icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

AP Capital Issue: 12 ఏళ్లు గడుస్తున్నా ఏపీ రాజధానిపై నో క్లారిటీ! రాజధాని లేకపోవడానికి కారణం వాళ్లేనా?

Vijayawada, Andhra Pradesh:

AP Capital Issue News: ఆంధ్రప్రదేశ్ పునవ్యవస్థీకరణ జరిగి 2014 నుంచి ఇప్పటివరకు 12 ఏళ్లు గడుస్తున్నా రాష్ట్రానికి ఒక ఖచ్చితమైన, పూర్తిస్థాయి రాజధాని నగరం రూపుదిద్దుకునే మార్గం కుదరలేదు. రాజకీయ అస్థిరత ప్రభుత్వాలు మారినప్పుడల్లా మారిన విధానాలు, వ్యూహాత్మక లోపాలే ప్రధాన కారణాలుగా వస్తున్నాయి. దీనికి ఏ ఒక్కరిని బాధ్యులు చేయడం కంటే, రెండు వేరువేరు ప్రభుత్వాల పరస్పర అభివృద్ధి నిర్ణయాలను విశ్లేషించాల్సి ఉంటుంది. 

టీడీపీ ప్రభుత్వం (2014-19)
ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రపంచ స్థాయి మెగాసిటీగా నిర్మించాలని సంకల్పించారు. దాదాపు 33 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించడం ఒక రికార్డు. అయితే సింగపూర్ మాస్టర్ ప్లాన్, గ్రాఫిక్స్, అంతర్జాతీయ డిజైన్ చుట్టూ కథ నడపడంతో ప్రాజెక్టు ప్రారంభం కావడానికి చాలా సమయం పట్టింది. 

తాత్కాలిక భవనాలకే పరిమితం..
ఐదేళ్ల కాలంలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి తాత్కాలిక భవనాలను నిర్మించినప్పటికీ.. శాశ్వత రాజధాని నిర్మాణ పనులు పునాదులు దశలోనే ఉండిపోయాయి. 2019 నాటికి కనీసం ఒక ఐకానిక్ భవనం కూడా పూర్తి కాకపోవడం ప్రతికూలంగా మారింది. 

వైసీపీ మూడు రాజధానుల ప్రయోగం (2019-2024)
2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం, చంద్రబాబు కలలో ప్రాజెక్టు అయినా అమరావతిని పూర్తిగా పక్కన పెట్టింది. అమరావతిలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. అందులో విశాఖ నుంచి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి నుంచి లెజిస్లెటివ్ క్యాపిటల్, కర్నూలు నుంచి జ్యూడిషల్ క్యాపిటల్.. ఈ విధంగా మూడు రాజధానులు అంశాన్ని వైసీపీ ప్రతిపాదించింది. 

ఈ నిర్ణయం వల్ల అమరావతి పనులు పూర్తిగా ఆగిపోయాయి. అటు విశాఖలోను పనులు సాగలేదు. భూములు ్ఇచ్చిన రైతులు కోర్టుకు వెళ్ళటం, హైకోర్టు తీర్పులు, సుప్రీంకోర్టు స్టేలతో ఐదేళ్ల కాలం చట్టపరమైన వివాదాలకు సరిపోయింది. దీనివల్ల ఏపీ రాజధాని లేదని గందరగోళం ఏర్పడింది. 

కేంద్ర ప్రభుత్వ వైఖరి..
విభజన చట్టం ప్రకారం రాజధాని ఏర్పాటుకు కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉంది. అయితే అమరావతి ప్రారంభంలో కొంత నిధులు ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదు. రాష్ట్రంలో రాజధాని మార్పు వివాదం నడుస్తున్న కూడా కేంద్రం అది రాష్ట్ర పరిధిలోని అంశం అని పేర్కొంటూ తటస్థంగా ఉండిపోయింది. 

ప్రస్తుత పరిస్థితి.. 
2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. 'ఏకైక రాజధాని అమరావతి' ప్రాజెక్టు మళ్ళీ పట్టాలెక్కించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు నుంచి నిధుల సమీకరణం తో పాటు పనులు మళ్లీ ఊపందుకుంటున్నాయి. అయితే ఇదే క్రమంలో ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్.. మరోసారి 'మావిగన్' (మచిలీపట్నం - విజయవాడ - గుంటూరు) అంటూ రాజధాని మార్పు చేయాలని సంకల్పిస్తున్నారు. ఇదే నినాదంతో తాము ఎన్నికలకు వెళ్తామని అంటున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే మళ్లీ రాజధానిని మారుస్తుందా? కూటమి ప్రభుత్వం వచ్చినా ఎన్నేళ్లకు రాజధాని పనులు పూర్తవుతాయనేది ప్రతి ఏపీ పౌరుడిలో తొలుస్తున్న ప్రశ్న.

చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒక ప్రభుత్వం తెచ్చిన ప్లాన్ ను, తర్వాత ప్రభుత్వం రద్దు చేయడం.. ఆపై మళ్ళీ ప్రభుత్వం మారి పాత ప్లాన్‌కే రావటం వల్ల దశాబ్ద కాలం వృథా అయ్యింది. ఈ రాజకీయ ప్రాంతాలు, పాలసీల్లో స్థిరత్వం లేకపోవడమే ఏపీ రాజధానికి ఆలస్యం కావడానికి అసలు కారణం.

Also Read: అమరావతి Vs మావిగన్.. జగన్ 'మావిగన్' సవాలుపై ఘాటుగా స్పందించిన సీఎం చంద్రబాబు..

Also Read: డిప్యూటీ సీఎంను దూషించిన కేసులో ప్రశ్న రావణ్‌కు బెయిల్..గంటలోనే మరో ట్విస్ట్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Oppo రెనో 16 సిరీస్ ఎంట్రీ.. ఫీచర్లు, ధరల పూర్తి వివరాలు!

Hyderabad, Telangana:

Oppo Reno 16 Series Launched: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో (Oppo) భారతీయ మొబైల్ ప్రియుల కోసం మరో సరికొత్త సిరీస్‌ను మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. మార్కెట్‌లో తనదైన ముద్ర వేస్తూ.. ఒప్పో రెనో 16 (Oppo Reno 16)తో పాటు ఒప్పో రెనో 16సి (Oppo Reno 16c) మోడళ్లను అధికారికంగా లాంచ్‌ చేసింది.. అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో శక్తివంతమైన బ్యాటరీ, అద్భుతమైన కెమెరా సెటప్‌తో ఈ ఫోన్లు వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

బడ్జెట్ ధరలోనే ప్రీమియం ఫీచర్లు..
భారత మార్కెట్లో ఒప్పో రెనో 16 సిరీస్ ప్రారంభ ధర రూ.46,999తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. మోడల్స్ వారీగా ధరల వివరాల్లోకి వెళితే.. ఒప్పో రెనో 16సి 5జీ (Oppo Reno 16c 5G) స్మార్ట్‌ఫోన్‌ 8GB + 128GB వేరియంట్ ధర రూ.46,999 కాగా.. ఇక రెండవ వేరియంట్ 8GB + 256GB స్టోరేజ్ కలిగిన ధర రూ.49,999 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే టాప్ ఎండ్ 12GB + 256GB వేరియంట్ ధర రూ.55,999తో అందుబాటులోకి రాబోతోంది. ఇక ఒప్పో రెనో 16 (Oppo Reno 16) స్మార్ట్‌ఫోన్‌ ధర వివరాల్లోకి వెళితే.. దీని 8GB + 256GB వేరియంట్ ధర రూ.61,999 కాగా.. 12GB + 256GB వేరియంట్ ధర రూ. 67,999తో అందుబాటులోకి రాబోతోంది..

