Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rangareddy501505

తెలంగాణలో 11062 పోస్టులకు 2.79 లక్షల దరఖాస్తులు ప్రారంభమయ్యాయి

Jul 18, 2024 10:13:27
Hayathnagar_Khalsa, Telangana

తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం కానున్న డీఎస్సీ పరీక్షకు సంబంధించి అభ్యర్థుల ఆన్‌లైన్ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు, 11062 పోస్టులకు 2 లక్షల 79 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు, మరికొద్దిసేపట్లో అభ్యర్థులు పరీక్షకు చేరుకుంటారు. ఈ పరీక్షల ప్రారంభ కాలం, ఈ డిఎస్‌సి పరీక్ష ఉదయం 9:15 నుండి 11:30 వరకు నిర్వహించబడుతుంది మరియు మధ్యాహ్నం 144 సెక్షన్ విధించబడింది మరియు జిరాక్స్ సెంటర్‌లు లేవు సమీపంలో.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Jan 30, 2026 16:57:28
Nizamabad, Telangana:

Municipal Tax Dues: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రూపేణా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. ఎన్నికల బరిలో నిలుస్తున్న అభ్యర్థులు తమకు సంబంధించిన అన్నీ పన్ను బకాయిలు చెల్లించారు. దీంతో కోట్ల రూపంలో ప్రభుత్వ ఖజానాకి ఆదాయం వచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నోడ్యూ సర్టిఫికెట్ కచ్చితంగా పొందాల్సి ఉండడంతో తమ పన్ను బకాయిలు చెల్లించారు. ఒక్క రూపాయి ఆస్తి పన్ను బకాయి ఉన్నా నామినేషన్ తిరస్కరణకు గురవుతుందనే నిబంధన ఉంది. ఎన్నికల సంఘం నిబంధనతో ఓ కార్పొరేటర్ అభ్యర్థి కాదు కాదు మేయర్ అభ్యర్థి ఏకంగా రూ.7.42 కోట్లకు పైగా చెల్లించడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: Child Missing: మేడారం జాతరలో పిల్లల అదృశ్యం.. రిస్ట్‌ బ్యాండ్‌తో 2 గంటల్లో ఆచూకీ లభ్యం

నిజామాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఓ అభ్యర్థి ప్రముఖ మూడు నక్షత్రాల హోటల్ యజమాని ఏకంగా రూ.7.42 కోట్లకు పైగా మున్సిపల్ పన్ను బకాయిలు చెల్లించారు. అనంతరం నేడు ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ అంశం నిజామాబాద్‌ నగరంలోని తీవ్ర చర్చనీయాశంగా మారింది. వాస్తవానికి సదరు అభ్యర్థి రూ.8 కోట్ల 16 లక్షల ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంది. సుమారు 75 లక్షల రూపాయల వరకు డీడీల రూపంలో ఇదివరకే పన్ను చెల్లించారు. మిగతా 7.42 కోట్ల రూపాయల బకాయిల మినహాయింపు కోసం కోర్టును ఆశ్రయించారు. కేసు పెండింగ్‌లో ఉంది. ఏళ్ల తరబడిగా ఈ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అంటూ ఈ మొండి బకాయిలు వసూలై నిజామాబాద్ కార్పొరేషన్‌కు ఖజానా నింపింది.

Also Read: DK Aruna: ప్రజలను మోసం చేయడానికి రేవంత్‌ రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ డ్రామా: డీకే అరుణ

మున్సిపల్ ఎన్నికల వేళ పుర పాలక సంస్థ ఖజానా ఒక్కసారిగా కళకళలాడుతోంది. ఏళ్ల తరబడి అధికారులు నోటీసులిచ్చినా.. జరిమానాలు వేసినా ససేమిరా చెప్పిన బకాయిదారులు ఇప్పుడు ఎన్నికల బరిలో నిలిచేందుకు క్యూ కట్టి మరీ పన్నులు చెల్లించారు. తాజాగా నిజామాబాద్‌ నగరంలోని ఒక డివిజన్ అభ్యర్థి ఏకంగా రూ.8 కోట్ల ఆస్తిపన్ను బకాయిలను చెల్లించాడు. ఈ పరిణామం కార్పొరేషన్ వర్గాల్లోనే కాదు.. నిజామాబాద్‌ మొత్తం చర్చనీయాంశమైంది.

Also Read: Medaram Prices: మేడారంలో జేబులు చిల్లు.. ఒక బీర్‌ రూ.300, మటన్‌ రూ.1500, చికెన్‌ రూ.500

మున్సిపల్ బరిలో నిలవాలంటే అభ్యర్థులు కచ్చితంగా 'నోడ్యూ సర్టిఫికెట్' సమర్పించాల్సి ఉండడంతో ఆశావహులంతా కొన్ని రోజులుగా ఆస్తిపన్ను శాఖాధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఒక్క రూపాయి బకాయి ఉన్నా నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉండడంతో.. ఇన్నాళ్లుగా అటకెక్కించిన బకాయిల లెక్కలన్నీ ఇప్పుడు బయటకు తీస్తున్నారు. మూడు రోజులుగా మున్సిపల్ కార్యాలయాలు పన్ను చెల్లింపుదారులతో కిక్కిరిసిపోతున్నాయి. వందలాది మంది అభ్యర్థులు తమ పాత బకాయిలన్నీ క్లియర్ చేస్తుండడంతో కార్పొరేషన్ ఖజానాకు కోట్లాది రూపాయల ఆదాయం సమకూరింది. అధికారుల విజ్ఞప్తులకు లొంగని వారు ఎన్నికల నిబంధనల దెబ్బకు దారిలోకి వచ్చారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న మొండి బకాయిలు కూడా ఇప్పుడు వసూలవుతుండడం గమనార్హం. మొత్తానికి ఎన్నికల సమరం మొదలవ్వకముందే మున్సిపాలిటీకి పన్నుల రూపంలో 'విజయం' దక్కినట్లయింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 30, 2026 16:13:09
Medaram, Telangana:

Medaram Jatara 2026: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. సమ్మక్క సారక్క జాతరకు లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. బంగారం సమర్పించడానికి.. పూజలు, విందు వినోదాలతో పెద్ద ఎత్తున భక్తులు ఆనందంలో ఉన్నారు. అయితే అక్కడకు వెళ్లిన భక్తుల జేబులకు మాత్రం చిల్లు పడుతోంది. మేడారంలో ప్రతీ వస్తువు భారీ ధరకు లభిస్తున్నాయి. ఇక మొబైల్ నెట్ వర్క్ కూడా తీవ్ర సమస్యగా ఉంది.

