icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
501505
V SHIVA NAGARAJUV SHIVA NAGARAJUFollow3 Aug 2024, 03:15 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

E10 Petrol: వాహనదారులకు బిగ్ రిలీఫ్..పెట్రోల్ బంకుల్లో పాత వాహనాల కోసం మళ్లీ E10 పెట్రోల్ అందుబాటులో!

Hyderabad, Telangana:

E10 Petrol Brings Back: దేశవ్యాప్తంగా పెట్రోల్‌లో ఇథనాల్ కలపడంపై వ్యక్తమవుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక పునరాలోచనలో పడింది. వాహనాల మైలేజ్, ఇంజిన్ ఆయుష్షు తగ్గిపోతున్నాయంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో, పాత వాహనాల కోసం ప్రత్యేకంగా E10 పెట్రోల్ (10 శాతం ఇథనాల్ కలిపిన ఇంధనం)ను మళ్లీ బంకుల్లో అందుబాటులోకి తీసుకురావాలని భారత ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (CEA) అనంత నాగేశ్వరన్ ప్రతిపాదించారు. కొత్త వాహనాలకు మాత్రం E20ని యథావిధిగా కొనసాగించాలని ఆయన సూచించారు.

కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం దేశంలో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ చేసిన E20 పెట్రోల్ అమల్లో ఉంది. అయితే పాత ఇంజిన్లు ఉన్న మోటార్ సైకిళ్లు, కార్ల యజమానులు దీనివల్ల నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో E10ని పునరుద్ధరిస్తే ధరలు ఏ విధంగా ఉంటాయనే దానిపై మార్కెట్లో చర్చ నడుస్తోంది.

ధరల అంచనా..
ప్రస్తుత ట్యాక్స్‌లు, పెట్రోల్, ఇథనాల్ బేస్ ధరల ఆధారంగా చూస్తే.. E20తో పోలిస్తే E10లో పెట్రోల్ శాతం (90%) కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. దీంతో దీని లీటరు ధర సుమారు రూ.103 నుంచి రూ.105 మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో మార్పులు ఉండవచ్చు.

ఇథనాల్ కలపని ప్రీమియం ఇంధనాలు..
మరోవైపు ఎలాంటి ఇథనాల్ కలపని స్వచ్ఛమైన E0 ప్రీమియం పెట్రోల్ (100 ఆక్టేన్) కూడా కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో అందుబాటులో ఉంది. ఇండియన్ ఆయిల్ (XP100), హెచ్‌పీ (Power100), బీపీసీఎల్ (Speed100) వంటి సంస్థలు విక్రయిస్తున్న ఈ ఇంధనాన్ని బ్లెండింగ్ నిబంధనల నుంచి మినహాయించారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లోని సెలెక్టెడ్ బంకుల్లో ఇది లభిస్తోంది.

పాత వాహనదారులకు ఎదురవుతున్న ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని ఈ-10 ఇంధనాన్ని పునరుద్ధరించే ప్రపోజల్‌పై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది అమలైతే పాత మోడల్ వాహనాల డ్రైవర్లకు పెద్ద ఉపశమనం లభించనుంది.

Also Read: స్కూల్ విద్యార్థులపై వీధికుక్కల వరుస దాడులు..ఆ స్కూళ్లకు వరుసగా 4 రోజులు సెలవులు!

Also Read: మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్..మూడో బిడ్డ ప్రసవానికి 365 రోజులు ప్రసూతి సెలవులు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Cinema Ticket Prices: తెలంగాణలో సినిమా థియేటర్లలో కొత్త రేట్లు..నిర్మాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ఆదేశాలు!

Hyderabad, Telangana:

Telangana Cinema Ticket Prices: తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపు, థియేటర్ల నిర్వహణపై సంచలన జీవోను విడుదల చేసింది. భారీ బడ్జెట్ చిత్రాల టికెట్ హైక్స్ ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో సంక్షేమ నిధులకు కేటాయింపులతో పాటు, అన్ని రకాల థియేటర్లకు కొత్త కనిష్ఠ, గరిష్ఠ ధరలను ఖరారు చేసింది.

థియేటర్ల వారీగా టికెట్ ధరల వివరాలు..
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేక ఆదేశాల ప్రకారం.. నాన్-ఏసీ థియేటర్లలో నాన్-ప్రీమియం టికెట్లు రూ.30 నుంచి రూ.70 వరకు.. అలాగే ప్రీమియం రూ.50 నుంచి రూ.100 వరకు నిర్ణయించారు. ఏసీ థియేటర్లలో నాన్-ప్రీమియం రూ.50 - రూ.150 ఉండగా.. ప్రీమియం రూ.100 - రూ.200 ఉండనుంది. అదే విధంగా స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో రెగ్యులర్/నాన్-ప్రీమియం రూ.100 - రూ.250.. రిక్లయినర్లు రూ.200 - రూ.300 గా ధరలను నిర్ణయించారు.

షోల పెంపు, చిన్న సినిమాలకు ప్రాధాన్యం..
ప్రతి థియేటర్‌లో రోజుకు ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు 5 షోలకు అనుమతినిచ్చారు. ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల మధ్య ఒక షో చిన్న సినిమాల ప్రదర్శనకు కేటాయించాలని, పండుగ సీజన్లలో చిన్న/మీడియం బడ్జెట్ చిత్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.

ఇతర ముఖ్యమైన మార్గదర్శకాలు..
రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ ఉన్న సినిమాలకు మొదటి 10 రోజులు మాత్రమే టికెట్ ధరల పెంపు వర్తిస్తుంది. అయితే సినీ కార్మిక సంక్షేమ నిధికి రూ.1 కోటి విరాళం ఇచ్చే చిత్రాలకే ఈ పెంపు అవకాశం లభిస్తుంది.

మల్టీప్లెక్స్‌లతో సహా అన్ని థియేటర్లలో పేద, మధ్యతరగతి ప్రేక్షకుల కోసం 25 శాతం సీట్లు (నాన్-ప్రీమియం) తప్పనిసరిగా కేటాయించాలి. ఆన్‌లైన్ బుకింగ్స్‌పై ఏసీ థియేటర్లకు రూ.5, నాన్-ఏసీ థియేటర్లకు రూ.3 నిర్వహణ ఛార్జీలు ఉంటాయి. రాబోయే రెండేళ్లలో ఎయిర్ కూల్డ్ థియేటర్లన్నీ ఏసీ థియేటర్లుగా మారాలని స్పష్టం చేశారు.

