వనస్థలిపురంలో సాఫ్ట్వేర్ యువతిపై చిన్ననాటి స్నేహితుల అత్యాచారం
Vanasthalipuram, Telangana:వనస్థలిపురంలో ఒక సాఫ్ట్వేర్ యువతిపై ఆమె చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డి మరియు మరో వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి ఇటీవలే ఉద్యోగం రావడంతో నిర్వహించిన పార్టీ సందర్భంగా ఈ ఘటన జరిగింది. మత్తులో ఉన్నప్పుడు హోటల్ గదిలో ఈ దారుణం జరిగింది. నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Karimnagar: స్క్రీన్ ప్లే అదిరిపోయింది.. కరీంనగర్ PMJ జువెలరీ దోపిడీకి స్కెచ్ గీసింది జైలులోనే..
Hyderabad, Telangana:Karimnagar PMJ Jewelry Robbery Case News: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే (PMJ) జువెలరీ దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించిన్నట్లు తెలిపారు.. ఈ భారీ దోపిడీ వెనక ఉన్న అసలు కుట్ర జైలు గోడల మధ్యే జరిగిందని ఇటీవలే పోలీసులు జరిపిన విచారణలో భాగంగా తేలింది.. దేశవ్యాప్తంగా వందల కిలోల బంగారాన్ని దోచుకున్న గోల్డెన్ థీఫ్ గ్యాంగ్ లీడర్ సుబూత్ సింగ్ ఈ దోపిడీకి సూత్రధారి అని కరీంనగర్ పోలీస్ కమిషనర్ (CP) గౌష్ ఆలం అధికారికంగా తెలిపారు.
ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్న సుబూత్ సింగ్, తన నేర సామ్రాజ్యాన్ని అక్కడి నుంచే రన్ చేపిస్తున్నట్లు సీపీ తెలిపారు. ఈ దోపిడీకి కొన్ని రోజుల ముందు తనను కలవడానికి వచ్చిన అనుచరులకు కరీంనగర్ షోరూం మ్యాప్తో పాటు ప్రత్యేకమైన ప్రణాళికను కూడా వివరించిన్నట్లు సమాచారం.. పోలీసులకు చిక్కకకుండా.. ఎలా పారిపోవాలి.. బంగారాన్ని ఎక్కడ విక్రయించాలి.. అనే అంశాలపై పక్కా..స్కెట్ వేసి ఇచ్చాడని విచారణలో తెలింది.
ఈ దోపిడీ కోసం సబూత్ సింగ్ మొత్తం 13 మంది సభ్యులతో కూడిన ప్రత్యేకమైన ముఠాను రంగంలోకి దించాడు. వీరిలో ప్రతి ఒక్కరికీ ఒక బాధ్యతను అప్పగించారు. కొంతమంది షోరూం పరిసరాల్లో రెక్కీ నిర్వహించడంతో పాటు మరికొందరు వాహనాలను సిద్ధం చేయడం వంటి బాధ్యతలు తీసుకున్నారు. అదేవిధంగా.. ప్రధాన నిందితులు షోరూంలోకి చొరబడి సిబ్బందిని బెదిరించి బంగారాన్ని దోచుకోవడం.. ఇలా ఒక్కక్కరూ వారి వారి బాధ్యతలను అమలు చేసి ఈ భారీ దోపిడీని చేశారు.
అలాగే ఈ దోపిడీలో నిందితులు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ..మొబైల్ ఫోన్లు వాడకుండా కేవలం సంకేతాల ద్వారా సంభాషించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దోపిడీ అయిపోయిన తర్వాత ఈ ముఠా సభ్యులు వివిధ మార్గాల ద్వారా రాష్ట సరిహద్దులు దాటి పారిపోయారు. ఈ దోపిడీపై సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ.. నిందితులు చాలా తెలివిగా వ్యవహరించినప్పటికీ.. ప్రత్యేక బృందాలు సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఇతర సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించాయని.. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.
Also Read: నీ కాళ్లు మొక్కుతా సారూ.. మా ధాన్యం కొనండి!.. జగిత్యాలలో రైతు ఆవేదన..
ఈ కేసులో పరారీలో ఎన్న మిగిలిన నిందితుల కోసం కూడా పోలీసులు పొరుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన గాలింపు చర్యాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. దోచుకున్న బంగారంలో కొంత భాగాన్ని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు సంచారం.. జైలులో ఉంటూ.. సుబూత్ సింగ్ ఎలా ప్లాస్ చేయగలిగాడు.. అతనికి సహకరించిన వారు ఎవరు? అనే కోణంలో కూడా అధికారులు లోతుగా దర్యాప్తు కూడా చేస్తున్నట్లు సమాచారం..
Also Read: నీ కాళ్లు మొక్కుతా సారూ.. మా ధాన్యం కొనండి!.. జగిత్యాలలో రైతు ఆవేదన..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nagamani Video: వామ్మె.. నాగుపాము తల నుంచి నాగమణి తీస్తున్న వీడియో..
