Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Yadadri Bhuvanagiri508277

కోతుల భయంతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు

Nov 18, 2024 02:42:23
Mothkur, Telangana
మోత్కూర్ పట్టణ కేంద్రంలో కోతుల బెడద రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రజల బెంబేలెత్తిపోతున్నారు. కోతులు గుంపులుగా బయలుదేరి కాలనీలపై విరుచుకుపడుతున్నాయి. ఇళ్లలోకి చొరబడి వీరంగం సృష్టిస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ప్రజలపై దాడులకు దిగుతూ గాయపరుస్తున్నాయి. బయటికి వెళ్లాలంటే కోతుల భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోతుల నియంత్రణ కోసం చర్యలు చేపట్టాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Feb 18, 2026 12:54:13
Hyderabad, Telangana:

Vijay Devarakonda Vs Rashmika Net Worth: టాలీవుడ్ జోడీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలో వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ, ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. 

ఈ క్రమంలోనే మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా రిసెప్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ స్టార్ కపుల్ సంపాదన, వారి నికర ఆస్తుల విలువ నెట్టింట ఆసక్తిని రేకెత్తిస్తోంది.

విజయ్ దేవరకొండ సంపాదన ఎంతంటే?
విజయ్ దేవరకొండ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్‌ను సృష్టించుకున్నారు. ఆయన నికర ఆస్తుల విలువ సుమారు రూ.70 కోట్లుగా అంచనా. హైదరాబాద్‌లోని విలాసవంతమైన జూబ్లీహిల్స్ ప్రాంతంలో రూ.15 కోట్ల విలువైన భవనంలో ఆయన నివసిస్తున్నారు. 

కేవలం సినిమాల ద్వారానే కాకుండా, తన సొంత నిర్మాణ సంస్థ 'కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్‌టైన్‌మెంట్', ఫ్యాషన్ బ్రాండ్ 'రౌడీ వేర్', వాలీబాల్ టీమ్ 'హైదరాబాద్ బ్లాక్ హాక్స్' సహ-యజమానిగా విజయ్ భారీగా ఆర్జిస్తున్నారు. అంతేకాకుండా, ఆయన గ్యారేజీలో BMW 5 సిరీస్, రేంజ్ రోవర్ వంటి లగ్జరీ కార్లతో పాటు ప్రైవేట్ జెట్ కూడా ఉండటం విశేషం.

రష్మిక ఎంత సంపాదిస్తుందంటే?
మరోవైపు 'నేషనల్ క్రష్' రష్మిక మందన్న సైతం సంపాదనలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం సౌత్, నార్త్ సినిమాలతో బిజీగా ఉన్న ఆమె నికర విలువ సుమారు రూ.66 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరులో రూ.8 కోట్ల విలువైన ఇల్లు మాత్రమే కాకుండా ముంబై, హైదరాబాద్, గోవా, కూర్గ్ ప్రాంతాల్లో ఆమెకు సొంత ఆస్తులు ఉన్నాయి. ఒక్కో సినిమాకు సుమారు రూ.4 కోట్లు వసూలు చేసే రష్మిక వద్ద ఆడి Q3, మెర్సిడెస్ బెంజ్ వంటి ఖరీదైన వాహనాలు ఉన్నాయి. బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా కూడా ఆమె కోట్లలో ఆదాయాన్ని పొందుతోంది.

విజయ్, రష్మికల మొత్తం ఆస్తుల విలువను కలిపి చూస్తే అది సుమారు రూ.136 కోట్లు దాటుతోంది. ఈ జంట తమ వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ అధికారికంగా స్పందించకపోయినప్పటికీ, వారి వెకేషన్ ఫోటోలు, సోషల్ మీడియా పోస్ట్‌లు వారు ప్రేమలో ఉన్నారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అభిమానులు నమ్ముతున్నారు. ఈ నెలాఖరున జరగబోయే వేడుకతో ఈ క్రేజీ కాంబినేషన్ అధికారికంగా ఒక్కటి కాబోతుండటం సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.

Also Read: Madanapalle Girl Incident: బాలిక హత్యాచార నిందితుడు ఆత్మహత్య..మదనపల్లెలో బాణాసంచాతో సంబరాలు!

Also Read: AP 10th Class Hall Ticket 2026: పదో తరగతి విద్యార్థులకు ముఖ్యగమనిక..హాల్‌టికెట్ల విడుదలపై విద్యాశాఖ కీలక నిర్ణయం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 18, 2026 12:50:20
Hyderabad, Telangana:

Money Rain On Bride Video Watch: సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగినప్పటి నుంచి ఏ చిన్న విషయం జరిగిన అది క్షణాల్లోనే ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. తాజాగా పంజాబ్ లోని తార్న్ తరుణ్ లో జరిగిన ఒక పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది. ఈ వేడుకలు వరుడు వధువుపై ఏకంగా రూ. 8.5 కోట్ల నోట్ల  వర్షం కురిపించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అయితే, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఎలాంటి నిజం లేదని వరుడుకి సంబంధించిన కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. 

ఫిబ్రవరి 14వ తేదీన పంజాబ్లోని తరుణ్‌లో గ్రాండ్‌గా పెళ్లి జరిగింది.. పంజాబీ ఆచారాల ప్రకారం వేడుకల్లో నోట్లను గాల్లోకి విసరడం సర్వసాధారణమే.. అయితే, ఈ పెళ్లిలో కూడా అతిథులతో పాటు కుటుంబ సభ్యులు DJ పాటలతో స్టెప్పులు వేస్తూ వధువుపై నోట్ల వర్షం కురిపించారు. దీంతో వివాహ వేదికంత కరెన్సీ నోట్లతో నిండిపోయి ఉండడానికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీనిని చూసి కొందరు ఏకంగా 8.5 కోట్లు ఖర్చు చేశారని పోస్ట్లు పెట్టడంతో సోషల్ మీడియా వినియోగదారులంతా ఆశ్చర్యానికి గురయ్యారు.

