Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

DJ Player David: న్యూ ఇయర్‌ వేడుకల్లో డ్రగ్స్‌.. ప్రముఖ డీజే ప్లేయర్‌కు పాజిటివ్‌

PPINEWZ
Jan 01, 2026 04:42:53
DJ Player David Tests Positive In Drugs Test In New Year Celebrations Watch Video
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
BBhoomi
Jan 01, 2026 03:58:19
Secunderabad, Telangana:

Trainee Police Constables Stipend Hike: ఆంధ్రప్రదేశ్‌లో స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు కూటమి ప్రభుత్వం కొత్త సంవత్సరం వేళ భారీ గుడ్ న్యూస్ అందించింది. ట్రైనింగ్ లో  ఉన్న కానిస్టేబుళ్లకు ఇప్పటివరకు నెలకు కేవలం రూ.4,500గా ఉన్న స్టైపెండ్‌ను ఏకంగా రూ.12,000కి పెంచుతూ హోంశాఖ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో శిక్షణలో ఉన్న వేలాది మంది అభ్యర్థుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ.. న్యాయపరమైన అడ్డంకులు పరిష్కరించకపోవడంతో పరీక్ష ఫలితాలు నిలిచిపోయాయి. దీని కారణంగా ఎంపికైన అభ్యర్థులు సంవత్సరాల పాటు నిరీక్షణలోనే ఉండాల్సి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి, పెండింగ్‌లో ఉన్న న్యాయ సమస్యలను పరిష్కరించి ఎట్టకేలకు ఫలితాలను విడుదల చేసింది. ఫలితంగా ఎంపికైన 5,751 మంది కొత్త పోలీస్ కానిస్టేబుళ్లు డిసెంబర్ 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డీటీసీలు (District Training Centres), పీటీసీలు (Police Training Centres), బీటీసీలు (Basic Training Centres)లో శిక్షణకు హాజరయ్యారు.

Also Read: Railway stocks: దుమ్మురేపుతోన్న రైల్వే స్టాక్స్.. టికెట్ ఛార్జీల పెంపుతో.. 5 రోజుల్లో 26శాతం లాభాలు..!!

ఈ నేపథ్యంలో మంగళగిరిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ట్రైనీ కానిస్టేబుళ్లకు అందిస్తున్న స్టైపెండ్ తక్కువగా ఉందన్న అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు  అక్కడికక్కడే స్టైపెండ్‌ను నెలకు రూ.12,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. సీఎం ప్రకటనకు అనుగుణంగా హోంశాఖ మరుసటి రోజే ఉత్తర్వులు జారీ చేయడం విశేషంగా నిలిచింది.

ప్రస్తుతం రాష్ట్రంలోని 21 శిక్షణ కేంద్రాల్లో పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ కార్యక్రమాలు సజావుగా కొనసాగుతున్నాయని పోలీస్ ట్రైనింగ్ విభాగం డీఐజీ సత్య యేసుబాబు తెలిపారు. రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో అన్ని శిక్షణ కేంద్రాల్లో ఆధునిక స్క్రీన్లు ఏర్పాటు చేసి, నిపుణుల సహకారంతో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ప్రతి ట్రైనీకి సైకోమెట్రిక్ అసెస్‌మెంట్ నిర్వహించి, వారి సామర్థ్యాలకు అనుగుణంగా శిక్షణ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని స్పష్టం చేశారు. ఈ చర్యలతో పోలీస్ శాఖకు నాణ్యమైన, క్రమశిక్షణ గల సిబ్బందిని అందించాలనే కూటమి ప్రభుత్వ సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది. 

Also Read:  Future Metal: బంగారం, వెండి, ప్లాటినం, రాగి కాదు.. భవిష్యత్ అంతా ఈ లోహానిదే..లాభాలే లాభాలు..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
RKRavi Kumar Sargam
Dec 31, 2025 17:53:17
Nellore, Andhra Pradesh:

