విమానంలో మంటలు చెలరేగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది
శంషాబాద్ విమానాశ్రయం నుండి కౌలాలంపూర్కు బయలుదేరిన తర్వాత, పైలట్ కుడి వైపు ఇంజిన్లో సాంకేతిక సమస్యను గుర్తించాడు, పైలట్ అత్యవసర ల్యాండింగ్ కోసం ATCని సంప్రదించాడు మరియు ఈ విమానంలో 130 మంది ప్రయాణికులను సురక్షితంగా తరలించారు. ఓ ప్రయాణికుడు తన సెల్ఫోన్తో ఇంజన్ మంటలను చిత్రీకరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
China’s Yuan Climbs Past 7 Per Dollar as PBOC Caves: ప్రపంచ ఆర్థిక రంగంలో చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా కరెన్సీ యువాన్, అమెరికా డాలర్తో పోలిస్తే కీలకమైన 7 స్థాయిని దాటింది. ఇది కేవలం సంఖ్యా మార్పు మాత్రమే కాదు.. అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లలో ఇది ఒక మానసిక పరిమితిగా పరిగణిస్తున్నారు. ఈ స్థాయిని యువాన్ దాటడంతో.. చైనా తన కరెన్సీని బలహీనపరచాలన్న ఉద్దేశం లేదని.. క్రమంగా బలోపేతం చేయాలన్న దిశగా అడుగులు వేస్తోందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. ఈ నిర్ణయం చైనా దేశీయ ఆర్థిక వ్యవస్థకే కాకుండా అమెరికా.. ప్రపంచ మార్కెట్లు, భారత్ పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
యువాన్ 7 స్థాయి దాటడం ఎందుకు అంత ముఖ్యమంటే.. గతంలో ఈ స్థాయి కంటే దిగువకు యువాన్ పడినప్పుడు చైనా తన ఎగుమతులను చౌకగా ఉంచేందుకు కరెన్సీని నియంత్రిస్తున్నదన్న భావన ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా రోజువారీ రిఫరెన్స్ రేటును మార్కెట్ అంచనాల కంటే బలంగా నిర్ణయిస్తూ.. యువాన్ మరింత పతనం చెందకుండా కట్టడి చేస్తోంది. దీని అర్థం చైనా మార్కెట్లకు యువాన్ను బలహీనంగా చేయాల్సిన అవసరం లేదు అనే స్పష్టమైన సందేశాన్ని పంపుతోంది.
ఈ పరిణామం అమెరికాకు బిగ్ షాక్ తగలడం ఖాయమని చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా అమెరికా.. చైనా ఉద్దేశపూర్వకంగా యువాన్ను బలహీనంగా ఉంచి తమ ఎగుమతులకు లాభం చేకూర్చుకుంటోందని ఆరోపిస్తోంది. కానీ యువాన్ బలపడటం ఆ వాదనను బలహీనపరుస్తోంది. అంతేకాదు.. డాలర్ ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న సమయంలో యువాన్ బలపడితే.. ప్రపంచ కరెన్సీ వ్యవస్థలో డాలర్ ఆధిపత్యంపై ప్రశ్నలు తలెత్తుతాయి. ఇది అమెరికా ఆర్థిక విధానాలకు రాజకీయంగా, వ్యూహాత్మకంగా కూడా ఇబ్బందికరమైన పరిస్థితిని తీసుకువస్తుంది.
చైనా ఈ నిర్ణయం వెనుక స్పష్టమైన లక్ష్యాలతో ముందుకెళ్తోంది. మొదటగా.. విదేశీ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి పొందడం ఒక కారణమైతే.. బలమైన కరెన్సీ ఉంటే పెట్టుబడిదారులు మరింత నమ్మకంతో చైనా మార్కెట్లలోకి వస్తారని చైనా బలంగా నమ్ముతోంది. తన స్టాక్, బాండ్ మార్కెట్లకు విదేశీ నిధులను ఆకర్షించడం రెండో కారణంగా చెబుతోంది. ఇక మూడవది ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంత సడలుతున్న వేళ.. ఆ అవకాశాన్ని ఆర్థికంగా వినియోగించుకోవాలని భావిస్తోంది. అయితే చైనా యువాన్ను పూర్తిగా స్వేచ్ఛగా వదిలేయదు. ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉండేందుకు, కరెన్సీ బలోపేతాన్ని ఎప్పటికీ నియంత్రితంగా కొనసాగిస్తుంది.
ఈ పరిణామం భారతదేశానికి కూడా చాలా ప్రాధాన్యత కలిగిస్తుందని చెప్పాలి. ఎందుకంటే యువాన్ బలపడితే చైనా ఉత్పత్తులు ఖరీదవుతాయి. ఇది భారత ఎగుమతిదారులకు ప్రపంచ మార్కెట్లో పోటీ పడేందుకు మంచి అవకాశాన్ని ఇస్తుంది. మరోవైపు.. చైనా నుంచి దిగుమతులు కొంత ఖరీదయ్యే అవకాశం ఉంది. డాలర్ బలహీనపడితే.. భారత రూపాయి స్థిరంగా ఉండే లేదా కొంత బలపడే అవకాశమూ ఉంది. ఇది విదేశీ పెట్టుబడులకు మద్దతుగా నిలిచే అవకాశం కూడా ఉంటుంది. చైనాలోకి విదేశీ పెట్టుబడులు పెరిగితే.. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై సానుకూల భావన ఏర్పడుతుంది. దీని ప్రభావం భారత స్టాక్ మార్కెట్పైనా కనిపించే అవకాశం ఉంటుంది.
