ఖైరతాబాద్: మైసమ్మ ఆలయంలో డిప్యూటీ మేయర్ పూజలు
Hyderabad, Telangana:ఆశాడ మాసం బోనాల సందర్భంగా మంగళవారం జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని కట్ట మైసమ్మ అమ్మవారి ఆలయాన్ని జీహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసి రాష్ట్ర అధ్యక్షులు, కాంగ్రెస్ నేత మోతె శోభన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, సంతోషంగా ఉండాలని పూజలు నిర్వహించినట్లు తెలిపారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
LPG Cylinder Price: సామాన్యులకు గుడ్న్యూస్..భారీగా పడిపోయిన సిలిండర్ ధరలు!
Hyderabad, Telangana:LPG Cylinder Price Cut: ఆగస్టు 1 నుంచి గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలో భారీగా తగ్గింపును ప్రకటించాయి. పశ్చిమాసియాలో నెలకొన్ని ఉద్రిక్తతలు, అంతర్జాతీయ సంగర్షణల నేపథ్యంలో సిలిండర్ ధరలు వ్యాపార రంగనికి గణనీయమైన ఉపశమనాన్ని కలిగించాయి.ఉగ్రరూపంలో గోదావరి.. 55 అడుగులకు చేరిన నీటిమట్టం.. 3వ ప్రమాద హెచ్చరిక జారీ!
Hyderabad, Telangana:Godavari Floods Latest News: భారీ వర్షం కారణంగా గోదావరి భయంకర ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి ఉప్పెనలా వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి ప్రళయ జలాలతో పోటెత్తుతోంది. శాంతమూర్తిలా ప్రశాంతంగా సాగే గోదారమ్మ.. నేడు మృత్యుదేవతలా పరివాహక ప్రాంతాలను ముంచెత్తుతుంటే.. కళ్లెదుటే తమ ఇళ్లు, చేన్లు నీట మునిగిపోతుండటాన్ని చూసి భద్రాద్రి జిల్లా ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు.
అర్థరాత్రి వేళ.. పెరిగిన భయం..
శనివారం ఉదయం ప్రాంతంలో భద్రాచలం వద్ద నీటిమట్టం ఒక్కసారిగా 53 అడుగులకు చేరుకోవడంతో అధికారులు తక్షణమే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద విపరీతంగా పెరగడం ముందే ఊహించిన యంత్రాంగం.. ప్రజలను హెచ్చరించడంతో పరివాహక గ్రామాల్లో భయాందోళనలు తీవ్రరూపం దాల్చాయి.
ప్రస్తుతం నీటిమట్టం ఏకంగా 55.10 అడుగుల వద్ద ప్రమాదకరంగా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నది తీర ప్రాంతాలను ముంచెత్తుతూ వస్తున్న ఈ దండయాత్రతో వేలాది కుటుంబాలు చెట్టుకొకరు, పుట్టకొకరుగా మారే పరిస్థితి ఏర్పడింది.. తరతరాలుగా నమ్ముకున్న నదే ఈ రోజు ఇంతలా ప్రవహించడంతో బాధితులు రోదిస్తున్న తీరు గుండెలను పిండేస్తోంది.
స్తంభించిన రవాణా వ్యవస్థ..
ఉగ్ర గోదావరి ధాటికి భద్రాచలం–వాజేడు మధ్య ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేరుకోవడంతో ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. అనేక గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయి.. జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తుండటంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
అధికారుల హైఅలర్ట్..
పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం హైఅలర్ట్ ప్రకటించింది. ముంపు ప్రాంతాల ప్రజలను రెస్క్యూ టీమ్ల సహాయంతో సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. బాధితులకు ఉచిత భోజన వసతితో పాటు తాగునీరు, వైద్య సదుపాయాలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
ఎగువన కురుస్తున్న వర్షాల దృష్ట్యా గోదావరి ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని.. తీర ప్రాంతాల ప్రజలు ఎవరూ ధైర్యం కోల్పోవద్దని.. అధికార యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ జల ప్రళయం నుంచి భద్రగిరి రామయ్యే తమను గట్టెక్కించాలని స్థానికులు ఆ స్వామివారిని వేడుకుంటున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Anti PM Modi Remarks: ప్రధాని మోదీని బూతులు పట్టిన యువతి..ఇప్పుడు అమాయకంగా క్షమాపణలు చెబుతోంది!
New Delhi, Delhi:Anti PM Modi Remarks Apology Video: నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జూలై నెలలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా తీవ్రమైన ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నిరసనల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా దూషిస్తూ చేసిన నినాదాలు చేసినట్లు కొందరు యువత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఓ అమ్మాయి మాత్రం ప్రధాని మోదీని దారుణంగా బూతులతో తిడుతూ రెచ్చిపోయిన వీడియో గతంలో వైరల్ అయ్యింది. తాజాగా ఆమెపై కేసు నమోదవ్వడం వల్ల ఆమె ఇప్పుడు తాను 15 ఏళ్ల బాలికను అంటూ క్షమాపణలు చెబుతూ ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విడుదల చేసింది.
ఏం జరిగిందంటే?
జూలై 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా దూషణాత్మక భాషను ఉపయోగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీజేపీ నిరసనకారిణి, ఆన్లైన్లో వెలుగులోకి వచ్చిన ఒక వీడియోలో క్షమాపణ చెప్పింది. తన వయసు 15 ఏళ్లని ఇప్పుడు ఆమె పేర్కొంది. ఢిల్లీలోని కానాట్ ప్లేస్ సందర్శించిన తర్వాత ఫ్రెండ్స్తో కలిసి తాను నిరసనలకు వెళ్లినట్లు చెప్పుకొచ్చింది. తన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రభావానికి లోనయ్యి ప్రధానమంత్రికి వ్యతిరేకంగా చేసిన నినాదాలు చేసినట్లు ఆమె చెబుతోంది.