కార్మికుల సంక్షేమ నిధికి 20% వాటా..
'అఖండ 2', 'ది రాజాసాబ్', 'మన శంకర వరప్రసాద్ గారు', 'పెద్ది' వంటి భారీ సినిమాలకు టికెట్ ధరల పెంపును అనుమతించిన ప్రభుత్వం.. ఆ హైక్స్ ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతాన్ని తప్పనిసరిగా చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని 'తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్', 'ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్' (TGFDC) ఖాతాల్లో జమ చేసి సినీ కార్మికుల సంక్షేమానికి వినియోగించనున్నారు.

Also Read: హైదరాబాద్‌లో మరో దారుణమైన హత్య..లవర్‌ని హత్య చేసి గోనెసంచిలో కుక్కిన ప్రియుడు!

Also Read: Balapur Ganesh Theme: ఈసారి బాలాపూర్ గణేష్‌కు పూరీ జగన్నాథ్ ఆలయం థీమ్..ఎలా ఉండబోతుందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

India In WTC Cycle: డబ్ల్యూటీసీ రేసులో భారత్ అసలు సిసలైన పరీక్ష.. ఫైనల్‌కు చేరాలంటే భారత్‌ ఈ మ్యాచ్‌ల్లో గెలవాల్సిందే!

Hyderabad, Telangana:

India In WTC 2027 Cycle: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు అర్హత సాధించేందుకు భారత క్రికెట్ జట్టు కీలకమైన పోరుకు సిద్ధమవుతోంది. శ్రీలంక గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన భారత్, పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ప్రస్తుతం 53.33 శాతంతో ఐదో స్థానంలో ఉన్న టీమిండియా, ఫైనల్ రేసులో నిలకడగా కొనసాగాలంటే అద్భుత ప్రదర్శన చేయడం తప్పనిసరి కానుంది.

గత రెండు డబ్ల్యూటీసీ సీజన్లలో వరుసగా ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్, రెండుసార్లు రన్నరప్‌గా నిలిచింది. ఇప్పుడు ప్రస్తుత సీజన్‌లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. సాధారణంగా 60 శాతానికి పైగా పాయింట్లు సాధించిన జట్లు మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధిస్తున్న చరిత్ర ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ తన వ్యూహాలను రచిస్తోంది.

శ్రీలంకతో జరగనున్న రెండో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేస్తే, భారత్ పాయింట్ల శాతం 57.57కు పెరిగే అవకాశం ఉంది. లంక పర్యటన ముగిసిన తర్వాత భారత్‌కు అసలైన పరీక్ష ఎదురుకానుంది. 

న్యూజిలాండ్ గడ్డపై రెండు టెస్టుల సిరీస్, ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల ప్రతిష్టాత్మక సిరీస్‌లలో భారత్ తలపడాల్సి ఉంది. మిగిలివున్న మొత్తం 8 టెస్టుల్లో భారత్ కనీసం 6 నుంచి 7 మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తేనే టాప్-2 స్థానం ఖాయమవుతుంది.

ప్రస్తుతం ఆస్ట్రేలియా (77.78%), దక్షిణాఫ్రికా (75%), న్యూజిలాండ్ (72.22%) జట్లు పట్టికలో అగ్రభాగంలో ఉన్నాయి. అయితే దక్షిణాఫ్రికాకు రాబోయే రోజుల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి బలమైన జట్లతో కఠినమైన మ్యాచ్‌లు ఉండటం భారత్‌కు సానుకూలాంశంగా మారవచ్చు. ఏదేమైనా, రాబోయే కివీస్, ఆసీస్ సిరీస్‌లే టీమిండియా ఫైనల్ భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి.

Also Read: శ్రీలంకతో తొలిటెస్టులో భారత్ ఘన విజయం..10 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్ మానవ్ సుతార్!

Also Read: టెస్టుల్లో రిషబ్ పంత్ సరికొత్త రికార్డు..రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ రికార్డు బ్రేక్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

School Holidays: స్కూల్ విద్యార్థులపై వీధికుక్కల వరుస దాడులు..ఆ స్కూళ్లకు వరుసగా 4 రోజులు సెలవులు!

Simlasu, Uttarakhand:

Uttarakhand School Holidays: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా నారాయణ్‌బగడ్ ప్రాంతంలో హింసాత్మక కుక్కల బెడద విపరీతంగా పెరుగుతున్న తరుణంలో స్థానిక అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో నారాయణ్ బాగ్‌లోని 10 పాఠశాలలకు ఏకంగా నాలుగు రోజులను సెలవులుగా మంజూరు చేశారు. అయితే ఈ నాలుగు రోజుల్లో పిల్లలకు ఆన్‌లైన్‌లో తరగతులు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. 

అయితే ఈ మధ్య నారాయణబగడ్ వరుసగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా స్థానికుల్లో భయాందోళనలు పెరిగిపోయాయి. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే తమ పిల్లల భద్రత గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు, కొన్ని రోజుల పాటు పాఠశాలలను మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది.

పాఠశాలకు రాకపోకలు సాగించేటప్పుడు పిల్లలను ఎలాంటి ప్రమాదం జరగకుండా రక్షించడమే థ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాఠశాలలు మూసివేసినప్పటికీ విద్యార్థుల విద్యకు ఆటంకం కలగకుండా ఉండేందుకు, ఆన్‌లైన్ తరగతులను ప్రతిపాదించడం జరిగింది.

అధికారులు తీసుకున్న నిర్ణయం ప్రకారం.. నారాయణబగడ్ ప్రాంతంలోని 10 పాఠశాలలను నాలుగు రోజుల పాటు మూతపడనున్నాయి. ఈ సమయంలో ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో విద్యార్థులతో అనుసంధానమై వారికి బోధిస్తారు. దీనివల్ల సాధారణ తరగతులు మూసివేసినప్పటికీ పిల్లలు తమ విద్యను కొనసాగించడానికి వీలవుతుంది. ఈ సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారిని అనవసరంగా బయటకు వెళ్లనివ్వవద్దని కూడా కోరారు.

దూకుడు స్వభావం గల కుక్కల ఉనికి పాఠశాల విద్యార్థులకే కాకుండా స్థానిక నివాసితులకు కూడా ఆందోళన కలిగిస్తోంది. పర్వత ప్రాంతాలలో ప్రజలు తరచుగా కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుంది. వీధి కుక్కలు, దూకుడు స్వభావం గల కుక్కల గుంపులు ఇబ్బందికరంగా మారవచ్చు.