అయితే...సామాన్యుడు ఈ పరిణామం నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. ఇది కేవలం చైనా–అమెరికా మధ్య జరిగే పరిణామం మాత్రమే కాదు... ప్రపంచ కరెన్సీ వ్యవస్థలో చైనా తన స్థానాన్ని బలపరుచుకునే దిశగా వేసిన ఒక కీలక అడుగుగా భావించాలి. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే.. భారతదేశానికి అవకాశాలతోపాటు కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి. రాబోయే రోజుల్లో డాలర్ కదలికలు, చైనా కేంద్ర బ్యాంకు తదుపరి చర్యలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, రూపాయి స్థిరత్వం ఇవన్నీ కలిపి తీసుకునే నిర్ణయం భారతదేశానికి ఎంత మేరకు ప్రభావం చూపుతుందో నిర్ణయించనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Bangladesh crisis Hindu leader to contest as independent from sheikh Hasina seat: బంగ్లాదేశ్ లోప్రస్తుతం అనిశ్చితి కొనసాగుతుంది. ఇప్పటికే అక్కడ హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఇటీవల విద్యార్థి నేత ఉస్మాన్ హదీ దుర్మరణం తర్వాత బంగ్లాదేశ్ లో అల్లరీ మూకలు రెచ్చిపోయారు. అంతేకాకుండా హిందువులను టార్గెట్గా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల బంగ్లాలో ఒక యువకుడ్ని దారుణంగా కొట్టి చెట్టుకు వేలాడదీసి కాల్చిన చంపిన ఘటనపై తీవ్ర ఆందోళన కరంగా మారిన విషయం తెలిసిందే.దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.
ఇదిలా ఉండగా.. బంగ్లాలో ఇంకా పరిస్థితులు పూర్తిగా అదుపులోకి రాలేదు. మరోవైపు ఫిబ్రవరిలో జరిగే బంగ్లాదేశ్ ఎన్నికల్లో భారత్ లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా పార్టీ అవామీలీగ్ పై నిషేధం విధిస్తున్నట్లు తాత్కలిక ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో షేక్ హసీనా ప్రాతినిధ్యం వహిస్తున్న
బంగ్లా తాత్కలిక ప్రభుత్వం ప్రధాని పదవి కోల్పోయిన షేక్ హసీనా పార్టీ అయిన అవామీలీగ్ పై నిషేధం ఫిబ్రవరిలో జరిగే జాతీయ పార్లమెంటరీ ఎన్నికల్లో ఒక హిందూ నేత పోటీలో ఉంటున్నట్లు ప్రకటించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. గోవిందా చంద్ర ప్రామాణిక్ అనే అడ్వకేట్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు.
ఈ క్రమంలో హిందువులపై, మైనారీటీలపై జరుగుతున్న దాడుల్ని విన్పిస్తానని లాయర్ గోవిందా చంద్ర ప్రామాణిక్ ముందుకు రావడం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.
ఈ క్రమంలో ప్రస్తుతం తాత్కలిక యూనస్ ప్రభుత్వం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనాపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. బంగ్లా, భారత్ ల మధ్య ఉద్రిక్తతలో యూనస్ ప్రభుత్వం కారణమన్న ఆమె వ్యాఖ్యల్నిఖండించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Atal bihari Vajpayee: కట్నంగా కశ్మీర్ కావాలి.. పాక్ మహిళ ప్రపోజల్ కు వాజ్ పేయి రిప్లై ఏంటో తెలుసా..?
Rajnath singh recalls atal Bihari Vajpayee reply to pak woman: దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన భారత మాజీ ప్రధాని అటల్ బీహరీ వాజ్ పేయి 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. భారత్ కు వాజ్ పేయిజీ చేసిన సేవలను మరోసారి స్మరించుకుంటున్నారు. ఒకవైపు దేశంలో పలు సంస్కరణలు తీసుకుని వస్తునే మరోవైపు అపోసిషన్ పార్టీలకు చుక్కలు చూపించేవారు. ఈ క్రమంలో ఢిల్లీలో వాజ్ పేయికి ప్రత్యేకంగా శ్రద్దంజలి ఘటిస్తు ఆయన చేసిన సేవలను పలువురు కేంద్ర మంత్రులు మరోసారి కొనియాడారు.
ఈ క్రమంలో హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. అటల్ బీహరీ వాజ్ పేయి ఒకసారి పాక్ కు పర్యటనలో ఉన్నప్పుడు ఒక జర్నలిస్టు తనను పెళ్లి చేసుకుని కశ్మీర్ ను కట్నంగా ఇస్తారా అని వాజ్ పేయిని అడిగింది. ఆ సమయంలో ప్రధాని ఏవిధంగా కౌంటర్ వేశారో మరోసారి రాజ్ నాథ్ సింగ్ మరోసారి ఆ సంఘటనను గుర్తు చేసుకున్నారు.
ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. వాజ్ పేయి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఆయన ప్రసంగాలకు ఒక పాక్ జర్నలిస్టు ముగ్దురాలైంది. అంతే కాకుండా తన ఆయన వద్దకు వచ్చి తనను పెళ్లి చేసుకుని కశ్మీర్ ను ఎదురు కట్నంగా ఇస్తారా అంటూ ప్రశ్నించింది. దీనిపై వాజ్ పేయిజీ తన దైన శైలీలో నిన్ను పెళ్లి చేసుకుంటాను.. కానీ పాక్ మొత్తంను తనకు కట్నంగా ఇస్తారా అంటూ కౌంటర్ వేశారు. దీంతో ఆ లేడీ జర్నలిస్టు తెల్లముఖం వేసింది.
Read more: Aravalli Mining: ఆరావళిలో మైనింగ్ విషయంలో వెనక్కి తగ్గిన మోడీ సర్కార్.. రాష్ట్రాలకు కీలక సూచనలు..
