icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
501505
V SHIVA NAGARAJUV SHIVA NAGARAJUFollow3 Aug 2024, 03:15 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Madhuri Rathod: డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయికి మాధురి బిగ్‌ షాక్!

Hyderabad, Telangana:Dancer Madhuri rathod suicide attempt: ఫోక్ డ్యాన్సర్ ల మధ్య వివాహేతర సంబంధం వివాదం పీక్స్ కు వెళ్లింది. ఈశ్వర్ సాయి, మాధురీ రాథోడ్ లు వేముల వాడలో ఒక గదిలో ఈశ్వర్ సాయి భార్యకు అడ్డంగా దొరికిపోయారు. తొలుత తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్పిన ఈశ్వర్ సాయి ఆ తర్వాత మరల ఆమెతో ఒత్తిడిలో అలా చేశానని చెప్పాడు. మరల వీరిద్దరి మధ్య డబ్బుల లావాదేవీల వివాదం వెలుగులోకి వచ్చింది. ఇక మాధురీ రాథోడ్ మాత్రం తనను పెళ్లి పేరుతో మాయ మాటలు చెప్పి మోసం చేశాడని, డైవర్స్ తీసుకుంటానని చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడని చెప్పింది.
0
0
Report

AP NTR Bharosa Pension: భరోసా పెన్షన్లకు ముహూర్తం ఖరారు..కొత్త పింఛన్ల కోసం కొత్త దరఖాస్తు ఆ రోజు నుంచే?

Vijayawada, Andhra Pradesh:

AP New NTR Bharosa Pension: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన పింఛన్లను మంజూరు చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కొత్త దరఖాస్తులను స్వీకరించడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను అధికారికంగా పూర్తి చేసింది. సమాజంలోని నిరుపేదలు, వెనుకబడిన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ధ్యేయంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. దీని కింద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలతో పాటు గీత కార్మికులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు నూతన పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది.

ఈ నూతన పింఛన్ల దరఖాస్తు ప్రక్రియ, ఈ-కేవైసీ (eKYC) నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 07వ తేదీ నుండి అధికారికంగా ప్రారంభం కానుంది. అర్హులైన లబ్ధిదారులు తమకు అత్యంత సమీపంలో ఉన్న గ్రామ లేదా వార్డు సచివాలయానికి స్వయంగా వెళ్లి తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు సమర్పించే సమయంలో లబ్ధిదారులు తమ వెంట కొన్ని అత్యవసరమైన పత్రాలను తప్పనిసరిగా తీసుకువెళ్లాలి. 

ముఖ్యంగా దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు, రైస్ కార్డ్ లేదా ఆదాయ ధృవీకరణ పత్రాన్ని (ఇన్‌కమ్ సర్టిఫికేట్) తప్పనిసరిగా జతచేయాల్సి ఉంటుంది. వీటితో పాటు, ప్రత్యేక కేటగిరీల కింద దరఖాస్తు చేసుకునే వారు అదనపు పత్రాలను అందించాలి. వికలాంగులు తమ వైకల్యాన్ని ధృవీకరించే సదరమ్ (SADAREM) సర్టిఫికేట్‌ను, వితంతువులు తమ భర్త మరణ ధృవీకరణ పత్రాన్ని (డెత్ సర్టిఫికేట్) సంబంధిత పత్రాలుగా అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తుదారులు అందించిన పత్రాల ఆధారంగా, సచివాలయంలో అందుబాటులో ఉండే డిజిటల్ అసిస్టెంట్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆన్‌లైన్ సమర్పణ ప్రక్రియ పూర్తయిన వెంటనే, లబ్ధిదారునికి ఒక రసీదు లేదా అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌ను జారీ చేస్తారు. ఈ రసీదు దరఖాస్తు విజయవంతంగా నమోదైనదనడానికి ఒక ముఖ్యమైన నిదర్శనంగా ఉపయోగపడుతుంది.

దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాత, సంబంధిత ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి నేరుగా ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో దరఖాస్తుదారు సమర్పించిన వివరాలు, పత్రాలు పూర్తిగా నిజమైనవని నిర్ధారణ అయితే, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ నూతన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ప్రభుత్వం అధికారికంగా మంజూరు చేస్తుంది. పింఛన్ల పంపిణీ విధానంలో అత్యున్నత పారదర్శకతను పెంచడానికి, సమాజంలోని నిజమైన లబ్ధిదారులకు మాత్రమే పూర్తి లబ్ధి చేకూర్చడానికి ఈ ప్రక్రియంతటినీ సచివాలయాల ద్వారా అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్నారు.

Also Read: CM Chandrababu PRC DA: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సీఎం చంద్రబాబు వరాల జల్లు..పీఆర్సీ, డీఏల చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్!

Also Read: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు వరాల జల్లు..పీఆర్సీ, DA చెల్లింపునకు డేట్ ఫిక్స్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

AP PRC: ఏపీ ప్రభుత్వ వరాలపై ఉద్యోగ సంఘాల హర్షం.. నెరవేర్చకపోతే ఉద్యమం చేస్తాం

Nuzendla, Andhra Pradesh:

AP Govt Employees: 'ఉపాధ్యాయ సంఘాలు డీఏ, ఇతర సమస్యలపై అతి పెద్ద ఉద్యమం చేశారు. 10 వేల మంది ఉద్యోగులతో పెద్ద కార్యక్రమాలు చేశారు. పీఆర్సీపై ఏపీ జెఎసీకి ఉమ్మడిగా వెళ్లే బాధ్యత అప్పగించారు. జూలై 26వ తేదీలోపు చర్చలకు పిలవాలని నోటీసులు ఇచ్చాం. ఆ తర్వాత వివిధ కార్యక్రమాలు చేపట్టడంతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో సమావేశం పెట్టారు. ఆగష్టు 31వ తేదీలోపు ముఖ్యమంత్రి చర్చలకు పిలవకపోతే సెప్టెంబర్ మొదటి వారంలో కార్యాచరణ ఉంటుందని చెప్పాం' అని ఏపీ జేఏసీ చైర్మన్‌ విద్యాసాగర్‌ తెలిపారు.

'ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో సెప్టెంబర్ 5వ తేదీన ఉద్యమ శంఖారావం పూరిస్తామని చెప్పాం. 200కు పైగా ఉన్న సంఘాలు ఏపీ జెఎసీ ఉద్యమంలోకి దిగుతుందని ప్రకటించింది. సెప్టెంబర్ 5వ తేదీన చంద్రబాబుతో జరిగిన చర్చల్లో పలు హా మీలు ఇచ్చారు' అని జేఏసీ అధ్యక్షులు విద్యాసాగర్‌ వివరించారు. 'మా సమస్యలను సీఎం చంద్రబాబుకు వివరించగా.. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మా ఇబ్బందులు గుర్తించి సానుకూలంగా స్పందించారు' అని తెలిపారు.