అదిరిపోయే లాంచ్ ఆఫర్లు..
ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్లు జూలై 9 నుంచి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఒప్పో ఈ-స్టోర్, ప్రధాన రిటైల్ అవుట్‌లెట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఇవి స్టారీ వైట్, స్టెల్లార్ పర్పుల్, ట్విలైట్ వయొలెట్ రంగులలో లభించబోతున్నాయి. లాంచ్ ఆఫర్లలో భాగంగా ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులు, యూపీఐ లావాదేవీలపై 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్, 18 నెలల వరకు జీరో డౌన్ పేమెంట్ ఈఎంఐ, రూ. 5,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, 180 రోజుల స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌ను ఒప్పో కంపెనీ అందిస్తోంది.

కళ్లు చెదిరే డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్..
రెనో 16 మోడల్ 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.32 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.ఇక రెనో 16సి మోడల్ 1,400 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.57 అంగుళాల FHD+ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ రెండు ఫోన్లు కూడా 120Hz రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తాయి. ప్రాసెసర్ విషయానికొస్తే.. రెనో 16లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌తో పాటు రెనో 16సిలో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఇవి లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ ఓఎస్ 16 (ColorOS 16) పై రన్‌ అవుతాయి.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ఒప్పో ఫోన్లు కెమెరాలకు పెట్టింది పేరు.. కాబట్టి ఈ సిరీస్‌లో కూడా కెమెరాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన్నట్లు తెలుస్తోంది. రెనో 16 ఫోన్ వెనుక భాగంలో OIS సపోర్ట్‌తో కూడిన 50MP సోనీ LYT-600 ప్రధాన కెమెరా, 50MP అల్ట్రావైడ్, 50MP టెలిఫోటో కెమెరాలను అందించారు. అదేవిధంగా రెనో 16సి మోడల్లో 50MP ప్రధాన, 50MP టెలిఫోటో కెమెరాలతో పాటు 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉంది. ఇక సెల్ఫీల కోసం రెండు ఫోన్లలోనూ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించడం విశేషం.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

క్రాంతి కుమార్‌ కుటుంబానికి అండగా ఉంటా.. న్యాయం చేస్తా: మాజీ సీం వైఎస్‌ జగన్‌

Vijayawada, Andhra Pradesh:

Kranthi Kumar Death Case:  'కృష్ణలంక పీఎస్‌ పరిధిలో నెల వ్యవధిలో రెండు మరణాలు. ఒకటి లాకప్‌డెత్‌.. మరొకటి ఆత్మహత్య. అక్కడ సీసీ టీవీ ఫుటేజ్‌ కూడా లేదు. పోలీస్‌ స్టేషన్లలో తప్పనిసరిగా ఉండాల్సిన సీసీ కెమెరా ఫుటేజ్‌ మాయమైపోయింది. ఒక రిమాండ్‌ రిపోర్టులో నెల రోజుల ఫుటేజ్‌ లేదన్నారు. మే 1 నుంచి జూన్‌ 1 వరకు లేదని. మరో దాంట్లో 18 నెలల నుంచి ఫుటేజ్‌ లేదన్నారు' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు. ఎవరు పడితే వారు అలా సీసీ కెమెరాల ఫుటేజ్‌ తీసేయొచ్చా? మరి బ్యాకప్‌ ఉండదా? అని ప్రశ్నలు సంధించారు. అంటే ఒక పద్ధతి ప్రకారం పోలీస్‌ స్టేషన్లలో చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నారని ఆరోపించారు. 'పోలీస్‌ స్టేషన్‌లో కొడుతున్నారు. చంపుతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేసినా, పట్టించుకోవడం లేదు. చెత్తబుట్టలో వేస్తున్నారు' అని విమర్శించారు.

కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు, పోలీసుల వేధింపులు తాళలేక సెల్ఫీ వీడియోలో మరణ వాంగ్మూలం మాదిరిగా అన్ని వివరాలు చెప్పి ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్‌ కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. విజయవాడ, కృష్ణలంకలో ఉన్న క్రాంతికుమార్‌ ఇంటికి వెళ్లిన వైఎస్ జగన్, ఆయన భార్య, పిల్లలు, తండ్రిని కలిసి ఓదార్చారు. పోలీసులు క్రాంతికుమార్‌ను ఏ విధంగా వేధించారనేది చెప్పిన వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. 

కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. 'క్రాంతికుమార్‌ కుటుంబం చాలా పేదరికంలో ఉందని.. ఇక్కడ హృదయ విదారకరమైన పరిస్థితి కనిపిస్తోందన్నారు. చాలా పేదరికంలో బతుకుతున్న వారిని, ఈ వ్యవస్థ చిన్నాభిన్నం చేసింది' అని ఆవేదన వ్యక్తం చేశారు. 'క్రాంతికుమార్‌ ఒక టాక్సీ డ్రైవర్‌. 8 ఏళ్ల కిందట ఏవో చిన్న కేసులు ఉంటే వాటిని కూడా కొట్టేశారు. శిక్ష కూడా పడలేదు. అయినా క్రాంతికుమార్‌ను రోజూ పోలీస్‌ స్టేషన్‌కు రమ్మని 3 నెలలు వేధించారు. ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు' అని వివరించారు.

'నీచ స్థాయికి పోలీస్‌ వ్యవస్థ దిగజారిపోయింది. క్రాంతికుమార్‌ ఏ నేరం చేయకపోయినా, పోలీసులు ఎందుకు స్టేషన్‌కు పిలిపించారు. తనను 3 నెలల నుంచి రోజూ స్టేషన్‌కు పిలిపించి వేధించారని, హింసించారని క్రాంతికుమార్‌ తన మరణ వాంగ్మూలం (వీడియో రికార్డింగ్‌)లో చెప్పారు. పోలీసులు బలవంతపెట్టి తనతో చేయించకూడని పనులు చేయించారని ఆ వీడియోలో పేర్కొన్నాడు' అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వెల్లడించారు.

'ఇది రాజధాని విజయవాడలో జరిగింది. కూతవేటు దూరంలో ముఖ్యమంత్రి నివాసం, పోలీస్‌ కమిషనర్‌ ఆఫీస్‌ ఉంది. డీజీపీ ఆఫీస్‌ ఉంది. హోం మంత్రి ఆఫీస్‌ కూడా ఇక్కడే ఉంది. తన కొడుకు ఆత్మహత్య తర్వాత ఆ వీడియోను ఆయన తండ్రి పోలీస్‌ కమిషనర్‌కు చూపినా పట్టించుకోలేదు. ఏ చర్య తీసుకోలేదు' అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ వివరించారు. మరి తప్పు చేసిన వారిని ఎందుకు రక్షిస్తున్నారని ప్రశ్నించారు. 'ఇక్కడ రాజధానిలో ఒక రాకెట్‌ నడిపిస్తున్నారు. సీఐ నాగరాజుకు సీపీ ప్రొటెక్షన్‌. సీపీకి డీజీపీ ప్రొటెక్షన్‌. డీజీపీకి సీఎం ప్రొటెక్షన్‌ ఇస్తున్నారు' అని తీవ్ర ఆరోపణలు చేశారు.

