icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
501505
V SHIVA NAGARAJUV SHIVA NAGARAJUFollow3 Aug 2024, 03:15 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Autos Bandh: బిగ్‌ బ్రేకింగ్‌.. ప్రభుత్వంతో చర్చలు సఫలం- అర్ధరాత్రి ఆటోల బంద్‌ విరమణ

Baddipadaga, Telangana:

Auto Workers Strike: తమకు ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆటోడ్రైవర్లు కొంచెం శాంతించారు. నేటి అర్ధరాత్రి నుంచి చేపట్టాల్సిన ఆటోల బంద్‌ను విరమించుకున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో తాత్కాలికంగా నిరవధిక బంద్‌ విరమించుకున్నట్లు ఆటో సంఘాలు ప్రకటించాయి. యథావిధిగా ఆటోల రాకపోకలు హైదరాబాద్‌తోపాటు తెలంగాణవ్యాప్తంగా ఉండనున్నాయి.

ఆటో కార్మిక సంఘాలతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఆటో కార్మిక సంఘాల డిమాండ్స్ పై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి ప్రకటించారు. చర్చలు సఫలం కావడంతో ఆటో కార్మిక సంఘాలు తలపెట్టిన నిరవధిక బంద్‌నును విరమించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించి ఆటో కార్మిక సంఘాలు సమ్మె విరమించాయి. దీంతో ఆటో కార్మిక సంఘాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఆటో కార్మిక సంఘాలకు ప్రభుత్వం నుంచి సానుకూల అంశాలు రావడంతో సమ్మె విరమించుకోవడంతో హైదరాబాద్ నగర ప్రయాణికులకు భారీ ఊరట లభించింది.

ఆర్టీసీ పక్షాన ఈవీ ఆటోలు కొనే ప్రసక్తే లేదని అది దుష్ప్రచారం మాత్రమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. విధివిధానాలకు సెప్టెంబర్ 1వ తేదీ కార్మిక శాఖ, రవాణా శాఖ అధికారులు, ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో సంయుక్త సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2012 తర్వాత ఆటో చార్జీలు పెంచుకోవడంతో ఆటో చార్జీలు పెంచడానికి అంగీకరిస్తూ ఎంత పెంచాలి అనే దానిపై తగిన నివేదిక తీసుకొని సంబంధిత జీవో విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఓలా, ఉబెర్ లా మాదిరి ప్రభుత్వం తరుపున యాప్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఐటీ శాఖ నుంచి యాప్ ప్రారంభించేందుకు తగిన ప్రక్రియ ప్రారంభిస్తామని రవాణా శాఖ అధికారులు తెలిపారు.

ద్విచక్ర వాహనాల్లో రాపిడో, ఓలా, ఉబెర్ నడిపే వాటికి ఎల్లో ప్లేట్ ఉన్న వాటికి మాత్రమే ప్రయాణికులను  తరలింపుపై నిర్ణయం తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు రూ.12 వేల అంశంపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తగిన అంశాలు పరిగణనలోకి తీసుకొని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సహచ మంత్రులతో చర్చించి  సానుకూల నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

హైదరాబాద్ లో పాత డీజిల్, పెట్రోల్ ఆటోలకు రెట్రోఫిట్మెంట్ ద్వారా ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చడానికి రూ.1.50 లక్షలు ప్రభుత్వం సహాయం అందిస్తుందని అధికారులు ప్రకటించారు. కొత్త ఆటోలు కొనుగోలు చేయడానికి సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందని గుర్తు చేశారు. హైదరాబాద్ లో కాలుష్యాన్ని తగ్గించడానికి.. పర్యావరణాన్ని కాపాడడానికి నగరంలో ఈవి ఆటో లుగా మార్చడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఆటో కార్మికుల సోదరుల డిమాండ్స్ పై ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని అధికారులు ప్రకటించారు. ఆటో కార్మిక సంఘాలతో జరిపిన చర్చల్లో రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి , అడిషనల్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేష్, జేటీసీలు చంద్రశేఖర్ గౌడ్, శివ లింగయ్య, వెంకటరమణ ఉన్నారు.

0
0
Report

Harish Rao: 'అసెంబ్లీని స్తంభింపజేస్తాం.. సచివాలయాన్ని ముట్టడిస్తాం'.. రేవంత్‌ రెడ్డికి హరీశ్‌ రావు హెచ్చరిక!

Hyderabad, Telangana:

Harish Rao vs Revanth Reddy: ప్రజల ఆస్తులపై ప్రభుత్వం 22ఏతో నిషేధిత జాబితాను ఎత్తివేయకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తాం.. సచివాలయాన్ని ముట్టడిస్తామని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరిక జారీ చేశారు. 22ఏ జాబితాను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజల ఆస్తులను లాక్కుంటే కాంగ్రెస్ పార్టీ మాడి మసైపోవడం ఖాయం అని తెలిపారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే రాహుల్ గాంధీ చోద్యం చూస్తున్నారా? అని ప్రశ్నించారు.

