icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
501505
V SHIVA NAGARAJUV SHIVA NAGARAJUFollow3 Aug 2024, 03:15 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Chicken Margin: మాంసంప్రియులు నోరు కట్టేసుకోవాల్సిందే! రేపటి నుంచి చికెన్‌ దుకాణాలు బంద్‌!

Baddipadaga, Telangana:

Telangana Chicken Shops Bandh: చికెన్ రిటైల్ షాపులకు వచ్చే మార్జిన్‌లో కార్పొరేట్ కంపెనీలు మార్జిన్ తగ్గించి ఇవ్వడాన్ని నిరసిస్తూ రేపటి నుంచి తెలంగాణలో చికెన్‌ దుకాణాలు మూతపడనున్నాయి. చికెన్‌ దుకాణ నిర్వాహకులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి దుకాణాలు బంద్‌ చేస్తామని ప్రకటించారు. మార్జిన్‌ పెంచాలని డిమాండ్‌ చేస్తూ దుకాణాలు బంద్‌ చేపడుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర చికెన్ దుకాణాల యాజమాన్యాల సంఘం పిలుపునిచ్చింది. చికెన్ దుకాణాల బంద్ ప్రభావం తెలంగాణలో తీవ్రంగా ఉండనుంది. 

Also Read: Bengaluru Couple Death: ఇంట్లో భర్త ఆత్మహత్య.. 17వ ఫ్లోర్‌ నుంచి దూకిన భార్య

చికెన్‌ దుకాణ యాజమాన్యాల పిలుపుతో రేపటి నుంచి అంటే బుధవారం నుంచి తెలంగాణలో చికెన్‌ దుకాణాలు మూతపడనున్నాయి. రిటైల్‌ చికెన్‌ షాపులకు ఇచ్చే మార్జిన్‌ పెంచాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఆ సంఘం నిరసనకు దిగుతోంది. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే లాభం (మార్జిన్) తగ్గించడంతో తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని.. ఈ మార్జిన్‌ను పెంచాలని చికెన్‌ దుకాణాల యాజమానులు ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు.

Also Read: RR vs CSK Highlights: తొలి మ్యాచ్‌లోనే చెన్నై చెత్త ప్రదర్శన.. విజయంతో రాజస్థాన్‌ శుభారంభం

'చికెన్ రేటు మూడు రోజుల్లో రూ.250కి ఎలా వచ్చింది. దీనిపై కార్పొరేట్ కంపెనీలు సమాధానం ఇవ్వాలి' అని నాచారంలోని చికెన్‌ దుకాణ యజమాని ప్రశ్నించారు. మార్జిన్ తగ్గించడంతో తాము ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నట్లు వాపోయారు. దుకాణాల రెంట్, వర్కర్ల జీతాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న తమకు మార్జిన్‌ పెంచడంతో వ్యాపారం చేయలేని పరిస్థితి ఏర్పడిందని మరో చికెన్‌ దుకాణ యజమాని వివరించారు. ప్రభుత్వం ఆలోచించి మార్జిన్ పెంచే ప్రయత్నం చేయాలని కోరారు. తమ సమస్యకు పరిష్కారం చూపని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Also Read: New Rules From April 1st: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..: మీకు లోన్‌ ఉందా? అయితే ఈ శుభవార్త మీకే!

చికెన్‌ మార్జిన్‌ వివరాలు ఇలా..
మార్జిన్‌ చికెన్‌ విక్రయించగా వచ్చే లాభం. గతంలో ఫౌల్ట్రి వాళ్లు రిటైల్ షాపులకు కిలోకు రూ.26 మార్జిన్ ఇచ్చేవారు. 20 ఏళ్లుగా ఇదే మార్జిన్ ఉండగా.. ఇటీవల మార్జిన్‌ను రూ.16కు తగ్గించారు. మార్జిన్‌ పెంచాల్సి ఉండగా తగ్గించడంతో ఒక్కసారిగా చికెన్‌ దుకాణ నిర్వాహకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలో చికెన్‌కు మార్జిన్ రూ.30 చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్‌ నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని చికెన్‌ దుకాణ సంఘాల వారు స్పష్టం చేస్తున్నారు. 

చికెన్‌ సంఘాల పిలుపుతో తెలంగాణతోపాటు హైదరాబాద్‌లో ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ దుకాణాలు మూతపడనున్నాయి. హైదరాబాద్‌లో చికెన్‌ దుకాణాల మూత ప్రభావం తీవ్రంగా ఉండనుంది. హైదరాబాద్‌లో 10 వేల నుంచి 15 వేల వరకు చికెన్‌ దుకాణాలు ఉంటాయి. వారాంతాలు, పండుగల సమయంలో భారీ డిమాండ్‌ ఉండగా.. పనిదినాల్లో కూడా మోస్తరుగా బిజినెస్‌ నడుస్తోంది. దుకాణాల మూసివేతతో మాంసంప్రియులు ఇబ్బందులు ఎదుర్కొననున్నారు. వేసవి కాలంలో చికెన్‌కు భారీ డిమాండ్‌ ఉంటుంది. దీనికితో శుభకార్యాలు కూడా ఉండడంతో చికెన్‌ దుకాణాలు మూతపడితే మాత్రం వినియోగదారులతోపాటు ప్రభుత్వానికి కూడా భారీగా నష్టం వాటిల్లనుంది. ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులు త్వరగా జోక్యం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని వినియోగదారులతోపాటు వ్యాపారులు కోరుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Gold Market Crash: 17 ఏళ్ల తర్వాత భారీగా పడిపోయిన గోల్డ్ రేట్స్.. తులం పసిడిపై ఎంత లాభం వచ్చిందంటే?

BBhoomi1h ago
Lakshmapur, Telangana:

Gold Market Crash:  అంతర్జాతీయ మార్కెట్‌లో నేడు మార్చి 31వ తేదీ మంగళవారం.. బంగారం ధరలు స్వల్పంగా పుంజుకున్నప్పటికీ.. గత 17 ఏళ్ల కాలంలో ఈ మార్చి నెల పసిడికి అత్యంత క్లిష్టమైన కాలంగా నిరూపించింది. అక్టోబర్ 2008 తర్వాత.. అంటే దాదాపు రెండు దశాబ్దాల కాలంలో.. ఒకే నెలలో బంగారం ధర 13 శాతం కంటే ఎక్కువగా పడిపోవడం ఇదే మొదటిసారి. ప్రపంచ ఆర్థిక పరిణామాలు, భౌగోళిక రాజకీయ మార్పులు ఈ భారీ పతనానికి ప్రధాన కారణమయ్యాయి.

ట్రంప్ ప్రకటనతో మార్కెట్‌లో స్వల్ప ఉపశమనం:
తాజా నివేదికల ప్రకారం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక చర్యను ముగించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తన మిత్రదేశాలకు తెలిపారు. ఈ వార్త మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయనే ఆశలను రేకెత్తించింది. దీని ప్రభావంతో మార్కెట్‌లో కొంత విశ్వాసం పెరిగి, బంగారం ధరలో స్వల్ప పునరుద్ధరణ కనిపించింది. స్పాట్ గోల్డ్ ధర సుమారు 1.5 శాతం పెరిగి ఔన్సుకు $4,578 కి చేరుకోగా, యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 1.2 శాతం వృద్ధితో సుమారు $4,611 వద్ద ట్రేడ్ అయ్యాయి.