'ఇంత జరిగినా కేసు నమోదు చేయలేదు. నిజానికి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి. ఆ కుటుంబానికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?' అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి, న్యాయ సహాయం మొదలు, అన్ని రకాలుగా వారికి మా పార్టీ తరపున అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అవసరమైతే కోర్టులో కూడా పోరాడతామని వైఎస్ జగన్ ప్రకటించారు. భార్య, చిన్నారులు ఉన్న వ్యక్తిని బెదిరించి, మానసికంగా వేధించడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

0
0
Report
Advertisement

iPhone చరిత్రలోనే బిగ్గెస్ట్ బ్యాటరీ.. iPhone 18 Pro లీక్స్ చూశారా!

Hyderabad, Telangana:

iPhone 18 Pro Max Leaks Latest News: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ (Apple) తన ప్రతిష్టాత్మక ఐఫోన్ సిరీస్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త సిరీస్‌లతో వినియోగదారులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. తాజాగా వైరల్‌ అవుతున్న లీక్‌ల ప్రకారం... యాపిల్ త్వరలో మార్కెట్లోకి రాబోతున్న ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ (iPhone 18 Pro Max) బ్యాటరీ విభాగంలో సరికొత్త రికార్డు సృష్టించబోతున్నట్లు తెలుస్తోంది. యాపిల్ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ ఐఫోన్‌లోనూ లేనంత అతిపెద్ద బ్యాటరీని ఈ మోడల్‌లో అందించబోతున్నట్లు ప్రముఖ టిప్‌స్టర్లతో పాటు చైనా సప్లై చైన్ వర్గాలు సంచారాన్ని లీక్‌ చేశాయి..

బ్యాటరీ సామర్థ్యం ఎంత ఉండబోతోంది?

గత మోడల్ అయిన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌లో 5,088mAh బ్యాటరీని అందించిన సంగతి తెలిసిందే..రాబోయే ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో అంతకంటే శక్తివంతమైన బ్యాటరీని అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. లీక్‌ అయిన వివరాల ప్రకారం.. గ్లోబల్ వేరియంట్‌లో ఏకంగా 5,100mAh నుంచి 5,200mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది.. అయితే, చైనా మార్కెట్ కోసం విడుదల చేసే వేరియంట్‌లో మాత్రం దాదాపు 5,000mAh బ్యాటరీ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. స్మార్ట్‌ఫోన్ హిస్టరీలోనే ఐఫోన్ నుంచి రాబోతున్న అత్యధిక బ్యాటరీ బ్యాకప్ కలిగిన ఫోన్‌గా ఇది నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

సరికొత్త 2nm A20 ప్రో చిప్‌సెట్..
ఈ భారీ బ్యాటరీ సామర్థ్యంతో పాటు, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో యాపిల్ అత్యాధునిక 2 నానోమీటర్ (2nm) సాంకేతికతతో తయారు చేసిన A20 ప్రో (A20 Pro Chip) ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సరికొత్త చిప్‌సెట్ ఫోన్ పనితీరును అద్భుతంగా మెరుగుపరచడమే కాకుండా.. బ్యాటరీ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. దీనివల్ల వినియోగదారులకు గతంలో ఎప్పుడు లేని విధంగా అత్యుత్తమ బ్యాటరీ లైఫ్ లభిస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే హెవీ గేమింగ్, 4K వీడియో రికార్డింగ్ చేసినా కూడా బ్యాటరీ సుదీర్ఘ కాలం పాటు వస్తుంది..

డిజైన్ వివరాలు..
సాధారణంగా బ్యాటరీ సైజ్ పెరిగితే ఫోన్ మందం (Thickness) కూడా విపరీతంగా పెరుగుతుంది. అయితే, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ విషయంలో యాపిల్ తన ఇంటర్నల్ డిజైన్‌లో కొన్ని కీలక మార్పులు చేస్తున్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి.. దీనివల్ల ఫోన్ మందం పెరగకుండా కేవలం 8.75mm ప్రొఫైల్‌తోనే.. పాత మోడల్ అంతే స్లిమ్‌గా ఉంటునే.. పెద్ద బ్యాటరీని అడ్జస్ట్ చేయనున్నారు. కానీ, భారీ బ్యాటరీ, అధునాతన కెమెరా సెటప్ కారణంగా ఫోన్ బరువు స్వల్పంగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది సుమారు 240 గ్రాముల వరకు ఉండవచ్చని లీక్‌లు చెబుతున్నాయి. 

డిస్‌ప్లే, ఇతర ఫీచర్లు..
ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో 6.9-ఇంచుల భారీ LTPO OLED డిస్‌ప్లేను అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. డిజైన్ పరంగా వెనుక వైపు గ్లాస్ ఫినిషింగ్‌తో పాటు రీలోకేటెడ్ సెల్ఫీ కెమెరా, పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Siri AI) ఫీచర్లు మరింత వేగంగా పనిచేయడానికి ఇందులో 12GB వరకు ర్యామ్‌తో తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

లాంచ్, ధర వివరాలు..
సాధారణంగా యాపిల్ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో తన కొత్త ఐఫోన్ సిరీస్‌ను లాంచ్ చూస్తూ ఉంటుంది.. అదే విధంగా ఈ ఐఫోన్ 18 సిరీస్‌ను కూడా ఈ ఏడాది సెప్టెంబర్‌లో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి. విడిభాగాల ధరలు పెరుగుతున్నప్పటికీ.. యాపిల్ ఈ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ ధరలను గత ఏడాదితో పోలిస్తే.. పెద్దగా పెంచకుండా, దాదాపు అదే ధరల్లో అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోందని సమాచారం. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Amaravati Vs Mavigun: అమరావతి Vs మావిగన్.. జగన్ 'మావిగన్' సవాలుపై ఘాటుగా స్పందించిన సీఎం చంద్రబాబు..

Vijayawada, Andhra Pradesh:

Amaravati Vs Mavigun News: ఆంధ్రప్రదేశ్ రాజధాని చుట్టూ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అమరావతికి ప్రత్యామ్నాయంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన 'మావిగన్' (మచిలీపట్నం - విజయవాడ - గుంటూరు) కాన్సెప్ట్ ఇప్పుడు రాష్ట్రంలో కొత్త చర్చకు తెరలేపింది. ఈ నేపథ్యంలో జగన్ విసిరిన సవాల్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు.

జగన్ సవాల్ ఏమిటి?
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమరావతి రాజధాని నిర్మాణాన్ని జగన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతిలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. దానికి బదులుగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ 'మావిగన్' అనే సరికొత్త మెగా సిటీని రాజధానిగా జగన్ ప్రతిపాదించారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో 'మావిగన్ వర్సెస్ అమరావతి' అనే అంశాన్నే తమ ప్రధాన అజెండాగా మారుస్తామని, ప్రజలు ఏ రాజధానిని కోరుకుంటున్నారో ఎన్నికల్లోనే తేల్చుకుంటామని చంద్రబాబుకు జగన్ బహిరంగ సవాల్ విసిరారు. అమరావతి కంటే మావిగన్‌కే ప్రజల మద్దతు లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్..
తిరుపతిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు, జగన్ విసిరిన సవాల్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ వైఖరిని ఎండగడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

రోజుకో మాట - నిలకడలేని రాజకీయం: "ఆ గొడ్డలి పార్టీ నేతలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వారికి ఓ విధానం లేదు, రోజుకో మాట మాట్లాడుతుంటారు. ఎన్నికలకు ముందు అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులంటూ 'మూడు ముక్కలాట' ఆడారు. ఇప్పుడు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత మళ్లీ 'మావిగన్' అంటూ కొత్త నాటకానికి తెరలేపారు" అని చంద్రబాబు ఆక్షేపించారు.

