వనస్థలిపురంలో సాఫ్ట్వేర్ యువతిపై చిన్ననాటి స్నేహితుల అత్యాచారం
Vanasthalipuram, Telangana:వనస్థలిపురంలో ఒక సాఫ్ట్వేర్ యువతిపై ఆమె చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డి మరియు మరో వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి ఇటీవలే ఉద్యోగం రావడంతో నిర్వహించిన పార్టీ సందర్భంగా ఈ ఘటన జరిగింది. మత్తులో ఉన్నప్పుడు హోటల్ గదిలో ఈ దారుణం జరిగింది. నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
AP Cabinet Meeting: ఏపీ క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు..ఒకరోజు నో వెహికల్ డే, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్!
Velgapudi, Andhra Pradesh:AP Cabinet Meeting News: అమరావతిలో నేడు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గం దాదాపుగా 40కి పైగా అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అందులో ప్రధానంగా పరిపాలనా సంస్కరణలు, పొదుపు చర్యలు, పారిశ్రామికాభివృద్ధిపై దృష్టి సారించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అటు పర్యావరణ పరిరక్షణతో పాటు ఇటు ప్రభుత్వ ఖర్చుల పొదుపు కోసం మంత్రివర్గం వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు 'పొదుపు'ను ఒక విధానాన్ని అమలు చేయడానికి కేబినెట్ నిర్ణయించింది. వారానికి ఒకరోజు ప్రభుత్వ వాహనాలను వాడకూడదని (నో వెహికల్ డే) మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మంత్రులు తమ రవాణా కోసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిక్ వాహనాలు (EV) లేదా సైకిళ్లను వాడాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అలాగే మంత్రుల జిల్లాల పర్యటనల్లో అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని (కాస్ట్ కటింగ్) సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పాలకులతో పాటు పౌరుల్లో బాధ్యతను పెంచేలా ఈ ప్రత్యేక ప్రచారాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు.
ఐటీ, ఇతర రంగాల తరహాలో ప్రభుత్వ శాఖల్లో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. నేరుగా ఆఫీసుకు రావాల్సిన అవసరం లేని ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ ప్రభుత్వ హోమ్' కల్పించే ప్రతిపాదనపై మంత్రివర్గంలో కీలక చర్చ జరిగింది. త్వరలోనే మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
అలాగే భవిష్యత్తులో ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసే వాహనాలన్నీ EV (ఎలక్ట్రిక్ వాహనాలు) అయి ఉండాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
ఇదే సమావేశంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేలా పలు పారిశ్రామిక ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టెక్నాలజీ రంగంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఆటోమొబైల్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో భారీ పెట్టుబడులు, ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే ఈ సమావేశంలో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల విస్తరణకు ప్రాధాన్యతనివ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.
Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి తీపికబురు..2 శాతం డీఏ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం!
Also Read: మహిళలకు ప్రభుత్వం శుభవార్త..బ్యాంకు ఖాతాల్లోకి రూ.1,000 జమ అప్పటి నుంచే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AMCA Project: అనంతపురం జిల్లాకు మరో వరం.. కరువు సీమలో భారీ యుద్ధ విమాన ప్రాజెక్టు
Puttaparthi, Andhra Pradesh:Puttaparthi AMCA Project: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరువుకు కేరాఫ్గా నిలిచిన ఉమ్మడి అనంతపురం జిల్లా ఇప్పుడు అభివృద్ధికి కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే ఈ కరువు ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండగా.. అదే స్థాయిలో భారీ ప్రాజెక్టులు వస్తున్నాయి. కియా కార్ల సంస్థ ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఉండగా.. తాజాగా యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు కూడా అనంతపురం జిల్లాలో ఏర్పాటుకానుంది. రూ.లక్ష కోట్లతో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుండడంతో అనంతపురం జిల్లాకు మహర్దశ పట్టనుంది.
Also Read: Bandi Bageerath POCSO Case: అమ్మాయి మైనర్ కాదు.. హైకోర్టులో బండి భగీరథ్ వాదనలు
పుట్టపర్తిలో రూ.లక్ష కోట్లతో ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు రేపు అంకురార్పణ జరగనుంది. ఈ ప్రాజెక్టు పనులకు సీఎం చంద్రబాబు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో పుట్టపర్తిలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు పూర్తిగా కాగా.. తాజాగా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read: KKR vs RCB Highlights: కలకత్తా ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు.. బెంగళూరు బెర్త్ పక్కా
ఈనెల 15న పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, సీఎం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పరిశీలించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 650 ఎకరాల్లో ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం ఎంతో చారిత్రాత్మక నిర్ణయమని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. రేపు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
సత్యసాయి బాబా ఆశీస్సులతో భారత రక్షణ రంగానికి సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మక విమానాల తయారీ ప్రాజెక్టు సత్యసాయి జిల్లా పుట్టపర్తికి రావడం గొప్ప వరం అని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఆమడగూరు మండలంలో 5 వేల మెగావాట్ల సామర్థ్యంతో రూ.51 వేల కోట్ల వ్యయంతో రిలయన్స్ సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కావడం జిల్లాకు మరొక గర్వకారణమని ఎమ్మెల్యే సింధూర రెడ్డి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమల స్థాపనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
Bandi Bageerath POCSO Case: అమ్మాయి మైనర్ కాదు.. హైకోర్టులో బండి భగీరథ్ వాదనలు
Hyderabad, Telangana:Telangana High Court: అత్యాచారానికి పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు, నిందితుడు బండి భగీరథ్కు బెయిల్పై ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదు. తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్ గురువారం మధ్యాహ్నం విచారణకు వచ్చింది. మధ్యంతర బెయిల్ కోసం బండి భగీరథ్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. బాధితురాలు మైనర్ కాదు మేజర్ అని చెబుతున్నారు కానీ ఆమెపై అత్యాచారం చేసిన విషయాన్ని మాత్రం మరచిపోతున్నారు. ఇదే విషయమై హైకోర్టులో వాదనల మీద వాదనలు జరిగాయి. చివరకు రేపు విచారణకు వాయిదా వేసింది.