ఆ తర్వాత వాజ్ పేయి ఎదురుగా ఉండలేక ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో వాజ్ పేయి మాటల చాతుర్యం, ప్రత్యర్థులు ఆయనను కార్నర్ చేయాలని వేసి పాచికలను తిరిగి వారి మెడకే చుట్టుకునేలా మాజీ ప్రధాని ముందుకు వెళ్లేవారని రాజ్ నాథ్ సింగ్ మరోసారి వాజ్ పేయి సేవలను స్మరించుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం వాజ్ పేయిజీని దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆయన చేసిన సేవల్ని స్మరించుకుంటూ దేశ వ్యాప్తంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Oppo K13 Turbo 5G Christmas Offer News: ప్రముఖ ఒప్పో మొబైల్ కంపెనీ ఇప్పటివరకు మార్కెట్లోకి విడుదల చేసిన కేతన్ సిరీస్లో అత్యంత శక్తివంతమైన గేమింగ్ ఫోన్ Oppo K13 Turbo 5G.. ఇది అద్భుతమైన ప్రాసెసర్తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఎంతో చక్కని డిజైన్ను కలిగి ఉంటుంది. అయితే, క్రిస్మస్ సందర్భంగా ఈ స్మార్ట్ ఫోన్ ఎన్నో రకాల డిస్కౌంట్ ఆఫర్స్తో అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్లో ఈరోజే స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేసే వారికి స్పెషల్ డిస్కౌంట్ కూపన్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
ఎప్పటినుంచో మీరు కూడా Oppo K13 Turbo 5G స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇదే మంచి సమయంగా భావించవచ్చు. ఎందుకంటే క్రిస్మస్ సందర్భంగా స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్కు సంబంధించిన ఫీచర్స్ వివరాళ్లోకి వెళితే.. ఇది అద్భుతమైన గేమింగ్ టీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ ఎంతో అద్భుతమైన 6.8 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది గరిష్టంగా 1600 నిట్స్ బ్రైట్నెస్ సపోర్టుతో అందుబాటులో ఉంది. అలాగే ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్టును కూడా కలిగి ఉంటుంది. దీంతోపాటు ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 8450 ప్రాసెసర్తో అందుబాటులోకి వచ్చింది.
ఈ స్మార్ట్ ఫోన్ ఎంతో శక్తివంతమైన 7000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ కోసం కంపెనీ చాలా ప్రత్యేకమైన 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను అందిస్తోంది. దీంతోపాటు వెనక భాగంలో 50MP (OIS) మెయిన్ కెమెరా, అదనంగా 2MP మోనోక్రోమ్ సెన్సార్లను కూడా కలిగి ఉంటుంది. ఇక ఫ్రంట్లో 16MP సెల్ఫీ కెమెరా కూడా లభిస్తోంది. ఈ Oppo K13 Turbo 5G స్మార్ట్ ఫోన్ చాలా ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15పై రన్ అవుతుంది. అలాగే ఇందులో కంపెనీ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు వంటి ఫీచర్లను కూడా అందించింది. ప్రస్తుతం మార్కెట్లో ఈ స్మార్ట్ఫోన్ వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంది. మొదటి వేరియంట్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. దీని అసలు ధర మార్కెట్లో రూ.28 వేలు కాగా.. ఫ్లిప్కార్ట్లో కేవలం రూ.24 వేలకే అందుబాటులో ఉంది.
Also Read: Iqoo Z11 Turbo: 7,600mAh బ్యాటరీతో Iqoo కొత్త మొబైల్ త్వరలో లాంచ్.. ఫీచర్స్ వివరాలు ఇవే!
అంతేకాకుండా ఇక రెండవ వేరియంట్ 256జిబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ని కలిగి ఉంటుంది. ఇది రూ.29 వేలతో మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా ఫ్లిప్కార్ట్లో కేవలం రూ.26 వేలకే లభిస్తుంది. అదనంగా తగ్గింపు పొందడానికి బేస్ వేరియంట్ పై ప్రత్యేకమైన బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పేటియంతో పాటు ఫ్లిప్కార్ట్ అనుసంధాన ఆక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేస్తే రూ.3,000 తగ్గింపు లభిస్తుంది.
అలాగే అదనంగా ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ వినియోగించి కొనుగోలు చేసే వారికి ఏకంగా రూ.21,000 వరకు బోనస్తో పాటు అదనంగా రూ.3,400 స్పెషల్ తగ్గింపు లభిస్తోంది. దీంతో ఈ ఆఫర్స్ అన్నింటిని వినియోగించి కొనుగోలు చేసే వారికి క్రిస్మస్ సందర్భంగా ఈ మొబైల్ కేవలం రూ.2 వేల లోపే లభిస్తోంది. ఇవే కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై మరెన్నో క్రెడిట్ కార్డుల క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Also Read: Iqoo Z11 Turbo: 7,600mAh బ్యాటరీతో Iqoo కొత్త మొబైల్ త్వరలో లాంచ్.. ఫీచర్స్ వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Huge devotees crowd in Tirumala alipiri complex video: తిరుమలలో ప్రస్తుతం విపరీతంగా భక్తులు రద్దీ కొనసాగుతుంది. ముఖ్యంగా శిలాతోరణం వరకు కూడా భక్తులు క్యూలైన్ లలో వేచి ఉంటున్నారు. ముఖ్యంగా ఎక్కడ చూసిన విపరీతంగా భక్తులు రద్దీ కన్పిస్తుంది. శ్రీవారి మాడ వీధులు, అన్నప్రసాద భవనం, వసతి సముదాయాలు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలు, లడ్డు కేంద్రం, అఖిలాండం, నారాయణ గిరిలోని షెడ్లూ సర్వదర్శనం భక్తులతో నిండిపోయాయి. ఈక్రమంలో అలిపిరి భూదేవీ కాంప్లెక్స్ వద్ద భారీ తోపులా చోటు చేసుకుంది.
తిరుమలలో తోపులాట
అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద క్యూలైన్లో తోపులాట
శ్రీవారి దర్శన టికెట్స్ కోసం బారులు తీరిన భక్తులు
దర్శన టికెట్లు కోసం పోటిపడుతున్న భక్తులు.. క్యూలైన్ వద్ద భక్తులను నియంత్రణ చేయలేకపోతున్న భద్రతా సిబ్బంది pic.twitter.com/VwOQBtHAc2
— Telugu Scribe (@TeluguScribe) December 25, 2025
శ్రీవారి దర్శనం టోకెన్ల కోసం బారులు తీరిని భక్తులు గేట్లు తెరవగానే ఒకరిపై మరోకరు నెట్టుకుంటూ ముందుకు వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో కొంత మంది కిందపడపోయారు. అక్కడున్నపోలీసు వారిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించిన కూడా కొంత మంది భక్తులు మాత్రం ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు.
మొత్తంగా క్యూలైన్ ల వద్ద సరైన నియంత్రణ లేదని కొంత మంది భక్తులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంటే వైకుంఠ ఏకాదశి పర్వదినం సమయంలో ఏంటని భక్తులు టెన్షన్ కు గురౌతున్నారు. మరోవైపు తిరుమలలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ దర్శనాలు ఏర్పాట్లపై టీటీడీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.