దేవతల రాజధాని అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం అమరావతి మాత్రమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. "మన రాజధాని ఎప్పటికీ అమరావతే. అది దేవతల రాజధాని, ప్రజా రాజధాని. ఇందులో ఎలాంటి సందేహాలు లేవు" అని తేల్చిచెప్పారు.

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికే ప్రతిపక్షం ఇలాంటి కొత్త ప్రతిపాదనలు చేస్తోందని చంద్రబాబు కొట్టిపారేశారు. జగన్ సవాల్‌ను తిప్పికొడుతూ, తమ ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయడానికే కట్టుబడి ఉందని సీఎం పునరుద్ఘాటించారు. ఈ పరిణామాలతో ఏపీలో 'రాజధాని' రాజకీయం మున్ముందు మరింత ముదిరేలా కనిపిస్తోంది.

ALso Read: చంద్రబాబుపై మరోసారి ధ్వజమెత్తిన వైఎస్ జగన్..రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగమంటూ ఆరోపణ!

Also Read: డిప్యూటీ సీఎంను దూషించిన కేసులో ప్రశ్న రావణ్‌కు బెయిల్..గంటలోనే మరో ట్విస్ట్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

మంత్రులపై కేటీఆర్‌ ఆగ్రహం.. చర్చకు రాకుండా తొడలు కొడితే ప్రయోజనం ఏంటి?

Hyderabad, Telangana:

KTR Challenge: మంత్రి జూపల్లి కోసం తెలంగాణ భవన్‌లో కుర్చీ వేసి వేచి చూసినా.. శాలువాతో సిద్ధంగా ఉన్నా ఆయన రాలేదు. గన్‌పార్క్ వద్ద చర్చకు రావడానికి కూడా నేను సిద్ధం. మేము అక్కడికి వెళ్దామని బయల్దేరితే పోలీసులను పెట్టి అరెస్టు చేస్తున్నారు. ఇక్కడ వేచి ఉంటే వాళ్లు తోక ముడిచారు. కాంగ్రెస్ మంత్రులు అక్కడ కూర్చుని తొడలు కొడితే ప్రయోజనం ఏమిటి?' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశ్నించారు.

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌ వద్ద గన్‌పార్క్‌కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కార్యాలయంలో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'గన్‌పార్క్ వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం. మంత్రి జూపల్లితో చర్చ కోసం గన్‌పార్క్ బయలుదేరితే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కంచన్‌బాగ్‌కు వెళ్లి అక్కడ అరెస్ట్ అయిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను పరామర్శిద్దామని అనుకుంటే గేటు నుంచి అడుగు బయట పెట్టకుండా భారీగా పోలీసులను మోహరించారు' అని తెలిపారు.

'అక్కడ కూర్చుని మంత్రులు సవాళ్లు విసరడం.. ఇక్కడ పోలీసులతో మమ్మల్ని అడ్డుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం. చర్చించడానికి దమ్ము లేకనే రేవంత్‌ రెడ్డి, మంత్రులు వెన్నుచూపి పారిపోతున్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. 'సంక్షేమ శాఖలో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని హరీశ్‌ రావు ఆరోపిస్తే గన్‌పార్క్‌కి మేము వస్తున్నాం, దమ్ముంటే రండి అని ముగ్గురు కాంగ్రెస్ మంత్రులు సవాల్ చేశారు. ఆ సవాల్‌ను స్వీకరించి హరీష్ రావు బయలుదేరితే వాస్తవాలు బయట పడితే, ప్రజల ముందు పరువు పోతుందనే భయంతో పోలీసులను పంపించి అడ్డుకున్నారు' అని మంత్రుల తీరుపై అహసనం వ్యక్తం చేశారు.

'బీఆర్ఎస్ పార్టీ నాయకులతో బహిరంగ చర్చకు కూడా రాలేని కాంగ్రెస్ పిరికిపందలు, చేతకాని దద్దమ్మలు చర్చలకు సిద్దమని సవాళ్లు ఎందుకు వేయాలి?' మంత్రుల తీరుపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలకు మేమే వారికి ఎక్కువ అని తెలిపారు. 'తెలంగాణ భవన్‌కి వస్తానని ఫోజులు కొట్టమన్నది ఎవరు మళ్లీ గన్‌పార్క్ అని లొకేషన్ మార్చామన్నది ఎవరు? నీకంటే పోలీస్ వాళ్ల ఎస్కార్ట్ ఉంది. కానీ మమ్మల్ని ఏమో బైటకి పోతే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ వివరించారు.

'పోలీసులని ఎవరు పంపుతున్నారు.. ముఖ్యమంత్రా, లేదా మంత్రులా. చర్చలని మీరే పిలుస్తారు. మళ్లీ పారిపోయేది మీరే! చేతకాని వెధవలు ఎవరో ప్రజలు చూస్తున్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నిద్ర పోయేవాడిని లేపొచ్చు.. నిద్రని నటించేవాడిని ఎక్కడ లేపగలం అని మంత్రుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. 'రేవంత్ రెడ్డికి ప్రజాక్షేత్రంలో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ధైర్యం లేదు. గతంలో రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించి మేము ప్రెస్‌క్లబ్‌కు వెళ్తే రాకుండా మొహం చాటేసి పారిపోయాడు. మరోసారి తెలంగాణ అప్పులపై రేవంత్ రెడ్డి సవాల్ విసిరితే మేము సిద్దమని చెప్పాం.. మళ్లీ రాకుండా తోక ముడిచి పారిపోయాడు. మధ్యలో సందట్లో సడేమియా అని జూపల్లి దూరి తెలంగాణ భవన్‌కు వస్తానని డైలాగులు వేశాడు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు.

0
0
Report
Advertisement

ఇంత తక్కువ ధరకే? Old Monk క్వార్టర్ రూ.60, ఫుల్ బాటిల్ రూ.220 మాత్రమే!

Hyderabad, Telangana:

Goa Liquor Prices: ప్రకృతి అందాలు, అద్భుతమైన బీచ్‌లు, రాత్రిపూట పార్టీలకు కేరాఫ్ అడ్రస్ గోవా.. నిత్యం వేలాది మంది పర్యాటకులతో కిటకిటలాడే ఈ పర్యాటక ప్రాంతం.. తాజాగా మద్యం ప్రియులకు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. గోవాలో మద్యం ధరలు చాలా తక్కువనే అందరికీ సంగతి తెలిసిందే.. అయితే, ప్రస్తుతం అక్కడ విక్రయిస్తున్న బ్రాండ్ల ధరలు వింటే.. ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాజా సమాచారం ప్రకారం.. గోవాలో లభిస్తున్న కొన్ని లిక్కర్ బ్రాండ్ల ధరల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రూ.30లకే 90ml.. రూ.60కే క్వార్టర్..
సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో మద్యం ధరలు ఆకాశాన్ని తాకుతుంటే.. గోవాలో మాత్రం చాలా చౌకగా లభిస్తున్నాయి. అక్కడ కేవలం రూ.30లకే 90ml బాటిల్ అందుబాటులో ఉండటం విశేషం.. ఇక ఎంతో మందికి ఇష్టమైన ఓల్డ్ మంక్ (Old Monk) బ్రాండ్ క్వార్టర్ బాటిల్ ధర కేవలం రూ.60 మాత్రమేనని అక్కడి వైన్స్‌ షాప్‌ నిర్వాకులు చెబుతున్నారు.