తాజాగా విడుదల చేసిన వీడియోలో ఆమె చేతులు జోడించి ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. "నేను ఆ వ్యక్తుల ప్రభావానికి లోనయ్యాను" అని ఆమె వీడియోలో చెబుతోంది. "నా వయసు కేవలం 15 ఏళ్లు. నేను చేసింది క్షమించదగినది కాదు. నేను చాలా చెడ్డ మాటలు మాట్లాడాను". దీనిని తన "మొదటి, చివరి తప్పు"గా పేర్కొంటూ, ఆమె మరో మాట మాట్లాడింది. "నేను యావత్ దేశానికి క్షమాపణలు చెబుతున్నాను. నాకు చాలా సిగ్గుగా ఉంది. నన్ను నేను కూడా చూసుకోలేకపోతున్నాను. దయచేసి నన్ను క్షమించండి" అని ఆ యువతి చెప్పుకొచ్చింది.
Ruchika Singh who abused PM Modi is now crying. She said
"I am apologizing to the entire country. I am so ashamed that I cannot even lift my eyes. I am asking for forgiveness from everyone, please forgive me, please.
This is my first and last mistake. After this, I will never… pic.twitter.com/ikcPJR7Q0t
— Chota Don (@choga_don) July 31, 2026
క్షమాపణలు అంగీకరించిన మోదీ!
నిరసన సందర్భంగా తనను దూషించిన విద్యార్థులను తాను క్షమించినట్లు, వారికి శిక్ష విధించడం కాకుండా మార్గనిర్దేశం చేయాలని సమాజాన్ని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో సందేశాన్ని విడుదల చేసిన కొన్ని గంటల తర్వాత ఈ వీడియో వెలుగులోకి వచ్చింది.
"నాపైనా, నా దివంగత తల్లిపైనా ఉపయోగించిన దూషణాత్మక నినాదాలు తీవ్ర ఆవేదన కలిగించాయి" అని మోదీ అన్నారు. "కానీ యువత తమ తప్పుల నుండి నేర్చుకోవడానికి అవకాశం ఇవ్వాలి" అని ప్రధాని మోదీ వీడియోలో చెప్పుకొచ్చారు.
Also Read: సామాన్యులకు పిడుగు లాంటి వార్త..ఆగస్టు 1 నుంచి భారీగా పెరగనున్న ధరలు!
Also Read: IMD Weather Alert: ఏపీ, తెలంగాణకు భారీ తుఫాను ముప్పు..బంగాళాఖాతంలో తీవ్ర అలజడి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
హైదరాబాద్ సైబర్ క్రైమ్ DCP అరవింద్ బాబుపై వేటు!
Hyderabad, Telangana:Hyderabad Cyber Crime DCP: హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) అరవింద్ బాబుపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయనను ప్రస్తుతం ఉన్న సైబర్ క్రైమ్ DCP బాధ్యతల నుంచి తప్పిస్తూ.. తెలంగాణ రాష్ట్ర DGP కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తుండటంతో అరవింద్ బాబు DGP కార్యాలయంలో రిపోర్ట్ చేశారు.
అసలేం జరిగింది?
ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖుల ఫోటోలతో పాటు వీడియోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో అభ్యంతరకర రీతిలో పోస్ట్ చేస్తున్నారంటూ తెలంగాణ BJP నేతలు, ఇతరులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులు భారతీయ నష్యాయ సంహిత (BNS)తో పాటు సమాచార సాంకేతిక చట్టం (IT Act) కింద రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. అయితే, పోస్టులు పెట్టిన ఖాతాదారులతో పాటు ఆయా ప్లాట్ఫామ్ల నిర్వహణ సంస్థ అయిన మెటా ఇండియా (Meta India) హెడ్ను కూడా ఈ కేసుల్లో నిందితుడిగా చేర్చడం పెద్ద వివాదానికి దారితీసింది.
జాతీయ స్థాయిలో దుమారం ..
సోషల్ మీడియా వేదికలలో వేర్వేరు వినియోగదారులు చేసిన వ్యక్తిగత పోస్టులకు వేదికను అందించే మెటా యాజమాన్యాన్ని లేదా దాని ఇండియా హెడ్ను ప్రత్యక్షంగా ఎలా బాధ్యులను చేస్తారనే అంశంపై జాతీయ స్థాయిలో తీవ్ర చర్చ నడిచింది.. IT నిబంధనలతో సాటే ప్లాట్ఫామ్ బాధ్యతలపై స్పష్టత లేకుండా కేసు నమోదు చేయడంపై ఉన్నతాధికారులు, ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
వివాదం ముదిరిపోవడంతో సమగ్ర పరిశీలన జరిపిన రాష్ట్ర ప్రభుత్వం.. సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబుపై వేటు వేస్తూ డీజీపీ కార్యాలయానికి బదిలీ చేసింది.. కాగా.. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల్లోని సాంకేతిక వివరాలు, వినతుల ఆధారంగానే నిందితుల పేర్లను చేర్చామని పోలీస్ వర్గాలు ప్రాథమిక వివరణ ఇచ్చాయి.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
శని-చంద్రుల కలయికతో విష యోగం.. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే!