'పీఆర్సీ కమిషన్ పెండింగ్‌లో ఉండగా.. కమిషనర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలలో.. రెండు డీఎలు ఒకే నెలలో ఇస్తామని చెప్పారు. సరెండర్ లీవ్‌లు ఒక ఇన్‌స్టాల్‌మెంట్ ఇస్తామని తెలిపారు. ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన డబ్బులు ఇవ్వాలని కోరాం' అని జేఏసీ చైర్మన్‌ విద్యాసాగర్‌ వివరించారు. 'పోలీసు సోదరులకు అదనంగా మరొక సరెండర్ లీవ్ సెప్టెంబర్ నుంచి డిక్లేర్ చేశారు. ఉద్యోగుల హెల్త్ కార్డు వ్యవస్థ సక్రమంగా పని చేయడం లేదు. ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులపై ముఖ్యమంత్రికి పరిస్థితిని వివరించాం' అని వెల్లడించారు.

'ఏడెనిమిది సంవత్సరాలుగా హెల్త్ కార్డులు పని చేయని పరిస్థితి. మా నుంచి డబ్బులు కట్టించుకుంటున్న ప్రభుత్వం నెలకు రూ.36 కోట్లు జమ చేయడం లేదు. ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకపోవడంతో నగదు రహిత  వైద్యానికి ముందుకు రావడం లేదు. మా జీతాల్లో నుంచి డబ్బులు తీసుకుంటున్న సమయంలోనే.. ప్రభుత్వం కూడా ట్రస్ట్ కు డబ్బులు ఇవ్వాలని  కోరాం' అని జేఏసీ అధ్యక్షులు విద్యాసాగర్‌ తెలిపారు.

'వచ్చే నెల నుంచి హెల్త్ ట్రస్టుకు డబ్బులు ఇస్తే.. మూడు నెలల్లో అందరికీ వైద్య సేవలు అందుతాయి. మా ముందే నగదు బదిఈ చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 2017లోనే పదిశాతం ఇచ్చారు' అని జేఏసీ చైర్మన్‌ విద్యాసాగర్‌ వివరించారు. 'నేడు నాలుగు లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. అడిషనల్ క్వాంటమ్‌ ఆఫ్ పెన్షన్ పదిశాతం ఇవ్వాలని కోరాం' అని తెలిపారు.

'జనవరి 1 నుంచి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇంటీరియమ్ రిలీఫ్ గురించి సీఎంగారిని కోరగా సానుకూలంగా స్పందించారు. 11 పీఆర్సీలు ఇప్పటివరకు వేయగా.. ఎప్పుడైనా ఇంటీరియమ్ రిలీఫ్ జరిగిందా అని అడిగారు. దీనికి కూడా ఒక షెడ్యూల్ పెట్టుకుని తప్పకుండా చేస్తామని చెప్పారు' అని జేఏసీ అధ్యక్షులు విద్యాసాగర్‌ తెలిపారు. కాంట్రాక్టు , అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై చర్చించినట్లు కూడా చెప్పారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పదవీ విరమణ 62 ఏళ్లకు పెంచాలని కోరినట్లు.. ఉద్యోగులకు అండగా నిలిచామని ప్రకటించారు.

'ప్రభుత్వం ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకుంటే మాత్రం వెనుకాడేది లేదు. ఉద్యమానికి సిద్దమయ్యే పరిస్థితి వచ్చినా ఏపీ జేఏసీ సిద్దంగా ఉంటుంది. 90 శాతం వ్యవస్థ ఉన్న ఏపీ జేఏసీ మొదటి నుంచి చర్చల ద్వారా పరిష్కరిద్దాం అని చెప్పాం. కాదంటే ఉద్యమం తప్పదని హెచ్చరించాం.. కార్యాచరణ ప్రకటించాం' అని జేఏసీ అధ్యక్షులు విద్యాసాగర్‌ వివరించారు. ఉద్యోగులు పెట్టుకున్న నమ్మకాలను సాకారం చేశారని అన్ని జిల్లాల నుంచి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

0
0
Report

DSC Scam: మెగా డీఎస్సీ అక్రమాలపై నారా లోకేశ్‌ రాజీనామా చేయాలి: ఆర్‌కే రోజా

Tirupati, Andhra Pradesh:

Nara Lokesh Resign: డీఎస్సీ అక్రమాలపై ధైర్యముంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని నారా లోకేశ్‌‌కు మాజీ మంత్రి ఆర్‌కే రోజా సవాల్ విసిరారు. నకిలీ సర్టిఫికెట్లు, సంతకాల వ్యవహారాన్ని ఆధారాలతో సహా బయటపెడతామని ప్రకటించారు. పీటీ టీచర్‌ పోస్టులే కాకుండా సైన్స్‌, సోషల్‌ పోస్టులను కూడా అమ్ముకున్నారని విమర్శించారు. అనర్హులకు ఉద్యోగాలు ఇవ్వడంతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో కూరుకుపోయిందని విమర్శించారు. లోకేష్‌ రాజీనామా చేసే వరకు డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్‌ విద్యా వ్యవస్థను తీవ్రంగా భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి ఆర్‌కే రోజా విమర్శించారు. డీఎస్సీ, టెట్‌ పరీక్షలను సక్రమంగా నిర్వహించకుండా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. 'స్పోర్ట్స్‌ కోటాలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలను అమ్ముకున్నారు. అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పోస్టులను అమ్ముకుని దోచుకున్నారు' అని మాజీ మంత్రి ఆర్‌కే రోజా తీవ్ర ఆరోపణలు చేశారు.

'వెలుగొండ ప్రాజెక్టుపై చంద్రబాబు మరోసారి క్రెడిట్‌ దొంగతనానికి పాల్పడ్డాడు. 1996లో వెలుగొండ ప్రాజెక్టుకు పునాది వేసి.. 1999లో అదే ప్రాజెక్టును వేస్ట్‌ అని చెప్పింది చంద్రబాబు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే వెలుగొండ ప్రాజెక్టు పనులు 85 శాతం పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి' వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకురాలు ఆర్‌కే రోజా తెలిపారు.