ఇప్పటికే సామాన్య భక్తులకు తొలి ప్రయారిటీ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశామని టీటీడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అదేవిధంగా తొలి మూడు రోజులు అంటే డిసెంబర్ 30,31, జనవరి 1న టొకెన్లు లేనివారికి తిరుమలకు రానివ్వరనేది అవాస్తమని టీటీడీ చైర్మన్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
How To apply Encumbrance Certificate what is the importance: భూమి..ఇల్లు.. ఫ్లాట్ ఇలా ఏదైనా స్థిర ఆస్తి కొనుగోలు చేయడం అనేది జీవితంలో ఒక ముఖ్య నిర్ణయమని చెప్పాలి. అయితే చాలా మంది స్థిర ఆస్తులు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన పత్రాలను పొందడానికి తొందరపడుతుంటారు. ఇవి చట్టపరమైన ఇబ్బందులకు దారి తీస్తుంది. ఆస్తి లావాదేవీల్లో అలాంటి కీలకమైన పత్రం ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ (ఈసీ). మీరు ఆస్తులు కొనుగోలు చేస్తున్న ఆస్తులకు ఎలాంటి అప్పులు కానీ వివాదాలు లేదా చట్టపరమైన క్లెయిమ్స్ లేదని ఈ సర్టిఫికేట్ ద్వారా తెలుస్తుంది. మరింత సులభంగా చెప్పాలంటే.. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ మీ ఆస్తి ఒప్పందాన్ని సురక్షితంగా ఉంచే బలమైన సాక్ష్యమని చెప్పాలి.
ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది మీ సంబంధిత ప్రాంతంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం జారీ చేస్తుంది. ఇది బ్యాంకు లోన్స్, తాకట్టు, కోర్టు కేసు లేదా ఇతర చట్టపరమైన ఎన్కంబరెన్స్ ద్వారా ఆసక్తిని విక్రయించారా లేదా అనేది స్పష్టం పేర్కొంటుంది. అందుకే ఎలాంటి ఆస్తి కొనుగోలు చేయాలన్న ముందుగా ఈసీని చూస్తుంటారు. ఆస్తిపై ఎలాంటి బకాయిలు లేదా వివాదాలు లేకుంటే కొనుగోలు చేయవచ్చని.. తర్వాత ఎలాంటి సమస్యలు రావని హామీ ఇస్తుంది.
ఈసీ ఎక్కడ పొందాలి? ఆస్తి రిజిస్టర్ చేసిన జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అనేక రాష్ట్రా్లలో ఈసీలను ఇప్పుడు ఆన్ లైన్ పోర్టల్స్ ద్వారా కూడా అప్లయ్ చేసుకునే సదుపాయం కల్పించాయి.
ఎలాంటి పత్రాలు అవసరం ?
⇒ ఆస్తి డీడ్ (సేల్ డీడ్ / గిఫ్ట్ డీడ్ కాపీ)
⇒ సర్వే నంబర్, ఖాస్రా నంబర్, గ్రామం లేదా నగరం పేరు వంటి పూర్తి ఆస్తి వివరాలు
⇒ దరఖాస్తుదారుడి గుర్తింపు, చిరునామా రుజువు
⇒ దరఖాస్తు ఫారం, నిర్ణీత రుసుములు
ఎంత ఫీజు చెల్లించాలి?
ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ కోసం రుసుము రాష్ట్రాన్ని బట్టి మారుతుంది. సాధారణంగా ఛార్జ్ 200 నుండి 600 రూపాయల వరకు ఉంటుంది. దరఖాస్తు చేసిన 7 నుండి 15 రోజులలోపు EC జారీ చేస్తారు.
ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ ఎన్ని రకాలు ఉంటుంది?
1. నిల్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్:
ఆస్తిపై ఎలాంటి లోన్స్, తనఖాలు లేదా ఇతర చట్టపరమైన చిక్కులు లేనప్పుడు నిల్ EC జారీ అవుతుంది. ఇది సురక్షితమైన, అతి ముఖ్యమైన సర్టిఫికెట్గా పరిగణించాలి.
2. వివరణాత్మక ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్
గతంలో ఆస్తిపై లోన్ తీసుకున్నట్లయితే లేదా ఏవైనా నమోదిత లావాదేవీలు జరిగి ఉంటే, వివరణాత్మక EC అన్ని వివరాలను కలిగి ఉంటుంది. ఇది గత లావాదేవీల రికార్డును అందిస్తుంది.
ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఎన్ని ఏళ్ల వరకు వ్యాలిడిటీ ఉంటుంది?
EC కనీసం 13 సంవత్సరాలకు జారీ చేస్తారు. కానీ 30 సంవత్సరాల వరకు పొందడం అన్ని విధాల సురక్షితం.
ప్రతి ఆస్తి ఒప్పందానికి EC అవసరమా?
ఇల్లు, భూమి లేదా వాణిజ్య ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు EC అవసరం. ఈసీ లేనిదే ఆస్తులు కొనుగోలు చేయలేము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Santoor is number 1 soap in India: భారత సబ్బుల పరిశ్రమలో కీలకమైన మార్పు చోటుచేసుకుంది.విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్కు చెందిన సంతూర్ బ్రాండ్ తాజాగా దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన సబ్బుగా నిలిచింది. గత ఏడాది కాలంలో సుమారు రూ.2,850 కోట్ల అమ్మకాలను నమోదు చేయడంతో.. ఎన్నేళ్లుగా మార్కెట్ లీడర్గా ఉన్న లైఫ్బాయ్ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
‘యవ్వనాన్ని నిలుపుకునే చర్మం’ అనే థీమ్ తో ప్రారంభం:
సంతూర్ ప్రయాణం 1985లో బెంగళూరులో ప్రారంభమైంది. మొదటిగా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ సబ్బును.. 1986లో దేశవ్యాప్తంగా మార్కెట్లోకి తీసుకొచ్చారు. గంధం, పసుపు వంటి సంప్రదాయ పదార్థాల మిశ్రమంతో ‘యవ్వనంగా కనిపించే చర్మం’ అనే థీమ్ వినియోగదారుల ముందుకు తీసుకెళ్లింది. ఈ ప్రత్యేకమైన వాగ్దానం సంతూర్ను త్వరగా ప్రజల్లోకి చేరేలా చేసింది.