ప్రస్తుతానికి పాఠశాలలను మూసివేయాలన్న నిర్ణయాన్ని ముందుజాగ్రత్త చర్యగా భావిస్తున్నారు. యాజమాన్యం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన తర్వాత యధావిధిగా తరగతులు తిరిగి ప్రారంభమవుతాయి.

Also Read: అమ్మాయిలతో మూత్రం తాగించిన 5వ తరగతి విద్యార్థి..ప్రిన్సిపల్‌ చాక్లెట్స్ తినమన్నాడు!

Also Read: మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్..మూడో బిడ్డ ప్రసవానికి 365 రోజులు ప్రసూతి సెలవులు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

India vs Pakistan: రెండో రౌండ్‌కు అర్హత.. భారత్‌ దెబ్బకు ప్రపంచకప్‌ నుంచి పాకిస్థాన్‌ నిష్క్రమణ

Amstelveen, Noord-Holland:

India vs Pakistan Highlights: హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుతం చేసింది. ప్రపంచ హాకీ టోర్నీలో భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసి ముందడుగు వేసింది. భారీ తేడాతో విజయం సాధించిన భారత జట్టు గోల్స్‌తో అదరగొట్టింది. హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, అభిషేక్‌ గోల్స్‌తో చెలరేగడంతో పాకిస్థాన్‌ ఆటగాళ్లు ఏమాత్రం పోరాడలేకపోయారు. చేసిన మూడు గోల్స్‌కు పరిమితమై ఓటమితో ప్రపంచకప్‌ను పాకిస్థాన జట్టు వీడింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పురుషుల హాకీ ప్రపంచకప్ 2026లో ఓటమి నుంచి తేరుకున్న భారత జట్టు హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై తీవ్రంగా శ్రమించి విజయం సాధించింది. ఆమ్‌స్టల్‌వీన్ వేదిక‌గా బుధవారం జరిగిన పూల్-డి మ్యాచ్‌లో భారత్‌ 5-3 తేడాతో పాకిస్థాన్‌ను చిత్తుచేసింది. భారీ విజయాన్ని అందుకున్న భారత జట్టు రెండో రౌండ్‌కు అర్హత సాధించగా.. పాకిస్తాన్ జట్టు ప్రపంచకప్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

మ్యాచ్‌ ప్రారంభం నుంచే భారత జట్టు దూకుడుగా ప్రదర్శన చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, ఫార్వర్డ్ అభిషేక్ చెరో రెండు గోల్స్‌తో చేసి ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలో పడేశారు. రెండో క్వార్టర్ పూర్తయ్యాక భారత్ 3-0తో పాకిస్థాన్‌పై ఆధిక్యం సాధించి మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది. మూడో క్వార్టర్‌లో పాకిస్థాన్‌ గొప్పగా పుంజుకుని రెండు గోల్స్‌ సాధించింది. అయితే అదే సమయంలో భారత జట్టు మరో గోల్ సాధించడంతో 4-2 భారత్‌ ఆధిక్యం కొనసాగింంది. ఆఖరి క్వార్టర్‌లో పాకిస్థాన్‌ తొలుత ఓ గోల్‌ కొట్టి భారత్‌కు ఝలక్‌ ఇచ్చింది. తర్వాత గోల్స్‌ కోసం పాకిస్థాన్‌ ఆటగాళ్లు శ్రమించినా భారత డిఫెండర్లు ఎదురు నిలబడి గట్టిగా సమాధానం ఇచ్చారు. ఆట పూర్తయ్యేసరికి ఆధిక్యం 5-3 ఉండడంతో పాకిస్థాన్‌కు ఓటమి తప్పలేదు. 

భారత గోల్స్‌ ఇలా..
రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు విజృంభించారు. మ్యాచ్‌ ప్రారంభమైన ఐదో నిమిషంలోనే కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ గోల్‌ సాధించి శుభారంభం అందించాడు. తర్వాత 11వ నిమిషంలో అభిషేక్‌ గోల్‌ చేసి అభిమానుల్లో ఉత్సాహం నింపాడు. రెండో క్వార్టర్‌లో 21వ నిమిషానికి హర్మన్‌ప్రీత్‌ ఓ గోల్‌ చేయగా.. కొద్దిసేపటికే 24వ నిమిషానికి అభిషేక్‌ గోల్‌ చేయడంతో పాకిస్థాన్‌పై భారత జట్టు ఆధిక్యంలోకి వచ్చింది. మూడో క్వార్టర్‌లో హార్దిక్ సింగ్ 35వ నిమిషానికి ఒక గోల్ చేయడంతో ప్రత్యర్థిపై భారత ఆధిక్యం పెరిగింది. 

పాకిస్తాన్‌ గోల్స్‌
పాక్ తరఫున హన్నన్ షాహిద్ రెండు గోల్స్‌ సాధించాడు. 22వ, 46వ నిమిషాల్లో షాహీద్‌ గోల్స్‌ కొట్టగా.. 24వ నిమిషంలో సుఫ్యాన్ ఖాన్ గోల్‌ కొట్టాడు. గోల్స్‌ కోసం పాకిస్థాన్‌ ఆటగాళ్లు పోరాడినా భారత డిఫెండర్లు పెట్టని కోటలా నిలబడి అడ్డుకోవడంతో వారి శ్రమ వృథాగా మారి మ్యాచ్‌ ఓడిపోవడమే కాకుండా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

0
0
Report

Konda Susmita: రేవంత్‌ రెడ్డిపై సుష్మిత తీవ్ర వ్యాఖ్యలు.. కొండా సురేఖకు కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ నోటీసులు

Baddipadaga, Telangana:

Konda Susmita Row: వరుసగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అధికారంలోని కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. పార్టీ నాయకులే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేవాదాయ, అటవీ శాఖల మంత్రి  కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత బుధవారం రేవంత్ రెడ్డితోపాటు పొంగులేటి శ్రీనివాస రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అవినీతి ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్‌ పార్టీ ఇరుకున పడింది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా కమిటీ కొండా సుష్మిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆమె తల్లి, మంత్రి కొండా సురేఖకు క్రమశిక్షణా కమిటీ నోటీసులు జారీ చేసింది.

సీనియర్ నాయకుడు సస్పెండ్
కొందరిని అసభ్య పదాలతో వ్యక్తిగత దూషణలు చేసిన ఎల్బీనగర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్‌ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశాలు ఇచ్చింది. పలువురిని వ్యక్తిగత విషయాలపై దూషించడమే కాకుండా కులాల పేరుతో దూషించిన సంఘటనలపై సరైన ఆధారాలు ఉండడంతో జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెన్షన్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశాలు జారీ చేసింది.