Hyderabad, Telangana:Nagamani Video Watch Here: ప్రకృతిలో చాలా మంది తెలియని ఎన్నో రకాల వింతలతో పాటు విశేషాలు దాగి ఉన్నాయి. అందులో మనం పురాణాల్లో విన్న నాగమణి గురించి.. ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. తాజాగా ఒక వ్యక్తి అత్యంత విషపూరితమైన పాము తల నుంచి మెరిసే నల్లటి నాగమణి తీస్తున్నట్లు ఉన్న ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. చాలా మంది ఈ వీడియోను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..ఒక వ్యక్తి తన చేతితో ఒక పొడవైన పామును పట్టుకుని ఉండడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ఈ వ్యక్తి కింగ్ కోబ్రా పాము తల భాగం పట్టుకుని.. దానిని నెలపై నిటారుగా పరచడం మీరు చూడొచ్చు. అలాగే అతను దానికి ఒక చిన్న చాక్తో రంధ్రం చేయడం కూడా మీరు గమనించవచ్చు. అయితే, అతను దాని గుండా.. ఒక నల్లని రాయిని బయిటకు తీశాడు. అదేంటో కాదు.. అత్యంత విలువైన నాగమణి అని నెటిజన్స్ చెబుతున్నారు. ఈ నాగమణి చాలా అరుదైన అకృతిలో, చూడడానికి చాలా వితంగా ఉన్నట్లు ఉండడం మీరు చూడొచ్చు..
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. కొందరు ఇది నిజమైన నాగమణి అని.. ఇలాంటివి దొరకడం చాలా అరుదని అనుకుంటూ ఉంటే.. మరికొందరు మాత్రం.. పాముల్లో ఇలాంటి రాళ్లు ఏర్పడటం సాధరణమని.. ఇలాంటి విషం గడ్డకట్టినప్పుడు ఏర్పడుతూ ఉంటాయని చెబుతున్నారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ వారి అభిప్రాయాలను కామెంట్స్ కూడా చేస్తూ వస్తున్నారు. మరికొందరు ఇది వీడియో వ్యూస్ కోసం నాగుపాము తల భాగం నుంచి ఇలాంటి రాళ్లు తీసి ఉండొచ్చని అంటూ ఉన్నారు. అయితే, ఏది ఏమైనా తాజాగా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
ఏది ఏమైనప్పటికీ.. ఇలాంటి విష పాములను పట్టుకుని నాగమణి తీసే క్రమంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా పాములను ఇలా హింసించడం కూడా చాలా నేరమని, ఇలా చేసేవారిపై అధికారులు తక్షమే చర్యులు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే, ఇలా చాలా మంది పాము తల భాగం చీల్చి వాటిలో లభించే రాళ్లలను వేయిల రూపాయాలకు విక్రయిస్తున్నారు. దీని వల్ల పాములు తీవ్ర గాయాల పాలవుతున్నాయి.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
- https://apple.co/3loQYe ఆపిల్ లింక్..
Nagamani Video: నాగమణి కోసం కోబ్రా కాపాలా కాస్తున్న అరుదైన దృశ్యం.. నెట్టింట వీడియో హల్చల్!
Hyderabad, Telangana:King Cobra Real Nagamani Video: తాజాగా సోషల్ మీడియోలో ప్రకృతిలో మనకు తెలియని వింతలు, విశేషాలు ఎన్నో వైరల్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా పాములకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కొన్ని కింగ్ కోబ్రాల తల భాగాలపై అత్యంత అరుదైన నాగమణి కలిగిన పాములకు సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియా వినియోగదారులకు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కూడా ఈ కోవాకు చెందిందే.. ఈ వైరల్ అవుతన్న వీడియోలో ఉన్న వింతలు విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతున్న ఒక షార్ట్ వీడియో చూస్తుంటే.. ఆ పురాణ గాథలు నిజమేనా? అనే అనుమానం కలగక మానదు.. అవును ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో చికట్లో అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా పామును చూడొచ్చు. అంతేకాకుండా ఈ పాము తల భాగంపై కాకుండా నాగమణి కింద పడి ఉండడం మీరు చూడొచ్చు. అయితే, పురాణ గాథల్లో ఈ నాగమణి గురించి వివిధ రకాలుగా వివరించారు. అంతేకాకుండా దీనిని శక్తివంతమైనదిగా కూడా చెప్పుకుంటారు.
Animal Zone అనే యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసిన ఈ 13 సెకన్ల వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తూ వస్తోంది. చీకటి రాత్రి సమయంలో ఒక పెద్ద నాగుపాము తన పడగ విప్పి గంభీరంగా కూర్చుని ఉంది. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఆ పాము తల భాగం కాకుండా కింది భాగంలో ఒక ప్రకాశవంతమైన వెలుగు కనిపిస్తోంది. అది చూడటానికి అచ్చం ఒక వజ్రం మెరుస్తున్నట్లుగా ఉంది. అయితే, ఈ పాము దాని కాపాలాగా ఉన్నట్లు కూడా మీరు చూడొచ్చు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే అన్ని మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవ్వడం ప్రారంభమయ్యింది. అంతేకాకుండా చాలా మంది ఈ వీడియోను చూసి.. నిజమైన నాగమణి అని కామెంట్స్ కూడా పెడుతున్నారు. అంతేకాకుండా ఇలాంటి దృశ్యాలు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తాయని కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ వీడియో చూసిన మరికొంతమంది ఇది గ్రాఫిక్స్ వీడియో అని.. దీనిని ఎవరో కావాలనే వ్యూస్ కోసం పోస్ట్ చేశారని చెబుతూ వస్తున్నారు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
- https://apple.co/3loQYe ఆపిల్ లింక్..