దాదాపు నలభై ఏళ్లుగా మార్కెట్లో నిలకడగా కొనసాగుతున్న సంతూర్.. తన విజయానికి వినియోగదారుల అభిరుచులను తెలసుకుంటుంది. ఉత్పత్తి నాణ్యతపై రాజీ పడకపోవడం... బలమైన పంపిణీ వ్యవస్థను నిర్మించుకోవడమే కారణమని విప్రో స్పష్టం చేసింది.ముఖ్యంగా బ్రాండ్ ప్రచారంలో సంతూర్ మామ్ గా ప్రసిద్ధి చెందిన ప్రకటనలు.. మహిళల జీవితాల్లో చోటుచేసుకుంటున్న సామాజిక మార్పులను ప్రతిబింబిస్తూ కాలానుగుణంగా మారుతూ రావడం బ్రాండ్కు విశేషమైన గుర్తింపును తెచ్చింది.
సంతూర్ ఎదుగుదలలో ఏపీది కీలక పాత్ర:
సంతూర్ జాతీయ స్థాయిలో ఎదగడంలో ఆంధ్రప్రదేశ్ కీలక భూమిక పోషించింది. 1990ల చివర్లో రాష్ట్రాల వారీగా విస్తరణ వ్యూహాన్ని రూపొందించిన విప్రో.. తొలి అడుగుగా ఏపీ మార్కెట్ను ఎంచుకుంది. అక్కడ సాధించిన విజయమే నేడు సంతూర్ను తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ వంటి ఇతర రాష్ట్రాల వైపు విస్తరించేందుకు దోహదపడేలా చేసింది.
కాలక్రమేణా సంతూర్ అమ్మకాలు వేగంగా పెరిగాయి. 2012 నాటికి రూ. 1,000 కోట్ల అమ్మకాల మైలురాయిని చేరుకున్న ఈ బ్రాండ్.. 2018లో రూ. 2,000 కోట్ల అమ్మకాలతో లక్స్ను వెనక్కి నెట్టి దేశంలో రెండో స్థానానికి చేరింది. తాజాగా రూ. 2,850 కోట్ల అమ్మకాలతో భారత సబ్బుల మార్కెట్లో నంబర్ వన్ స్థానాన్ని సంపాదించింది. ఈ విజయంపై విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ సీఈఓ వినీత్ అగర్వాల్ స్పందించారు. వినియోగదారుల అవసరాలను లోతుగా అర్థం చేసుకోవడం.. ఉత్పత్తి నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా ముందుకెళ్లడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నామని తెలిపారు. అలాగే సంస్థ బృందాల అంకితభావం.. పంపిణీ భాగస్వాముల సహకారం ఈ విజయానికి ప్రధాన ఆధారమని ఆయన పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Bangladesh's Crown Prince Re-Enters Arena After 17 Years In Exile: బంగ్లాదేశ్ రాజకీయాలు మరో కీలక మలుపునకు వేదిక కాబోతున్నాయి. దాదాపు 17 సంతవ్సరాల తర్వాత మాజీ ప్రధాని ఖలీదా జియా పెద్ద కుమారుడు తారిఖ్ రెహమాన్ లండన్ నుంచి స్వదేశం బంగ్లాదేశ్ లో అడుగుపెట్టారు. ప్రస్తుతం 60 ఏళ్ల వయసున్న తారిఖ్ను బంగ్లాదేశ్లో చాలామంది క్రౌన్ ప్రిన్స్ గా అభివర్ణిస్తారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) తాత్కాలిక అధ్యక్షుడు కాగా.. ఫిబ్రవరి 2026లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి ప్రధాన నాయకత్వం వహించనున్నారు. ఆయన రాకను బీఎన్పీ శ్రేణులు చారిత్రాత్మక ఘట్టంగా చూస్తుండగా.. ప్రత్యర్థులు మాత్రం ఇది రాజకీయ వ్యూహంలో భాగమేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకీ తారిఖ్ రెహమాన్ ఎవరు? ఆయన ఎందుకు ఇన్నేళ్లు లండన్లో ఉన్నారు? ఈ పరిణామాలు భారత్ ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? అనే అంశాల గురించి తెలుసుకుందాం.
రాజకీయ వారసత్వం:
తారిఖ్ రెహమాన్ జీవితం.. బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రతో గాఢంగా ముడిపడి ఉంది. ఆయన 1965లో... అప్పట్లో తూర్పు పాకిస్తాన్గా ఉన్న బంగ్లాదేశ్లో జన్మించారు. 1971 విముక్తి యుద్ధ సమయంలో కేవలం 6ఏళ్ల వయసులో జైలుకు వెళ్లారు. అందుకే BNP ఆయనను అతి పిన్న వయస్కుడైన యుద్ధ ఖైదీగా పేర్కొంటుంది. ఆయన తండ్రి జియావుర్ రెహమాన్ 1975లో జరిగిన సైనిక తిరుగుబాటు తర్వాత అధికారంలోకి వచ్చారు. అదే తిరుగుబాటులో దేశ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ హత్యకు గురయ్యారు. ఈ ఘటన జియా కుటుంబం.. హసీనా కుటుంబాల మధ్య దీర్ఘకాలిక రాజకీయ శత్రుత్వానికి కారణమైంది. దీనినే బంగ్లాదేశ్ రాజకీయాల్లో బేగంల పోరుగా పిలుస్తారు. జియావుర్ రెహమాన్ 1977 నుంచి 1981 వరకు అధ్యక్షుడిగా పనిచేసి, BNPను స్థాపించారు. అయితే 1981లో సైనిక తిరుగుబాటులో ఆయన హత్యకు గురయ్యారు.
ఆ తరువాత ఖలీదా జియా పార్టీ నాయకత్వాన్ని స్వీకరించి మూడు సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తారిఖ్ ఆమె పెద్ద కుమారుడు. చిన్న కుమారుడు అరాఫత్ రెహమాన్ కోకో 2015లో థాయిలాండ్లో మరణించారు. తారిఖ్ తన భార్య జుబైదా రెహమాన్, కుమార్తె జైమా రెహమాన్తో కలిసి లండన్లో నివసిస్తున్నారు.