Also Read: KKR vs RCB Highlights: కలకత్తా ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు.. బెంగళూరు బెర్త్ పక్కా
బాధితురాలు తరఫు న్యాయవాది వాదనలు
కరీంనగర్లో బాధితురాలిపై తప్పుడు కేసు పెట్టారు. బాధితురాలు తల్లి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్లిన సమయంలో వెంటనే కరీంనగర్కి సమాచారం ఇచ్చి కేసు నమోదు చేశారు. నిందితుడు కేంద్ర మంత్రి కుమారుడు ఈ కేసులో చాలా ప్రభావితం చేశారు. తమ వాదనలు వినిపించడానికి మాకు కొంత సమయం కావాలని న్యాయస్థానాన్ని బాధితురాలు తరఫు న్యాయవాది కోరారు. రేపు మధ్యంతర బెయిల్ పై రేపు నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం తెలిపింది.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. రేపు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
'పోక్సో చట్టంలోని సెక్షన్ 11 నిర్దేశించిన వాటి పరిధిలోకి పిటిషనర్ రారు. బీఎన్ఎస్ సెక్షన్ 74, 75 ఆరోపించిన నేరాలు రుజువు కాలేదు. బాధితురాలుగా చెబుతున్న బాలిక వయసు 19 నుంచి 20 మధ్య ఉంటుంది. ఆమె తల్లి తప్పుడు రికార్డ్స్ సృష్టించి వయసు తగ్గించి కఠినమైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయించారు. 8 నెలలు కింద జరిగిన సంఘటనపై ఇప్పుడు ఫిర్యాదు చేయడంలో దురుద్దేశం ఉంది. ' అని బండి భగీరథ్ న్యాయవాది, సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి వాదించారు. బాలిక మైనర్ కాదు అనడానికి మీ దగ్గర ఆధారాలు ఉంటే సమర్పించాలని నిందితుడు తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించారు.
'ఐదేళ్ల కిందట అంటే అమ్మాయికి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కారు నడుపుతూ కేసు నమోదైంది. అందులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ వివరాలు సరైనవే అయితే తను మేజర్ అవుతుంది. ఆ యువతి పలు రకాల తేదీలతో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ తీసుకుంది' అని పిటిషనర్ తరపున వాదన వినిపిస్తున్న సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి తెలిపారు. 'ఈనెల 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో తప్పుడు ఆరోపణలు చేశారు. నాపై ఆరోపణలు చేస్తున్న బాలిక, ఫిర్యాదు చేసిన వ్యక్తి రూ.5 కోట్లు డిమాండ్ చేశారు. బెదిరింపులకు పాల్పడమే కాకుండా ఆ మొత్తాన్ని చెల్లించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు బెదిరించారు. బాధితుల నుంచి వచ్చిన బెదిరింపులకు లొంగకుండా కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. ప్రముఖ రాజకీయ వ్యక్తి కుమారుడు కావడంతో ఈ కుట్రకు పాల్పడ్డారు' అని నిందితుడు బండి భగీరథ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
హైకోర్టు కీలక వ్యాఖ్యలు
'ప్రతిసారి కేంద్ర మంత్రి కుమారుడు అని మీరు పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. బాధితురాలు పుట్టినరోజు డేట్స్పై పోలీసులు విచారణ చేయాలి' అని హైకోర్టు ఆదేశించింది. ఇక బెయిల్పై విచారణను రేపటికి వాయిదా వేసింది.
Bandi Bhageerath Bail: పోక్సో కేసులో కోర్టుకు వెళ్లిన బండి భగీరథ్..బెయిల్ అభ్యర్ధనపై నేడు విచారణ!
Hyderabad, Telangana:Bandi Bhageerath Bail News: మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టుకు చేరారు. దీనిపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.CM Vijay 1000 Scheme: మహిళలకు ప్రభుత్వం శుభవార్త..బ్యాంకు ఖాతాల్లోకి రూ.1,000 జమ అప్పటి నుంచే?