బంగారంపై ఒత్తిడికి ప్రధాన కారణాలు:
ఈ రోజు ధరలు పెరిగినప్పటికీ.. నెల మొత్తం మీద చూస్తే బంగారం భారీగా నష్టపోయింది. దీనికి ప్రధానంగా మూడు అంశాలు కారణమయ్యాయి. మొదటిది, అంతర్జాతీయంగా అమెరికా డాలర్ బలోపేతం కావడం వల్ల ఇతర కరెన్సీలు ఉన్నవారికి బంగారం కొనుగోలు ఖరీదైనదిగా మారింది. రెండవది.. పెరుగుతున్న చమురు ధరలు ద్రవ్యోల్బణ భయాలను పెంచాయి. మూడవది.. వడ్డీ రేట్ల కోతలపై అంచనాలు తగ్గడం. ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోవడంతో, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది వడ్డీ రేట్లను తగ్గించడాన్ని వాయిదా వేసే అవకాశం ఉందనే వార్తలు పసిడి ధరలపై ఒత్తిడిని పెంచాయి.

Also Read: Gold Selling: కేంద్ర బ్యాంకుల సంచలన నిర్ణయం.. మార్కెట్లోకి భారీగా బంగారం.. తులం ధర రూ. లక్ష దిగువకు..?   

వడ్డీ రేట్లు, ఇతర లోహాల స్థితి:
బంగారం అనేది ఎటువంటి వడ్డీని సంపాదించి పెట్టని పెట్టుబడి సాధనం. అందువల్ల, వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు బంగారం నుండి నిధులను ఉపసంహరించుకుని ఇతర లాభదాయకమైన ఆస్తులలో పెట్టుబడి పెడతారు. ఈ క్రమంలోనే మార్చిలో బంగారం ఒత్తిడికి లోనైంది. అయితే, మంగళవారం నాటి ట్రేడింగ్‌లో కేవలం బంగారమే కాకుండా ఇతర లోహాలు కూడా లాభపడ్డాయి. వెండి 3 శాతానికి పైగా పెరగగా, ప్లాటినం, పల్లాడియం కూడా సానుకూల వృద్ధిని నమోదు చేశాయి.

బంగారం స్వల్పంగా కోలుకుంటున్నప్పటికీ, మార్చి నెల మొత్తం గణనీయమైన ఒత్తిడికి లోనైంది. భవిష్యత్తులో ద్రవ్యోల్బణం, డాలర్ విలువ, వడ్డీ రేట్లకు సంబంధించిన అనిశ్చితి బంగారం  భవిష్యత్ గమనాన్ని నిర్దేశించనున్నాయి. పెట్టుబడిదారులు ప్రపంచ పరిణామాలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:  Bank Auto Sweep Facility: బ్యాంకు ఖాతాదారులకు బంపర్ ఆఫర్! ఆటో స్వీప్ సౌకర్యంతో మీ సేవింగ్స్ అకౌంట్‌పై భారీ వడ్డీ.. ఎలాగో తెలుసా?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Bengaluru Couple Death: ఇంట్లో భర్త ఆత్మహత్య.. 17వ ఫ్లోర్‌ నుంచి దూకిన భార్య

Bengaluru, Karnataka:

Telangana Techie Couple Death: కుటుంబ కలహాలతో క్షణికావేశానికి లోనయి ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సహజీవనం చేసి ప్రేమ పెళ్లి చేసుకున్న దంపతులు తమ గొడవలతో ప్రాణాలు తీసుకున్నారు. తెలంగాణకు చెందిన దంపతులు తాము పని చేసే బెంగళూరులో బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న భర్త మొదట ఆత్మహత్య చేసుకోగా.. ఇది తెలుసుకున్న భార్య దిగ్భ్రాంతికి లోనయి 17వ అంతస్తు పై నుంచి కిందకు ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలో జరగ్గా.. తెలంగాణలో తీవ్ర విషాదం నింపింది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: RR vs CSK Highlights: తొలి మ్యాచ్‌లోనే చెన్నై చెత్త ప్రదర్శన.. విజయంతో రాజస్థాన్‌ శుభారంభం

తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భానుచందర్ రెడ్డి కుంట (32) బెంగళూరులోని ప్రముఖ ఐటీ కంపెనీలో పని చేస్తుండేవాడు. కొన్నేళ్ల కిందట పరిచయమైన బీబీ షాజియా సిరాజ్ (31)తో ప్రేమాయణం నడిపి అనంతరం ఇద్దరూ సహజీవనం చేశారు. అనంతరం వివాహం చేసుకుని ప్రస్తుతం బెంగళూరులోని ఓ భారీ అపార్ట్‌మెంట్‌లో కాపురం ఉంటున్నారు. పెళ్లయినా కొన్నాళ్ల తర్వాత వారి కాపురంలో కలహాలు మొదలయ్యయి.

Also Read: New Rules From April 1st: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..: మీకు లోన్‌ ఉందా? అయితే ఈ శుభవార్త మీకే!

కుటుంబ సమస్యలకు తోడు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తాయని తెలుస్తోంది. వీరిద్దరూ తరచూ గొడవలు పడుతున్నారని ఇరుగుపొరుగు వారు చెప్పారు. కుటుంబ కలహాలు, ఇతర సమస్యలు తట్టుకోలేక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో భర్త మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుని ఇంటి తలుపు తాళం వేసి ఉంచాడు. కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన భార్య షాజియా తాళం ఉండడంతో అవాక్కైంది. పదేపదే తలుపు తట్టినా  లోపల ఉన్న భర్త స్పందించకపోవడంతో ఆమె ఆందోళనకు గురయ్యింది. వెంటనే సెక్యూరిటీని.. ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేయడంతో వారు బలవంతంగా తలుపు తెరిచి చూశారు. అయితే అప్పటికే భాను చనిపోయి కనిపించాడు. భర్త మృతదేహాన్ని చూసి హతాశయురాలైన షాజియా ఏం చేయాలో పాలుపోలేదు. కొన్ని నిమిషాలు దిగ్భ్రాంతికి లోనయిన ఆమె తర్వాత తేరుకుంది. కొన్ని నిమిషాల తర్వాత షాజియా అదే నివాస సముదాయంలోని 17వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

నిమిషాల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు తీసుకోవడంతో ఆ అపార్ట్‌మెంట్‌లో భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి.. వాటిని పోస్టుమార్టానికి తరలించారు. ఈ సంఘటనలతో తెలంగాణలోని ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగాయి. ఈ జంట ఆత్మహత్యలకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద సంఘటనలకు సంబంధించిన వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Oneplus Ace 6 Ultra: 8500mAh భారీ బ్యాటరీతో రానున్న వన్ ప్లస్ ఏస్ 6 అల్ట్రా.. ఫీచర్స్‌ వివరాలు లీక్‌!