Also Read: Padi Kaushik Reddy: పోలీసులతో వివాదంపై వెనక్కి తగ్గిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి

మేడారం జాతరలో ధ‌ర‌లు భక్తులకు చుక్క‌లు చూపిస్తున్నాయి. అక్కడ చికెన్‌, మటన్‌.. ఆఖరకు మద్యం కొనాల‌న్నా భ‌క్తులు భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. మార్కెట్‌లో ఉన్న ధరల కన్నా డబుల్‌, త్రిబుల్‌ రేట్లు ఉన్నాయి. ప్రస్తుతం మ‌ట‌న్ ధ‌ర బయట రూ.900 నుంచి రూ.వెయ్యి ఉండ‌గా.. మేడారం ప్రాంతంలో మాత్రం డబుల్‌ ధర ఉంది. అక్కడ రూ.1500ల‌కు కిలో మటన్‌ లభిస్తోంది. ఇక కోడి మాంసం విషయానికి వస్తే లైవ్ కోడి బ‌య‌ట రూ.170 ఉండ‌గా మేడారంలో రూ.350 పైన ఉంది.

Also Read: TTD: హిందూ సమాజానికి వైఎస్ జగన్, వైఎస్సార్‌సీపీ క్షమాపణ చెప్పాలి: టీటీడీ

మద్యం ధరల విషయానికి మ‌ద్యం ధ‌ర‌లు కూడా భారీగా ఉన్నాయి. పెద్ద ఎత్తున రేట్లు పెంచేసి అక్కడ విక్రయిస్తున్నారు. సాధారణ బీర్‌ల విషయానికి వస్తే రూ.180 ఉండ‌గా మేడారంలో మాత్రం రూ.280 నుంచి రూ.300ల‌కు అక్కడి వ్యాపారులు అమ్ముతున్నారు. ప్రతి మద్యం బాటిళ్ల‌పై రూ.100 ఎక్కువ తీసుకుంటున్నారు. తాగునీళ్ల సీసాలు కూడా అధిక ధరలకు అమ్ముతున్నారు. ఇక అక్కడ సేద తీరడానికి.. వంటలు వండడానికి టెంటులు కూడా భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇక విచిత్రమేమంటే.. చెట్టుకు కూడా డబ్బులు తీసుకుంటున్నారు. చెట్టు కింద ఉండేందుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు అద్దెలు వ‌సూలు చేస్తున్నారు.

Also Read: Child Missing: మేడారం జాతరలో పిల్లల అదృశ్యం.. రిస్ట్‌ బ్యాండ్‌తో 2 గంటల్లో ఆచూకీ లభ్యం

నెట్‌వర్క్‌ సమస్య
మేడారం జాతర ప్రాంతంలో సిగ్నల్‌ సమస్య తీవ్రంగా ఉంది. జాతర ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్ సమస్య కన్నా ఎక్కువైంది. మొబైల్‌ నెట్‌వర్క్‌లు దాదాపుగా అన్నీ తక్కువ కెపాసిటీతో వస్తున్నాయి. అత్యధిక యూజర్లు ఉన్న జియో కూడా పనిచేయకపోవడంతో భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎయిర్‌టెల్ సిగ్నల్స్ ఉన్నా నెట్‌వర్క్‌ మాత్రం రావడం లేదు. డేటా కనెక్ట్‌ కాకపోవడం, కాల్స్ రాకపోవడంలో సమస్య ఎదురవుతోంది. ఫోన్లు చేసిన వెంటనే డ్రాపవడం, ఫోన్‌ కాల్‌ సరిగా వినపడకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ కారణంగా యూపీఐ పేమెంట్లు పని చేయడం లేదు. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేయలేకపోతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 30, 2026 14:27:15
Koduru, Andhra Pradesh:

Women Employee: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ వివాదం ఊహించని మలుపు తిరిగింది. అతడిపై తీవ్ర ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగిని అదృశ్యమైంది. తనకు సంబంధించిన వీడియో కాల్స్‌, స్క్రీన్‌షాట్‌లు విడుదల చేయడంతోపాటు.. మీడియా సమావేశం నిర్వహించి తీవ్ర ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగిని కనిపించడం లేదని పోలీసులు తెలిపారు. ఆమె ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయ్యిందని చెప్పారు.

Also Read: Padi Kaushik Reddy: పోలీసులతో వివాదంపై వెనక్కి తగ్గిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి

ప్రభుత్వ ఉద్యోగి హర్ష వీణ తన కొడుకు రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను బ్లాక్ మెయిల్ చేస్తోందని ఈనెల 7వ తేదీన అతడి తల్లి ప్రమీలమ్మ ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుపై రైల్వే కోడూరు అర్బన్  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో హర్ష వీణ కాల్ డేటా, ఇతర సాంకేతిక అంశాలపై దృష్టిపెట్టారు. కొన్ని వీడియోలు, ఆడియోలు, ఫొటోలు, ఇతర సమాచారం పోలీసులు సేకరిస్తున్నారు. దీంతో కోడూరు అర్బన్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

Also Read: TTD: హిందూ సమాజానికి వైఎస్ జగన్, వైఎస్సార్‌సీపీ క్షమాపణ చెప్పాలి: టీటీడీ

ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్న హర్ష వీణ ఇంకా పోలీసులకి అందుబాటులోకి రాలేదని రైల్వేకోడూరు అర్బన్ సీఐ చంద్ర శేఖర్ ప్రకటించారు. హర్ష వీణ స్థానికంగా లేనట్లు తెలుస్తోందని.. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని తెలిపారు. ఈ కేసులో ఎమ్మెల్యే స్టేట్‌మెంట్ కూడా రికార్డు చేస్తామని చెప్పారు. హర్ష వీణ నేరుగా విచారణకు హాజరైనా.. లేకపోతే తమను రమ్మని పిలిచినా వెళ్లి విచారిస్తామని వివరించారు. త్వరలోనే దర్యాప్తు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

Also Read: Child Missing: మేడారం జాతరలో పిల్లల అదృశ్యం.. రిస్ట్‌ బ్యాండ్‌తో 2 గంటల్లో ఆచూకీ లభ్యం

'స్థానిక విలేకరి శంకర్ రాజుపై నిర్బంధించి దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేశాం. హర్ష వీణ నిర్బంధించి దాడి చేసి.. గాయపరిచిన దానిపై ఆధారాలు ఉన్నాయి. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్న హర్ష వీణ పై రెండు కేసులు నమోదు చేశారు. రెండు కేసుల్లో నాన్ బెయిలబుల్ కేసులు నమోదు  చేసినట్లు రైల్వేకోడూరు అర్బన్ సీఐ చంద్ర శేఖర్ వెల్లడించారు. ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు చేస్తుండడంతో జనసేన పార్టీలో తీవ్ర కలకలం రేపింది. అరవ శ్రీధర్ కు సంబంధించి రోజుకో వివాదం రాజుకుంటుండడంతో జనసేన పార్టీ అతడిని దూరం పెట్టింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 30, 2026 13:47:15
Hyderabad, Telangana:

Big King Cobra Video Watch Now: గత కొద్ది రోజుల నుంచి ప్రకృతిలో నివసించే అడవి జంతువులతో పాటు విశసర్పాలు మానవ వివాసాల మధ్యకి రావడం సర్వసాధారణమైపోయింది.. ఇప్పుడు ఇలా వచ్చిన పాములను కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు ప్రకృతిపై ఉన్న ప్రేమతో వాటిని పట్టుకొని సురక్షితమైన ప్రదేశాల్లో వదిలేస్తున్నారు. ఇలా కీలక పాత్ర పోషిస్తున్న వారిలో ఒకరు మున్న స్నేక్ క్యాచర్.. ఇతను గత కొద్ది రోజుల నుంచి జనావాసాల్లోకి సంచారం చేస్తున్న పాములను పట్టుకొని రెస్క్యూ చేస్తున్నారు. తాజాగా ఇతడు రెస్క్యూ చేస్తున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ఈ వీడియోను తీసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 

ఈ వీడియోలో స్నేక్ క్యాచర్ ఒక పామును జనావాసాల దగ్గరగా ఉన్న ఓ ఎండిన పొలంలోకి అత్యంత ప్రమాదకరమైన నాగుపాము సంచారం చేయడంతో వెంటనే అక్కడికి వెళ్లి దానిని పట్టుకుంటాడు. అయితే, ఆ పాము దాని శరీరం భాగంపై ఉన్న కుబుసం విడిచే దశలో ఉండడం మీరు చూడొచ్చు. అయితే, ఈ సమయంలో పాములు అనేక సమస్యలను ఎదుర్కొంటాయి. ముఖ్యంగా ఈ కుబుసం కళ్ళను పూర్తిగా కప్పేస్తుంది. దీని కారణంగా ఈ పాములు ఎక్కడికి వెళ్తాయనేది వాటికి కనిపించదు. అయితే ఆ స్నేక్ క్యాచర్ ఇలా పట్టుకున్న పామును.. తన చేతులతో చర్మాన్ని పూర్తిగా తొలగించడం మీరు చూడొచ్చు.

ఈ వీడియోలో.. ఆ వ్యక్తి పామును ఒక చేతితో పట్టుకొని.. మరో చేతితో దాని చర్మ పైభాగంలోని పొరను సులభంగా తొలిచేయడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఆ వ్యక్తి పాముకు ఎలాంటి హాని కలగకుండా చాలా నెమ్మదిగా జాగ్రత్తగా తొలగిస్తూ ఉండడం మీరు చూడొచ్చు. అయితే, ఈ వీడియోలో ఆ స్నేక్ క్యాచర్ ని ఒకరు అన్న ఇది పామా అని ప్రశ్న అడిగితే.. అతను ఒక విషపూరితమైన నాగుపామని.. దీనిని ఎంతో సురక్షితంగా రక్షించారని ఆయన తెలిపారు. నిజానికి ఇలాంటి ప్రమాదకరమైన పాముల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. 

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

సాధారణంగా కింగ్ కోబ్రా లు ఒక్కొక్క సమయంలో సంవత్సరానికి రెండుసార్లు దాని కుబుసాన్ని విడుస్తూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో మరికొన్ని జాతులకు సంబంధించిన పాములు మూడుసార్లు కుబుసాన్ని వదిలిపెడుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో పాములు తీవ్ర సమస్యలకు గురవుతూ.. మరణిస్తూ ఉంటాయి.. కాబట్టి కుబుసం పెడితే సందర్భంలో ఉన్న పామును చాలా జాగ్రత్తగా వదిలిపెట్టడం మంచిది. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటివరకు 25వేల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు.

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 30, 2026 13:37:19
Hyderabad, Telangana:

Huge Cobra Under Bike Video Viral: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా క్రేజ్ ఎంత ఉందంటే.. ప్రాణాలు మీదికి వచ్చిన సరే చాలామంది లైకులు, షేర్ల కోసం దేనికైనా తెగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొంతమంది సాహసోపేతమైన చర్యలకు పాల్పడుతూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తుంది. ఈ వీడియోలో ఒక పల్సర్ బైక్ వెనక టైర్, సీట్ మధ్యలో దాదాపు ఆరడుగుల పొడవు కల భారీ నాగుపాము చిక్కుకుపోవడం, ప్రాణాలకు తెగించి ఒక యువకుడు దానిని రెస్క్యూ  చేయడం ఈ దృశ్యాల్లో చూడొచ్చు. 

సాధారణంగా చాలామంది పాము కనిపిస్తేనే ఆమడ దూరం పరిగెడుతూ ఉంటారు.. ఇక్కడ మాత్రం వింతగా ప్రవర్తించారు. అయితే ఈ సమయంలో బైక్ వెనక భాగంలో ఆ అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా పడగ విప్పి నిలబడి ఉండడం మీరు చూడొచ్చు. ఇలా ప్రత్యక్షమైన ఆ కింగ్ కోబ్రా దగ్గరికి ఒక యువకుడు వెళ్లి ఫోటోలు తీయడమే కాకుండా.. నేరుగా ఆ పాము దగ్గరికి వెళ్లి, దానితో ఫోటోలు దిగేందుకు ప్రయత్నించాడు. అయితే, ఈ సమయంలో ఆ పాము దూకుడు స్వభావం కలిగి ఉండడం మీరు చూడొచ్చు.

అయితే, అక్కడే ఉన్న కొంతమంది వెంటనే స్నేక్ క్యాచర్‌కి సమాచారం అందించారు. వెంటనే మున్నా అనే స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకొని.. ఆ పాముని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో అది బుసలు కొడుతూ ఆగ్రహంగా ఉండడం మీరు గమనించవచ్చు. ఆ స్నేక్ క్యాచర్ ఏమాత్రం భయపడకుండా వెంటనే ఆ పాముని పట్టుకొని.. ఒక సంచిలో బంధించాడు.. ఇలా బంధించిన పాములు సురక్షితమైన ప్రదేశాల్లో వదిలిపెట్టాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలే వైరల్‌గా మారాయి.

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

తరచుగా సోషల్ మీడియాలో జనావాసాల్లోకి సంచారం చేసే ఇలాంటి పాములకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. జనాలు కూడా ఇలాంటి వీడియోలు ఎక్కువగా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియో ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని వేలమందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను మున్నా స్నేక్ క్యాచర్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పోస్ట్ చేశారు.