Nagalapuram, Tamil Nadu:CM Vijay 1000 Scheme Update: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన ఎన్నికల హామీని నిలబెట్టుకునే పనిలో పడ్డారు. మహిళా గౌరవ వేతన పథకం కింద మే నెలకు సంబంధించిన రూ.1,000 నిధులను తాజాగా విడుదల చేశారు. కుటుంబ భారాన్ని మోస్తున్న గృహిణులకు, పేద మహిళలకు అండగా నిలవడమే ఈ పథకం ఉద్దేశం అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఈ పథకం లబ్ధిదారులకు ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి 'డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్' (DBT) పద్ధతిలో జమ అవుతాయి. వార్షిక ఆదాయం, భూమి విస్తీర్ణం, విద్యుత్ వినియోగం వంటి వస్తువులను ప్రాతిపదికగా తీసుకుని అర్హులైన ప్రభుత్వం ఎంపిక చేసింది. నిధుల జమ ప్రక్రియలో ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా చూడాలని సీఎం విజయ్ అధికారులను సూచించారు.
గతంలో కొన్ని కారణాల వల్ల దరఖాస్తులు తిరస్కరణకు గురైన మహిళల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది. అర్హత ఉండి కూడా లబ్ధి పొందని వారు మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించనున్నట్లు తెలుస్తోంది. ప్రతి అర్హత కలిగిన మహిళకు ఈ పథకం అందాలన్నదే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి విజయ్ సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ వెయ్యి రూపాయల సాయం సామాన్య మహిళల దైనందిన అవసరాలకు, పిల్లల చదువులకు, మందుల ఖర్చులకు ఎంతో ఆసరాగా నిలుస్తోంది. మే నెల నిధుల విడుదల కోసం బ్యాంకింగ్, ప్రభుత్వ నిర్వహణ సమన్వయంతో పనిచేస్తున్నాయి.
Also Read: హాట్ ఫోజులతో హీటెక్కిస్తున్న గోల్డెన్ బ్యూటీ..వరుస హిట్లతో దూసుకుపోతున్న మీనాక్షి!
Also Read: బంగాళాఖాతంలో ఉపరీతల ఆవర్తన ద్రోణి..రాబోయే 5 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలు దంచికొడతాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rain Alert: బంగాళాఖాతంలో ఉపరీతల ఆవర్తన ద్రోణి..రాబోయే 5 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలు దంచికొడతాయి!
Vijayawada, Andhra Pradesh:Rain Alert In AP And Telangana: ఈసారి వర్షాకాలం ముందస్తుగానే పలకరించనుంది. మే 16 నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించనున్నాయి. ప్రస్తుతం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి వర్షాలకు అనుకూలంగా మారింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
తెలంగాణలో ఎండలతో పాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. మే 14న రాష్ట్రవ్యాప్తంగా జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడవచ్చని వెల్లడించింది. మే 15-16 తేదీల్లో ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 40-50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. మరోవైపు ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మే 15 నుంచి వడగాల్పులు వీచే ప్రమాదం ఉంది. ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అభిప్రాయపడింది.
మరోవైపు ఏపీలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరి తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని APSDMA హెచ్చరించింది. మే 15, 16 తేదీల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు పొలాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ప్రజలకు సూచనలు
వాతావరణ మార్పుల నేపథ్యంలో అధికారులు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. వర్షం పడేటప్పుడు పిడుగుల ముప్పు ఉంటుంది కాబట్టి చెట్లు లేదా విద్యుత్ స్తంభాల కింద నిలబడకూడదని తెలిపింది. అలాగే మధ్యాహ్నం బయటకు వెళ్లేవారు గొడుగు వాడడం సహా డీహైడ్రేషన్ కాకుండా తగినంత నీరు తాగాలని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం తగ్గించడం సురక్షితం. కాబట్టి రాబోయే ఐదు రోజులు ప్రకృతి విచిత్రంగా ప్రవర్తించనుందన్న హెచ్చరికల నడుమ తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
Also Read: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్..ఇకపై లక్కీడిప్ విధానంలో ఆ టికెట్లు!
Also Read: ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఎంత లాభమో తెలుసా? పర్యావరణానికి ఎంతో మేలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Oppo నుంచి అదిరిపోయే ఫోన్.. 200MP కెమెరా, 7000mAh భారీ బ్యాటరీతో Oppo Reno 16 సిరీస్!
Hyderabad, Telangana:Oppo Reno 16F 5g Leaked: ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ కంపెనీ ఒప్పో త్వరలో ఒక కొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ ఒప్పో రెనో 16 ఎఫ్ 5జీ పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ముఖ్యంగా కంపెనీ ఈ స్మార్ట్ఫోన్లో అద్భుతమైన ఫీచర్స్తో విడుదల చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. ఒప్పో రెనో 15 సిరీస్ను కంపెనీ ఇటీవలే భారత మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.. అయితే, దీనికి సక్సెసర్గా ఈ ఒప్పో రెనో 16 ఎఫ్ 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయబోతోంది. ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన ఫీచర్స్తో పాటు స్పెషిఫికేషన్ లీక్ అయ్యాయి.. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
లీక్ అయిన వివరాల ప్రకారం.. ఒప్పో రెనో 16F 5G స్మార్ట్ఫోన్ CPH2859 మోడల్ నంబర్తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఇది అంతర్జాతీయ మార్కెట్ల కోసం వివిధ పరీక్షల్లో మంచి ఫలితాలు కూడా సాధించిన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ స్మార్ట్ఫోన్ ఇదే మోడల్ నంబర్తో థాయ్లాండ్కు చెందిన NBTC సర్టిఫికేషన్ ప్లాట్ఫారమ్లలో కూడా కనిపించిన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ మొబైల్ను కంపెనీ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది.