Delhi Rape Case: ఢిల్లీలో మరో నిర్భయ ఘటన..స్లీపర్ బస్సులో మహిళపై డ్రైవర్, కండెక్టర్ అత్యాచారం!
New Delhi, Delhi:Delhi Rape Case News: ఢిల్లీలో మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. స్లీపర్ బస్సులో ఓ వివాహితపై అత్యాచార ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళనకు గురిచేసింది. పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న మహిళలపై ఆ బస్సు డ్రైవర్, కండక్టర్ ఈ అమానుషానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన నిందితులు ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు.
ఏం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలు పీతాంపుర నివాసి. ఆమె మంగోల్పురిలోని ఒక ఫ్యాక్టరీలో కార్మికురాలుగా పనిచేస్తోంది. సోమవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో పని ముగించుకుని ఆమె ఇంటికి నడుచుకుంటూ వెళ్తోంది. మార్గమధ్యలో సరస్వతీ విహార్ వద్ద ఆగి ఉన్న ఒక స్లీపర్ బస్సు ప్రవేశ ద్వారం వద్ద నిలబడిన వ్యక్తిని ఆమె సమయం అడిగింది. ఆ సమయంలో నిందితులు ఆమెను బలవంతంగా బస్సులోకి లాక్కెళ్లారు.
రాణి బాగ్ నుండి నంగ్లోయ్ వైపు బస్సు తీసుకువెళుతూ, నిర్మానుష్య ప్రాంతంలో నిలిపి ఉంచి ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు తక్షణమే స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘటనకు బాధ్యులైన బస్సు డ్రైవర్, కండక్టర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరానికి ఉపయోగించిన స్లీపర్ బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరస్వతీ విహార్ నుండి నంగ్లోయ్ వరకు బస్సు నడిపిన సీసీటీవీ (CCTV) ఫుటేజీని పోలీసులు సేకరిస్తున్నారు.
బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు, ఆమెకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. అయితే, రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లే మహిళలకు ప్రజా రవాణా వ్యవస్థలో భద్రత కరువైందనే విమర్శలు మరోసారి వెల్లువెత్తుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని సీనియర్ పోలీసు అధికారులు వెల్లడించారు.
Also Read: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్..ఇకపై లక్కీడిప్ విధానంలో ఆ టికెట్లు!
Also Read: ఏపీలో మోగనున్న ఎన్నికల నగారా..స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Srivani Tickets Lucky DIP: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్..ఇకపై లక్కీడిప్ విధానంలో ఆ టికెట్లు!
Tirupati Urban, Andhra Pradesh:Srivani Tickets Lucky DIP News: సామాన్య భక్తులకు అనుకూలంగా కల్పిస్తూ, టీటీడీ పాలనలో సమూల మార్పులు చేయబోతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ ముద్దాడ రవిచంద్ర వెల్లడించారు. తాజాగా ఆయన ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి వ్యాప్తంగా చేయనున్న సమూల మార్పుల గురించి ఆయన మాట్లాడారు.
లక్కీడిప్లో శ్రీవాణి టికెట్లు..
ఇటీవలే శ్రీవాణి టికెట్ల పంపిణీల అక్రమాలను పసిగట్టిన నేపథ్యంలో ఆన్లైన్ బుకింగ్లో అక్రమాలను అరికట్టేందుకు ఇకపై 'లక్కీడిప్' పద్ధతిని అమలు చేయనున్నట్లు టీటీడీ ఈవో రవిచంద్ర తెలిపారు. ఈ కోటాలో రోజుకు 1,500 మందికి శ్రీవాణి టికెట్లు జారీ చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి వంటి ప్రధాన విమానాశ్రయాల నుంచి కూడా శ్రీవాణి కోట టికెట్లు జారీ చేసే విధంగా చర్యలు చేపట్టనున్నారు. అయితే ఇప్పటికే గతంలో విరాళాలు ఇచ్చి దర్శనం చేసుకోని 41 వేల మందికి జూన్ మొదటి వారం నుంచి రోజుకు 300 టికెట్ల చొప్పున కేటాయించి, వచ్చే 5-10 నెలల్లో బ్యాక్లాగ్ను పూర్తి చేసే విధంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
అలాగే సాధారణ భక్తులు శ్రీవారి దర్శనానికి నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు వీలుగా వీఐపీ బ్రేక్ దర్శనాల సంఖ్యను భారీగా తగ్గించినట్లు టీటీడీ ఈవో వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల సాధారణ రోజుల్లో సామాన్యులకు త్వరగా స్వామివారి దర్శనం లభిస్తోందని ఈ సందర్భంగా తెలిపారు. తాజాగా 2.5 లక్షల మందికి మూడు రోజుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించినట్లు చెప్పుకొచ్చారు.
