హయత్ నగర్ లో రిలయన్స్ డిజిటల్ షోరూం ప్రారంభించిన సినీనటి నభా నటేష్
Hayathnagar_Khalsa, Telangana:హయత్నగర్లోని కొత్త రిలయన్స్ డిజిటల్ స్టోర్ను సినీనటి నభా నటేష్ ఈ రోజు ప్రారంభించారు. 1 లక్ష రూపాయల పైగా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసిన వినియోగదారులతో ఫోటోలు తీసి, వారికి వస్తువులు అందించారు. నభా నటేష్ మాట్లాడుతూ, ఈ స్టోర్ ప్రారంభం తనకు చాలా సంతోషంగా ఉందని, ప్రముఖ నటితో మీట్ & గ్రీట్ష్లో పాల్గొనేవారికి ప్రత్యేక సంతకం చేసిన వస్తువులు అందించామన్నారు. కొత్త స్టోర్లో, బ్యాంక్ కార్డ్లపై 10% వరకు తక్షణ తగ్గింపుతో ఎర్లీ బర్డ్ ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Janasena Rajya Sabha: జనసేన నుంచి రాజ్యసభ బరిలో టాలీవుడ్ బడా నిర్మాత..పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Chinnakakani, Andhra Pradesh:Janasena Rajya Sabha Candidate: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రానురాను మరింత ఆసక్తిగా మారుతున్నాయి. 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు పన్నాగాలు పన్నుతున్నారు. అటు కూటమిలోని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతో పాటు ఇటు వైసీపీలోనూ ప్లానింగ్స్ మొదలెడుతున్నారు. ఈ క్రమంలో రాజ్యసభకు నిపుణులను పంపే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
రానున్న రాజ్యసభ స్థానాల భర్తీకి కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ ఓ ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో చెరో సీటు అనే ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి రాజ్యసభ స్థానాల కోసం జనసేన నుంచి రెండు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారిలో ఎవరికి సీటు ఇస్తారనే విషయంపై ఇప్పుడు సందిగ్ధం నెలకొంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మదిలో ఎవరు ఉన్నారనే విషయంపై ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
పార్లమెంట్లోని రాజ్యసభలో జనసేన తొలిసారి అడుగుపెట్టబోతోంది. 2024 ఎన్నికల్లో జనసేన నుంచి లోక్సభకు ఇద్దరు నాయకులు ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజ్యసభలో తొలి అడుగు పెట్టేందుకు జనసేన సమీకరణాలను మొదలుపెడుతోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో రెండు టీడీపీకి ఉండగా.. మిగిలిన రెండింటిని జనసేన, బీజేపీ పంచుకోనున్నాయి.
రాజ్యసభకు ఇప్పుటికే ఎంపీగా ఉన్న సానా సతీష్ ఎంపికను మరోసారి పునరుద్ధరిస్తూ ఖరారు చేయగా.. ఇప్పుడు మరోస్థానంలో ప్రముఖ ఫార్మా కంపెనీకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి తమిళనాడు లీడర్ అన్నామలై లేదా మందకృష్ణ మాదిగను ఆ స్థానంలో పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే జనసేన పార్టీ విషయానికొస్తే.. రాజ్యసభ స్థానానికి గానూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అందులో పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు గట్టిగా వినిపిస్తోంది. అలాగే టాలీవుడ్ నుంచి మరో స్టార్ ప్రొడ్యూసర్ పేరు కూడా జనసేనాని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలను నిర్మిస్తున్న ఓ ప్రముఖ నిర్మాతను జనసేన పార్టీ నుంచి రాజ్యసభకు పంపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజాలేంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు.
Also Read: Trump Nobel Prize: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు నోబెల్ బహుమతి?! 287 మందిలో ఒక్కడిగా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Education: సింగపూర్కి ఏపీ టీచర్స్.. విద్యా ప్రమాణాల్లో విప్లవాత్మక మార్పులు!
Hyderabad, Telangana:AP Government Latest News: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి పెంచే లక్ష్యంతో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో ఊహించని మార్పులకు శ్రీకారం చుట్టింది.. ఇందులో భాగంగా.. ఏపీ రాష్ట్రంలోని ఉత్తమ టీచర్లకు అద్భుతమైన విదేశీ విద్యా విధానాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా నేరుగా ప్రభుత్వం ఎంపిక చేసిన 37 మంది ఉత్తమ ఉపాధ్యాయుల బృందం త్వరలో సింగపూర్ పర్యటనకు వెళ్లడానికి సిద్ధమైంది.. ఈ ప్రతిష్టాత్మక పర్యటన ఈ నెల 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరగబోతోందని ఉన్నతాధికారులు తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థను కలిగి సింగపూర్లోని అమలవుతున్న వినూత్న బోధనా పద్ధతులతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, విద్యార్థుల అభ్యసన శైలిపై ఈ ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయబోతున్నట్లు తెలుస్తోంది..