చిన్నారెడ్డికి నోటీస్
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి ఇటీవల వనపర్తి నియోజకవర్గంలో ఒక సభలో చేసిన పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలపై, ఎమ్మెల్యే మేఘారెడ్డిపై చేసిన అనుచిత ప్రసంగాలపై మూడు రోజులలో వివరణ ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. ఇక ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, మునిసిపల్ కార్పొరేషన్ సభ్యుడు సంజయ్‌లకు క్రమశిక్షణ కమిటీ నోటీసు పంపింది. వెంటనే వివరణ ఇవ్వాలని వారిద్దరికీ కాంగ్రెస్‌ పార్టీ ఆదేశించింది.

0
0
Report
Advertisement

Telangana Police: ట్రాఫిక్‌, రోడ్డు భద్రతకు అత్యధిక ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్‌

Hyderabad, Telangana:

Telangana Police: తెలంగాణలో ట్రాఫిక్‌, రోడ్డు భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని డీజీపీ సీవీ ఆనంద్‌ ప్రకటించారు. మారుతున్న సవాళ్లకు అనుగుణంగా పోలీసు సిబ్బంది పునర్వ్యవస్థీకరణ జరుగుతోందని వెల్లడించారు. డ్రగ్స్‌, సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయని.. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయని వివరించారు.

హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్‌ కీలక విషయాలు వెల్లడించారు. మారుతున్న నేర స్వభావం, ప్రజా భద్రతకు ఎదురవుతున్న కొత్త సవాళ్లకు అనుగుణంగా తెలంగాణ పోలీసు శాఖలో మానవ వనరులను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు తెలిపారు. ఒకప్పుడు వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదం ప్రధాన సవాళ్లుగా ఉండగా.. ప్రస్తుతం డ్రగ్స్‌, సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, పెట్టుబడి మోసాలు, ట్రాఫిక్‌ నిర్వహణ, రోడ్డు భద్రత, ఆహార కల్తీ వంటి అంశాలు పోలీసులకు కొత్త సవాళ్లుగా మారాయని వెల్లడించారు.

తెలంగాణలో వామపక్ష తీవ్రవాదం దాదాపు ముగిసిపోయిందని.. మావోయిస్టు కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయని డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. కర్రెగుట్టల ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంగా అక్కడ మౌలిక వసతుల కొరత స్పష్టంగా కనిపించిందని.. కొన్ని ప్రాంతాల్లో రహదారులు, పాఠశాలలు, వైద్య సదుపాయాలు ఇంకా మెరుగుపడాల్సి ఉందని పేర్కొన్నారు. యువతలో డ్రగ్స్‌ వినియోగం పెరుగుతోందని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. 

గతేడాది 835 మంది విద్యార్థుల్లో డ్రగ్స్‌ ఆనవాళ్లు గుర్తించినట్లు.. మరో విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అధ్యయనంలో సుమారు 70 శాతం మంది విద్యార్థులు డ్రగ్స్‌కు గురైనట్లు తేలిందని డీజీపీ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. డ్రగ్స్‌ సరఫరా చైన్‌ను పూర్తిగా అడ్డుకోవడంతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా సంస్థల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పోలీస్‌ యంత్రాంగానికి గుర్తుచేశారు. పిల్లలను ఇప్పుడే కాపాడుకోకపోతే భవిష్యత్తులో పరిస్థితి మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

పెరుగుతున్న సైబర్‌ నేరాలు
ప్రస్తుతం సైబర్‌ నేరాలు ప్రధాన సవాలుగా మారాయని.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, పెట్టుబడి మోసాలు, నకిలీ యాప్‌ల ద్వారా మోసాలు పెరుగుతున్నాయని డీజీపీ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. గతేడాది తెలంగాణలో సైబర్‌ నేరాల కారణంగా సుమారు రూ.1,750 కోట్ల ఆర్థిక నష్టం జరిగినట్లు తెలిపారు. గతేడాది తెలంగాణలో రోడ్డు ప్రమాదాల్లో సుమారు 8 వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి వాటికి సంబంధించిన ఇంజినీరింగ్‌ లోపాలను సరిదిద్దేందుకు సంబంధిత ప్రభుత్వ శాఖలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక రోడ్డు భద్రత కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

0
0
Report

Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్ర పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్‌..

Hyderabad, Telangana:

Viral Latest Pic: ఈ రోజుల్లో పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ (Pre-Wedding Shoot) అనేది ఒక తప్పనిసరి తంతుగా మారిపోవడం విశేషం.. పెళ్లి ఎంత ఘనంగా చేసుకుంటున్నారనే దానికంటే.. ప్రీ వెడ్డింగ్ షూట్ ఎంత వెరైటీగా ప్లాన్ చేశారనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.. ఇరుగు పొరుగు వారు ఆశ్చర్యపోయేలా.. సోషల్ మీడియాలో తమదే బెస్ట్ కపుల్ అనిపించుకునేలా యువత రకరకాల సాహసాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక జంట చేయించుకున్న ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది.

సాధారణంగా ప్రీ వెడ్డింగ్ ఫోటోలు అనగానే.. పచ్చని పొలాలు, సముద్ర తీరాల్లో రొమాంటిక్‌గా దిగుతుంటారు. కానీ, వైరల్ అవుతున్న ఈ తాజా ఫోటోలో ఒక జంట అద్భుతమైన ఫార్మల్.. ఖరీదైన పార్టీ వేర్ దుస్తులు ధరించి.. ఒక అందమైన కొలను దగ్గర నిల్చుని ఉండడం మీరు ఈ ఫోటోల్లో చూడొచ్చు. అందులో కాబోయే వధువు చాలా అందంగా ముస్తాబై.. కెమెరా వైపు చూస్తూ ఎంతో ఆకర్షణీయంగా చిరునవ్వుతో ఫోజులిచ్చింది.. ఇక్కడి వరకు చూస్తే ఇదొక అద్భుతమైన ఫోటో అనిపిస్తుంది. కానీ, ఆమె పక్కనే ఉన్న కాబోయే వరుడి స్టిల్ చూస్తే మాత్రం ఎవరికైనా ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.