వీటితో పాటు పాలనాపరమైన సంస్కరణలను ఆస్తుల రక్షణ కోసం తగిన చర్యలు చేపట్టనున్నారని తెలుస్తోంది. ఒకే స్థానంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సిబ్బంది వల్ల తలెత్తుతున్న సమస్యలను నివారించేందుకు కొత్త ట్రాన్స్ఫర్ పాలసీని రూపొందించారు. అలాగే టీటీడీ ఐటీ విభాగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, టీటీడీ విద్యాసంస్థల అభివృద్ధికి రూ.160 కోట్లు వెచ్చించనున్నట్లు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. దేశవ్యాప్తంగా టీటీడీకి ఉన్న 11,000 ఆస్తులను రికార్డుల్లో నమోదు చేసి, అన్యాక్రాంతం కాకుండా కాపాడటమే తమ తొలి ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు.
ALso Read: బంగారం, వెండి ప్రియులకు కేంద్రం మరో ఝలక్..భారీగా పెరగనున్న ధరలు!
Also Read: 'తల్లికి వందనం' డబ్బు విడుదలకు ముహూర్తం ఫిక్స్..డబ్బులు అకౌంట్లో పడేది ఆరోజే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Budhaditya Rajayoga 2026: శని జయంతి రోజున అరుదైన రాజయోగం.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు, కనకవర్షమే!
Hyderabad, Telangana:Budhaditya Rajayoga Effect On Zodiac Telugu: శని జయంతి రోజునే ఎంతో శక్తివంతమైన రాజయోగం ఏర్పడబోతోంది. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజు ఏర్పడే బుధాదిత్య రాజయోగానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ యోగంతో కొన్ని రాశులవారు జీవితాల్లో అద్భుతమైన పురోగతి సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆదాన మార్గాలు కూడా ఏర్పడే ఛాన్స్లు ఉన్నాయి. ఆర్థిక స్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత బలంగా మారుతాయి. ముఖ్యంగా నిలిపోయిన పనులు సులభంగా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మే 15న సూర్యుడు, బుధుడు కలిసి వృషభ రాశిలోకి ప్రవేశించాయి. దీని ఫలితంగానే ఎంతో శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. అయితే, ఈ రాజయోగం శని జయంతి రోజు ఏర్పడడం చాలా విశేషమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని ప్రభావం మే 29వ వరకు కొనసాగుతుంది. దీంతో ఆయా రాశులవారికి ఆర్థికంగా బోలెడు లాభాలు చేకూరుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా భారీ డబ్బును కూడా సులభంగా సొంతం చేసుకుంటారు. అయితే, ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మిథున రాశి
బుధాదిత్య రాజయోగం ప్రభావంతో మిథున రాశివారికి ఈ సమయం ఎంతో అద్బుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో వృత్తి జీవితంలో గొప్ప పురోగతి కూడా లభిస్తుంది. ఉద్యోగాలు మారాలనుకుంటున్నవారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు వైవాహిక జీవితం కూడా చాలా వరకు బాగుంటుంది. అలాగే విదేశాలకు వెళ్లాలనుకునేవారి కోరికలు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.
సింహ రాశి
సూర్య, బుధ గ్రహాల కలయికతో సింహ రాశివారికి ఎంతో లాభదాయంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఆదాయ మార్గాలు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతాయి. అలాగే ఆర్థిక స్థితులు కూడా చాలా వరకు బలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు చేసేవారు కొత్త కొత్త బాధ్యతలు కూడా చాలా వరకు పొందుతారు. దీంతో పాటు ఆధ్యాత్మికంగా కొన్ని యాత్రలకు కూడా వెళ్తారు. అలాగే వీరికి ఈ సమయంలో ఆస్తులు కూడా గతంలో కంటే ఇప్పుడు పెరిగే ఛాన్స్లు ఉన్నాయి. అంతేకాకుండా వాహనాలు కూడా సులభంగా కొనుగోలు చేస్తారు.
కన్యారాశి
కన్యారాశిలో జన్మించిన వారికి కూడా ఈ సమయం చాలా ఉత్తమంగా ఉంటుంది. అంతేకాకుండా బుధాదిత్య రాజయోగం కారణంగా భారీ మొత్తంలో ఆదాయం కూడా పెరుగుతుంది. వీరికి ఈ సమయంలో తప్పకుండా ఉద్యోగాలు కూడా లభిస్తాయి. వ్యాపారాలు చేసేవారు గొప్ప పురోగతిని సాధించే ఛాన్స్లు ఉన్నాయి. అంతేకాకుండా వీరు ఎప్పటి నుంచో అనుకుంటున్న కార్లు కూడా కొనుగోలు చేస్తారు. అలాగే కొత్త కొత్త బాధ్యతలు కూడా ఈ సమయంలో పెరుగుతాయి.