ఈ స్మార్ట్ఫోన్ 512 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ వేరియంట్లో అందుబాటులోకి రాబోతోంది. ఈ ఒప్పో స్మార్ట్ఫోన్ సింగపూర్లో CPH2865 మోడల్ నంబర్తో విడుదల కాబోతోంది. అయితే, ఈ మోడల్ బేస్ వేరియంట్లో అందుబాటులోకి రాబోతోంది. ఇక ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే..ఒప్పో రెనో 16 6.87-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8500 చిప్సెట్ ప్రాసెసర్తో లాంచ్ కానుంది. ఈ సిరీస్లోని ఒప్పో రెనో 16 ప్రో కూడా విడుదల కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది CPH2863 మోడల్ నంబర్తో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ 6.78-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి.
ఈ ఒప్పో రెనో 16 ప్రో మోడల్ ప్రాసెసర్గా మీడియాటెక్ డైమెన్సిటీ 9500s ప్రాసెసర్ను కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మోడల్ అన్నింటి కంటే త్వరలోనే భారత్లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది కూడా ఎంతో శక్తివంతమైన 7,000 mAh బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా OIS సపోర్ట్తో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇప్పటికే ఈ స్మార్ట్ఫోన్ సిరీస్కి సంబంధించిన ప్రీ-రిజర్వేషన్లు కూడా ప్రారంభమైన్నట్లు తెలుస్తోంది.
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Karimnagar: స్క్రీన్ ప్లే అదిరిపోయింది.. కరీంనగర్ PMJ జువెలరీ దోపిడీకి స్కెచ్ గీసింది జైలులోనే..
Hyderabad, Telangana:Karimnagar PMJ Jewelry Robbery Case News: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే (PMJ) జువెలరీ దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించిన్నట్లు తెలిపారు.. ఈ భారీ దోపిడీ వెనక ఉన్న అసలు కుట్ర జైలు గోడల మధ్యే జరిగిందని ఇటీవలే పోలీసులు జరిపిన విచారణలో భాగంగా తేలింది.. దేశవ్యాప్తంగా వందల కిలోల బంగారాన్ని దోచుకున్న గోల్డెన్ థీఫ్ గ్యాంగ్ లీడర్ సుబూత్ సింగ్ ఈ దోపిడీకి సూత్రధారి అని కరీంనగర్ పోలీస్ కమిషనర్ (CP) గౌష్ ఆలం అధికారికంగా తెలిపారు.
ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్న సుబూత్ సింగ్, తన నేర సామ్రాజ్యాన్ని అక్కడి నుంచే రన్ చేపిస్తున్నట్లు సీపీ తెలిపారు. ఈ దోపిడీకి కొన్ని రోజుల ముందు తనను కలవడానికి వచ్చిన అనుచరులకు కరీంనగర్ షోరూం మ్యాప్తో పాటు ప్రత్యేకమైన ప్రణాళికను కూడా వివరించిన్నట్లు సమాచారం.. పోలీసులకు చిక్కకకుండా.. ఎలా పారిపోవాలి.. బంగారాన్ని ఎక్కడ విక్రయించాలి.. అనే అంశాలపై పక్కా..స్కెట్ వేసి ఇచ్చాడని విచారణలో తెలింది.
ఈ దోపిడీ కోసం సబూత్ సింగ్ మొత్తం 13 మంది సభ్యులతో కూడిన ప్రత్యేకమైన ముఠాను రంగంలోకి దించాడు. వీరిలో ప్రతి ఒక్కరికీ ఒక బాధ్యతను అప్పగించారు. కొంతమంది షోరూం పరిసరాల్లో రెక్కీ నిర్వహించడంతో పాటు మరికొందరు వాహనాలను సిద్ధం చేయడం వంటి బాధ్యతలు తీసుకున్నారు. అదేవిధంగా.. ప్రధాన నిందితులు షోరూంలోకి చొరబడి సిబ్బందిని బెదిరించి బంగారాన్ని దోచుకోవడం.. ఇలా ఒక్కక్కరూ వారి వారి బాధ్యతలను అమలు చేసి ఈ భారీ దోపిడీని చేశారు.
