్రంలో కుజుడు ఉండటం వల్ల ధైర్యంతో పాటు సంపాదన పెరుగుతుంది. అలాగే బుధుడు పూర్వభద్రపాదనక్షత్రంలో సంచార దశలో ఉండటం వల్ల మేధో వికాసం ఊహించని స్థాయిలో రెట్టింపు అవుతుంది. ఈ రెండు గ్రహాల సంచారం చాలా శుభ్రమైందిగా భావిస్తారు. ఎందుకంటే ఫిబ్రవరి 15వ తేదీన కుజుడితో పాటు బుధ గ్రహాలు సంచారం చేశాయి. ముఖ్యంగా ఈ రెండు గ్రహాలు నక్షత్ర సంచారంతో కొన్ని రాశుల వారికి అపారమైన ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా కూడా చాలా వరకు కలిసి రాబోతోంది.
ఈ రాశులవారికి ఊహించని లాభాలు:
మేషరాశి
మేష రాశి వారికి కుజుడు అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటాడు. ధనిష్ట నక్షత్రం లోకి కుజుడు సంచారం చేయడం కారణంగా ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఏదైనా చట్టపరమైన కేసుల్లో ఇరుక్కున్న వారికి ఈ సమయంలో ఊహించని స్థాయిలో ఆత్మవిశ్వాసం లభిస్తుంది. అంతేకాకుండా వాటిల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు. నాయకత్వ లక్షణాలున్నవారు పనుల్లో అద్భుతంగా రాణించగలుగుతారు. కొత్త భాగ్యదలు పొందడమే కాకుండా.. ఈ సమయంలో ఊహించని లాభాలు కూడా సొంతం చేసుకుంటారు. వ్యాపారాల్లో ఆర్థిక విస్తరణ కూడా సాధ్యమవుతుంది. ఈ సమయంలో ఊహించని ఆర్థిక లాభాలు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మిథున రాశి
మిధున రాశికి బుధుడు అధిపతిగా వ్యవహరిస్తాడు.. అయితే, నక్షత్ర మార్పుల కారణంగా వీరికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అలాగే కొన్ని రకాల కీరకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమ్యూనికేషన్ రంగంలో పనులు చేస్తున్న వ్యక్తులకు.. ఈ సమయం అద్భుతమైన అవకాశాలను అందించబోతోంది. రచనల్లో కూడా మిమ్మల్ని మించిన వారు లేకుండా ఉంటారు. అంతేకాకుండా ఆకస్మికంగా ఉద్యోగాలు కూడా లభిస్తాయి. అలాగే గణనీయమైన పురోగతి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సింహరాశి
సింహరాశి వారికి ఆర్థికంగా ఊహించని స్థాయిలో బలం పెరుగుతుంది. అదృష్టం కూడా చాలా వరకు సహకరించి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. పూర్వీకుల ఆస్తుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు కూడా పొందగలుగుతారు. ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు పదోన్నతులు పొందే అవకాశాలు కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు కూడా పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగాల్లో స్థిరపడిన వ్యక్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా మారబోతోంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా కుజుడు ధనిష్ట నక్షత్రంలోకి సంచారం చేయడం కారణంగా ధైర్యం పెరగబోతుంది. ముఖ్యంగా వీరికి చాలా రకాల ప్రయత్నాలు విజయవంతమవుతాయి. శత్రువులపై ఊహించని విజయాలు సాధించగలుగుతారు. సామాజిక స్థితి కూడా ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా.. వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు దీర్ఘకాలిక సమస్యలు పూర్తిగా తొలగిపోబోతున్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ardha Kendra Raja Yoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని ఎంతో శక్తివంతమైన గ్రహంగా పరిగణిస్తారు.. ఈ గ్రహం రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో సంచార దశలో ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఎన్నో రకాల సంయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం శని మీనరాశిలో సంచార దశలో ఉంది. ఫిబ్రవరి 11వ తేదీన ఉదయం 9 గంటల సమయంలో కుజుడు శని గ్రహం ఒకదానికొకటి 45 డిగ్రీల కోణం లోకి వచ్చి సంయోగం జరిపాయి. జ్యోతిష్య శాస్త్రంలో ఇలా అరుదుగా జరుగుతుంది. అయితే ఈ సమయంలోనే ఎంతో శక్తివంతమైన అర్థకేంద్ర రాజయోగం ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఇది చాలా శుభప్రదమైనదిగా చెప్పుకుంటారు.. ఈ యోగ ప్రభావం వల్ల అన్ని రాశుల వారికి ఎంతో కొంత మేలు జరుగుతుంది. అనుకోకుండా ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే, అర్థ కేంద్ర రాజయోగం వల్ల ఊహించని లాభాలు పొందుపై రాశులేవో.. ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారికి ప్రయోజనాలు:
మేషరాశి