ఈ టీచర్స్ పర్యటనలో భాగంగా.. ఎంపికైన ఉపాధ్యాయులు సింగపూర్లోని ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించబోతున్నట్లు తెలుస్తోంది. తరగతి గదుల్లో డిజిటల్ బోధనను ఏ విధంగా అమలు చేస్తున్నారు? అనే అంశాలతో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ఎటువంటి ప్రత్యేకమైన వ్యూహాలను అనుసరిస్తున్నారు? వంటి అంశాలను ఈ టీచర్స్ ప్రత్యక్షంగా పరిశీలించబోతున్నట్లు సంచారం. అంతేకాకుండా అక్కడ నేర్చుకున్న ఉత్తమ పద్ధతులను.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలా అందించాలనే దానిపై వారు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయ్యబోతున్నట్లు కూడా తెలుస్తోంది..
అంతేకాకుండా సింగపూర్ పర్యటన మాత్రమే కాకుండా.. విద్యారంగంలో అగ్రగామిగా ఉన్న ఫిన్లాండ్ దేశానికి కూడా మిగిలిన ఉత్తమ టీచర్స్ను రాష్ట్ర ప్రభుత్వం పంపేందుకు ప్రత్యేకమైన కసరత్తు కూడా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కొనేలా సిద్ధం చేయడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యమని విద్యాశాఖ అధికారులు తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Huawei Nova 15 Max: ఫోన్ కాదు పవర్ హౌస్.. హువావే నోవా 15 మ్యాక్స్ స్పెసిఫికేషన్లు ఇవే..
Hyderabad, Telangana:Huawei Nova 15 Max Launch: ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ హువావే (Huawei) మార్కెట్లోకి కొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇది నోవా 15 మ్యాక్స్ (Huawei Nova 15 Max) పేరుతో విడుదల కాబోతోంది. ముఖ్యంగా దీనిని కంపెనీ మే 7న జరిగే ప్రత్యేకమైన లాంచ్ ఈవెంట్లో భాగంగా థాయిలాండ్లోని బ్యాంకాక్లో లాంచ్ చేయబోతోంది. గ్లోబల్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని ఈ స్మార్ట్ఫోన్ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. దీనిని కంపెనీ అత్యంత శక్తివంతమైన 8,500 mAh బ్యాటరీతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది.
ప్రస్తుత స్మార్ట్ఫోన్ మార్కెట్లో కేవలం కొన్ని బ్రాండ్లు మాత్రమే.. 7,500 mAh బ్యాటరీతో స్మార్ట్ఫోన్స్ను విడుదల చేశాయి. అయితే, త్వరలోనే విడుదల కాబోయే నోవా 15 మ్యాక్స్ (Huawei Nova 15 Max) స్మార్ట్ఫోన్ 8,500 mAh బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు రెండు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ను అందిస్తుంది. దీంతో పాటు ఇందులో కంపెనీ 40W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా అందిస్తోంది.
ఈ హువావే నోవా 15 మ్యాక్స్ స్మార్ట్ఫోన్కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఈ స్మార్ట్ఫోన్ను ఫోటోగ్రఫీ ప్రేమికులను ఆకట్టుకునేలా రూపొందించిన్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో చాలా ప్రత్యేకమైన RYYB సెన్సార్స్ను కూడా అందిస్తోంది. దీంతో పాటు ఈ సెన్సార్ సాధారణ సెన్సార్ల కంటే 40 శాతం ఎక్కువ కాంతిని అందించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా చికటిలో కూడా అద్భుతమైన ఫోటోలను కూడా అందిస్తుంది.
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
ఇక ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన డిజైన్ వివరాల్లోకి వెళితే... ఇది గత మొబైల్స్ మోడల్స్ కంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ స్మార్ట్ఫోన్ స్కై బ్లూ, అబ్సిడియన్ బ్లాక్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్తో విడుదల కాబోతోంది. అంతేకాకుండా ఇందులో కంపెనీ 6.8 అంగుళాల డిస్ప్లే కూడా అందిస్తోంది. దీంతో పాటు కిరిన్ 8000 చిప్సెట్ ప్రాసెసర్ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీని డిజైన్ యూత్ సెంట్రిక్గా ఉంటుంది. మే 7న జరిగే ఈ గ్లోబల్ ఈవెంట్లో భాగంగా ఈ స్మార్ట్ఫోన్ విడుదల కాబోతోంది.
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ravindra Jadeja Kuldeep Yadav: బ్యాట్తో కుల్దీప్ ముఖంపై కొట్టబోయిన జడేజా..ఐపీఎల్ మ్యాచ్లో ఊహించని సంఘటన..
Hyderabad, Telangana:Ravindra Jadeja Kuldeep Yadav Interaction: ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆసక్తికర సంఘటన జరిగింది. రాజస్థాన్ టీమ్కు చెందిన రవీంద్ర జడేజా, ఢిల్లీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మధ్య ఈ ఘటన జరిగింది. అయితే వీరిద్దరూ కొట్టుకునే స్థాయికి వెళ్లారని చూపరులకు కనిపిస్తుంది. కానీ, అక్కడ జరిగింది అందుకు పూర్తి విరుద్ధం.
రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ధ్రువ్ జూరెల్ అవుటైన తర్వాత 12వ ఓవర్లో జడేజా బ్యాటింగ్కు వచ్చాడు. అదే సమయంలో ఈ విచిత్ర సంఘటన జరిగింది. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లు ఒకరినొకరు సరదాగా ఆటపట్టించుకోవడం కనిపించింది. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. కుల్దీప్ తన వైపు రావడం గమనించిన జడేజా, తన టీమ్ఇండియా పార్ట్నర్ను భయపెట్టాలనే ఉద్దేశంతో వ్యూహాత్మకంగా బ్యాట్ ఝుళిపించాడు.