అలాగే ఈ దోపిడీలో నిందితులు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ..మొబైల్ ఫోన్లు వాడకుండా కేవలం సంకేతాల ద్వారా సంభాషించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దోపిడీ అయిపోయిన తర్వాత ఈ ముఠా సభ్యులు వివిధ మార్గాల ద్వారా రాష్ట సరిహద్దులు దాటి పారిపోయారు. ఈ దోపిడీపై సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ.. నిందితులు చాలా తెలివిగా వ్యవహరించినప్పటికీ.. ప్రత్యేక బృందాలు సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఇతర సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించాయని.. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.
Also Read: నీ కాళ్లు మొక్కుతా సారూ.. మా ధాన్యం కొనండి!.. జగిత్యాలలో రైతు ఆవేదన..
ఈ కేసులో పరారీలో ఎన్న మిగిలిన నిందితుల కోసం కూడా పోలీసులు పొరుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన గాలింపు చర్యాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. దోచుకున్న బంగారంలో కొంత భాగాన్ని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు సంచారం.. జైలులో ఉంటూ.. సుబూత్ సింగ్ ఎలా ప్లాస్ చేయగలిగాడు.. అతనికి సహకరించిన వారు ఎవరు? అనే కోణంలో కూడా అధికారులు లోతుగా దర్యాప్తు కూడా చేస్తున్నట్లు సమాచారం..
Also Read: నీ కాళ్లు మొక్కుతా సారూ.. మా ధాన్యం కొనండి!.. జగిత్యాలలో రైతు ఆవేదన..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nagamani Video: వామ్మె.. నాగుపాము తల నుంచి నాగమణి తీస్తున్న వీడియో..
Hyderabad, Telangana:Nagamani Video Watch Here: ప్రకృతిలో చాలా మంది తెలియని ఎన్నో రకాల వింతలతో పాటు విశేషాలు దాగి ఉన్నాయి. అందులో మనం పురాణాల్లో విన్న నాగమణి గురించి.. ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. తాజాగా ఒక వ్యక్తి అత్యంత విషపూరితమైన పాము తల నుంచి మెరిసే నల్లటి నాగమణి తీస్తున్నట్లు ఉన్న ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. చాలా మంది ఈ వీడియోను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..ఒక వ్యక్తి తన చేతితో ఒక పొడవైన పామును పట్టుకుని ఉండడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ఈ వ్యక్తి కింగ్ కోబ్రా పాము తల భాగం పట్టుకుని.. దానిని నెలపై నిటారుగా పరచడం మీరు చూడొచ్చు. అలాగే అతను దానికి ఒక చిన్న చాక్తో రంధ్రం చేయడం కూడా మీరు గమనించవచ్చు. అయితే, అతను దాని గుండా.. ఒక నల్లని రాయిని బయిటకు తీశాడు. అదేంటో కాదు.. అత్యంత విలువైన నాగమణి అని నెటిజన్స్ చెబుతున్నారు. ఈ నాగమణి చాలా అరుదైన అకృతిలో, చూడడానికి చాలా వితంగా ఉన్నట్లు ఉండడం మీరు చూడొచ్చు..
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. కొందరు ఇది నిజమైన నాగమణి అని.. ఇలాంటివి దొరకడం చాలా అరుదని అనుకుంటూ ఉంటే.. మరికొందరు మాత్రం.. పాముల్లో ఇలాంటి రాళ్లు ఏర్పడటం సాధరణమని.. ఇలాంటి విషం గడ్డకట్టినప్పుడు ఏర్పడుతూ ఉంటాయని చెబుతున్నారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ వారి అభిప్రాయాలను కామెంట్స్ కూడా చేస్తూ వస్తున్నారు. మరికొందరు ఇది వీడియో వ్యూస్ కోసం నాగుపాము తల భాగం నుంచి ఇలాంటి రాళ్లు తీసి ఉండొచ్చని అంటూ ఉన్నారు. అయితే, ఏది ఏమైనా తాజాగా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
ఏది ఏమైనప్పటికీ.. ఇలాంటి విష పాములను పట్టుకుని నాగమణి తీసే క్రమంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా పాములను ఇలా హింసించడం కూడా చాలా నేరమని, ఇలా చేసేవారిపై అధికారులు తక్షమే చర్యులు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే, ఇలా చాలా మంది పాము తల భాగం చీల్చి వాటిలో లభించే రాళ్లలను వేయిల రూపాయాలకు విక్రయిస్తున్నారు. దీని వల్ల పాములు తీవ్ర గాయాల పాలవుతున్నాయి.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
- https://apple.co/3loQYe ఆపిల్ లింక్..
Nagamani Video: నాగమణి కోసం కోబ్రా కాపాలా కాస్తున్న అరుదైన దృశ్యం.. నెట్టింట వీడియో హల్చల్!