అలాగే సోషల్ మీడియాలో వీడియోలు విపరీతంగా వైరల్ అవ్వడంతో కొన్ని నెగిటివ్ వార్తలు కూడా వచ్చాయి. దీంతో వరుడి సోదరుడు సికిందర్ సింగ్ స్పందించారు.. తన సోదరుడు ఆస్ట్రేలియాలోని ట్రక్ బిజినెస్ చేస్తున్నాడని.. ఫిబ్రవరి 14వ తేదీన పెళ్లి జరిగిందని.. ఈ సమయంలో తమ ఆచారాల ప్రకారమే గాల్లో డబ్బులు చల్లారని.. అది కేవలం రెండు లక్షల రూపాయలు మాత్రమేనని అన్నారు. సోషల్ మీడియాలో కోట్లాది రూపాయలని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు..

Read more: Video Viral: వాట్ ఎన్ ఐడియా సర్జీ... స్మార్ట్ ఫోన్ లైట్ తో మహిళ ఏంచేస్తుందో తెలుసా..?.. వీడియో వైరల్..

ఈవెంట్ మేనేజర్ స్పందించారు.. 
ఈ వేడుకలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఈవెంట్ మేనేజర్ తో పాటు డీజే కు సంబంధించిన కొంతమంది సిబ్బంది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కూడా కొట్టి పారేశారు. డాలర్ నోట్లతో కలిసి మొత్తం మీద సుమారు రూ.4 లక్షల వరకు నగదును ఇందులో వినియోగించి ఉండవచ్చని.. వారు తెలిపారు.. అంతేకానీ సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవాలు అసాధ్యమని వారు తెలిపారు. అయితే ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు మిశ్రమంగా స్పందిస్తున్నారు.. 

Read more: Video Viral: వాట్ ఎన్ ఐడియా సర్జీ... స్మార్ట్ ఫోన్ లైట్ తో మహిళ ఏంచేస్తుందో తెలుసా..?.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 18, 2026 12:31:59
Hyderabad, Telangana:

 Paper Boy Video Watch: ఉదయం లేవగానే ఇంటి గుమ్మం ముందు పేపర్ బాయ్ పేపర్ విసరడం మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కానీ ఓ పేపర్ బాయ్ విసిరే విధానం మాత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపరిచేలా చేస్తోంది. వృత్తి పట్ల అతనికున్న అద్భుతమైన ఏకాగ్రత, నైపుణ్యం చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ పేపర్ బాయ్‌కి సంబంధించిన వీడియో ఇంస్టాగ్రామ్ లో ఊహించని స్థాయిలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు 41 మిలియన్లకు పైగా వ్యూస్ తెచ్చుకొని ట్రెండింగ్లో కొనసాగుతోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది? ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంస్టాగ్రామ్ లో పేపర్ బాయ్ దీప్ అనే అకౌంట్ నుంచి పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియోలో సదరు యువకుడు సైకిల్ పై వెళ్తూ అత్యంత వేగంగా.. న్యూస్ పేపర్లను ఎంతో స్పీడ్‌గా గురి తప్పకుండా.. సైకిల్ తొక్కుతూనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. కొన్నిచోట్ల తలుపులు కింద ఉన్న సన్నని సందులో నుంచి కూడా పేపర్ లోపలికి వెళ్లేలా విసురుతున్నాడు. ఇక మరికొన్ని చోట్లనైతే ఇంటి బయట పేపర్ కోసం చూస్తున్న యజమానుల చేతుల్లోకి నేరుగా వెళ్లేలా పేపర్ విసరడం విశేషం.. అతను ఏ మాత్రం తడబాటు లేకుండా సైకిల్ తొక్కుతూనే.. పేపర్ డిస్ట్రిబ్యూట్ చేయడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది.

 
 
 
 
 

ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.  నువ్వు ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్నప్పుడు... రోజు పేపర్ నీ ముందుకు వస్తే, ఆ అనుభూతే వేరు అని.. ఒక సోషల్ మీడియా వినియోగదారుడు కామెంట్ పెడితే.. మరొకరు 2027 సంవత్సరం ఒలంపిక్స్‌లో పేపర్ గ్రోయింగ్ అనే పోటీని కూడా పెట్టాలి కానీ కచ్చితంగా ఇతనికి గోల్డ్ మెడల్ వస్తుందని.. కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది అతని క్రమశిక్షణతో పాటు నైపుణ్యాన్ని చూసి మెచ్చుకుంటున్నారు.  ఏది ఏమైనా ఇలాంటి నైపుణ్యం కొంతమందిలో మాత్రమే ఉంటుంది.

Read more: Video Viral: వాట్ ఎన్ ఐడియా సర్జీ... స్మార్ట్ ఫోన్ లైట్ తో మహిళ ఏంచేస్తుందో తెలుసా..?.. వీడియో వైరల్..

రోజు చేసే సాధారణ పని కూడా.. ఎంత సులభంగా కచ్చితంగా చేయవచ్చో అనేది ఈ యువకుడు నిరూపించేసాడు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్‌లో రికార్డుల వ్యూస్‌ను సంపాదించుకుంది. కేవలం పనిగా కాకుండా.. దానిని ఒక కలల మార్చుకున్న ఈ పేపర్ బాయ్ ఇప్పుడు ఇంటర్నెట్లో సెన్సేషన్‌గా మారారు. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు తమ స్నేహితులకు షేర్ చేస్తూనే ఉన్నారు..

Read more: Video Viral: వాట్ ఎన్ ఐడియా సర్జీ... స్మార్ట్ ఫోన్ లైట్ తో మహిళ ఏంచేస్తుందో తెలుసా..?.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 18, 2026 12:17:59
Nagarkurnool, Telangana:

Nagarkurnool Latest Telugu News: గత కొద్ది రోజుల నుంచి ప్రభుత్వ గురుకులాల్లో విద్యార్థుల స్థితిగతులు దిగజారుతూ వస్తున్నాయి.. ముఖ్యంగా శుభ్రమైన ఆహారం అందించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపణ మరోసారి ఈరోజు నిజమైంది. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావుపూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థులు బుధవారం మధ్యాహ్నం రోడ్డుపై నిరసనకు దిగారి. తమకు పురుగుల అన్నం పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. శ్రీశైలం, హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు..

గత కొంతకాలంగా పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం ఇవ్వడం లేదని.. ముఖ్యంగా మూడు పూటలా వడ్డించే ఆహార పదార్థాల్లో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఫలితం లేకపోవడంతో విద్యార్థులంతా విసిగిపోయి.. పాఠశాల నుంచి బయటికి వచ్చి రహదారిపై ధర్నాకు దిగారు.. దీనివల్ల శ్రీశైలం హైదరాబాద్ హైవే పై కొంత దూరం మేర వాహనాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.