Hyderabad, Telangana:

Oneplus Ace 6 Ultra Launch Date In India: మొబైల్‌ ప్రియులకు వన్‌ప్లస్‌ కంపెనీ అతి త్వరలోనే భారీ సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కంపెనీ ఏస్‌ సిరీస్‌తో చైనా మార్కెట్‌లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. ఇదిలా ఉంటే అతి త్వరలోనే వన్‌ప్లస్ ఏస్ 6 అల్ట్రా (OnePlus Ace 6 Ultra) పేరుతో ఒక అత్యంత శక్తివంతమైన ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు సంచారం. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ను ఇటీవలే సోషల్‌ మీడియాలో లీక్‌ చేశారు. దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రధాన ఆకర్షణ ఏంటంటే దీని బ్యాటరీ.. సాధారణంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో 5000mAh బ్యాటరీని చూస్తుంటాం. కానీ వన్‌ప్లస్ ఏస్ 6 అల్ట్రా ఏకంగా 8500mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌  చరిత్రలో అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే ప్రీమియం ఫోన్లలో ఒకటిగా నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండడం విశేషం.. ఈ స్మార్ట్‌ఫోన్‌ చాలా అద్భుతమైన 6.8 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 165Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండటం విశేషం.

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ అత్యంత శక్తివంతమైన డైమెన్సిటీ 9500 (Dimensity 9500) చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్త్ఓంది. ఇది అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించడమే కాకుండా మల్టీ టాస్కింగ్‌ చేసేవారికి చాలా బాగుంటుంది. అలాగే డిస్ల్పే కూడా అద్భుతంగా స్మూత్‌గా ఉండబోతోంది. వన్‌ప్లస్ ఏస్ 6 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ షియోమీకి చెందిన రెడ్‌మీ K90 అల్ట్రా (Redmi K90 Ultra మొబైల్‌కి గట్టి పోటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 

Read more: Vivo T4R 5G: Sony కెమెరా, 5700 mAh బ్యాటరీ.. vivo T4R 5G పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

రెడ్‌మీ కూడా దాదాపు ఇవే స్పెసిఫికేషన్లతో తన ఫోన్‌ను ఏప్రిల్ నెలలో లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వన్‌ప్లస్ ఏస్ 6 స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ మొదటగా చైనా మార్కెట్‌లోకి విడుదల చేసిన తర్వాత గ్లోబల్‌ మార్కెట్‌లోకి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ భారత మార్కెట్‌లో ఏస్ 6T మోడల్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని బ్యాక్‌ సెటప్‌లో ప్రైమరీ కెమెరా అద్భుతంగా ఉండబోతోంది. ఇది 50MP ప్రైమరీ సెన్సార్‌తో విడుదల కాబోతోంది. అయితే, కంపెనీ త్వరలోనే అన్ని రకాల ఫీచర్స్‌ను, భారత్‌లో విడుదల తేదిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 

Read more: Vivo T4R 5G: Sony కెమెరా, 5700 mAh బ్యాటరీ.. vivo T4R 5G పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Nalanda Stampede: ఘోర విషాదం.. శీతలాదేవి ఆలయంలో తొక్కిసలాట, 8 మహిళలు దుర్మరణం!

Hyderabad, Telangana:

Nalanda Stampede 8 Women Dead: ఆధ్యాత్మిక.. రద్దీ ఉన్న ప్రదేశాలలో తొక్కిసలాట ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. తాజాగా బీహార్ లోని నలంద జిల్లాలో మరో ఘోర విషాదం చోటుచేసుకుంది. శీతలా దేవి ఆలయంలో తొక్కిసలాట జరగడంతో 8 మంది భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో పలువురికి తీవ్రగాయాల పాలయ్యారు. ఈరోజు ఉదయం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి మెరుగైన చికిత్సకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

0
0
Report

Hyundai i20 కేవలం రూ.4 లక్షలే, టాటా నెక్సాన్ రూ.5 లక్షలు.. ఛీప్‌ ధరలకే!

Hyderabad, Telangana:

Best Used Car Deals In Delhi Ncr: సొంత కారు ఉండాలని చాలా మంది సామాన్యులు ఎన్నో కలలు కంటూ ఉంటారు. అయితే, కొత్త కార్ల ధరలు అకాశాన్ని తాకుతున్న సమయంలో.. మధ్యతరగతి వారి చూపు ఇప్పుడు సెకండ్‌ హ్యాండ్‌ కార్ల మార్కెట్‌ వైపు మళ్లుతోంది. ముఖ్యంగా రాజధాని ఢిల్లీలోని సెకటర్ 31 రోహిణి సమీపంలో ఉన్న సెకండ్‌ హ్యాండ్‌ కార్ల మార్కెట్‌లోని కార్లను సాధారణ జనాలు ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ i20 ధరకే ఫోర్డ్ ఎండీవర్ వంటి లగ్జరీ కార్లు సైతం లభిస్తున్నాయి. అంతేకాకుండా బడ్జెట్ ధరల్లో సీఎన్జీ కార్లు అందుబాటులో ఉండడం విశేషం..

బడ్జెట్ ధరల్లో క్రేజీ డీల్స్..
అయితే, ఈ సెకటర్ 31లో అనేక సెకండ్‌ హ్యాండ్‌ కార్లు లభించే షాపులు ఉండడం వల్ల ఒకరి కంటే ఒకరు.. చీప్‌ ధరల్లో విక్రయిస్తున్నారు. అలాగే ఇక్కడ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి అత్యంత చౌక ధరల్లోనే కార్లు లభిస్తాయి. ముఖ్యంగా టొయోటా ఎటోస్ (Toyota Etios) కేవలం రూ. 1.25 లక్షలకే అందుబాటులో ఉంది.. అలాగే, 2018 మోడల్ డాట్సన్ రెడిగో (Redi-GO) సీఎన్జీ వేరియంట్ రూ.1.99 లక్షలకే అందుబాటులో ఉండడం విశేషం.. మధ్యతరగతి వారి ఫేవరెట్ ఆల్టో 800 (2018 మోడల్) రూ.2.75 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇక 2021 మోడల్ పెట్రోల్ ఆల్టో రూ.2.85 లక్షలకే సొంతం చేసుకోవచ్చు..

ఎస్‌యూవీ ప్రియుల కోసం కూడా ఈ మార్కెట్‌లో చీప్‌ ధరలకే మంచి కార్లు అందుబాటలో ఉన్నాయి.  2023 మోడల్ నిస్సాన్ మాగ్నైట్ రూ.4.50 లక్షలకే అందుబాటులో ఉండటం విశేషం.. యువత ఎక్కువగా ఇష్టపడే మహీంద్రా థార్ (Thar 4x4) కేవలం ఏడాది పాతది, ఫ్యాన్సీ నంబర్‌తో కలిపి రూ.13.99 లక్షలకు విక్రయిస్తున్నారు.. ఇక భారీ లగ్జరీ కారు ఫోర్డ్ ఎండీవర్ (3.2 ఆటోమేటిక్) రూ.13.50 లక్షలకే లభిస్తోంది..

Read more: Vivo T4R 5G: Sony కెమెరా, 5700 mAh బ్యాటరీ.. vivo T4R 5G పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

అలాగే ప్రతి కారుపై 100 రోజుల ఇంజన్, గేర్ బాక్స్ వారంటీ ఇస్తున్నారు .. అంతేకాకుండా, పాన్ ఇండియా లోన్ సదుపాయం, ఇన్సూరెన్స్, ఎన్‌ఓసీ (NOC), ట్రాన్స్‌పోర్టేషన్ సదుపాయాలను కూడా ఒకే చోట అందిస్తున్నారు.. ఇక మరిన్నీ కార్లపై కూడా ప్రత్యేకమైన ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. మారుతి వేగన్-ఆర్ (2018 సీఎన్జీ) రూ.3.75 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇక హ్యుందాయ్ i20 (2020 మోడల్) రూ. 4.90 లక్షలకు అందుబాటులో ఉంది. అలాగే హోండా సిటీ (2016-17) రూ.4.65 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాటా నెక్సాన్ (2021 సన్‌రూఫ్) రూ.5.75 లక్షలకు అందుబాటులో ఉంది.. అలాగే ఇక్కడ తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారికి కూడా లోన్ కూడా అందిస్తున్నారు.. కేవలం రూ. 21,000 లేదా రూ. 50,000 డౌన్ పేమెంట్ కట్టి కారును విక్రయించవచ్చు..

