హయత్ నగర్ లో రిలయన్స్ డిజిటల్ షోరూం ప్రారంభించిన సినీనటి నభా నటేష్
Hayathnagar_Khalsa, Telangana:హయత్నగర్లోని కొత్త రిలయన్స్ డిజిటల్ స్టోర్ను సినీనటి నభా నటేష్ ఈ రోజు ప్రారంభించారు. 1 లక్ష రూపాయల పైగా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసిన వినియోగదారులతో ఫోటోలు తీసి, వారికి వస్తువులు అందించారు. నభా నటేష్ మాట్లాడుతూ, ఈ స్టోర్ ప్రారంభం తనకు చాలా సంతోషంగా ఉందని, ప్రముఖ నటితో మీట్ & గ్రీట్ష్లో పాల్గొనేవారికి ప్రత్యేక సంతకం చేసిన వస్తువులు అందించామన్నారు. కొత్త స్టోర్లో, బ్యాంక్ కార్డ్లపై 10% వరకు తక్షణ తగ్గింపుతో ఎర్లీ బర్డ్ ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Tharun Bhascker Eesha Rebba: పెళ్లికి రెడీ అయిన తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా..జంటగా కలిసి ఎయిర్పోర్టులో ఇలా..
Hyderabad, Telangana:Tharun Bhascker Eesha Rebba Airport: టాలీవుడ్లో స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక ఇటీవలే పెళ్లి బంధంతో ఒక్కటవ్వగా.. ఇప్పుడు మరో జంట పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. 'పెళ్లిచూపులు' సినిమాతో సెన్సేషనల్ క్రియేట్ చేసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు సమాచారం. హీరోయిన్ ఈషా రెబ్బాతో ఈయన ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి వార్త చెప్పనున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ వార్తలకు బలం చేకూరేలాగ వీరిద్దరూ ప్రతిసారి జంటగా మీడియా కంట పడుతున్నారు. అందుకు తగ్గట్టు తాజాగా తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హైదరాబాద్ ఎయిర్పోర్టులో జంటగా కనిపించడమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ జంట కలిసి ఎక్కడికో వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై క్లారిటీ లేదు.
డైరెక్టర్ తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ప్రేమాయణం గురించి ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నా.. ఈ వార్తలపై వీరిద్దర్లో ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. అయితే ఇలాంటి వార్తలపై స్పందించలేదు. అలాగనీ ఖండించకపోవడం వల్ల వీరిద్దరి ప్రేమ నిజమే అంటూ టాలీవుడ్ ఫ్యాన్స్ అంటున్నారు. తాజాగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కంటపడిన వీడియోలో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ స్టైలిష్ లుక్తో కనిపించగా.. హీరోయిన్ ఈషా రెబ్బా సింపుల్గా 3-పీస్ డ్రస్సులో కనిపించింది.
ఉదయ్పూర్లోనూ జంటగా..
హీరో విజయ్ దేవరకొండ, రష్మిక వివాహ వేడుకలు ఇటీవలే రాజస్థాన్లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లికి కూడా తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా వెళ్లినట్లు సమాచారం. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్గానూ మారాయి. వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూస్తుంటే, కేవలం స్నేహం కంటే ఎక్కువే ఉందన్న అనుమానాలు అభిమానుల్లో వ్యక్తమయ్యాయి.
New Couple Very Soon ❤️✨😍#EeshaRebba #TharunBhascker pic.twitter.com/iaEvK4RW9h
— Hatoffcine (@Hatoffcine_) July 8, 2026
గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నప్పటికీ, తాజా పర్యటనతో ఆ పుకార్లకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. అయితే, ఈ వార్తలపై అటు తరుణ్ భాస్కర్ గానీ, ఇటు ఈషా రెబ్బా గానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. విజయ్ దేవరకొండతో ఉన్న సాన్నిహిత్యం వల్లే వీరు ఈ వేడుకకు హాజరయ్యారని, వీరిద్దరూ కేవలం మంచి స్నేహితులు మాత్రమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు.
వెడ్డింగ్ ప్లాన్?
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ప్రస్తుతం స్ట్రాంగ్ రిలేషన్లో ఉన్నారనే చర్చ ఫిలిం నగర్ సర్కిల్స్లో గట్టిగా వినిపిస్తోంది. విజయ్ - రష్మికల పెళ్లి సందడిలో ఈ కొత్త జంట హైలైట్ అవ్వడం ఇపుడు టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఈ వార్తలపై తరుణ్ లేదా ఈషా ఎప్పుడు స్పందిస్తారో వేచి చూడాలి.
Also Read: మహేష్ బాబు ఫ్యాన్స్కు సూపర్ గుడ్న్యూస్..'వారణాసి' సినిమా టీజర్ వచ్చేది ఎప్పుడంటే?
Also Read: ఒక్క వెబ్సిరీస్తో లెవల్ మారిపోయింది..రాత్రికి రాత్రే స్టార్గా మారిన మలయాళ బ్యూటీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ఈనెల 20 నుంచి 22 వరకు వైభవంగా బల్కంపేట బోనాలు.. కల్యాణోత్సవం
Hyderabad, Telangana:Bonalu Festival 2026: ఆషాఢ మాసం ప్రారంభమవుతుండడంతో హైదరాబాద్ బోనాల పండుగకు ముస్తాబవుతోంది. అయితే బోనాల ప్రారంభానికి ముందు అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా బోనాల ఉత్సవాలు జరగనుండగా.. ఈ ఉత్సవాలకు సంబంధించి తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి సమన్వయ సమావేశం నిర్వహించడమే కాకుండా సమీక్ష చేశారు. జూలై 20 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న కల్యాణోత్సవానికి సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు.
హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ వార్షిక కల్యాణోత్సవం, ఆషాడ బోనాల జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై సంబంధిత శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్ష చేశారు. అంతకుముందు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం భారీ స్థాయిలో జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వసన్నద్ధమైంది. జూలై 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.
బల్కంపేట ఎల్లమ్మ దర్శనం అష్టాదశ శక్తిపీఠాల దర్శనంతో సమానమని మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో.. ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్, జీహెచ్ఎంసీ, విద్యుత్, జలమండలి, వైద్య, తెలంగాణ ఆర్టీసీ వంటి అన్ని ప్రభుత్వ శాఖలు సంపూర్ణ సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు.
కల్యాణోత్సవం, జాతర సందర్భంగా క్యూ లైన్లు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కొండా సురేఖ తెలిపారు. భక్తుల రద్దీని తట్టుకునేలా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేస్తున్నామని.. ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా ముందస్తుగా ట్రాఫిక్ మళ్లింపులు, వాహనాల నిలుపుదలకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయిస్తున్నట్లు కొండా సురేఖ వివరించారు. జాతరలో మహిళలు, వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనానికి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కొండా సురేఖ వెల్లడించారు.
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి వైభవాన్ని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు. బల్కంపేట ఎల్లమ్మ ఉత్సవాల ప్రాంగణంలో నిరంతరం తాగునీటి సరఫరా, మొబైల్ టాయిలెట్ల ఏర్పాటుతో పాటు పారిశుద్ద్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు.. విద్యుత్ ప్రమాదాలు, ఎలాంటి అపశృతులు జరగకుండా విద్యుత్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఓపెన్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద ముందస్తు రక్షణ ఏర్పాట్లు చేయనుని సూచించారు.
కల్యాణోత్సవం, జాతర సందర్భంగా భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు.. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పాత నేరస్తులు, అనుమానితుల ఫొటోలను వాల్ పోస్టర్లుగా ప్రదర్శించాలని పోలీసులను మంత్రి ఆదేశించారు. ఉత్సవాల సమయంలో రద్దీ ఉండగా తప్పిపోయిన చిన్నారులను త్వరగా గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక కార్యాచరణను చేపట్టినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా అస్వస్థతకు గురయితే ఉత్సవాల ప్రాంగణంలో ప్రత్యేక వైద్య శిబిరాలను, 108 అంబులెన్స్లను నిరంతరం అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించారు. భక్తుల రాకపోకలకు వీలుగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు మంత్రి ప్రకటించారు.