అయితే, కుల్దీప్ ఏమాత్రం చలించకుండా, జడేజా భుజాలపై చేతులు వేసి తేలికగా నెట్టాడు. జడేజా తన బ్యాట్ను అంపైర్తో తనిఖీ చేయించుకోబోతుండగా, కుల్దీప్ అతడిని పట్టుకుని మళ్లీ నెట్టాడు. వారి మధ్య జరిగిన ఈ సరదా వాగ్వాదం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
OMG 😱 War between Kuldeep Yadav & Ravindra Jadeja 😭#DCvsRR #RRvsDC
Kyle Jamieson #Peddi
Riyan Paragpic.twitter.com/ZZNhckDYMN— Rolex x👑 (@Tfg85743663) May 1, 2026
ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుసగా మూడు ఓటముల పరంపరకు ముగింపు పలికి, ఐపీఎల్లో తమ అత్యధిక విజయవంతమైన ఛేజింగ్ను పూర్తి చేసింది. జైపూర్లో 226 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న క్రమంలో, ఓపెనర్లు కేఎల్ రాహుల్, పతుమ్ నిస్సంకల అర్ధశతకాల చెలరేగిన వేళ రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ఢిల్లీ ఘనవిజయం సాధించింది.
పతుమ్ నిస్సంక 33 బంతుల్లో 62 పరుగులతో ఛేజింగ్లో రాజస్థాన్ జట్టుపై అద్భుతమైన ఆరంభాన్ని అందించగా, కేఎల్ రాహుల్ 40 బంతుల్లో 75 పరుగులు చేసి ఢిల్లీని విజయానికి చేరువ చేశాడు. నిస్సంకతో కలిసి 110 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన సమయంలో రాహుల్ అతనికి సహకరించినప్పటికీ, నిస్సంక అవుటైన తర్వాత డీసీ ఇన్నింగ్స్కు ఎంతో అవసరమైన ఊపునిచ్చాడు. చివరికి, నితీష్ రాణా (33), అశుతోష్ శర్మ (25*), ట్రిస్టన్ స్టబ్స్ (18*) అందించిన విలువైన ఇన్నింగ్స్తో రాణించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ 50 బంతుల్లో 90 పరుగులు చేసి ఫామ్లోకి తిరిగి వచ్చాడు. ఇది ఈ సీజన్లో అతని మొదటి యాభైకి పైగా స్కోరు. అదే సమయంలో, డోనోవన్ ఫెరీరా 14 బంతుల్లో 47 నాటౌట్ పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో, బ్యాటింగ్ ఎంచుకున్న RR జట్టు 225/6 అనే బలమైన స్కోరును నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన గత మ్యాచ్లో 'వేపింగ్' చేస్తూ పట్టుబడి జరిమానాకు గురైన పరాగ్, తొలి రెండు ఓవర్లలోనే యశస్వి జైస్వాల్ (6), వైభవ్ సూర్యవంశీ (4) అవుటైన తర్వాత, ధృవ్ జురెల్ (42)తో కలిసి ఇన్నింగ్స్ను పటిష్టం చేశాడు.
Also Read: Trump Nobel Prize: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు నోబెల్ బహుమతి?! 287 మందిలో ఒక్కడిగా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Xiaomi Civi 6: 50MP పెరిస్కోప్ కెమెరా, 1.5K డిస్ప్లేతో షావోమి సివి 6 సిరీస్.. మార్కెట్లోకి ఎప్పుడంటే?
Hyderabad, Telangana:Xiaomi Civi 6 And Civi 6 Pro Leaks: షావోమి బ్రాండ్కి సంబంధించిన స్మార్ట్ఫోన్స్కి మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఉంది. ప్రీమియం ఫీచర్స్తో అత్యంత శక్తివంతమైన ఫీచర్స్తో విడుదల చేయడం వల్ల చాలా మంది వీటికి ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతూ వస్తున్నారు. షావోమి తన సివి (Civi) సిరీస్లో భాగంగా కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. కంపెనీ త్వరలోనే షావోమి సివి 6 (Xiaomi Civi 6)తో పాటు షావోమి సివి 6 ప్రో (Xiaomi Civi 6 Pro) మోడళ్లను మార్కెట్లోకి లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ రెండు స్మార్ట్ఫోన్స్ అధునాతన సాంకేతికతతో పాటు అద్భుతమైన డిస్ల్పేతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన ఫీచర్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రముఖ టిప్స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపిన వివరాల్లోకి వెళితే.. షావోమి సివి 6 స్మార్ట్ఫోన్ 6.59 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది 1.5K రిజల్యూషన్తో అందుబాటులోకి రాబోతోంది. ఇది వినియోగదారులకు స్పష్టమైన విజువల్స్ను అందించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా హార్డ్వేర్ పరంగా.. ఇందులో కంపెనీ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 చిప్సెట్ ప్రాసెసర్ను అందించిన్నట్లు తెలుస్తోంది.