YSRCP vs Ponguru Narayana: తమపై చేస్తున్న విమర్శలకు అభివృద్ధితో సమాధానం చెబుతామని.. అభివృద్ధిని చూసి ఓర్వలేని కొంతమంది అవాక్కులు.. చవాక్కులు పేలుతున్నారని ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మండిపడ్డారు. అభివృద్ధి చేసి చూపిస్తామని.. వారి నోళ్లు మూయిస్తామని ప్రకటించారు. రాజధాని అమరావతిని కూడా అభివృద్ధి చేసి చూపిస్తామని.. ప్రతిపక్షాల తీరు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నెల్లూరు నగరంలోని మైపాడు గేట్ సెంటర్ వద్ద ఉన్న స్మార్ట్ స్ట్రీట్ బజార్‌లో గురువారం రాత్రి న్యూ ఇయర్ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారాయణ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న విజేతలకు మంత్రి నారాయణ బహుమతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్నారులతో కలిసి ఆట పాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ కీలక ప్రసంగం చేశారు. స్మార్ట్ స్ట్రీట్  నూతన సంవత్సర సంబరాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని.. ఇక్కడ దుకాణాలు నిర్వహిస్తున్న మహిళలు చాలా ఆనందంగా ఉన్నారని.. చక్కగా వ్యాపారాలు చేసుకుంటున్నారని వివరించారు.

స్మార్ట్‌ స్ట్రీట్‌లో 120 మంది మెప్మా మహిళలకు ఒక్కొక్కరికి తమ సొంత నిధి నుంచి లక్ష రూపాయలు ఇచ్చినట్లు మంత్రి నారాయణ గుర్తు చేశారు. వారి వ్యాపార అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని ప్రకటించారు. అయితే కొంతమంది అభివృద్ధిని చూసి ఓర్వలేక అవాకులు చవాకులు చేసి మాట్లాడుతున్నారని.. ఏ వ్యాపారమైన నిలదొక్కునేందుకు సమయం పడుతుందని నారాయణ పేర్కొన్నారు. ఆ చిన్న విషయం కూడా తెలియని కొందరు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఆరోపణలు, విమర్శలు అన్నీ పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదని నారాయణ స్పష్టం చేశారు. స్మార్ట్ స్ట్రీట్‌ను సక్సెస్ చేసి వారి నోరు మూయిస్తామని ప్రకటించారు. పేద పిల్లల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రారంభించిన వీఆర్ హై స్కూల్‌పైన కూడా వైఎస్సార్‌సీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో 14 స్కూల్స్‌ను వీఆర్‌ హైస్కూల్‌ తరహాలో వచ్చే విద్యాసంవత్సరానికి సిద్ధం చేస్తామని.. విమర్శకులకు చేతలతో సమాధానం చెబుతామని తెలిపారు.

జూన్ 12 కల్లా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ,ప్రతీ ఇంటికీ మంచినీటి కుళాయి పనులు పూర్తి చేస్తానని మంత్రి నారాయణ తెలిపారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్న ప్రభుత్వం తమదేనని గొప్పలు చెప్పుకున్నారు. వైఎస్సార్సీపీ సద్విమర్శలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని, వారి తీరు మారకుంటే ప్రజలే  ఛీత్కరిస్తారని చెప్పారు.

0
comment0
Report
PPINEWZ
Dec 31, 2025 17:00:37
Balapur, Telangana:

KCR, Harish Rao Politics: గులాబీ బాస్ కేసీఆర్ ఏదీ చేసినా.. దానికో అర్థం ఉంటుందని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతారు. కేసీఆర్ ఏనేత కైనా పదవి ఇచ్చినా ముందు వెనుక చూస్తారని చెబుతుంటారు. ఇప్పుడు గులాబీ పార్టీలో ప్లోర్ లీడర్ల నియామకం మాత్రం గులాబీ పార్టీ నేతలకు అంతుచిక్కడం లేదట. తాజాగా అసెంబ్లీలో బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా హరీష్ రావును నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ అసెంబ్లీలో డిప్యూటీ ప్లోర్ లీడర్లను నియమించారు. అటు అసెంబ్లీ, ఇటు శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు అనుభవజ్ఞులైన నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కోవాలని కేసీఆర్ బాగానే ప్లాన్ చేశారు.. కానీ హరీశ్ రావు ఒక్కరికి కాకుండా ముగ్గురు నేతలకు బాధ్యతలు అప్పగించడమే ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ అవుతోంది.