రూ.4.70 కోట్ల వాట్సాప్ 'బాస్' మోసం కేసు.. నమ్మించి మోసం చేసిన ఇద్దరు అరెస్ట్!
Hyderabad, Telangana:Cyber Security Bureau: వాట్సప్ ద్వారా ఓ కంపెనీ వారిని నమ్మించి భారీ మోసం చేసిన ఉదంతం తెలంగాణలో జరిగింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) పేరు, ఫొటోతో నకిలీ వాట్సాప్ ప్రొఫైల్ను సృష్టించి ఏకంగా రూ. 4.70 కోట్లు దోచుకున్నారు. ఈ భారీ సైబర్ మోసం కేసును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఛేదించింది. ఈ కేసులో సైబర్ నేరగాళ్లకు సహకరిస్తూ బ్యాంక్ ఖాతాలను సమకూర్చిన ఇద్దరు మ్యూల్ (నకిలీ) ఖాతాదారులను, ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తాను పనిచేసే కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఫోటో, పేరుతో ఉన్న ఒక వాట్సాప్ నంబర్ నుంచి వచ్చిన సందేశాలను సంబంధిత సంస్థ ఉద్యోగి నిజమేనని భావించాడు. అత్యవసరం అని నమ్మించి ఆ ఉద్యోగి నుంచి పలు బ్యాంక్ ఖాతాలకు విడతల వారీగా మొత్తం రూ.4.70 కోట్ల భారీ మొత్తాన్ని బదిలీ చేసుకున్నాడు. ఆ తర్వాత ఎంతకీ అడిగిన డబ్బులు తిరిగివ్వకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు సాంకేతిక విశ్లేషణ, బ్యాంక్ ఖాతాల పరిశీలన ఆధారంగా పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులను ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన దోసపాటి కృష్ణసాయి, హైదరాబాద్ కొత్తపేటలో నివసిస్తున్న మందవల్లి శివ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు ఇద్దరూ కమిషన్ ఆశతో సైబర్ నేరగాళ్లకు కరెంట్ బ్యాంక్ ఖాతాలను కొనుగోలు చేసి సరఫరా చేసినట్లు తేలింది. ఈ మ్యూల్ ఖాతాల నిర్వహణను సులభతరం చేసినందుకు వారు సుమారు రూ.4 లక్షలు కమీషన్ పొంది.. దానిని ఇద్దరూ పంచుకున్నారు.
బాధితుడి నుంచి దోచుకున్న సొమ్ములో రూ.1.80 కోట్లు నేరుగా నిందితుడు మందవల్లి శివ నాగరాజు బ్యాంక్ ఖాతాలోకి చేరాయి. ఈ ఖాతాను సహ-నిందితుడైన దోసపాటి కృష్ణసాయి సైబర్ నేరగాళ్లకు ఏర్పాటుచేసి ఇచ్చాడు. సదరు బ్యాంక్ ఖాతాను మరింత లోతుగా పరిశీలించగా వాటిలో రూ.2.49 కోట్లకు పైగా అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు వెల్లడైంది. ఈ ఖాతాకు మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో నమోదైన పలు సైబర్ నేరాల ఫిర్యాదులతో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను పట్టుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రజలకు సైబర్ బ్యూరో సూచనలు
==> ఎవరైనా తెలిసిన వ్యక్తి పేరు లేదా ఫొటో వాట్సాప్ ప్రొఫైల్లో ఉన్నంత మాత్రాన దానిని బ్లైండ్గా నమ్మకండి. వీటిని సైబర్ నేరగాళ్లు సులభంగా కాపీ చేసి దుర్వినియోగం చేసే అవకాశం ఉంది.
మీకు తెలిసిన కాంటాక్ట్ నుంచి అకస్మాత్తుగా అత్యవసరంగా లేదా రహస్యంగా డబ్బులు పంపించాలని.. ముఖ్యంగా కొత్త బ్యాంక్ ఖాతాలకు పంపాలని కోరితే అప్రమత్తంగా ఉండండి.
ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు కేవలం వాట్సాప్ సందేశాలపై మాత్రమే ఆధారపడకండి.
ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే, ఆలస్యం చేయకుండా వెంటనే #1930 నంబర్కు కాల్ చేయండి లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
రూ.10 నాణేలతో బైక్ కొన్న కస్టమర్.. లెక్కపెట్టలేక తలలు పట్టుకున్న సిబ్బంది!
Nalgonda, Telangana:Nalgonda Viral News: సమాజంలో ఇప్పటికీ రూ.10 నాణేల చెల్లబాటుపై అక్కడక్కడా అపోహాలు నడుస్తూనే ఉన్నాయి. చాలా చోట్ల కిరాణా దుకాణ యజమానులతో పాటు వ్యాపారాలు చేసేవారు కూడా పది రూపాయల కాయిన్స్ తీసుకోవడానికి నిరాకరిస్తూ ఉంటారు. అయితే, ఆ అపోహలను తొలగిస్తూ.. రూ.10 నాణేలు భారత అధికారిక కరెన్సీయేనని నిరూపించాడు నల్లగొండ జిల్లాకు చెందిన ఒక సాధారణ వ్యక్తి.. ఏకంగా రూ.1.10 లక్షల విలువైన బైక్ను కేవలం పది రూపాయల నాణేల రూపంలోనే బిల్ కట్టేసి.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు..
అసలేం జరిగిందంటే..?
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన కొండే రఘుపతి అనే వ్యక్తి కొంతకాలంగా బైక్ కొనుగోలు చేయాలని అనుకున్నాడు.. అయితే, ఇందుకోసం ఆయన వినూత్నంగా ఆలోచించి.. రూ.10 నాణేలను భారీగా సేకరించాడట. చిట్యాల పట్టణంలోని ప్రముఖ మోటర్ సైకిల్ షోరూమ్కు వెళ్లాడు. అక్కడ తనకు నచ్చిన.. సుమారు రూ.1.10 లక్షల విలువైన హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ను కొనుగోలు చేశాడు..
నాణేల మూటలతో షోరూమ్కు..
ఇక అసలు కథ ఇక్కడే మొదలైంది. బైక్ కొనుగోలుకు సంబంధించిన నగదు చెల్లించే సమయం వచ్చేసరికి.. రఘుపతి తన వెంట తెచ్చుకున్న సంచులను ఓపెన్ చేశాడు. అందులో నోట్లకు బదులుగా గుట్టలు గుట్టలుగా రూ.10 నాణేలు దర్శనమిచ్చాయి. ఏకంగా 11,000 పది రూపాయల నాణేలను షోరూమ్ కౌంటర్పై కుమ్మరించాడు. అది చూసి షోరూమ్ సిబ్బందితో పాటు అక్కడున్న మిగతా కస్టమర్లు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు.
లెక్కపెట్టడానికి గంటల సమయం..