Hyderabad, Telangana:Visha Yoga Astrology News: జ్యోతిషశాస్త్రం ప్రకారం.. గ్రహాల గమనం, వాటి కలయిక మానవ జీవితంపై విశేష ప్రభావాన్ని చూపుతూ ఉంటాయని మనందరికీ తెలుసు. ఆగస్టు నెలలో జ్యోతిష్యపరంగా అనేక కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. మనస్సు, భావోద్వేగాలకు కారకుడైన చంద్రుని సంచారం వల్ల ఈ నెల ప్రారంభంలోనే కొన్ని ప్రతికూల యోగాలు.. ముఖ్యంగా విష యోగంతో పాటు చంద్రగ్రహణ ప్రభావం పడబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
జ్యోతిషశాస్త్రం ప్రకారం.. చంద్రుడు, శని గ్రహాల కలయిక లేదా పరస్పర దృష్టి ఏర్పడినప్పుడు విష యోగం సంభవిస్తూ ఉంటుంది.. ఇది మానసిక ఆందోళన, అనారోగ్యం, చేపట్టిన పనుల్లో అడ్డంకులను కలిగిస్తూ ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీనికి తోడు రాహు-కేతువుల ప్రభావంతో ఏర్పడే గ్రహణాలు కొన్ని రాశులవారిని అనేక రకాలుగా దెబ్బతీసే ఛాన్స్లు కూడా ఉన్నాయి. ఆగస్టు మొదటి వారంలో ఈ గ్రహాల స్థితి వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థిక నష్టాలు, నిరాశ, తీవ్ర మానసిక ఒత్తిడి ఎదురయ్యే ముప్పు ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
ఏ రాశిపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
వృశ్చిక రాశి (Scorpio)
వృశ్చిక రాశివారికి ప్రతీ నిర్ణయంలోనూ అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. విష యోగం, గ్రహణ ప్రభావం కారణంగా అకస్మాత్తుగా ఊహించని ఖర్చులు పెరిగి.. అనేక సమస్యలు వస్తూ ఉంటాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కుటుంబంలో మనస్పర్థలు, గొడవలు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.. కోర్టు లేదా న్యాయపరమైన విషయాల్లో నిర్ణయాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో ఓపిక పట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వాహనాలు నడిపేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
మీన రాశి (Pisces)
మీన రాశి వారికి కూడా ఈ సమయంలో అనేక సవాళ్లతో జీవితాన్ని ముందుకు సాగించాల్సి ఉంటుంది.. పనుల్లో వరుస ఆటంకాలు ఎదురై తీవ్ర ఒత్తిడికి గురిచేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో సమాజంలో మీ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించే రహస్య శత్రువుల పట్ల అత్యంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.. ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు.. ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది..
మిథున రాశి (Gemini)
ఆగస్టు మొదటి వారం మిథున రాశి వారికి తీవ్ర మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.. చంద్రుని ప్రతికూల పరిస్థితుల వల్ల కోపం, సహనం కోల్పోవడం వంటివి పెరుగుతాయి. ఉద్యోగస్తులు తమ సహోద్యోగులతో, ఉన్నతాధికారులతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించడం అత్యంత ముఖ్యం. వ్యాపారంలో ఎలాంటి పెద్ద పెట్టుబడులు పెట్టకూడదు.. రిస్క్ తీసుకుంటే భారీగా ధన నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఆరోగ్యపరంగా కడుపు నొప్పి, తలనొప్పి వంటి చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే ఛాన్స్లు కూడా కనిపిస్తున్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
August New Rules: సామాన్యులకు పిడుగు లాంటి వార్త..ఆగస్టు 1 నుంచి భారీగా పెరగనున్న ధరలు!
Hyderabad, Telangana:August New Rules 2026: ఆగస్టు నెల ప్రారంభంతో సామాన్యులపై ద్రవ్యోల్బణం భారం మరింత పెరగనుంది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముడిసరుకుల ధరల పెరుగుదల, రవాణా ఛార్జీల భారం, రూపాయి విలువ పతనం వంటి కారణాల వల్ల వివిధ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచేందుకు నిర్ణయించాయి. ఈ ఏడాది వివిధ వినియోగ వస్తువుల ధరలు పెరగడం ఇది మూడోసారి కావడం విశేషం.
ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయి?
ఆగస్టు నుంచి ప్యాక్ చేసిన టీ, హెయిర్ ఆయిల్ (తల నూనె), రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్లు (టీవీలు), రెడీమేడ్ దుస్తులు, ప్రయాగ వాహనాల ధరలు సుమారు 4 శాతం నుంచి 8 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. పండుగ సీజన్ ప్రారంభానికి ముందు ఇదే చివరి ధరల పెంపు కావచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆటోమొబైల్ రంగంపై ప్రభావం..
దేశీయ కార్ల మార్కెట్పై ధరల పెంపు ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. మారుతి సుజుకి కార్లపై ఆగస్టు నుంచి కార్ల ధరలను రూ.15,000 నుంచి రూ.30,000 వరకు పెంచనుంది. అలాగే హోండా ఇండియా కార్లపై ఆగస్టు 1 నుంచి ధరలు పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీ కార్ల ధరలను పెంచగా.. మెర్సిడెస్-బెంజ్ ఇండియా కంపెనీ వచ్చే త్రైమాసికంలో ధరల పెంపు ఉండబోతుందని అంచనా వేస్తుంది.
ఎలక్ట్రానిక్స్, ఎఫ్ఎంసిజి ఉత్పత్తులు..