హైదరాబాద్‌ బోడుప్పల్ పరిధిలోని తిరుమల మెడోస్, లక్ష్మీ గణపతి, హేమానగర్ కాలనీలను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన నేపథ్యంలో ఆ కాలనీవాసులకు బీఆర్ఎస్ పార్టీ బాసటగా నిలిచింది. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 30 శాతం కమీషన్ల కోసమే పక్కా రిజిస్టర్డ్ ఇళ్లను నిషేధిత జాబితాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పెడుతోందని.. భూభారతి పోర్టల్ నుంచి 22ఏ జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు? అని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు నిలదీశారు. పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు లేని సమస్యలు సృష్టించి వారిని తీవ్ర ఇబ్బందులపాలు చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. 'వైఎస్సార్‌ ప్రభుత్వ హయాంలో 2008లో అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ను ఎత్తేశారు. ఎప్పుడో రద్దయిన చట్టాన్ని మళ్లీ తెచ్చి, పట్టా భూములను 22-A నిషేధిత జాబితాలో పెట్టి వసూళ్లకు పాల్పడాలని చూస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రభుత్వ భూములను, ఎస్సీల అసైన్డ్ భూములను సైతం తెగనమ్ముతోంది. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులో ఉన్న 1000 గజాల పార్కును కూడా అమ్మకానికి పెట్టారు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు వివరించారు.

'ఆఖరికి గుడి కట్టడానికి.. బడి కట్టడానికి.. దవాఖానాకి.. శ్మశాన వాటికకు కూడా జాగా లేని పరిస్థితి సృష్టించారు. మరోవైపు కూకట్‌పల్లిలోని 1000 గజాల ప్రైవేటు ప్లేగ్రౌండ్‌ను కూడా ప్రభుత్వం తనదే అంటోంది. రాత్రికి రాత్రే ఇళ్లను యూఎల్‌సీ కింద 22ఏలో దేనికోసం పెడుతున్నారు? ఇదంతా కేవలం 30 శాతం కమీషన్లు లాగడానికే' అని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. దళారులు వెళ్లి యజమానులను 30 శాతం కమీషన్ అడుగుతున్నారని ఆరోపించారు.

 

'కమీషన్ల కోసం చేసిన తప్పునకు సామాన్య ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ఎందుకు తిరగాలి? ఎందుకు అప్లికేషన్లు పెట్టుకోవాలి?' అని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు నిలదీశారు. ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పుకోవాలని ఆలోచించడమే కాంగ్రెస్ ప్రభుత్వ తుగ్లక్ చర్య అని విమర్శించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తప్పు చేసి క్షమాపణలు చెప్పి తప్పించుకోవాలని చూడొద్దని సూచించారు. అప్లికేషన్లతో సంబంధం లేకుండా ఆ భూములను 22ఏ నుంచి తొలగించాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. అధికారులు చేసిన తప్పు వెనుక దాక్కుని రేవంత్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

'తెలంగాణ వ్యాప్తంగా ఏకంగా 40 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారు. అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ కూడా 22ఏలోనే ఉంది. మొత్తం హైదరాబాద్ అంతా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సరూర్‌నగర్ లాంటి ప్రాంతాలన్నీ నిషేధిత జాబితాలోనే ఉండటం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు దుయ్యబట్టారు. సీఐడీ, విజిలెన్స్ విచారణ పేరిట బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంతపెద్ద తుగ్లక్ నిర్ణయం తీసుకున్న అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.

'కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో పెట్టింది. ఇటు రేవంత్ రెడ్డి, అటు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులే. వీళ్లు రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే.. రాహుల్ గాంధీ చోద్యం చూస్తున్నారా?' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

0
0
Report

Baingan Bharta: విషంగా మారిన రాత్రి భోజనం.. వంకాయ కూర తిని ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

Chhatarpur, Madhya Pradesh:

Three Sisters Death: ఇంట్లో రాత్రి భోజనంగా చేసిన వంకాయ కూర, చపాతీల ఇంట్లోని ముగ్గురు అక్కాచెల్లెళ్లు తిన్నారు. తిన్న తర్వాత ముగ్గురు బాలికలు తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూశారు. ముగ్గురు కుమార్తెలు మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగింది. అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న ఆ బాలికల మృతి చెందడం పలు అనుమానాలు ఏర్పడుతున్నాయి. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. 

మధ్యప్రదేశ్‌ ఛతర్‌పూర్ జిల్లాలోని పిపోరా ఖుర్ద్ గ్రామానికి చెందిన బాల్‌ముకుంద్ కుష్వాహకు ముగ్గురు కుమార్తెలు పూనమ్ (7), మనీషా (3), చాహత్ (9 నెలల). వారు ముగ్గురు శుక్రవారం రాత్రి భోజనంగా వంకాయ కూర, చపాతీలు తిన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆ ముగ్గురు పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్దిసేపటికి ఆ ముగ్గురు చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అనంతరం ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలకు అంత్యక్రియలు చేశారు.

అయితే అనుమానాస్పద స్థితిలో బాలికలు మృతిచెందడంతో గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తుల సమాచారం అనంతరం స్థానిక పోలీసులు, వైద్యులతో కలిసి ఆ గ్రామానికి చేరుకున్నారు. పిల్లల మృతదేహాలను పూడ్చిపెట్టిన స్థలాన్ని పరిశీలించారు. బాలికల మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి పోలీసులు ఆధారాలు సేకరించారు. 