ఆ భారీ నాణేల గుట్టను చూసి షోరూమ్ సిబ్బంది తలలు పట్టుకున్నారు.. అయినా కస్టమర్ తెచ్చిన డబ్బును కాదనలేక.. వాటిని లెక్కించడం మొదలు పెట్టారు. వేల సంఖ్యలో ఉన్న ఆ నాణేలను ఒక్కొక్కటిగా లెక్కించడానికి సిబ్బందికి చాలా సమయం పట్టింది. ఒకరి తర్వాత ఒకరు చేతులు మారుస్తూ.. కౌంటింగ్ పూర్తి చేసేసరికి షోరూమ్ సిబ్బందికి చెమటలు పట్టాయి.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
ఈ వింత సంఘటనపై ఆ మోటార్స్ షోరూమ్ నిర్వాహకుడు సానుకూలంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. కస్టమర్ రఘుపతి ఏకంగా 11 వేల నాణేలను తెచ్చి బైక్ కొంటానన్నప్పుడు మొదట కాస్త ఆశ్చర్యమేసిందని.. వాటిని లెక్కించడానికి మా సిబ్బందికి చాలా సమయం పట్టిన మాట నిజమేనని.. కానీ, రూ.10 నాణేలు అనేవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్వారా గుర్తింపు పొంది.. చెల్లుబాటులో ఉన్న భారత అధికారిక కరెన్సీనని.. చట్టబద్ధమైన కరెన్సీని తిరస్కరించే హక్కు ఎవరికీ లేదని.. అందుకే మేము ఆ నాణేలను సంతోషంగా స్వీకరించి.. ఆయనకు బైక్ డెలివరీ చేశామని తెలిపారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Siddipet: రాజీ మార్గమే రాజమార్గం.. చెక్ బౌన్స్ కేసులున్నవారికి బంపర్ ఛాన్స్..
Siddipet, Telangana:Siddipet Special Lok Adalat: సుదీర్ఘకాలంగా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను పరస్పర రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడం వల్ల అటు సమయం.. ఇటు డబ్బు రెండూ ఆదా అవుతాయని సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ స్పష్టం చేశారు. సిద్దిపేట కోర్టు కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 18వ తేదీన జిల్లాలో చెక్ బౌన్స్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
519 చెక్ బౌన్స్ కేసుల..
ఈ సందర్భంగా.. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మొత్తం 1324 చెక్ బౌన్స్ కేసులు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు.. ఇందులో ప్రాథమికంగా రెండు వర్గాల మధ్య పరస్పర అవగాహనతో క్లియర్ చేసుకునే.. 519 కేసులను ప్రత్యేకంగా గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. వీరందరికీ ఇప్పటికే కోర్టు ద్వారా ముందస్తు నోటీసులు జారీ చేశామని.. లోక్ అదాలత్కు హాజరై తమ వివాదాలను సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకోవాలని సూచించారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు..
ముఖ్యంగా ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు, చిట్ ఫండ్ కంపెనీలకు సంబంధించిన చెక్ బౌన్స్ సమస్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఆర్థికపరమైన వివాదాలకు త్వరితగతిన ముగింపు పలికేందుకు గౌరవ సుప్రీంకోర్టు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల అనుగుణంగానే.. ఈ నెల 18న ఈ స్పెషల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
కోర్టుల చుట్టూ.. ఏళ్ల తరబడి తిరిగి మానసిక ప్రశాంతతను కోల్పోవడం కంటే.. లోక్ అదాలత్ వేదికగా ఇరుపక్షాలు ఒక అంగీకారానికి రావడం ఎంతో ఉత్తమయని.. లోక్ అదాలత్లో పరిష్కారమైన కేసులకు సంబంధించి ఎలాంటి అప్పీళ్లకు అవకాశం ఉండదు కాబట్టి.. వివాదాలు శాశ్వతంగా తొలగిపోతాయని న్యాయమూర్తి సుదర్శన్ ఈ సందర్భంగా వివరించారు. ఈ సమావేశంలో న్యాయమూర్తి సంతోష్ కుమార్తో పాటు పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. వ్యాపారస్తులు, ఫైనాన్స్ నిర్వాహకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ కేసులను క్లియర్ చేసుకోవాలని కోరారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
అమ్మ ప్రేమకు హద్దుల్లేవు.. అనాథలైన పసి ప్రాణాలకు తల్లిగా మారిన పంది!
Nuzendla, Andhra Pradesh:Kurnool Pig Viral Pic: అమ్మ ప్రేమకు ఎలాంటి హద్దులు, సరిహద్దులు లేవని నిరూపించే ఒక అద్భుతమైన సంఘటన ఆంధ్రప్రదేశ్లో వెలుగుచూసింది. కర్నూలు జిల్లా కోసిగి మండలానికి సమీపంలో ఉన్న జాంబాపురం గ్రామంలో ఒక హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఒక ఆడకుక్క కొన్ని రోజుల క్రితం నాలుగు అందమైన పిల్లలకు జన్మనిచ్చింది. అయితే, దురదృష్టవశాత్తూ రెండు రోజుల క్రితం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆ తల్లి కుక్క చనిపోయింది.. దీనితో పుట్టి కొన్ని రోజులు కూడా కాకముందే ఆ చిన్నారి కుక్క పిల్లలు తల్లిలేని అనాథలుగా మారిపోయాయి.
ఆకలి కేకలతో పిల్లలు..
కళ్లు కూడా సరిగ్గా.. తెరవని ఆ నాలుగు కుక్క పిల్లలకు తమ తల్లి చనిపోయిందనే విషయం కూడా తెలియదు.. ఆకలితో అవి అలమటించిపోయాయి. ఆహారం కోసం, తల్లి పాలు దొరకక అల్లాడిపోతూ.. గట్టిగా అరుస్తూ ఏడవడం మొదలుపెట్టాయి. ఆ పసి ప్రాణాల ఆకలి కేకలు, దీనమైన అరుపులు చూసి స్థానికులు ఎంతో బాధపడ్డారు. కానీ వాటి ఆకలిని ఎలా తీర్చాలో.. పాలు ఎలా పట్టాలో తెలియదు.. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఒక అపురూపమైన ఘటన చోటు చేసుకుంది.
ఆ వీధిలోనే తిరిగే ఒక ఆడపంది.. ఆకలితో ఏడుస్తున్న కుక్క పిల్లల దీనమైన అరుపులను వినింది... ఆ పంది కుక్క పిల్లలు ఉన్న చోటుకు వెళ్లింది. ఆకలితో అలమటిస్తున్న ఆ పసి ప్రాణాలను చూసి దానిలోని మాతృ హృదయం ఉప్పొంగింది.. ఏమాత్రం సంకోచించకుండా.. ఆ కుక్క పిల్లల చెంతకు చేరి వాటి పక్కనే ప్రేమగా పడుకుంది. సాధారణంగా పందులు ఇతర జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్థించడం మనం చూస్తూ ఉంటాము.. కానీ ఈ పంది మాత్రం ఆ పిల్లలకు తల్లిలా మారిపోయింది.
పాలు తాగిన కుక్క పిల్లలు..
ఆకలితో అలమటించిన ఆ చిన్నారి కుక్క పిల్లలు కూడా తమ ఎదుట ఉన్నది వేరే జాతి జంతువు అనే భయం లేకుండా.. వెంటనే ఆ పంది దగ్గరకు చేరి ఎంతో ఆత్రుతగా పాలు తాగడం మొదలు పెట్టాయి.. ఆ పంది కూడా ఎంతో ఓపికగా.. కదలకుండా నిలబడి ఆ పిల్లల ఆకలి తీరేంత వరకు పాలు ఇచ్చింది.. ఆ పసి పిల్లలు కడుపు నిండా పాలు తాగిన తర్వాతే.. అక్కడే ప్రశాంతంగా పడుకున్నాయి.. అప్పటి నుంచి ఆ పంది ప్రతిరోజూ క్రమం తప్పకుండా వచ్చి.. ఆ అనాథ కుక్క పిల్లల ఆకలి తీరుస్తూ.. కంటికి రెప్పలా కాపాడుతోందని స్థానికులు చెబుతున్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Love గుడ్డిదంటే ఇదేనా? ప్రియుడి కోసం 88 తులాల బంగారం దోచేసిన యువతి!