17 ఏళ్లుగా విదేశాల్లోనే ఎందుకు జీవించారు?
2000వ సంవత్సరం ప్రారంభంలో ఖలీదా జియా ప్రభుత్వంలో తారిఖ్ అత్యంత ప్రభావశీల వ్యక్తిగా ఎదిగారు. హవా భవన్ గా పిలిచే అనధికార అధికార కేంద్రంతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని..ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అంతర్జాతీయ దౌత్య కేబుల్స్లో కూడా ఆయనపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. కాగా 2007లో సైనిక మద్దతు ఉన్న తాత్కాలిక ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. సుమారు 18 నెలలు జైల్లో గడిపిన ఆయన.. హింసకు గురయ్యానని పలుమార్లు ఆరోపించారు. 2008లో బెయిల్పై విడుదలయ్యాక.. అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ.. లండన్ వెళ్లిపోయారు. ఆ తర్వాత షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం ఆయనపై అవినీతి, మనీలాండరింగ్ కేసులతో పాటు 2004 గ్రెనేడ్ దాడి కేసులో కూడా గైర్హాజరీలో జీవిత ఖైదు విధించింది. BNP మాత్రం ఇవన్నీ రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపించింది.
లండన్లో ఉంటూనే తారిఖ్ వీడియో కాల్స్.. సోషల్ మీడియా ద్వారా పార్టీని నడిపించారు. అయితే 2024లో జరిగిన విద్యార్థి ఉద్యమం హసీనా పతనానికి దారితీసింది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పలు కేసుల్లో తారిఖ్కు ఉపశమనం కల్పించింది. దీంతో ఆయన స్వదేశానికి తిరిగిరావడానికి మార్గం సుగమమైంది.
నాయకత్వ బదిలీ దశ:
ఖలీదా జియా ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రచారం చేస్తానని ప్రకటించినప్పటికీ.. ఆరోగ్యం క్షీణించడంతో అది సాధ్యం కాలేదు. అందువల్ల పార్టీకి పూర్తి స్థాయి నాయకత్వం వహించగల వ్యక్తిగా తారిఖ్ రెహమాన్ ఒక్కరే మిగిలారని BNP నేతలు భావిస్తున్నారు. ఆయన రాక ప్రజాస్వామ్యానికి చారిత్రాత్మక ఘట్టమని పార్టీ నాయకత్వం చెబుతోంది.
ఎన్నికలు, భవిష్యత్తు రాజకీయాలు:
2024 ఆగస్టులో హసీనా రాజీనామా చేసి భారత్కు వెళ్లిన తర్వాత బంగ్లాదేశ్ రాజకీయ పరిస్థితి పూర్తిగా మారింది. ఫిబ్రవరి 2026లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో BNP బలమైన పోటీదారుగా కనిపిస్తోంది. అవామీ లీగ్పై నిషేధం విధించాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.
భారత్ పై ఎలాంటి ప్రభావం ఉండబోతోంది?
భారత్–బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు నీరు, వాణిజ్యం, భద్రత, సరిహద్దు అంశాలపై ఆధారపడి ఉంటాయి. హసీనా ప్రభుత్వ కాలంలో ఈ సంబంధాలు బలంగానే ఉన్నాయి. అయితే ఆమె పతనం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తారిఖ్ను కొందరు భారత వ్యతిరేక నేతగా భావిస్తారు. తీస్తా జల వివాదం, హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడం వంటి అంశాలపై ఆయన విమర్శలు చేశారు.BNP అధికారంలోకి వస్తే ఇస్లామిస్ట్ గ్రూపులతో పొత్తులు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇటీవల తారిఖ్ భారత్తో మంచి సంబంధాలు కావాలని.. కానీ బంగ్లాదేశ్ ప్రయోజనాలే ప్రథమమని చెప్పడం గమనార్హం. భారత్ మాత్రం ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తూ.. ప్రాంతీయ స్థిరత్వం, మైనారిటీల భద్రతపై దృష్టి పెట్టిందని చెప్పవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
8th Pay Commission: కొత్త ఏడాది 2025 ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ఆశలు మరింత పెరిగాయి. 7వ వేతన సంఘం(7th Pay Commission) పదవీకాలం డిసెంబర్ 31, 2025తో ముగుస్తుంది. 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా 8వ వేతన సంఘంపై చర్చలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులందరిలోనూ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది? అన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది.
అయితే ఈ అంశంపై ఆల్ ఇండియా NPS ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు మంజీత్ సింగ్ పటేల్ స్పష్టత ఇచ్చారు. 8వ వేతన సంఘం(8th Pay Commission)లో కనీసం 2.64 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను ప్రభుత్వం అమలు చేయాలనే డిమాండ్ను ఉద్యోగ సంఘాలు ముందుకు తెచ్చాయి. ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్(Fitment Factor) అమలైతే.. ప్యూన్ నుంచి IAS స్థాయి అధికారుల వరకు మూల వేతనాలు భారీగా పెరుగుతాయని ఆయన వివరించారు.
ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే.. ప్రస్తుతం ఉన్న బేసిక్ జీతాన్ని ఒక నిర్దిష్ట గుణకంతో గుణించడం ద్వారా కొత్త బేసిక్ జీతాన్ని నిర్ణయించే విధానం అని అర్థం. ఈ గుణకం ఎంత ఎక్కువగా ఉంటే.. (8th Pay Commission)ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు అంత ఎక్కువగా పెరుగుతాయి. 7వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. ఈసారి దానిని 2.64 లేదా అంతకంటే ఎక్కువగా నిర్ణయించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
2.64 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అమలు అయినట్లయితే.. వివిధ స్థాయిల్లో జీతాలు ఎలా మారుతాయో ఓసారి పరిశీలిద్దాం.
⇒ లెవల్–1లో ఉన్న ఉద్యోగి ప్రస్తుత మూల వేతనం రూ. 18,000 ఉండగా.. అది సుమారు రూ. 47,520కి పెరుగుతుంది.
⇒ లెవల్–2లో రూ. 19,900 ఉన్న జీతం రూ. 52,536కి పెరుగుతుంది.