కుంభ రాశి
కుంభ రాశివారికి ఈ సమయంలో కుటుంబ సభ్యులతో మంచి సమాయాన్ని కూడా గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కొత్త ఉద్యోగాల పొందాలని చూస్తున్నవారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అలాగే వీరికి భారీ మొత్తంలో పదోన్నతులు కూడా లభిస్తాయి. అంతేకాకుండా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారి కల కూడా చాలా వరకు నెరవేరుతుంది. డబ్బుపరమైన సమస్యలు కూడా సులభంగా నెరవేరే ఛాన్స్లు ఉన్నాయి. అంతేకాకుండా వీరు వ్యాపారాల పరంగా బంపర్ ప్రాజెక్ట్లు కూడా సొంతం చేసుకుంటారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KKR vs RCB Highlights: కలకత్తా ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు.. 8వ విజయంతో బెంగళూరు బెర్త్ కన్ఫామ్
Jaipur, Rajasthan:Virat Kohli: ఐపీఎల్ సీజన్లో చాంపియన్గా నిలిచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో ట్రోఫీపై కన్నేసినట్టు కనిపిస్తోంది. అద్భుత విజయాలతో రాణిస్తున్న బెంగళూరు జట్టు ప్లేఆఫ్స్ అవకాశాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. కలకత్తా నైట్రైడర్స్పై ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన బెంగళూరు మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అన్నింటా విఫలమవుతున్న కలకత్తా నైట్రౌడర్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఈ మ్యాచ్కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. రేపు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Nuzendla, Andhra Pradesh:AP Govt Employees: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు రేపో మాపో భారీ శుభవార్త వినిపించబోతున్నారు. ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించగా.. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అమలు సాధ్యసాధ్యాలపై రేపు మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు సూత్రాలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
బంగారం కొనరాదు.. విదేశాలకు వెళ్లరాదు.. రవాణా తగ్గించుకోవాలి.. వర్క్ఫ్రమ్ విధానం అమలు చేయాలని తెలంగాణలో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మోదీ చేసిన పొదుపు సూత్రాలను ఏపీ ప్రభుత్వం పక్కా పాటించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి, మంత్రులు తమ కాన్వాయ్లలో వాహనాలను కుదించారు. ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ప్రధానమంత్రి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం కొనసాగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 'ప్రభుత్వంలోనూ వర్క్ ఫ్రమ్ హోం విధానం తీసుకొస్తాం' అని ప్రకటించారు. రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. అయితే రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ప్రధానమంత్రి చెప్పిన పొదుపు మంత్రంపై రేపు మంత్రివర్గ సమావేశంలో ఏపీ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోబోతుందని సమాచారం. అమరావతిలోని సచివాలయంలో గురువారం ఉదయం 10.30 గంటలకు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ప్రధాని పొదుపు పిలుపు చర్యలపై ప్రత్యేకంగా మంత్రివర్గం చర్చించబోతున్నది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ పొదుపు చర్యలపై సూచనలు చేయనుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోంపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. వర్క్ ఫ్రమ్ విధానం అమల్లోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులు సంబరాల్లో మునిగి తేలనున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంతో రవాణా ఖర్చు, సమయం ఆదా వంటివి ఉంటాయని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. ఒక విధంగా ఇంటి నుంచి పని చేయడం మేలు కానీ.. దీర్ఘకాలికంగా సమాజంపై.. ఆర్థిక వ్యవస్థతోపాటు ప్రజల మానసిక ప్రవర్తనలోనూ దుష్ప్రభావం పడే అవకాశం ఉందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుంది? ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు ఎదురుచూస్తున్నారు.
Chandrababu Convoy: ప్రధాని మోదీ పొదుపు మంత్రం.. ఆయన మార్గంలోనే చంద్రబాబు కాన్వాయ్ తగ్గింపు
Nuzendla, Andhra Pradesh:Fuel Conservation Drive: భారతదేశమంతటా పొదుపు మంత్రం మోగుతోంది. ఎవరు చెప్పారో.. దాని వలన ఏం ఉపయోగమో తెలియదు కానీ అకస్మాత్తుగా తక్కువ వాహనాలు వినియోగించాలని ప్రచారం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ బహిరంగ సభలో చెప్పినట్టుగానే ఆయన కూడా పొదుపు మంత్రం పాటించారు. ఆయన బాటలోనే టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు వెళ్తున్నారు. చంద్రబాబు కూడా తన కాన్వాయ్లోని వాహనాలను తగ్గించారు. కాన్వాయ్లో తక్కువ వాహనాలు ఉంచాలని చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. కాన్వాయ్లో వాహనాలు కుదించలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్లతో కీలక సమావేశం నిర్వహించారు. తన కాన్వాయ్లో వాహనాలు 50 శాతం తగ్గించాలని ఆదేశించారు. జిల్లా పర్యటనలో కూడా తగ్గించాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు కూడా తమ వాహనాలు తగ్గించుకోవాలని సూచించారు.
Also Read: Bandi Bhageerath: పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ డుమ్మా.. తర్వాత ఏం జరగనుంది?
ప్రధాని కాన్వాయ్ తగ్గింపు
ప్రధాని తన కాన్వాయ్లోని వాహనాలను భారీగా తగ్గించారు. మెర్సిడెస్ అల్ట్రా లగ్జరీ కార్లు, రేంజ్ రోవర్లు, టయోటా ఫార్చ్యూనర్లు, ఎస్కార్ట్ వాహనాలు, జామర్ యూనిట్ల సహా మొత్తం 12 నుంచి 15 కార్లు ఉండేవి. తాజాగా వాటి సంఖ్యను మొత్తం తగ్గించారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు అధికారులు కాన్వాయ్లోని అన్ని వాహనాలను తొలగించి రెండింటినే ఉంచారు.