Hyderabad, Telangana:Chennai Love Cheating Case: అందరూ ప్రేమ గుడ్డిదని చెప్పుకుంటూ ఉంటారు.. కానీ ఆ గుడ్డి ప్రేమ ఒక్కోసారి కన్నవారిని.. నమ్ముకున్న కుటుంబాన్ని రోడ్డున పడేస్తూ ఉంటుంది.. తాజాగా తమిళనాడులోని చెన్నైలో ఇటువంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. ప్రేమించిన ప్రియుడి కోసం ఓ యువతి తన సొంతింటిలో భారీ చోరీకి పాల్పడింది. ఏకంగా 88.4 తులాల బంగారు ఆభరణాలను కొద్దికొద్దిగా దొంగిలించి ప్రియుడి చేతిలో పెట్టింది.. ఆ నమ్మకద్రోహి ఆ నగలని అమ్మి.. స్నేహితులతో కలిసి విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. చివరకు పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడటంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు..
అసలు ఏం జరిగిందంటే?
చెన్నైలోని మధురవాయల్ ప్రాంతానికి చెందిన పన్నీర్సెల్వం (51) తన అన్న మరణించడంతో.. ఆయన భార్యతో పాటు ముగ్గురు కుమార్తెల బాధ్యతలను చూసుకుంటున్నాడు. కొన్ని నెలల క్రితం పన్నీర్సెల్వం తనకు సంబంధించిన బంగారు నగలను తన వదినకు ఇచ్చి.. బీరువాలో భద్రపరచమని చెప్పాడు.. కాగా.. కొన్ని రోజుల క్రితం ఇంట్లోని బీరువాను తెరిచి చూడగా పన్నీర్సెల్వం ఇచ్చిన బంగారు నగలతో పాటు వారి సొంత బంగారం మొత్తం 88 తులాలకు పైగా బంగారం మాయమైనట్లు గుర్తించి షాక్కు గురయ్యారు. ఇంట్లో ఎలాంటి తాళాలు పగలగొట్టకపోవడంతో విస్తుపోయిన కుటుంబ సభ్యులు వెంటనే మధురవాయల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అబద్ధాలతో దోపిడీ..
రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. బీరువా తలుపులు పగలగొట్టకపోవడంతో.. ఇది కచ్చితంగా ఇంట్లోని వారి పనే అని పోలీసులు అనుమానించారు. ఈ క్రమంలో పన్నీర్సెల్వం అన్న మూడో కుమార్తె అయిన 18 ఏళ్ల యువతి ప్రవర్తనపై పోలీసులకు సందేహం వచ్చి.. ఆమెను గట్టిగా విచారించడంతో అసలు నిజం ఏంటో బయటపడింది.
గతేడాది ఇంటర్మీడియట్ సెలవుల్లో ఆ యువతి ఒక చోట పార్ట్-టైమ్ ఉద్యోగం చేసేందుకు వెళ్లింది.. అక్కడ షెనాయ్ నగర్కు చెందిన కార్తీక్ (21) అనే యువకుడితో పరిచయం ఏర్పడి.. అది కాస్తా ప్రేమగా మారుతూ వచ్చింది. యువతి అమాయకత్వాన్ని కార్తీక్ ఆసరాగా చేసుకున్నాడు. మా నాన్నకు ఆరోగ్యం బాగోలేదని.. ఆసుపత్రి ఖర్చుల కోసం అత్యవసరంగా డబ్బు కావాలని అంటూ నమ్మబలికాడు..
కొద్దికొద్దిగా నగలు మాయం..
ప్రియుడి మాటలను గుడ్డిగా నమ్మిన ఆ యువతి.. ఇంట్లో ఎవరికీ తెలియకుండా బీరువాలో ఉన్న బంగారు నగలను కొద్దికొద్దిగా దొంగిలించి.. కార్తీక్కు ఇవ్వడం ప్రారంభించింది.. కార్తీక్ ఆశ అక్కడితో ఆగలేదు.. ఆ తర్వాత కూడా వరుసగా డబ్బు.. నగలు కావాలని అడగడంతో, ఇంట్లో ఉన్న మొత్తం 88 తులాల బంగారాన్ని యువతి అతడికి అప్పగించింది. ఆ నగలను తీసుకున్న కార్తీక్.. తన స్నేహితులతో కలిసి వాటిని తాకట్టు పెట్టి.. ఆ డబ్బుతో కొత్త కారు.. ఖరీదైన మోటార్ సైకిళ్లు, అత్యంత విలాసవంతమైన స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసి స్నేహితులతో కలిసి జల్సాలు చేశాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
IOCL Recruitment: అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇండియన్ ఆయిల్లో 1,626 ఖాళీలు, అర్హతలివే!
Hyderabad, Telangana:IOCL Recruitment 2026: ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) అద్భుతమైన శుభవార్తను అందించింది. సంస్థలో ఖాళీగా ఉన్న 1,626 అప్రెంటిస్ (Apprentice) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అప్రెంటిస్ కాలం ఒక సంవత్సరం పాటు ఉంటుందని అధికారక నోటిఫికేషన్లో వెల్లడించింది.. అయితే, దీనికి సంబంధించిన అర్హత వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
విద్యార్హతలు ఇవే..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ విద్యార్హతలను బట్టి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారక నోటిఫికేషన్ సంస్థ క్లియర్గా పేర్కొంది.. ఇంటర్మీడియట్తో పాటు ఐటీఐ (ITI), ఏదైనా డిప్లొమా కోర్సు, బి.ఎస్సీ (B.Sc), బి.ఏ (B.A), లేదా బి.కామ్ (B.Com) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని నోటిఫికేషన్లో వెల్లడింది..
వయోపరిమితి సడలింపులు..
అభ్యర్థుల వయస్సు 30 జూన్ 2026 నుంచి కౌంట్ అవుతుందని అధికారక నోటిఫికేషన్లో వెల్లడించారు. దీని ప్రకారం.. అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలతో పాటు గరిష్ట వయస్సు 24 సంవత్సరాల లోపు ఉండాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. కాబట్టి వయోపరిమితి కలిగిన వారు సింపుల్గా వీటికి అప్లై చేసుకోవచ్చు.
శిక్షణతో పాటు స్టైపెండ్..
వీటినికి ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు ఐఓసిఎల్ (IOCL) సంస్థలో ప్రత్యేక అప్రెంటిస్ శిక్షణను కూడా కంపెనీ అందిస్తోంది.. ఈ శిక్షణ కాలంలో అప్రెంటిస్ చట్ట నిబంధనల ప్రకారం.. అభ్యర్థులకు ప్రతి నెలా కొంత మొత్తంలో స్టైపెండ్ చెల్లిస్తమని సంస్థ అధికారిక నోటిఫికేషన్లో వెల్లడించింది.. ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ కొట్టాలనుకునేవారికి ఇది ఒక మంచి అవకాశంగా భావించవచ్చు.
ఎంపిక విధానం..
ఈ ఉద్యోగాలకు ఎటువంటి కఠినమైన పరీక్షలు ఉండవని సంస్థ అధికారికంగా వెల్లడించింది.. అభ్యర్థులు సాధించిన అకడమిక్ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ (Merit List) తయారు చేస్తారని తెలిపింది.. మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ (Document Verification) నిర్వహించి.. లిస్ట్ విడుదల చేస్తమని సంస్థ తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ?
ఆసక్తితో పాటు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ (Online) విధానం ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సంస్థ అధికారక నోటిఫికేషన్లో వెల్లడించింది.. అభ్యర్థులు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారిక వెబ్సైట్ (IOCL Official Website) సందర్శించి.. నోటిఫికేషన్లోని పూర్తి వివరాలను చదువుకుని.. ఆన్లైన్ అప్లికేషన్ ఫారమ్ను ఫిల్ చేయాల్సి ఉంటుందని తెలిపింది.. అంతేకాకుండా ఈ ఉద్యోగాలకు 28 జూలై 2026లోపే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
ఇరాన్తో కాల్పుల విరమణ ముగిసింది.. మధ్యప్రాచ్యంలో మరో యుద్ధానికి ట్రంప్ సంచలన సంకేతాలు?!