ఆందోళన చేస్తున్న సమయంలో ఎండ తీవ్రత విపరీతంగా ఉండడం కారణంగా.. నలుగురు విద్యార్థులు స్పృహతప్పి పడిపోయినట్లు సమాచారం. వెంటనే అక్కడే ఉన్న స్థానికులు చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కాస్త నిలకడగానే ఉంది.. అలాగే వీరు ధర్నాకు దిగే కంటే ముందు మధ్యాహ్నం భోజనం చేయకపోవడం కారణంగానే.. విద్యార్థులను ఇబ్బంది పడ్డట్లు తెలుస్తోంది.

Read more: Video Viral: వాట్ ఎన్ ఐడియా సర్జీ... స్మార్ట్ ఫోన్ లైట్ తో మహిళ ఏంచేస్తుందో తెలుసా..?.. వీడియో వైరల్..

ప్రిన్సిపల్ పై తీవ్ర ఆరోపణలు..
కొంతమంది విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ.. కనీసం మాకు తినడానికి వీల్లేని భోజనం పెడుతున్నారు.. అడిగితే ప్రిన్సిపల్‌తో పాటు ఉపాధ్యాయులు మమ్మల్ని మానసికంగా ఇబ్బందికి గురి చేస్తున్నారు" అని కొంతమంది విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్ తో పాటు సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.. విషయం తెలుసుకున్న వెల్దండ ఎమ్మార్వో తో పాటు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.. విద్యార్థునులతో సుదీర్ఘ చర్చలు జరిపారు. అంతేకాకుండా ఆహార నాణ్యతను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

Read more: Video Viral: వాట్ ఎన్ ఐడియా సర్జీ... స్మార్ట్ ఫోన్ లైట్ తో మహిళ ఏంచేస్తుందో తెలుసా..?.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 18, 2026 11:28:55
Madanapalle, Arikela, Andhra Pradesh:

Madanapalle Incident Accused Suicide: మదనపల్లెలో బాలికపై జరిగిన హత్యాచారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది. బాలికను దారుణంగా అత్యాచారం చేయడమే కాకుండా ఆ తర్వాత చిన్నారిని హత్య చేసిన ఉదంతంపై ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడైన కులవర్ధన్‌ను నిర్ధాక్షిణంగా వ్యవహరించి, బాలిక మృతికి తగిన న్యాయం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఘటనకు పాల్పడిన కులవర్ధన్ తొలుత పరారీలో ఉండగా.. ఈరోజు ఉదయాన్నే చెరువులో విగతజీవిగా కనిపించాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడని జిల్లా ఎస్పీ నిర్ధారించారు. అయితే నిందితుడు కులవర్ధన్ మృతిపట్ల స్థానికులు సంబరాలు చేసుకుంటున్నారు. రాక్షసుడికి తగిన గతి జరిగిందని టపాసులు కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

ఏం జరిగిందంటే?
స్థానికులు, పోలీసులు కథనం ప్రకారం.. నిన్న (మంగళవారం) మదనపల్లె పరిధిలో ఒక మైనర్ బాలికపై హత్యాచారం జరిగింది. కులవర్ధన్ అనే ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడడమే కాకుండా ఆ తర్వాత ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో రోడ్లపై ఆందోళన చేపట్టారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అయితే తొలుత నిందితుడు కులవర్ధన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలో అతడు తప్పించుకున్నాడు. 

నిందితుడు పరారీలో ఉండడం వల్ల అతడి కోసం వెతికేందుకు జిల్లా యంత్రాంగం తీవ్రంగా శ్రమించింది. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగగా.. వారంతా మదనపల్లెను జల్లెడ పట్టారు. చివరికి డ్రోన్లు, డాగ్ స్క్వాడ్స్‌ను కూడా రంగంలోకి దించినట్లు తెలిసింది.

అలా నిందితుడు కులవర్ధన్ ఆచూకీ కోసం వెతుకుతున్న తరుణంలో బుధవారం అనగా ఫిబ్రవరి 18న ఉదయం స్థానిక చెరుపులో ఓ మృతదేహం తేలియాడుతూ ఉంది. అది నిందితుడే అని పోలీసులు నిర్ధారించారు. పోలీసుల చెర నుంచి తప్పించుకున్న నిందితుడు.. భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ వెల్లడించారు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

నిందితుడు కులవర్ధన్ మృతిపట్ల మృతురాలు బాలిక తల్లి స్పందించింది. కులవర్ధన్ బతికే ఉంటే తానే చంపేదాన్ని అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అతడి మృతి పట్ల మదనపల్లెలో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. చిన్నారిని బలి తీసుకున్న కిరాతకుడు మట్టికరిచిపోయాడని ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

Also Read: AP 10th Class Hall Ticket 2026: పదో తరగతి విద్యార్థులకు ముఖ్యగమనిక..హాల్‌టికెట్ల విడుదలపై విద్యాశాఖ కీలక నిర్ణయం!

Also Read: Shubman Gill Dance Video: సచిన్ కొడుకు పెళ్లి వేడుకల్లో టీమ్ఇండియా కెప్టెన్ డ్యాన్సులు.."అంతా బామ్మర్ది కోసమేనా?"

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 18, 2026 10:45:41
Nunna, Vijayawada, Andhra Pradesh:

AP 10th Class Hall Ticket 2026 Release Date: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సమయం ఆసన్నమైంది. మార్చి 16 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తొలుత ఇంటర్ పరీక్షలు నిర్వహించి.. వచ్చే నెలలో పదో తరగతి ఎగ్జామ్స్ జరిపేందుకు ఏపీ విద్యాశాఖ ప్రణాళిక రచించింది. అయితే ఈ క్రమంలో మార్చి మొదటి వారంలో హాల్ టికెట్లు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. 

ఈ క్రమంలో హాల్ టికెట్లపై విద్యార్థుల ఇంటి పేరు,  పుట్టినతేదీ వంటి వివరాల్లో ఎలాంటి తప్పులున్నా వాటి సవరణల కోసం అవకాశం కల్పిస్తామని ఏపీ విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇలాంటి సమస్యలున్న విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పరీక్షలు పూర్తైన తర్వాత కూడా మార్క్స్ మెమో ఇచ్చే సమయంలో వివరాలను సవరణ చేసుకునేందుకు వీలుందని అధికారులు తెలియజేశారు. 