బ్రాండ్ల రేట్ల వివరాలు ఇవే..
గోవా వైన్ షాపుల్లో లభిస్తున్న కొన్ని ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ (Quarter) ధరల వివరాల్లోకి వెళితే.. రాయల్ ఛాలెంజ్ (Royal Challenge) క్వార్టర్ ధర ఇక్కడ కేవలం రూ.95 మాత్రమే అందుబాటులో ఉంది. అంతేకాకుండా మ్యాన్స్ నోస్ (Man's Nose) బ్రాండ్ క్వార్టర్ రూ.80 లకే లభింస్తోంది. ఇక ఇంపీరియల్ బ్లూ (Imperial Blue) ధర కేవలం రూ.85కే లభించడం విశేషం.. ఇక అందరూ ఎంతగానో ఇష్టపడే మెక్‌డోవెల్స్ (McDowell's) క్వార్టర్ కూడా రూ.85 లకే విక్రయిస్తున్నారు. దీంతో పాటు ప్రియులు ఇష్టపడే మ్యాజిక్ మూమెంట్స్ బ్లూ (Magic Moments Blue) వోడ్కా క్వార్టర్ ధర రూ.100కే అందుబాటులో ఉంది.

Also Read: Goaలో ఇంత చీప్‌గా బీరా, కరోనా, కింగ్‌ఫిషర్ దొరుకుతున్నాయా? 2026 లేటెస్ట్ రేట్లు ఇవే!

ఫుల్ బాటిల్ రూ.220 మాత్రమే..
ఇక అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఓల్డ్ మంక్ ఫుల్ బాటిల్ కేవలం రూ.220 లభిస్తుండటం.. బాటిల్‌పై ఉన్న గరిష్ట రిటైల్ ధర (MRP) ప్రకారం.. ఈ ధరలకే గోవాలో విక్రయిస్తున్నట్లు అక్కడి నిర్వాహకులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో వందల రూపాయలు పలికే బ్రాండ్లు ఇక్కడ ఇంత తక్కువ ధరలకే లభిస్తుండటంతో పర్యాటకులు ఎంతో హ్యాపీగా ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.. మొత్తానికి గోవా ట్రిప్ ప్లాన్ చేసుకునే వారికి, ముఖ్యంగా అక్కడి నైట్ లైఫ్‌ను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ ధరల వివరాలు ఎంతగానో సహాయపడతాయి. రాబోయే పర్యటక సీజన్‌లో గోవాకు వెళ్లే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

(నోట్: ఈ వార్తను సోషల్ మీడియాలో లభించిన తాజా ధరల సమాచారం ఆధారంగా మాత్రమే అందించబడింది. దీనికి జీ తెలుగు న్యూస్‌కి ఎలాంటి సంబంధం లేదు.)

Also Read: Goaలో ఇంత చీప్‌గా బీరా, కరోనా, కింగ్‌ఫిషర్ దొరుకుతున్నాయా? 2026 లేటెస్ట్ రేట్లు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

0
0
Report

Prashna Ravan Arrest: డిప్యూటీ సీఎంను దూషించిన కేసులో ప్రశ్న రావణ్‌కు బెయిల్..గంటలోనే మరో ట్విస్ట్ ఇచ్చిన ఏపీ పోలీస్!

Pithapuram, Andhra Pradesh:

Prashna Ravan Arrest News: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇటీవలే యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై తాజాగా కోర్టుకు కీలక నిర్ణయం తీసుకుంది. అతనికి బెయిల్ మంజూరు చేస్తూ పిఠాపురం కోర్టు ఆదేశాలు జారీ చేయగా.. ఇక్కడ మరో ట్విస్ట్ వచ్చిపడింది. బెయిల్‌పై రావణ్ విడుదలైన వెంటనే ఇప్పుడు మరో కేసు విషయంలో ఏపీ పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. 

అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా పిrఠాపురంలో యూట్యూబర్ ప్రశ్నపై కేసు నమోదయ్యింది. ఈ కేసులో రిమాండ్ కోసం పిఠాపురం పోలీసులు కోరగా.. కోర్టు అందుకు నిరాకరించింది. బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే బెయిల్‌పై బయటకు వద్దామనుకున్న ప్రశ్న రావణ్‌కు వెంటనే మరో ట్విస్ట్ ఎదురైంది. గతంలో కాకినాడ జిల్లా సర్పవరంలో నమోదైన కేసు విషయంలో అతడ్ని సర్పవరం పోలీసులు మరోసారి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

కాకినాడ జిల్లా సర్పవరంలోనూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సదరు ప్రశ్న రావణ్ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో జనసేన కార్యకర్తలు కేసు నమోదు చేశారు. 2025లో ఈ కేసు నమోదైనా.. తాజాగా అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. అయితే రావణ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే మరోమారు అతడ్ని కోర్టు ముందు హాజరు పరిచి.. రిమాండ్ కోరనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రశ్న రావణ్‌పై ఏపీ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కేసులు నమోదైనట్లు సమాచారం అందుతోంది. ఒకవేళ అదే నిజమైతే సర్పవరంలో బెయిల్ వచ్చినా.. మరో ప్రాంతం పోలీసులు అరెస్టు చేయడం తప్పనిసరిగా కనిపిస్తుంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై యూట్యూబర్ ఛానల్ ప్రశ్న ద్వారా రావణ్ అనే వ్యక్తి ఎప్పటి నుంచో విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో అవి మరింతగా శృతిమించినట్లు కనిపిస్తున్నాయి. ప్రశ్న అనే చాటున వ్యక్తిగత దూషణలు చేసిన సంగతి వాస్తవం. అయితే ఇదే విషయమై జనసేన కార్యకర్తలు పలుమార్లు రావణ్‌కు సోషల్ మీడియా ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆ టైమ్‌లో రావణ్‌పై కేసు నమోదు చేసిన అరెస్టు వరకు వెళ్లలేదు. 

అయితే తాజాగా పవన్‌ను దూషించడంతో పిఠాపురం పోలీసులు ఏకంగా హైదరాబాద్ వెళ్లి మరీ ప్రశ్న రావణ్‌ను అరెస్టు చేశారు. అక్కడి నుంచి పిఠాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించి, కోర్టులో హాజరు పరిచారు. అయితే పోలీసులు రిమాండ్ కోరగా.. కోర్టు అందుకు నిరాకరించింది. ఈ క్రమంలో ప్రశ్న రావణ్‌కు బెయిల్ మంజూరు చేసింది. అయితే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. సోషల్ మీడియాలో హద్దుమీరిన విమర్శలు ఎక్కువయ్యాయని, భావప్రకటన స్వేచ్ఛ అంటే పక్క వాళ్లని దూషించడం కాదని ఆయన తెలిపారు. అలా చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుందని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విమర్శించడం, తప్పులను ఎత్తి చూపడం వరకు పర్వాలేదని చెప్పిన ఆయన వ్యక్తిగత దూషణలకు, భౌతిక దాడులకు, మత విద్వేషాలకు దిగితే నిందితులను విడిచిపెట్టమని ఆయన స్పష్టం చేశారు. 