Hyderabad, Telangana:King Cobra Real Nagamani Video: తాజాగా సోషల్ మీడియోలో ప్రకృతిలో మనకు తెలియని వింతలు, విశేషాలు ఎన్నో వైరల్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా పాములకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కొన్ని కింగ్ కోబ్రాల తల భాగాలపై అత్యంత అరుదైన నాగమణి కలిగిన పాములకు సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియా వినియోగదారులకు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కూడా ఈ కోవాకు చెందిందే.. ఈ వైరల్ అవుతన్న వీడియోలో ఉన్న వింతలు విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతున్న ఒక షార్ట్ వీడియో చూస్తుంటే.. ఆ పురాణ గాథలు నిజమేనా? అనే అనుమానం కలగక మానదు.. అవును ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో చికట్లో అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా పామును చూడొచ్చు. అంతేకాకుండా ఈ పాము తల భాగంపై కాకుండా నాగమణి కింద పడి ఉండడం మీరు చూడొచ్చు. అయితే, పురాణ గాథల్లో ఈ నాగమణి గురించి వివిధ రకాలుగా వివరించారు. అంతేకాకుండా దీనిని శక్తివంతమైనదిగా కూడా చెప్పుకుంటారు.
Animal Zone అనే యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసిన ఈ 13 సెకన్ల వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తూ వస్తోంది. చీకటి రాత్రి సమయంలో ఒక పెద్ద నాగుపాము తన పడగ విప్పి గంభీరంగా కూర్చుని ఉంది. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఆ పాము తల భాగం కాకుండా కింది భాగంలో ఒక ప్రకాశవంతమైన వెలుగు కనిపిస్తోంది. అది చూడటానికి అచ్చం ఒక వజ్రం మెరుస్తున్నట్లుగా ఉంది. అయితే, ఈ పాము దాని కాపాలాగా ఉన్నట్లు కూడా మీరు చూడొచ్చు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే అన్ని మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవ్వడం ప్రారంభమయ్యింది. అంతేకాకుండా చాలా మంది ఈ వీడియోను చూసి.. నిజమైన నాగమణి అని కామెంట్స్ కూడా పెడుతున్నారు. అంతేకాకుండా ఇలాంటి దృశ్యాలు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తాయని కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ వీడియో చూసిన మరికొంతమంది ఇది గ్రాఫిక్స్ వీడియో అని.. దీనిని ఎవరో కావాలనే వ్యూస్ కోసం పోస్ట్ చేశారని చెబుతూ వస్తున్నారు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
- https://apple.co/3loQYe ఆపిల్ లింక్..
Delhi Rape Case: ఢిల్లీలో మరో నిర్భయ ఘటన..స్లీపర్ బస్సులో మహిళపై డ్రైవర్, కండెక్టర్ అత్యాచారం!
New Delhi, Delhi:Delhi Rape Case News: ఢిల్లీలో మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. స్లీపర్ బస్సులో ఓ వివాహితపై అత్యాచార ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళనకు గురిచేసింది. పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న మహిళలపై ఆ బస్సు డ్రైవర్, కండక్టర్ ఈ అమానుషానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన నిందితులు ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు.
ఏం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలు పీతాంపుర నివాసి. ఆమె మంగోల్పురిలోని ఒక ఫ్యాక్టరీలో కార్మికురాలుగా పనిచేస్తోంది. సోమవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో పని ముగించుకుని ఆమె ఇంటికి నడుచుకుంటూ వెళ్తోంది. మార్గమధ్యలో సరస్వతీ విహార్ వద్ద ఆగి ఉన్న ఒక స్లీపర్ బస్సు ప్రవేశ ద్వారం వద్ద నిలబడిన వ్యక్తిని ఆమె సమయం అడిగింది. ఆ సమయంలో నిందితులు ఆమెను బలవంతంగా బస్సులోకి లాక్కెళ్లారు.
రాణి బాగ్ నుండి నంగ్లోయ్ వైపు బస్సు తీసుకువెళుతూ, నిర్మానుష్య ప్రాంతంలో నిలిపి ఉంచి ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు తక్షణమే స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘటనకు బాధ్యులైన బస్సు డ్రైవర్, కండక్టర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరానికి ఉపయోగించిన స్లీపర్ బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరస్వతీ విహార్ నుండి నంగ్లోయ్ వరకు బస్సు నడిపిన సీసీటీవీ (CCTV) ఫుటేజీని పోలీసులు సేకరిస్తున్నారు.
బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు, ఆమెకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. అయితే, రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లే మహిళలకు ప్రజా రవాణా వ్యవస్థలో భద్రత కరువైందనే విమర్శలు మరోసారి వెల్లువెత్తుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని సీనియర్ పోలీసు అధికారులు వెల్లడించారు.
Also Read: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్..ఇకపై లక్కీడిప్ విధానంలో ఆ టికెట్లు!
Also Read: ఏపీలో మోగనున్న ఎన్నికల నగారా..స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Srivani Tickets Lucky DIP: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్..ఇకపై లక్కీడిప్ విధానంలో ఆ టికెట్లు!
Tirupati Urban, Andhra Pradesh:Srivani Tickets Lucky DIP News: సామాన్య భక్తులకు అనుకూలంగా కల్పిస్తూ, టీటీడీ పాలనలో సమూల మార్పులు చేయబోతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ ముద్దాడ రవిచంద్ర వెల్లడించారు. తాజాగా ఆయన ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి వ్యాప్తంగా చేయనున్న సమూల మార్పుల గురించి ఆయన మాట్లాడారు.
లక్కీడిప్లో శ్రీవాణి టికెట్లు..
