Back
Mancherial504251blurImage

ఉప్పొంగి ప్రవహిస్తున్న రాంనగర్ బ్రిడ్జి, ఇబ్బందుల్లో 33వ వార్డ్ ప్రజలు

KASARLA RAMESH
Sep 02, 2024 09:56:34
Bellampalle, Kannal Rural, Telangana
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలకు హనుమాన్ బస్తీ-అశోక్ నగర్ మధ్య గల రాంనగర్ బ్రిడ్జి ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో రాంనగర్ నుండి రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జి ఉప్పొంగి ప్రవహించడంతో 33వ వార్డ్ లోని ఇండ్లలోకి వరద నీరు వచ్చి ఇబ్బంది పడుతున్నామని వార్డ్ ప్రజలు వాపోయారు. వరద నీటితో పాటు తేల్లు, పాములు వంటి విషపురుగులు వస్తుండడంతో పిల్లలు మహిళలు భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరగా నూతన బ్రిడ్జి నిర్మించాలని కోరారు
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com