Also Read: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్..వారంలో రెండు రోజులు సెలవులు..ఎప్పుడంటే?

Also REad: చంద్రబాబుపై మరోసారి ధ్వజమెత్తిన వైఎస్ జగన్..రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగమంటూ ఆరోపణ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Flipkart GOAT Sale: రూ.20 వేల Oppo K14x 5G ఫోన్ కేవలం రూ.7,899లకే..

Hyderabad, Telangana:

Oppo K14x 5G Flipkart GOAT Sale: మీరు ఎప్పటి నుంచో 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకు ఒక అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నిర్వహించబోయే Flipkart GOAT (Greatest Of All Time) సేల్‌లో Oppo బ్రాండ్‌కు సంబంధించిన Oppo K14x 5G స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని ఆఫర్లు ప్రకటించారు. జూలై 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రత్యేక సేల్‌లో ప్రీమియం ఫీచర్లు కలిగిన ఈ మొబైల్‌ను ఎవరూ ఊహించని అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకునే అద్భుతమైన అవకాశం లభిస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రూ.19,999 ఫోన్.. కేవలం రూ.14 వేలకే!
సాధారణంగా మార్కెట్లో Oppo K14x 5G (64 GB + 4 GB స్టోరేజ్ వేరియంట్) అసలు ధర (MRP) రూ. 19,999తో అందుబాటులో ఉంది.. కానీ, ఈ ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్‌లో భాగంగా కస్టమర్లకు ఏకంగా రూ.5,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభించబోతోంది.. అంటే ఎలాంటి అదనపు బ్యాంక్‌ ఆఫర్స్‌ లేకుండానే ఈ ఫోన్ ధర నేరుగా రూ.14,999కే లభిస్తోంది. మిడ్-రేంజ్ బడ్జెట్‌లో ప్రీమియం లుక్, 5G కనెక్టివిటీ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది పండగ లాంటి వార్తనే చెప్పొచ్చు.

బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో అదనపు డిస్కౌంట్‌..
ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు కస్టమర్లకు మరింత లాభం చేకూర్చేందుకు అద్భుతమైన బ్యాంక్ ఆఫర్లను కూడా అందుబాటులో ఉండడం విశేషం. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఎస్‌బీఐ (SBI) బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి రూ.1,000 వరకు అదనపు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఫోన్ ధర మరింత తగ్గి.. బడ్జెట్ ప్రియులకు భారీ ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయి.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ఎక్స్ఛేంజ్ బోనస్‌తో రూ.7,899లకే మీ సొంతం..
ఈ సేల్‌లో అన్నింటికంటే హైలైట్ ఏమిటంటే.. భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉండటం. ఈ Flipkart GOAT సేల్‌లో  మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం వల్ల దాదాపు రూ.6,100 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఒకవేళ మీరు మీ పాత ఫోన్‌పై పూర్తి ఎక్స్ఛేంజ్ బోనస్‌ పొందితే.. అన్ని ఆఫర్లు అంటే.. ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్ కలుపుకొని ఈ ప్రీమియం Oppo K14x 5G ఫోన్‌ను కేవలం రూ.7,899 లోపే మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ బోనస్ అనేది మీరు ఎక్స్ఛేంజ్ చేసే పాత స్మార్ట్‌ఫోన్ వర్కింగ్ కండీషన్, స్క్రాచెస్‌తో పాటు బ్రాండ్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

పుష్య నక్షత్రంలోకి సూర్యుడు.. ఆగస్టు 3 వరకు ఈ రాశుల జాతకం పూర్తిగా మారిపోతుంది!

Hyderabad, Telangana:

Sun Transit In Pushya Nakshatra 2026: జ్యోతిషశాస్త్రంలో గ్రహాల రాజు అయిన సూర్య భగవానుడి నక్షత్ర సంచారం అత్యంత కీలకమైనదిగా భావిస్తారు. గౌరవం, కీర్తి, ఆత్మవిశ్వాసానికి కారకుడైన సూర్యుడు 2026 జూలై 20వ తేదీన తన నక్షత్రాన్ని మార్చుకుని అత్యంత పవిత్రమైన  పుష్య నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. జూలై 20 ఉదయం 11:33 గంటలకు మొదలు కాబోతున్న ఈ సూర్య సంచారం.. ఆగస్టు 3 వరకు కొనసాగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ ప్రత్యేక సూర్యుడి సంచారం వల్ల ముఖ్యంగా నాలుగు రాశుల వారి జాతకాలు పూర్తిగా మారే అవకాశాలు ఉన్నాయి.. ఈ రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి.. ఊహించని విధంగా ఆదాయం పెరగడమే కాకుండా కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో అదృష్టాన్ని పొందే రాశులేవో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మేష రాశి (Aries)
మేష రాశి వారికి ఈ నక్షత్ర సంచారం అద్భుతమైన సమయాన్ని అందించబోతోంది. వీరి ఆర్థిక స్థితి గతంలో కంటే చాలా వరకు మెరుగుపడుతుంది.. ఉద్యోగస్తులకు ఆఫీసులో అందరి సపోర్ట్‌ కూడా లభిస్తుంది. అంతేకాకుండా, కెరీర్‌లో బంపర్ పురోగతితో పాటు ప్రమోషన్స్‌తో పాటు జీతాలు విపరీతంగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జీవితంలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి.. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి..

సింహ రాశి (Leo)
సూర్యుని సంచారం సింహ రాశి వారికి సువర్ణ అవకాశాలను అందిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు హఠాత్తుగా చేతికి అందుతాయి. దీనివల్ల ఆర్థిక సంక్షోభం పూర్తిగా తొలగిపోతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు పెద్ద ప్రాజెక్టులు దక్కడం వల్ల భారీ లాభాలు కలుగుతాయి.. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం.. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. ఆరోగ్యం మెరుపడి.. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

వృశ్చిక రాశి (Scorpio)
సూర్యుడు పుష్య నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల వృశ్చిక రాశి వారి ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. జీవితంలో వీరు కొన్నిసానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. ధన సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి.. ఆదాయానికి కొత్త మార్గాలు సుగమవుతాయి.. దీనివల్ల బ్యాంక్ బ్యాలెన్స్ భారీగా పెరుగుతుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యుల పూర్తి సపోర్ట్‌ లభిస్తుంది.. సమాజంలో మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి. కుటుంబంలో ఉన్న మనస్పర్థలు తొలగిపోయి..

ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి జాతకులకు ఈ సూర్య గోచారం వల్ల బంపర్ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఘన విజయం సాధిస్తారు. కొత్త ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి ఆశించిన ఫలితాలు కలుగుతాయి. జీవిత భాగస్వామితో పాటు కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం లభింస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీనివల్ల బంధాలు మరింత బలంగా మారుతాయి.. ఆర్థిక కొరత పూర్తిగా తీరిపోతుంది. ఎలాంటి ఆందోళనలు లేకుండా ఈ అదృష్ట సమయంలో ముందుకు సాగడం మంచిది..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

 

0
0
Report

Shani Dev: శని గ్రహ కదలికలు.. ఈ రాశుల వారికి అఖండ ఐశ్వర్యం, ఉద్యోగంలో ప్రమోషన్లు!