'కరువు, చంద్రబాబు కవల పిల్లలు అని మా నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడో చెప్పారు. రాష్ట్రంలో 420 మండలాలు కరువు మండలాలుగా మారడానికి చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యమే కారణం. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించి కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలి' అని మాజీ మంత్రి ఆర్‌కే రోజా పిలుపునిచ్చారు. వైఎస్‌ జగన్‌కు అండగా నిలిచి 2029లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

0
0
Report

Harish Rao: రేవంత్‌ రెడ్డికి హరీశ్‌ రావు సవాల్‌.. దమ్ముంటే అసెంబ్లీ నెల రోజులు నడపాలి

Erravalli, Telangana:

BRSLP Meeting: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ రాజీనామా కోరుతున్న రేవంత్‌ రెడ్డి ముందు అతడు రాజీనామా చేయాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి ఆరు గ్యారెంటీలు, రుణమాఫీ ఎగ్గొట్టినందుకు ముందు రాజీనామా చేయాల్సింది రేవంత్ రెడ్డే అని స్పష్టం చేశారు. 'నాడు ఎన్టీఆర్, జయలలిత, చంద్రబాబు లాంటి నాయకులను సభలో అవమానిస్తే.. వారు అసెంబ్లీని బహిష్కరించి ప్రజాక్షేత్రంలో గెలిచి మళ్లీ ముఖ్యమంత్రులుగా అడుగుపెట్టారు. కేసీఆర్‌ కూడా అదే బాటలో ఉన్నారు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు వివరించారు. దమ్ముంటే అసెంబ్లీని నెల రోజులు నడపాలని ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డికి సవాల్‌ చేశారు.

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై గులాబీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ భేటీ అనంతరం మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కీలక విషయాలు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై, రేవంత్ రెడ్డి తీరుపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసే అంశాలను, పార్టీ భవిష్యత్ కార్యాచరణను వివరించారు.

'కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తవుతున్నా అన్ని వర్గాల ప్రజలకు తీరని ద్రోహమే జరిగింది. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, దళిత, గిరిజన, బీసీ వర్గాలను ఈ ప్రభుత్వం నిలువునా మోసం చేసింది. ప్రజా సమస్యల మీద సమగ్రంగా చర్చించడానికి కనీసం నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నడపాలని బీఏసీ సమావేశంలో బీఆర్ఎస్ పక్షాన గట్టిగా డిమాండ్ చేయాలని నిర్ణయించాం' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు వెల్లడించారు.

'కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద నీళ్లున్నా కావాలనే ఎత్తిపోతలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఏడిపిస్తోంది. కేసీఆర్ 80 శాతం పూర్తి చేసిన పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో చిన్న పని పూర్తి చేస్తే 60 టీఎంసీల నీళ్లు వస్తాయి. కానీ ప్రభుత్వం కక్షపూరితంగా దాన్ని గాలికొదిలేసింది' అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గుర్తుచేశారు. ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రాబోయే రోజుల్లో కేసీఆర్ స్వయంగా లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమానికి నాయకత్వం వహిస్తారని ప్రకటించారు. ఈ విషయమై సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

'22A కింద వ్యవసాయ భూములను నిషేధిత జాబితాలో పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్న తీరుపై, కరెంట్ కోతలు, రుణమాఫీ వైఫల్యం, పాలిటెక్నిక్ జీవో 97 రద్దు, సింగరేణి కుంభకోణాలు, పీఆర్సీ, డీఏలు, ఈహెచ్ఎస్ ఫెయిల్యూర్ వంటి అన్ని అంశాలపైనా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు. రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో వారి భవిష్యత్తు అంధకారమవుతుండడంతో.. విద్యార్థుల పక్షాన అవసరమైతే సభను స్తంభింపజేసి న్యాయం జరిగేదాకా కొట్లాడుతామని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు వీలైనన్నీ ఎక్కువ రోజులు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారని హరీశ్ రావు తెలిపారు.

0
0
Report
Advertisement

Pollachi KTM Bike Gift: ప్రియుడికి KTM బైక్ గిఫ్ట్ కోసం సొంత ఇంట్లోనే దొంగతనం.. 19 ఏళ్ల కాలేజీ యువతి అరెస్ట్!

Pollachi, Tamil Nadu:

Pollachi KTM Bike Gift News: తమిళనాడు రాష్ట్రంలోని పొల్లాచి ప్రాంతంలో జరిగిన ఈ విచిత్రమైన ఘటన ప్రస్తుతం స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాలేజీలో చదువుతున్న ఒక 19 ఏళ్ల యువతి ఒక యువకుడితో ప్రేమలో పడింది. ఆ ప్రియుడికి ఖరీదైన కేటీఎం (KTM) స్పోర్ట్స్ బైక్ నడపాలనే మోజు, కోరిక బలంగా ఉంది. ప్రియుడిపై ఉన్న అమితమైన ప్రేమతో, అతని బైక్ కోరికను తీర్చడం కోసం ఆమె ఎలాగైనా ఆ బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే, అంత ఖరీదైన స్పోర్ట్స్ బైక్ కొనడానికి ఆమె వద్ద తగినంత డబ్బు లేదు.

ఈ నేపథ్యంలో, ఆమె కన్ను తన సొంత ఇంట్లోని బంగారంపై పడింది. సాధారణంగా కుటుంబ సభ్యులు ఇంట్లో భద్రంగా దాచుకునే బంగారు ఆభరణాలను దొంగిలించాలని నిర్ణయించుకుంది. కుటుంబ సభ్యులకు ఎటువంటి అనుమానం రాకుండా, వారి కళ్ళు గప్పి ఇంట్లో ఉన్న సుమారు 72 గ్రాముల బంగారు ఆభరణాలను తీసుకువెళ్లింది. అనంతరం ఆ ఆభరణాలను విక్రయించి, వచ్చిన డబ్బుతో తన ప్రియుడు ఎంతో ఆశపడిన కేటీఎం బైక్‌ను కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చింది.

కొన్ని రోజుల తర్వాత, ఇంట్లో భద్రంగా ఉంచిన లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు అకస్మాత్తుగా కనిపించకపోవడాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. ఆభరణాలు ఇంట్లోనే ఉన్నప్పటికీ ఎంత వెతికినా దొరక్కపోవడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు చేసేదేమీ లేక స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, ఇంటి పరిసరాలను పరిశీలించి కుటుంబ సభ్యులందరినీ విచారించారు.

ఈ దర్యాప్తు సమయంలో యువతి మాటలు, ప్రవర్తనపై పోలీసులకు బలమైన అనుమానం వచ్చింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడికి కేటీఎం బైక్ గిఫ్ట్ ఇవ్వడానికే ఇంట్లో బంగారం దొంగిలించి అమ్మినట్లు ఆమె స్వయంగా ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలు శిక్ష విధించారు. 

తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మును సొంత కూతురే దొంగిలించడంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కాగా, ఈ దొంగతనం విషయం బయటపడటంతో బైక్‌ను తీసుకున్న ఆమె ప్రియుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ కేసులో అతని పాత్రను నిర్ధారించడానికి, దొంగిలించబడిన నగలు, బైక్‌ను స్వాధీనం చేసుకోవడానికి పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Also Read: వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.1,000 ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ ఉచితం..ఈ పని చేస్తే చాలు

Also REad: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధరలు..ఈరోజు రేట్స్ ఎలా ఉన్నాయంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ సీజన్ 10 గ్రాండ్ లాంచ్ ప్రోమో వచ్చేసింది.. ఊహించని సర్‌ప్రైజ్‌లతో 16 మంది కంటెస్టెంట్లు!