Read more: Vivo T4R 5G: Sony కెమెరా, 5700 mAh బ్యాటరీ.. vivo T4R 5G పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

RR vs CSK Highlights: తొలి మ్యాచ్‌లోనే చెన్నై చెత్త ప్రదర్శన.. విజయంతో రాజస్థాన్‌ శుభారంభం

Guwahati, Assam:

RR Won By 8 Wickets: గత సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శన కనబర్చిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 2026 సీజన్‌ను ఓటమితో ప్రారంభించింది. ఎదుర్కొన్న తొలి మ్యాచ్‌ను సొంతం చేసుకుని రాజస్థాన్‌ రాయల్స్‌ కొత్త సీజన్‌ను శుభారంభం చేసింది. అన్ని విభాగాల్లో సత్తా చాటిన రాజస్థాన్‌ అత్యంత సునాయాసంగా మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అన్నింటా విఫలమైన చెన్నై భారీ పరాజయాన్ని చవిచూసింది. గౌహతిలో జరిగిన మ్యాచ్‌ విశేషాలు ఇలా ఉన్నాయి. 19.4 ఓవర్లలో ఆలౌటై 127 పరుగులు చెన్నై చేయగా.. రాజస్థాన్‌ రాయల్స్‌ 2 వికెట్లు కోల్పోయి 12.1 ఓవర్‌లో లక్ష్యం పూర్తి చేసి 8 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ భారీ విజయాన్ని అందుకుంది.

Also Read: BRS Party: పొంగులేటిని బర్తరఫ్‌ చేయాలి, న్యాయ విచారణ చేయాలి: గవర్నర్‌కు బీఆర్‌ఎస్‌ పార్టీ విజ్ఞప్తి

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ అతి కష్టంగా 19.4 ఓవర్లు ఆడి 127 పరుగులు చేసి కుప్పకూలింది. జేమీ ఓవర్టన్‌ మినహా తొలి బ్యాటర్‌ నుంచి ఆఖరి వరకు ఒక్కరూ కూడా భారీ ఇన్నింగ్స్‌ ఆడలేకపోయారు. వంద కూడా స్కోర్‌ చేస్తారా లేదా అనుకుంటున్న సమయంలో ఓవర్టన్‌ అద్భుతంగా ఆడి జట్టు పరువు కాపాడాడు.  బ్యాటర్లు అందరూ చేతులెత్తేసిన వేళ 36 బంతుల్లో 43 పరుగులు చేసి అదరగొట్టాడు. వాటిలో రెండేసి ఫోర్లు, సిక్సర్లు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్‌ భారత గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూ శామ్‌సన్‌ ఆరు పరుగులకే పరిమితమవగా.. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ కూడా అదే స్కోర్‌ చేశాడు. ఆయూశ్‌ మాత్రే గోల్డెన్‌ డకౌట్‌, మాట్‌ షార్ట్‌ (2), సర్ఫరాజ్‌ ఖాన్‌ (17), కార్తీక్‌ శర్మ (18), నూర్‌ అహ్మద్‌ (1), మ్యాట్‌ హెన్రీ (5) బ్యాటింగ్‌ ఝుళిపించడంలో ఘోరంగా విఫలమయ్యారు. రాజస్థాన్‌ బౌలర్లు అద్భుతంగా బంతులు వేసి చెన్నై బ్యాటింగ్‌ దళాన్ని కుప్పకూల్చారు. జోఫ్రా ఆర్చర్‌, నందరే బర్గర్‌, రవీంద్ర జడేజా రెండేసి వికెట్ల చొప్పున తీశారు.

Also Read: New Rules From April 1st: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..: మీకు లోన్‌ ఉందా? అయితే ఈ శుభవార్త మీకే!

ఘోరంగా విఫలం
తక్కువ స్కోర్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ రెండు వికెట్లు కోల్పోయి 12.1 ఓవర్లలోనే పూర్తి చేసి మ్యాచ్‌ను ముగించింది.  యువ కెరటాలు యశస్వి జైస్వాల్‌, వైభవ్ సూర్యవంశీలు చెలరేగి ఆడారు. ఇద్దరు ఓపెనర్లు పూర్తి చేస్తారనుకున్న సమయంలో అనూహ్యంగా వికెట్లు పడడంతోనే విజయం కొంత ఆలస్యమైంది. మరోసారి వైభవ్‌ చెలరేగి ఆడాడు. 17 బంతుల్లోనే 52 పరుగులు చేసి ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 4 ఫోర్లు, 5 సిక్సర్లతో వైభవ్‌ దుమ్మురేపగా.. అదే స్థాయిలో యశస్వి జైస్వాల్‌ 35 బంతుల్లో 38 పరుగులు చేసి రాణించాడు. వైభవ్‌ వైదొలిగిన అనంతరం గ్రౌండ్‌లోకి వచ్చిన ధ్రువ్‌ జురేల్‌ 18 పరుగుల అనంతరం చెత్త షాట్‌ ఆడుతూ వికెట్లకు దొరికిపోయాడు. కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ 14 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌కు విజయం అందించాడు. 8 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ అద్భుత విజయం అందుకుంది.

Also Read: KT Rama Rao: ప్రజల గొంతు నొక్కేందుకు 'హేట్ స్పీచ్'.. రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం

బ్యాటర్లు చేతులెత్తేసిన వేళ చెన్నై సూపర్‌ కింగ్స్‌ బౌలర్లు కూడా అదే చేశారు. అతి తక్కువ స్కోర్‌ను కాపాడాల్సిన బౌలర్లు తమ బాధ్యతను వదిలేశారు. మ్యాచ్‌ ఓటమిని ముందే ఖరారు చేసుకుని గ్రౌండ్‌లోకి వచ్చినట్టు బౌలర్లతోపాటు ఫీల్డర్ల వ్యవహారం ఉంది. పరుగులకు కళ్లెం వేయడంతోపాటు వికెట్లు తీయాల్సి ఉండగా అందరూ మ్యాచ్‌ను తేలికగా తీసుకున్నారు. కళ్ల ముందే బౌండరీ పోతున్నా వాటిని ఆపేందుకు ఫీల్డర్లు శ్రమించలేకపోయారు. తీసిన రెండు వికెట్లలో జురేల్‌ వికెట్‌ స్వయంకృపరాధం ఉండగా.. దానికి చెన్నై బౌలర్‌ చేసిందేమీ లేదు. తొలి మ్యాచ్‌లోనే ఇంతటి పేలవ ప్రదర్శన కనబర్చిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ సీజన్‌ను ఎంతటి ఘోరంగా ముగుస్తుందోనని ఆ జట్టు అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

BRS Party: పొంగులేటిని బర్తరఫ్‌ చేయాలి, న్యాయ విచారణ చేయాలి: గవర్నర్‌కు బీఆర్‌ఎస్‌ పార్టీ విజ్ఞప్తి

Hyderabad, Telangana:

Ponguleti Srinivas Reddy Scam: రెండేళ్లుగా రూ.వందల కోట్ల ప్రజా సంపదను పొంగులేటి కుటుంబం కొల్లగొడుతోందని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. వెంటనే పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.  పొంగులేటి మైనింగ్‌ కుంభకోణంపై స్వతంత్ర న్యాయ విచారణ చేయాలని కోరారు. ఎలాంటి మినరల్ డీలర్ లైసెన్స్, పొల్యూషన్ బోర్డ్ అనుమతులు, విద్యుత్ కనెక్షన్లు, పరిశ్రమల శాఖ అనుమతులు లేకుండానే రెండేళ్లుగా రూ.వందల కోట్ల ప్రజా సంపదను పొంగులేటి కుటుంబం దోచుకుందని ఆరోపించారు.