ఇటీవలే శ్రీవాణి టికెట్ల పంపిణీల అక్రమాలను పసిగట్టిన నేపథ్యంలో ఆన్లైన్ బుకింగ్లో అక్రమాలను అరికట్టేందుకు ఇకపై 'లక్కీడిప్' పద్ధతిని అమలు చేయనున్నట్లు టీటీడీ ఈవో రవిచంద్ర తెలిపారు. ఈ కోటాలో రోజుకు 1,500 మందికి శ్రీవాణి టికెట్లు జారీ చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి వంటి ప్రధాన విమానాశ్రయాల నుంచి కూడా శ్రీవాణి కోట టికెట్లు జారీ చేసే విధంగా చర్యలు చేపట్టనున్నారు. అయితే ఇప్పటికే గతంలో విరాళాలు ఇచ్చి దర్శనం చేసుకోని 41 వేల మందికి జూన్ మొదటి వారం నుంచి రోజుకు 300 టికెట్ల చొప్పున కేటాయించి, వచ్చే 5-10 నెలల్లో బ్యాక్లాగ్ను పూర్తి చేసే విధంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
అలాగే సాధారణ భక్తులు శ్రీవారి దర్శనానికి నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు వీలుగా వీఐపీ బ్రేక్ దర్శనాల సంఖ్యను భారీగా తగ్గించినట్లు టీటీడీ ఈవో వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల సాధారణ రోజుల్లో సామాన్యులకు త్వరగా స్వామివారి దర్శనం లభిస్తోందని ఈ సందర్భంగా తెలిపారు. తాజాగా 2.5 లక్షల మందికి మూడు రోజుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించినట్లు చెప్పుకొచ్చారు.
వీటితో పాటు పాలనాపరమైన సంస్కరణలను ఆస్తుల రక్షణ కోసం తగిన చర్యలు చేపట్టనున్నారని తెలుస్తోంది. ఒకే స్థానంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సిబ్బంది వల్ల తలెత్తుతున్న సమస్యలను నివారించేందుకు కొత్త ట్రాన్స్ఫర్ పాలసీని రూపొందించారు. అలాగే టీటీడీ ఐటీ విభాగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, టీటీడీ విద్యాసంస్థల అభివృద్ధికి రూ.160 కోట్లు వెచ్చించనున్నట్లు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. దేశవ్యాప్తంగా టీటీడీకి ఉన్న 11,000 ఆస్తులను రికార్డుల్లో నమోదు చేసి, అన్యాక్రాంతం కాకుండా కాపాడటమే తమ తొలి ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు.
ALso Read: బంగారం, వెండి ప్రియులకు కేంద్రం మరో ఝలక్..భారీగా పెరగనున్న ధరలు!
Also Read: 'తల్లికి వందనం' డబ్బు విడుదలకు ముహూర్తం ఫిక్స్..డబ్బులు అకౌంట్లో పడేది ఆరోజే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Budhaditya Rajayoga 2026: శని జయంతి రోజున అరుదైన రాజయోగం.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు, కనకవర్షమే!
Hyderabad, Telangana:Budhaditya Rajayoga Effect On Zodiac Telugu: శని జయంతి రోజునే ఎంతో శక్తివంతమైన రాజయోగం ఏర్పడబోతోంది. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజు ఏర్పడే బుధాదిత్య రాజయోగానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ యోగంతో కొన్ని రాశులవారు జీవితాల్లో అద్భుతమైన పురోగతి సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆదాన మార్గాలు కూడా ఏర్పడే ఛాన్స్లు ఉన్నాయి. ఆర్థిక స్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత బలంగా మారుతాయి. ముఖ్యంగా నిలిపోయిన పనులు సులభంగా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మే 15న సూర్యుడు, బుధుడు కలిసి వృషభ రాశిలోకి ప్రవేశించాయి. దీని ఫలితంగానే ఎంతో శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. అయితే, ఈ రాజయోగం శని జయంతి రోజు ఏర్పడడం చాలా విశేషమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని ప్రభావం మే 29వ వరకు కొనసాగుతుంది. దీంతో ఆయా రాశులవారికి ఆర్థికంగా బోలెడు లాభాలు చేకూరుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా భారీ డబ్బును కూడా సులభంగా సొంతం చేసుకుంటారు. అయితే, ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మిథున రాశి
బుధాదిత్య రాజయోగం ప్రభావంతో మిథున రాశివారికి ఈ సమయం ఎంతో అద్బుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో వృత్తి జీవితంలో గొప్ప పురోగతి కూడా లభిస్తుంది. ఉద్యోగాలు మారాలనుకుంటున్నవారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు వైవాహిక జీవితం కూడా చాలా వరకు బాగుంటుంది. అలాగే విదేశాలకు వెళ్లాలనుకునేవారి కోరికలు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.