మెమరీ చిప్ల ధరల పెరుగుదల, సరఫరా సమస్యలు, దిగుమతి వ్యయాల కారణంగా టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఇతర గృహోపకరణాల ధరలను ఎలక్ట్రానిక్స్ కంపెనీలు 4% నుంచి 6% మేర పెంచనున్నాయి. మరోవైపు, పెట్రోలియం ఆధారిత ప్యాకేజింగ్ మెటీరియల్స్, వంట నూనెలు, ముడి పదార్థాల భారం కారణంగా ఎఫ్ఎంసిజి (FMCG) కంపెనీలు కూడా ఉత్పత్తి వ్యయాల పెరుగుదలను ఎదుర్కొంటున్నాయి.
ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు..
పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ప్రపంచ సరఫరా గొలుసు దెబ్బతినడం వల్ల సముద్ర రవాణా ఛార్జీలు, ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. రూపాయి మారకం విలువ పడిపోవడంతో దిగుమతులు మరింత ప్రియంగా మారాయి. పెరిగిన ఉత్పాదక వ్యయాల భారాన్ని కంపెనీలు చివరికి చిల్లర ధరల రూపంలో వినియోగదారులపై మోపుతున్నాయి.
పండుగ సీజన్పై అంచనాలు..
ఆగస్టు తర్వాత ధరలు మరింత భారీగా పెరిగే అవకాశం ఉండదని కంపెనీలు భావిస్తున్నాయి. ఓనంతో ప్రారంభమయ్యే రాబోయే పండుగ సీజన్లో వినియోగదారుల నుంచి డిమాండ్ బలంగా ఉంటుందని, మార్కెట్పై దీని ప్రభావం పరిమితంగానే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also REad: ఆగస్టులో విద్యార్థులకు పండగే పండగ..ఏకంగా వారం రోజులకు పైగా సెలవులు!
Also Read: E20 పెట్రోల్తో మైలేజ్ తగ్గుతుందా? రాజ్యసభలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
శ్రావణ మాసంలో ఈ రాశులవారికి శని ఎఫెక్ట్.. వీరికి రాజయోగం.. కోరుకున్న కోరికలు నెరవేరే కాలం!
Hyderabad, Telangana:Shravana Masam Shani Effect: హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన శ్రావణ మాసం మొదలైంది.. ఈ మాసంలో కర్మఫలదాత అయిన శని దేవుడు మీన రాశిలో వక్ర మార్గంలో సంచారం కొనసాగిస్తున్నాడు.. శనిభగవానుడి ఈ వక్ర స్థితి 2026 డిసెంబర్ వరకు కొనసాగనుంది. శ్రావణ మాసంలో శనిదేవుని ఈ ప్రత్యేక కదలికలు మొత్తం 12 రాశుల వారి కెరీర్, ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడబోతోంది. ముఖ్యంగా కొందరికి ఇది సువర్ణ అవకాశాలను తెచ్చిపెడితే.. మరికొందరికి సవాళ్లను ఎదుర్కొనేలా చేస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే శని అనుగ్రహం వల్ల జీవితంలో అనుకున్న పనులు సులభంగా చేస్తారు. ముఖ్యంగా 12 రాశుల వారి భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారికి లాభాలే, లాభాలు:
మేష రాశి:
శ్రావణ మాసం మేష రాశి వారికి అత్యంత శుభప్రదమైనదిగా భావించవచ్చు.. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి మంచి అవకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు సులభంగా పూర్తవుతాయి. నాయకత్వలో ఉన్నవారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది.
వృషభ రాశి:
ఆర్థికంగా ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది.. ఆదాయానికి కొత్త మార్గాలు సుగమమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రయాణాలు చేయాలనుకుంటున్నవారికి దిమ్మతిరిగే ధన లాభాలు కూడా కలుగుతాయి. అయితే, అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది..
సింహ రాశి:
శని దేవుని అనుగ్రహంతో సింహ రాశి వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆఫీసులో శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
మకర రాశి:
వ్యాపారంలో కొత్త, లాభదాయకమైన ఒప్పందాలు ఖరారవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కెరీర్లో పురోగతి లభించడమే కాకుండా అనుకున్న పనుల్లో దిమ్మతిరిగే ధన లాభాలు కూడా సొంతం చేసుకుంటారు. కుటుంబ సంబంధాలు మరింత బలపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
కర్కాటక రాశి:
ఈ సమయంలో కర్కాటక రాశివారికి మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ.. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించాలి. అంతేకాకుండా కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మేలు..
మిథున రాశి:
మిథున రాశివారికి ఈ సమయం ఎంతో లాభదాయంగా ఉంటుంది. విజయం సాధించడానికి సాధారణం కంటే ఎక్కువ శ్రమించాల్సి ఉన్నప్పటికీ జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు సొంతం చేసుకుంటారు.. తొందరపాటు నిర్ణయాల వల్ల చిక్కులు రావచ్చు.. ఓర్పు వహించడం చాలా ముఖ్యం.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Bhogapuram Airport Credit: టీడీపీ Vs వైసీపీ.. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం వేళ క్రెడిట్ రాజకీయాలు..ఎవరు ఎంత చేశారంటే?
Gudepuvalasa, Andhra Pradesh:Bhogapuram Airport Credit War: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం వేళ క్రెడిట్ ఎవరిదనే చర్చపై రాజకీయ వర్గాలలో, సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత దశాబ్ద కాలంగా ప్రాజెక్ట్ వెనుక జరిగిన పరిణామాలు, రికార్డుల్లో ఉన్న వాస్తవాలు పరిశీలిస్తే పరిస్థితి స్పష్టమవుతుంది.
ప్రాజెక్ట్ ప్రయాణం - వాస్తవాల రూపంలో...