Hyderabad, Telangana:US Iran Tensions: అమెరికా మరోసారి యుద్ధంలోకి దిగనుందా?. కాల్పుల విరమణ ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారితో మేము ఎలాంటి చర్చలు జరపాలని కోరుకోవడం లేదని, ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న తరుణంలో అమెరికా పెద్దన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటో శిఖరాగ్ర సమావేశంలో ఆయన నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇరాన్తో కాల్పుల విరమణ ముగిసిందా అని ఒక విలేఖరి ప్రశ్నించగా, అది ముగిసిపోయిందని ఆయన సమాధానమిచ్చారు. ఇరానీయులతో వ్యవహరించడం లేదని, వారు నీచమైన, రోగుల మనస్తత్వం కలిగిన హింసాత్మక వ్యక్తులని ఆయన విమర్శించారు. వైమానిక దాడులు చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ఈరోజు ఉదయం భారత కాలమానం ప్రకారం తెలిపింది. వాణిజ్య నౌకలపై జరిగిన దాడికి ప్రతిస్పందనగానే ఈ దాడులు ప్రారంభించామని, దురాక్రమణ ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు కూడా సంభవించినట్లు సమాచారం.
రెండు నౌకలపై ఇరాన్ దాడి...
హార్మూజ్ జలసంధిలో వెళ్తున్న రెండు వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేసిన సంగతి తెలిసిందే. యెమెన్ సమీపంలో కార్గోతో వెళ్తున్న నౌకకు భారీ నష్టం వాటిల్లింది. అమెరికా మద్దతు ఉన్న హార్మూజ్ దక్షిణ కారిడార్లో వెళ్తుండటంతో మిస్సైల్ అటాక్ జరిగిందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. తాము ఆమోదించిన మార్గాన్ని పాటించని ఏ నౌక అయినా ప్రతిస్పందనను ఎదుర్కోవాల్సిందేనని ఐఆర్జీసీ ఇప్పటికే హెచ్చరించింది. ఈ నౌకలపై దాడుల నేపథ్యంలో అమెరికా ప్రతీకార చర్యలకు దిగుతోంది.
మరోవైపు, యుఎస్ దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా రంగంలోకి దిగింది. బహ్రెయిన్లోని అమెరికాకు చెందిన షేక్ ఈసా బేస్ పై డ్రోన్ అటాక్ చేసినట్లు ప్రకటించింది. అంతేకాకుండా కువైట్లోని మిలిటరీ స్థావరాలను కూడా టార్గెట్ చేశామని హెచ్చరించింది. హార్మూజ్ జలసంధిని మూసివేయాలని కూడా ఐఆర్జీసీ నేవీని ఆదేశించినట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, రెండు దేశాల మధ్య భీకర యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదు.
BREAKING:
🇺🇸🇮🇷 U.S President Trump announced that the CEASEFIRE WITH IRAN IS OVER.
"To me, I think it's over. I don't want to deal with them...They’re scum. They’re sick people.” pic.twitter.com/qvDXZY60fc
— Commentary Donald J. Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) July 8, 2026
లైసెన్సు రద్దు చేసిన యూఎస్...
హార్మూజ్ జలసంధిలో నౌకలపై దాడులు జరుగుతున్నందున, ఇరాన్ ఆయిల్ పై అమెరికా మరికొన్ని ఆంక్షలు విధించింది. చమురు విక్రయాల కోసం గతంలో ఇచ్చిన 60 రోజుల తాత్కాలిక మినహాయింపులను ఉపసంహరించుకుంది. ఆగస్టు 21 వరకు ఇచ్చిన లైసెన్స్ను అమెరికా రద్దు చేసింది. జలసంధిలో ఇరాన్ చర్యలు ఆమోదయోగ్యం కాదని, వీటికి తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు.
ఈ నెల మొదటి వారంలోనే ఇరాన్ యుద్ధం ముగిసిందని, అన్ని షరతులకు అంగీకరించిందని ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సైనికంగా ఓడిపోయిందని, వారి వద్ద కొద్దిపాటి శక్తే మిగిలిందని, దానిని కూడా తుడిచిపెట్టగలమని ప్రకటించారు. దోహాలో అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన పరోక్ష చర్చలు ముగిసిన వేళ ట్రంప్ ఇలా వ్యాఖ్యానించారు. అయితే ఈ చర్చల్లో శాశ్వత శాంతి కనిపించలేదు. ఈ నెల ప్రారంభంలో పాకిస్థాన్, ఖతార్ మధ్యవర్తిత్వంతో జరిగిన అమెరికా-ఇరాన్ చర్చలు సానుకూలంగా ముగిశాయని ఇరాన్ ప్రకటించింది. జప్తు చేసిన ఆస్తులలో కొంత విడుదలకు అంగీకరించిందని కూడా తెలిపింది. వివాదాన్ని పరిష్కరించడానికి ఒక వేదికను ఏర్పాటు చేయాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు తెలిసింది. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో అనుకోకుండా మళ్లీ యుద్ధం మొదలైంది.
ఖమేనీ అంత్యక్రియల వేళ...
మరోవైపు, జూలై 9వ తేదీన ఖమేని అంత్యక్రియలు జరగనున్నాయి. ఇరాన్ మాజీ సుప్రీమ్ లీడర్ భౌతిక కాయాన్ని ఇరాన్కు తరలిస్తున్నారు. ఈరోజు కర్బలాలో ఏర్పాట్లు చేసి, రేపు మషహాద్లో కమేని అంత్యక్రియలు నిర్వహిస్తారు. దీనిలో ఇరాక్ ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోంది. కమేని అంత్యక్రియల కోసం వేలాది మంది జనం రోడ్లపైకి రావడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశ్చర్యపోయారు.
Also Read: అలీ ఖమేనీ పార్థివ దేహాన్ని ఇరాక్ ఎందుకు తీసుకెళ్తున్నారు? అంత్యక్రియలకు భారత్ నుంచి వెళ్లేది ఎవరంటే?
Also Read: మళ్లీ మొదలైన మహా యుద్ధం.. ఇరాన్పై అమెరికా డైరెక్ట్ అటాక్కు కారణమిదేనంటా! భారత్కు చమురు సెగ తప్పదా?
80 లక్ష్యాలను ఛేదించిన యూఎస్...
జలసంధిలో ఇరాన్ దాడికి ప్రతీకారంగా అమెరికా సైన్యం కొత్త దాడులకు దిగింది. కచ్చితంగా 80కి పైగా లక్ష్యాలను ఛేదించామని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ముఖ్యంగా కమాండ్ నెట్వర్క్లు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, నౌక విధ్వంస క్షిపణి సామర్థ్యాలు, హార్మూజ్ జలసంధి సమీపంలోని 60కి పైగా పడవలను లక్ష్యంగా చేసుకున్నామని సెంట్రల్ కమాండ్ పేర్కొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
జూలై 15న iQOO Z11 గ్రాండ్ లాంచ్.. 9,020 mAh భారీ బ్యాటరీతో అరాచకం!
Hyderabad, Telangana:Iqoo Z11 Launching In India: ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఐకూ (iQOO) భారతీయ మొబైల్ ప్రియులకు మరో అదిరిపోయే వార్త అందించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్న తన సరికొత్త స్మార్ట్ఫోన్ iQOO Z11ను త్వరలోనే భారతదేశంలో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.. ఇటీవలే అందిన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ వచ్చే జూలై 15వ తేదీ నాటికి భారత మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉందని టెక్ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించని ఫీచర్స్తో పాటు స్పెషిఫికేషన్స్ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ట్రెండింగ్లో iQOO Z11..
ఇటీవలే iQOO ఇండియా CEO నిపుణ్ మౌర్య సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. తమ పాపులర్ Z సిరీస్లో ఒక పవర్ఫుల్ స్మార్ట్ఫోన్ను భారత్కు తీసుకువస్తున్నట్లు ఆయన హింట్ ఇచ్చారు. అధికారికంగా మోడల్ పేరును ప్రకటించనప్పటికీ.. ఇది ఖచ్చితంగా iQOO Z11 మోడలేనని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మోడల్తో పోలిస్తే.. భారత్లో విడుదల కాబోయే వేరియంట్ కొన్ని ప్రత్యేకమైన మార్పులతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది కొన్ని స్పెషల్ ప్రీమియం ఫీచర్స్ను కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది..