Also Read: New Rules From April 1st: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..: మీకు లోన్‌ ఉందా? అయితే ఈ శుభవార్త మీకే!

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమాలపై హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో గవర్నర్‌ శివ్ ప్రతాప్ శుక్లాతో కేటీఆర్‌, హరీశ్‌ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి ఫిర్యాదు చేశారు. పొంగులేటి మైనింగ్ అక్రమాలను గవర్నర్‌కు వారు వివరించారు. మంత్రిని బర్తరఫ్ చేయాలని, పొంగులేటి అక్రమాలపైన స్వతంత్ర న్యాయ విచారణ, సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మైనింగ్ అక్రమాలు, భూకబ్జాలపై సాక్ష్యాధారాలను గవర్నర్‌కు అందించారు. ఒకప్పుడు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో అచ్చంగా ఆనాటి ఎమర్జెన్సీ రోజులను తీసుకువచ్చిందని గవర్నర్‌కు గులాబీ బృందం వివరించింది.

Also Read: KT Rama Rao: ప్రజల గొంతు నొక్కేందుకు 'హేట్ స్పీచ్'.. రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం

ఈ సందర్భంగా గవర్నర్ కూడా ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ రోజుల్లో 19 నెలల పాటు జైలు అనుభవించారని గుర్తుచేసుకున్నారు. దురదృష్టవశాత్తు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు ఎమర్జెన్సీ నాటి అరాచక పరిస్థితులు ఎదుర్కొంటున్నారని పార్టీ నేతలు గవర్నర్‌కు వివరించారు. సంబంధం లేని భూమిని చెరబట్టి ఎలాంటి మినరల్ డీలర్ లైసెన్స్, పొల్యూషన్ బోర్డ్ అనుమతులు, విద్యుత్ కనెక్షన్లు, పరిశ్రమల శాఖ అనుమతులు లేకుండానే రెండేళ్లుగా రూ.వందల కోట్ల ప్రజా సంపదను, పొంగులేటి కుటుంబం కొల్లగొడుతుందని అన్ని ఆధారాలతో గవర్నర్‌కు అందించిన లేఖలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వివరించారు. ఈ అంశంలో రేవంత్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సభలో లేవనెత్తితే మొత్తం ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను సభ నుంచి బహిష్కరించారని గవర్నర్‌కు బీఆర్‌ఎస్‌ బృందం తెలిపింది.

Also Read: KT Rama Rao: మూసీ పేరిట రేవంత్‌ రెడ్డి రూ.లక్షన్నర కోట్ల అవినీతి: కేటీఆర్‌

గవర్నర్‌ను కలిసిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కంటే పెద్ద బ్లాక్‌మెయిలర్ రాష్ట్రంలో ఎవరూ లేరని.. రేవంత్ రెడ్డికి దమ్ముంటే పొంగులేటిని బర్తరఫ్ చేయాలని సవాల్ చేశారు. పొంగులేటి అక్రమాలపై ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కూడిన సభా సంఘం వేయాలని.. స్వతంత్ర న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్స్‌ట్రక్షన్స్ అనే కంపెనీ మైనింగ్ నిబంధనలను ఉల్లంఘించి.. అక్రమంగా జంట జలాశయాల పరిధిలో మైనింగ్ నిషేధం ఉన్నప్పటికీ మైనింగ్ చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు.

'అసెంబ్లీ సమావేశాల్లోనే రాఘవ కన్స్‌ట్రక్షన్స్ అనే కంపెనీ తప్పు చేసింది. దానికి సంబంధించి మా ప్రభుత్వమే కొన్ని నోటీసులు కూడా ఇచ్చిందని అసలు నిజాన్ని ఒప్పుకుంది' అనే విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. అయితే ఈ అంశంపై విచారణ పారదర్శకంగా జరగాలని, అందులో భాగంగా పొంగులేటిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒకవైపు శాసనసభా సంఘాన్ని ఏర్పాటు చేస్తే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని.. పొంగులేటి రూ.వందల కోట్ల అక్రమ మైనింగ్‌తో పాటు అక్రమ భూకబ్జాలు బయటకు వస్తాయని కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

'పార్లమెంట్‌లో ఏమో రాహుల్ గాంధీ జాయింట్ పార్లమెంటరీ కమిటీలు కావాలని పట్టుబడతారు.. ఇక్కడ మాత్రం సభా నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం సభా సంఘాలకు విలువ లేదు అన్నట్లు తన సొంత ప్రభుత్వ ఏజెన్సీలతోనే విచారణ జరిపిస్తాం' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రేవంత్‌ రెడ్డి స్వయంగా హోంమంత్రి బాధ్యతలు తీసుకున్నప్పుడు సీబీ, సీఐడీని లేదా రాష్ట్ర హోంశాఖ అధికారులతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని చెప్పారని గుర్తుచేశారు. 

ఒక శాసనమండలి, శాసనసభ్యులతో కూడిన సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని లేదా ఒక స్వతంత్ర న్యాయ విచారణ కావాలని గవర్నర్‌కు కోరినట్లు మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న పొంగులేటి తన ప్రభుత్వమే చేపట్టే విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. అతడిని బర్తరఫ్ చేయాలని మరోమారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారి రక్షకులే భక్షకులయితే సామాన్యుడికి న్యాయం జరగదని.. గవర్నర్ ఈ అంశంలో జోక్యం చేసుకొని న్యాయం చేయాలని కోరారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Russia Gold Plan: రష్యా తీసుకున్న ఆ ఒక్క నిర్ణయంతో భారత్‎లో బంగారం భారీగా పడిపోనుందా? అదే జరిగితే..?

BBhoomi23h ago
Lakshmapur, Telangana:

Russia  Gold Plan: రష్యా వద్ద ప్రస్తుతం 2,000 టన్నులకు పైగా భారీ బంగారు నిల్వలు ఉన్నాయి. అయితే.. గత 25 ఏళ్లలో మొదటిసారిగా రష్యా తన సెంట్రల్ బ్యాంక్ నుండి బంగారాన్ని ఉపసంహరించి విక్రయిస్తోంది. ఉక్రెయిన్‌తో సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధం.. దానికి తోడు ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల వల్ల చమురు ఆదాయం తగ్గడం రష్యాను ఈ నిర్ణయం దిశగా నడిపించాయి. కేవలం రెండు నెలల్లోనే రష్యా 14 టన్నుల బంగారాన్ని అమ్మేసింది.