ఇకమీదట అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్లోర్ లీడర్లుగా మాజీమంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలాసాని శ్రీనివాస్ యాదవ్ కొనసాగతారు. సభా వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉన్న హరీష్ రావుతో పాటు, మహిళా, బీసీ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని సబితా ఇంద్రారెడ్డి, తలాసానిలకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. ఈ ముగ్గురూ సభలో పార్టీ పక్షాన కీలక అంశాలపై చర్చను నడిపిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం గులాబీ పార్టీలో మాజీమంత్రి హరీశ్ రావు కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్లాక.. అధికార పార్టీని ఎక్కువ ఇబ్బంది పెట్టిందే హరీశ్ రావే అన్న చర్చ ఉంది. సీఎం రేవంత్‌ను అన్ని అంశాల్లో ధీటుగా ఎదుర్కొవడంలో హరీశ్ రావు తర్వాతే ఎవరైనా అని గులాబీ నేతలు చెబుతుంటారు.. అలాంటి జనధరణ ఉన్న నేతకు నేరుగా ప్లోర్ లీడర్ బాధ్యతలు అప్పగించకుండా.. ఆయనకు పోటీగా మరో ఇద్దరు ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించడంతో సొంత పార్టీలోనే రకరకాలుగా చర్చ జరుగుతోంది. 

ఇక ఈనెల 2 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాకపోవచ్చని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. అందుకే ఆయన బీఆర్ఎస్ ప్లోర్ లీడర్లను నియమించారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే హరీశ్ రావు ఒక్కరికే ప్లోర్ లీడర్ బాధ్యతలు అప్పగిస్తే.. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే అంచనాతోనే కేసీఆర్ ముగ్గురికి బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే గులాబీ పార్టీలో నెంబర్ టూ ఎవరనే దానిపై పెద్ద చర్చే ఉంది. కేసీఆర్ తర్వాత.. పార్టీని ఎవరూ ముందుండి నడిపిస్తారు అని సొంత పార్టీ నేతలకే అనేక అనుమానాలు ఉన్నాయి. ఇటీవల ఇదే విషయమై పెద్ద రచ్చ జరిగింది. ఆ సమయంలో హరీశ్ రావు క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ ఉన్నంతవరకు పార్టీకి వెన్నుపోటు పొడిచే ప్రసక్తే లేదన్నారు. అంతేకాదు.. కేటీఆర్ సీఎం అయితే ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు రెడీగా ఉన్నానంటూ ప్రకటించారు. కానీ హరీశ్ రావు మాటలను గులాబీ బాస్ విశ్వసించలేదని ప్రచారం సాగుతోంది. అందుకే మరో ఇద్దరు ప్లోర్ లీడర్లను రంగంలోకి దింపినట్టు ప్రచారం సాగుతోంది. 

వాస్తవానికి హరీశ్ రావుకు అసెంబ్లీ వ్యవహారాలపై మంచి పట్టుంది. గతంలోనూ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని హరీష్ రావే ఎదుర్కొన్నారు. హరీశ్ రావు సభలో ఉండటంతో కేటీఆర్ కూడా పెద్దగా జోక్యం చేసుకున్న సందర్భాలు చాలా తక్కువే. కానీ ఇప్పుడు హరీశ్ రావుకు పోటీగా అటు తలసాని, ఇటు సబితా ఇంద్రారెడ్డి రంగంలోకి దిగబోతున్నారు. అయితే హరీశ్ ఒక్కరికే ఇవ్వకుండా మరో ఇద్దరితో కలిపి డిప్యూటీ ప్లోర్ లీడర్ పదవులు ఇవ్వడంపై హరీశ్ రావును వ్యతిరేకించే మరోవర్గం మాత్రం తెగ ఖుషీ అవుతున్నట్లు తెలుస్తోంది. అటు కాంగ్రెస్ కూడా హరీశ్ ను కేసీఆర్ పూర్తిస్థాయిలో నమ్మకుండా అనుమానిస్తున్నారంటూ బీఆర్ఎస్ కేడర్ లో గందరగోళ పరిచేలా కామెంట్స్ చేస్తున్నారు. ఇకమీదట హరీశ్ రావు తలనొప్పి తమకు లేదని గుసగుస లాడుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏదీఏమైనా గులాబీ పార్టీలో డిప్యూటీ ప్లోర్ లీడర్ల నియామకం మాత్రం.. హరీశ్ రావు వర్గంలో సెగలు రాజేస్తోందని ప్రచారం సాగుతోంది.

0
comment0
Report
Dec 31, 2025 16:50:08
0
comment0
Report
Advertisement
Back to top