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 30, 2026 13:25:31
Hyderabad, Telangana:

Snake Video Watch Here: నేటి కాలంలో సోషల్ మీడియాలో వింతలు విశేషాలకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని వీడియోలు చూస్తుంటే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది.. తాజాగా వైరల్ అవుతున్న వీడియో కూడా దీనికి సంబంధించిందే. ఇప్పుడు ఈ వీడియో సర్వత్రా చర్చనీయాంశమైంది. మున్నా స్నేక్ రెస్క్యూయర్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు విపరీతంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ వీడియోను ఒక వ్యక్తి నేలపై పడక విప్పి పడుకొని ఉన్న.. అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను చేతులతో నిమరటం మీరు చూడొచ్చు.. సాధారణంగా నాగుపాము అంటేనే భయపడిపోతూ ఉంటారు. కొంతమంది అయితే, ఆమడ దూరంగా ఉన్న పామును చూసి అక్కడి నుంచి కేకలు వేస్తూ భయపడి పారిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ సదరు వ్యక్తి ఏ మాత్రం భయం లేకుండా ఆ పాము తలభాగం మీద.. చేతుపెట్టి ప్రశాంతంగా నిమురుతుండడం ఇప్పుడు సోషల్ మీడియాలో సర్వత్రా చర్చనీయంగా మారింది. ఈ వీడియోను చూస్తుంటే ఆ పాము ఎప్పుడు ఆ వ్యక్తిని కాటేస్తుందో తెలియని పరిస్థితి.. 

అయితే, ఈ వీడియోలో ఆ వ్యక్తి తన చేతితో పాము పడక భాగాన్ని నిమ్మిరినప్పటికీ.. అది ప్రశాంతంగా అలాగే ఉండిపోయింది.. ఆ వ్యక్తి ఆ పాము తలభాగం నుంచి తోక భాగం వరకు అలాగే నిమురుతూ ఉండిపోయాడు. అయితే చివరి సమయంలో మాత్రం ఆ పాము ఒక్కసారిగా తన పడగలను పైకి లేపి.. కాటి వేయడానికి సిద్ధమైనట్లు  కనిపించడం మీరు చూడొచ్చు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోను 46 లక్షల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. 

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

అంతేకాకుండా ఈ వీడియోను సుమారు 61,000 మందికి పైగా లైక్ చేశారు.. అయితే, ఈ వీడియో చూసిన చాలామంది.. పాముతో ఇలా సాహసోపేతమైన చర్యలకు పాల్పడడం ప్రమాదమని చెబుతున్నారు. మరికొంతమంది మాత్రం ఇది తన పెంపుడు పామని.. అందుకే తల భాగంలో నిమురుతున్నప్పటికీ.. ఏమాత్రం అతడి పై దాడి చేయలేకపోయిందని వారు అంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి పాములతో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిదని వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు.

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 30, 2026 12:40:10
Huzurabad, Telangana:

Sammakka Sarakka Jatara 2026: సమ్మక్క సారక్క జాతరలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డితో పోలీసులు వ్యవహరించిన తీరు తెలంగాణలో తీవ్ర వివాదాస్పదమైంది. ఒక ఎమ్మెల్యేను పట్టుకుని లాగిపడేయడం.. ఈడ్చుకుంటూ తీసుకెళ్లడంపై బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్రంగా తప్పుబడుతోంది. అయితే తోపులాట సమయంలో తాను పోలీసు అధికారులపై చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ అధికారులకు క్షమాపణలు చెప్పారు.

Also Read: TTD: హిందూ సమాజానికి వైఎస్ జగన్, వైఎస్సార్‌సీపీ క్షమాపణ చెప్పాలి: టీటీడీ

తన హుజురాబాద్‌ నియోజకవర్గంలోని వీణవంక సమ్మక్క సారక్క జాతరలో జరిగిన ఘటనపై ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. 'ఉద్దేశ్యపూర్వకంగా చేసిన మాటలు కాదు. మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు. రేవంత్ రెడ్డి ప్రోత్బలంతో నాపై, నా కుటుంబంపై రాజకీయ కక్షకు తెగబడ్డారు. పోలీసులు, అధికారులు అంటే నాకు ఎంతో గౌరవం. కానీ కొందరు మేము సమ్మక్క జాతరకు వెళ్తున్న క్రమంలో అడ్డుకొని తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. ఆవేశంలో, ఒత్తిడిలో తెలియకుండా నోరు జారా. అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా చేసిన మాటలు కావు' అని పాడి కౌశిక్‌ రెడ్డి స్పష్టత ఇచ్చారు.

Also Read: Child Missing: మేడారం జాతరలో పిల్లల అదృశ్యం.. రిస్ట్‌ బ్యాండ్‌తో 2 గంటల్లో ఆచూకీ లభ్యం

'నా మాటలతో ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నా. ఈ విషయంలో కొందరు పని కట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని అందరిని వేడుకుంటున్నా' అని హుజురాబాద్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి తెలిపారు. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించడాన్ని మాత్రం ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి తీవ్రంగా తప్పబడుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్‌ను కలిసిన విషయం తెలిసిందే. ప్రివిలేజ్‌ మోషన్‌ దాఖలు చేసి తనపై అనుచితంగా వ్యవహరించిన పోలీస్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని.. ఒక ఎమ్మెల్యేకు గౌరవం ఇవ్వలేరా? అని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి కోరారు.

Also Read: DK Aruna: ప్రజలను మోసం చేయడానికి రేవంత్‌ రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ డ్రామా: డీకే అరుణ

కాగా ఈ ఘర్షణ సమయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీస్‌ ఉన్నత అధికారుల సంఘం తప్పుబట్టింది. పోలీసులను అలా దూషించడం తగదని పేర్కొంది. ఈ మేరకు పోలీస్‌ అధికారుల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డితో ఈ వివాదం ముగిసిపోయింది. అయితే తనతో పోలీసులు వ్యవహరించిన తీరుపై మాత్రం ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. వారిపై చర్యలు తీసుకునేదాకా ఉపేక్షించే అవకాశం లేనట్టు కనిపిస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 30, 2026 12:19:56
Mahbubnagar, Telangana:

Municipal Elections: 'ఎన్నికలు వచ్చిన ప్రతి సారి ప్రజలను మోసం చేయడానికి రేవంత్‌ రెడ్డి ఏదో ఒకటి తెరపైకి తేవడం అలవాటుగా మారింది. ఫోన్ ట్యాపింగ్‌లో సిట్ నోటీసులు ఎన్నికల స్టంట్ మాత్రమే' అని మహబూబ్‌నగర్‌ బీజేపీ ఎంపీ డీకే అరుణ కొట్టిపారేశారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలోనే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తెరపైకి తెచ్చారని తెలిపారు. ఎన్నికల తర్వాత ఏం ఉండదని చెప్పారు. సిట్ నోటీసులు ఎన్నికల వేళ మాత్రమే ఎందుకు గుర్తుకు వచ్చిందని రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు.

Also Read: TTD: హిందూ సమాజానికి వైఎస్ జగన్, వైఎస్సార్‌సీపీ క్షమాపణ చెప్పాలి: టీటీడీ

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎంపీ డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డిపై, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నికల స్టంట్‌లకు ప్రజలు మోసపోవద్దని ప్రజలకు సూచించారు. 'గద్వాల ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నాడని స్పీకర్ చెబుతుంటే అతడు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. ఆ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి నిలబడి గెలవండి' అని సూచించారు.