Hyderabad, Telangana:

Shani Nakshatra Gochar July 2026: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన, కర్మఫల ప్రదాతగా భావించే శని దేవుడు తన నక్షత్ర సంచారం చేసింది.. జూలై 2, గురువారం రోజున శని నక్షత్ర సంచారం చేశాడు.. ప్రస్తుతం మీన రాశిలో సంచార దశలో ఉన్న.. శని దేవుడి నక్షత్ర మార్పు కారణంగా మొత్తం 12 రాశుల వారి జీవితాల్లో పెను మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. శని గ్రహం అత్యంత నెమ్మదిగా కదులుతుంది కాబట్టి.. ఈ నక్షత్ర మార్పు ప్రభావం దీర్ఘకాలం పాటు ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీనివల్ల ఉద్యోగం, వ్యాపారంతో పాటు ఆర్థిక పరిస్థితి, కుటుంబం, ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కొన్ని రాశులకు అదృష్టం.. 
మేష రాశి:

ఈ రాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అనవసరపు ఖర్చులను అదుపులో పెట్టుకోవడం మంచిది. అయితే, విదేశీ ప్రయాణాలు లేదా సుదూర ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగం చేస్తున్నవారు తప్పకుండా ఎంతో ఓపికగా ఉండడం చాలా మంచిది.

వృషభ రాశి: 
వృషభ రాశివారికి కూడా ఈ సమయంలో శని అనుగ్రహం ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి ఆదాయానికి కొత్త మార్గాలు సుగమవుతాయి. దీర్ఘకాలిక ప్రణాళికలు నెరవేరుతాయి. వ్యాపారస్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మిత్రుల సహాయంతో లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.

కర్కాటక రాశి: 
శని దేవుడి ఆశీస్సులతో వీరికి అదృష్టం కలిసి రాబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉన్నత విద్య, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి సానుకూల ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆధ్యాత్మికంగా కూడా బోలెడు లాభాలు కలుగుఆయి..

సింహ రాశి: 
జ్యోతిష్యుల ప్రకారం.. ఈ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అకస్మాత్తుగా ఖర్చులు పెరగడంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది..

మిథున రాశి: 
శని ప్రభావంతో మిథున రాశివారికి ఉద్యోగ జీవితంలో కీలక మార్పులు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు దక్కే అవకాశం ఉంది.. అయితే, కార్యాలయంలో ఉన్నతాధికారులతో విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. లేదంటే అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఈ రాశులవారికి ఆర్థిక పురోగతి..
తులా రాశి: 
శని ప్రభావంతో తులా రాశివారికి శత్రువులతో పాటు పోటీదారులపై అద్బుతమైన విజయం సాధిస్తారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగస్తులు తమ పనితీరుతో ప్రశంసలు లభిస్తాయి.. అయితే, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం ఉంది..

ధనుస్సు రాశి: 
కుటుంబంతో పాటు ఆస్తికి సంబంధించిన విషయాల్లో భారీ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇల్లు లేదా భూమి కొనాలనుకునే వారికి ఇది శుభ సమయంగా భావించవచ్చు. కుటుంబంలో కాస్త సహనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అందరితో అద్భుతంగా మాట్లాడాల్సి ఉంటుంది..

వృశ్చిక రాశి: 
వృశ్చిక రాశివారికి వివిధ రంగాల్లో ఉన్న వారికి భారీ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రేమ వ్యవహారాల్లో సానుకూల మార్పులు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. వీరు తప్పకుండా సంతానం గురించిన శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి..

మీన రాశి:

శని నక్షత్ర మార్పు ప్రభావంతో మీన రాశి వారికే అత్యధిక లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవల్సి వస్తుంది.. కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి..

మకర రాశి: 
కమ్యూనికేషన్‌తో పాటు నెట్‌వర్కింగ్ ద్వారా మంచి ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. చిన్నపాటి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలంగా ఉన్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

మఘా నక్షత్రంలోకి కేతువు.. ఈ రాశుల వారికి ఇక తిరుగుండదు, అదృష్టం మామూలుగా లేదు!

Hyderabad, Telangana:

Shukra Ketu Yuti In Leo 2026 Telugu News: జ్యోతిష్య శాస్త్ర పరంగా 2026 జూలై నెలలో ఒక కీలకమైన గ్రహ మార్పు చోటుచేసుకోబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. జూలై 4వ తేదీన సంపద, వైభవానికి కారకుడైన శుక్ర గ్రహం తన రాశిని మార్చుకుని కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి సంచారం చేయబోతోంది.. అయితే, అప్పటికే సింహ రాశిలో మాయా గ్రహంగా పరిగణించే కేతువు గ్రహం సంచార దశలో ఉంది.. దీనివల్ల సింహ రాశిలో శుక్ర, కేతువుల అరుదైన కలయిక జరగబోతోంది.

మఘా నక్షత్రంలోకి కేతువు ప్రవేశం..
జూలై 4వ తేదీన మరో ముఖ్యమైన మార్పు కూడా జరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కేతువు ఆశ్లేష నక్షత్రాన్ని వదిలిపెట్టి.. తన స్వంత నక్షత్రమైన మఘా నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. కేతువు నీడలోకి శుక్రుడు రావడం వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని శుభఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.. ముఖ్యంగా 4 రాశుల వారు ఈ గ్రహాల అనుగ్రహంతో జూలై నెల నుంచి ఆర్థికంగా, వృత్తిపరంగా అద్భుతమైన పురోగతిని సాధించబోతున్నారు. అయితే, ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందే రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మిథున రాశి: 
మిథున రాశి వారికి శుక్ర-కేతువుల కలయిక ఎంతో అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరి మాటతీరు మెరుగుపడటం వల్ల సమాజంలో వీరికి సంబంధించిన ప్రభావం పెరుగుతుంది. నూతన పరిచయాలు ఏర్పడి.. వ్యాపారాలు విస్తరించేందుకు మార్గాలు సుగమం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు లాభసాటిగా మారుతాయి. ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరగడం వల్ల కెరీర్‌కు సంబంధించిన కీలక నిర్ణయాలు సులభంగా తీసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేందుకు మంచి అవకాశాలు లభిస్తాయి.

మేష రాశి: 
మేష రాశి వారికి ఈ కాలం ఎంతో అద్భుతంగా ఉంటుంది. వీరిలో దాగి ఉన్న సృజనాత్మకత, నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కార్యాలయంలో మీరు వేసిన ప్రణాళికలతో పాటు వ్యూహాలు విజయవంతం అవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కళలు, రచనలు లేదా సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి సమాజంలో మంచి గుర్తింపుతో పాటు పెద్ద ప్రాజెక్టులు లభిస్తాయి. గతంలో చేసిన పెట్టుబడులు, షేర్ మార్కెట్ లేదా ఇతర వనరుల నుంచి ఊహించని విధంగా ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి.

ధనుస్సు రాశి: 
ధనుస్సు రాశి వారికి అదృష్టం పూర్తిగా కలిసిరాబోతోంది. సుదూర ప్రాంతాలకు లేదా విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు, లేదా అక్కడ ఉద్యోగం చేయాలనుకునే వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది.. వ్యాపారంలో విదేశీ వనరుల నుంచి భారీ లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వారసత్వ ఆస్తి లేదా పాత వివాదాల పరిష్కారం వల్ల ఊహించని ఆర్థిక లాభాలు చేకూరుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

తులా రాశి: 
ఉద్యోగస్తులకు ఈ సమయం ఎంతో సానుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మీ కష్టానికి తగ్గ సరైన ప్రతిఫలం లభిస్తుంది. ఉన్నతాధికారులు మీ పనితీరుకు ముగ్ధులవుతారు.. దీనివల్ల పదోన్నతి లేదా జీతాల పెంపు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా మునుపటి కంటే చాలా బలోపేతం అవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన బకాయిలు చేతికి అందుతాయి. కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. సమాజంలో పేరున్న పెద్దల నుంచి మీకు పూర్తి సపోర్ట్‌ లభిస్తుంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report
Advertisement

8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు..త్వరలోనే భారీగా పెరగనున్న జీతాలు..ఎంత పెరుగుతాయంటే?