సింహ రాశి
సూర్య, బుధ గ్రహాల కలయికతో సింహ రాశివారికి ఎంతో లాభదాయంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఆదాయ మార్గాలు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతాయి. అలాగే ఆర్థిక స్థితులు కూడా చాలా వరకు బలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు చేసేవారు కొత్త కొత్త బాధ్యతలు కూడా చాలా వరకు పొందుతారు. దీంతో పాటు ఆధ్యాత్మికంగా కొన్ని యాత్రలకు కూడా వెళ్తారు. అలాగే వీరికి ఈ సమయంలో ఆస్తులు కూడా గతంలో కంటే ఇప్పుడు పెరిగే ఛాన్స్లు ఉన్నాయి. అంతేకాకుండా వాహనాలు కూడా సులభంగా కొనుగోలు చేస్తారు.
కన్యారాశి
కన్యారాశిలో జన్మించిన వారికి కూడా ఈ సమయం చాలా ఉత్తమంగా ఉంటుంది. అంతేకాకుండా బుధాదిత్య రాజయోగం కారణంగా భారీ మొత్తంలో ఆదాయం కూడా పెరుగుతుంది. వీరికి ఈ సమయంలో తప్పకుండా ఉద్యోగాలు కూడా లభిస్తాయి. వ్యాపారాలు చేసేవారు గొప్ప పురోగతిని సాధించే ఛాన్స్లు ఉన్నాయి. అంతేకాకుండా వీరు ఎప్పటి నుంచో అనుకుంటున్న కార్లు కూడా కొనుగోలు చేస్తారు. అలాగే కొత్త కొత్త బాధ్యతలు కూడా ఈ సమయంలో పెరుగుతాయి.
కుంభ రాశి
కుంభ రాశివారికి ఈ సమయంలో కుటుంబ సభ్యులతో మంచి సమాయాన్ని కూడా గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కొత్త ఉద్యోగాల పొందాలని చూస్తున్నవారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అలాగే వీరికి భారీ మొత్తంలో పదోన్నతులు కూడా లభిస్తాయి. అంతేకాకుండా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారి కల కూడా చాలా వరకు నెరవేరుతుంది. డబ్బుపరమైన సమస్యలు కూడా సులభంగా నెరవేరే ఛాన్స్లు ఉన్నాయి. అంతేకాకుండా వీరు వ్యాపారాల పరంగా బంపర్ ప్రాజెక్ట్లు కూడా సొంతం చేసుకుంటారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KKR vs RCB Highlights: కలకత్తా ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు.. 8వ విజయంతో బెంగళూరు బెర్త్ కన్ఫామ్
Jaipur, Rajasthan:Virat Kohli: ఐపీఎల్ సీజన్లో చాంపియన్గా నిలిచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో ట్రోఫీపై కన్నేసినట్టు కనిపిస్తోంది. అద్భుత విజయాలతో రాణిస్తున్న బెంగళూరు జట్టు ప్లేఆఫ్స్ అవకాశాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. కలకత్తా నైట్రైడర్స్పై ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన బెంగళూరు మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అన్నింటా విఫలమవుతున్న కలకత్తా నైట్రౌడర్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఈ మ్యాచ్కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. రేపు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Nuzendla, Andhra Pradesh:AP Govt Employees: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు రేపో మాపో భారీ శుభవార్త వినిపించబోతున్నారు. ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించగా.. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అమలు సాధ్యసాధ్యాలపై రేపు మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు సూత్రాలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
బంగారం కొనరాదు.. విదేశాలకు వెళ్లరాదు.. రవాణా తగ్గించుకోవాలి.. వర్క్ఫ్రమ్ విధానం అమలు చేయాలని తెలంగాణలో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మోదీ చేసిన పొదుపు సూత్రాలను ఏపీ ప్రభుత్వం పక్కా పాటించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి, మంత్రులు తమ కాన్వాయ్లలో వాహనాలను కుదించారు. ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ప్రధానమంత్రి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం కొనసాగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 'ప్రభుత్వంలోనూ వర్క్ ఫ్రమ్ హోం విధానం తీసుకొస్తాం' అని ప్రకటించారు. రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. అయితే రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ప్రధానమంత్రి చెప్పిన పొదుపు మంత్రంపై రేపు మంత్రివర్గ సమావేశంలో ఏపీ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోబోతుందని సమాచారం. అమరావతిలోని సచివాలయంలో గురువారం ఉదయం 10.30 గంటలకు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ప్రధాని పొదుపు పిలుపు చర్యలపై ప్రత్యేకంగా మంత్రివర్గం చర్చించబోతున్నది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ పొదుపు చర్యలపై సూచనలు చేయనుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోంపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. వర్క్ ఫ్రమ్ విధానం అమల్లోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులు సంబరాల్లో మునిగి తేలనున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంతో రవాణా ఖర్చు, సమయం ఆదా వంటివి ఉంటాయని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. ఒక విధంగా ఇంటి నుంచి పని చేయడం మేలు కానీ.. దీర్ఘకాలికంగా సమాజంపై.. ఆర్థిక వ్యవస్థతోపాటు ప్రజల మానసిక ప్రవర్తనలోనూ దుష్ప్రభావం పడే అవకాశం ఉందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుంది? ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు ఎదురుచూస్తున్నారు.