Also Read: Child Missing: మేడారం జాతరలో పిల్లల అదృశ్యం.. రిస్ట్‌ బ్యాండ్‌తో 2 గంటల్లో ఆచూకీ లభ్యం

స్పీకర్ కూడా కోర్టులను మోసం చేయడం, ఇంతకన్నా దారుణం ఇంకా ఏం ఉంటుంది? అని బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. ఫిరాయింపులపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలని సూచించారు. ఇలాంటి వాటివల్లే రాజకీయాలకు విలువలు లేకుండా మారిపోతుందని తెలిపారు. విద్య, వైద్యం, రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం నిధులు కేవలం కేంద్రం నుంచి మాత్రమే వస్తున్నాయని ఎంపీ అరుణ చెప్పారు.

Also Read: AP Assembly Session: నెల రోజుల పాటు ఏపీ బడ్జెట్‌ సమావేశాలు.. వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు?

'మహబూబ్‌నగర్ చుట్టుపక్కల బైపాస్ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. మహబూబ్‌నగర్ పట్టణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు. మహబూబ్‌నగర్ పట్టణ అభివృద్ధి  కేంద్ర ప్రభుత్వంతోనే సాధ్యం. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగురవేయాలని ప్రజలను కోరుతున్నా' అని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. మహబూబ్‌నగర్ మేయర్‌గా బీజేపీకి అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ తుంగలో తొక్కిందని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఎన్నికలు రాగానే.. శంకుస్థాపనలు చేయడం కొబ్బరికాయలు కొట్టి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 30, 2026 12:00:15
Hyderabad, Telangana:

Varanasi Movie Release Date: టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ చిత్రం 'వారణాసి'. ఈ సినిమా రిలీజ్‌పై చిత్రబృందం క్లారిటీ ఇచ్చేసింది. 

సోషల్ మీడియా వేదికగా రాజమౌళి ప్రకటించిన వివరాల ప్రకారం, 'వారణాసి' చిత్రం ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇది 2027లో రాబోయే అతిపెద్ద అంతర్జాతీయ చిత్రాలలో ఒకటిగా నిలవనుంది.

అద్భుతమైన తారాగణం
ఈ సినిమాలో భారతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నటీనటులు నటిస్తున్నారు. మహేష్ బాబు కథానాయకుడిగా 'రుద్ర' పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్ ప్రియాంక చోప్రా జోనస్ 'మందానికి'గా.. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర 'కుంభ'గా వెండితెరపై కనిపించనున్నారు. 

కథా నేపథ్యం - ఖండాలు దాటే అడ్వెంచర్
ఈ సినిమా కథ వేల సంవత్సరాల నాటి పురాతన రహస్యాల చుట్టూ అల్లుకుంది. కథ అంటార్కిటికా మంచు ఖండం నుండి ఆఫ్రికా అడవుల వరకు, చివరకు భారతీయ పుణ్యక్షేత్రమైన వారణాసి వరకు అనేక దేశాలు, ఖండాలను దాటుతున్నట్లు ఇటీవలే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌లో తెలిసింది. రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రపంచ స్థాయి యాక్షన్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఐమ్యాక్స్ కోసం స్పెషల్‌గా చిత్రీకరిస్తున్నారు.

ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. "నాటు నాటు" తర్వాత రాజమౌళి-కీరవాణి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

2022లో విడుదలైన "RRR" ప్రపంచవ్యాప్తంగా విశేషంగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలలో ఇది ఐదవ స్థానంలో నిలిచింది. ఆ సినిమా సాధించిన ఆస్కార్ విజయం, ఇప్పుడు 'వారణాసి'పై ప్రపంచ మార్కెట్ దృష్టి పడేలా చేసింది.

మహేష్ బాబు కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్, ప్రతిష్టాత్మక చిత్రం. నవంబర్‌లో విడుదలైన ఫస్ట్ లుక్ ఫుటేజ్ ఇప్పటికే రికార్డులు సృష్టిస్తుండగా, 2027 ఏప్రిల్ కోసం సినీ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Also Read: Mood Of The Nation Survey: ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేది ఎవరు? తాజా సర్వేలో సంచలన నిజాలు!

Also Read: T20 World Cup 2026 Schedule: T20 ప్రపంచ కప్ 2026 కొత్త షెడ్యూల్..ఫిబ్రవరి 7 నుంచి సమరం షురూ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 30, 2026 11:32:56
Tirupati Urban, Andhra Pradesh:

YS Jagan Apology: 'వైఎస్సార్‌సీపీ హయాంలో తిరుమలలో వేల అరాచకాలు చేశారు. సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని వైఎస్సార్‌సీపీ నాయకులు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. అబద్దాలు చెబుతున్న వారికి బుద్ది ఉండాలి. యజ్ఞాలు ఎందుకు చేస్తున్నారు? హిందూ సమాజానికి వైఎస్‌ జగన్‌తో పాటు మిగిలిన వారు క్షమాపణ చెప్పాలి' టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు డిమాండ్‌ చేశారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో హిందువులపై దాడి జరిగిందని ఆరోపించారు. టీటీడీ నిబంధనలను ఎందుకు మార్చారని ప్రశ్నించారు.

Also Read: Janasena Party: జనసేన పార్టీ కీలక పరిణామం.. పిఠాపురం నుంచే ప్రారంభం

తిరుమల లడ్డూ వ్యవహారం సిట్‌ నివేదికపై రాజకీయ దుమారం రేపడంతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ వైఎస్‌ జగన్‌, వైఎస్సార్‌సీపీ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ' సామర్థ్యం లేని డైరీలకు నెయ్యి సరఫరా చేయమని చెప్పారు. 60 లక్షల కిలోల కల్తీ నెయ్యిని కొనుగోలు చేశారు. జంతు కొవ్వు లేదని చెప్పడం చెప్పడం సిగ్గుచేటు' అని మండిపడ్డారు. 'కెమికల్స్‌తోనే నెయ్యి సరఫరా చేశారని స్పష్టంగా సిట్ చార్జ్‌షీట్‌లో ఉంది. అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్‌ను నెయ్యి తయారీకి వాడారు. హిందువుల ప్రాణాలు తీసేలా వ్యవహరించారు' అని తీవ్ర ఆరోపణలు చేశారు.

Also Read: AP Assembly Session: నెల రోజుల పాటు ఏపీ బడ్జెట్‌ సమావేశాలు.. వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు?

'కల్తీనెయ్యితో 20 కోట్ల లడ్డూలను తయారు చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు మహాపాపం చేశారు. జంతుకొవ్వు ఉందని ఎన్‌డీడీబీ నివేదిక ఇచ్చింది. సిట్ నిర్థారించింది. నెయ్యిని ల్యాబ్‌లకు పంపించి తమకు అనుకూలంగా రిపోర్ట్‌లు తెప్పించుకున్నారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడ్డారు' అని వైఎస్సార్‌సీపీ నాయకులపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మండిపడ్డారు. ఏ నిబంధనల ప్రకారం బోలేబాబా డైరీకి టెండర్‌ అప్పగించారు? జగన్, వైవీ సుబ్బారెడ్డి ప్రమేయం లేకుండానే పీఏ చిన్నప్పన్న ఇదంతా చేస్తాడా? అని నిలదీశారు.

Also Read: Child Missing: మేడారం జాతరలో పిల్లల అదృశ్యం.. రిస్ట్‌ బ్యాండ్‌తో 2 గంటల్లో ఆచూకీ లభ్యం

'వైవీ సుబ్బారెడ్డి, ఆయన సతీమణి ఎందుకు సిట్‌కు బ్యాంకు వివరాలు ఇవ్వలేదు? తిరుమల వాటికన్ సిటీని దాటిపోయింది. వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రణాళిక ప్రకారమే తిరుమలపై స్కెచ్ వేశారు. టీటీడీలో ప్రతి విషయంలోను నిబంధనలను తూట్లు పొడిచారు. టీటీడీని భ్రష్టుపట్టించి కోట్లు సంపాదించాడు' అని వైవీ సుబ్బారెడ్డిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. 'తల వెయ్యి ముక్కలు అవుతుందని భూమన మృత్యుంజయ యాగం చేస్తున్నాడు. భూమనకు అంత ప్రాణభయం ఎందుకు? తప్పు చేసి తప్పించుకోవాలనుకుంటే సాధ్యం కాదు భూమన' అని హెచ్చరించారు. 

'కల్తీనెయ్యిలో పెద్దవారి పాత్రను సిట్‌ పూర్తిగా వెలికితీయాలి. సిట్ గతంలో ఇచ్చింది చివరి ఛార్జ్‌షీట్ కాదు. ఇంకా ఉంది' అని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. దుర్మార్గుల నుంచి తిరుమలను కాపాడుకోవాలని.. హిందువులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. కల్తీ కేటుగాళ్లపై కేసులు పెట్టాలి.. జైలుకు పంపించాలని సూచించారు. 'వైఎస్సార్‌సీపీ పెద్దలకు హిందువులంటే చులకన భావం. హిందూ సమాజాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులను తరిమి తరిమి కొట్టే సమయం దగ్గరపడింది' అని తెలిపారు. నూటికి నూరు శాతం నెయ్యి కల్తీ అయ్యిందని స్పష్టం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 30, 2026 10:45:58
Hyderabad, Telangana:

T20 World Cup 2026 New Schedule: క్రికెట్ అభిమానులకు అదిరిపోయే వార్త! T20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్‌లో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. బంగ్లాదేశ్ జట్టు ఈ టోర్నీ నుండి వైదొలగడంతో, వారి స్థానంలో స్కాట్లాండ్ జట్టును చేర్చుతూ ఐసీసీ కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నమెంట్ సరికొత్త షెడ్యూల్‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

భారత్, శ్రీలంకలోని ప్రముఖ నగరాలైన ముంబై, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, ఢిల్లీ, కొలంబో వేదికలుగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

కీలక మార్పులు..
బంగ్లాదేశ్ నిష్క్రమణతో స్కాట్లాండ్‌కు అవకాశం దక్కింది. స్కాట్లాండ్ జట్టు తన మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబై వేదికల్లో ఆడనుంది. మిగిలిన గ్రూపుల్లో ఎటువంటి మార్పులు లేవు.

భారత్ ప్రస్థానం..
టీమ్ ఇండియా తన మొదటి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న అమెరికాతో (ముంబైలో) టోర్నీని ఆరంభిస్తుంది. క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్ వర్సెస్ పాకిస్థాన్ హై-వోల్టేజ్ పోరు ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో రాత్రి 7 గంటలకు జరగనుంది.

టోర్నీ ముఖ్య తేదీలు..
ప్రారంభం: ఫిబ్రవరి 7, 2026.
సూపర్ 8: ఫిబ్రవరి 21 నుండి ప్రారంభం.
సెమీ-ఫైనల్స్: మార్చి 4, 5 తేదీల్లో.
ఫైనల్: మార్చి 8న అహ్మదాబాద్ లేదా కొలంబోలో.

ముఖ్యమైన మ్యాచ్‌ల షెడ్యూల్..

తేదీ మ్యాచ్ వేదిక సమయం
ఫిబ్రవరి 7 ఇండియా vs అమెరికా ముంబై రాత్రి 7:00
ఫిబ్రవరి 12 భారత్ vs నమీబియా ఢిల్లీ రాత్రి 7:00
ఫిబ్రవరి 15 ఇండియా vs పాకిస్తాన్ కొలంబో రాత్రి 7:00
ఫిబ్రవరి 18 భారత్ vs నెదర్లాండ్స్ అహ్మదాబాద్ రాత్రి 7:00
మార్చి 4 & 5 సెమీ-ఫైనల్స్ కోల్‌కతా/ముంబై రాత్రి 7:00
మార్చి 8 ఫైనల్ అహ్మదాబాద్/కొలంబో రాత్రి 7:00

మొదటి సెమీ-ఫైనల్, ఫైనల్ వేదికలు పాకిస్తాన్ జట్టు ప్రదర్శనపై ఆధారపడి ఉంటాయి. ఒకవేళ పాకిస్తాన్ నాకౌట్ దశకు చేరుకోలేకపోతే, ఆ మ్యాచ్‌లు భారతదేశంలోనే నిర్వహిస్తారు.

టీ20 వరల్డ్ కప్ పూర్తి మ్యాచ్ షెడ్యూల్
గ్రూప్ దశ
శనివారం, ఫిబ్రవరి 7

నెదర్లాండ్స్ vs పాకిస్తాన్: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – కొలంబో

స్కాట్లాండ్ vs వెస్టిండీస్: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

భారతదేశం vs USA: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – వాంఖడే స్టేడియం, ముంబై

ఆదివారం, ఫిబ్రవరి 8
ఆఫ్ఘనిస్తాన్ vs న్యూజిలాండ్: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – MA చిదంబరం స్టేడియం, చెన్నై

ఇంగ్లాండ్ vs నేపాల్: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – వాంఖడే స్టేడియం, ముంబై

శ్రీలంక vs ఐర్లాండ్: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – R ప్రేమదాస స్టేడియం, కొలంబో

సోమవారం, ఫిబ్రవరి 9
స్కాట్లాండ్ vs ఇటలీ: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

ఒమన్ vs జింబాబ్వే: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – SSC, కొలంబో

కెనడా vs దక్షిణాఫ్రికా: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్

మంగళవారం, ఫిబ్రవరి 10
నమీబియా vs నెదర్లాండ్స్: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ

న్యూజిలాండ్ vs యుఎఇ: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – ఎంఎ చిదంబరం స్టేడియం, చెన్నై

పాకిస్తాన్ vs యుఎస్ఎ: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – SSC, కొలంబో

బుధవారం, ఫిబ్రవరి 11

ఆఫ్ఘనిస్తాన్ vs దక్షిణాఫ్రికా: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్

ఆస్ట్రేలియా vs ఐర్లాండ్: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో

ఇంగ్లాండ్ vs వెస్టిండీస్: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – వాంఖడే స్టేడియం, ముంబై

గురువారం, ఫిబ్రవరి 12
శ్రీలంక vs ఒమన్: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, కాండీ

ఇటలీ vs నేపాల్: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) - వాంఖడే స్టేడియం, ముంబై

భారతదేశం vs నమీబియా: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) - అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ

శుక్రవారం, ఫిబ్రవరి 13

ఆస్ట్రేలియా vs జింబాబ్వే: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో

కెనడా vs యుఎఇ: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ

నెదర్లాండ్స్ vs యుఎస్ఎ: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – ఎంఎ చిదంబరం స్టేడియం, చెన్నై

ఫిబ్రవరి 14 శనివారం
ఐర్లాండ్ vs ఒమన్: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – SSC, కొలంబో

స్కాట్లాండ్ vs ఇంగ్లాండ్: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్

ఫిబ్రవరి 15 ఆదివారం
నేపాల్ vs వెస్టిండీస్: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – వాంఖడే స్టేడియం, ముంబై

నమీబియా vs యుఎస్ఎ: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – ఎంఎ చిదంబరం స్టేడియం, చెన్నై

భారతదేశం vs పాకిస్తాన్: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో

సోమవారం, ఫిబ్రవరి 16

ఆఫ్ఘనిస్తాన్ vs యుఎఇ: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ

ఇంగ్లాండ్ vs ఇటలీ: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

ఆస్ట్రేలియా vs శ్రీలంక: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, కాండీ

మంగళవారం, ఫిబ్రవరి 17

కెనడా vs న్యూజిలాండ్: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – MA చిదంబరం స్టేడియం, చెన్నై

ఐర్లాండ్ vs జింబాబ్వే: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, కాండీ

స్కాట్లాండ్ vs నేపాల్: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – వాంఖడే స్టేడియం, ముంబై

బుధవారం, ఫిబ్రవరి 18
దక్షిణాఫ్రికా vs యుఎఇ: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ

నమీబియా vs పాకిస్తాన్: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – SSC, కొలంబో

భారతదేశం vs నెదర్లాండ్స్: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్

గురువారం, ఫిబ్రవరి 19
ఇటలీ vs వెస్టిండీస్: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

శ్రీలంక వర్సెస్ జింబాబ్వే: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ కెనడా: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై

శుక్రవారం, ఫిబ్రవరి 20
ఆస్ట్రేలియా వర్సెస్ ఒమన్: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, క్యాండీ

సూపర్ 8
శనివారం, ఫిబ్రవరి 21

TBD వర్సెస్ TBD: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో

ఆదివారం, ఫిబ్రవరి 22
TBD వర్సెస్ TBD: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, క్యాండీ

TBD వర్సెస్ TBD: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్

సోమవారం, ఫిబ్రవరి 23
TBD వర్సెస్ TBD: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – వాంఖడే స్టేడియం, ముంబై

మంగళవారం, ఫిబ్రవరి 24
TBD వర్సెస్ TBD: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, క్యాండీ

బుధవారం, ఫిబ్రవరి 25
TBD వర్సెస్ TBD: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో

గురువారం, ఫిబ్రవరి 26
TBD వర్సెస్ TBD: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్

TBD వర్సెస్ TBD: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై

శుక్రవారం, ఫిబ్రవరి 27
TBD వర్సెస్ TBD: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో

శనివారం, ఫిబ్రవరి 28
TBD వర్సెస్ TBD: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, క్యాండీ

ఆదివారం, మార్చి 1
TBD వర్సెస్ TBD: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ

TBD వర్సెస్ TBD: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

నాకౌట్‌లు
బుధవారం, మార్చి 4

మొదటి సెమీఫైనల్ సాయంత్రం 7 గంటలకు (13:30 (GMT) – ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా లేదా ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో

గురువారం, మార్చి 5
రెండో సెమీఫైనల్ రాత్రి 7 గంటలకు (13:30 GMT) – వాంఖడే స్టేడియం, ముంబై

ఆదివారం, మార్చి 8
ఫైనల్ రాత్రి 7 గంటలకు (13:30 GMT) – నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్ లేదా ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో.

Also Read: Virat Kohli Net Worth: విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత సంపాదిస్తాడో తెలుసా? ఒక్క పోస్ట్ పెడితే కోట్లు అకౌంట్లో వచ్చి పడతాయి!

Also Read: Mood Of The Nation Survey: ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేది ఎవరు? తాజా సర్వేలో సంచలన నిజాలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 30, 2026 09:59:05
Hyderabad, Telangana:

Virat Kohli Instagram Earning: ప్రపంచ క్రికెట్ ఐకాన్ విరాట్ కోహ్లీ, కేవలం మైదానంలోనే కాదు, డిజిటల్ దునియాలోనూ రికార్డుల రారాజుగా దూసుకుపోతున్నారు. 2026 నాటికి ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఆదాయం అమాంతం పెరిగి, గ్లోబల్ స్టార్లకు గట్టి పోటీనిస్తోంది. క్రీడలకు అతీతంగా ఒక పవర్‌ఫుల్ డిజిటల్ బిజినెస్ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న కోహ్లీ, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌లో సరికొత్త బెంచ్‌మార్క్‌లను సృష్టిస్తున్నారు.

భారతీయ సెలబ్రిటీలలో అగ్రస్థానం
ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఒక్కో స్పాన్సర్డ్ పోస్ట్‌కు సుమారు రూ.11 కోట్ల నుండి రూ.14 కోట్ల వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. భారతీయ సినీ, క్రీడా రంగాల్లో మరే ఇతర సెలబ్రిటీ కూడా ఈ స్థాయిలో ఆదాయం పొందడం లేదు. దీనితో ఆయన ఇండియాలోనే అత్యధికంగా ఆర్జిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ సెలబ్రిటీగా నిలిచారు.

గ్లోబల్ టాప్-20 క్లబ్‌లో ఏకైక భారతీయుడు
ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న టాప్-20 వ్యక్తుల జాబితాలో కోహ్లీ స్థిరంగా కొనసాగుతున్నారు. క్రిస్టియానో రొనాల్డో (ఒక్కో పోస్ట్‌కు సుమారు రూ.26 కోట్లు), లియోనెల్ మెస్సీ (రూ.21 కోట్లు) అగ్రస్థానంలో ఉండగా, కోహ్లీ తన రూ.12-14 కోట్ల ఫీజుతో వారికి గట్టి పోటీ ఇస్తున్నారు.