ఈ పొదుపు మంత్రంపై రేపు మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో జరగనున్న సమావేశంలో ప్రధాని పొదుపు పిలుపు చర్యలపై ప్రత్యేకంగా మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్రంలో సీఎం, ఇతర మంత్రులు, అధికారులు పొదుపు చర్యలపై సూచనలు చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోంపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.
Also Read: Cricket Betting: ఏపీ పోలీసులు స్టింగ్ ఆపరేషన్.. క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
మంత్రివర్గంలో చర్చించే అంశాలు
మంత్రివర్గ సమావేశంలో 17వ ఎస్ఐపీబీ ఆమోదించిన పలు అంశాలపై చర్చ, ఆమోదం తెలపనున్నారు. మొత్తం 25 ప్రాజెక్టులకు చెందిన రూ.2,01,023 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలపనుంది. విశాఖలో రూ.లక్ష కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్కు పచ్చజెండా ఊపనుంది. సత్యసాయి జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్కు ఆమోదం తెలపనుంది. పలు కీలక సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
==> కడపలో రూ.12 వేల కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు
==> తిరుపతిలో రూ.2,500 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటర్ సైకిల్ తయారీ పరిశ్రమకు గ్రీన్ సిగ్నల్
Bandi bhagirath: కీలక ఆధారాలతో ఆ రోజు వస్తా.!. సిట్ పోలీసులకు బండి భగీరథ్ సంచలన లేఖ..
Hyderabad, Telangana:Bandi Bhagirath responds to Hyderabad police sit notices: కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండీ భగీరథ్ పోక్సో కేసు వివాదం తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతుంది. ఇప్పటికే దీనిపై బీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శనాస్త్రాలను సంధిస్తుంది. మే 8న కేసు నమోదైతే ఇప్పటి వరకు అరెస్ట్ చేయక పోవడం ఏంటని నేతలు మండిపడుతున్నారు. మంత్రుల కొడుకులకు ఒక న్యాయం, ప్రజలకు మరో న్యాయమా అంటూ ఫైర్ అవుతున్నారు. మరోవైపు బండి సంజయ్ దేశం వదిలి పారిపోయాడా అంటూ పలు చోట్ల పోస్టర్ లు వెలిశాయి. ఈ క్రమంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసును విచారిస్తోంది. తమ ఎదుట విచారణకు రావాల్సిందిగా భగీరథ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు పోలీసుల ముందు విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. అయితే సమయం గడిచినప్పటికీ భగీరథ్.. పోలీసుల విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలో తాజాగా.. బండి భగీరథ్ సిట్ పోలీసులకు మెయిల్ చేయడం సంచలనంగా మారింది.
ఈ క్రమంలో తాను మే 15న సిట్ పోలీసుల ఎదుట హజరవుతానని ఆ లేఖలో పేర్కొన్నాడు. కీలక సాక్షాలతో విచారణకు హాజరవుతానంటూ బండి భగీరథ పేర్కొన్నాడు. తనకు రెండు రోజుల సమయం కావాలని గడువు కోరాడు. అంతే కాకుండా SIT దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని కూడా భగీరత్ తన లేఖలో పేర్కొన్నాడు.ఈ లేఖ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ మారింది.
బండి భగీరథ్ పై పోలీసులు BNS 74,75 తో పాటు సెక్షన్ 5 (i) రెడ్ విత్ 6 కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలి నుంచి రెండో సారి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. తాజాగా నిందితుడిపై తీవ్రమైన లైంగిక దాడి, ముందుగా ప్లాన్ చేసి లైంగిక చర్యలకు పాల్పడినట్లు సెక్షన్ 5 (i)ను కూడా పోలీసులు జతపరిచారు.
Read more: Kalva kuntla Kavitha: మైనర్ అమ్మాయికే ఎక్కువ నష్టం..!.. బండి భగీరథ్
మరోవైపు ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో బండి భగీరథ్ పిటిషన్ వేశారు. ఇక తెలంగాణ హైకోర్టులో బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పై రేపు విచారణ జరగనుంది. హైకోర్టు ఏవిధంగా తీర్పునిస్తుంది.. బండి సంజయ్ కొడుకు ఏవిధమైన ఆధారాలను సిట్ ముందు ఉంచుతారో అన్నదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Bandi Bhageerath: పోక్సో కేసులో పోలీసు విచారణకు బండి భగీరథ్ డుమ్మా..ఏం జరిగిందంటే?
Hyderabad, Telangana:Bandi Bhageerath POCSO Case: మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఇప్పుడు పరారీలో ఉన్నాడు. అత్యాచార ఆరోపణల నేపత్యంలో ప్రత్యేక దర్యాప్తు టీమ్ విచారణకు బండి భగీరథ్ విచారణకు హాజరుకాలేదు.Work From Home: ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఎంత లాభమో తెలుసా? ఆర్థికంగానే కాకుండా పర్యావరణానికి మేలు!