కుటుంబసభ్యులు చెబుతున్నట్టు బాలికలు తీసుకున్న ఆహారం విషతుల్యమైందని.. వారి మరణానిఇక ఆహారానికి ఏమైనా సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని అధికారులు తెలుసుకుంటున్నారు. పిల్లల అనుమానాస్పద మృతిపై కుటుంబసభ్యులను పోలీసులు విచారణ చేస్తున్నారు. బాలికల మృతిపై పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాత వారి మరణానికి కారణాలు తెలియనున్నాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అక్కడి పోలీసులు చెబుతున్నారు. వంకాయ కూర తిని ముగ్గురు చిన్నారులు మరణించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వార్త వైరల్‌గా మారింది.

0
0
Report
Advertisement

BRS Party: కాంగ్రెస్‌ 1000 రోజుల పాలన.. సెప్టెంబర్‌ 2 నుంచి గులాబీ పార్టీ ఆందోళనలు

Baddipadaga, Telangana:

KTR Call: 420 హామీలు.. 13 డిక్లరేషన్లు.. 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం.. కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని.. వెయ్యి రోజులు పూర్తి చేసుకుంటున్న రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ పార్టీ భారీ ఆందోళనలకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. సెప్టెంబర్‌ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఆదేశించారు. ‘బాకీ కార్డుల’తో హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ మోసాన్ని  గ్రామగ్రామాన ప్రజలకు తెలపాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి 1000 రోజులు నిండుతున్న సందర్భంగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ మోసాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్ద ఎత్తున కార్యాచరణకు సిద్ధమైంది. ఈ మేరకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కమిటీతో ఆదివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో కేటీఆర్‌ పలు సూచనలు, దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్‌ 2 నుంచి వారం రోజుల పాటు సమాజంలోని అన్ని రంగాలకు కాంగ్రెస్‌ పార్టీ చేసిన మోసాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున వినూత్నంగా తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ వివిధ కార్యక్రమాలు చేపట్టనుంది. అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి.. తర్వాత అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ నట్టేట ముంచిందని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి 1000 రోజులు నిండుతున్న సందర్భంగా ఆ పార్టీ మోసాన్ని ప్రజల్లో ఎండగడుతామని ప్రకటించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేసిన మోసాలు, ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతి వర్గానికి చేరేలా ఈ వారం రోజుల కార్యక్రమాలను నిర్వహించాలని పార్టీ నాయకత్వానికి మాజీ మంత్రి కేటీఆర్‌ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులంతా ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగట్టేలా కార్యాచరణను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇచ్చి, 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు డిక్లరేషన్ల పేరుతో ప్రతి ఒక్క మాటను 100 రోజుల్లోనే నెరవేరుస్తామని చెప్పి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గుర్తుచేశారు. అయితే 1000 రోజులు పూర్తయిన తర్వాత కూడా ఒక్కటంటే ఒక్క హామీని సంపూర్ణంగా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన తీరును ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యం, అవినీతి, అరాచకాల పట్ల తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు.

రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వ పరిపాలనా విధానాలు, వైఫల్యాలు, అవినీతి, అరాచకాలను ప్రజల ముందుంచాలని బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ సూచించారు. కార్యక్రమాలు కేవలం హామీల చుట్టూ కాకుండా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చోటుచేసుకున్న వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రధానంగా ప్రస్తావించాలని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీల విషయాలను మరోసారి ‘బాకీ కార్డుల’ రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. రైతు కూలీలు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, యువతకు ప్రతి నెలా ఇస్తామన్న ఆర్థిక సహాయం ఎంత మేరకు పేరుకుపోయిందో ఈ బాకీ కార్డుల ద్వారా ప్రజలకు గుర్తు చేయాలని పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు 1000 రోజుల కాంగ్రెస్‌ ప్రభుత్వం వైఫల్యానికి సంబంధించిన కార్యాచరణలో భాగంగా మరోసారి యువతకు కాంగ్రెస్‌ చేసిన మోసాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందని గులాబీ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గుర్తుచేశారు.

0
0
Report

July DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్! జూలై డీఏ పెంపుపై కీలక అప్‌డేట్..

Hyderabad, Telangana:

July DA Hike News: కేంద్ర ప్రభుత్వం సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు కరువు భత్యాన్ని సవరిస్తుంది. మొదటి విడత (జనవరి నెలకు సంబంధించి) సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ నెలలో ప్రకటిస్తారు. రెండో విడత (జూలై నెలకు సంబంధించి) సాధారణంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో వెల్లడిస్తారు. రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈసారి ఈ పెంపును కొద్దిగా ముందుగానే ప్రకటించి ఉద్యోగులకు దీపావళి లేదా దసరా కానుక అందించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఎంత శాతం పెరిగే అవకాశం ఉంది?
గత ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం కరువు భత్యాన్ని 58 శాతం నుండి 60 శాతానికి (అనగా 2%) పెంచింది. ప్రస్తుత ద్రవ్యోల్బణం, ధరల సూచీ ట్రెండ్స్ పరిశీలిస్తే, ఈసారి కూడా 2% నుండి 3% వరకు వేతన పెంపును ఉద్యోగులు ఆశించవచ్చు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం 3 శాతం పెంపుకు ఆమోదం తెలిపితే, ఉద్యోగుల మొత్తం డీఏ 63 శాతానికి చేరుకుంటుంది.