274 మిలియన్ల ఫాలోవర్లు..
కోహ్లీకి ఉన్న 274 మిలియన్లకు పైగా ఫాలోవర్లు బ్రాండ్‌లకు తక్షణమే గ్లోబల్ విజిబిలిటీని అందిస్తారు. రొనాల్డో కంటే తక్కువ మంది ఫాలోవర్లు ఉన్నప్పటికీ, కోహ్లీ పోస్ట్‌లకు వచ్చే 'లైక్స్', 'కామెంట్స్' (Engagement Rate) ప్రపంచ స్థాయి స్టార్లకు సమానంగా ఉంటాయి. దీనివల్ల బ్రాండ్‌లు ఆయనకు భారీ మొత్తంలో చెల్లించడానికి మొగ్గు చూపుతాయి.

ఆదాయం ఎలా పెరుగుతుంది?
కోహ్లీ ఆదాయం కేవలం ఒక ఫోటో పోస్ట్ చేయడంతోనే ఆగిపోదు. ప్రచారాల కాలపరిమితి, గ్లోబల్ యూసేజ్ హక్కులు, క్రాస్-ప్లాట్‌ఫామ్ ప్రమోషన్ల ఆధారంగా ఈ ఒప్పందాల విలువ మరిన్ని కోట్లకు చేరుకుంటుంది. ఆయన వార్షిక ఎండార్స్‌మెంట్ పోర్ట్‌ఫోలియో విలువ ఇప్పుడు రూ.200 కోట్లు దాటినట్లు అంచనా.

గతంలో (2023లో) తన ఆదాయంపై వచ్చిన వార్తలను కోహ్లీ స్పందిస్తూ.. థర్డ్ పార్టీ నివేదికలు ఇచ్చే అంకెలు ఎప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉండకపోవచ్చని, అవి కేవలం అంచనాలు మాత్రమేనని గుర్తుచేశారు. అయినప్పటికీ, మార్కెట్ నిపుణుల ప్రకారం ఆయన బ్రాండ్ వాల్యూ నిరంతరం పెరుగుతూనే ఉంది.

క్రికెట్ ఆడుతున్నా లేకపోయినా, కోహ్లీ పర్సనల్ బ్రాండింగ్ మాత్రం స్థిరంగా ఉంది. ఇది క్రీడాకారులు తమ కెరీర్ ముగిసిన తర్వాత కూడా డిజిటల్ రంగంలో ఎలా రాణించవచ్చో నిరూపిస్తోంది.

Also Read: Mood Of The Nation Survey: ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేది ఎవరు? తాజా సర్వేలో సంచలన నిజాలు!

Also Read: Free Bus For Men: పురుషులకు ప్రభుత్వం శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలతో పాటు మగాళ్లకు కూడా ఉచిత బస్సు ప్రయాణం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 30, 2026 09:46:49
Hyderabad, Telangana:

Motorola Signature Offer Price in Flipkart: మోటరోలా కంపెనీ ఇప్పటికీ విడుదల చేసిన అత్యంత ప్రీమియం ఫీచర్స్ మొబైల్స్‌లో Motorola Signature ఒకటి. దీనిని కంపెనీ జనవరి 30వ తేదీ నుంచి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. అయితే, దీనిని మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీనిపై స్పెషల్ ఆఫర్స్ లభించడమే కాకుండా ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. 

ఈ Motorola Signature స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే, ఇది ఎంతో అద్భుతమైన 6.8 అంగుళాల 1.5K LTPO AMOLED స్క్రీన్ను కలిగి ఉంటుంది.. అంతేకాకుండా దీన్ని స్క్రీన్ గరిష్టంగా 6200 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అలాగే ఇందులో స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కంపెనీ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ కూడా అందిస్తోంది. దీనిని మార్కెట్‌లోకి కంపెనీ అల్ట్రా స్లిమ్ డిజైన్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది కేవలం 6.99mm మందం మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా 186 గ్రాముల బరువుతో చాలా తేలికగా చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌తో వచ్చింది.

ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన క్వాల్కమ్ లేటెస్ట్ Snapdragon 8 Gen 5 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. కాబట్టి మల్టీ టాస్కింగ్ చేసుకోవాలనుకునే వారికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. గేమింగ్ చేసేవారు దాదాపు అన్లిమిటెడ్ గా 12 గంటలు ఎంతో తేలికగా ఆడొచ్చు.  ఇక వెనక భాగంలో మూడు కెమెరాలు కలిగి ఉంటుంది. ఇందులోని ప్రధాన కెమెరా సోనీ LYTIA 828 సెన్సార్‌తో 50MPతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా అదనంగా మరో రెండు 50MP కెమెరాలు కూడా లభిస్తాయి. దీంతో పాటు వీటిల్లోని 3x ఆప్టికల్ జూమ్, 100x సూపర్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. 

ఫ్రంట్ భాగంలో 50MP ఆటోఫోకస్ కెమెరా కూడా లభిస్తోంది. ఇక ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన 5200mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతోపాటు ఫాస్ట్ చార్జింగ్ కోసం ఇందులో కంపెనీ 90W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. ఇవే కాకుండా ఎన్నో రకాల అద్భుతమైన స్పెషల్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఇది మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. మొదటి స్టోరేజ్ వేరియంట్ 12GB + 256GB రూ.59,999తో.. రెండవ స్టోరేజీ వేరియంట్ 16GB + 512GB రూ.64,999తో, ఇక మూడవ స్టోరేజ్ వేరియంట్  16GB + 1TB రూ.69,999తో అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో బేస్ వేరియంటిపై ప్రత్యేకమైన ఆఫర్ లభిస్తుంది. 

మార్కెట్‌లో బేస్ వేరియంట్ అసలు ధర రూ.74 వేల రూపాయలు కాగా.. ఫ్లిప్‌కార్ట్‌లో మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి.. 20 శాతం తగ్గింపుతో కేవలం రూ.59,999కే అందుబాటులో ఉంది. దీనిని ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేస్తే రూ.7,740 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఇతర బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి కూడా పేమెంట్ చేసే వారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది.  మీరు యాపిల్ కంపెనీ లేదా సామ్సంగ్ కంపెనీకి సంబంధించిన హై ఎండ్ మొబైల్‌ను ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే క్రమంలో ఎక్స్చేంజ్ చేస్తే ఏకంగా రూ.59,000 వరకు బోనస్ లభిస్తుంది. గరిష్టంగా ఈ బోనస్ను వినియోగించి కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వారికి కేవలం ఇది రూ999కే పొందవచ్చు. అయితే, బోనస్ అనేది పాత మొబైల్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
Advertisement
Back to top