ఆ యువకుడు వధువుకు కొద్దిగా దూరంగా నిలబడి ఉండడం మీరు క్లియర్‌గా చూడొచ్చు.. అంతేకాకుండా ఏకంగా ఆ కొలనులోకి మూత్ర విసర్జన (Urinating) చేస్తున్నట్లుగా కెమెరాకు స్టిల్ ఇచ్చాడు. వినడానికి వింతగా అనిపించినా.. ఫోటోలో ఉన్నది ఇదే.. విభిన్నంగా కనిపించాలన్న ఉద్దేశ్యమో.. లేదా నెటిజన్ల దృష్టిని ఆకర్షించాలన్న ఆరాటమో కానీ.. ఇలాంటి ఒక వింతైన కాన్సెప్ట్‌తో ఫోటో దిగాలనే ఆలోచన ఆ ఫోటోగ్రాఫర్‌కు ఎలా వచ్చిందో.. దానికి ఆ జంట ఎలా ఒప్పుకుందో అర్థం కాక నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు.

 Also Read: తెలుగు రాష్ట్రాల్లో 22A పిడుగు.. సొంత భూమి ఉన్నా ఎందుకీ తిప్పలు?

ప్రస్తుతం ఈ ఫోటో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ వింత ఫోటోకు ఇప్పటికే ఏకంగా 1 మిలియన్‌కు పైగా లైక్స్ రావడం విశేషం.. దీన్ని బట్టి చూస్తే.. సోషల్ మీడియాలో ఇలాంటి వింతలకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఫోటోను చూసి చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్స్‌ కూడా చేస్తున్నారు. 

 Also Read: తెలుగు రాష్ట్రాల్లో 22A పిడుగు.. సొంత భూమి ఉన్నా ఎందుకీ తిప్పలు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Chandra Grahan: ఆగస్టు 28న చివరి చంద్రగ్రహణం.. ఈ 3 రాశుల వారికి ఆర్థిక నష్టం, తీవ్ర మానసిక ఒత్తిడి తప్పదా?

Hyderabad, Telangana:

Lunar Eclipse August 28: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహణాలకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా సూర్య, చంద్ర రెండు గ్రహణాలు మానవ జీవితాలపై ఊహించని ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. అంతేకాకుండా రాశులపై కూడా ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ఇదిలా ఉంటే 2026 సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం ఆగస్టు 28న సంభవించబోతోంది. అయితే, ఈ గ్రహణానికి జ్యోతిష్య శాస్త్రం పరంగా చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.  

ఆగస్టు 28న ఏర్పడే ఈ చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు.. తన శత్రువుగా భావించే శనికి సంబంధించిన కుంభరాశిలో.. అలాగే రాహువుకు చెందిన శతభిషా నక్షత్రంలో సంచారం చేయబోతున్నాడు.. శని, రాహువుల ఈ ద్వంద్వ ప్రభావం కారణంగా చంద్రుడు మాయాజాలంలో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. దీని కారణంగా ఈ చంద్రగ్రహణం కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులకు దారితీసే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ 4 రాశుల వారికి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అనేక సమస్యలకు దారీ తీసే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి.

ఈ రాశులవారికి సమస్యలు..
సింహ రాశి (Leo)
చంద్రగ్రహణ ప్రభావంతో సింహ రాశి వారికి తీవ్రమైన మానసిక ఒత్తిడికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.. అంతేకాకుండా ఈ సమయంలో ఊహించని ఖర్చులు కూడా పెరుగుతాయి. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తప్పవని నిపుణులు తెలుపుతున్నారు. కోపంలో మాట జారడం వల్ల కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో సంబంధాలు కూడా ఊహించని స్థాయిలో దెబ్బతింటాయి. ఇంట్లో అకారణంగా గొడవలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆఫీసులో పనిభారం పెరిగి తీవ్రమైన ఒత్తిడికి దారి తీసే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. 

కర్కాటక రాశి (Cancer)
ఈ రాశికి అధిపతి స్వయంగా చంద్రుడే కావడం విశేషం.. కాబట్టి ఈ గ్రహణ ప్రభావం కర్కాటక రాశి వారిపై నేరుగా పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా వచ్చే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. కంటి సమస్యలు, అధిక రక్తపోటు, తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండడం మంచిది.. భారీగా ఆర్థిక నష్టాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది..

వృశ్చిక రాశి (Scorpio)
ఈ వృశ్చిక రాశి వారి శారీరక, మానసిక ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామి లేదా పిల్లల ఆరోగ్యం మిమ్మల్ని తీవ్ర ఆందోళనకు గురిచేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏదైనా ఆర్థికంగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు తప్పకుండా తొందరపాటు అస్సలు పనికిరాదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. పని ప్రదేశంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మి డబ్బులు అప్పుగా ఇవ్వకండి.

(నోట్: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణుల అంచనాలు, జ్యోతిష్యులు అందించిన సమాచారం ఆధారంగా తీసుకుని రాసింది మాత్రమే.. దీనికి జీ తెలుగు న్యూస్‌కి ఎలాంటి సంబంధం లేదు..)

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report
Advertisement

Viral Video: కన్నవారి కల నెరవేర్చిన కొడుకు.. తల్లిదండ్రులను తొలిసారి విమానం ఎక్కించిన యువకుడు!

Hyderabad, Telangana:

Emotional Family Video: కన్నవారి కలలను నెరవేర్చడంలో ఉండే ఆనందం అంతో, ఇంతో కాదు.. పేదరికంలో పుట్టినా.. పట్టుదలతో శ్రమించి పైకొచ్చి.. అమ్మానాన్నల కళ్లలో ఆనందం చూస్తే.. ఆ తృప్తి ముందు కోట్ల రూపాయలు కూడా పనికారవు.. తాజాగా రాజస్థాన్‌కు చెందిన ఒక యువకుడు తన తల్లిదండ్రులను తొలిసారిగా విమానం ఎక్కించి.. వారి జీవితంలో మర్చిపోలేని అద్భుతమైన అనుభూతిని బహుమతిగా అందించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఈ వీడియో ఇప్పుడు లక్షలాది నెటిజన్ల హృదయాలను గెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన ఖేము సైనీ అనే యువకుడు ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు. ఒకప్పుడు కుటుంబ తినడానికి చాలా కష్టం అయ్యేది.. నెలకు కేవలం 6 నుంచి 7 వేల రూపాయలు మాత్రమే సంపాదిస్తూ.. తీవ్రంగా కష్టపడేవాడు.. ఆ సమయంలో పూట గడవడమే ఎంతో కష్టంగా ఉండేది.. అలాంటి పరిస్థితుల్లో విమానం ఎక్కడం అనేది ఆ కుటుంబానికి కలలో కూడా ఊహించని విషయంగానే భావించవచ్చు.. కానీ.. ఖేము తన పేదరికాన్ని చూసి అస్సలు కుంగిపోలేదట.. తన కష్టాన్ని నమ్ముకుని పగలు రాత్రి చాలా వరకు కష్టపడ్డాడు.. ఎంతో శ్రమతో ఆర్థికంగా స్థిరపడిన తర్వాత.. తన తల్లిదండ్రులకు, అక్కకు విమాన ప్రయాణం చేయించాలనే తన చిరకాల కోరికను నెరవేర్చాడు.