ఉద్యోగులు ప్రస్తుతం కొత్త వేతన సంఘం (8వ వేతన సంఘం) ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఈ డీఏ పెంపు కీలకమైనదిగా మారింది. కొత్త వేతన సంఘం అధికారికంగా ఏర్పాటయ్యే వరకు, ఏడవ వేతన సంఘం నిబంధనల ప్రకారమే ఈ అలవెన్సుల పెంపు కొనసాగుతుంది.

ఉద్యోగ సంఘాల డిమాండ్
పండుగ సీజన్ (రక్షాబంధన్, ఓనం వంటి పండుగలు) దృష్ట్యా ఉద్యోగుల జీతాలను ఒకటి లేదా రెండు రోజుల ముందుగానే చెల్లించాలని, అలాగే డీఏ పెంపును ఆలస్యం చేయకుండా త్వరగా ప్రకటించాలని ఆల్ ఇండియా ఎన్‌పిఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. అక్టోబర్ వరకు ఆలస్యం చేయకుండా, కేంద్ర మంత్రివర్గం త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Also Read: టీచర్లకు బెదిరింపులు.. 'కాక్రోచ్ జనతా పార్టీ' అభిజీత్ దీప్కేపై కేసు నమోదు!

Also Read: రైలు ఒక కిలోమీటర్ ప్రయాణించాలంటే ఎన్ని లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుందో తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అల్పపీడన అలర్ట్!

Hyderabad, Telangana:

Andhra Pradesh Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీని ప్రభావం వల్ల రానున్న రెండు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.

మత్స్యకారులకు బలమైన హెచ్చరికలు..
అల్పపీడన తీవ్రత కారణంగా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీనితో పాటు సముద్రం తీవ్ర అలజడిగా మారి అలలు భారీ ఎత్తున ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా మంగళవారం వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఏయే జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది?
సోమవారం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ప్రజలకు కీలక సూచనలు
ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో బయట ఉన్న ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. బలమైన గాలుల వల్ల చెట్లు, భారీ హోర్డింగులు కూలిపోయే ప్రమాదం ఉన్నందున, ఎవరూ వాటి కింద నిలబడకూడదని స్పష్టం చేశారు. వాతావరణంలో వస్తున్న ఈ మార్పులను గమనిస్తూ ప్రజలంతా రక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: ఏపీ నిరుద్యోగులకు విద్యాశాఖ మంత్రి శుభవార్త.. మరో 3,000 టీచర్ పోస్టుల భర్తీకి రెడీ!

Also REad: ఎన్టీఆర్ జిల్లాలో స్కూల్ బస్సుకు ఘోరం ప్రమాదం..20 మంది విద్యార్థులు, దూసుకెళ్లింది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Irumudi Collections: 'ఇరుముడి' సినిమా ఆల్‌టైమ్ రికార్డ్..36 గంటల్లో బ్రేక్ ఈవెన్ తెచ్చుకొని సంచలనం!

Hyderabad, Telangana:Irumudi Collection Day 2: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన తాజా ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్ 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద అపూర్వ విజయాన్ని అందుకుంది. విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. రవితేజ కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక వసూళ్లతో ఈ సినిమా ఒక సరికొత్త మైలురాయిని తాకింది. సినిమా విడుదలైన 36 గంటల్లోనే సినిమా కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్‌ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది.
0
0
Report

BJP Strike: రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ పోరు.. 2 రోజుల నిరాహార దీక్ష

Baddipadaga, Telangana:

Telangana BJP Protest: విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిపులు చెల్లించడం లేదని తెలంగాణ బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిపులు పెండింగ్‌లో పడడంతో విద్యార్థుల భవిష్యత్‌ ప్రమాదకరంగా మారిందని కాషాయ పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేపటి నుంచి తెలంగాణ బీజేపీ నిరాహార దీక్ష చేపట్టనుంది.

రాష్ట్రంలో విద్యావ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంపై తాము పోరాటం చేస్తామని.. ఫీజు బకాయిలు చెల్లించేవరకు బీజేపీ పోరాటం ఆగదని ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు స్పష్టం చేశారు. రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేపటి నుంచి హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో రెండు రోజుల నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. 

న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని.. విద్యార్థులు, యువత తీవ్ర ఆందోళనలో ఉన్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.12,000 కోట్లకు చేరాయని.. నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాలలు అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాయి. విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నాయి' అని వెల్లడించారు.

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై హైకోర్టు తీవ్ర స్థాయిలో చీవాట్లు పెడితే తప్ప కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చలనం రాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట రేపటి నుంచి 2 రోజుల నిరాహార దీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. పోలీసుల ఆంక్షలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. 

తెలంగాణలో రాహుల్‌ గాంధీ అడుగుపెట్టే హక్కు లేదు
'రాహుల్ గాంధీకి తెలంగాణలో అడుగుపెట్టే నైతిక హక్కు లేదు. ఎన్నికల వేళ తెలంగాణ విద్యార్థులకు ‘యూత్ డిక్లరేషన్’ పేరుతో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించారు' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులపై లాఠీచార్జీలు జరుగుతుంటే.. ఆయుష్ విద్యార్థులు స్టైపెండ్ల కోసం పోరాడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా విదేశాలకు పారిపోతూ రోడ్లపై డ్రామాలు చేసే రాహుల్ గాంధీకి దమ్ముంటే హైదరాబాద్‌కు వచ్చి విద్యార్థుల సమస్యలపై సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. తెలంగాణలో విద్యార్థులు రాహుల్ గాంధీని నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

కాంగ్రెస్ 30 శాతం కమీషన్ల సర్కార్
కాంగ్రెస్ ప్రభుత్వం 'బ్రదర్స్ సర్కార్'గా మారి దోపిడీ చేస్తోందని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా 30 శాతం కమీషన్లు తీసుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో బిల్డర్లను 22ఉ పేరుతో తీవ్రంగా వేధిస్తూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో అవినీతి కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కావడంతోనే ఆ పార్టీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి, అంతర్గత కుమ్ములాటలు, రహస్య సమావేశాలు జరుగుతున్నాయని వివిరించారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు కూడా ప్రభుత్వాన్ని నడిపించేలా కనిపించడం లేదని తెలిపారు.

