ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ మానవత్వం, అతని ఆందోళన చూసి ఓ బాలికను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లారు.
Hyderabad, Telangana:యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ బాలికకు సైబరాబాద్లో సాయం చేశారు. పరీక్షా కేంద్రానికి చేరుకునే సమయం కావడంతో ఆందోళన చెందిన ఆమెను రాజేంద్రనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ సకాలంలో బైక్పై పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాడు. అతను తన దాతృత్వాన్ని ప్రదర్శించి అతనికి సహాయం చేశాడు. ఈ మానవ సృష్టికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Free Sewing Machine: తెలంగాణ మహిళలకు వరం.. రేపు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ
Hyderabad, Telangana:Telangana Govt Free Schemes: మహిళలకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని నేడు ప్రారంభించనుంది. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంలో భాగంగా మహిళల స్వయం ఉపాధి కోసం ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టనుంది. అయితే అందరూ మహిళలకు కాకుండా వెనుకబడిన వర్గాల (బీసీలు) మహిళలకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. నేడు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ చేయనుండగా ఆ పథకానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకానికి నేడు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రేపు ఆగస్టు 13 గురువారం సచివాలయంలో బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు మహిళలు ఆర్థిక వృద్ధి సాధించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కుట్టు వృత్తిపై ఆసక్తి నైపుణ్యం ఉన్న పేద, నిరుద్యోగ బీసీ మహిళలకు 100 శాతం ప్రభుత్వ సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్లను ఈ పథకం ద్వారా అందిస్తున్నారు.
రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ మహిళలను ఎంపిక చేసి వారికి ప్రతీ నియోజకవర్గంలో అందించనున్నారు. లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పూర్తిగా ప్రభుత్వ సబ్సిడీతో కుట్టు మిషన్లను అందిస్తుండడం విశేషం. కుట్టు వృత్తిపై నైపుణ్యం ఉన్న మహిళలకు ఆధునిక ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించడం ద్వారా ఇంటి వద్దనే స్వయం ఉపాధి పొందే అవకాశం కల్పించడంతోపాటు వారి ఆదాయాన్ని పెంచి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది.
మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా ఆదాయాన్ని ఆర్జించే స్వయం ఉపాధి మహిళలుగా.. భవిష్యత్ మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు బాటలు వేస్తూ, మహిళలను ఆర్థికంగా శక్తివంతం చేసే దిశగా ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకం కీలక ముందడుగుగా నిలవనుంది.
పథకం ప్రారంభం వివరాలు
ఎప్పుడు: ఆగస్టు 13, 2026 గురువారం
సయమం: మధ్యాహ్నం 12:00 గంటలకు
ఎక్కడ: హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలోని జీ-29
అర్హులు: పథకం విధి విధానాలు, కేటాయించిన బడ్జెట్, లబ్ధిదారుల ఎంపిక, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెల్లడించనున్నారు.
నీట్ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఫ్రీగా లాంగ్ టర్మ్ కోచింగ్, అప్లై చేసుకోండి..!
Lakshmapur, Telangana:Telangana NEET Free Coaching: నీట్ 2027కు సిద్ధమవుతున్న తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్యలో ప్రవేశం పొందేందుకు ఒక గొప్ప అవకాశం లభించింది. వచ్చే ఏడాది జరిగే నీట్ యూజీ పరీక్ష కోసం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థాన్ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) ఉచిత దీర్ఘకాలిక కోచింగ్ను అందించనుంది. అర్హులైన విద్యార్థులు ఆగస్టు 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి కంభంపాటి శారద తెలిపారు.
2026-27 విద్యా సంవత్సరానికి గాను ఈ ప్రత్యేక కోచింగ్ కార్యక్రమంలో మొత్తం 200 మంది విద్యార్థులకు అవకాశాలు కల్పించనున్నారు. ఇందులో 100 సీట్లు బాలురకు, 100 సీట్లు బాలికలకు కేటాయించబడ్డాయి. హైదరాబాద్లోని చిలకూరులో ఉన్న టీజీఎస్డబ్ల్యూఆర్ ఫౌండేషన్ సీఓఈ బాలురకు, మహేంద్ర హిల్స్ ఫౌండేషన్ సీఓఈ బాలికలకు ఉచిత నీట్ కోచింగ్ను అందిస్తాయి. 2025-26 విద్యా సంవత్సరంలో ఏదైనా కళాశాల నుండి ఇంటర్మీడియట్ లేదా బీ.ఎస్సీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే నీట్-2026 పరీక్ష రాసిన అభ్యర్థులకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించబడింది. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించడమైనది.
ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఐఎస్ (TGSREIIS) వెబ్సైట్ నుండి నోటిఫికేషన్, దరఖాస్తు ఫారమ్ను డౌన్లోడ్ చేసుకుని, దానిని పూర్తిగా నింపి, అవసరమైన పత్రాలను జతచేసి, సంబంధిత జిల్లా కోఆర్డినేటర్ (డీసీఓ) నిర్దేశించిన కేంద్రాలలో సమర్పించాలి. బాలుర దరఖాస్తులను చిలుకూరు కేంద్రంలో, బాలికల దరఖాస్తులను మహేంద్ర హిల్స్ కేంద్రంలో సమర్పించాలని అధికారులు సూచించారు.
ఈ ఉచిత నీట్ కోచింగ్ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల నుండి ఎటువంటి దరఖాస్తు రుసుము వసూలు చేయడం లేదని వర్గాలు తెలిపాయి. ఎంపికైన 200 మంది అభ్యర్థులకు ఉచిత వసతి , నిపుణులైన ఉపాధ్యాయుల నుండి నాణ్యమైన కోచింగ్ లభిస్తుందని కూడా వెల్లడించారు. వైద్య విద్యను అభ్యసించాలనుకునే అర్హులైన విద్యార్థులకు ఈ అవకాశం చాలా ఉపయోగకరంగా ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ ఉచిత నీట్ కోచింగ్కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల 22వ తేదీ. గడువులోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన విద్యార్థులను కోరారు.
Also Read:ఎస్బీఐలో 1,538 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో భారీ నోటిఫికేషన్.. దరఖాస్తు వివరాలు ఇవే..!!
Also Read:ఏమిటీ 'సావోజీ మటన్'? ఒకే ఒక్క కామెంట్తో రగిలిన వివాదం.. మహారాష్ట్రలో ఎందుకీ తీవ్ర దుమారం..?
Also Read: రోజూ ఈ గింజలు తింటే కిలో మటన్ తినంత బలం..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Solar Eclipse 2026: మరికొద్ది గంటల్లో సూర్యగ్రహణం ప్రారంభం..ఈ రాశుల వారికి తస్మాత్ జాగ్రత్త!
Hyderabad, Telangana:Solar Eclipse 2026 Zodiac Signs: ఈ ఏడాది (2026) రెండవ సూర్యగ్రహణం ఆగస్టు 12న సంభవించనుంది. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం రాత్రి 9:04 గంటలకు ప్రారంభమై, రాత్రి 11:16 గంటలకు గరిష్ట దశకు చేరుకుని, ఆగస్టు 13 తెల్లవారుజామున 1:27 గంటలకు ముగియనుంది. అయితే, ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. దీనివల్ల మన దేశంలో సూతక కాలం వర్తించదని జ్యోతిష్యులు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ, గ్రహాల గతులు, గోచారాల ప్రభావం అన్ని రాశులపై ఉంటుందని, కొన్ని రాశుల వారు మాత్రం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
రాశుల వారీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
మేష రాశి
మేష రాశి వారు తమ వృత్తి, ఉద్యోగాలపై మరింత ఏకాగ్రత పెట్టాలి. ఎవరితోనూ వాదనలకు దిగకుండా ప్రశాంతంగా ఉండటం మంచిది. అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకుంటూ, ప్రతి విషయంలోనూ ఓపిక వహించాలి.
వృషభ రాశి
ప్రయాణాలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. కుటుంబంలో చిన్నపాటి వివాదాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి, వాటిని పెద్దవి చేయకుండా ప్రశాంతంగా మాట్లాడి పరిష్కరించుకోవాలి.
సింహ రాశి
కోపాన్ని, తొందరపాటును పూర్తిగా నియంత్రించుకోవాలి. ఆవేశానికి పోయి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగ, వ్యాపార రంగాలలో ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
మకర రాశి
ఆరోగ్యం విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం తగదు. పనుల్లో తొందరపాటు నిర్ణయాలు నష్టాన్ని తెస్తాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ముందు సమగ్ర సమాచారం సేకరించడం ముఖ్యం. ప్రయాణాలలోనూ తగు జాగ్రత్తలు అవసరం.
పాటించాల్సిన పరిహారాలు..
ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించనప్పటికీ, జ్యోతిష్య ప్రభావం దృష్ట్యా సంయమనం పాటించడం ప్రయోజనకరం. "ఓం సూర్యాయ నమః" లేదా మహామృత్యుంజయ మంత్రం పఠించడం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు ఎంతో శుభప్రదంగా పరిగణించబడుతుంది.
Also Read: ఆగస్టు 11న అరుదైన రాజయోగం..ఈ నాలుగు రాశులకు రాజయోగాలతో అదృష్టం!
Also REad: Solar Eclipse: ఆగస్టు 12న సూర్యగ్రహణం..భారత్తో కనిపిస్తుందా? సూతక సమయం అప్పుడే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
కేజీబీవీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. సెలవులపై సమగ్రశిక్ష SPD కీలక ఉత్తర్వులు..!!
Lakshmapur, Telangana:KGBV Staff Leave Rules: తెలంగాణలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న స్పెషల్ ఆఫీసర్లు, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కేజీబీవీ సిబ్బందికి ఏడాదికి 15 రోజుల క్యాజువల్ లీవ్ (CL) మంజూరు చేస్తూ సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ (SPD) పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్, IAS అధికారిక జీవో జారీ చేశారు. గతంలో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం.. కేజీబీవీల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, ప్రత్యేక అధికారులు నెలకు గరిష్ఠంగా 2 క్యాజువల్ లీవులు (2 CLs) మాత్రమే వినియోగించుకోవడానికి అవకాశం ఉండేది. దీనివల్ల అత్యవసర సమయాల్లో లేదా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు.
తాజా ఉత్తర్వుల ప్రకారం, నెలకు గరిష్ఠంగా 2 సీఎల్లు మాత్రమే వాడాలనే నిబంధనను విద్యాశాఖ పూర్తిగా తొలగించింది. ఇకపై సంవత్సరానికి కేటాయించిన 15 రోజుల క్యాజువల్ లీవులను తమ అవసరాన్ని బట్టి వినియోగించుకునే వెసులుబాటును కల్పించారు. సమగ్రశిక్ష విడుదల చేసిన ఈ నూతన ఉత్తర్వులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేజీబీవీలలో తక్షణమే అమలులోకి రానున్నాయి. అయితే, హైదరాబాద్. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల కేజీబీవీలకు ఈ జీవో వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, సీఆర్టీ (CRT)లు కాంట్రాక్ట్ టీచర్లు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ముందస్తు అనుమతి తప్పనిసరి: సాధారణ సెలవు అనేది హక్కుగా భావించరాదు. అత్యవసర పరిస్థితులు మినహా, సాధారణ రోజుల్లో సిబ్బంది తమ సెలవు దరఖాస్తును కేజీబీవీ ప్రత్యేక అధికారి (SO) లేదా సంబంధిత విభాగాధిపతికి సమర్పించి ముందస్తు అనుమతి పొందాలి.