స్నాప్డ్రాగన్ 7s Gen 4 చిప్సెట్..
ప్రముఖ బెంచ్మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్బెంచ్ (Geekbench AI)పై ఈ స్మార్ట్ఫోన్ ప్రొటోటైప్ ఇటీవల లిస్ట్ అయిన్నట్లు తెలుస్తోంది. చైనాలో విడుదలైన ఈ సిరీస్ మోడల్లో మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది. మలేషియాతో పాటు ఇతర అంతర్జాతీయ వేరియంట్లలో శక్తివంతమైన స్నాప్డ్రాగన్ 7s Gen 4 (Snapdragon 7s Gen 4) చిప్సెట్ను అందించిన్నట్లు కంపెనీ గతంలోనే వెల్లడించింది.. భారతదేశంలో కూడా ఇదే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో ఈ ఫోన్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.. అంతేకాకుండా, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్పై ఈ ఫోన్ రన్ అవుతుందని సమాచారం.. ఇది ఇటీవల మార్కెట్లోకి వచ్చిన వివో S60e (Vivo S60e)కి రీబ్రాండెడ్ వెర్షన్గా భారత్లో పరిచయమయ్యే అవకాశం ఉందని లీకులు చెబుతున్నాయి.
భారీ డిస్ప్లే, అద్భుతమైన బ్యాటరీ లైఫ్..
లీకైన వివరాల ప్రకారం.. iQOO Z11 స్మార్ట్ఫోన్ అద్భుతమైన ఫీచర్స్తో పాటు భారీ బ్యాటరీ సెటప్ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఎంతో శక్తివంతమైన 6.83 ఇంచుల భారీ అమోలెడ్ (AMOLED) డిస్ప్లేను కలిగి ఉంటుంది. లాంగ్ లాస్టింగ్ పెర్ఫార్మెన్స్ కోసం ఇందులో ఏకంగా మోస్ట్ పవర్ఫుల్ 9,020 mAh భారీ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
మార్చి నెలలో లాంచ్ అయిన మోడల్ iQOO Z11x 5G ఇప్పటికే.. 120Hz రిఫ్రెష్ రేట్తో పాట 50MP కెమెరా, 7,200 mAh బ్యాటరీతో అదరగొట్టగా.. రాబోయే సరికొత్త Z11 మోడల్ అంతకు మించిన అప్గ్రేడెడ్ ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకోనుంది. ఒకవేళ మీరు సరికొత్త టెక్నాలజీతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, గేమింగ్కు అనుకూలమైన ప్రాసెసర్ కలిగిన ఫోన్ కోసం చూస్తుంటే.. మరికొద్ది రోజులు ఓపిక పడితే చాలు.. iQOO Z11 స్మార్ట్ఫోన్ ఒక బెస్ట్ ఆప్షన్ అందుబాటులోకి రాబోతోంది. దీని ధరతో పాటు సేల్ వివరాలు లాంచ్ రోజున అధికారికంగా వెల్లడి కానున్నాయి.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Varanasi Teaser: మహేష్ బాబు ఫ్యాన్స్కు సూపర్ గుడ్న్యూస్..'వారణాసి' సినిమా టీజర్ వచ్చేది ఎప్పుడంటే?
Hyderabad, Telangana:Varanasi Mahesh Babu Birthday Teaser: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి గ్లోబల్ హిట్స్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో, ప్రపంచవ్యాప్తంగా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో విజువల్ వండర్గా రూపొందుతున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, 'సంచారి' సాంగ్, ‘రణకుంభ’ థీమ్ సాంగ్స్ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఆగస్టు 9న సూపర్స్టార్ మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఈ మూవీ నుండి ఒక పవర్ఫుల్ టీజర్ లేదా అఫీషియల్ పోస్టర్ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
శ్రీరాముడి లుక్లో మహేశ్ బాబు?
గతంలో 'ఆర్ఆర్ఆర్' సినిమా సమయంలో చరణ్, ఎన్టీఆర్ పుట్టినరోజులకు ప్రత్యేక పోస్టర్లను విడుదల చేసిన సెంటిమెంట్ను రాజమౌళి ఇక్కడ కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో మహేశ్ బాబు 'శ్రీరాముడి' లుక్లో ఉన్న ఫొటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. గతంలో ఒక ఈవెంట్లో రాజమౌళి సైతం తాను శ్రీరాముడి గెటప్ పోస్టర్ను పరిశీలనలో ఉంచానని హింట్ ఇచ్చారు. దీంతో మహేశ్ బర్త్డే నాడు ఈ లుక్ను అధికారికంగా లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు గట్టిగా వినిపిస్తోంది.
భారీ తారాగణం.. విడుదల ఎప్పుడంటే?
ఈ విజువల్ అడ్వెంచర్లో మహేశ్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. అలాగే మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో 'కుంభ' అనే పవర్ఫుల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కె.ఎల్.నారాయణ అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం, వచ్చే ఏడాది ఏప్రిల్ 7న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. మహేశ్ బర్త్డే నాడు రాబోయే అప్డేట్తో ఈ సినిమా ప్రమోషన్స్ మరింత ఊపందుకోనున్నాయి.
Also REad: "అతడు సైకో..సిగరెట్లతో కాల్చి, ఎలా పడితే అలా కొట్టాడు" టాలీవుడ్ హీరోయిన్ కంటతడి!
Also Read; ఒక్క వెబ్సిరీస్తో లెవల్ మారిపోయింది..రాత్రికి రాత్రే స్టార్గా మారిన మలయాళ బ్యూటీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Flipkart సేల్లో రూ.10,449కే వివో 5G ఫోన్.. ఈ ఛాన్స్ అస్సలు వదలకండి!
Hyderabad, Telangana:Flipkart GOAT Sale: బడ్జెట్ ధరలో అదిరిపోయే 5G స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకు ఇది అద్భుతమైన శుభవార్తగా భావించవచ్చు. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో సరికొత్త ఆఫర్ల ఫెస్టివల్ ప్రారంభమైంది.. జూలై 4వ తేదీన గ్రాండ్గా ప్రారంభమైన Flipkart GOAT సేల్లో భాగంగా.. ప్రముఖ బ్రాండ్కి సంబంధించిన వివో 5G మొబైల్పై దిమ్మతిరిగే ఆఫర్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా ప్రీమియం లుక్, అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లో అందుబాటులో ఉన్న vivo T3 Lite 5G (6 GB ర్యామ్తో పాటు 128 GB స్టోరేజ్) వేరియంట్ మొబైల్ ఇప్పుడు అత్యంత చీప్ ధరకే అందుబాటులో ఉండడం విశేషం. అయితే, దీనిపై లభిస్తున్న ఆఫర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
రూ.4,000 ఫ్లాట్ డిస్కౌంట్..
మార్కెట్లో సాధారణంగా vivo T3 Lite 5G వేరియంట్ అసలు ధర (MRP) రూ.15,499లోపే లభిస్తోంది. అయితే, ప్రస్తుత ఫ్లిప్కార్ట్ GOAT సేల్ ప్రత్యేక తగ్గింపులో భాగంగా ఈ ఫోన్పై ఏకంగా రూ.4,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.. ఈ బంపర్ ఆఫర్ వల్ల ఎటువంటి అదనపు నిబంధనలు లేకుండానే ఈ ప్రీమియం స్మార్ట్ఫోన్ నేరుగా రూ.11,499 లోపే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఇవే కాకుండా ఈ స్మార్ట్ఫోన్ మరింత చీప్ ధరకే సొంతం చేసుకోవచ్చు. దీని కోసం తప్పకుండా కొన్ని రకాల ఆఫర్స్ వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే భారీ తగ్గింపు అందుబాటులో ఉంటుంది.