Hyderabad, Telangana:Work From Home Benefits: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా ఇంధన ధరలు ఆకాశాన్ని చేరుతున్నాయి. ఈ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించేందుకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' (ఇంటి వద్ద నుంచే పని) ఒక శక్తివంతమైన ప్రత్యామ్నాయంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశప్రజలకు పిలుపునిచ్చారు. ఈ విధంగా ఇంధన ఆదా దిశగా అడుగులు వేయాలని సూచించిన ఆయ సూచించిన నేపథ్యంలో, హైదరాబాద్ ఐటీ హబ్ సహా ఇరు తెలుగు రాష్ట్రాల్లోని అవసరమైన రంగాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని అమలు చేస్తే కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదాహరణకు హైదరాబాద్లోని గచ్చిబౌలి, నానక్రామ్గూడ, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో సుమారు 9 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు ప్రతిరోజూ ఆఫీసులకు వెళ్లడం వల్ల ట్రాఫిక్ రద్దీతో పాటు ఇంధనం భారీగా వృథా అవుతోంది.
ఒకవేళ ఉద్యోగుల్లో సగం మందికి (4.5 లక్షల మందికి) వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పిస్తే అనేక మార్పులు కలిగే అవకాశం ఉంది. రోజుకు సుమారు 90 లక్షల మేర ప్రయాణ దూరం తగ్గుతుంది. ఈ విధంగా రోజుకు దాదాపు 3.6 లక్షల లీటర్ల పెట్రోల్ ఆదా అవుతుందని అంచనా. ఈ గణాంకాలతో ప్రస్తుత పెట్రోల్ ధరల ప్రకారం.. రోజుకు దాదాపు రూ.3.87 కోట్ల మేర ప్రజా ధనం ఆదా అవుతుంది.
అలాగే ప్రయాణాలు తగ్గడం వల్ల వాహనాల నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. ఇది నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించి, మన తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు మరింత నివాసయోగ్యమైన 'స్మార్ట్ సిటీలు'గా మార్చడానికి దోహదపడుతుంది.
ఉద్యోగుల ఉత్పాదకతపై ప్రభావం
అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉద్యోగులు అద్భుతమైన పనితీరు కనబరిచారు. దీనివల్ల కొన్ని కీలక ఉపయోగాలు ఉన్నాయి. ట్రాఫిక్లో గంటల కొద్దీ వేచి ఉండాల్సిన అవసరం లేకపోవడంతో ఆ పనికి లేదా కుటుంబానికి కేటాయించవచ్చు. ప్రయాణ ఒత్తిడి తగ్గి ఉద్యోగుల పని సామర్థ్యం మెరుగుపడుతుంది. పెట్రోల్, వాహన నిర్వహణ ఖర్చులు తగ్గిపోతున్న ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది.
హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలన్నా, దేశ ఇంధన భద్రతను కాపాడాలన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం.. ప్రభుత్వం, కంపెనీ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆధునిక సాంకేతికతను వాడుకుంటూ ఇంటి నుండే పనిచేయడం వల్ల అటు ఆర్థిక వ్యవస్థకు, ఇటు పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది.
Also Read: బంగారం ధరలు పెరుగుతున్న వేళ కేంద్రం బంపర్ ఆఫర్..ఇంట్లో ఉన్న బంగారానికి వడ్డీ!
Also Read: 'తల్లికి వందనం' డబ్బు విడుదలకు ముహూర్తం ఫిక్స్..డబ్బులు అకౌంట్లో పడేది ఆరోజే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ఖరారు..ఎప్పుడంటే?
Nunna, Vijayawada, Andhra Pradesh:AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించే దిశగా ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కసరత్తు ముమ్మరం చేశారు. ఈ ఎన్నికల సన్నాహాలకు సంబంధించిన కీలక వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.Bandi Bhageerath: పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ డుమ్మా.. తర్వాత ఏం జరగనుంది?
Baddipadaga, Telangana:Bandi Bhageerath POCSO Case: మద్యం తాగించి తాగిన మైకంలో బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు, నిందితుడు బండి భగీరథ్ తప్పించుకు తిరుగుతున్నాడు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు రావాలని నోటీసు ఇవ్వగా ఎలాంటి స్పందన రాలేదు. పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలని కోరగా.. బండి భగీరథ్ రాలేదు. పరారీలో ఉన్నాడని చెబుతుండగా.. అయినా కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం గమనార్హం. సిట్ విచారణకు డుమ్మా కొట్టడంతో బండి భగీరథ్ కేసు ఏమవుతుందనేది ఉత్కంఠ నెలకొంది.
Also Read: Cricket Betting: ఏపీ పోలీసులు స్టింగ్ ఆపరేషన్.. క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు బండి భగీరథ్ పోక్సో నమోదై ఆరు రోజులు గడిచినా ఇంకా అరెస్ట్ కాలేదు. వాస్తవంగా పోక్సో కేసు నమోదైతే వెంటనే 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేయాల్సి ఉంది. కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు కావడంతో బండి భగీరథ్ను ఆరు రోజులైనా పోలీసులు అరెస్ట్ చేయడం లేదు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఈ కేసుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటుచేసినా విచారణను తూతూమంత్రంగా చేపడుతోంది. నోటీసులు ఇచ్చి ఈరోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్దకు విచారణకు రావాలని చెప్పినా బండి భగీరథ్ రాలేదు.