0
0
Report

Jagadish Reddy: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ రెడ్డి క్షమాపణలు చెప్పాలి: జగదీశ్‌ రెడ్డి

Hyderabad, Telangana:

Telangana Bhavan: తెలంగాణ రైతు పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉండే దానికంటే ఎక్కువ అధ్వానమైపోయిందని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పి రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పి కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలని కోరారు. రైతులకు ఎల్‌నినో పెట్టిన శాపం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన శాపం అని పేర్కొన్నారు. పోలవరం నుంచి పట్టిసీమ నుంచి బ్రహ్మాండంగా నీళ్లు పోతున్నాయని.. కన్నెపల్లి పంపులు ఆన్ చేసి ఉంటే మల్లన్నసాగర్, కొండ పోచమ్మ, రంగనాయక సాగర్ నిండేవి అని తెలిపారు.

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం, బీజేపీ కలిసి ఆడిన నాటకం ద్రోహం ఇప్పుడు తేటతెల్లమైందని తెలిపారు. 'కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ల, అన్నారం బ్యారేజ్‌లపై కేంద్ర జల సంఘం ఇచ్చిన రిపోర్ట్‌తో కలిసి ఆడుతున్న నాటకం తేటతెల్లమైంది. మేడిగడ్డ బ్యారేజ్‌తో సంబంధం లేకుండా కన్నేపల్లి పంపుహౌస్ ఆన్ చేయాలని కేటీఆర్ అనేక సార్లు చెప్పిన రేవంత్‌ రెడ్డి పట్టించుకోలేదు. చెప్పిన అబద్ధమే చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌డీఎస్‌ఏ సాకు చెప్పింది' అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. కమీషన్‌లకు అలవాటుపడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు.

'పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు ఏ విధంగా దోచుకుంటున్నారో  వాస్తవాలు ప్రజలకు చూపించా. రాజశేఖర్ రెడ్డి పెట్టిన పోతిరెడ్డిపాడు బొక్కతో అంతులేకుండా నీళ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకెళ్తుంది' అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. పోతిరెడ్డిపాడు నుంచి వరద జలాలను మాత్రమే తీసుకుపోవాలని గుర్తుచేశారు. దుర్మార్గంగా 140 టీఎంసీల నీళ్లను ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీళ్లను తీసుకెళ్లింది. సాగర్‌లో ఇప్పటివరకు 175 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. 110 టీఎంసీల నీళ్లు వచ్చి ఉంటే సాగర్ నిండేది. నాగార్జున సాగర్‌లో ఎడమ కాల్వ కింద ఉండే పంటలకు సరిపడే నీళ్లు ఉండేవి' అని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వివరించారు.

'నాగార్జున సాగర్‌లో 518 అడుగుల నీళ్లు ఉన్నప్పుడే ఎడమ కాల్వ కింద సాగునీరు ఇచ్చాం. సాగర్‌లో 510 అడుగుల నీళ్లు ఉన్నప్పుడే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎడమ కాల్వ కింద సాగునీరు ఇచ్చాడు. పెన్నా బేసిన్‌లో వరద రాకున్నా రాయలసీమలో  52 శాతం వర్షపాతం తక్కువ ఉన్నా మహబూబ్ నగర్ పరిధిలో ఉండే పంపులు ఇంతవరకు ఆన్ చేయలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం గోదావరి,  కృష్ణాలో ద్రోహం చేస్తోంది' అని రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు.

'నీళ్లు ఇస్తే కరెంట్ కొనాలని.. పంటలు వేస్తే ఎరువులు ఇవ్వాల్సి వస్తుందని కాంగ్రెస్‌ ప్రభుత్వం నీళ్లు ఇవ్వడం లేదు. పంట కొంటే బోనస్ ఇవ్వాలి. దుర్మార్గమైన ఆలోచనతో నీళ్లు ఇవ్వడం లేదు' అని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌నినో పేరుతో దుర్మార్గమైన ఆలోచన కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తోందని.. నీళ్లు ఇవ్వొద్దని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారని విమర్శించారు.