Hyderabad, Telangana:

Bigg Boss 10 Telugu Promo: తెలుగు బుల్లితెర వీక్షకులకు 'బిగ్‌బాస్' రియాలిటీ షో అంటే ఎనలేని క్రేజ్, విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే విజయవంతంగా 9 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ భారీ షో, నేడు (సెప్టెంబర్ 6) సాయంత్రం 7 గంటల నుండి 'స్టార్ మా' ఛానల్, 'జియో హాట్ స్టార్' ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో గ్రాండ్‌గా ప్రసారం కానుంది. ఈ మేరకు నిర్వాహకులు విడుదల చేసిన గ్రాండ్ లాంచింగ్ ఎపిసోడ్ ప్రోమో ప్రేక్షకులలో అంచనాలను అకాశానికి చేర్చింది.

ఈ సారి ఆట మరింత రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది. "ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్" అంటూ ఇప్పటికే విడుదలైన ప్రోమోలు సీజన్ 10పై విపరీతమైన ఆసక్తిని, ఉత్కంఠను పెంచాయి. పదో సీజన్ ప్రత్యేకతకు అనుగుణంగా నిర్వాహకులు "దశావతారం" అనే సరికొత్త సర్‌ప్రైజ్ కాన్సెప్ట్‌ను ప్లాన్ చేశారని సమాచారం. 

అంతేకాకుండా, ఈసారి తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకే రోజే షో ప్రారంభం కానుండటం బుల్లితెర చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డు అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇతర భాషల బిగ్‌బాస్ హోస్టులైన విజయ్ సేతుపతి, మోహన్ లాల్, కిచ్చా సుదీప్ ముగ్గురూ కలిసి తెలుగు బిగ్‌బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జునతో వర్చువల్ పద్ధతిలో భేటీ కావడం ప్రేక్షకులలో మరింత జోష్ నింపింది.

ఈ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌కు పలువురు సినీ తారలు విచ్చేసి అలరించనున్నారు. వారిలో 'సర్దార్ 2' సినిమా ప్రమోషన్స్ కోసం తమిళ స్టార్ హీరో కార్తీ రానుండగా, తమ సరికొత్త 'ఎపిక్' సినిమా ప్రమోషన్లలో భాగంగా టాలీవుడ్ యువ హీరో ఆనంద్ దేవరకొండ, అందాల హీరోయిన్ వైష్ణవి చైతన్య స్టేజ్‌పై సందడి చేయబోతున్నారు

మరోవైపు, హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్ల వివరాల గురించి నెట్టింట భారీగా చర్చ సాగుతోంది. ఈసారి తొలి రోజే మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి వెళ్తున్నట్లు సమాచారం. వీరిలో సామాన్యుల కోటా నుండి ఆరుగురు, సెలెబ్రెటీ కోటా నుండి పది మంది ఉన్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సెలెబ్రెటీల జాబితా ప్రకారం.. 
1) ఆటో రాంప్రసాద్ 
2) టెంపర్ వంశీ 
3) దేబ్జానీ మోదక్ 
4) యాంకర్ వర్షిణి 
5) ముఖేష్ గౌడ 
6) చైత్రా రాయ్ 
7) నటుడు కృష్ణుడు 
8) జబర్దస్త్ నరేశ్ 
9) పాడ్‌కాస్ట్ యాంకర్ సుధీర్ రెడ్డి తదితరులు ఉన్నట్టు సమచారం.

ఇక 'అగ్నిపరీక్ష' మార్గం ద్వారా హౌస్‌లోకి వెళ్లే ఆరుగురు సామాన్యులలో రైతు బిడ్డ ఝాన్సీ (ఈమె ఎంట్రీని ప్రోమోలోనే చూపించారు). రోహిత్ నాయుడు, శ్రష్టి, చరణ్, అమన్ మసూద్, షాలిని పటేల్ ఉండబోతున్నట్లు సమాచారం. మరి ఈ సరికొత్త కాన్సెప్ట్, అదిరిపోయే సర్‌ప్రైజ్‌లతో రాబోతున్న ఈ సీజన్ 10 ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Also Read: బిగ్‌బాస్ ఆఫర్ తిరస్కరించిన సెలబ్రిటీలు వీళ్లే.. లక్షల్లో రెమ్యునరేషన్ ఇచ్చినా 'నో'

Also REad: నాని పారడైజ్ సినిమా రిలీజ్‌కు మళ్లీ బ్రేక్.. మరోసారి సినిమా విడుదలపై సస్పెన్స్?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Employees Protest: విశాఖలో ఒక్కసారిగా ఉద్రిక్తత.. రోడ్డుపై సచివాలయ ఉద్యోగుల ధర్నా

Visakhapatnam, Andhra Pradesh:

Sachivalaya Employees Protest: తమ పరిష్కారంపై తీవ్ర నిర్లక్ష్యం.. తమ డిమాండ్లపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుండడంతో ఏపీ సచివాలయ ఉద్యోగులు ఒక్కసారిగా ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలు, వేతన సవరణ సంఘం ప్రకటించగా తమ సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించలేదు. దీంతో ఆకస్మికంగా ఉద్యోగులు నిరసనకు దిగారు. విశాఖపట్టణంలో సచివాలయ ఉద్యోగుల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

సచివాలయ ఉద్యోగుల నిరసనల హోరుతో ఆదివారం విశాఖ మహా నగరం అట్టుడికిపోయింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి విశాఖ జిల్లాల ఉద్యోగులు రోడ్డెక్కారు. వారి ఆందోళనతో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గత మూడ్రోజులుగా శాంతియుతంగా చేపట్టిన ఆందోళన ఆదివారం పతాకస్థాయికి చేరుకుంది. వార్డు, గ్రామ, సచివాలయ ఉద్యోగుల నిరసనతో ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ జోన్-1 పరిధిలోని వందలాది మంది సచివాలయ ఉద్యోగులు రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారు. సమాచారం అందుకున్న ఈస్ట్ ఏసీపీ కె. లక్ష్మణమూర్తి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారుల్ని అదుపు చేయడానికి ప్రయత్నించారు. నిరసనకారులు రోడ్డుపై బైఠాయించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులు కూడా ప్రత్యామ్నాయ దారుల్లో ప్రయాణించాయి. 

వెట్టిచాకిరీ కాదు.. మాది అర్హతతో సాధించిన ఉద్యోగం
'నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజల ముంగిటకు చేర్చేది మేమే. కానీ మేం మాత్రం నడిరోడ్డుపై ఎండనక, వాననక కూర్చోవాల్సిన దుస్థితి. ప్రభుత్వ వ్యవస్థలో అత్యంత కీలకమైన ఉద్యోగుల్ని ఈ విధంగా నిరాదరణకు గురిచేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. ఇప్పటికైనా మా సమస్యలపై దృష్టి సారించి న్యాయం చేయాలి'అని బాధితులు నినదించారు.