బ్యాంక్ ఆఫర్లతో మరింత చౌకగా..
ఫ్లాట్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా.. వినియోగదారులు మరింత ఆకట్టుకునేందుకు ఫ్లిప్కార్ట్ అద్భుతమైన బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తూ వస్తోంది. ఈ సేల్లో భాగంగా మీరు ఫ్లిప్కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ (Axis Bank)తో పాటు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్లను వినియోగించి పేమెంట్ చేస్తే.. మీకు అదనంగా మరో రూ.1,050 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ భారీ డిస్కౌంట్తో పాటు బ్యాంక్ ఆఫర్ రెండింటినీ కలిపి ఉపయోగిస్తే.. అసలు రూ.15,499 ధర కలిగిన ఈ వివో 5G స్మార్ట్ఫోన్ను మీరు కేవలం రూ.10,449 లోపే సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
vivo T3 Lite 5G ప్రత్యేకత ఇదే..
vivo T3 Lite 5G స్మార్ట్ఫోన్ అద్భుతమైన ఫీచర్స్తో అందుబాటులో ఉంది. ఇది ఆకర్షణీయమైన డిజైన్తో అందుబాటులో ఉండడం విశేషం. అంతేకాకుండా ఎంతో ఆకట్టుకునే Vibrant Green కలర్ వేరియంట్లో ఎంతో క్లాసీగా, ప్రీమియం లుక్తో కనిపిస్తుంది. ఇది సూపర్ ఫాస్ట్ 5G సపోర్ట్తో అందుబాటులోకి రావడం విశేషం.. తక్కువ బడ్జెట్లోనే హై-స్పీడ్ 5G కనెక్టివిటీని అందిస్తుంది. కాబట్టి ఈ స్మార్ట్ఫోన్పై Flipkart GOAT సేల్లో ఉన్న ఆఫర్ను అస్సలు మిస్ చేసుకోకండి.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Flipkart బంపర్ ఆఫర్.. రూ.45 వేల వివో 5G స్మార్ట్ఫోన్ ఇప్పుడు కేవలం రూ.11,699కే!
Hyderabad, Telangana:Flipkart GOAT Sale: మీరు సరికొత్త ఫీచర్లతో కూడిన బెస్ట్ 5G స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, మీకు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ నిర్వహిస్తోన్న Flipkart GOAT సేల్లో భాగంగా vivo Y11 5G స్మార్ట్ఫోన్పై కళ్లు చెదిరే ఆఫర్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రీమియం లుక్తో పాటు అదిరిపోయే ఫీచర్లతో లభిస్తున్న ఈ మొబైల్ను ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ డిస్కౌంట్తో సొంతం చేసుకునే సువర్ణావకాశం ఫ్లిప్కార్ట్ అందిస్తోంది.. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి చాలా చీప్ ధరకే లభిస్తోంది. అయితే, దీనిపై లభిస్తున్న ఆఫర్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఊహించని ఫ్లాట్ డిస్కౌంట్..
మార్కెట్లో వివో Y11 5Gకి సంబంధించిన 128 GB ఇంటర్నల్ స్టోరేజ్తో పాటు 4 GB ర్యామ్తో కూడిన వేరియంట్ అసలు ధర (MRP) రూ. 44,999తో అందుబాటులో ఉండగా.. అయితే, జూలై 4వ తేదీన ప్రారంభమైన ఫ్లిప్కార్ట్ గోట్ సేల్లో భాగంగా ఈ ఫోన్పై ఏకంగా రూ.26,000 వరకు ఫ్లాట్ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ భారీ డిస్కౌంట్ తర్వాత కస్టమర్లు ఈ ప్రీమియం స్మార్ట్ఫోన్ను కేవలం రూ.18,999 లోపే పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
అదనపు బ్యాంక్ ఆఫర్స్..
ఫ్లాట్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా.. కొనుగోలుదారుల కోసం ఫ్లిప్కార్ట్ అద్భుతమైన బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తూ వస్తోంది. ఈ సేల్లో భాగంగా ఫ్లిప్కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) లేదా ఎస్బీఐ (SBI) బ్యాంక్ క్రెడిట్ కార్డ్లను వినియోగించి పేమెంట్ చేసే వారికి అదనంగా దాదాపు రూ.1,425 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.. అలాగే భారీ తగ్గింపు పొందాలనుకునేవారు తప్పకుండా ఎక్చేంజ్ బోనస్ ఆఫర్ కూడా వినియోగించవచ్చు.
ఎక్చేంజ్ బోనస్తో బంపర్ ఆఫర్..
పాత స్మార్ట్ఫోన్ను ఎక్చేంజ్ చేసుకునేవారికి ఇది ఒక బెస్ట్ డీల్గా భావించవచ్చు. ఈ సేల్లో పాత ఫోన్ను ఎక్చేంజ్ చేసే వారికి దాదాపు రూ.7,300 వరకు ఎక్చేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది.. ఒకవేళ ఈ స్మార్ట్ఫోన్పై మీ పాత ఫోన్కు పూర్తి ఎక్చేంజ్ వాల్యూ లభిస్తే.. అన్ని ఆఫర్లు కలుపుకుని ఈ vivo Y11 5G స్మార్ట్ఫోన్ను కేవలం రూ.11,699 లోపే సొంతం చేసుకోవచ్చు. ఈ ఎక్చేంజ్ బోనస్ అనేది మీరు ఎక్చేంజ్ చేసే పాత స్మార్ట్ఫోన్ కండీషన్తో పాటు మోడల్పై ఆధారపడి ఉంటుందని ఫ్లిప్కార్ట్ వెల్లడించింది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Google Pixel 11: గూగుల్ పిక్సెల్ 11 రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది..సూపర్ గాడ్జెట్ ఫీచర్స్, ధర ఎంతో తెలిస్తే షాకే!
Hyderabad, Telangana:Google Pixel 11 Launch Date: ప్రముఖ సంస్థ గూగుల్ నుంచి పిక్సెల్ (Pixel) స్మార్ట్ ఫోన్ను లాంఛ్ చేయనున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది నిర్వహించనున్న 'మేడ్ బై గూగుల్' అనే ఈవెంట్ ద్వారా గూగుల్ నుంచి కొత్త ప్రొడక్ట్స్ను ఆగస్టు నెలలో విడుదల చేయనున్నారు. ఆగస్టు 12న నిర్వహించనున్న వేడుకలో గూగుల్ పిక్సెల్ 11ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
గూగుల్ పిక్సెల్ 11 సిరీస్.. డిజైన్, పిక్సెల్ గ్లో
గూగుల్ ఇంకా Pixel 11 స్మార్ట్ఫోన్ గురించి అధికారికంగా సమాచారం రానప్పటికీ.. గత కొన్ని వారాలుగా ఆన్లైన్లో లీక్ అయిన సమాచారం ద్వారా టెక్ దిగ్గజం నుంచి ఏమి ఏమి ఆశించవచ్చో ఇప్పుడు ఓ అంచనాకు రావొచ్చు.
ఈ సిరీస్లో పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో ఎక్స్ఎల్, పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ వంటి మోడల్స్ అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. లీక్ అయిన సమాచారం ప్రకారం.. పిక్సెల్ 11 సిరీస్లో డిజైన్ వరకు పెద్దగా మార్పు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. కానీ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్లో మాత్రం రీడిజైన్ చేసిన కెమెరా బంప్ ఉండే అవకాశం కనిపిస్తోంది.
పిక్సెల్ 11లో నథింక్, గ్లైప్ వంటి లైట్ల మాదిరిగా ఈసారి LED లైట్ల అమరికను తీసుకొచ్చే అవకాశం ఉంది. గూగుల్ తీసుకొచ్చే ఈ విధానంలో ఆర్జీబీ (రెడ్, గ్రీన్, బ్లూ) ఫార్మాట్ను తీసుకొచ్చే అవకాశం ఉంది.