రష్యా బంగారాన్ని ఎవరు కొంటున్నారు?
పాశ్చాత్య దేశాలు విధిస్తున్న కఠిన ఆంక్షల వల్ల రష్యా తన బంగారాన్ని ప్రపంచ ప్రధాన ఎక్స్ఛేంజీలలో అమ్మలేకపోతోంది. అందుకే రష్యా తన చిరకాల మిత్రదేశమైన చైనాను ఆశ్రయించింది. చైనీస్ యువాన్ కరెన్సీని పొందేందుకు రష్యా తన భౌతిక బంగారాన్ని చైనాకు విక్రయిస్తోంది. తన వద్ద ఉన్న యువాన్ నిల్వలను ఖర్చు చేయడం కంటే.. పెరుగుతున్న ధరల నేపథ్యంలో బంగారాన్ని అమ్మడమే లాభదాయకమని పుతిన్ సర్కార్ భావిస్తోంది.

భారతదేశం 1991 నాటి సంక్షోభం.. అప్పుడు మనం ఏం చేశాం?
నేటి రష్యా పరిస్థితిని చూస్తుంటే 1991లో భారతదేశం ఎదుర్కొన్న గడ్డుకాలం గుర్తొస్తుంది. అప్పట్లో మన విదేశీ మారకద్రవ్య నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. కేవలం రెండు వారాల దిగుమతులకు సరిపడా డబ్బు మాత్రమే మిగిలింది. ఆ సమయంలో దేశాన్ని దివాలా నుండి కాపాడటానికి అప్పటి ప్రభుత్వం 67 టన్నుల బంగారాన్ని విమానాల్లో విదేశాలకు తరలించింది.

Also Read: Gold Price Crash: బంగారం కొనేవారికి శుభవార్త? సంచలన నిర్ణయం తీసుకున్న ముస్లిం దేశం.. భారీగా పతనం కానున్న పసిడి ధరలు..!  

ఎవరి వద్ద తాకట్టు పెట్టాం?:

ఆనాడు భారత్ తన బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్.. బ్యాంక్ ఆఫ్ జపాన్ వద్ద తాకట్టు పెట్టి సుమారు 400 మిలియన్ డాలర్ల రుణం పొందింది. ఇది దేశ ప్రతిష్టకు మచ్చగా భావించినప్పటికీ.. ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి అది తప్పనిసరి చర్య. అయితే, ఆ తర్వాత కొద్ది నెలల్లోనే భారత్ ఆ బంగారాన్ని తిరిగి తెచ్చుకోవడమే కాకుండా.. నేడు ప్రపంచంలోనే అత్యధిక బంగారు నిల్వలు కలిగిన దేశాల్లో ఒకటిగా నిలిచింది.

రష్యా నిర్ణయం సరైందేనా?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రష్యా చేస్తున్నది భయం వల్ల చేస్తున్న అమ్మకం కాదు. బంగారం ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు, తగ్గిన చమురు ఆదాయాన్ని భర్తీ చేయడానికి ఆస్తులను లిక్విడిటీ చేయడం ఒక తార్కికమైన ఆర్థిక చర్య. రష్యా ప్రపంచ ధరల నిర్ణయ ప్రక్రియలో భాగం కానందున, ఈ అమ్మకాలు అంతర్జాతీయంగా బంగారం ధరలను పడగొట్టే అవకాశం తక్కువగా ఉంటుంది.

భారత్‌లో బంగారం ధరలు తగ్గుతాయా.. పెరుగుతాయా?
రష్యా బంగారం అమ్మడం వల్ల అంతర్జాతీయ సరఫరాలో పెద్ద మార్పు రానప్పటికీ, ఇతర అంశాలు భారత్‌లో ధరలను శాసిస్తున్నాయి.

ధరల పతనం: ప్రస్తుతం యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ డాలర్ బలోపేతం కావడం, కేంద్ర బ్యాంకుల విక్రయాల వల్ల గరిష్ట స్థాయిల నుండి బంగారం రూ. 40,000 మేర తగ్గింది.

భవిష్యత్తు అంచనా: నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఈ తగ్గుదల తాత్కాలికమే. రష్యా వంటి దేశాలు నిల్వలు విక్రయిస్తున్నా, ద్రవ్యోల్బణం, ప్రపంచ అనిశ్చితి వల్ల దీర్ఘకాలంలో బంగారం మళ్ళీ  కొండెక్కడం ఖాయమని చెబుతున్నారు. ప్రస్తుతానికి ధరలు తగ్గుముఖం పట్టాయి కాబట్టి, సామాన్య ప్రజలకు, ఇన్వెస్టర్లకు బంగారం కొనడానికి ఇది  గోల్డెన్ టైమ్  అని చెప్పవచ్చు. కానీ, యుద్ధం మరింత ముదిరితే మాత్రం సరఫరా గొలుసు దెబ్బతిని ధరలు మళ్ళీ ఆకాశాన్నంటే ప్రమాదం ఉంది.

Also Read: Iran Uranium Price: ఇరాన్ యురేనియంపై అమెరికా కన్ను.. ఇరాన్ దగ్గరున్న 400కిలోల కోసం అగ్రరాజ్యం వేట.. కిలో ధర తెలిస్తే మైండ్ బ్లాక్..!!  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

Rupee slips All Time Low: డాలర్ దెబ్బకు రూపాయి విలవిల.. పాతాళానికి రూపాయి.. సెంచరీ దిశగా పరుగు..!!

BBhoomi1d ago
Lakshmapur, Telangana:

Indian Rupee All Time Low : మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న భీకర యుద్ధం భారత మార్కెట్లను అతలాకుతలం చేస్తోంది. అంతర్జాతీయంగా డాలర్ బలపడటం, చమురు సరఫరాలో అంతరాయాలు కలగడంతో భారత రూపాయి విలువ సోమవారం నాడు రికార్డు స్థాయి కనిష్టానికి పడిపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఏకంగా రూ. 95.20 వద్దకు చేరింది. కేవలం రెండు రోజుల క్రితమే రూ. 94.26 వద్ద ఉన్న రూపాయి.. ఇంత తక్కువ సమయంలోనే రూ. 95 మార్కును దాటడం ఆర్థిక నిపుణులను విస్మయానికి గురిచేస్తోంది.

యుద్ధం తెచ్చిన కరెన్సీ కష్టం:
గత నెల చివర్లో యుద్ధం మొదలైనప్పటి నుండి భారత కరెన్సీ సుమారు 4.4 శాతం మేర బలహీనపడింది. యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 115 డాలర్ల పైన స్థిరంగా కొనసాగుతుండటం రూపాయి పతనానికి ప్రధాన కారణమైంది. చమురు దిగుమతుల కోసం భారత్ భారీగా డాలర్లను ఖర్చు చేయాల్సి రావడంతో రూపాయిపై ఒత్తిడి విపరీతంగా పెరిగింది. ఇది కేవలం కరెన్సీ మార్కెట్‌నే కాకుండా, స్టాక్ మార్కెట్లు,  బాండ్ మార్కెట్లపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఆర్బీఐ రంగంలోకి దిగినా..:
రూపాయి పతనాన్ని అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. బ్యాంకులు విదేశీ మారకపు మార్కెట్‌లో చేసే లావాదేవీలపై ఆర్బీఐ కఠిన పరిమితులు విధించింది. ప్రతి పని దినం ముగిసేలోపు నికర ఓపెన్ రూపాయి స్థానాలను 100 మిలియన్ డాలర్లకు పరిమితం చేయాలని ఆదేశించింది. ఏప్రిల్ 10 నాటికి ఈ నిబంధనలు అమలులోకి రావాలని సూచించినప్పటికీ.. మార్కెట్ సెంటిమెంట్ మాత్రం రూపాయికి అనుకూలంగా లేదు. ఆర్బీఐ తీసుకున్న చర్యలు కేవలం స్వల్పకాలిక ఊరటను మాత్రమే ఇస్తున్నాయని.. దీర్ఘకాలికంగా రూపాయి పతనం ఆగేలా కనిపించడం లేదని తాజా గణాంకాలు చెబుతున్నాయి.