కలల కొలువు.. నేడు రోడ్డున పడ్డ బతుకు
'ఎన్నో ఏళ్లు నిద్రాహారాలు మాని, పుస్తకాలతో కుస్తీ పట్టి, కష్టపడి సాధించుకున్న ప్రభుత్వ ఉద్యోగం మాది. ఇంట్లో వృద్ధులైన తల్లిదండ్రులు, భార్యాపిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆశపడితే... చివరకు మిగిలింది ఈ నిరసనల రోడ్డు మాత్రమేనా? ఉన్నత చదువులు చదివి, ఉత్తమ అర్హతలతో ప్రజలకు సేవ చేస్తున్న గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు కనీస గౌరవం, భద్రత కరువవ్వడం అత్యంత బాధాకరం. మా శ్రమకు గుర్తింపు, మా హక్కులకు న్యాయం ఎప్పుడు దక్కుతుంది?' అంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.

0
0
Report
Advertisement

Kavitha: రేవంత్ రెడ్డి ఓటమి లక్ష్యంగా కవిత.. 24న కొడంగల్ లో పాంచజన్య సభ

Baddipadaga, Telangana:

Kavitha Targets Kodangal: సొంత బీఆర్ఎస్ పార్టీతోపాటు కాంగ్రెస్ పార్టీపై కూడా మాజీ ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి లక్ష్యంగా కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొడంగల్‌లో రేవంత్‌ రెడ్డిని ఓడించాలనే లక్ష్యంతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. తన పార్టీ నిర్ణయించిన పాంచజన్యం వివరించేందుకు వరుసగా సంకల్ప సభలు నిర్వహిస్తుండగా.. ఈసారి కొడంగల్‌లో నిర్వహించనున్నారు.

రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత దృష్టి సారించారు. ఈనెల 23వ తేదీన కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కోస్గి సభ పోస్టర్‌ను ఆదివారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో కవిత ఆవిష్కరించారు. కోస్గి సభను విజయవంతం చేయాలని ప్రజలను పిలుపునిచ్చారు. 

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి హాఫ్ గ్యారంటీ కూడా అమలు చేయడం లేదని ఆరోపించారు. బూటకపు హామీలు.. బోగస్ మాటల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై కొడంగల్ కేంద్రంగా పాంచజన్య శంఖారావం పూరిస్తున్నామని ప్రకటించారు. 'రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన పార్టీని గెలిపిస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడంతో పాటు తమ పాంచజన్యంలోని ప్రతి హామీని వంద శాతం నెరవేర్చి తీరుతాం' అని కవిత హామీ ఇచ్చారు. యువత, మహిళలు, సబ్బండ వర్గాల వికాసం, సాధికారత కలిగిన బహుజన తెలంగాణాను సాకారం చేయడమే తమ లక్ష్యమని కవిత ప్రకటించారు.

ఎన్నికలకు ముందు తెలంగాణ ఉద్యమకారుల కాళ్లు పట్టుకున్నంత పనిచేసి.. అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఉద్యమకారులకు న్యాయం జరగలేదు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి' అని ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు. 'బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారే సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అత్యంత బాధాకరం' అని కవిత తెలిపారు.

0
0
Report

Keyaa Banerji AI: భారత వెయిట్‌లిఫ్టర్ కీయా బెనర్జీకి చేదు అనుభవం.. నగ్న ఫొటోలుగా మార్ఫింగ్ వైరల్!

Hyderabad, Telangana:

Keyaa Banerji AI Images: పవర్‌లిఫ్టింగ్ రంగంలో తన అద్భుత ప్రదర్శనతో భారతదేశానికి కీర్తి తెచ్చిన 21 ఏళ్ల యువ అథ్లెట్ కీయా కునాల్ బెనర్జీ, ప్రస్తుతం ఒక దురదృష్టకరమైన ఆన్‌లైన్ వివాదాన్ని ఎదుర్కొంటోంది. దక్షిణాఫ్రికాలోని సన్ సిటీలో జరిగిన '2026 ఐపీఎఫ్ వరల్డ్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌ల'లో జూనియర్ మహిళల 47 కేజీల విభాగంలో ఆమె రజత పతకాన్ని సాధించింది. పోటీ సమయానికి కేవలం 45.70 కేజీల బరువున్న కీయా, తన శరీర బరువుకు మూడు రెట్ల కంటే ఎక్కువ బరువైన 140 కేజీల డెడ్‌లిఫ్ట్‌ను ఎత్తి సంచలనం సృష్టించింది. 

ఈ టోర్నమెంట్‌లో ఫ్రాన్స్‌కు చెందిన ఇనెస్ హెర్బాక్స్ 165 కేజీలతో స్వర్ణం సాధించగా, ఐర్లాండ్‌కు చెందిన బ్లాత్‌నైడ్ ఓ'డ్వైర్ కూడా 140 కేజీలు ఎత్తారు. అయితే, నియమాల ప్రకారం ఓ'డ్వైర్‌ను అధిగమించి కీయా రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఆమె స్క్వాట్‌లో 90 కేజీలు, బెంచ్ ప్రెస్‌లో 50 కేజీలతో కలిపి మొత్తం 280 కేజీల బరువును ఎత్తి ఐదో స్థానంలో నిలిచారు.

దేశీయంగా ఎదుగుదల..
జాతీయ స్థాయిలో కూడా కీయా నిరంతర పురోగతిని కనబరిచారు. 2025 జాతీయ ఛాంపియన్‌షిప్‌లో ఆమె 257.5 కేజీల బరువును నమోదు చేయగా, 2026 నాటికి స్క్వాట్‌లో 95 కేజీలు, బెంచ్ ప్రెస్‌లో 52.5 కేజీలు, డెడ్‌లిఫ్ట్‌లో 140 కేజీలతో మొత్తం 287.5 కేజీల అత్యుత్తమ బరువును ఎత్తి తన ప్రదర్శనను గణనీయంగా మెరుగుపరుచుకున్నారు.

ఆన్‌లైన్ వేధింపుల చీకటి కోణం.. 
ఈ అంతర్జాతీయ విజయం తెచ్చిన కీర్తి కీయాకు ఆనందాన్ని ఇవ్వాల్సింది పోయి నరకాన్ని చూపించింది. రజతం గెలిచిన వెంటనే ఆమె పేరుతో నకిలీ ఖాతాలు వెలిశాయి. అంతేకాకుండా, ఆమె ముఖాన్ని, శరీరాన్ని చాలా అసభ్యకరమైన రీతిలో మార్ఫింగ్ చేసిన వేలాది నకిలీ ఏఐ (AI) చిత్రాలను సృష్టించి వైరల్ చేశారు. దీనితో పాటు సోషల్ మీడియాలో లైంగిక వేధింపులు, జాతి, కుల పరమైన అనుచిత వ్యాఖ్యలు ఆమెను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశాయి.