ఈ సిరీస్లోని ప్రో వేరియంట్ (Xiaomi Civi 6 Pro) మరెన్నో అద్భుతమైన ఫీచర్స్ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ 6.83 అంగుళాల 1.5K డిస్ప్లేతో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇందులో కూడా అదే శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ప్రాసెసర్ను అందించేందుకు కంపెనీ సిద్ధమైన్నట్లు తెలుస్తోంది.. అలాగే కెమెరా పరంగా చాలా అద్భుతమైన ఫీచర్స్ను కూడా కలిగి ఉండబోతోంది.. సివి 6 మోడల్లో కంపెనీ ఎంతో శక్తివంతమైన 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా అందించడం విశేషం. ఇది 5x జూమ్ సామర్థ్యంతో అందుబాటులోకి రాబోతోంది. ఇవే కాకుండా ఇందులో అనేక రకాల కొత్త ఫీచర్స్ లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
షావోమి ఈ సివి సిరీస్ను మొదటి చైనా మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్లు వివో (Vivo), సామ్సంగ్ (Samsung)తో పాటు వన్ప్లస్ (OnePlus) బ్రాండ్ బడ్జెట్ స్మార్ట్ఫోన్స్ దృష్టిలో పెట్టుకుని.. తయారు చేసిన్నట్లు తెలుస్తోంది..తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లను అందించే రేసులో షావోమి ముందు వరుసలో నిలవాలని చూస్తోంది. అయితే, దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫీచర్స్ కంపెనీ త్వరలోనే వెల్లడించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vivo S50t 5G లాంచ్.. 6500mAh బ్యాటరీ, కెమెరాలతో అదరగొడుతున్న కొత్త ఫోన్!
Hyderabad, Telangana:Vivo S50t 5G Launched: స్మార్ట్ఫోన్ మార్కెట్లో తమదైన ముద్ర వేసుకున్న ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ కంపెనీ వీవో తాజాగా కొత్తగా ఎస్ సిరీస్ నుంచి అద్భుతమైన మొబైల్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది ప్రీమియం ఫీచర్స్తో అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ Vivo S50t 5G పేరుతో లాంచ్ చేసింది. ఇది ప్రీమియం కెమెరాతో పాటు భారీ బ్యాటరీతో కస్టమర్స్ను ఆకట్టుకునేలా కంపెనీ రూపొందించింది. అలాగే ఇందులో వీవో ఎన్నో రకాల కొత్త ఫీచర్స్ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్ఫోన్ మోడల్కు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ Vivo S50t 5G స్మార్ట్ఫోన్ ఫీచర్స్కి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇది 6.59 అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 1.5K రిజల్యూషన్తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ను సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ఇందులో టెస్ట్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 (Snapdragon 8s Gen 3) చిప్సెట్ ప్రాసెసర్తో లాంచ్ చేయబోతోంది. అలాగే ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6పై రన్ అవుతుంది. దీంతో పాటు మల్టీ టాస్కింగ్ చేసేందుకు ఈ మొబైల్ చాలా అద్భుతంగా పని చేస్తుంది.
ఈ స్మార్ట్ఫోన్ వెనక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు అదనంగా 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఫ్రంట్ భాగంలో ఈ స్మార్ట్ఫోన్ అద్భుతమైన కెమెరా సెటప్ను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 50 మెగాపిక్సెల్ పవర్ఫుల్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఇది హై-క్వాలిటీ ఫొటోలతో పాటు అద్భుతమైన వీడియోను కూడా రికార్డ్ చేయగలుగుతుంది.
ఈ స్మార్ట్ఫోర్ ప్రధాన ఆకర్శణ ఏంటంటే దాని బ్యాటరీ.. ఇందులో కంపెనీ 6500mAh శక్తివంతమైన బ్యాటరీని అందిస్తోంది. అంతేకాకుండా దీనికి తోడుగా 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తోంది. అలాగే తక్కువ సమయంలోనే ఫోన్ ఛార్జింగ్ అయ్యేందుకు అద్భుతమైన టెక్నాలజీని అందిస్తోంది. దీంతో పాటు ఇందులో అల్ట్రాసోనిక్ ఫింగర్ప్రింట్ స్కానర్ వంటి అత్యాధునిక ఫీచర్లు కూడా అందుబాటులో ఉంచిన్నట్లు తెలుస్తోంది.
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
ప్రస్తుతం ఈ స్మార్ట్ఫోన్ చైనా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇది మొత్తం రెండు స్టోరేజ్ వేరియంట్స్లో అందుబాటులో ఉంది. మొదటి వేరియంట్ 12GB RAM + 512GB స్టోరేజ్ మోడల్ ధర సుమారు రూ.48,500 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే రెండవ 16GB RAM + 512GB మోడల్ ధర రూ. 50,000తో లభిస్తోంది. అయితే, ఇప్పటికే ఇది చైనాలో వివో అధికారక వెబ్సైట్లో కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే, భారత్లో కూడా త్వరలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sun Transit 2026: రోహిణి నక్షత్రంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశులకు ఆర్థికంగా తిరుగులేని అదృష్టం!
Hyderabad, Telangana:Sun Transit In Rohini Nakshatra 2026: మే నెలలో అత్యంత ప్రధాన గ్రహంగా పరిగణించే సూర్యుడు కూడా రాశి సంచారం చేయబోతోంది. ఈ సమయంలో సూర్యుడు నక్షత్రం సంచారం చేయబోతోంది. అయితే, చాలా నెలల తర్వాత నక్షత్ర సంచారం చేయడం విశేషం.. సూర్యుడు చంద్రునికి అత్యంత ప్రియమైన రోహిణి నక్షత్రంలోకి సంచారం చేసేందుకు సిద్ధమైంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రోహిణి నక్షత్రం చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. ఈ నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి ఈ సమయంలో అద్భుతమైన పురోగతి లభించబోతోంది. ముఖ్యంగా ప్రకృతిలో అనేక మార్పులు రాబోతున్నాయి. అయితే, కొన్ని రాశులవారికి మాత్రం ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు కూడా లభించబోతున్నాయి. సూర్యుడి సంచారంతో ఏయే రాశులవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
రోహిణి నక్షత్రం అన్ని నక్షత్రాల్లోకి నాలుగవ నక్షత్రంగా చెప్పకుంటారు. ఈ నక్షత్రానికి చంద్రుడితో పాటు బ్రహ్మదేవుడు అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే ఈ నక్షత్ర చిహ్నం ఎద్దుల బండిగా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇది పెరుగుదలతో పాటు పురోగతి, బరువు మోసే సామర్థ్యానికి సూచికగా భావిస్తారు. ఈ రోహిణి నక్షత్రాన్ని ఆనందంతో పాటు విలాసం, పరిశ్రమ, సంపదకు సూచికగా భావిస్తారు. అయితే, ఈ సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
ఈ రాశులవారికి బంపర్ జాక్పాట్:
సింహరాశి:
రోహిణి నక్షత్రంలోకి అన్ని గ్రహాలకు అధిపతిగా వ్యవహరించే సూర్యుడు సంచారం చేయడంతో ఈ సొంత రాశివారికి వృత్తిపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే పెట్టుబడులు పెట్టేవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే అద్భుతమైన ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. ఎన్నో రకాల సమస్యలు ఈ సమయంలో తొలగిపోయే ఛాన్స్లు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
వృషభ రాశి:
రోహిణి నక్షత్రంలోకి సూర్యుడు సంచారం చేయడంతో వృషభ రాశివారికి కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా మారుతుంది. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో మార్పులు వస్తాయి. అలాగే డబ్బులు సంపాదించడానికి కొత్త కొత్త మార్గాలు కూడా లభిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సూర్యుడి ప్రభావంతో దీర్ఘకాలిక సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా పొదుపు కూడా గణనీయంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
ధనుస్సు రాశి:
సూర్యుని ప్రభావంతో ధనుస్సు రాశివారికి కూడా ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు కూడా లభిస్తాయి. నిలిచిపోయిన పాత డబ్బులు కూడా తిరిగిపొందుతారు. అలాగే ఈ సమయంలో అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. భవిష్యత్కు తగ్గ డబ్బులు కూడా సంపాదించే ఛాన్స్లు కూడా ఉన్నాయి. ఈ సమయంలో ఆర్థిక ప్రణాళికల్లో కూడా ఊహించని సక్సెస్ సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Govt Employees: 100 రోజుల్లో అన్నింటికి పరిష్కారం.. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు
Hyderabad, Telangana:Telangana Govt Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులతోపాటు టీచర్లు, రిటైర్మెంట్ పొందిన ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఉద్యోగులకు సంబంధించిన అన్నీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. వంద రోజుల్లోపే సమస్యలు, డిమాండ్లు నెరవేరుస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది. వేతన సవరణ సంఘంతోపాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర సమస్యలు నెరవేరుస్తామని ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Pending Traffic Challan: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం
వంద రోజులు
ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో హైదరాబాద్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఉద్యోగ సంఘాలు తమ 45 సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారం, ఆర్థికభారంపై ఉద్యోగ సంఘాలతో సుదీర్ఘ చర్చ జరిగింది. ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి.. ముఖ్యమంత్రితో చర్చించి 100 రోజుల్లోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతినెల ఉద్యోగులకు రూ.వెయ్యి కోట్లు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని ఉద్యోగులకు మాట ఇచ్చారు. సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండడంతో ఉద్యమ కార్యచరణ వాయిదా వేసుకోవాలని ఉద్యోగులకు డిప్యూటీ సీఎం సూచించారు.
Also Read: Govt Employees: డిప్యూటీ సీఎంతో భేటీ! తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు నేడే భారీ శుభవార్త?
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తాజా సమావేశం స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంటింజెంట్ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఉద్యోగుల ప్రధాన సమస్యల పరిష్కారం చేస్తామని.. వాటితో ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం, సత్వరం పరిష్కరించాల్సిన సమస్యలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో డిప్యూటీ సీఎం సుదీర్ఘంగా చర్చించారు.
Also Read: Sanath Nagar TIMS: హైదరాబాద్లో మరో కొత్త నిమ్స్ తరహా ఆస్పత్రి.. ఎక్కడో తెలుసా?