మేషరాశి వారికి అర్థ కేంద్ర రాజయోగ ప్రభావంతో ఎన్నో రకాల అనుకూలమైన సంఘటనలు ఎదురవుతాయి. ముఖ్యంగా కుజుడు వీరికి ఉన్నత స్థానంలో ఉండడం వల్ల ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు ఈ సమయం మంచి అవకాశాలను కలిగిస్తుంది. కొత్త కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి. వృత్తిపరమైన జీవితం కూడా చాలా వరకు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో హోదా కూడా పెరిగి ఊహించని స్థాయిలో ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యంగా అనుకున్నంత స్థాయిలో ఆదాయం కూడా పెరుగుతుంది. జీవితం ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉన్నతాధికారుల నుంచి పనుల్లో సంతృప్తి కూడా లభిస్తుంది. దీంతోపాటు పదోన్నతులు పెరిగి జీతం కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ జీవితం కూడా చాలా వరకు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసం కూడా అనుకున్నంత స్థాయిలో పెరుగుతుంది. జీవితంలో ఊహించని ధన లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి అర్థ కేంద్ర రాజయోగం కారణంగా అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. దీంతోపాటు సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. అంతేకాకుండా వ్యక్తిగత జీవితం కూడా మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారవేత్తలు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. కొన్ని నిర్ణయాలు తీసుకునే క్రమంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mahalakshmi Raja Yoga Effect On Zodiac: ఫిబ్రవరిలోని కొత్త వారంలో మకర రాశిలో చంద్రుడి గుజుడి కలయిక జరిగింది. అయితే ప్రారంభ సమయంలోనే ఈ రెండు గ్రహాల కలయిక జరగడం వల్ల ఎంతో ప్రత్యేకమైన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడింది. ఈ యోగాన్ని అత్యంత అరుదైనదిగా భావిస్తారు. అయితే దీని ప్రభావం కొన్ని రోజులపాటు కొనసాగుతూ వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీనిని చంద్ర మంగళ రాజయోగంగా కూడా చెప్పుకుంటారు. ఈ వారం ఎంతో శక్తివంతమైన మహాపురుష రాజయోగం కూడా ఏర్పడబోతోంది. దీనివల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలకమైన మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ధైర్యం పెరగడమే కాకుండా.. రాజకీయాల్లో అపారమైన విజయాలు లభించబోతున్నాయి. మేష రాశి వారికి అన్నింటి పరంగా విపరీతమైన ఆర్థిక లాభాలు కలుగుతాయి. డబ్బు కూడా భారీ మొత్తంలో లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ రాశుల వారికి బంపర్ జాక్పాట్..
మేషరాశి
మేష రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం (Mahalakshmi Raja Yoga) కారణంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. పనుల్లో సానుకూలమైన ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్య పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రయాణాలు చేయడం వల్ల విపరీతమైన ఆనందం కూడా లభిస్తుంది. మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. ఆర్థికంగా ఖర్చులు విపరీతంగా ఉన్నప్పటికీ.. ఈ సమయంలో కొన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలకు కాస్త పరిష్కారం కూడా దొరుకుతుంది.
వృషభ రాశి
వృషభ రాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో కొన్ని రకాల ఆర్థికపరమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. పెట్టుబడులు పెట్టడం వల్ల జీవితం చాలా వరకు ప్రశాంతంగా ముందుకు కొనసాగుతుంది. దీంతోపాటు కుటుంబంలో ఆనందం విపరీతంగా పెరుగుతుంది. ఈ వారం ప్రయాణాలు చేయాలనుకుంటున్న వ్యక్తులకు విశేషమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కాస్త వీరు ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అలాగే ఆహార సంబంధిత సమస్యలు కూడా రావచ్చు.
మిథున రాశి
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం విశేషమైన ప్రయోజనాలను అందించబోతోంది. ముఖ్యంగా వీరికి కార్యాలయాల్లో విశేషమైన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికపరమైన శ్రేయస్సు లభించడమే కాకుండా.. ప్రయాణాలు చేయడం వల్ల అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. ఇక భాగస్వామ్య జీవితంలో సంబంధాలు మరింత మెరుగుపడతాయి. వ్యాపారాల్లో భాగస్వాములు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా కుటుంబ విషయాలపై అద్భుతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. ఈ సమయంలో కాస్త రిస్కు తీసుకున్నప్పటికీ ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook