Back
Khammam507003blurImage

భూ తగాదాలో మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుడు

Kotha Yakesh
Aug 01, 2024 02:42:18
Khammam, Telangana

ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూ వివాదంలో అంగన్‌వాడీ టీచర్ అరుణపై ఆమె మరిది కొడుకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గుర్రం వెంకట్రావు-రాంబాబు అన్నదమ్ముల మధ్య భూ పంచాయితీ జరుగుతోంది. అరుణకు రుణమాఫీ అయిన పొలంలో వాటా కోరుతున్న రాంబాబు కుమారుడు సాయి కుమార్, అంగన్‌వాడీ సెంటర్‌కు వెళ్లి ఈ దాడికి పాల్పడ్డాడు. స్థానికులు మంటలు ఆర్పి, బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com