భూసేకరణ వివాదాలు: అవసరానికి మించి దాదాపు 5,000 ఎకరాలకు పైగా భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేయడం, స్థానిక రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, ఆందోళనలకు అప్పట్లో ప్రతిపక్షం (వైసీపీ) మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ప్రజాపోరాటాల ఫలితంగా భూమి పరిమితిని సుమారు 3,000 ఎకరాలకు కుదించారు.
మొదటి వేలం, మార్పులు
ఎయిర్పోర్టు నిర్మాణానికి తొలుత వేలం నిర్వహించగా, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) బిడ్డు గెలుచుకుంది. అయితే అప్పట్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు హయాంలో ఆ వేలాన్ని రద్దు చేసి, నిబంధనలను సవరించి తిరిగి వేలం నిర్వహించి GMR సంస్థకు అప్పగించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇందులో నిజమెంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికే తెలియాలి.
ప్రభుత్వాల మారడంతో జాప్యం
ఆ తర్వాత కాలంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు కొంతకాలం ఆగిపోవడం, కాకినాడ SEZలో GMR వాటాలు అరబిందోకు బదిలీ కావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2014లో భూసేకరణ ప్రారంభమైన అనేక అవాంతరాల తర్వాత ఓ కొలిక్కి వచ్చింది. అయితే 2019-2024 మధ్య విమానాశ్రయ పనులు మందకొడిగా సాగాయి.
పునఃప్రారంభం వేగం
ఆ తర్వాత 2024లో పనులు మళ్లీ ఊపందుకున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనులను వేగవంతం చేశారు. ఉత్తరాంధ్రలో కలికితురాయిగా ఉండాలని.. రాష్ట్ర ప్రభుత్వం కనెక్టింగ్ రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించింది.
చివరిగా.. భోగాపురం ప్రాజెక్ట్ అనేది ఒక రోజూ, ఒక ప్రభుత్వ హయాంలో పూర్తయింది కాదు. అనేక రాజకీయ పరిణామాలు, ప్రభుత్వాల మార్పులు, న్యాయపరమైన, ఆర్థిక ఒప్పందాల నేపథ్యంలో దశాబ్ద కాలంగా సాగిన ప్రక్రియ ఇది. ప్రాజెక్ట్ నిర్మాణంలో వాస్తవ పనులు దక్కించుకుని పూర్తి చేసిన ఘనత మాత్రం పూర్తిగా GMR (జీఎంఆర్) సంస్థకే దక్కుతుంది.
Also Read: భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా సర్వీసులు ప్రారంభం..పూర్తి షెడ్యూల్ ఇదే!
Also Read: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సానికి ఏర్పాట్లు పూర్తి..ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
కమర్షియల్ ఎల్పీజీ యూజర్లకు గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన సిలిండర్ ధరలు!
Lakshmapur, Telangana:LPG Cylinder Price Cut: దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపార వర్గానికి, హోటళ్లకు, రెస్టారెంట్లకు, క్యాటరింగ్ ఆపరేటర్లకు ఉపశమనం కల్పిస్తూ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ ధరల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నాయి. నెలవారీ సవరణలలో భాగంగా, ఆగస్టు 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చేలా వాణిజ్య (19 కేజీల) ఎల్పీజీ సిలిండర్ల ధరలో గణనీయమైన తగ్గింపును ప్రకటించాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ సంఘర్షణల నేపథ్యంలో, గతంలో పెరుగుతూ వచ్చిన సిలిండర్ ధరలు ఇప్పుడు వ్యాపార రంగానికి గణనీయమైన ఉపశమనాన్ని కలిగించాయి.
వివిధ నగరాల్లో సిలిండర్ ధరలలో భారీ తగ్గింపు:
తాజా సవరణ ప్రకారం, జాతీయ రాజధాని ఢిల్లీ నుండి కోల్కతా వరకు వాణిజ్య సిలిండర్ ధరలు మారాయి. ఢిల్లీలో, 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర సుమారుగా రూ.192 తగ్గి రూ.202కు చేరింది. అదేవిధంగా, కోల్కతాలో ధర రూ.209మేర తగ్గడం విశేషమని చెప్పాలి. ఈ తాజా తగ్గింపుతో, కోల్కతాలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ 2,872.50కు తగ్గింది. నిజానికి, జూలై 1వ తేదీన వాణిజ్య సిలిండర్ల ధరను కూడా రూ.183.50 తగ్గించారు. ఈ తగ్గింపు వరుసగా రెండో నెల కూడా కొనసాగుతూ, వ్యాపారులకు గణనీయమైన ఉపశమనాన్ని అందిస్తోంది. రెండు నెలల్లోనే ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ల ధర మొత్తం రూ.375.50 తగ్గింది.
గృహ వినియోగదారులకు ఉపశమనం లేదు
వాణిజ్య సిలిండర్ల ధరలు గణనీయంగా తగ్గి వ్యాపార వర్గానికి ప్రయోజనం చేకూర్చగా, సాధారణ గృహ వినియోగదారులకు ఎలాంటి ఉపశమనం లభించలేదు. మన ఇళ్లలో వంటకు ఉపయోగించే 14.2 కేజీల గృహ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. గృహ సిలిండర్ల ధరలు పాత ధరల వద్దే స్థిరంగా ఉన్నందున, ఈ ధరల తగ్గింపు వర్తిస్తే తమకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని మధ్యతరగతి కుటుంబాలు ఆశిస్తున్నాయి.
Also Read: మీ సమస్యలు నాకు వదిలేయండి.. ముందు పిల్లల భవిష్యత్తుపై పోరాడండి
Also Read: ఒక్కో విద్యార్థిపై రూ. 1.08 లక్షల ఖర్చు.. అయినా ప్రైవేట్ వైపేనా
Also Read: ఆ పరిచయమే కొంపముంచిందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా సర్వీసులు ప్రారంభం..పూర్తి షెడ్యూల్ ఇదే!
Gudepuvalasa, Andhra Pradesh:Bhogapuram Airport Air India Services: దేశీయ విమానయాన రంగంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ అత్యాధునిక ఎయిర్పోర్టును ఘనంగా ప్రారంభించనున్నారు. ఈ చారిత్రాత్మక తరుణంలో, ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీని అందించేందుకు ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ముందుకు వచ్చింది. భోగాపురం నుంచి ఆగస్టు 17 నుంచి విమాన రాకపోకలు ప్రారంభంకానున్నట్లు వెల్లడించిన సంస్థ, ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను అక్టోబర్ 24 వరకు తాజాగా విడుదల చేసింది.
విమానయాన రాకపోకలకు సంబంధించి ఎయిర్ ఇండియా ప్రకటించిన వివిధ నగరాల సర్వీసుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. వాటి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ - భోగాపురం రూట్
తెలుగు రాష్ట్రాల రాజధాని హైదరాబాద్ నుంచి భోగాపురం విమానాశ్రయానికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అత్యధిక సర్వీసులను కేటాయించారు. ఈ మార్గంలో ప్రతిరోజూ నిరంతరం 5 సర్వీసులు రాకపోకలు సాగించనున్నాయి. దీనివల్ల వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, విద్యార్థులకు రాకపోకలు ఎంతో సులభతరం కానున్నాయి.
బెంగళూరు - భోగాపురం రూట్
ఐటీ హబ్ బెంగళూరు నుంచి భోగాపురానికి రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం ప్రత్యేక షెడ్యూల్ను రూపొందించారు. ఈ మార్గంలో నిత్యం 2 సర్వీసులు రెగ్యులర్గా నడుస్తాయి. అయితే, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రోజులను దృష్టిలో ఉంచుకుని ఆది, శుక్రవారాలు మినహా మిగిలిన 5 రోజులు అదనంగా మరో సర్వీసును నడపనున్నట్లు ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. తద్వారా ఈ మార్గంలో కొన్ని రోజులు మొత్తం 3 సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.
విజయవాడ - భోగాపురం రూట్
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన విజయవాడ నుంచి భోగాపురం మధ్య కూడా విమాన సర్వీసులు భారీగా ఉండనున్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించేలా రోజుకు 4 సర్వీసులు నడపనున్నట్లు ఎయిర్ ఇండియా అధికారికంగా తెలియజేసింది.
ప్రయాణికులకు ముఖ్య గమనిక
విమానాశ్రయ ప్రారంభోత్సవం అనంతరం ఆగస్టు 17 నుంచి విమానాలు టేకాఫ్ తీసుకోనున్నాయి. అక్టోబర్ 24 వరకు వర్తించే ఈ తాజా షెడ్యూల్ను ప్రయాణికులు అందరూ విధిగా గమనించాలని కోరడమైనది. టికెట్ల బుకింగ్, సమయాల్లోని మార్పులు వంటి ఇతర పూర్తి వివరాల కోసం ఎయిర్ ఇండియా అధికారిక వెబ్సైట్ లేదా కస్టమర్ కేర్ను సంప్రదించవచ్చు. ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక, పర్యాటక అభివృద్దికి ఈ ఎయిర్పోర్టు ఒక మైలురాయిగా నిలవనుందని విమానయాన నిపుణులు భావిస్తున్నారు.
Also Read: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సానికి ఏర్పాట్లు పూర్తి..ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే!
Also Read: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల ముసాయిదా విడుదల..44 లక్షల ఓట్ల తొలగింపు..మీ పేరు ఉందా చూడండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Commonwealth Games 2026: కామన్వెల్త్ గేమ్స్లో అద్భుతం..నీరజ్ చోప్రాకు రజతం.. యశ్వీర్ సింగ్కు కాంస్య పతకం
Hyderabad, Telangana:Commonwealth Games 2026 Javelin Throw: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు మరోసారి సత్తా చాటారు. శుక్రవారం రాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో ఇద్దరు భారత ఆటగాళ్లు పతకాలు సాధించారు. ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాకు రజతం.. అలాగే యువ కెరటం యుశ్ వీర్ సింగ్ కాంస్య పతకాన్ని సాధించారు. అయితే ఒకే గేమ్లోని ఇద్దరు భారత ఆటగాళ్లు రెండేసి పతకాలు సాధించడం అరుదైన ఘటనగా క్రీడా అభిమానులు అభివర్ణించారు.
స్కాట్లాండ్లోని గ్లాస్గోలో ఉన్న స్కాట్స్టౌన్ స్టేడియంలో జరుగుతోన్న కామన్ వెల్త్ గేమ్స్లో భారత అథ్లెట్లు ఈ ఘటన సాధించారు. ఈ ఫైనల్ విభాగంలో స్టార్ జావెలిన్ ప్లేయర్ నీరజ్ చోప్రా 85.83 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకోగా, యశ్ వీర్ సింగ్ 85.41 మీటర్ల త్రోతో కాంస్య పతకాన్ని సాధించాడు. అయితే వీరిద్దరి కంటే ముందుగా శ్రీలంకకు చెందిన రుమేష్ తరంగ పతిరాగే 89.75 మీటర్ల భారీ త్రోతో స్వర్ణ పతకాన్ని గెలుచుకుని అగ్రస్థానంలో నిలిచాడు.