గతంలో కేవలం 300 మంది ఫాలోవర్లతో ప్రైవేట్ ఖాతాలో నిశ్శబ్దంగా ఉండే కీయా, ఇన్‌స్టాగ్రామ్ తన ఖాతాను సస్పెండ్ చేయడంతో కొత్త పబ్లిక్ ఖాతాను సృష్టించాల్సి వచ్చింది. తన ఆవేదనను వ్యక్తపరుస్తూ.. "పవర్‌లిఫ్టింగ్ అనేది నన్ను నేను సవాలు చేసుకోవడానికి మాత్రమే తప్ప సోషల్ మీడియా ప్రచారం కోసం కాదు. నాకు ఈ వైరల్ కీర్తి, ఫాలోవర్ల సంఖ్య వద్దు. నా అనుమతి లేకుండా ఏఐ చిత్రాలను సృష్టించడం దారుణం. డెడ్‌లిఫ్ట్ ఇష్టపడే ఒక సాధారణ అమ్మాయిగా బతికే ప్రశాంతమైన స్థలం మాత్రమే నాకు కావాలి" అని కీయా పేర్కొన్నారు. ఈ సంఘటన మహిళా అథ్లెట్లకు డిజిటల్ భద్రత ఎంత అవసరమో మరొక్కసారి చాటిచెప్పింది.

Also Read: India Vs Japan: జపాన్‌తో టీమ్ఇండియా ద్వైపాక్షిక టీ20 సిరీస్..భారత్‌కు ఇన్ని లాభాలా?

Also Read: రేపే భారత్ Vs పాకిస్థాన్ మధ్య పోరు..ఆసియా కప్‌ 2026లో దుబాయ్‌లో హై-వోల్టేజ్ మ్యాచ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Indonesia Volcano: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం.. 209 విమానాలపై ప్రభావం, ప్రయాణికులకు తీవ్ర అంతరాయం

Central Kalimantan:

Indonesia Volcano Eruption: జావా, సుమత్రా ద్వీపాల మధ్య ఉన్న సుండా జలసంధిలో ఈ అనాక్ క్రాకటోవా అగ్నిపర్వతం ఉంది. ఆదివారం తెల్లవారుజామున సుమారు 3:53 గంటల సమయంలో దాదాపు 30 సెకన్ల పాటు ఈ విస్ఫోటనం జరిగింది. ఈ ఘోర విస్ఫోటనం కారణంగా అగ్నిపర్వతం నుండి రెండు భారీ బూడిద మేఘాలు ఏర్పడి గగనతలాన్ని కమ్మేశాయని స్థానిక అధికారులు వెల్లడించారు. అనంతరం ఏర్పడిన మొదటి బూడిద మేఘం సుమారు 20 వేల అడుగుల ఎత్తుకు చేరుకుని ఈశాన్య దిశగా కదిలింది. 

దీనివల్ల జకార్తా, బాంటెన్, పశ్చిమ జావా ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇక రెండో బూడిద మేఘం ఏకంగా 50 వేల అడుగుల అసాధారణ ఎత్తుకు చేరుకుంది. ఇది పశ్చిమ, వాయవ్య దిశగా వ్యాపిస్తూ బాంటెన్, లాంపంగ్, బెంగ్‌కులు ప్రాంతాలతో పాటు దక్షిణ సుండా జలసంధి, పశ్చిమ సుమత్రాలోని హిందూ మహాసముద్ర పరిసరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.

ఈ భారీ బూడిద వ్యాప్తి కారణంగా విమాన ప్రయాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లింది. దీంతో సుకర్ణో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో మొదట ఉదయం 5:30 గంటల వరకు విమాన రాకపోకలను నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆ ఆంక్షలను ఉదయం 9:30 గంటల వరకు పొడిగించారు. దీనివల్ల రాత్రి సమయంలో విమానాశ్రయంలో పార్క్ చేసిన 170 విమానాలు అక్కడే నిలిచిపోయాయి.

దీని ప్రభావం వల్ల జకార్తాలోని సుకర్ణో–హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొత్తం 209 విమాన సర్వీసులు ప్రభావితమవగా, సుమారు 22,800 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

నిరాశ చెందిన పలువురు ప్రయాణికులు తమ టికెట్ డబ్బులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు, అప్పటికే చెక్-ఇన్ చేసిన తమ సామాన్లను కూడా వెనక్కి తీసుకున్నారు. ముఖ్యంగా సింగపూర్‌కు వెళ్లే అంతర్జాతీయ విమానాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. వీటితో పాటు హాంకాంగ్, సిడ్నీ, ఆమ్‌స్టర్‌డామ్, సియోల్, దోహా, కౌలాలంపూర్ నగరాలకు వెళ్లే విమానాలు రద్దు కావడం, ఆలస్యం కావడం లేదా రీషెడ్యూల్ చేయడం జరిగింది. దేశీయంగా కూడా లాంపంగ్, బాలి, సురబయ, మకాసర్ ప్రాంతాలకు వెళ్లే కొన్ని విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది

ప్రస్తుతానికి ఈ అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించినట్లు సమాచారం అందలేదు. అలాగే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఉత్తర్వులు కూడా జారీ కాలేదు. కానీ, అగ్నిపర్వత క్రియాశీల క్రేటర్‌కు కనీసం 3 కిలోమీటర్ల దూరంలో ఉండాలని ప్రజలను, పర్యాటకులను అధికారులు హెచ్చరించారు. బూడిద పడే ప్రాంతాల వారు మాస్కులు ధరించాలని, కళ్లకు రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి వనరులను మూసి ఉంచాలని సూచించారు.

గతంలో 2018లో ఇదే అనాక్ క్రాకటోవా అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల సంభవించిన భయంకరమైన సునామీ కారణంగా దాదాపు 430 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ చేదు జ్ఞాపకాల దృష్ట్యా ప్రస్తుతం అధికారులు తీవ్ర అప్రమత్తతతో బూడిద వ్యాప్తిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Also Read: 5,000 మంది అమెరికా సైనికుల రాకతో సెక్స్ వర్కర్లపై దాడులు..థాయ్‌లాండ్‌ పోలీసులకు షాక్

Also Read: "భారత్, చైనా, అమెరికా వల్లనే వరదలు వచ్చాయి": నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Jio యూజర్లకు భారీ గుడ్‌న్యూస్.. ఈ రీఛార్జ్‌పై 365 రోజులు 120GB బోనస్ డేటా, Hotstar ఫ్రీ!