అయితే పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి మార్చి 30 తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల మధ్య పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల అనంతరం ఏప్రిల్ 4 నుంచి పదో తరగతి జవాబు పత్రాలు మూల్యాంకనం జరగనుంది. ఇదే విషయాన్ని ప్రభుత్వ పరీక్షల విభాగం స్పష్టం చేసింది. ఈ మ్యూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు 10 రోజుల పాటు కొనసాగుతుందట.

ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2026 టైమ్‌టేబుల్..
మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు)
మార్చి 18న సెకండ్ లాంగ్వేజ్ (హిందీ)
మార్చి 21న ఇంగ్లీష్ (మార్చి 20 నుంచి 21కి పరీక్ష తేదీ మారింది)
మార్చి 23న మ్యాథమెటిక్స్‌
మార్చి 25న ఫిజికల్ సైన్స్
మార్చి 28న బయాలజికల్ సైన్స్
మార్చి 30న సోషల్ స్టడీస్.

Also REad: Shubman Gill Dance Video: సచిన్ కొడుకు పెళ్లి వేడుకల్లో టీమ్ఇండియా కెప్టెన్ డ్యాన్సులు.."అంతా బామ్మర్ది కోసమేనా?"

Also Read: Dinesh Karthik On Virat Kohli: "కోహ్లీతో బాబర్ ఆజమ్‌కు పోలికేంటి?" మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక సంచనల వ్యాఖ్యలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 18, 2026 09:46:40
Hyderabad, Telangana:

Infinix Note Edge 5g Price: ప్రముఖ ఇన్ఫినిక్స్ బ్రాండ్‌ తమ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీనిని కంపెనీ ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్‌ పేరుతో లాంచ్‌ చేసింది. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో పాటు ప్రీమియం కెమెరా సెటప్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ముఖ్యంగా ఇందులోని ప్రధాన కెమెరా 50-మెగాపిక్సెల్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అన్ని రకాల ఫీచర్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్‌ ప్రీమియం 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన 6500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతో పాటు ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 6nm ప్రాసెసర్‌తో లభిస్తోంది. ఇది IP65 రేటింగ్‌ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది. ఇది మొత్తం మూడు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులోని బేస్‌ వేరియంట్‌ 6GB + 128GB స్టోరేజ్‌తో ధర రూ.21,999తో లభిస్తోంది..

ఇక రెండ వేరియంట్‌ 8GB + 128GB స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. మూడవ వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌ 8GB + 256GB స్టోరేజ్ రూ.25,999తో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫిబ్రవరి 25వ తేదిన ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇన్ఫినిక్స్ ఇండియాలో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు లాంచింగ్‌ ఆఫర్స్‌లో భాగంగా ICICI బ్యాంక్, SBI కార్డ్‌లను వినియోగించి పేమెంట్‌ చేసేవారికి రూ.2,000 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌పై ఏకంగా రూ.2 వేల వరకు అదనపు బోనస్‌ కూడా లభిస్తుంది. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ ఫీచర్స్‌ వివరాలు..
ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. 6.78-అంగుళాల 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 2644×1208 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. అలాగే 4500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంది. ఇక ఇందులో కంపెనీ ప్రత్యేకమైన 2160Hz PWM డిమ్మింగ్‌ను ఆప్షన్‌ను కూడా అందిస్తోంది..

డిస్ప్లే  ప్రొటక్షన్‌ కోసం ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటక్షన్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఇది మాలి-G610 GPUతో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 6nm ప్రాసెసర్‌తో లభిస్తోంది. ముఖ్యంగా మల్టీ టాస్కింగ్‌ చేయాలనుకునేవారికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఇది చాలా ప్రత్యేకమైన Android 16 ఆధారంగా XOS 16 ఆపరేటింగ్‌పై రన్‌ అవుతుంది. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Feb 18, 2026 08:45:27
Hyderabad, Telangana:

Shubman Gill Dance In Arjun Tendulkar Pre Wedding: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ క్రమంలో జరిగిన ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం క్రికెట్ షెడ్యూల్ బిజీగా ఉన్నప్పటికీ, అర్జున్ టెండూల్కర్ వేడుకల కోసం గిల్ ప్రత్యేకంగా హాజరయ్యారు. అక్కడ ఆయన చేసిన డ్యాన్స్ అభిమానులను అలరిస్తోంది.

వైరల్ అవుతున్న వీడియోలో గిల్ పూర్తి 'ఫన్ మూడ్'లో కనిపించారు. బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ 'మౌజా హీ మౌజా' (జబ్ వి మెట్) కు గిల్ అదిరిపోయే స్టెప్పులు వేశారు. బ్రౌన్ కలర్ బంద్‌గలా సూట్, మెడలో స్టైలిష్ మఫ్లర్ ధరించి గిల్ చాలా హుందాగా కనిపించారు. మైదానంలోనే కాదు, డాన్స్ ఫ్లోర్‌పై కూడా గిల్ 200 స్ట్రైక్ రేట్‌తో అదరగొడుతున్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ వీడియోపై కొందరు ఇది ఆయన బంధువుల పెళ్లి వీడియో అని చెబుతున్నా.. నెట్టింట మాత్రం అర్జున్ ప్రీ-వెడ్డింగ్ వీడియోగానే వైరల్ అవుతోంది.

అర్జున్ టెండూల్కర్ పెళ్లి ఎవరితో? ఎప్పుడు?
అర్జున్ టెండూల్కర్ తన లాంగ్‌టైమ్ పార్ట్నర్ సానియా చండోక్‌ను పెళ్లాడబోతున్నారు. 2026 మార్చి 5న ముంబైలో ఈ వివాహం జరగనుంది. సానియా చండోక్ ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘై మనవరాలు. వీరి కుటుంబానికి క్వాలిటీ ఐస్‌క్రీమ్, బాస్కిన్ రాబిన్స్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లతో అనుబంధం ఉంది.