Hyderabad, Telangana:

8th Pay Commission Salary Hike: 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల పెన్షన్ ఎంత పెరుగుతుంది? రూ.18,000 మూల వేతనం పొందుతున్న ఉద్యోగి జీతం రూ.37,800కి పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే దీనిపై స్పష్టమైన వివరణను ఇప్పుడు తెలుసుకుందాం. 

8వ వేతన సంఘం ఏర్పాటు చేసిన తర్వాత వారి సిఫార్సుల అంశం 'ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్'పై చర్చలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ విషయంలో కొన్ని కొత్త సమాచారం వెలువడింది. కొత్త మూల వేతనాన్ని నిర్ణయించడంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకోవడం గమనార్హం.

8వ వేతన సంఘం సమావేశం జూన్ 22, 23 తేదీలలో ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో జరిగింది. ఈ సమావేశం తర్వాత 2.10 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే, దీనితో సంతృప్తి చెందని సంఘాలు, అధిక రేటును డిమాండ్ చేస్తున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచితే, అది ఉద్యోగులకు భారీ ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుంది.

భారతీయ రక్షా మజ్దూర్ సంఘ్ 4.0 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను డిమాండ్ చేసింది. నేషనల్ కౌన్సిల్ స్టాఫ్ సైడ్, ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 3.833 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పట్టుబట్టాయి. ఆల్ ఇండియా ఎంపీఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంజిత్ సింగ్ పటేల్ మాట్లాడుతూ, "అదనపు వృద్ధి అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, డిసెంబర్ 21 వరకు కేవలం కరువు భత్యం (డీఏ), ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ), రవాణా భత్యాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.10కి చేరవచ్చు" అని అన్నారు.

కనీస ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.10గా నిర్ణయిస్తే, రూ.18,000 మూల వేతనం పొందుతున్న ఉద్యోగి జీతం రూ.37,800కి పెరుగుతుంది. అదేవిధంగా, రూ.19,900 జీతం రూ.41,790కి, రూ.21,000 జీతం రూ.45,570కి, రూ.25,500 జీతం రూ.53,550కి, రూ.29,200 జీతం రూ.61,320కి పెరుగనుందని సమాచారం అందుతోంది.

ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల నుండి జీతభత్యాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం పూర్తి చేసిన తర్వాత 8వ వేతన సంఘం ఒక కీలక దశకు చేరుకుంది. ఆన్‌లైన్‌లో సమాచారాన్ని సమర్పించడానికి చివరి గడువు జూన్ 30, 2026 కావడంతో, సవరించిన జీతం, భత్యాలు, పెన్షన్, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై సిఫార్సులు సిద్ధం చేయడానికి ముందు, సేకరించిన సమాచారాన్ని పరిశీలించే ప్రక్రియను కమిటీ త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వానికి తన సిఫార్సులను సమర్పించడానికి కమిషన్‌కు సుమారు 10 నెలల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున, సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరపడం, అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతన నిర్మాణం, భత్యాలు, ఇతర సేవా సంబంధిత ప్రయోజనాలను సమీక్షించడంపై దృష్టి సారించారు.

Also Read: ముగ్గురు హీరోయిన్లతో హైటెక్ లెవల్ వ్యభిచారం..ముంబైలో చీకటి దందా బట్టబయలు

Also Read: జూలైలో భారీగా సెలవులు..ఏకంగా 12 రోజులు మూతపడనున్న బ్యాంకులు..ఎందుకంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

బ్యాంక్ ఉద్యోగాల వేటలో ఉన్నారా? IBPS నుంచి 7400 పైగా పోస్టులతో భారీ నోటిఫికేషన్!

Hyderabad, Telangana:

IBPS Po 2026 Notification Out: దేశవ్యాప్తంగా ఇండియన్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ పీఓ నోటిఫికేషన్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదలైంది. బ్యాంకు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి ఇది బంపర్‌ ఆఫర్‌. ఐబీపీఎస్‌ పీఓ, ఎంటీ, ఎస్‌ఓ ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేష్‌ విడుదలైంది. ఇందులో మొత్తం 6,715 ప్రొబెషనరీ ఆఫీసర్‌/మేనేజ్‌మెంట్‌ ట్రైనీ, 745 స్పెషలిస్ట్‌ ఆఫీసర్ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఈరోజు జూలై 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన అర్హత, వయస్సు ఇతర వివరాలు తెలుసుకుందాం. 

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ప్రక్రియ ప్రకారం మొత్తం 11 బ్యాంకులు కలిసి 6,715 ఖాళీలను భర్తీ చేస్తాయి. ఈ ప్రక్రియలో మొదటగా ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాత మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. చివరగా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

IBPS PO ఎగ్జామ్ డేట్..
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆగస్టు 22, 23 తేదీలలో జరుగుతుంది. ఇక మెయిన్స్ పరీక్ష 2026 అక్టోబర్ 4వ తేదీన నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ పాస్ అయిన వారే మెయిన్స్ పరీక్ష రాయాలి. ఈ రెండు పరీక్షలు వేర్వేరుగా ఉంటాయి. పరీక్షకు 15 రోజుల ముందు అడ్మిట్ కార్డ్స్ కూడా విడుదల చేస్తారు.

ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు జీతం రూ.74,000 నుండి రూ. 76,000 మధ్య జీతం ఉంటుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఈ పరీక్షకు అర్హులు. అలాగే, అభ్యర్థి వయస్సు 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తుల కోసం అధికారిక వెబ్‌సైట్ ibps.in ని సందర్శించవచ్చు.

Also Read: SBI PO Notification 2026: బ్యాంక్ ఉద్యోగాల జాతర.. డిగ్రీ పాసైన వారికి గోల్డెన్ ఛాన్స్, రూ.48,000 జీతంతో ఎస్‌బీఐ బ్యాంక్ జాబ్స్‌!

Also Read: రీ-నీట్ రాసే విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎగ్జామ్ టెన్షన్ పోవాలంటే ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న ఈ టిప్స్ పాటించండి!

IBPS PO పరీక్ష విధానం..
IBPS ద్వారా ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రధానంగా ప్రిలిమ్స్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలకు సమాధానం చెప్పి, వంద మార్కులు కేవలం 60 నిమిషాల్లో పూర్తి చేయాలి.

ఇక IBPS PO మెయిన్స్ పరీక్షను ప్రిలిమ్స్ పాస్ అయిన వారు రాస్తారు. ఇందులో జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్, డేటా ఇంటర్‌ప్రెటేషన్ ఉంటాయి. మొత్తం 170 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలసిస్, డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటాయి. పర్సనాలిటీ టెస్ట్ ద్వారా అభ్యర్థి ప్రవర్తన, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఫైనల్ ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ లెట్టర్ అందిస్తారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement
Advertisement
Back to top