ఖేము సైనీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా (@tijara_vines01) ద్వారా ఈ అద్భుతమైన వీడియోను పోస్ట్ చేశాడు.. ఈ వీడియోలో, అతని కుటుంబం రాజస్థానీ సంప్రదాయ దుస్తులైన ధోతీ-కుర్తా ధరించి.. ఎంతో సంతోషంగా విమానాశ్రయానికి రావడం ఈ వీడియోలో మనం చూడోచ్చు. ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టినప్పటి.. నుంచి విమానంలో కూర్చునే వరకు ఆ తల్లిదండ్రుల ముఖంలో కనిపించిన ఆనందం.. కళ్లలో మెరిసిన ఆ బ్రైట్‌నెస్‌ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత వారు పొందిన సంతోషం చూసి ప్రతి ఒక్కరూ ఎంతగానో భావోద్వేగానికి గురయిన్నట్లు తెలుస్తోంది..

Also Read: తెలుగు రాష్ట్రాల్లో 22A పిడుగు.. సొంత భూమి ఉన్నా ఎందుకీ తిప్పలు?

ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారింది... నిజమైన విజయం అంటే ఇదే.. మన సంపాదనతో కన్నవారి ముఖంలో చిరునవ్వులు పూయించడానికి మించిన ఆస్తి మరొకటి లేదు.. అంటూ నెటిజన్లు ఖేము సైనీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒకప్పుడు విమానం గురించి ఆలోచించడానికే భయపడే స్థాయి నుంచి.. ఈ రోజు అదే విమానంలో సగర్వంగా ప్రయాణించిన ఈ కుటుంబం కథ ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

 Also Read: తెలుగు రాష్ట్రాల్లో 22A పిడుగు.. సొంత భూమి ఉన్నా ఎందుకీ తిప్పలు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

YS Jagan: చంద్రబాబుపై యుద్ధానికి సిద్ధం కండి.. వచ్చే ఏడాదే నా పాదయాత్ర: వైఎస్‌ జగన్‌

Tadepalli, Andhra Pradesh:

YS Jagan Padayatra: మరో ఏడాదిలో తన పాదయాత్ర మొదలవుతుందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించారు. పాదయాత్ర జరిగిన తర్వాత ఏడాది ఎన్నికలు జరుగుతాయని..  ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమదే (వైఎస్సార్‌సీపీ) విజయం అని పూర్తి విశ్వాసం ప్రకటించారు. నిత్యం ప్రజలతో మమేకమై పని చేయాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు సూచించారు. 'అన్నింట్లో చంద్రబాబు విఫలమవడంతో వైఎస్సార్‌సీపీపై రోజురోజుకీ ప్రజాదరణ పెరుగుతోంది. అందుకే నాటి వైఎస్సార్‌సీపీ పరిపాలనను, ఇప్పుడు వెన్నుపోటు పార్టీ కూటమి పాలనతో పోల్చి చూస్తున్నారు. దీనిపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. స్థానిక యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

రాజమండ్రి రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమావేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 'స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు సిద్ధం కండి. గెలుపే లక్ష్యంగా పని చేయాలి. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏ ఒక్క వర్గమూ కూడా సంతోషంగా లేదు' అని తెలిపారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో కనిపించకుండా చేసేందుకు పోలీసులను ప్రయోగిస్తారు. అన్నీ ఎదుర్కొని యుద్ధం చేయాలి' అని పార్టీ శ్రేణులకు సూచించారు. మనకు అత్యంత ప్రజాదరణ ఉందని.. తప్పకుండా గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

'ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణంగా శాంతి భద్రతలు దిగజారిపోయాయి. ఇసుక, మట్టి, మద్యం మాఫీయాలు. గంజాయి రవాణా చేస్తూ పోలీసులు పట్టుబడిన స్థాయికి వ్యవస్థలు దిగజారాయి. ఆ ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు చేస్తున్నారు' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు. 'రాజమండ్రిలో డాక్టర్‌ ప్రియాంకను దారుణంగా చంపారు. కారుతో పదే పదే ఢీకొట్టి ప్రాణం తీశారు. అయినా కేసు బయటకు రాకుండా తొక్కి పెట్టే ప్రయత్నం చేశారు' అని ఆరోపించారు. అంత దారుణంగా పోలీసులు, అధికార పార్టీ (టీడీపీ) వారు కుమ్మక్కై పని చేస్తున్నారని విమర్శించారు.

'రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచిన వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. విద్యార్థులు, రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, ఉద్యోగులు, వ్యాపారులు.. ఇలా ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. అందుకే వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం మీద రెండేళ్లలోనే తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది' అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ వివరించారు.

0
0
Report

Realme P4s 5g: 8000mAh భారీ బ్యాటరీతో ఆగస్టు 26న రియల్‌మీ P4s 5G విడుదల.. ఫీచర్లు ఇవే!

Hyderabad, Telangana:

Realme P4s 5g Price: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఊహించని గుడ్‌న్యూస్‌.. పవర్‌ఫుల్ బ్యాటరీతో పాటు ప్రీమియం ఫీచర్లతో ప్రముఖ టెక్ దిగ్గజం రియల్‌మీ (Realme) స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.. ఇప్పటికే P సిరీస్‌లో P4, P4 Lite, P4x, P4 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌లను బడ్జెట్, మిడ్-రేంజ్ మోడళ్లను విడుదల చేసి సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు మార్కెట్లో రియల్‌మీ పీ4ఎస్ 5జీ  (Realme P4s 5G)ను భారత్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది.. ఈ ఫోన్ ఫీచర్లతో పాటు లాంచ్ తేదీ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అతిపెద్ద హైలైట్ దీని బ్యాటరీగానే భావించవచ్చు.. ఇందులో ఏకంగా 8000mAh పవర్‌ఫుల్ బ్యాటరీని అందిస్తోంది. దీనికి తోడు వేగంగా ఛార్జింగ్ చేసేందుకు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా మూడు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుందని రియల్‌మీ కంపెనీ క్లైమ్‌ కూడా చేస్తోంది.. ప్రయాణాలు చేసేవారికి.. మొబైల్ గేమర్స్‌కు ఈ భారీ బ్యాటరీ ఒక వరం లాంటిదిగా భావించవచ్చు..