సచిన్ తన కుమారుడి పెళ్లిని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉన్న ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హోం మంత్రి అమిత్ షా వంటి వారికి ఇప్పటికే ఆహ్వానాలు అందినట్లు సమాచారం. అలాగే క్రీడా రంగంలో ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ వంటి క్రికెట్ స్టార్స్ హాజరుకానున్నారు. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ కలిసి డాన్స్ ఫ్లోర్‌పై స్టెప్పులు వేస్తే చూడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

అర్జున్ టెండూల్కర్ కొత్త ఇన్నింగ్స్
2026 సంవత్సరం అర్జున్‌కు వ్యక్తిగతంగానే కాకుండా ప్రొఫెషనల్‌గా కూడా చాలా కీలకం. వివాహంతో పాటు, ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆయన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తరపున బరిలోకి దిగనున్నారు. సచిన్ తనయుడి పెళ్లి వేడుకలు ఇప్పటికే జామ్‌నగర్‌లో అంబానీ కుటుంబంతో కలిసి ప్రారంభమయ్యాయి. మార్చి 5న జరగబోయే ఈ మెగా వెడ్డింగ్ కోసం క్రికెట్, సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Also Read: AP New Voter Amendment Bill: రాష్ట్రంలోని యువతకు గుడ్‌న్యూస్..కొత్త బిల్లుకు అసెంబ్లీ ఆమోదం..ఏడాదికి నాలుగుసార్లు ఓటు నమోదు!

Also Read: Dinesh Karthik On Virat Kohli: "కోహ్లీతో బాబర్ ఆజమ్‌కు పోలికేంటి?" మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక సంచనల వ్యాఖ్యలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 18, 2026 08:40:18
Hyderabad, Telangana:

Pharmacist Grade 2 Candidates Telugu News: తెలంగాణ రాష్ట్రంలో ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌ 2 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అందని ద్రాక్షలా మారింది.. అభ్యర్థులు పరీక్షలు ఎన్నో నెలలు అవుతున్న ఫలితాల విడుదలపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో వేల సంఖ్యలో ఉన్న అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారుల చుట్టూ రోజు తీరుగుతున్నా.. వచ్చే నేల, వచ్చే నెల అంటూనే సమాధానమే తప్ప.. ఎలాంటి వాస్తవ రూపంలో ఫలితాలు రాకపోవడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

ఈ ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పరీక్షకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 24,000 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష రాసి చాలా రోజులు గడుస్తున్నా.. కనీసం ప్రథమిక సమాచారం లేకపోవడంతో అభ్యర్థులు మండిపడుతున్నారు. రిజల్ట్స్‌ వస్తే.. మాకు ఉద్యోగం వస్తుందో లేదో తెలుస్తుంది.. దాన్ని బట్టి మా భవిష్యత్‌ ప్రణాళిక చేసుకుంటాం.. కానీ ఇలా కాలయాపన చయడం వల్ల చాలా మానసిక ఒత్తిడికి గురవుతున్నాం.. అని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ నోటిఫికేషన్‌ చాలా మంది అభ్యర్థుల జీవితాల్లో ఊహించని సంక్షోభాన్ని సృష్టిస్తోంది.. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా చేసుకుని చాలా మంది ఎంతో కష్టపడి ప్రిపేర్‌ అయ్యారు. అయితే, ఈ సమయంలో చాలా మంది అభ్యర్థులు తాము చేస్తున్న ప్రైవేట్‌ ఫార్మా కంపెనీలతో పాటు ఆసుపత్రుల్లోని ఉద్యోగాలను వదులుకున్నారు. చాలా మంది అభ్యర్థులు మీడియాతో మాట్లాడుతూ..నమ్మకంతో ఉద్యోగం వదిలాం.. ఇప్పుడు అటు ప్రైవేట్ లేక, ఇటు సర్కారు ఉద్యోగాలు రాక నడిరోడ్డుపై నిలబడ్డాం.. అంటూ కన్నీటి పర్యంతమయ్యారు..

Also Read: Nampally Court: నాంపల్లి CBI కోర్టు వద్ద హై అలర్ట్.. బాంబు బెదిరింపుతో ఉద్రిక్తత!

అభ్యర్థులు తాజాగా ప్రభుత్వంతో పాటు బోర్డుకు అల్టిమేటం జారీ చేశారు. ఎన్నిసార్లు చెప్పటిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. మర్చి నెలాఖరు లోపు ఫలితాలు విడుదల చేయకపోతే.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అలాగే కొన్ని డిమాండ్లను కూడా వారు ముందుకు తీసుకు వచ్చారు. ఇందులో మొదటిది.. మార్చి 31లోపు ఫార్మసిస్ట్ గ్రేడ్-2 తుది ఫలితాలను వెల్లడించాలి. రెండవది నియామక ప్రక్రియలో పారదర్శకత పాటించాలి. మూడవది అభ్యర్థుల వయోపరిమితిని దృష్టిలో ఉంచుకుని వెంటనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించాలి.

Also Read: Nampally Court: నాంపల్లి CBI కోర్టు వద్ద హై అలర్ట్.. బాంబు బెదిరింపుతో ఉద్రిక్తత!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 18, 2026 08:38:14
Amaravathi, Andhra Pradesh:

AP Assembly New Voter Amendment Bill: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. యువతకు ఓటు హక్కు కల్పించడంలో ఉన్న సాంకేతిక ఇబ్బందులను తొలగిస్తూ రూపొందించిన 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ సవరణ బిల్లు-2026'కు సభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఓటు హక్కు కల్పించే ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ, కేంద్ర చట్టంతో అనుసంధానిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

బిల్లు ప్రవేశం, ఆమోదం
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తరపున పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యులందరూ బిల్లుకు మద్దతు పలికారు. గతంలో డిసెంబర్ 23, 2025న ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు ప్రస్తుతం సభలో చట్టబద్ధత లభించింది.

చారిత్రాత్మక మార్పు - యువతకు మేలు
గతంలో పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితాలో పేరు నమోదుకు కేవలం జనవరి 1ని మాత్రమే కటాఫ్ తేదీగా పరిగణించేవారు. తాజా సవరణతో ఆ నిబంధన మారింది. ఇకపై ఏటా నాలుగు తేదీల్లో (జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1) 18 ఏళ్లు నిండిన యువత తమ ఓటు హక్కును నమోదు చేసుకోవచ్చు. దీనివల్ల జనవరి 2న 18 ఏళ్లు నిండిన వారు మరో ఏడాది పాటు వేచి చూడాల్సిన అవసరం ఉండదు. పార్లమెంట్, అసెంబ్లీ, మున్సిపాలిటీ ఎన్నికల తరహాలోనే పంచాయతీలకు కూడా ఒకే విధమైన ఓటర్ల జాబితా విధానం అమల్లోకి వస్తుంది.