ఫైనల్ పోటీ ఎలా సాగింది?
గాయం కారణంగా 2022 కామన్వెల్త్ గేమ్స్కు దూరమైన నీరజ్ చోప్రా, ఈసారి 80.97 మీటర్ల త్రోతో బలమైన ఆరంభాన్ని ఇచ్చాడు. రెండో రౌండ్లో 85.83 మీటర్ల అత్యుత్తమ త్రోతో అతను తాత్కాలికంగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. అయితే, అదే రౌండ్లో పతిరాగే 89.75 మీటర్ల భారీ త్రోతో వెంటనే స్పందించి, మిగిలిన పోటీలో ఎవరూ అధిగమించలేని రికార్డును నెలకొల్పాడు.
తుది పతకాల పట్టిక: పురుషుల జావెలిన్ త్రో (CWG 2026)
స్వర్ణం: రుమేష్ పతిరాగే (శ్రీలంక) - 89.75 మీటర్లు
రజతం: నీరజ్ చోప్రా (భారత్) - 85.83 మీటర్లు
కాంస్యం: యశ్ వీర్ సింగ్ (భారత్) - 85.41 మీటర్లు
పాకిస్థాన్కు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ అర్షద్ నదీమ్ చివరి మూడు ప్రయత్నాలకు అర్హత సాధించలేకపోవడంతో తొమ్మిదవ స్థానానికి పరిమితమవ్వడం ఈ రాత్రి జరిగిన ఒక ఊహించని పరిణామం.
యశ్ వీర్ సింగ్ అద్భుత ప్రదర్శన
గోల్డ్ కోస్ట్ 2018లో స్వర్ణం గెలిచిన తర్వాత నీరజ్ చోప్రా తన కెరీర్లో మరో కామన్వెల్త్ పతకాన్ని జోడించుకోగా, భారత బృందానికి యశ్ వీర్ సింగ్ ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తీవ్రమైన పోటీ మధ్య అద్భుతంగా రాణించిన యశ్ వీర్, తన మునుపటి వ్యక్తిగత పరిమితులను అధిగమించి 85.41 మీటర్లు విసిరి, గ్రెనడాకు చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్ ఆండర్సన్ పీటర్స్, దక్షిణాఫ్రికాకు చెందిన డౌ స్మిత్లను వెనక్కి నెట్టి, తన తొలి కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతకాన్ని పదిలం చేసుకున్నాడు. అలాగే భారతదేశానికి చెందిన మూడవ ఫైనలిస్ట్, రోహిత్ యాదవ్ 81.56 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శనతో ఏడవ స్థానంలో నిలిచాడు.
కామన్వెల్త్ గేమ్స్లో జావెలిన్ త్రోలో భారత్కు సంబంధించిన కీలక అంశాలు..
భారతదేశానికి డబుల్ పోడియం: కామన్వెల్త్ గేమ్స్ జావెలిన్ చరిత్రలో తొలిసారిగా భారత్కు చెందిన ఇద్దరు అథ్లెట్లు మొదటి మూడు స్థానాల్లో నిలవడం విశేషం.
నీరజ్ చోప్రా కామన్వెల్త్ గేమ్స్ రికార్డు: నీరజ్ చోప్రా తాను గతంలో పాల్గొన్న కామన్వెల్త్ గేమ్స్లో ఓ సారి స్వర్ణ (2018) పతాకాన్ని సాధించగా.. ఇప్పుడు రజత (2026) పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
అప్కమింగ్ టాలెంట్: యశ్ వీర్ సింగ్ అంతర్జాతీయ వేదికపై తన కెరీర్లోనే అత్యుత్తమమైన 85.41 మీటర్ల త్రోను నమోదు చేశాడు.
Also Read: కామన్వెల్త్ గేమ్స్లో ఫైనల్కు చేరిన మరో భారత అథ్లెట్..బంగారం వేటలో బాక్సర్ ప్రీతి!
Also Read: కామన్వెల్త్ గేమ్స్లో సత్తా చాటిన నీరజ్ చోప్రా..ఫైనల్లో అడుగుపెట్టిన భారత అథ్లెట్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
RTC Bus Driver: రీల్స్ చూస్తూ ఆర్టీసీ బస్ డ్రైవింగ్.. సస్పెండ్
Madanapalle, Arikela, Andhra Pradesh:RTC Bus Driver Watch Insta Reels While Driving Watch Viral VideoMouse Theft Gold: దొంగ ఎలుక.. బంగారం దుకాణంలో చోరీ
Tumakur, Karnataka:Mouse Theft Gold Ornaments In Jewellery Shop Video Goes ViralTelangana: దేశంలో పెట్టుబడులకు తెలంగాణ సురక్షిత స్థానం: రేవంత్ రెడ్డి
Hyderabad, Telangana:Invest Telangana: 'పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ సురక్షిత స్థానం. తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టాలి' అని తెలంగాణ ముఖ్యమంత్రి ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులకు రక్షణగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. 'తెలంగాణ సంస్కృతి తమకు పెద్ద ఆస్తి. హైదరాబాద్లో అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టిన దానికి రెట్టింపు ఆదాయం వస్తుంది. పారిశ్రామికవేత్తలు తమకు ఏం కావాలో చెబితే ఆ వసతులు కల్పిస్తాం' అని పెట్టుబడిదారులను తెలంగాణ సీఎం ఆకర్షించారు.