⇒ లెవల్–3లో రూ. 21,700 ఉన్న వేతనం రూ. 57,288కి చేరుతుంది.
⇒ ఇదే విధంగా లెవల్–6లో ఉన్న ఉద్యోగి ప్రస్తుత బేసిక్ రూ. 35,400 నుంచి దాదాపు రూ. 93,456కి పెరుగుతుంది.
⇒ లెవల్–10లో రూ. 56,100గా ఉన్న మూల వేతనం రూ.1.48 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
⇒ అత్యున్నత స్థాయిల్లో మార్పులు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. లెవల్–13లో ఉన్న అధికారుల జీతం రూ. 1.18 లక్షల నుంచి రూ.3.12 లక్షలకు పెరుగుతుంది.
⇒ లెవల్–15లో ఉన్న అధికారుల వేతనం రూ. 1.82 లక్షల నుంచి సుమారు రూ. 4.81 లక్షలకు పెరుగుతుంది.
⇒ లెవల్–18లో ప్రస్తుతం రూ. 2.50 లక్షలుగా ఉన్న మూల వేతనం దాదాపు రూ. 6.60 లక్షలకు చేరే అవకాశం ఉంది.
ఈ లెక్కన బట్టి చూస్తే.. ప్యూన్ నుంచి IAS వరకు అందరికీ భారీగా జీతాలు పెరిగే అవకాశం ఉంటుందని స్పష్టంగా అర్థం అవుతోంది.
అయితే 7వ వేతన సంఘం పదవీకాలం ముగిసిన వెంటనే 8వ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తాయా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. సాధారణంగా కొత్త వేతన సంఘం ఏర్పాటు చేసి.. దాని నివేదికను ప్రభుత్వం ఆమోదించడానికి ఒకటిన్నర నుంచి రెండు సంవత్సరాల వరకు సమయం పడుతుంది. అందువల్ల 2026 జనవరి నుంచి జీతాలు అమలుకాకపోయినా, తరువాత అమలు చేసినప్పుడు ఉద్యోగులకు బకాయిల రూపంలో చెల్లింపులు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఫిట్మెంట్ ఫ్యాక్టర్ (Fitment Factor)నిర్ణయానికి ప్రభుత్వం పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. దేశంలో ద్రవ్యోల్బణ స్థాయి, జీవన వ్యయం, CPI, CPI-IW గణాంకాలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి, బడ్జెట్ భారం, ప్రైవేట్ రంగంతో జీతాల పోలిక, మార్కెట్ సర్వేలు వంటి అంశాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవన్నీ సమతుల్యం చేస్తూ తుది నిర్ణయం తీసుకుంటారు.
2.64 కంటే తక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టర్(Fitment Factor) ఉద్యోగులకు సరైన న్యాయం చేయదని మంజీత్ సింగ్ పటేల్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఉద్యోగుల జీవన వ్యయం, పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అవసరమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ డిమాండ్ను అంగీకరిస్తే ఉద్యోగుల్లో సంతృప్తి పెరుగుతుందని, లేకపోతే అసంతృప్తి, విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. మొత్తంగా చూస్తే, 8వ వేతన సంఘం చుట్టూ సాగుతున్న ఈ చర్చలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంతో కీలకంగా మారాయి. ఫిట్మెంట్ ఫ్యాక్టర్(Fitment Factor)పై తీసుకునే నిర్ణయం లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును ప్రభావితం చేయనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
EPF withdrawal New Rules: పీఎఫ్ ఖాతాదారులకు కొత్త సంవత్సరం సరికొత్త శుభవార్తను అందించబోతోంది. కొత్త సంవత్సరం 2026 నుంచి ఉద్యోగస్థులకు ఈపీఎఫ్ విషయంలో భారీ ఉపశమనం కల్పించే మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. ఈపీఎఫ్ ఉద్యోగుల భవిష్యత్తు భద్రతకు బాసటగా నిలుస్తూ.. అవసరం, అత్యవసర సమయాల్లో పీఎఫ్ డబ్బును విత్ర డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. గతంలో పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే నానా తంటాలు పడాల్సి వచ్చేది. చాలా ఆలస్యం జరిగేది. ఈ సమస్యలను గుర్తించిన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ విత్ డ్రా రూల్స్ మరింత ఈజీగా స్పష్టంగా మార్చేసింది. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో ఈ మార్పులు పీఎఫ్ ఖాతాదారులకు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి.
ఇప్పటివరకు EPF విత్ డ్రాకు సంబంధించి 13 రకాల విభిన్న నిబంధనలు ఉండేవి. ఈ రూల్స్ ఉద్యోగులకు అర్థం కాకపోవడంతో గందరగోళానికి గురయ్యేవారు. తాజాగా మార్పుల ప్రకారం ఈపీఎఫ్ఓ ఈ నియమాలను మూడు ప్రధాన వర్గాలుగా విభజించింది. ముఖ్యమైన అవసరాలు, గ్రుహ సంబంధిత అవసరాలు, ప్రత్యేక పరిస్థితులుగా వర్గీకరించింది. ఈ విధంగా విభజించడం వల్ల తమ అవసరానికి ఏ కేటగిరిలో విత్ డ్రా చేసుకోవచ్చో సులభంగా తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. అంతేకాదు ఆన్ లైన్ క్లెయిమ్ ప్రక్రియ కూడా మరింత ఈజీ అయ్యింది.
మొత్తం EPF మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవాలటే కొన్ని నిర్దిష్ట పరిస్థితులు ఉండాలి. ఉద్యోగి 58 సంవత్సరాల వయస్సు పూర్తి చేసిన తర్వాత.. స్వచ్ఛంద పదవీ విరమణ చేసినప్పుడు.. శాశ్వత వైకల్యం కలిగినప్పుడు లేదా పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ సందర్భాల్లో మాత్రం మొత్తం EPF మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగం కోల్పోయిన వెంటనే EPFలోని 75 శాతం మొత్తాన్ని తీసుకునే వెసులుబాటు కూడా కల్పించింది. మిగిలిన 25 శాతం మొత్తాన్ని 12 నెలల తర్వాత విత్ డ్రా చేసుకోవచ్చు. అంతేకాదు, విదేశాల్లో శాశ్వతంగా స్థిరపడిన వారు కూడా తమ EPF నిధులను పూర్తిగా విత్ డ్రా చేసుకునే వెలుసుబాటు కల్పించింది.