'నాగార్జున సాగర్ నిండిన రైతులకు నీళ్లు ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పాడు. ఆరుతడి పంటలు ఏం వేసుకోవాలో ఏ జిల్లాలో ఏం పంటలు పండుతాయిని మంత్రులు ఒక్కరంటే ఒక్కరు చెప్పినవారు లేరు. ఏ గింజ పెట్టుకోవాలన్నా నీళ్లు కావాలి, రైతులకు నీళ్లు ఎలా ఇస్తారు' అని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి ప్రశ్నించారు. రైతులకు నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

0
0
Report
Advertisement

Revanth Reddy: కొన్ని గంటల్లో వచ్చేస్తున్నా.. అన్నింటిపై మాట్లాడుతా: రేవంత్‌ రెడ్డి

Baddipadaga, Telangana:

USA Tour Cancel: అమెరికా పర్యటన రద్దు అంశంపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో బీజేపీ నాయకులు.. జాతీయవాదులు రేవంత్‌ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్‌ మద్దతుదారుడిని కలిసేందుకు అమెరికా పర్యటనకు వెళ్లడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. జాతీయవ్యాప్తంగా రాజకీయ వివాదం నెలకొన్న నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి స్పందించారు. ఈ విషయాలపై తాను అన్నింటిపై మాట్లాడుతానని... కొన్ని గంటల్లో తాను వస్తున్నట్లు ప్రకటించారు.

తన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలోనే అనుమతి ఇవ్వలేదని రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారు. తనకు అనుమతి నిరాకరించడంతో అమెరికాలోని బోస్టన్‌ పర్యటనకు వెళ్లలేకపోతున్నట్లు తెలిపారు. తన అమెరికా పర్యటనపై ‘ఎక్స్‌’లో రేవంత్‌ రెడ్డి పోస్ట్‌ చేశారు. రాజకీయ కారణాలతోనే తన అమెరికా పర్యటనకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించిందని తెలిపారు.

ఈ కారణంగా అమెరికాలోని బోస్టన్‌కు వెళ్లలేకపోతున్నట్లు.. విదేశీ పర్యటన అంశంలో తనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. లండన్‌ పర్యటనను విజయవంతంగా ముగించుకుని మరికొన్ని గంటల్లో హైదరాబాద్‌కు వస్తున్నట్లు వెల్లడించారు. అక్కడికి (హైదరాబాద్‌) వచ్చాక మిగిలిన అంశాలపై మాట్లాడతానని రేవంత్‌ రెడ్డి ప్రకటన చేశారు. ఇక తనకు మద్దతుగా మూడు రోజుల నుంచి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని.. దీనికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు.

రేపు ప్రెస్‌మీట్‌..?
విదేశీ పర్యటన ముగించుకుని రేవంత్‌ రెడ్డి రేపు ఉదయం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. అనంతరం రేపు ఉదయం తన అమెరికా పర్యటన రద్దు అంశంపై మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన తన అమెరికా పర్యటన రద్దుపై కీలక విషయాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న ఆగస్టు సంక్షోభం.. కొండా సురేఖ, చిన్నారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వ్యవహారాలపై కూడా స్పందిస్తారని సమాచారం. దీంతో రేపటి రేవంత్‌ రెడ్డి మీడియా సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.

0
0
Report

Emotional Video: మతిస్థిమితం లేని వ్యక్తికి రాఖీ కట్టిన విద్యార్థిని.. తర్వాత ఆ వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు ఫిదా!

Hyderabad, Telangana:

 Emotional Viral Video Watch: రక్తసంబంధం లేకపోయినప్పటికీ.. సమాజం గుర్తించని స్థితిలో ఉన్నప్పటికీ.. స్వచ్ఛమైన ప్రేమకు ఎలాంటి సరిహద్దులు ఉండవని నిరూపించే హృదయాన్ని హత్తుకునే ఘటన ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మతిస్థిమితం లేని ఓ వ్యక్తి పట్ల పాఠశాల విద్యార్థిని చూపిన ప్రేమ.. ఆమె చూపిన ఆదరణకు ఆ వ్యక్తి స్పందించిన తీరు ప్రతి ఒక్కరి కళ్ళలోనూ నీళ్లు తెప్పిస్తోంది. ఇప్పుడు ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరు బాగోద్వేగానికి గురవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

రోజులాగే యూనిఫామ్ ధరించి బ్యాగ్ తగిలించుకొని పాఠశాలకు వెళ్తున్న ఓ బాలిక దగ్గరకు.. చిరిగిన బట్టలతో.. కర్రతో పాటు సంచిని భుజానికి వేసుకొని ఓ మతిస్థిమితం లేని వ్యక్తి వచ్చాడు. చేతిలో ఒక రాఖీని పట్టుకొని.. దాన్ని తనకు కట్టాలంటూ మూగ సైగలతో దీనంగా వేడుకున్నాడు.. తెలియని వ్యక్తి కావడంతో పాటు.. మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఆ విద్యార్థిని మొదటగా తీవ్రంగా భయపడి వెనకడుగు వేసింది. అయితే.. తనలో ఉన్న అమాయకత్వాన్ని గమనించిన ఆ చిన్నారి.. ఏమాత్రం ఆలోచించకుండా అతని వద్దకు వెళ్లి ఎంతో ఆప్యాయంగా చేతికి రాఖీ కట్టడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు..

రాఖీ కట్టిన మరుక్షణమే ఆ వ్యక్తి ప్రవర్తించిన తీరు అక్కడున్న వారిని.. వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపరిచేలా చేసింది. సోదరి సమానురాలైన ఆ చిన్నారి కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు.. అనంతరం సాంప్రదాయం ప్రకారం చెల్లికి కానుక ఇవ్వాలన్న భావనతో తన జేబులను తడుముకున్నాడు.. జేబులు ఖాళీగా ఉండడంతో పాటు తమ వద్ద ఇచ్చేందుకు చెల్లి గవ్వ లేదంటూ చేతులు జోడించి సైగల ద్వారా క్షమాపణలు కోరాడు.. ఆపై చిరునవ్వుతో అక్కడి నుంచి భారంగా అడుగులు వేస్తూ వెళ్లిపోయాడు..

 Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్‌సాయి రాసలీలలు.. 

ఈ అపురూప ఘట్టానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చెక్కర్లు కొడుతోంది.. సంపద లేకున్నా సంస్కారం ఉంది.. మానసిక స్థితి దెబ్బతిన్న రక్తంలో జీర్ణించుకుపోయిన బంధాల విలువ మరువ లేదంటూ చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు చేస్తున్నారు. ఆపదలో ఉన్న వారిని దూరం పెట్టకుండా ఆదరించిన ఆ పాఠశాల విద్యార్థిని సంస్కారాన్ని కూడా ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు.. మనుషుల మధ్య అంతరాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో.. ఈ అద్భుతమైన వీడియో మానవత్వపు మానవత్వపు గొప్పదనాన్ని మరోసారి చాటి చెప్పింది..

 
 
 
 
 

 Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్‌సాయి రాసలీలలు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

  

0
0
Report

కొండగట్టు అంజన్న సన్నిధిలో ఉద్రిక్తత.. లడ్డూ కౌంటర్ వివాదంపై VHP ధర్నా!

Hyderabad, Telangana:

Kondagattu Temple: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం.. చొప్పదండి నియోజకవర్గం పరిధిలో ఉన్న కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ఊహించని ఒక వివాదం చోటుచేసుకుంది.. పవిత్రమైన లడ్డు ప్రసాద పంపిణీ కేంద్రం వద్ద భక్తులతో పాటు ఆలయ సిబ్బంది మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.. సిబ్బంది తీరును నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ సభ్యులు ఆలయ ఈవో కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు..

సాధారణంగా కొండగట్టు స్వామివారి దర్శనార్థం నిత్యం వందలాదిమంది భక్తులు వస్తూ ఉంటారు. దర్శనానంతరం లడ్డు ప్రసాదం కొనుగోలు చేసేందుకు వెళ్లిన విశ్వహిందూ పరిషత్ సభ్యులకు చేదు అనుభవం ఎదురైంది.. ప్రసాదం కోసం వెనక వైపు నుంచి వెళ్ళిన తమపై కౌంటర్లో సిబ్బంది అత్యంత తురుసుగా ప్రవర్తించారని విహెచ్పి నాయకులు ఆరోపించారు. కనీస మర్యాద లేకుండా తమను నెట్టువేసి.. దౌర్జన్యానికి పాల్పడ్డారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు..

ఈ ఘటనతో మనస్థాపానికి చెందిన విశ్వహిందూ పరిషత్ సభ్యులు వెంటనే ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యాలయం వద్దకు చేరుకొని భారీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.. ఈవో డౌన్ డౌన్ అంటే పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఆలయ ప్రాంగణంలో గందరగోల వాతావరణం నెలకొంది. భక్తులతో వింతగా ప్రవర్తించిన సదరు సిబ్బందిని తక్షణమే విధుల్లో నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు..

 Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్‌సాయి రాసలీలలు..

దైవ దర్శనానికి వచ్చే భక్తులతో ఆలయ సిబ్బంది ఎంతో మర్యాదగా.. ఓపికగా వ్యవహరించాలని.. భక్తులను ఇబ్బందులకు గురిచేస్తూ దాడులకు దిగడం క్షమించరాన్ని నేరమని.. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న కొండగట్టు ఎస్సై, ఆలయ సూపరింటెండెంట్ హుటాహుటిన అక్కడికి చేరుకొని.. ఆందోళన చేస్తున్న వారితో సంప్రదింపులు జరిపి అన్ని విషయాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అనంతరం విశ్వహిందూ పరిషత్ సభ్యుల నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదును కూడా స్వీకరించారు..

 Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్‌సాయి రాసలీలలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Eshwar Sai Madhuri Rathod: మధూరీ రాథోడ్ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి!

Hyderabad, Telangana:Eshwar Sai On Madhuri Rathod: ఇటీవల వివాదం చెలరేగిన నేపథ్యంలో ఈశ్వర్ సాయి, మాధురీ రాథోడ్ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన నేపథ్యంలో ఇటీవలే వైరల్‌గా మారింది. ఈ ఘటనను భార్య వీడియో తీస్తు రెడ్ హ్మాండెడ్ గా పట్టుకుంది. మాధురిని చెంప మీద కొట్టి నానా బూతులు తిట్టింది. ఈ రచ్చను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది కాస్త విపరీతంగా వైరల్గా మారింది. కొంత మంది ఈశ్వర్ సాయి భార్యకు సపోర్ట్ చేస్తుండగా, మరికొంత మంది మాత్రం మాధురీ రాథోడ్ కు అండగా నిలుస్తున్నారు. తాజాగా ఈ సంఘటనపై ఈశ్వర్ సాయి స్పందించాడు.
0
0
Report

AP Liquor Scam: వైసీపీ మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం!