Hyderabad, Telangana:

Jio Mega Anniversary Offer: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన వార్షికోత్సవం సందర్భంగా తమ కస్టమర్స్ కి భారీ కానుకను అందించేందుకు సిద్ధమైంది. దీర్ఘకాలిక వ్యాలిడిటీ తో పాటు పూర్తి వినోదాన్ని కోరుకునే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా మెగా యానివర్సరీ ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీ కి చెందిన పాపులర్ రూ.3,599 ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ పై అదనపు డేటా తో పాటు ప్రత్యేకమైన ఉచిత OTT సబ్ స్క్రిప్షన్లో, క్లౌడ్ స్టోరేజీ వంటి అద్భుతమైన ప్రయోజనాలతో వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. 

ఈ వన్ ఇయర్ ప్లాన్ కు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకునే వారికి 365 రోజుల పాటు వ్యాలిడిటీ లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఏ నెట్వర్క్ కైనా అన్లిమిటెడ్ ఉచిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఉచిత SMS పొందే సదుపాయాన్ని అందిస్తోంది. అంతేకాకుండా రోజుకు 2.5 హై స్పీడ్ ఫోర్ జి డేటా తో పాటు అర్హత కలిగిన వినియోగదారులకు అన్లిమిటెడ్ ఫైవ్ జి డేటా కూడా ఉచితంగా అందిస్తోంది..

యానివర్సరీ స్పెషల్ బెనిఫిట్స్ ఇవే..
యానివర్సరీ సందర్భంగా జియో ఈ 365 రోజుల ప్లాన్ను రీఛార్జ్ చేసుకునే వారికి.. 12 నెలల పాటు నెలకు 10 జీబీల చొప్పున మొత్తం 120 జీబీల వరకు అదనపు హై స్పీడ్ బోనస్ డేటాను కూడా అందిస్తోంది. అంతేకాకుండా జియో హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ తో పాటు భారీగా బాలీవుడ్ కంటెంట్ కేటలాగ్‌ను ఉచితంగా వీక్షించేలా ప్రత్యేకమైన సదుపాయాన్ని అందిస్తోంది. అలాగే వినియోగదారులకు మొత్తం 12 జియో టీవీ ప్రో ఓచర్లను అందించడం విశేషం. వీటి ద్వారా జియో టీవీలో దాదాపు 1000కి పైగా ప్రముఖ లైవ్ టీవీ చానళ్లను ఏడాది పాటు ఎంజాయ్ చేయవచ్చు. వినియోగదారుల పర్సనల్ ఫైల్స్ కోసం.. అలాగే ఫోటోలు, సెక్యూరిటీ కోసం 50 gb జియో AI క్లౌడ్ స్టోరేజ్‌ను కూడా అందిస్తోంది. దీంతోపాటు ప్రత్యేకమైన ఏఐ టూల్స్ యాక్సిస్ ను కూడా వినియోగదారులకు అందించడం విశేషం..

Also Read: Flipkart బంపర్ ఆఫర్.. సగం ధరకే Realme 43-ఇంచ్ 4K QLED స్మార్ట్ టీవీ!

ప్రత్యేకమైన షాపింగ్ తో పాటు ట్రావెల్ డిస్కౌంట్ వోచర్లు..
రీఛార్జ్ చేసుకున్న ప్రతి యూజర్ కి EaseMyTrip ద్వారా ఫ్లైట్‌ బుకింగ్‌తో పాటు హోటల్ బుకింగ్స్ పై దాదాపు రెండువేల వరకు అద్భుతమైన డిస్కౌంట్ స్పెషల్ ఓచర్స్ అందిస్తోంది. అంతేకాకుండా జియో ఆన్లైన్ షాపింగ్ పై 2500 వరకు డిస్కౌంట్ వోచర్.. సినిమా ప్రియుల కోసం సినీ పోలీస్ మూవీ టికెట్లపై 150 వరకు ప్రత్యేకమైన తగ్గింపుతో కూడిన వోచర్లు అందించేందుకు సిద్ధమైంది.. ఈ యానివర్సరీ ప్రత్యేకమైన ఆఫర్ ద్వారా రీఛార్జ్ చేసుకోవాలనుకునే వారు నేరుగా మై జియో యాప్ లోకి వెళ్లి.. ప్లాన్ సెలెక్ట్ చేసుకుని రీఛార్జ్ చేసుకోవచ్చు..

Also Read: Flipkart బంపర్ ఆఫర్.. సగం ధరకే Realme 43-ఇంచ్ 4K QLED స్మార్ట్ టీవీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

..Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Hotel Room Rates: ఢిల్లీలో NO ROOMS బోర్డులు.. రూ. 14 లక్షలకు చేరిన హోటల్ రూమ్స్‌ అద్దె!

Hyderabad, Telangana:

Delhi Hotel Room Rates: దేశ రాజధాని ఢిల్లీలో లగ్జరీ హోటల్స్ గదుల అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సాధారణ రోజుల్లో కేవలం లక్ష రూపాయల వరకు ఉండే లగ్జరీ సూట్ ధరలు ఏకంగా రాత్రికి రాత్రే రూ.14 లక్షలకు పైగా చేరడం విశేషం. త్వరలో జరగబోతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026 నేపథ్యంలో ప్రపంచ దేశాల అధినేతలతో పాటు విదేశీ దౌత్యవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధుల రాకతో ఢిల్లీ ఆతిథ్య రంగం ఒక్కసారిగా బిజీగా మారింది. కొన్నిచోట్ల సూట్ సూట్ రూమ్స్ లేవని నో రూమ్స్ బోర్డ్స్ కూడా పెట్టేస్తున్నారు. 

పూర్తిగా బుక్ అయిపోయిన ఫైవ్ స్టార్ హోటల్స్..
సెప్టెంబర్ 12తో పాటు 13వ తేదీల్లో ఢిల్లీలోని ప్రతిష్టాత్మకంగా భారత్ మండపం వేదికగా ఈ మెగా సదస్సు జరగబోతోంది. ఈ కార్యక్రమానికి వస్తున్న VIP అతిథులతో పాటు భద్రతా సిబ్బంది, అంతర్జాతీయ ప్రతినిధుల బస కోసం ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖ ప్రత్యేకమైన రిజర్వేషన్లు కూడా చేసుకున్నాయి. దీంతో లూటియన్స్ ఢిల్లీ తో పాటు ఏరోసిటీ పరిసరాల్లోని తాజ్ మహల్ హోటల్, తాజ్ ప్యాలెస్, ది లీలా ప్యాలెస్, లీ-మెరిడియన్, ది లలిత్ వంటి చాలా ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్స్ సాధారణ బుకింగ్స్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది..