అర్ధ రోజు (Half Day) లీవ్: సిబ్బంది వ్యక్తిగత పనుల నిమిత్తం ఒంటిపూట సెలవు కూడా వాడుకోవచ్చు. ఉదయం సెషన్ (10:30 నుండి 01:30) లేదా మధ్యాహ్నం సెషన్ (02:00 నుండి 05:00) వరకు దీనిని పరిగణిస్తారు (G.O.Ms.No.112 Fin).
లేట్ అటెండెన్స్ పెనాల్టీ: నిబంధనల ప్రకారం ప్రతినెల ఆఫీస్/స్కూల్ టైమింగ్స్ కంటే 3 రోజులు ఆలస్యంగా హాజరైతే, వారి ఖాతా నుండి 1 సాధారణ సెలవు (CL) మినహాయించబడుతుంది.
క్యారీ ఫార్వర్డ్ ఉండదు: ఆయా సంవత్సరంలో మిగిలిపోయిన సాధారణ సెలవులు డిసెంబర్ 31 తో ముగుస్తాయి (Lapse). వీటిని తదుపరి సంవత్సరానికి బదిలీ చేయడం లేదా నగదు రూపంలోకి మార్చుకోవడం (Encashment) కుదరదు.
కేజీబీవీలలో వంద శాతం మహిళా సిబ్బంది విధులు నిర్వహిస్తుండటంతో, ప్రభుత్వం వారికి కొన్ని ప్రత్యేక సెలవుల రక్షణలు కల్పించింది..
ప్రసూతి సెలవులు (Maternity Leave): సమగ్ర శిక్ష నిబంధనల ప్రకారం కేజీబీవీ కాంట్రాక్ట్ మహిళా సిబ్బందికి మొదటి ఇద్దరు పిల్లల ప్రసవానికి పూర్తి వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులను ప్రభుత్వం కల్పిస్తోంది.
ప్రత్యేక సాధారణ సెలవులు (Special CL): ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రత్యేక సందర్భాలలో లేదా మహిళా ఉపాధ్యాయులకు కల్పించే ప్రత్యేక ఆకస్మిక సెలవుల మార్గదర్శకాలను కూడా స్థానిక నిబంధనల మేరకు వర్తింపజేస్తారు.
Also Read:ఎస్బీఐలో 1,538 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో భారీ నోటిఫికేషన్.. దరఖాస్తు వివరాలు ఇవే..!!
Also Read:ఏమిటీ 'సావోజీ మటన్'? ఒకే ఒక్క కామెంట్తో రగిలిన వివాదం.. మహారాష్ట్రలో ఎందుకీ తీవ్ర దుమారం..?
Also Read: రోజూ ఈ గింజలు తింటే కిలో మటన్ తినంత బలం..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు షెడ్యూల్ ఖరారు..ఆగస్టు 17 నుంచి సభ ప్రారంభం!
Velgapudi, Andhra Pradesh:Indiramma Indlu Towers: రేపే శంకుస్థాపన.. తీరనున్న హైదరాబాద్ ప్రజల సొంతింటి కల
Hyderabad, Telangana:Hyderabad: హైదరాబాద్లో పేదల సొంతింటి కల నెరవేర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. హైదరాబాద్లోని కేపీహెచ్బీలో తొలి ఇందిరమ్మ టవర్స్కు శంకుస్థాపన చేయనుంది. రేపు శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. కేపీహెచ్బీలోని మలేషియన్ టౌన్షిప్ ఎదురుగా ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణం చేయనున్నారు. హౌసింగ్ బోర్డు స్థలంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం ప్రభుత్వం చేపట్టనుంది. అత్యంత ప్రైమ్ లొకేషన్ లో నిర్మిస్తున్న ఈ టవర్స్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బీపీఎల్ కుటుంబాలకు ఇందిరమ్మ టవర్స్ అందుబాటులోకి రానున్నాయి. కేపీహెచ్బీ 7, 9 ఫేజ్ మధ్య ఉన్న అత్యంత ప్రైమ్ లొకేషన్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తోంది. ఈ టవర్స్ నిర్మాణానికి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల విషయంలో హైదరాబాద్లో కార్యరూపం దాల్చనుంది. హైదరాబాద్వాసులకు ఎల్ఐజీ ఇండ్ల నిర్మాణ పేరిట టవర్స్ను నిర్మిస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.
కేపీహెచ్బీ కాలనీలోని 9వ ఫేజ్ వద్ద సాయంత్రం 4 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి టవర్స్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రతి నియోజకవర్గానికి 528 ఎస్ఎఫ్టీలతో 480 ప్లాట్లకు సంబంధించి 16 నియోజకవర్గాలలో మొదటి విడత నిర్మాణం చేపట్టనున్నారు. రేపు శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేశ్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ సన్ ప్రీత్ సింగ్, హౌసింగ్ బోర్డ్ అధికారులు పరిశీలించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసే స్థలాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు. కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి ఫేజ్-1లో 480 ఫేజ్-2లో 680 ఇండ్ల నిర్మాణం ఇక్కడ చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన 5.87 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మొత్తం నాలుగు టవర్లు నిర్మించనుండగా.. ఒక్కో టవర్కు రూ.10 కోట్ల ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. నాలుగు టవర్లకు రూ.43 కోట్లు అంచనా వేసి రెండు ఫేజ్లలో ప్రభుత్వం నిర్మాణం చేయనుంది.
Jr NTR Health Update: హీరో ఎన్టీఆర్కు సర్జరీ విజయవంతం..ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే?
Hyderabad, Telangana:Jr NTR Health Update News: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్.టి.ఆర్ ఆరోగ్య పరిస్థితిపై సికింద్రాబాద్లోని కిమ్స్ (KIMS) ఆసుపత్రి యాజమాన్యం అధికారికంగా ఒక హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. ఇటీవల జరిగిన ఒక అవాంఛనీయ ఘటనలో ఆయన భుజానికి గాయం కావడంతో, వైద్య నిపుణుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరారు. ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల అనంతరం, నిపుణులైన వైద్యుల బృందం త్వరితగతిన కోలుకునేందుకు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ (Arthroscopic Surgery) శ్రేయస్కరమని నిర్ధారించి, శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది.Bigg Boss Agnipareeksha: బిగ్బాస్ అగ్నిపరీక్ష సీజన్కు రంగం సిద్ధం..ఎంపికైన టాప్ 15 కంటెస్టెంట్లు వీళ్లే!
Hyderabad, Telangana:Bigg Boss Agnipareeksha Contestants: తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్' గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షో ప్రారంభం కాకముందే హౌస్లోకి ఎవరు అడుగుపెడతారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎవరివంటూ అభిమానులలో భారీ అంచనాలు ఉంటాయి. త్వరలో అట్టహాసంగా ప్రారంభంకానున్న బిగ్ బాస్ సీజన్ 10 కోసం నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లు వేగవంతం చేశారు. ప్రధాన షో ప్రారంభానికి ముందే ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా 'అగ్నిపరీక్ష' రెండో సీజన్ సరికొత్త జోష్తో వచ్చేందుకు సిద్ధమైంది.
ఆగస్టు 15 నుంచి ఈ షో ప్రసారం కానుండగా, అప్పుడే కంటెస్టెంట్లకు సంబంధించిన లీకులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఈసారి కామన్ పీపుల్కు పెద్దపీట వేస్తూ నిర్వహించిన ఈ వేడుకలో విపరీతమైన స్పందన లభించింది. దేశవ్యాప్తంగా వచ్చిన వేలాది దరఖాస్తుల నుంచి మొదటగా దాదాపు 70 మందిని నిర్వాహకులు షార్ట్ లిస్ట్ చేశారు. వీరికి కఠినమైన టాస్కులు, ఇంటర్వ్యూలు నిర్వహించి జల్లెడ పట్టారు.
ఈ 70 మంది 'అగ్ని వారియర్స్' నుంచి టాప్ 15 మంది కంటెస్టెంట్లను ముగ్గురు జడ్జీలు ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ టాప్ 15 మంది నుంచి చివరికి కేవలం ఐదారు మందిని మాత్రమే అసలు బిగ్బాస్ హౌస్లోకి పంపించనున్నారు. అంటే హౌస్లోకి వెళ్లకముందే కంటెస్టెంట్లకు అసలైన పరీక్ష ఇక్కడే ప్రారంభమైందన్నమాట.
మరోవైపు ఈ షోకు సంబంధించిన జ్యూరీ ప్యానెల్ మరింత ఆకర్షణీయంగా ఉంది. గెలిచిన అనుభవం ఉన్న ప్రముఖులు బిందు మాధవి, నవదీప్, అభిజీత్ మరోసారి జడ్జీలుగా వ్యవహరిస్తూ కంటెస్టెంట్లను కఠినంగా పరీక్షిస్తున్నారు. మరోవైపు ప్రముఖ యాంకర్ శ్రీముఖి తనదైన ఎనర్జిటిక్ కామెంట్స్తో షోకు మరింత జోష్ తెస్తున్నారు. జడ్జీలు కొందరితో సరదాగా మాట్లాడుతూనే, తప్పులున్న చోట తీవ్రంగా స్పందిస్తున్న తీరు తాజాగా విడుదలైన ప్రోమోలో స్పష్టంగా కనిపిస్తోంది.
బిగ్ బాస్ షో అనగానే లీకుల బెడద కామన్ అన్నట్లుగా, 'అగ్నిపరీక్ష' ప్రసారం కాకముందే టాప్ 15 మందికి సంబంధించిన పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రాజకుమారి డయానా, ఆర్జే చరణ్, షాలిని పటేల్, మిథిలేష్, అమన్, శ్రష్ఠి వ్యాకర్ని, హేమంత్, భాగీ తుళ్లూరి, నవరసాలు ఆర్కే, దీపక్, యాంకర్ ప్రియా, రోహిత్, సింగర్ ఝాన్సీ, మిస్ అపూర్వ, గాయత్రి తదితరులు ఈ జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న ఈ ఎపిసోడ్స్ ద్వారా అసలు లక్కీ కంటెస్టెంట్లు ఎవరో తేలనుంది.
Also REad: 'కల్కి 2' సినిమాలో ప్రభాస్తో కలిసి నటించాలని ఉందా? మేకర్స్ అధికారిక ప్రకటన!
Also REad: హీరో ఎన్టీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల..ఆరోగ్య పరిస్థితిని ప్రకటించిన కిమ్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
YS Sharmila: తప్పుడు లెక్కలతో చంద్రబాబు చెప్పేదంతా సొంత డబ్బా: వైఎస్ షర్మిల
Vijayawada, Andhra Pradesh:YS Sharmila vs Chandrababu: వృద్ధి రేటుపై కూటమి ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారంపై 'ఎక్స్' వేదికగా కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. వృద్ధి రేటు అంతా చంద్రబాబు సొంత డబ్బా కొట్టుకోవడమేనని విమర్శించారు. వృద్ధి రేటుపై అనుకూలంగా అన్ని మీడియాల్లో చాటింపు వేసుకున్న చంద్రబాబు వాస్తవాలను తొక్కిపెట్టారని.. వైఫల్యాలను దాచిపెట్టారని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో కొట్టొచ్చినట్టు నిరాశ నిస్పృహలు కనపడుతున్నాయని.. రాష్ట్రాన్ని తప్పించుకొలేని కష్టనష్టాల్లోకి తోసేశారని కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు.
'వృద్ధి లేదు, అభివృద్ధి అంతకన్నా లేదు. ఆర్థికంగా పరుగులు పెడుతున్నామని జాతీయ సగటు కంటే గొప్పోళ్లు అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేదంతా సొంత డబ్బా. వృద్ధి అధఃపాతాళం' అని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. అభివృద్ధి కాదు అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిందని ఆరోపించారు. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 10.7 శాతం వృద్ధి రేటు ఉందని అన్ని మీడియాల్లో చాటింపు వేసుకున్న చంద్రబాబు వాస్తవాలను తొక్కిపెట్టారని తెలిపారు. వైఫల్యాలను దాచిపెట్టారని వైఎస్ షర్మిల చెప్పారు. అన్ని రంగాల్లో కొట్టొచ్చినట్టు నిరాశ నిస్పృహలు కనపడుతుంటే తప్పటడుగులతో తప్పుడు లెక్కలతో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తప్పించుకొలేని కష్టనష్టాల్లోకి తోసేశారని చంద్రబాబుపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఎక్కడ వృద్ధి రేటు? ఎందులో వృద్ధి రేటు? దేశ సగటుకంటే హెచ్చుగా ఉన్న నిరుద్యోగంలోనా ఈ వృద్ధి రేటు? అరటి నుంచి మామిడి, టమాటా నుంచి కోకో, పత్తి నుంచి పొగాకు రెండేళ్లుగా ఒక్క పంటకు మద్దతు ధర లేక.. అటు ప్రభుత్వ మద్దతు లేక.. రైతు పంటను, బతుకులను రోడ్డుమీద నిలబెట్టి దైన్యంగా నించుంటే, రైతు కన్నీటిలో వృద్ధి రేటా?' అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. పట్టపగలే హత్యలు, మద్యం, గంజాయి మత్తులో మర్డర్లు, మహిళలపై దాడులు, చివరికి పోలీసులకే రక్షణలేని మీ పాలనలో నిర్లక్ష్యంలో వృద్ధి రేటా? అని నిలదీశారు.
'పోలవరం ప్రాజెక్టు పచ్చిమోసం. 41.5 మీటర్లకు కుదించి అదేదో పెద్ద ఘనకార్యంలా డబ్బాలు కొట్టుకుంటున్న మీకు రేపు ఈ ఎత్తుతో ఏమీ ఒరగదని తెలిసికూడా రైతులను ముంచడంలో వృద్ధి రేటా?' అని కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రూ డౌన్ చేసి విద్యుత్తు ధరలు తగ్గించామని చెప్పి.. మరొక వైపు నిర్లజ్జగా పాత చార్జీలను పేదల మీద రుద్దటంతో, మీ వెన్నుపోటు విధానాల్లో వృద్ధి రేటా?' అని ప్రశ్నించారు.
'రెండేళ్లలో లక్షల కోట్ల పెట్టుబడి అంటూ ఇప్పటికి ఎన్ని ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యాయి, వాటికి భూమి, నీరు, విద్యుత్తు ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో మీ విధి విధానాలేమిటో చెప్పకుండా, నిజాలను మరింత చీకటిలో నెడితే, పారదర్శకత లేమిలో వృద్ధి రేటా?' అని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సందేహం వ్యక్తం చేశారు. చివరాఖరిగా ఫాసిస్టు నరేంద్ర మోదీని రోజూ పొగడ్తల్లో ముంచేస్తూ విద్యార్థుల ఉద్యమాలు పట్టకుండా.. కనీసం వారికి మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడలేని మీ పిరికితనానికి, చేతగానితనానికి ఇది వృద్ధి రేటా? అని నిలదీశారు. ఇవన్నీ మా విమర్శలు కాదు.. ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలు అని వివరించారు. అబద్ధాలను అందంగా వల్లించే కూటమి ప్రభుత్వం వృద్ధిరేటుపై ఆత్మవిమర్శ చేసుకోవాలని కూటమి ప్రభుత్వానికి వైఎస్ షర్మిల హితవు పలికారు.
Ayyanna Patrudu YS Jagan: అసెంబ్లీకి రాకపోతే జీతం కట్..వైఎస్ జగన్పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు!
Velgapudi, Andhra Pradesh:Ayyanna Patrudu On YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసెంబ్లీ సమావేశాల వేడెక్కాయి. కాకినాడ జిల్లా తుని పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు.. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఘాటు విమర్శలు చేశారు. చట్టసభలకు గైర్హాజరవుతున్న ప్రజాప్రతినిధుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కీలక ముఖ్యాంశాలు..
జీతాల కోతకు ప్రత్యేక చట్టం తేవాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అభిప్రాయపడ్డారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకునే ఎమ్మెల్యేలపై చర్యలు ఉండాలని, వారి జీతభత్యాలను వెనక్కి తీసుకునేలా ప్రత్యేక చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. ప్రజాధనం వృథా కాకుండా పార్లమెంట్ పరిధిలోనే కఠిన నిబంధనలు రావాలన్నారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్కు స్పీకర్ కొన్ని సూచనలు చేశారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకే ప్రజలు జగన్ను గెలిపించారని, కాబట్టి ఆయన బాధ్యతగా సభకు హాజరుకావాలని స్పష్టం చేశారు.
అసెంబ్లీలో దొంగ హాజరులకు చెక్ పెట్టేందుకు సరికొత్త విధానం తెస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పారు. ఎమ్మెల్యేలకు కేటాయించిన సీట్లలో వారు స్వయంగా కూర్చుంటేనే ఆటోమేటిక్ కెమెరాలు ఆన్ అవుతాయని, అప్పుడే హాజరు నమోదవుతుందని తేల్చిచెప్పారు. ఈ నెల 17న జరగనున్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
డీఎస్సీ దుష్ప్రచారంపై మండిపాటు
కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా చేపట్టిన డీఎస్సీ నియామకాలపై జగన్, వైఎస్సార్సీపీ నేతలు తప్పుడు ప్రచారాలు మానివేయాలని హితవు పలికారు. "స్పోర్ట్స్ కోటా" అంటే జగన్కు కనీస అవగాహన ఉందా అని ఆయన ఎద్దేవా చేశారు. అర్హులైన నిరుద్యోగులను మానసికంగా కుంగదీసేలా మాట్లాడటం దారుణమని విమర్శించారు.
Also Read: అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్? ఆగస్టు 17న అసెంబ్లీలో అడుగుపెడతారా?
Also REad; గోవింద నామాలతో వైసీపీ నేతలు పేరడీలు..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sircilla: 20 ఏళ్లలో ఇలాంటి దిగజారుడుతనం చూడలేదు..: కాంగ్రెస్పై KTR ఫైర్
Hyderabad, Telangana:Sircilla News: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత 20 సంవత్సరాలుగా ఎప్పుడు లేని విధంగా అత్యంత దిగజారుడు రాజకీయాలు నడుస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల దారుణ హత్యకు గురైన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని ఆయన స్వయంగా పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి.. వారికి కొండంత అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై KTR నిప్పులు చెరిగారు.
రాజకీయ లబ్ధి కోసం హత్యల పర్వమా..
కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి ఒక సామాన్యుడిని అత్యంత దారుణంగా హత్య చేసి.. దానిని ఆత్మహత్యగా చిత్రీకరించే.. ప్రయత్నం చేయడం బాధాకరమని KTR విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న.. ఈ అకృత్యాలను సభ్య సమాజం ఎప్పటికీ హర్షించదని.. వారిని క్షమించదని హెచ్చరించారు. BRS పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలనుకుంటే నేరుగా ఎన్నికల మైదానంలో తలపడొచ్చు.. మాపై కేసులు పెట్టొచ్చు, రాజకీయంగా వేధించవచ్చు. కానీ.. ఈ రాజకీయంలో ఏ పాపం తెలియని అమాయకులను, సామాన్యులను బలి చేయడం ఏంటని.. ఆయన సూటిగా ప్రశ్నించారు.
వెంగళ వెంకటేశం హత్య కేసులో పోలీసులు కేవలం కింది స్థాయి నాయకులను మాత్రమే అరెస్టు చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని KTR ఆరోపించారు. ఈ దారుణం వెనుక ఇంకా పెద్ద నాయకుల హస్తం ఉందని.. ఆ అసలు సూత్రధారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. అమాయకుడి ప్రాణం తీసిన వారికి చట్టపరంగా కఠిన శిక్ష పడేలా పార్టీ పక్షాన న్యాయపోరాటం చేస్తామన్నారు.
వెంగళ వెంకటేశం తన ఇంటి సమస్య పరిష్కారం కోసం నెల రోజుల పాటు అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని KTR ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై తాను ఇప్పటికే జిల్లా కలెక్టర్తో స్వయంగా మాట్లాడానని తెలిపారు. ప్రభుత్వమే వెంకటేశం కుటుంబానికి ఇంటి నిర్మాణం చేపట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే.. BRS పార్టీ పక్షాన సొంత ఖర్చులతో ఆ బాధిత కుటుంబానికి ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు.
బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ.. తక్షణ ఆర్థిక సాయంగా కింద రూ.3 లక్షలు అందిస్తున్నట్లు KTR ప్రకటించారు. అలాగే, వెంకటేశం కూతురి చదువుకయ్యే పూర్తి ఖర్చును BRS పార్టీ తరఫున తామే భరిస్తామని.. ఆ బిడ్డ భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేకుండా చూసుకుంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
మెట్రోలో స్టేషన్లో టికెట్ తీసుకోకుండా గేట్ల కింద నుంచి పాకిన మహిళలు.. వీడియో!
Hyderabad, Telangana:Women Crawling Metro Gate Video Watch: రైళ్లతో పాటు బస్సులు, మెట్రోల్లో ప్రయాణించేటప్పుడు కనీసం తప్పకుండా కొన్ని రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తప్పకుండా టికెట్ కొనుగోలు చేయడం ప్రతి పౌరుడి బాధ్యతగా భావిస్తూ ఉంటారు.. కానీ, కొంతమంది చేసే పనులు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.. కొద్దిరోజులుగా ఢిల్లీ మెట్రో రకరకాల వింత ఘటనలకు కేరఫ్ అడ్రస్గా మారుతూ వస్తున్న విషయం తెలిసిందే.. చాలా మంది మెట్రోలో వింత వింత డ్యాన్సులు చేయడంతో పాటు రీల్స్ చేయడం, తోటి ప్రయాణికులతో గొడవలు పడటం వంటి వీడియోలు మనం నిత్యం ఏన్నో సోషల్ మీడియాల్లో చూస్తూ ఉంటాం.. కానీ తాజాగా ఢిల్లీ మెట్రోలో జరిగిన ఒక ఘటన సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతూ వస్తోంది. అయితే, ఈ వీడియో ఏంటి? ఇంతలా వైరల్ కావడానికి గల కారణాలేంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
టికెట్ డబ్బులు ఆదా చేయడం కోసం కొందరు మహిళలు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఢిల్లీ మెట్రో అనగానే మనందరికీ భద్రతతో పాటు మంచి ప్రయాణం గుర్తుకొస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఎక్స్లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. కొందరు మహిళలు చీరలు కట్టుకుని ఉండడం మీరు చూడొచ్చు.. ఏమాత్రం భయం లేకుండా వారు ఆటోమేటెడ్ టికెట్ గేట్ల కింద నుంచి దూరుతూ లోపలికి వెళ్లడం స్పష్టంగా మీరు ఈ వీడియోలో చూడొచ్చు..
సాధారణంగా ఎవరైనా ప్రయాణికులు కార్డ్ స్వైప్ చేయడం లేదా.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే గేట్లు తెరుచుకుంటూ ఉంటాయి.. కానీ.. ఈ మహిళలు టికెట్ కోసం డబ్బులు ఖర్చు చేయడానికి ఇష్టం లేకనో.. లేక మరే కారణమో కానీ.. గేట్ల కింద ఉన్న కొద్దిపాటి ఖాళీ స్థలంలో నుంచి వంగి.. పాకుతూ మెట్రో లోకి ఎంట్రీ ఇవ్వడం మీరు క్లియర్గా ఈ వీడియోలో చూడొచ్చు.
Meanwhile Indian people civic sense: pic.twitter.com/OYlm9siNrO
— v. Jatin (@JatinTweets_) August 10, 2026
ఈ వైరల్ వీడియోలో అందరినీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. ఆ మహిళలతో పాటు ఉన్న చిన్న పిల్లలు కూడా పెద్దలను చూసి అదే తరహాలో అక్కడే గేట్ల కింది భాగంలో దూరుతూ వెళ్లిపోవడం మీరు గమనించవచ్చు.. పిల్లలు ఎప్పుడు తమ పెద్దల చేసే పనులు చూసి మాత్రమే.. వారు చేస్తూ ఉంటారు. పిల్లలకు ఇలాంటి తప్పుడు పనులు నేర్పిస్తూ.. ఇలా చేయడం అస్సలు మంచిది కాదని నెటిజన్స్ మండిపడుతున్నారు. అంతేకాకుండా కొంతమంది మెట్రో సిబ్బందిపై కూడా విరుచుకు పడుతున్నారు. ఏది ఏమైన ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా వైరల్గా మారింది.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Inmates SSC Pass: జైళ్ల చరిత్రలో తొలిసారి.. తెలంగాణలో 78 మంది ఖైదీలు పదో తరగతి పాస్
Baddipadaga, Telangana:Telangana Prisoners SSC Pass: తెలంగాణ జైళ్ల చరిత్రలో తొలిసారి ఖైదీలు అత్యధికంగా పదో తరగతి ఉత్తీర్ణత సాధించారు. ఖైదీల విద్య, పునరావాసం , సమాజంలో తిరిగి గౌరవప్రదంగా జీవించేలా చేయడంలో భాగంగా తెలంగాణ జైళ్ల శాఖ చేపడుతున్న నిరంతర కార్యక్రమాల్లో మరో కీలక అడుగు వేసింది. ఖైదీలు తమ విద్యను కొనసాగించి పదో తరగతి పూర్తి చేసుకునే అవకాశం కల్పించింది. తెలంగాణ జైళ్ల శాఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం అనంతరం సెంట్రల్ ప్రిజన్, చర్లపల్లి; సెంట్రల్ ప్రిజన్, నిజామాబాద్; స్పెషల్ ప్రిజన్ ఫర్ ఉమెన్, హైదరాబాద్ నుంచి మొత్తం 108 మంది ఖైదీలు SSC (10వ తరగతి) కార్యక్రమంలో నమోదు చేసుకున్నారు. ఖైదీల చదువుకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులను కేటాయించడంతో పాటు, అవసరమైన చోట అదనంగా ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా నియమించారు. వీరి వేతనాలను తెలంగాణ జైళ్ల శాఖ భరించింది.
PM E-Drive Scheme: ఈవీ వాహనాలు కొనుగోలు చేసేవారికి గుడ్న్యూస్..పీఎం ఈ-డ్రైవ్ పథకంతో రూ.5,000 డిస్కౌంట్!
Hyderabad, Telangana:PM E-Drive Scheme Subsidy: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని (EV) కొనుగోలు చేయాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం మిశ్రమ స్పందనతో కూడిన నిర్ణయాన్ని వెల్లడించింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం 'పీఎం ఇ-డ్రైవ్' (PM E-DRIVE) పథకంలో కీలక మార్పులు చేసింది. ఈ పథకం కింద టూ-వీలర్లపై ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని తగ్గించినప్పటికీ, పథకం గడువును మాత్రం 2028 మార్చి 31 వరకు పొడిగించింది.
సబ్సిడీ వివరాలు, మార్పులు
1) ద్విచక్ర వాహనాల కేటగిరీకి గతంలో కేటాయించిన రూ.1,772 కోట్ల బడ్జెట్ను రూ.2,767 కోట్లకు పెంచారు. దీనివల్ల దేశవ్యాప్తంగా దాదాపు 46 లక్షల ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు సబ్సిడీ ప్రయోజనం దక్కనుంది.
2) ఏప్రిల్ 1, 2025 నుంచి రిజిస్టర్ అయ్యే ఈవీలకు బ్యాటరీ సామర్థ్యం ప్రతి కిలోవాట్-గంటకు (kWh) రూ.2,500 చొప్పున సబ్సిడీ లభిస్తుంది (గతంలో ఇది రూ.5,000 ఉండేది).
3) గరిష్ట పరిమితి కింద ఒక వాహనానికి గరిష్ట సబ్సిడీ పరిమితిని రూ.5,000 (గతంలో రూ.10,000)గా నిర్ణయించారు.
అర్హత: ఎక్స్-షోరూమ్ ధర రూ.1.5 లక్షల వరకు ఉన్న ఎలక్ట్రిక్ టూ-వీలర్లు మాత్రమే ఈ పథకానికి అర్హత పొందుతాయి. సబ్సిడీ మొత్తం ఎక్స్-షోరూమ్ ధరలో 15% లేదా రూ.5,000 (ఏది తక్కువైతే అది) వర్తిస్తుంది.
పథకం ముఖ్యమైన గడువులు
అమలు కాలం: ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2028 మధ్య రిజిస్టర్ అయ్యే వాహనాలకు వర్తిస్తుంది.
క్లెయిమ్ల గడువు: సబ్సిడీ క్లెయిమ్లను సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2027. మార్చి 31, 2028 తర్వాత ఎలాంటి చెల్లింపులు ఉండవు. ఒకవేళ కేటాయించిన నిధులు గడువు కంటే ముందే అయిపోతే ఈ పథకం ముగుస్తుంది.
ఈవీల వృద్ధి, ఇతర కేటగిరీలు
భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. 'వాహన్' పోర్టల్ డేటా ప్రకారం, 2022 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2,52,787 ఈవీలు అమ్ముడవ్వగా.. 2026 నాటికి ఆ సంఖ్య 14.6 లక్షలకు పెరిగింది.
ఈ పథకం కేవలం ద్విచక్ర వాహనాలకే కాకుండా.. ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు, బస్సులు, ట్రక్కులు, అంబులెన్సులు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా వర్తిస్తుంది. మీరు సమీప భవిష్యత్తులో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్ కొనుగోలు చేయాలని భావిస్తుంటే, మార్చి 31, 2028 వరకు ఈ ప్రభుత్వ సబ్సిడీని సద్వినియోగం చేసుకోవచ్చు.
Also REad; రూ.35,999 విలువైన శాంసంగ్ గెలాక్సీ 5జీ మొబైల్ ఇప్పుడు కేవలం రూ.26,999లకే!
Also Read: భారీగా తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు..భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
చంద్రబాబుతో కలిసి రేవంత్ రెడ్డి తెలంగాణకు తీరని అన్యాయం: జగదీశ్ రెడ్డి
Hyderabad, Telangana:Jagadish Reddy vs Revanth Reddy: 'చంద్రబాబు నాయుడు కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును రేవంత్ రెడ్డి ఎండబెట్టాడు. చంద్ర బాబు నాయుడు దగ్గర రేవంత్ రెడ్డి లొంగిపోయి కుక్కలా బతుకుతున్నాడు' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జగదీశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాగార్జున సాగర్ దగ్గర వరుణ యాగం చేయడం కాదు దమ్ముంటే పోతిరెడ్డిపాడు గేట్లు బంద్ చేయాలని డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్కు ఇంతవరకు ఒక్క చుక్క నీరు రాలేదు ఎడమ కాలువ కింద రైతులు పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ద్రోహం, మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో నీటి విడుదలపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి నల్లగొండ జిల్లా నాయకులతో కలిసి కీలక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫ్యాలు ఎండగట్టారు. 'రెండు నెలలుగా గోదావరి పై బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించుకునిపోతుంటే రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నాడు. కేసీఆర్ హయాంలో ఆనాడు శ్రీశైలం ఎగువన 10 నుంచి 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది' అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వివరించారు.
'ఎగువ నుంచి కృష్ణాకు బ్రహ్మాండంగా నీళ్లు వస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటుంది. పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి కన్న తల్లికి ద్రోహం చేస్తున్నాడు. నాగార్జున సాగర్లో నీళ్లు ఉన్నా రైతులకు నీళ్లు ఇవ్వలేమని జిల్లా మంత్రి వాటర్లో నీళ్లు కలిపి తాగి మాట్లాడుతున్నాడు. ఇప్పటికే పాలమూరుకు మొదటి పంట పండించుకునే అవకాశం ఉంది. రేవంత్ ప్రభుత్వ దుర్మార్గానికి ఇంతవరకు ఒక్క ఎకరానికి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది' అని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
'నాగార్జున సాగర్కు చుక్క నీరు రాకుండా పోతిరెడ్డిపాడుకు నీళ్లు తరలిస్తున్నారు. 25 వేల క్యూసెక్కుల నీళ్లు పోతిరెడ్డిపాడు నుంచి తరలిస్తుంటే నాగార్జున సాగర్ చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు. ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇవ్వకుండా పెద్ద కుట్ర చేస్తోంది. రైతులు ఆరుతడి పంటలు వేసుకోండని అంటున్నారు. ఆరుతడి పంటలకైన నీళ్లే కావాలి కదా! పోతిరెడ్డిపాడుకు నీళ్లు ఇవ్వొద్దని డిమాండ్ చేసే దమ్ముందా!' అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్ చేశారు.
'తెలంగాణ రాష్ట్రానికి చెందిన 7 ప్రాజెక్టుల పై రివ్యూ చేయాలని జీఆర్ఎంబీ ఎజెండాలో పొందుపరిచారు. బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిన తరువాత ఎజెండా అంశాలపై లేఖ రాశారు. జీఆర్ఎంబీ సమావేశాన్ని బహిష్కరించాలి' అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. 'నాగార్జున సాగర్ నిండేంత వరకు పోతిరెడ్డిపాడు నీళ్లు తీసుకొని పోవడానికి వీల్లేదు. ఎవరి ఆదేశాలతో పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తరలిస్తున్నారు? అని ప్రశ్నించారు.
'రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రైతుల పట్ల సోయి ఉంటే రెండు పంటలకు నీళ్లు ఇవ్వొచ్చు. మంత్రి శ్రీధర్ బాబుకు చీము రక్తం ఉంటే సిగ్గుతప్పిన మాటలు మాట్లాడకూడదు. చంద్రబాబు నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ ఎందుకు లాగులు తడుపుకుంటున్నారు? అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. 'నా ముందు మాట్లాడే దైర్యం తెలంగాణ ప్రభుత్వానికి లేదనే జీఆర్ఎంబీ ఎజెండా చంద్రబాబు పొందుపరిచాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి బుర్ర మోకాళ్లో ఉంది. తెలంగాణలో 7 ప్రాజెక్టులకు టీఏసీ అనుమతులు పొందినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియదా?' అని నిలదీశారు.
'ఆరుతడి పంటలకు అర్ధం తెలియని వెధవలు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఇది మన దురదృష్టం. అడ్డగోలుగా భూ దందాలతో రేవంత్ రెడ్డి, మంత్రులు బిజీగా ఉంటే అధికారులు రైతులకు దగ్గరకు వెళ్తున్నారు' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామని ప్రకటించారు. ఎల్ నినో ప్రభావంతో తాగునీటి సమస్య ఉంటే పోతిరెడ్డిపాడుకు నీళ్లు ఎలా పోతున్నాయని ప్రశ్నించారు. రైతులకు నీళ్లు ఇవ్వకుండా వరుణ యాగాలు చేస్తా. క్షుద్ర పూజలు చేస్తా అంటే ఎలా అని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు.
మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్, నల్లమోతు భాస్కర్ రావు, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి కుమార్, బిఆర్ఎస్ నేతలు వంటెద్దు నరసింహారెడ్డి, కడారి అంజయ్య పాల్గొన్నారు.