చర్చలో పాల్గొన్న సభ్యుల సూచనలు
ఈ బిల్లుపై జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు లోకం నాగ మాధవి, ఎన్. ఈశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. వారు ప్రధానంగా కింది అంశాలను లేవనెత్తారు. ఓటర్ల జాబితాలో అక్రమాలను పూర్తిస్థాయిలో తొలగించి, పారదర్శకమైన జాబితాను రూపొందించాలని సూచించారు. సభ్యుల సూచనలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి, అక్రమ ఓట్ల తొలగింపుపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు.

ఈ సవరణ బిల్లు వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది యువతకు త్వరితగతిన ఓటు హక్కు లభించడమే కాకుండా, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుంది. కేంద్ర చట్టంతో అనుసంధానించడం ద్వారా ఎన్నికల నిర్వహణలో గందరగోళం తొలగిపోనుంది.

Also Read: Dinesh Karthik On Virat Kohli: "కోహ్లీతో బాబర్ ఆజమ్‌కు పోలికేంటి?" మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక సంచనల వ్యాఖ్యలు!

Also REad: Best AC in India: వేసవిలో ఏసీ కొనాలనుకుంటున్నారా? 3-స్టార్ vs 5-స్టార్..మీ ఇంటికి ఏది బెటర్?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 18, 2026 07:57:28
Hyderabad, Telangana:

Dinesh Karthik On Babar Azam: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్థాన్‌పై టీమ్ ఇండియా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బాబర్‌ను భారత రన్ మెషిన్ విరాట్ కోహ్లీతో పోల్చడంపై టీమ్ ఇండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఘాటుగా స్పందించారు. పాకిస్థాన్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో ఘోర విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో బాబర్ అజామ్ కేవలం 5 పరుగులకే (7 బంతుల్లో) పెవిలియన్ చేరడం చర్చనీయాంశమైంది.

అది కోహ్లీకి అన్యాయం చేసినట్లే!
దినేశ్ కార్తీక్ ఒక క్రీడా విశ్లేషణలో మాట్లాడుతూ.. బాబర్‌ను కోహ్లీతో పోల్చడాన్ని తప్పుబట్టారు. "చాలా కాలంగా బాబర్‌ను విరాట్‌తో పోల్చుతున్నారు, అది చాలా అన్యాయం. విరాట్ ఎప్పుడూ బాబర్‌లా నిర్లక్ష్యంగా షాట్లు ఆడటం నేను చూడలేదు" అని కార్తీక్ వ్యాఖ్యానించారు. బాబర్ షాట్ సెలక్షన్ చాలా పేలవంగా ఉందని, అతడిలో జట్టును గెలిపించగలననే ఆత్మవిశ్వాసం కనిపించడం లేదని విశ్లేషించారు.

గొప్ప క్రికెటర్‌కు ఉండాల్సిన లక్షణాలను వివరిస్తూ కార్తీక్ కింది విధంగా అన్నారు. "ఒత్తిడిలో రాణించడమే గొప్ప ఆటగాడి లక్షణం. కానీ బాబర్‌పై నాకు ఆ నమ్మకం కలగడం లేదు. అతడిలో అత్యుత్తమ క్రికెటర్ లక్షణాలు నాకు కనిపించలేదు" ఇదే క్రమంలో యువ ఆటగాడు అభిషేక్ శర్మపై డీకే ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం అభిషేక్ శర్మ ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్ అని తాను భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

కోహ్లీ మెల్‌బోర్న్ ఇన్నింగ్స్..
విరాట్ కోహ్లీ ఒత్తిడిలో ఎలా ఆడతారో చెప్పడానికి 2022 టీ20 ప్రపంచకప్‌లో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌ను ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు (నాటౌట్) చేసి అసాధ్యమైన విజయాన్ని సుసాధ్యం చేశారు. 160 పరుగుల ఛేదనలో టీమ్ ఇండియాను ఒంటిచేత్తో గెలిపించి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. అలాంటి ఇన్నింగ్స్‌లు ఆడటంలో కోహ్లీకి సాటి ఎవరూ లేరని దినేశ్ కార్తిక్ అభిప్రాయపడ్డారు.

Also Read: Madanapalle Girl Incident: మదనపల్లె చిన్నారి హత్య కేసులో కీలక మలుపు..నిందుతుడు కులవర్ధన్ చెరువులో శవమై లభ్యం!

Also Read: Best AC in India: వేసవిలో ఏసీ కొనాలనుకుంటున్నారా? 3-స్టార్ vs 5-స్టార్..మీ ఇంటికి ఏది బెటర్?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 18, 2026 07:45:38
Hyderabad, Telangana:

Nampally Court Latest News: హైదరాబాద్‌ నగరంలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. భాగ్యనగరంలో అత్యంత ప్రధానమైన నాంపల్లి CBI కోర్టుకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు వచ్చాయి.. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు సమాచారం.. కోర్టు ప్రధాన బిల్డింగ్‌లో ప్రత్యేకమైన బాంబు అమర్చామని.. కొద్దిసేపట్లోనే బ్లాస్ట్‌ అవుతుందని వచ్చిన సమాచారంతో అటు పోలీసులతో పాటు ఇటు న్యాయవాదులు తీవ్ర భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం..

జరిగింది ఇదే..
బుధవారం ఉదయం కోర్టుకు సంబంధించిన అన్ని పనులు మొదలు కాగానే..కొద్దిసేపటికే అధికారులకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.. అయితే, ఈ మెయిల్‌లో సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కోర్టు ఆవరంలో బాంబ్‌ బ్లాస్‌ అవుతుందని రాశారు. అయితే, ఈ సమాచారం తెలిసిన వెంటనే నాంపల్లి పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. దీనికి ముందు జాగ్రత్తగా కోర్టు భవనంలోని నాయమూర్తులతో పాటు సిబ్బంది, న్యాయవాదులు వెంటనే బయటకు వచ్చారు. అంతేకాకుండా పోలీసులు వెంటనే ప్రాంగణాన్ని ఖాళీ చేశారు. 