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించిందని.. అయితే అన్ని సమస్యలను ఏకకాలంలో కాకుండా దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు తెలిపారు. పెన్షనర్ల సమస్యలను వంద రోజులలోనే పరిష్కరిస్తామని ఇప్పటికే మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నామని.. ఉద్యోగుల సమస్యలను కూడా ప్రాధాన్య క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సానుకూలం
ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇచ్చిన వినతులపై త్వరలోనే సీఎం తో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం తెలిపారు. సాధ్యమైనంత త్వరగా పీఆర్సీ నివేదికను తెప్పించుకొని అమలు చేస్తామని ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యచరణను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినా ఉద్యోగుల సమస్యలపై ప్రజా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా త్వరలోనే ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశమై తీపి కబురు చెప్తానని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
కార్యాచరణపై త్వరలో నిర్ణయం
ఈ సమావేశంపై ఉద్యోగ సంఘాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు, కాంటిజెంట్ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి తీపి కబురు వస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఈనెల 5వ తేదీన చేపట్టనున్న కార్యాచరణపై ఉద్యోగ సంఘాల జేఏసీతోపాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి తెలిపారు. సమావేశానికి ఉద్యోగ సంఘాల జేఏసీ భాగస్వామ్య ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రామకృష్ణ, రాములు, బాణాల రాం రెడ్డి, పెంటయ్య, రమేశ్ పాక, డాక్టర్ నిర్మల, ఎండీ హబీబ్ మియా, మహిపాల్ రెడ్డి, దర్శన్ గౌడ్, భిక్షం, ఉపేందర్ రావు, రాబర్ట్ బ్రూస్, డాక్టర్ సైదులు, బుచ్చయ్య, కుమార స్వామి, హబీబ్ మియా, వెంకటేశం, వివేక్, మమత, క్రాంతి కుమార్, రవి, నరేందర్, స్వామి, దేవిక, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
CM Revanth RTC JAC: సీఎం రేవంత్ రెడ్డితో ఆర్టీసీ జేఏసీ మీటింగ్..ఆర్టీసీ విలీనమా? గుర్తింపు సంఘాల ఎన్నికలా?
Hyderabad, Telangana:CM Revanth RTC JAC Meet: తెలంగాణ ఆర్టీసీ జేఏసీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నట్లు సమాచారం. అయితే ఇదే సమావేశంలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమా? గుర్తింపు సంఘాల ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అనేది తేలిపోతుంది.Peddi New Release Date: రామ్చరణ్ 'పెద్ది' సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది! బుచ్చిబాబు అదరగొట్టాడు!
Hyderabad, Telangana:Peddi Movie New Release Date: మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'పెద్ది' సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడగా..2026 జూన్ 4న సినిమా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.Fee Reimbursement: రేవంత్ రెడ్డి బీసీ జేఏసీ ఆగ్రహం.. తీవ్ర హెచ్చరిక
Hyderabad, Telangana:Watch BC JAC Leaders Fire On Revanth Reddy A Head Fee Reimbursement Scheme AbolishPending Traffic Challan: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం
Hyderabad, Telangana:Pending Traffic Challan: ట్రాఫిక్ పెండింగ్ చలాన్లపై గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించిన తెలంగాణ పోలీసులపై హైకోర్టు తప్పుబట్టింది. స్పష్టమైన ఆదేశాలు ఉన్నా ట్రాఫిక్ పోలీసులు, తెలంగాణ పోలీసులు ఉల్లంఘించారని ఆరోపణలు రావడంతో ఈ అంశం హైకోర్టుకు చేరింది. పిటిషన్లు చేసిన వాదనలను విన్న హైకోర్టు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులతోపాటు కొత్త డీజీపీ, పాత డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Govt Employees: డిప్యూటీ సీఎంతో భేటీ! తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు నేడే భారీ శుభవార్త?
ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు వ్యవహారంపై హైకోర్టు గతంలో కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పెండింగ్ చలాన్లు ఉంటే వాహనాలు సీజ్ చేయరాదని జనవరి 20వ తేదీన హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా ట్రాఫిక్ పోలీసులు వాహనాలు సీజ్ చేస్తున్నారు. దీంతో కోర్టు ధిక్కరణ కింద డీజీపీ సీవీ ఆనంద్, మాజీ డీజీపీ శివధర్ రెడ్డి, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్లకు హైకోర్టు నోటీసులు అందించింది.
Also Read: Sanath Nagar TIMS: హైదరాబాద్లో మరో కొత్త నిమ్స్ తరహా ఆస్పత్రి.. ఎక్కడో తెలుసా?
హైకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఏప్రిల్ 9వ తేదీన మల్లికార్జున అనే వ్యక్తి బైక్ను పోలీసులు సీజ్ చేశారు. దీంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ను అతడు దాఖలు చేశాడు. హోమ్ శాఖ సెక్రటరీ, డీజీపీ, ట్రాఫిక్ అదనపు సీపీ, రవాణా శాఖ కమిషనర్లను పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చాడు. పెండింగ్ చలాన్లు ఉంటే వాహనాలు సీజ్ చేయరాదని జనవరి 20న ఇచ్చిన ఉత్తర్వులను ప్రత్యేకంగా పిటిషనర్ ప్రస్తావించారు. కోర్టు ఉత్తర్వులను పోలీసులు ఉల్లంఘించారని పిటిషన్లో స్పష్టంగా పేర్కొన్నారు.
కోర్టు ఉత్తర్వులను ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదని న్యాయవాది విజయ్ గోపాల్ ఆరోపించారు. వాహనం ఆర్సీ బుక్ను ఎం వాలెట్లో చూపించినా ట్రాఫిక్ పోలీసులు అంగీకరించడం లేదని న్యాయవాది విజయ్ గోపాల్ వివరించారు. ఈ అంశంపై హైకోర్టు ప్రతివాదులకు నోటిసులు జారీ, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 19వ తేదీకి వాయిదా వేసింది.