డిస్ప్లే పరిమాణాలలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అంచనా. పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో మోడళ్లలో 6.3-అంగుళాల OLED ప్యానెల్స్, అలాగే పిక్సెల్ 11 ప్రో ఎక్స్ఎల్లో 6.8-అంగుళాల OLED డిస్ప్లే కొనసాగే అవకాశం ఉంది. పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ 6.4-అంగుళాల కవర్ డిస్ప్లే, 8.0-అంగుళాల ఇన్నర్ స్క్రీన్ ఉంటాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే ఇందులో టెన్సార్ జీ6 ప్రాసెసర్, 7-కోర్ చిప్సెట్, పిక్సెల్ 11 ఫోన్లలో శాంసంగ్ మోడెమ్ కు బదులుగా మీడియా టెక్ ఎమ్ 90 మోడమ్ను ఉపయోగించినట్లు సమాచారం.
గూగుల్ పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ మోడళ్లు ట్రిపుల్ కెమెరా సెటప్తో వచ్చాయి. ఇందులో 50-మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 48-మెగా పిక్సెల్ ఆల్ట్రా-వైడ్ కెమెరా, 48-మెగా పిక్సెల్ 5x టెలిఫొటో కెమెరా ఉన్నాయి. మరోవైపు 48 మెగా పిక్సెల్ మెయిన్ సెన్సార్, 10.5 మెగా పిక్సెల్ ఆల్ట్రా-వైడ్ కెమెరా, 10.8 మెగాపిక్సెల్ 5x టెలిఫొటో లెన్స్ ఉంది. గూగుల్ తన పిక్సెల్ 11లో 'ఆన్-డివైస్ AI' ఫీచర్లను తీసుకురావచ్చని భావిస్తున్నారు. వీటిలో 'జెమిని ఇంటెలిజెన్స్'తో పాటు కొత్త 'ఏజెంటిక్ AI' సామర్థ్యాలు కూడా ఉండే అవకాశం ఉంది.
గూగుల్ పిక్సెల్ 11 ధర అంచనా..
మెమరీ చిప్స్ కొరత కారణంగా విడిభాగాల ధరలు పెరగడం వల్ల గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ ధరలను పెంచవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. గతేడాది విడుదలైన పిక్సెల్ 10 భారతదేశంలో రూ.79,999 ధరకు విడుదల కాగా.. పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ ధరలు వరుసగా రూ.1,09,999, రూ.1,24,999గా ఉన్నాయి. ఇందులో అత్యుత్తమ శ్రేణి మోడల్ అయిన పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ ధర రూ.1,72,999గా నిర్ణయించారు.
గూగుల్ పిక్సెల్ 11 విడుదల ఎలా ఉందంటే..
పిక్సెల్ 11 విడుదల కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే.. గూగుల్, యూట్యూబ్ ఛానల్ లేదా వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో వీక్షించవచ్చు. 'మేడ్ బై గూగుల్ 2026' ఈవెంట్ ఆగస్టు 12న సాయంత్రం 6 గంటలకు (EST) ప్రారంభమవుతుంది. అంటే భారత కాలమానం ప్రకారం (IST) ఆగస్టు 13న తెల్లవారుజామున 3:30 గంటలకు మొదలవుతుంది.
గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా విడుదలైన సుమారు వారం రోజుల తర్వాత Pixel 11 స్మార్ట్ఫోన్స్ అమ్మాకానికి మార్కెట్లోకి రానున్నాయి. ఆగస్టు 20, 2025లో జరిగిన గూగుల్ పిక్సెల్ 10 విడుదల కార్యక్రమాన్ని అమెరికన్ కమెడియన్, టీవీ హోస్ట్ జిమ్మీ ఫాలన్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. గతేడాది విడుదల చేసిన పిక్సెల్ 10 సిరీస్ ఆగస్టు 29న అమ్మాకాకి వచ్చింది.
Also Read: వినియోగదారులకు కీలక అలర్ట్.. రూ.100 కరెన్సీ నోట్పై ఆర్బీఐ కీలక ప్రకటన..
Also REad: రూ.4.53 లక్షలకే సూపర్ గ్రేడ్ కారు..బడ్జెట్లో సూపర్ ఫీచర్స్ ఏంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ఈ 5 రాశుల వారికి ఊహించని ధనలాభం.. బుధుడి సంచారంతో అదృష్టమే అదృష్టం!
Hyderabad, Telangana:Mercury Transit In Cancer 2026 Telugu: బుద్ధి, వివేకం, కమ్యూనికేషన్తో పాటు వ్యాపారానికి కారకుడిగా భావించే బుధ గ్రహం త్వరలోనే రాశి సంచారం చేయబోతోంది. 2026 ఆగస్టు నెలలో జరగబోయే ఈ గ్రహ మార్పు కొన్ని రాశుల వారికి అమితమైన లాభాలను చేకూర్చబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆగస్టు 5న బుధుడు తన మిత్రుడైన చంద్రుని రాశి అయిన కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతోంది. ఈ నేపథ్యంలో 5 ప్రత్యేక రాశుల వారికి అదృష్ట ఊహించని స్థాయిలో పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
గ్రహాలకు రాజుగా భావించే బుధుడు 2026 జూలై 7న తన సొంత రాశి అయిన మిథున రాశిలోకి సంచారం చేస్తాడు.. అక్కడ ఆగస్టు 5 వరకు సంచార దశలో ఉంటాడు.. అనంతరం 2026 ఆగస్టు 5న కర్కాటక రాశిలోకి ప్రవేశించి.. ఆగస్టు 22 వరకు అంటే దాదాపు 18 రోజుల పాటు అక్కడే సంచార దశలో ఉంటాడు.. ఆ తర్వాత సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ 18 రోజుల వ్యవధిలో 5 రాశుల వారు కెరీర్, వ్యాపారంతో పాటు ఆర్థిక రంగాలలో అద్భుతమైన విజయాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మేష రాశి (Aries)
మేష రాశి వారికి బుధుడి సంచారం ప్రభావం కుటుంబ జీవితంలో అద్భుతమైన ఆనందాన్ని అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. భూమి, ఇల్లు లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.. చాలా కాలంగా నిలిచిపోయిన గృహ సంబంధిత పనులు ఇప్పుడు వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు మరింత బలపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారడమే కాకుండా వ్యాపారంలో మంచి లాభాలు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి..
మకర రాశి (Capricorn)
మకర రాశి వారికి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఈ సంచారం ఎన్నో సానుకూల మార్పులను తీసుకు వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు, అభిప్రాయభేదాలు ఎంతో సులభంగా తొలగిపోతాయి.. భాగస్వామ్య (Partnership) వ్యాపారాలు చేసేవారికి ఈ 18 రోజులు భారీ లాభాలు కలుగుతాయి. వీరు తప్పకుండా లాభదాయకమైన వ్యాపార ఒప్పందం కూడా కుదుర్చుకుంటారు.
తులా రాశి (Libra)
తులా రాశి వారికి పనిలో తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇది సరైన సమయంగా భావించవచ్చు.. మీ కష్టానికి తగిన పూర్తి ప్రతిఫలం కూడా లభించే ఛాన్స్ కూడా ఉంది. ఉన్నతాధికారులతో పాటు బాస్లు మీ పనితీరును అభినందించే ఛాన్స్లు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ప్రమోషన్ లేదా జీతం పెరిగే బలమైన అవకాశాలు ఉన్నాయి. అలాగే పెద్ద, ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ బాధ్యతలు కూడా సులభంగా పొందుతారు. దీనివల్ల సమాజంలో మీ గౌరవ మర్యాదలు కూడా విపరీతంగా పెరుగుతాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