కొన్ని హోటల్స్ లో రూమ్స్ లేకపోవడంతో.. హోటల్లు డైనమిక్ రైసింగ్ విధానాన్ని అమలు చేస్తూ వస్తున్నాయి. సాధారణ రోజుల్లో రూ.70 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఉండే ప్రెసిడెంట్, సూపర్ లగ్జరీ సూట్స్ ధరలు డిమాండ్ తో పాటు తేదీలను బట్టి ఒక్కసారిగా రూ.14 లక్షలు చేరడంతో అప్పుడప్పుడు విజిట్ అయ్యే బిజినెస్ మాన్స్ ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఎగ్జిక్యూటివ్, డీలక్స్ గదుల అద్దె రోజుకు కేవలం రూ.1.5 లక్షలు నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుంది. కొన్ని హోటల్స్ ఇప్పటికే ఆయా తేదీలకు ఆన్లైన్ బుకింగ్ పోర్టల్ కూడా క్లోజ్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

సెంట్రల్ ఢిల్లీలో గదులు దొరకకపోవడంతో విదేశీ ప్రతినిధులతో పాటు పర్యాటకులు, కార్పొరేట్ వ్యాపారవేత్తలు ఎన్ఆర్సి, గురుగ్రామ్ తో పాటు నోయిడా లోని స్టార్ హోటల్ వైపు మొగ్గు చూపుతున్నారట. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సమయంలో హోటల్స్ బుకింగ్ సెర్చ్ దాదాపు 50 శాతం పెరిగినట్లు ప్రముఖ ట్రావెల్ పోర్టల్ వెల్లడించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

ఎన్‌సీఆర్, గురుగ్రామ్‌కు పాకిన ప్రభావం..
సెంట్రల్ ఢిల్లీలో గదులు దొరకకపోవడంతో విదేశీ ప్రతినిధులు, పర్యాటకులు, కార్పొరేట్ వ్యాపారవేత్తలు ఎన్‌సీఆర్ (NCR), గురుగ్రామ్, నోయిడాలోని స్టార్ హోటళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సమయంలో హోటల్ బుకింగ్స్ సెర్చ్ దాదాపు 50 శాతం పెరిగినట్లు ప్రముఖ ట్రావెల్ పోర్టల్స్ వెల్లడించాయి. మరోవైపు అంతర్జాతీయ సదస్సు నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వంతో పాటు ట్రాఫిక్ పోలీసులకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తున్నారు. అలాగే ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారత్ మండపం వరకు సాగే మార్గాల్లో హై సెక్యూరిటీ ముమ్మరం చేశారు.

Also Read: 20 ఏళ్ల వయస్సును తగ్గించుకున్న 68 ఏళ్ల వ్యక్తి.. ఎలా సాధ్యం ఇది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

..Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

.

0
0
Report

Egg Prices: ఉల్లి, చక్కెర తర్వాత గుడ్ల వంతు.. డిసెంబర్‌లో రూ.10కి చేరే ఛాన్స్‌!

Hyderabad, Telangana:

Egg Prices In India Telugu News: సామాన్యుడి వస్తువుల ధరలు రోజురోజుకు భారంగా మారుతూ వస్తున్నాయి. ఇప్పటికే పంచదారతో పాటు ఉల్లిపాయ ధరలు పెరిగి బడ్జెట్ తలకిందులు అవుతుండగా.. తాజాగా గుడ్ల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా గుడ్ల ధరలు దాదాపు 40 శాతం మేర పెరిగినట్లు సమాచారం. అయితే, గత మూడు నెలల నుంచి ఈ గుడ్ల ధరలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. అసలు ఇంత ధరలు పెరగడానికి గల కారణాలు ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం స్థానిక రిటైల్ మార్కెట్లో ఒక్కొక్క గుడ్డు ధర కొన్నిచోట్ల రూ.9 నుంచి దాదాపు రూ.10 వరకు పలుకుతోందంటే మామూలు విషయం కాదు.. సాధారణంగా నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ప్రకారం హోల్సేల్ ధర రూ.5 నుంచి రూ.6 మధ్య ఉన్నప్పటికీ.. చిల్లర వస్తువులు రవాణా ఖర్చులతో పాటు ఇతర ఖర్చుల పేరుతో కొన్ని షాపులు అధిక ధరలకు విక్రయిస్తూ వస్తున్నాయి.

గుడ్ల ధరలు విపరీతంగా పెరగడానికి కారణాలేంటి?
ధరల పెరుగుదలకు ప్రధాన కారణం కోళ్ల దాణా.. దీనికి సంబంధించిన ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉండడమే కాకుండా కొన్నిచోట్ల వీటికి సంబంధించిన కోరత ఏర్పడిందని పరిశ్రమ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. పౌల్ట్రీ పరిశ్రమలు ఉత్పత్తి వ్యాయాయంలో 65 నుంచి 70 శాతం వరకు దాణా కోసమే ఖర్చవుతుందట. 

ముఖ్యంగా మొక్కజొన్నల పెరుగుదల..
కోళ్ల దానాలో ప్రధానమైన మొక్కజొన్న ధర కిలోకు దాదాపు 22 రూపాయల నుంచి 30 వరకు చేరింది. మూడేళ్ల క్రితం టన్ను దాదాపు కేవలం 14000 మాత్రమే ఉండేది.. కానీ ఇప్పుడు ఈ మొక్కజొన్న టన్ను ధర దాదాపు 26,000 వరకు చేరింది.. నాణ్యమైన దాణా ముడి సరుకుల ధరలు పెరగడంతో గుడ్డు ఉత్పత్తి వ్యాయామం గణనీయంగా పెరిగింది.. 

Also Read: DA Hike 2026: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గుడ్‌న్యూస్.. 2.9 శాతం DA పెంపు..

డిసెంబర్ నాటికి గుడ్ల రేట్లు విపరీతంగా పెరిగే ఛాన్స్..
రాబోయే రోజుల్లో గుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ నాటికి ఉత్పత్తి వ్యాయాయంలో మరో 15 నుంచి 20% వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని వారంటున్నారు. దానలో నాణ్యత తగ్గకుండా ఆరోగ్యకరమైన గుడ్లను సరఫరా చేయాలంటే ధరల పెంచడం అని భార్యమని పౌల్ట్రీ వ్యాపారస్తులు చెబుతూ వస్తున్నారు..

ఉల్లి, చక్కెరలతో రెట్టింపు భారం..
ఒక గుడ్లే కాకుండా.. నిత్యవసరాలు అయినా చక్కెరతోపాటు ఉల్లిపాయ ధరలు కూడా వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. గత రెండు నెలల్లో చక్కెర ధర 25 శాతం పెరిగి ప్రస్తుతం కిలో 60 రూపాయలకు పైగా దాటింది. ఇక ఉల్లిపాయల విషయానికొస్తే.. గత నెల రోజుల్లోనే ఉల్లిపాయ ధరలు 42 శాతం పెరిగి మార్కెట్లో కిలో ఉల్లిపాయ ధర 50 నుంచి 65 రూపాయల వరకు విక్రయిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లోనైతే దాదాపు వీటి ధర 80 రూపాయలకు కూడా పలుకుతుంది.

Also Read: DA Hike 2026: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గుడ్‌న్యూస్.. 2.9 శాతం DA పెంపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

..Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement
Advertisement
Back to top