Hyderabad, Telangana:

Karumuri Nageswara Rao Arrest: ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఈ దర్యాప్తులో భాగంగా వైకాపా నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని ఆయన నివాసంలో ఆదివారం సాయంత్రం కారుమూరిని అదుపులోకి తీసుకున్న అధికారులు, తదుపరి విచారణ కోసం బషీర్‌బాగ్‌లోని ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఈ కేసులో కారుమూరి నాగేశ్వరరావు నాలుగో నిందితుడిగా అరెస్ట్ అయ్యారు. 

కాగా, ఇదే కేసులో ఆయన కుమారుడు కారుమూరి సునీల్‌ను ఈ ఏడాది జూన్ 16న ఈడీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ దందాలో సునీల్ అత్యంత కీలక పాత్ర పోషించారని, ఆయన బ్యాంకు ఖాతాల్లోకి దాదాపు రూ.28 కోట్ల మేర కిక్‌బ్యాక్స్ (ముడుపులు) వచ్చాయని ఈడీ తన రిమాండ్ నివేదికలో స్పష్టం చేసింది. తండ్రి రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని సునీల్ ఈ భారీ అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే తండ్రి కారుమూరి నాగేశ్వరరావును కూడా ఈడీ అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు.

ఈ కేసులో ఇప్పటికే రాజ్‌ కసిరెడ్డి, మద్యం నియంత్రణ సంస్థ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి వంటి ప్రముఖులను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తండ్రీకొడుకులిద్దరూ ఈ కేసులో అరెస్ట్ కావడంతో రాబోయే రోజుల్లో మరికొందరు కీలక వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

Also Read: ఏపీ నిరుద్యోగులకు విద్యాశాఖ మంత్రి శుభవార్త.. మరో 3,000 టీచర్ పోస్టుల భర్తీకి రెడీ!

Also REad: ఎన్టీఆర్ జిల్లాలో స్కూల్ బస్సుకు ఘోరం ప్రమాదం..20 మంది విద్యార్థులు, దూసుకెళ్లింది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Anasuya Vs Hema: యాంకర్ అనసూయకు నటి హేమ కౌంటర్..నోరు అదుపులో పెట్టుకోవాలని ఘాటు వార్నింగ్!

Hyderabad, Telangana:

Hema On Anasuya Controversy: టాలీవుడ్ యాంకర్ అనసూయ భరద్వాజ్ సనాతన ధర్మం, శ్రీరాముడి నామంపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపాయి. కొందరు శ్రీరాముడి పేరును, దేవుడి ఫొటోలను వాడుకుంటూ సోషల్ మీడియాలో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆమె చేసిన కామెంట్లపై హిందూ సంఘాలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై అధికారికంగా ఫిర్యాదు కూడా నమోదైంది. పరిస్థితి తీవ్రతను గమనించిన అనసూయ వివరణ ఇస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. తాను కూడా హనుమాన్ భక్తురాలినేనని, కేవలం సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తూ వేధిస్తున్న కొందరిని ఉద్దేశించి మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశానని, తన మాటలను వక్రీకరించారని అందులో పేర్కొన్నారు. అయితే, ఈ వివరణతో వివాదం ముగియకముందే, సీనియర్ నటి హేమ ఈ వ్యవహారంలోకి ప్రవేశించి అనసూయపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

"సినీ పరిశ్రమలో ఉన్న మనమంతా అద్దాల మేడలో ఉన్నట్లే. మనం మాట్లాడే ప్రతి మాటా, చేసే పనీ ప్రజలు భూతద్దంలో పెట్టి చూస్తారు. ఈ కనీస స్పృహ లేకుండా పదే పదే ఎందుకు నోరు జారుతావు?" అంటూ హేమ అనసూయను సూటిగా ప్రశ్నించారు. కోట్ల మంది హిందువుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న సున్నితమైన విషయాలపై పబ్లిక్‌గా మాట్లాడేటప్పుడు అత్యంత విచక్షణతో వ్యవహరించాలని హితవు పలికారు. 'జై శ్రీరామ్' నామం కేవలం ఒక నినాదం కాదని, అది కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో నిక్షిప్తమైన ఒక దివ్య మంత్రం అని హేమ భావోద్వేగానికి లోనయ్యారు.

ఎవరైనా వేధిస్తే ధైర్యంగా వారి పేర్లు బయటపెట్టి పోరాడాలి కానీ, పవిత్రమైన దేవుడి పేర్లను, ఫొటోలను కవచంగా వాడుతూ విమర్శలు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని నటి హేమ మండిపడ్డారు. ముందు నోరు జారి, ఆ తర్వాత కవరింగ్ ఇచ్చుకోవడం మానుకోవాలని చురకలంటించారు.

"కర్మ సిద్ధాంతం ఎవరినీ వదిలిపెట్టదు. జాగ్రత్త" అని హేమ హెచ్చరించారు. తెలుగు సినీ ప్రేక్షకుల ఆదరణ వల్లే ఈ స్థాయి గుర్తింపు వచ్చిందని, వారి విశ్వాసాలను గౌరవించడం నేర్చుకోవాలని హేమ ఘాటుగా విమర్శించారు. ప్రస్తుతం ఈ వివాదం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Also REad: బిగ్‌బాస్‌లోకి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..సోషల్ మీడియాలో సుజీత్ హీరోయన్ క్లారిటీ!

Also Read: బాక్సాఫీస్ వద్ద మాస్ మహారాజా ప్రభంజనం.. తొలిరోజే 'ఇరుముడి' ఆల్‌టైమ్ రికార్డ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top