భారత పరిశ్రమల సమాఖ్య, ఉత్తర భారత ప్రతినిధులను హైదరాబాద్లో ముఖ్యమంత్రి కలిశారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రితో సమావేశమైన ప్రతినిధులు తమ ఆలోచనలు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ పారిశ్రామిక విధానాలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని, మంచి ప్రతిపాదనలతో వచ్చిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తున్నామని వివరించారు. 30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ఫార్చ్యూన్ 500 కంపెనీల పెట్టుబడులు పెట్టాలనేది తమ ఆకాంక్ష అని తెలిపారు.
'డిసెంబర్లో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో 175 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్ -2047 పాలసీని గ్లోబల్ సమ్మిట్లో ప్రకటించాం. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతంగా ఉందని.. అది 10 శాతంగా ఉండాలన్నదే మా లక్ష్యం' అని తెలంగాణ సీఎం తెలిపారు. ఐటీ శాఖ మంత్రి ప్రతి రెండు నెలలకోసారి, తాను ప్రతి మూడు నెలలకు ఒకసారి అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణను మీ సొంత ప్రాంతంగా భావించాలని సీఐఐ ప్రతినిధులకు సూచించారు.
దేశంలోని మెట్రో నగరాలు ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగుళూరు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ ఆ మహానగరాల పరిస్థితులు రావొద్దన్న ఉద్దేశంతో సంస్కరణలు తీసుకువచ్చాం. సర్వీస్ సెక్టర్, మాన్యుఫ్యాక్చర్ రంగం, వ్యవసాయ రంగానికి, వ్యవసాయ ఆధార పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలంగాణ సీఎం వివరించారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు ఇవ్వడంతో పాటు ఇతర వసతులు కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
వరంగల్, ఆదిలాబాద్లో ఎయిర్ పోర్టుల నిర్మాణాలకు కేంద్రం నుంచి అనుమతి తెలిపిందని, 7 బుల్లెట్ ట్రైన్లను కేంద్రం ప్రకటిస్తే 3 తెలంగాణకు వచ్చాయని తెలంగాణ సీఎం గుర్తుచేశారు. శంషాబాద్ నుంచి చెన్నై, శంషాబాద్ నుంచి పూణె, శంషాబాద్ నుంచి బెంగళూరు బుల్లెట్ ట్రైన్లు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోటీ పడి చైనా ప్లస్ 1 కంట్రీగా తెలంగాణను నిలపడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 2037 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతామని తెలిపారు.
'ఏఐ సునామీతో వైట్ కాలర్ జాబ్లు పోతుండడంతో నైపుణ్యాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాం. రాష్ట్రంలోని ఐటీఐలను ఏటీసీలుగా మార్చిన నేపథ్యంలో వాటిల్లో శిక్షణ పొందిన వారికి 100 శాతం ఉద్యోగాలు పొందారు. జీసీసీల్లో 200 కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయని, అమెజాన్ డేటా సెంటర్ల పై రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెడుతోందన్నారు. అదాని రూ.35 వేల కోట్లు డేటా సెంటర్పైన పెట్టుబడి పెడుతోంది' అని ముఖ్యమంత్రి వివరించారు.
RTC Bus Driver: సెల్ఫోన్ చూస్తూ బస్ డ్రైవింగ్.. వీడియో వైరల్ కావడంతో డ్రైవర్ సస్పెండ్
Madanapalle, Andhra Pradesh:Viral News: విధి నిర్వహణలో ఆదర్శంగా ఉండే ఆర్టీసీ డ్రైవర్ తీవ్ర నిర్లక్ష్యం వహించాడు. పదుల సంఖ్యలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సు డ్రైవర్ బాధ్యతగా ఉండాల్సి ఉండగా ప్రమాదకరంగా బస్సు నడిపాడు. సెల్ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయగా.. ఆ వీడియో వైరల్గా మారింది. నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఎట్టకేలకు అతడిని ఆర్టీసీ అధికారులు విధుల నుంచి తొలగించారు. ఈ వీడియో వైరల్గా మారింది. ఈ సంఘటన ఏపీలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన కలకలం రేపింది. మదనపల్లి నుంచి చిత్తూరుకు వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు (ఏపీ39 యూవీ 9691)ను డ్రైవర్ నిర్లక్ష్యం ప్రదర్శించాడు. బస్సు నడుపుతూనే డ్రైవర్ సెల్ఫోన్లో నిమగ్నమై డ్రైవింగ్ చేశాడు. ప్రయాణికులు వారిస్తున్నా వినిపించుకోలేదని తెలుస్తోంది. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
బస్సు డ్రైవర్ మొబైల్ ఫోన్ చూస్తూ ప్రమాదకరంగా బస్సు నడపడాన్ని గమనించిన ఓ ప్రయాణికుడు తన సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించాడు. అనంతరం అది సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. పలమనేరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో ఈ సంఘటన చోటుచేసుకుందని తెలిసింది. ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టి డ్రైవింగ్ చేస్తూనే సెల్ఫోన్ ఉపయోగించడంపై ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైరల్గా మారిన ఈ వీడియోపై అధికారులు స్పందించారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సంబంధిత డ్రైవర్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఆదర్శంగా ఉండాల్సిన ఆర్టీసీ డ్రైవర్లు ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని విధి నిర్వహణ సమయంలో సెల్ఫోన్లు ఉపయోగించకుండా కఠిన చర్యలు అమలు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఈ సమాచారం తెలుసుకున్న ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించారని తెలుస్తోంది. మొబైల్ ఫోన్ చూస్తూ బస్సు నడిపిన ఘటనపై ఆర్టీసీ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. ఆర్టీసీ అధికారులతో చర్చించి సంబందించిన ఆర్టీసీ డ్రైవర్ను వెంటనే సస్పెండ్ చేయించారని తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