రంగంలోకి బాంబ్ స్క్వాడ్..
పరిస్థితులు తీవ్రతరం కాకుండా ముందుగానే ఉన్నతాధికారులు కోర్టుకు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDS)తో పాటు డాగ్ స్క్వాడ్ బృందాలను కూడా పంపించిన్నట్లు తెలుస్తోంది. దాదాపు 2 నుంచి 3 గంటల పాటు కోర్టులోని ప్రతి రూమ్‌ని, పార్కింగ్‌ ఏరియాను, క్యాంటీన్‌ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అనుమానాస్పద వస్తువుల కోసం అధికారులు అణువణువూ గాలించారు. ఈ సోదాల సమయంలో కోర్టు కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోవడంతో న్యాయవాదులు ఇబ్బంది పడినట్లు సమాచారం..

Also Read: Tata Motors EV Discount: టాటా EVలపై బంపర్ ఆఫర్..ఒక్కో కారుపై రూ.3.80 లక్షలు తగ్గింపు?! ఏ కార్లపై ఈ ఆఫర్!

ఊపిరి పీల్చుకున్న అధికారులు..
కోర్టును మొత్తం తనిఖీలు చేసిన అధికారులు అనంతరం కోర్టులో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవవడంతో అధికారులు ఇది ఫేక్‌ మెయిల్‌గా తేల్చినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దార్యప్తు ప్రారంభించారు. ఈ మెయిల్‌ ఎక్కడి నుంచి వచ్చిందో? పంపిన వ్యక్తి ఎవరు? అనే కోణంలో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు. 

Also Read: Tata Motors EV Discount: టాటా EVలపై బంపర్ ఆఫర్..ఒక్కో కారుపై రూ.3.80 లక్షలు తగ్గింపు?! ఏ కార్లపై ఈ ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 18, 2026 07:18:12
Hyderabad, Telangana:

3 star or 5 Star AC Which Is Better: వేసవి కాలం వచ్చేస్తోంది.. భానుడి భగభగలకు చెక్ పెట్టేందుకు చాలా మంది ఏసీల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఏసీ కొనడానికి వెళ్ళినప్పుడు ఎదురయ్యే అతిపెద్ద సందేహం.. '3 స్టార్ ఏసీ తీసుకోవాలా? లేక 5 స్టార్ ఏసీ బెటరా?' అనేది. ఏసీ రేటింగ్‌ను భారతదేశంలో BEE (Bureau of Energy Efficiency) నిర్ణయిస్తుంది. స్టార్స్ ఎక్కువగా ఉంటే విద్యుత్ ఆదా అంత ఎక్కువగా ఉంటుందని అర్థం.

3-స్టార్ ఏసీ (తక్కువ ధర - ఎక్కువ బిల్లు)
3-స్టార్ ఏసీ దీని ప్రారంభ ధర 5-స్టార్ ఏసీ కంటే తక్కువగా ఉంటుంది. బడ్జెట్ తక్కువగా ఉన్నవారికి ఇది మంచి ఆప్షన్. ఇది 5-స్టార్ ఏసీ కంటే ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. ఫలితంగా నెలవారీ కరెంటు బిల్లు భారంగా మారుతుంది. మీరు ఏసీని రోజుకు కేవలం 2-3 గంటలు మాత్రమే వాడితే లేదా సంవత్సరంలో కేవలం రెండు నెలలు మాత్రమే ఉపయోగిస్తే 3-స్టార్ ఏసీ సరిపోతుంది.

5-స్టార్ ఏసీ (ఎక్కువ ధర - భారీ పొదుపు)
ఇది అత్యంత శక్తి సామర్థ్యం కలిగినది. 3-స్టార్ ఏసీతో పోలిస్తే కరెంటు బిల్లులో ఏటా వేల రూపాయలు ఆదా చేస్తుంది. దీని కొనుగోలు ధర 3-స్టార్ మోడల్ కంటే దాదాపు రూ.5,000 నుండి రూ.10,000 వరకు ఎక్కువగా ఉండవచ్చు. మీరు రోజుకు 6 నుండి 8 గంటల కంటే ఎక్కువ సమయం ఏసీని ఉపయోగిస్తుంటే, 5-స్టార్ ఏసీయే బెస్ట్. మీరు పెట్టిన అదనపు పెట్టుబడి 2-3 ఏళ్లలోనే కరెంటు బిల్లుల పొదుపు రూపంలో తిరిగి వచ్చేస్తుంది.

స్టార్ రేటింగ్‌తో పాటు ఇవి కూడా ముఖ్యం..
కేవలం స్టార్ రేటింగ్ చూస్తే సరిపోదు, ఏసీ పనితీరు బాగుండాలంటే కింది విషయాలు గమనించాలి. గది చిన్నదైతే 1 టన్, మీడియం అయితే 1.5 టన్, పెద్ద హాల్ అయితే 2 టన్నుల ఏసీని ఎంచుకోవాలి. తప్పు టన్నేజ్ ఎంచుకుంటే 5-స్టార్ ఏసీ కూడా ఎక్కువ బిల్లును ఇస్తుంది. ఇన్వర్టర్ ఏసీలు కంప్రెసర్ వేగాన్ని నియంత్రిస్తాయి. దీనివల్ల విద్యుత్ ఆదా అవ్వడమే కాకుండా గదిలో ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. 

మంచి సర్వీస్ నెట్‌వర్క్ ఉన్న బ్రాండ్‌ను ఎంచుకోవడం వల్ల భవిష్యత్తులో రిపేర్ ఖర్చులు తగ్గుతాయి. మీరు ఏసీని దీర్ఘకాలం (5-8 ఏళ్లు) వాడాలని ప్లాన్ చేస్తే, కళ్లు మూసుకుని 5-స్టార్ ఏసీ తీసుకోవడం తెలివైన పని. తక్కువ వాడకం ఉన్నవారికి మాత్రమే 3-స్టార్ ఏసీ ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

Also Read: Madanapalle Girl Incident: మదనపల్లె చిన్నారి హత్య కేసులో కీలక మలుపు..నిందుతుడు కులవర్ధన్ చెరువులో శవమై లభ్యం!