డీజీపీ నియామకంపై విచారణ
తెలంగాణ పూర్తిస్థాయి డీజీపీగా సీవీ ఆనంద్ నియామకంపై హైకోర్టులో విచారణ జరిగింది. సీవీ ఆనంద్ను రెగ్యులర్ డీజీపీగా నియమించినట్లు ఏజీ కోర్టుకు వివరించారు. పూర్తి స్థాయి డీజీపీ నియామకం జీఓ ప్రతిని అడ్వకేట్ జనరల్ కోర్టుకు సమర్పించారు. ప్రభుత్వం ఇచ్చిన జీఓని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. డీజీపీగా పనిచేసిన బి శివధర్ రెడ్డి తాత్కాలిక డీజీపీ నియామకం చట్టబద్ధమా కాదా అనే అంశంపై తరువాత నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు తెలిపింది. ఈ విషయంలో శివధర్ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు విన్న తరువాతే తుది నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం పేర్కొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Fee Reimbursement: ఫీజు రీయింబర్స్మెంట్ రద్దుకు రేవంత్ రెడ్డి కుట్ర: బీసీ జేఏసీ
Hyderabad, Telangana:Students Fee Reimbursement: తెలంగాణ విద్యార్థులతో రేవంత్ రెడ్డి ఆటలాడుకుంటున్నారని బీసీ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పేద, బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని బీసీ జేఏసీ నిలదీసింది. ఫీజు రీయింబర్స్మెంట్ అనేది విద్యార్థుల హక్కు.. ఇది ఎవరి భిక్షం కాదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి జేబుల నుంచి ఇస్తలేరు. భట్టి విక్రమార్క కష్టపడి చెమటోడ్చిన డబ్బులు కావు' అని బీసీ జేఏసీ నాయకులు తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించకపోతే తెలంగాణ రాష్ట్రం అగ్గి అవుతుందని హెచ్చరించారు.
Also Read: Govt Employees: డిప్యూటీ సీఎంతో భేటీ! తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు నేడే భారీ శుభవార్త?
ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 7ను రద్దు చేయాలని హైదరాబాద్లో బీసీ జేఏసీ సమావేశం నిర్వహించింది. జీవోకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాలని విద్యార్థులకు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను కాలబెట్టి శాంతియుత నిరసనలు తెలుపాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల నుండే ఫీజు వసూలు చేసుకోవాలన్న హైకోర్టు తీర్పుకు ప్రభుత్వమే కారణం అని స్పష్టం చేశారు.
Also Read: Education Year: విద్యా సంవత్సరానికి స్కూల్ డ్రెస్సులు, నోటు పుస్తకాలు సకాలంలో అందాలి: తెలంగాణ సీఎం
'ఉన్నత విద్య నుండి బడుగు విద్యార్థులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూరం చేస్తోంది. విద్యార్థుల ఖాతాల్లోకి ఫీజులు చెల్లిస్తామన్న ప్రభుత్వ నిర్ణయం అవివేకం. ఫీజుల రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చడానికి జీవో నెంబర్ 7ను ప్రభుత్వం తీసుకువచ్చింది' అని బీసీ జేఏసీ స్పష్టం చేసింది. ప్రభుత్వానికి దమ్ముంటే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేస్తామని ప్రకటించాలని రేవంత్ రెడ్డికి సవాల్ చేసింది. ఆనాటి కాంగ్రెస్ ఫీజుల పథకం తెస్తే.. ఈనాటి కాంగ్రెస్ ఆ పథకాన్ని రద్దు చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్పై కాంగ్రెస్ ప్రభుత్వం డొంకతిరుగుడు మాటలు మానుకోవాలని హితవు పలికారు. ఫీజుల బకాయిలు ఇవ్వకపోతే జూన్ నెలలో లక్ష మంది విద్యార్థులతో హైదరాబాద్ను దిగ్భందిస్తామని బీసీ జేఏసీ హెచ్చరించింది. ఫీజు రీయింబర్స్మెంట్పై తాము కోర్టుకు వెళ్తామని బీసీ జేఏసీ ప్రకటించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Kondagattu: ఎండకాలంలోనూ ఎండని సీతమ్మ బావి నీరు.. కొండగట్టు అంజన్న ఆలయ రహస్యం ఇదే!
Hyderabad, Telangana:Seethamma Bavi Kondagattu Latest News: తెలంగాణలోని అత్యంత మహివాన్మితమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కొండగట్టు అంజన్న ఆలయంలో ఒక ప్రత్యేకమైన ఆచారం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. సాక్షాత్తు సీతమ్మ తల్లి పేరుతో పిలుచుకునే సీతమ్మ భావించి సేకరించిన పవిత్ర జలాలతోనే స్వామివారికి నిత్యం అభిషేకం నిర్వహించడం ఇక్కడి విశేషం.. ఈ సాంప్రదాయం వెనకున్న ఆసక్తికరమైన విషయాలను ఆలయ అర్చకులు ఇటీవల వెల్లడించారు. అవేంటో? ఈ బావిలో నుంచి తీసిన నీటిని అభిషేకం చేయడానికి గల కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఆలయానికి దిగువన.. సుమారు 6 కిలోమీటర్ దూరంలో దట్టమైన పచ్చని చెట్ల మధ్య సహజ సిద్ధంగా ఏర్పడిన భావి సీతమ్మ భావిగా ప్రసిద్ధి చెందింది. ఈ భావి నీరు అత్యంత స్వచ్ఛమైనదిగా.. మధురంగా ఉంటుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. నిత్యం ఇద్దరు అర్చకులు తెల్లవారి జామునే ఈ భావి వద్దకు వెళ్లి.. సాంప్రదాయ బద్ధంగా రాగి బిందెలతో నీటిని సేకరించి ఆలయానికి తీసుకు వస్తారు.. స్వామివారికి చేసే అభిషేకం నుంచి భక్తులకు పంచే తీర్థ ప్రసాదాల తయారీ వరకు ఈ పవిత్ర జలాలనే వినియోగిస్తారట..