Also Read: GT vs SRH Highlights: సన్రైజర్స్ ఘోర పరాభవం.. భారీ విజయంతో ప్లేఆఫ్స్కు గుజరాత్
తెలంగాణ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం జారీ చేసిన నోటీసులకు బండి భగీరథ్ వైపు నుంచి స్పందన లేదు. పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్లో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రావాలని సిట్ నోటీస్ ఇస్తే బండి భగీరథ్ డుమ్మా కొట్టాడు. భగీరథ్ అరెస్ట్ కానీ పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు జరిగే అవకాశం ఉంది. రేపు ముందస్తు బెయిల్పై హైకోర్టులో వెకేషన్ బెంచ్ విచారణ చేయనుండడంతో ఈ నేపథ్యంలోనే బండి భగీరథ్ విచారణకు రాలేదు.
బండి భగీరథ్పై కేసులు ఇవే
బాధితురాలి తల్లి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్లో వివిధ సెక్షన్ల కింద పోక్సో కేసు నమోదైంది. బీఎన్ఎస్ 74, 75తో పాటు సెక్షన్ 5 (ఐ) రెడ్ విత్ 6 కింద పేట్ బషీర్బాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా బాధితురాలి నుంచి పోలీసులు రెండోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. నిందితుడు బండి భగీరథ్పై తీవ్రమైన లైంగిక దాడి, ముందుగా ప్లాన్ చేసిన లైంగిక చర్యలకు పాల్పడినట్లు సెక్షన్ 5 (ఐ)ను జోడించడంతో బండి భగీరథ్కు బెయిల్ అనేది రాదు. కానీ అతడి తండ్రి కేంద్ర మంత్రి కావడంతో బండి భగీరథ్కు బెయిల్ వచ్చినా ఆశ్చర్యం లేదు.
పెద్ద ఉద్యమమే..
అసలు పోక్సో కేసు నమోదైనప్పటి నుంచి బండి భగీరథ్ను తప్పించాలనే ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అందులో భాగంగానే తీవ్రమైన పోక్సో కేసు నమోదైనా పోలీసులు ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. వాస్తవంగా 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేయాల్సి ఉండగా పోలీసులు విచారణ పేరిట తాత్సారం చేస్తున్నారు. నిందితుడు తప్పించుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలు చేసుకోవాలని సమయం ఇస్తున్నారు. చట్టం, న్యాయం నుంచి బండి భగీరథ్ తప్పించుకున్నా ప్రజల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధాన మీడియా పట్టించుకోకున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆడినా కూడా ప్రజలు మాత్రం బండి భగీరథ్ను క్షమించలేరు. ఇప్పటికే సోషల్ మీడియాలో బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలనే ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతోంది. బండి భగీరథ్ను అరెస్ట్ చేయకపోతే మాత్రం రానున్న రోజుల్లో ప్రజల నుంచి పెద్ద ఉద్యమమే రాజుకునే అవకాశం ఉంది.
AP Local Body Elections: ఏపీలో మోగనున్న ఎన్నికల నగారా..స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడంటే?
Vijayawada, Andhra Pradesh:AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించే దిశగా ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కసరత్తు ముమ్మరం చేశారు. ఈ ఎన్నికల సన్నాహాలకు సంబంధించిన కీలక వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.
తాజాగా అందిన సమాచారం మేరకు.. ఈ ఏడాది సెప్టెంబరు నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే డిసెంబరు నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి రాష్ట్ర ఎన్నికల కమీషన్ లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా కొత్త ఏడాది (2027) ఆరంభం నాటికి నూతన పాలకవర్గాలు కొలువుదీరనున్నాయని తెలుస్తోంది.
అంతకు ముందు నోటిఫికేషన్ జారీ చేసేందుకు అత్యంత కీలకమైన బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమీషన్ వచ్చే నెలలో నివేదిక ఇవ్వనుంది. దీని ఆధారంగా జూలై నాటికి రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి రానుంది. అదే విధంగా వార్డుల పునర్విభజనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 123 పట్టణ స్థానిక సంస్థల్లో డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతోంది. ఇది జూన్ 26 నాటికి పూర్తి కావాలి.
ఇప్పటికే 13,291 పంచాయతీల్లో ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయింది. తాజా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.36 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఎన్నికల నిర్వహణపై పంచాయతీరాజ్, పురపాలక, బీసీ సంక్షేమ శాఖలతో ఎన్నికల కమిషనర్ వరుస సమావేశాలు నిర్వహించారు. కోర్టు కేసులు ఉన్న 56 పంచాయతీలు మినహా మిగిలిన చోట్ల నిర్వహణ సర్వసన్నద్ధంగా ఉంది.
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి కూటమి ఎన్నికలు కావడంతో, అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఈ ఎన్నికలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిష్పక్షపాతంగా, పారదర్శకమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.
Also Read: 'తల్లికి వందనం' డబ్బు విడుదలకు ముహూర్తం ఫిక్స్..డబ్బులు అకౌంట్లో పడేది ఆరోజే!
Also Read: Gold Monetisation: బంగారం ధరలు పెరుగుతున్న వేళ కేంద్రం బంపర్ ఆఫర్..ఇంట్లో ఉన్న బంగారానికి వడ్డీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