Also REad: Chiranjeevi Shoulder Surgery: మెగాస్టార్‌ భుజానికి తీవ్ర గాయం?! అంతలోనే హాస్పటల్‌లో సర్జరీ..చిరంజీవి ఏమన్నారంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 18, 2026 05:50:39
Madanapalle, Arikela, Andhra Pradesh:

Madanapalle Child Murder Case: మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారిపై జరిగిన అమానుష ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హేయమైన చర్యకు పాల్పడిన నిందితుడు కులవర్ధన్ (30) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. బాలికను అత్యంత కిరాతకంగా పొట్టనబెట్టుకున్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, చివరకు కురబలకోట మండలంలో అతడి మృతదేహం లభ్యమైంది.
 
స్థానికుల కథనం ప్రకారం.. కురబలకోట మండలం కనసానివారి పల్లె చెరువులో నిందితుడు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ, నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆదేశించిన తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

అసలేం జరిగింది?
రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారి సోమవారం బడికి సెలవు కావడంతో ఇంటి వద్ద ఆడుకుంటోంది. సాయంత్రం 4 గంటల సమయంలో తల్లి ఫోన్ చేయగా పాప కనిపించడం లేదని కుటుంబ సభ్యులు గుర్తించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టారు. బాలిక చివరిసారిగా ఎదురింట్లో ఉండే కులవర్ధన్‌తో కనిపించిందని పాప తాత సమాచారం ఇచ్చారు.

మంగళవారం ఉదయం కులవర్ధన్ ఇంటి తలుపులు బద్దలు కొట్టి చూడగా, నీళ్ల డ్రమ్ములో చిన్నారి విగతజీవిగా పడి ఉంది. నిందితుడు పాపపై అత్యాచారం చేసి, ఆపై నీటి డ్రమ్ములో ముంచి చంపేసి, అదే గదిలో రాత్రంతా నిద్రపోవడం కలచివేసింది.

నిందితుడి నేర చరిత్ర
పోలీసుల విచారణలో నిందితుడు కులవర్ధన్ గురించి దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు గంజాయికి అలవాటు పడినట్లు పోలీసులు తేల్చారు. ఇతనిపై గతంలో కూడా పలు క్రిమినల్ ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. గంజాయి మత్తులో ఏమీ తెలియని చిన్నారిపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

ఈ ఘటనతో మదనపల్లె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిందితుడు పోలీసులకు దొరకకముందే ఆత్మహత్య చేసుకున్నప్పటికీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Chiranjeevi Shoulder Surgery: మెగాస్టార్‌ భుజానికి తీవ్ర గాయం?! అంతలోనే హాస్పటల్‌లో సర్జరీ..చిరంజీవి ఏమన్నారంటే?

Also Read: Tata Motors EV Discount: టాటా EVలపై బంపర్ ఆఫర్..ఒక్కో కారుపై రూ.3.80 లక్షలు తగ్గింపు?! ఏ కార్లపై ఈ ఆఫర్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 18, 2026 05:37:00
Hyderabad, Telangana:

Most Romantic Zodiac Signs Telugu: ప్రేమ అనే భావన రాశిచక్రాలపై కూడా ఆధారపడి ఉంటుందంటే మీరు నమ్ముతారా? తప్పకుండా నమ్మాల్సిందే.. ఎందుకంటే రాశి ఫలాలపై కూడా కొన్ని సార్లు ప్రేమ, వ్యక్తిగత జీవితం ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొన్ని రాశులవారు ఎల్లప్పుడు జీవితభాగస్వామితో ప్రేమగా కూడా ఉంటారు. అయితే, ఆ రాశులేంటో వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారు ఎల్లప్పుడు ప్రేమగా ఉంటారు..
తుల రాశి: 
తుల రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం చాలా శృంగారభరితంగా ఉంటుంది. అంతేకాకుండా వీరు మానసికంగా భాగస్వామితో చాలా సంతోషంగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు సంబంధాల్లో అవగాహన కూడా చాలా ప్రాముఖ్యతను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా చిన్న చిన్న సమస్యలు అప్పుడప్పుడు వచ్చినప్పటికీ ఎన్నో రకాలుగా పరిష్కారం కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వీరు చాలా సున్నితంగా ఉంటారు. అలాగే వీరు భాగస్వామితో కూడా ఎంతో ఆరోగ్యంగా జీవితం కొనసాగిస్తారు. 

వృషభ రాశి:  
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా మంచి భాగస్వాములు లభిస్తూ ఉంటారు. అంతేకాకుండా తమ భాగస్వామి భావాలను కూడా ఎంతో సులభంగా బాగా అర్థం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు అభిప్రాయభేదాలు కూడా లభిస్తాయి. వీరు చిన్ని చిన్న విషయాల్లో కూడా భాగస్వామితో చాలా ప్రేమగా ఉంటారు. అంతేకాకుండా వీరు కుంటుంబ పట్ల బాధ్యతాయుతంగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ వృషభ రాశివారు చాలా సంతోషంగా జీవిస్తారు. 

సింహ రాశి: 
సింహ రాశిలో జన్మించిన వ్యక్తులు కూడా చాలా రొమాంటిక్‌గా ఉంటారు. వీరు తమ ప్రేమను వక్తపరచడంలో ఎప్పుడూ ముందుంటారు. అంతేకాకుండా తమ భాగస్వామిని కూడా ఎప్పుడు ప్రశంసిస్తునే ఉంటారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే వీరు తమ భాగస్వామిని ఆశ్చర్యపరిచేందుకు కూడా చాలా అసక్తి చూపుతూ ఉంటారు. వీరికి ప్రతిరోజూ కొత్త కొత్త సంఘటనలు కూడా జరుగుతూనే ఉంటాయి. దీని వల్ల వీరు మనసులో ఉన్న ప్రేమను కూడా చూపించగలుగుతారు. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

వృశ్చిక రాశి:  
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు భాగస్వామ్య జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా వీరు చాలా నిజాయితీపరులుగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే వీరికి విశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. వారు తమ భాగస్వాములతో ప్రేమగా ఉండేందుకు ఇష్టపడతారు. ఈ రాశివారు భాగస్వామితో ఎల్లప్పుడూ ఒకరికొకరు ఎంతో అండగా కూడా ఉండేందుకు ఇష్టపడతారు. అలాగే వ్యక్తిగత జీవితంలో సమస్యలు కూడా ఎప్పటికప్పుడు పూర్తిగా పరిష్కారం అవుతూనే ఉంటాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
Advertisement
Back to top