Also Read: Gold Price Crash: బంగారం కొనేవారికి శుభవార్త? సంచలన నిర్ణయం తీసుకున్న ముస్లిం దేశం.. భారీగా పతనం కానున్న పసిడి ధరలు..!  

సామాన్యుడిపై ప్రభావం ఎంత?
రూపాయి విలువ పడిపోవడం అంటే దేశంలో ద్రవ్యోల్బణం పెరగడమే. దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు, ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రానిక్ వస్తువులు, వంట నూనెల ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉంది. దీనికి తోడు, రాబోయే 12 నెలల్లో ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. దీనివల్ల సామాన్యుల హోమ్ లోన్లు, కార్ లోన్ల ఈఎంఐలు మరింత భారం కానున్నాయి.

అంతర్జాతీయ లావాదేవీలన్నీ డాలర్ కేంద్రంగానే సాగుతున్న ప్రస్తుత తరుణంలో రూపాయి విలువ ఈ స్థాయికి పడిపోవడం దేశ ఆర్థిక వ్యవస్థను రక్షణాత్మక స్థితిలోకి నెట్టింది. యుద్ధం త్వరగా ముగిసి, చమురు ధరలు అదుపులోకి వస్తే తప్ప రూపాయికి కోలుకునే అవకాశం కనిపించడం లేదు.

Also Read: Iran Uranium Price: ఇరాన్ యురేనియంపై అమెరికా కన్ను.. ఇరాన్ దగ్గరున్న 400కిలోల కోసం అగ్రరాజ్యం వేట.. కిలో ధర తెలిస్తే మైండ్ బ్లాక్..!!  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

 

0
0
Report

New Rules From April 1st: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..: మీకు లోన్‌ ఉందా? అయితే ఈ శుభవార్త మీకే!

Wadgaon, Maharashtra:

CIBIL Score Update: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త బ్యాంకింగ్ నిబంధనలను తీసుకువస్తోంది. బ్యాంకు వినియోగదారులకు లబ్ధి చేకూరేలా.. పారదర్శకతను పెంచేలా ఆర్‌బీఐ కీలక మార్పులు చేసింది. నామినీలు, సిబిల్‌ స్కర్‌, చార్జీలు, బంగారు ఆభరణాలపై తీసుకునే రుణాలు తదితర వాటి నిబంధనల విషయంలో ఆర్‌బీఐ కొన్ని కొత్త నిబంధనలు అమలు చేయనుంది. కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కొత్తగా రాబోతున్న ఐదు నిబంధనలు ఏమిటో తెలుసుకుందాం.

Also Read: KT Rama Rao: ప్రజల గొంతు నొక్కేందుకు 'హేట్ స్పీచ్'.. రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం

నామినీలు
బ్యాంకు ఖాతాకు నామినీల విషయంలో ఆర్‌బీఐ కొత్త నిబంధన తీసుకురాబోతున్నది. నలుగురు నామినీలు ఇప్పటివరకు మీ బ్యాంకు అకౌంట్ లేదా లాకర్‌కు ఒకరిద్దరిని మాత్రమే నామినీలుగా ఉంచే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు బ్యాంకు అకౌంట్లు, లాకర్లకు గరిష్టంగా నలుగురిని నామినీలుగా చేర్చుకోవచ్చు. ఈ కొత్త నిబంధనతో భవిష్యత్‌లో కుటుంబీకులకు ఆస్తుల నిర్వహణ సులభం కానుంది.

వారానికి ఒకసారి అప్‌డేట్‌
ఆర్థిక లావాదేవీలపై ఇచ్చే క్రెడిట్‌ స్కోర్‌ విషయంలో కొత్త నిబంధన వచ్చింది. సాధారణంగా సిబిల్ స్కోర్ నెలకు ఒకసారి మాత్రమే అప్‌డేట్ అయ్యేది. ఇకపై వారానికి ఒకసారి అంటే 7 రోజులకు ఒకసారి సిబిల్ స్కోర్ అప్‌డేట్ అవుతుంది. అంటే ప్రతి నెల 7, 14, 21, 28 తేదీల్లో క్రెడిట్‌ స్కోర్‌ అప్‌డేట్‌ కానుంది.  కొత్త నిబంధన తీసుకురావడంతో అప్పు కట్టగానే ఆ వివరాలు వెంటనే స్కోర్‌లో కనిపిస్తాయి. దీనివల్ల క్రెడిట్‌ స్కోర్‌ పెరుగుతుంది.

Also Read: KT Rama Rao: మూసీ పేరిట రేవంత్‌ రెడ్డి రూ.లక్షన్నర కోట్ల అవినీతి: కేటీఆర్‌

లోన్‌ క్లోజ్‌
రుణాలు తీసుకున్నవారు ముందే దానిని మూసేయాలనుకుంటే ఛార్జీలు వసూలు చేసేవారు. బ్యాంకులు 'ఫోర్‌క్లోజర్' లేదా 'ప్రీ-పేమెంట్' పేరుతో వసూలు చేసే జరిమానాలు ఇకపై ఉండవు. ఫ్లోటింగ్ వడ్డీ రేటు ఉన్న హోమ్ లోన్, కారు లోన్, ఎడ్యుకేషన్ లేదా పర్సనల్ లోన్లపై ముందస్తు చెల్లింపులకు ఛార్జీలు ఒకటో తేదీ నుంచి ఉండవు. అదనపు ఖర్చు లేకుండా అప్పును ఎప్పుడైనా తీర్చేసి క్లోజ్‌ చేయవచ్చు.

బంగారు ఆభరణాలపై..
సామాన్య ప్రజలకే కాదు బంగారు వ్యాపారులకు మేలు కలిగించే ఓ నిర్ణయం ఆర్‌బీఐ తీసుకుంది. బంగారు ఆభరణాల వ్యాపారులు తీసుకునే 'గోల్డ్ మెటల్ లోన్' (జీఎంఎల్‌) తిరిగి చెల్లించే గడువును ఆర్‌బీఐ పెంచింది. ఇంతకు ముందు 180 రోజులు ఉండగా.. ఇప్పుడు 270 రోజులకు గడువును పెంచారు. గడువు పెంపుతో బంగారు వ్యాపారులకు నగదు నిర్వహణ సులభమవుతుంది.

Also Read: Kavitha Apology: బహిరంగ క్షమాపణలు చెప్పిన కవిత.. ఎందుకో తెలుసా?