ఈ బావికి ఉన్న అతిపెద్ద విశేషం ఏంటంటే.. ఎండలు దంచి కొట్టే మండు వేసవిలో కూడా ఇందులో నీరు ఇనికిపోకుండా ఉండడం.. చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి.. సాధారణ బోర్లు ఎండిపోయినప్పటికీ.. ఈ సీతమ్మ బావిలో మాత్రం నీరు ఎప్పుడూ నిండు గానే ఉండటం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇది సాక్షాత్తు అంజన్న చల్లని చూపు వల్లే సాధ్యమని.. ప్రకృతి ప్రసాదించిన వరమని స్థానికులు చెబుతూ ఉంటారు..
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు సైతం ఈ సీతమ్మ భావి ప్రత్యేకత గురించి తెలుసుకొని.. అంజన్నకు జరిపి అభిషేకంలో వాడే జలాల గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉంటారు. కొండగట్టు క్షేత్రం ఆధ్యాత్మికతకు, ప్రకృతి సమతుల్యతకు ఈ భావి ఒక సజీవ నిదర్శనంగా నిలుస్తుందని అర్చకులు చెబుతున్నారు. ఆ జలాల పవిత్రతను అనుభూతి చెందుతూ ఉంటారు. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ నీరును తీర్ధంగా ఇవ్వడం వల్ల.. అంజన్న భక్తులకు ఒక అద్భుతమైన భక్తి అనుభూతిని నింపుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Sircilla: దేశమే గర్వించేలా.. సిరిసిల్ల వెంకటపల్లి సత్తా.. జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు!
Hyderabad, Telangana:Sircilla News: గ్రామీణ స్థానిక సంస్థల పనితీరును సమగ్రంగా అంచనా వేస్తూ.. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.0 (2023-24) నివేదికలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రం మొత్తం 86.41.లతో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోగా.. అందులో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని వెంకటపల్లి గ్రామం తన ప్రతిభతో జాతీయస్థాయిలో ప్రత్యేకమైన గుర్తింపు పొందింది.. అయితే, ఈ గుర్తింపు ఏంటో, ఆ ఊరికి దక్కిన గౌరవం ఏంటో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
గ్రామీణ అభివృద్ధితో పాటు సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం వంటి కీలక అంశాల్లో వెంకటపల్లి అద్భుతమైన ప్రగతిని కనబరిచింది. కేంద్రం నిర్దేశించిన కఠినమైన ప్రమాణాలను సమర్ధవంతంగా అమలు చేస్తూ.. రెండు ప్రధాన విభాగాల్లో అత్యుత్తమ గ్రేడ్లను కైవసం చేసుకుంది.. చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో 96.67 స్కోర్ సాధించి.. ఏ ప్లస్ గ్రేడ్ ని దక్కించుకోగా.. సోషల్ జస్టిస్ విభాగంలో 88.82 స్కూలుతో ఏ గ్రేడును సొంతం చేసుకుంది.. అంతేకాకుండా వివిధ విభాగాల్లో కూడా అద్భుతమైన స్కోర్లను సాధించినట్లు తెలుస్తోంది.
ఒక చిన్న గ్రామం జాతీయస్థాయిలో ఇలాంటి ఘనత సాధించడం వెనక స్థానిక పాలన యంత్రాంగం తో పాటు ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సమిష్టి కృషి దాగి ఉంది. పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు పిల్లల హక్కుల పరిరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన వంటి చర్యల వల్ల చైల్డ్ ఫ్రెండ్లీ విభాగంలో వెంకటపల్లికి అత్యుత్తమ గుర్తింపు లభించింది. అదేవిధంగా సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడంతోపాటు సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పారదర్శకంగా చేరవేయడంలో గ్రామపంచాయతీ చూపిన చొరవ సోషల్ జస్టిస్ విభాగంలో అద్భుతమైన ఫలితాలను అందించింది..
కేంద్ర ప్రభుత్వ నివేదికలో వెంకటపల్లి పేరు ప్రముఖంగా కనిపించడంతో జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.. గ్రామ అభివృద్ధిలో ఇది ఒక మైలురాయని.. రాబోయే రోజుల్లో మరిన్ని విభాగాల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామని గ్రామ పాలకవర్గం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. దేశానికి ఆదర్శంగా నిలిచిన వెంకటపల్లి, మిగతా గ్రామాలకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం సాధించిన ఈ అరుదైన విజయంలో సిరిసిల్ల జిల్లాకు చెందిన ఈ గ్రామం కీలక పాత్ర పోషించడం విశేషం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