డిస్‌ప్లే పరంగా ఈ ఫోన్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.. రియల్‌మీ P4s 5G స్మార్ట్‌ఫోన్‌లో సాంసంగ్‌ M14 ప్యానెల్‌తో కూడిన అద్భుతమైన డిస్‌ప్లేను కూడా అందించింది.. ఇందులో 1,272 × 2,772 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 144 Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగిన అత్యంత స్మూత్ స్క్రోలింగ్ అనుభూతిని కూడా అందిస్తోంది.. ముఖ్యంగా 6,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో మండుటెండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే ఇది HDR10+తో పాటు నెట్‌ఫ్లిక్స్ HDR కంటెంట్‌ను కూడా సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది.

పెర్ఫార్మెన్స్ పరంగా ఈ ఫోన్ ఎక్కడా రాజీ పడకుండా.. ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఆల్ట్రా 5G (MediaTek Dimensity 7400 Ultra 5G) ప్రాసెసర్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.. దీనికి తోడుగా హై-గ్రాఫిక్స్ గేమింగ్ కోసం HyperVision+ AI అదనపు గ్రాఫిక్స్ చిప్‌ను కూడా అందించడం విశేషం..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ఇక ఫోటోగ్రఫీ విషయానికొస్తే.. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ డ్యూయల్ AI రియర్ కెమెరా సెటప్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది.. షేక్ అవ్వకుండా.. తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన ఫోటోలు, వీడియోలను క్లిప్‌లను తీసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 26న భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది.. ఇది గ్రీన్‌తో పాటు బీజ్-బ్రౌన్ అనే రెండు అద్భుతమైన కలర్ ఆప్షన్లలో విడుదల కాబోతోంది.. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart)తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

AP Assembly: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ప్రత్యక్ష ఎన్నికలు

Velgapudi, Andhra Pradesh:

AP Mayor Elections: స్థానిక ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే మంత్రివర్గ సమావేశంలో బీసీ రిజర్వేషన్‌లకు సంబంధించి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కొన్ని వారాల్లోనే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కాబోతున్న వేళ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు మేయర్‌, మున్సిపల్ చైర్మన్‌ల ఎన్నికలు పరోక్ష పద్ధతిలో ఉండేవి. ఇకపై వాటిని ప్రత్యక్షంగా ఎన్నిక చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన బిల్లు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో మేయర్, మున్సిపల్ చైర్మన్‌ల ఎంపికకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు వీలు కల్పించే ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనాలు 4వ సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మేయర్, మున్సిపల్ చైర్మన్‌లను పరోక్ష విధానంలో ఎన్నుకుంటున్న నేపథ్యంలో, ఎన్నికల విధానంలో మార్పు తీసుకువస్తూ ప్రభుత్వం ఈ చట్ట సవరణ బిల్లును రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. '1986 వరకు మేయర్, మున్సిపల్ చైర్మన్‌ల ఎంపికకు పరోక్ష ఎన్నికలు జరిగేవి. 1986 నుంచి 2005 వరకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. 2005 నుంచి ఇప్పటివరకు మళ్లీ పరోక్ష ఎన్నికల విధానం కొనసాగుతోంది' అని సభకు వివరించారు. ప్రస్తుతం తీసుకొచ్చిన చట్ట సవరణతో ఇకపై మేయర్, మున్సిపల్ చైర్మన్‌ల ఎన్నికలు ప్రత్యక్ష విధానంలో నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని వెల్లడించారు.

పరోక్ష పద్ధతి కాకుండా ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ప్రజలే నేరుగా మేయర్ లేదా మున్సిపల్ చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. దీనివలన అనేక ప్రయోజనాలు ఉంటాయని మంత్రి నారాయణ తెలిపారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల నుంచి ఎన్నికైన మేయర్, చైర్మన్‌కు బలమైన ప్రజామోదం ఉంటుందని చెప్పారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ద్వారా కాకుండా ప్రజలే నేరుగా ఎన్నుకోవడంతో మేయర్ లేదా చైర్మన్‌పై కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రభావం ఉండదని వివరించారు.

బిల్లు ఆమోదం
ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికయ్యే మేయర్, చైర్మన్‌లు వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని మంత్రి నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. నగరాలు, పట్టణాల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను త్వరితగతిన అమలు చేసేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు. అభివృద్ధి పనుల అమలులో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలతో మెరుగైన సమన్వయం చేసుకుంటూ పనులను వేగవంతం చేసేందుకు ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నికైన మేయర్, చైర్మన్‌కు అవకాశం ఉంటుందని ప్రభుత్వం వివరణ ఇస్తోంది. నగరాలు, పట్టణాల్లో పెట్టుబడులు, పరిశ్రమలు, పర్యాటక రంగాన్ని చురుకుగా ప్రోత్సహించేందుకు మేయర్ లేదా మున్సిపల్ చైర్మన్‌కు మరింత అవకాశం ఉంటుందని ప్రభుత్వం వివరించింది. ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపడంతో ఇకపై మేయర్, మున్సిపల్ చైర్మన్‌ల ఎంపికకు ప్రత్యక్ష ఎన్నికల విధానం అమల్లోకి రానుంది.

0
0
Report

Best Used Bikes: హైదరాబాద్‌లో రూ.56 వేలకే Vespa, రూ.85 వేలకే Yamaha ఆర్15..

Hyderabad, Telangana:

Cheap Second Hand Bikes in Hyderabad: తెలంగాణలో సెకండ్ హ్యాండ్ బైక్‌లకు ఎప్పుడు భారీ డిమాండ్ ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో బ్రాండ్ న్యూ కండిషన్ ఉన్న స్పోర్ట్స్ బైక్ లేదా స్కూటీ కొనుగోలు చేయాలనుకుంటారు.. కానీ కొత్త బైక్‌ల ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో.. సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా సగం ధరలకే మంచి మంచి బైక్‌లను విక్రయించే సెకండ్‌ హ్యాండ్ షోరూమ్స్‌కి వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. అయితే, అలాంటి వారి కోసమే.. హైదరాబాద్‌లోని ఓ సెంకడ్‌ హ్యాండ్‌ మోటార్స్ షోరూమ్‌ అదిరిపోయే ఆఫర్లతో సెకండ్ హ్యాండ్ బైక్స్‌తో పాటు స్కూటీలను అందుబాటులోకి తీసుకు వచ్చింది.. రోజువారీ వాడుకునే స్కూటీల నుంచి మొదలుపెడితే.. కుర్రాళ్లకు ఎంతో ఇష్టమైన బుల్లెట్, ప్రీమియం బైక్స్ అయిన బెనెల్లీ, జావా వరకు అన్ని రకాల వాహనాలు ఇక్కడ అత్యంత చీప్‌ ధరలకే లభిస్తుంది.