ఇక పాక్షిక ఉపసంహరణల విషయంలో కూడా EPFO స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఐదేళ్ల సర్వీస్ పూర్తైన తర్వాత ఇంటి కొనుగోలు, నిర్మాణం లేదా మరమ్మత్తుల కోసం EPF నుంచి డబ్బు తీసుకోవచ్చు. పదేళ్ల సర్వీస్ తర్వాత గృహ రుణాన్ని చెల్లించేందుకు మొత్తం PF నిల్వలో 90 శాతం వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇంటి మరమ్మతుల కోసం అయితే నెలవారీ జీతం లేదా ఉద్యోగి PFలో చేసిన సహకారానికి 12 రెట్లు వరకు తీసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని జీవితంలో రెండుసార్లు వినియోగించుకోవచ్చు.
వైద్య అవసరాల విషయంలో సర్వీస్ కాలానికి ఎలాంటి పరిమితి లేదు. ఉద్యోగి తనకు, భార్య లేదా భర్తకు, తల్లిదండ్రులకు లేదా పిల్లలకు వైద్య చికిత్స అవసరమైతే ఎప్పుడైనా EPF నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. వివాహం, చదువు అవసరాల కోసం కూడా సౌకర్యం ఉంది. ఏడేళ్ల సర్వీస్ ప పూర్తైన తర్వాత, ఉద్యోగి తన వివాహం లేదా పిల్లలు, తోబుట్టువుల వివాహం కోసం మొత్తం సహకారంలో 50 శాతం వరకు తీసుకోవచ్చు. అలాగే పిల్లల విద్య కోసం (10వ తరగతి తర్వాత) కూడా అదే విధంగా 50 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.
రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న ఉద్యోగులకు మరింత ఉపశమనం కల్పించారు. 54 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు లేదా రిటైర్మెంట్ కు ఒక ఏడాది EPFలోని 90 శాతం వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. అలాగే వరదలు, భూకంపాలు వంటి సహజ విపత్తులు సంభవించినప్పుడు లేదా రెండు నెలలకుపైగా జీతం అందకపోతే అత్యవసరంగా కొంత మొత్తం తీసుకోవచ్చు.
EPF విత్ డ్రాపై ట్యాక్స్ రూల్స్ తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఒక ఉద్యోగి ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిరంతరంగా ఉద్యోగంలో ఉన్నట్లయితే, EPF నుంచి తీసుకునే మొత్తం పూర్తిగా పన్ను మినహాయింపుకు అర్హం. కానీ ఐదేళ్ల కంటే ముందే విత్ డ్రా చేస్తే, నియమాల ప్రకారం TDS వర్తించే అవకాశం ఉంటుంది. ఈ మార్పులతో EPF ఖాతాదారులకు అవసరమైన సమయంలో తమ పొదుపును సులభంగా వినియోగించుకునే అవకాశం లభించనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Gold Rate Today: దేశీయ బులియన్ మార్కెట్లో డిసెంబర్ 25వ తేదీ గురువారం బంగారం.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బుధవారంతో పోలిస్తే 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధరకు రూ.10 పెరుగుదల నమోదైంది. తాజా ధర ప్రకారం 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు రూ.1,38,940కు చేరింది. ఇదే విధంగా 22 క్యారెట్ బంగారం ధర కూడా రూ.10 పెరిగి 10 గ్రాములకు రూ.1,27,360గా నమోదైంది. 18 క్యారెట్ బంగారం సైతం రూ.10 పెరిగి 10 గ్రాములకు రూ.1,04,210 వద్ద స్థిరపడింది.
వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. బుధవారం కిలో వెండి ధర రూ.2,33,000గా ఉండగా.. నేడు గురువారం అది రూ.2,33,100కు చేరింది. దేశీయ మార్కెట్లో పెరుగుదల తక్కువగా కనిపించినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు భారీగా ఎగబాకాయి. అమెరికా మార్కెట్లో ఒక ఔన్స్ (సుమారు 31.2 గ్రాములు) బంగారం ధర తొలిసారిగా దాదాపు 4,500 డాలర్ల స్థాయికి చేరడం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఇలా ఒక్కసారిగా పెరగడానికి ప్రధాన కారణం ఇన్వెస్టర్ల ప్రవర్తనలో వచ్చిన మార్పేనని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక అనిశ్చితి పెరుగుతున్న సమయంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా గ్లోబల్ మార్కెట్లలో బంగారానికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగి ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. దేశీయంగా కూడా 24 క్యారెట్ బంగారం ధర చరిత్రలో తొలిసారిగా 10 గ్రాములకు రూ.1.40 లక్షల స్థాయిని దాటడం విశేషంగా చెప్పుకోవచ్చు.
బంగారం ధరల ఈ భారీ పెరుగుదల ఆభరణాల కొనుగోలుదారులకు మాత్రం తీవ్ర నిరాశ కలిగిస్తోంది. దేశీయంగా బంగారు ఆభరణాల డిమాండ్ పెద్దగా లేకపోయినా, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం వల్లే ధరలు పెరుగుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో చోటుచేసుకుంటున్న ఆర్థిక పరిణామాలు దీనికి ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి 2025లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ దేశ ఆర్థిక విధానాలపై అనిశ్చితి పెరిగిందని.. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత ఆశ్రయంగా భావిస్తున్నారని చెబుతున్నారు.
ఇక వెండి విషయానికి వస్తే.. అది కూడా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక్క ఏడాదిలోనే దాదాపు 100 శాతం వరకు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా గ్రీన్ ఎనర్జీ, సౌర విద్యుత్ రంగాల్లో వెండి వినియోగం పెరగడం వల్ల డిమాండ్ బాగా పెరిగింది. అదే సమయంలో సరఫరా పరిమితంగా ఉండటంతో వెండి ధరలు మరింత ఎగబాకుతున్నాయి. భవిష్యత్తులో కూడా వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఇప్పటికే అంచనా వేస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