ఏప్రిల్‌ 1వ తేదీన ఆర్‌బీఐ అమలు చేయనున్న ఈ కొత్త నిబంధనలతో ప్రజలతోపాటు బంగారు వ్యాపారులకు చాలా లబ్ధి జరగనుంది. ముఖ్యంగా రుణాలు కావాలని చూస్తున్న వారికి భారీ ప్రయోజనం లభించనుంది. తక్కువ వడ్డీకే రుణాలు తీసుకునేవారికి క్రెడిట్ స్కోర్ ప్రతి వారం అప్‌డేట్ అవుతుండడంతో మరికొన్ని రుణాలు పొందడానికి దోహదం చేస్తుంది. మంచి క్రెడిట్‌ స్కోర్ ఉన్నవారు బ్యాంకులతో మాట్లాడి తక్కువ వడ్డీ రేట్లు పొందే అవకాశం లభించింది. అదనపు చార్జీలు లేకపోవడంతో ఇక త్వరగానే లోన్లు మూసివేసి వడ్డీ భారం నుంచి విముక్తి కావొచ్చు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

KT Rama Rao: ప్రజల గొంతు నొక్కేందుకు 'హేట్ స్పీచ్'.. రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం

Hyderabad, Telangana:

Hate Bill Is Cruel Weapon: సోషల్‌ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలు, కుంభకోణాలపై నిలదీస్తుంటే వాటిని నియంత్రించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన హేట్‌ బిల్లును బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఖండించారు. హేట్‌ బిల్లుతో ప్రజాస్వామ్యం గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పౌర స్వేచ్ఛను హరించే క్రూరమైన ఆయుధంగా కేటీఆర్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డిపై మండిపడ్డారు.

Also Read: KT Rama Rao: మూసీ పేరిట రేవంత్‌ రెడ్డి రూ.లక్షన్నర కోట్ల అవినీతి: కేటీఆర్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్) బిల్లుపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. ఈ బిల్లును పౌర స్వేచ్ఛను హరించే ఒక క్రూరమైన ఆయుధంగా అభివర్ణించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తన విమర్శకుల నోళ్లు మూయించేందుకే ఇటువంటి నిరంకుశ చట్టాలను తీసుకువస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హేట్‌ బిల్లు చట్టరూపం దాల్చితే రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య మూలాలకే ముప్పు వాటిల్లుతుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: Kavitha Apology: బహిరంగ క్షమాపణలు చెప్పిన కవిత.. ఎందుకో తెలుసా?

సామాజిక సామరస్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యతే అయినప్పటికీ ఈ బిల్లులోని నిబంధనలు అత్యంత అస్పష్టంగా ఉన్నాయని కేటీఆర్‌ తెలిపారు. అధికారుల వ్యక్తిగత అభిప్రాయాలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చేలా ఈ బిల్లు రూపకల్పన చేశారని.. ఇది కచ్చితంగా దుర్వినియోగానికి దారితీస్తుందని మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. బిల్లులో ఉపయోగించిన వ్యతిరేక భావాలు ప్రేరేపించడం, సామాజిక సమగ్రతను దెబ్బతీయడం వంటి పదాలకు స్పష్టమైన న్యాయ పరిమితులు లేవని ఎత్తిచూపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను లక్ష్యంగా చేసుకునేందుకే ఈ పదజాలాన్ని పొందుపరిచారని మాజీ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తే వాటిని ఫేక్ న్యూస్‌గా ముద్రవేసి జైలుకు పంపే ప్రమాదం పొంచి ఉందని న్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన హేట్‌ బిల్లు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని మాజీ మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. ప్రత్యక్ష హింసకు ప్రేరేపించే మాటలపైనే నియంత్రణ ఉండాలని, విమర్శ లేదా వ్యంగ్యం శిక్షార్హం కాదని కోర్టు స్పష్టం చేసిందని వెల్లడించారు. ఈ పరిమితిని మించి చట్టాలు చేయడం ఆర్టికల్ 19(1)(a) ప్రకారం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.

ఏడు నుంచి పది సంవత్సరాల వరకు జైలు శిక్షలను ప్రతిపాదించడం ద్వారా ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టించాలని రేవంత్‌ రెడ్డి చూస్తున్నాడని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు, విద్యార్థులు, సామాన్యులు తమ అభిప్రాయాలను పంచుకోవాలంటేనే భయపడేలా ఈ శిక్షలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే దేశంలో హేట్ స్పీచ్‌పై తగినన్ని చట్టాలు ఉండగా, అదనంగా ఈ చట్టం తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

AP High Court Jobs 2026: నెలకు రూ.1,47,760 జీతం..ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీగా ఉద్యోగాలు..7వ తరగతి చదివితే చాలు!

Nelapadu, Andhra Pradesh:

AP High Court Jobs 2026 News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఖాళీగా ఉన్న పోస్టుల ఇప్పుడు భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా ఏపీ హైకోర్టులో మొత్తం 300 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రణాళికను రూపొందించారు. ఇందులో 78 అసిస్టెంట్లు, 50 డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌, 20 ఆఫీస్ సబార్డినేట్, 44 టైపిస్ట్ పోస్టుల ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల దరఖాస్తు చేసుకోవాలని 
నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. విడుదల చేసిన ఈ 300 పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు వివిధ విభాగాలను మార్చి 30 అనగా నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు వీలు ఉంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..

సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ పోస్టులు: 1
అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు: 1
సెక్షన్ ఆఫీసర్స్ పోస్టులు: 5
కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు: 31
లైబ్రేరియన్ గ్రేడ్-II పోస్టులు: 1
అసిస్టెంట్ పోస్టులు: 78
యూడీ స్టెనోగ్రాఫర్ పోస్టులు: 7
ఎగ్జామినర్ పోస్టులు: 27
కాపీయిస్ట్ పోస్టులు: 34
టైపిస్ట్ పోస్టులు: 44
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు: 50
ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు: 20
స్టెనోగ్రాఫర్ పోస్టులు:1

హైకోర్టులో భర్తీకి  పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు విడుదల చేసిన నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలి. అయితే విడుదలైన పోస్టుల నోటిఫికేషన్ అనుసరించి సంబంధిత విభాగాల్లో కనీసం 7వ తరగతి నుంచి డిగ్రీ, బీటెక్‌, లా డిగ్రీ, ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత పొంది ఉండాల్సిన అవసరం ఉంది. అయితే అభ్యర్ధులకు గరిష్ఠ వయోపరిమితి 2026 జనవరి 1 నాటికి 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. 

రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడౠ్ల్యఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయో సడలింపు ఉండనుంది. అయితే ఇందులో కొన్ని పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు తప్పనిసరిగా టైపింగ్ లేదా షార్ట్‌హ్యాండ్ వంటి టెక్నికల్ అర్హతలు కూడా ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవాళ్లు ఆన్‌లైన్‌లో మార్చి 30, 2026 నుంచి‌ ఏప్రిల్‌ 19, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ రాత పరీక్ష (సీబీటీ), స్కిల్ టెస్ట్ (కొన్ని పోస్టులకు మాత్రమే) హజరవ్వాల్సి ఉంటుంది. అయితే మెరిట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక అనేది జరుగుతుంది. అయితే ఇందులో ఎంపికైన వారికి నెలకు రూ.20,000 నుంచి అత్యధికంగా రూ.1,47,760 వరకు జీతాలను చెల్లిస్తారు.

Also Read: Bank Holiday April 2026 List: షాకింగ్ న్యూస్..ఏకంగా 12 రోజులు సెలవులు..బ్యాంకు ఉద్యోగులకు పండగే..ఎందుకంటే?

Also Read: Ball Tampering PSL: మరోసారి చెత్తబుద్ధి బయటపెట్టిన పాకిస్థాన్..నిన్న జరిగిన మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్..గెలుపు కోసం తప్పుడు పని!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top