యువత ఎక్కువగా ఇష్టపడే యమహా MT15, R15 సిరీస్ బైక్స్ ఇక్కడ బెస్ట్ ప్రైస్‌లో అందుబాటులో ఉండడం విశేషం.. అలాగే 2018 మోడల్ యమహా R15 V3 మోటర్‌ సైకిల్‌ ఆఫర్ ప్రైస్‌లో కేవలం రూ.85,000 లకే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు 2022 మోడల్ యమహా MT15 బ్లూ కలర్ మోడల్ కేవలం రూ. 1,29,000 నుంచి ప్రారంభం అవుతుండగా, కండిషన్ బట్టి రూ. 1,39,000 వరకు ఉన్నాయి. అలాగే కేవలం 6,000 కి.మీ మాత్రమే తిరిగి 2024 మోడల్ యమహా R15 V4 మోటర్‌ సైకిల్‌ బ్రాండ్ న్యూ కండిషన్‌లో ఉంది. దీని ధర రూ. 1,79,000తో విక్రయిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా 2022 మోడల్ టీవీఎస్ అపాచీ 160 రూ.75,000 లకే అందుబాటులో ఉంది..

ఇక మహిళలు ఎక్కువగా ఇష్టపడే వెస్పాతో పాటు ఇతర స్కూటర్లు సైతం ఇక్కడ ఎక్సలెంట్ కండిషన్‌లో అందుబాటులో ఉన్నాయి.. ముఖ్యంగా 2022 మోడల్ పింక్ కలర్ వెస్పా ధర రూ.76,000 కాగా.. 2019 మోడల్ వెస్పా అత్యంత తక్కువగా కేవలం రూ.56,000 లకే అందుబాటులో ఉండడం విశేషం.. అంతేకాకుండా 2022 మోడల్ TVS జూపిటర్ రూ. 69,000లకు.. 2023 మోడల్ జూపిటర్ 125 ఆరెంజ్ కలర్ రూ. 79,000 లకు లభించడం విశేషం.. ఇక 2022 మోడల్ ఏప్రిలియా బండి కూడా రూ.69 వేలకే అందుబాటులో ఉంది..

అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఇష్టపడేవారికి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 2022 మోడల్ మోటర్‌ సైకిల్ కేవలం రూ.1,89,000 లకు లభిస్తోంది. అంతేకాకుండా ఇది 13,000 కి.మీ తిరిగిన్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా మెటియోర్ 350, థండర్ బర్డ్ రూ.1,29,000 బైక్స్ కూడా బెస్ట్ ధరల్లో లభిస్తున్నాయి.. బెస్ట్ లుక్ అందించే.. 2020 మోడల్ బెనెల్లీ 400 గ్లాసీ బ్లాక్ రూ.1,49,000 లకు అందుబాటులో ఉండగా.. జావా పెరాక్, యెజ్డీ రోడ్‌స్టార్ వంటివి మోటర్‌ సైకిల్స్‌ ఇక్కడ రూ. 1,29,000 లకే ప్రారంభమవుతున్నాయి.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

(నోట్‌: ఈ ధరలు వీడియో ఆధారంగా మాత్రమే అందించింది.. అలాగే ఈ సమాచారం పైన ఇచ్చిన వీడియోను ఆధారంగా రాసిది మాత్రమే.. దీనికి జీ తెలుగు న్యూస్‌కి ఎలాంటి సంబంధం లేదు.. అలాగే కొనుగోలు చేసే ముందు షోరూమ్‌కు వెళ్లి బండి కండిషన్ స్వయంగా చెక్ చేసుకోవడం మంచిది)

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

iQOO Neo 11 Ultra ఫోన్‌ లాంచ్.. అదిరిపోయే ఫీచర్లు, ధర వివరాలు ఇవే!

Hyderabad, Telangana:

Iqoo Neo 11 Ultra Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ iQOO మార్కెట్‌లోకి అద్భుతమై మొబైల్‌ విడుదల చేసింది. దీనిని కంపెనీ iQOO Neo11 Ultra మొబైల్ పేరుతో చైనాలో లాంచ్‌ చేసింది. ఇది మోస్ట్ పవర్‌ఫుల్  9100mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా  50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా దీని ఫ్రంట్‌ భాగంలో 16-మెగాపిక్సెల్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

iQOO నియో11 అల్ట్రా ధర..
ఈ iQOO Neo11 Ultra స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. 12GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారుగా రూ.48,250, 16GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారుగా రూ.53,925, మిడిల్‌ వేరియంట్ 12GB ర్యామ్‌తో పాటు 512GB స్టోరేజ్ ధర రూ.56,765ను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇక చివరి వేరియిట్ ధర 16GB ర్యామ్‌తో పాటు 512GB స్టోరేజ్ ధర రూ.62,440తో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు చైనాలో మార్కెట్‌లోకి లభిస్తోంది.

iQOO నియో11 అల్ట్రా ఫీచర్స్‌..
ఈ iQOO నియో11 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది 6.83-అంగుళాల 2K+ విజినోక్స్ F2 LTPS AMOLED డిస్‌ప్లే కలిగి ఉటుంది. అంతేకాకుండా దీని రిజల్యూషన్ 3200×1440 పిక్సెల్స్‌తో పాటు 20:9 యాస్పెక్ట్ రేషియో, HDR10+, 144Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింద. అలాగే ఇది 4500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.. ఇది ఆర్మ్ మాలి-G1 అల్ట్రా MC12 GPUతో కూడిన ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500M 3nm చిప్‌సెట్‌పై పని చేస్తుందని కంపెనీ తెలిపింది.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ OS 6.0 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది. ఈ ఫోన్ 9100mAh బ్యాటరీతో పాటు 100W అల్ట్రా-ఫాస్ట్ ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుందని కంపెనీ తెలిపింది. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

కెమెరా సెటప్‌కి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ నియో11 అల్ట్రాలో అద్భుతమైన OIS సపోర్ట్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు f/2.2 అపర్చర్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాను కలిగి ఉంటుంది.. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం.. 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది.. ఈ ఫోన్‌లో 3D అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉండడం విశేషం.. కనెక్టివిటీలో భాగంగా ఇందులో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, GPS, NFCతో పాటు USB టైప్-సి పోర్ట్ కూడా లభిస్తోంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement
Advertisement
Back to top