\n

Read more: Two-headed Snake Video: ఒకే పాము రెండు తలలు.. ఇలాంటి వీడియో ఎప్పుడైనా చూశారా?

\n

ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబాల సొంత కారు కలలను నిజం చేసిన నానో.. సేఫ్టీ రేటింగ్ తో పాటు మార్కెటింగ్ వ్యూహాల వల్ల వెనకబడిన మాట వాస్తవమే.. కానీ ఇలాంటి క్రియేటివ్ ఐడియాల వల్ల నానో మళ్లీ వార్తల్లో నిలుస్తోంది.. కేవలం రవాణా కోసమే కాకుండా స్టైలిష్ గా మార్చుకోవచ్చని ఈ యువత నిరూపించారు.. క్రియేటివిటీ ఉంటే ఏదైనా సాధ్యమే.. పాత నానోకు సరికొత్త జీవం పోసిన యువత ప్రతిభ మహా అద్భుతం అంటూ ఆటోమొబైల్ నిపుణులు సైతం ఈ వీడియో చూసి ప్రశంసిస్తున్నారు..

\n

Read more: Two-headed Snake Video: ఒకే పాము రెండు తలలు.. ఇలాంటి వీడియో ఎప్పుడైనా చూశారా?

\n

\n

\n

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

\n

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

\n

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

\n

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

\n

  

\n","url":"https://pinewz.com/telugu/story/telangana/rangareddy-tata-nano-video-it-39-s-not-a-nano-it-39-s-a-nano-sports-everyone-is-amazed-by-the-makeover-car-video-1774169670817","datePublished":"2026-03-22T08:54:31+05:30","dateModified":"2026-03-22T08:54:31+05:30"}

\n

Read more: Two-headed Snake Video: ఒకే పాము రెండు తలలు.. ఇలాంటి వీడియో ఎప్పుడైనా చూశారా?

\n

ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబాల సొంత కారు కలలను నిజం చేసిన నానో.. సేఫ్టీ రేటింగ్ తో పాటు మార్కెటింగ్ వ్యూహాల వల్ల వెనకబడిన మాట వాస్తవమే.. కానీ ఇలాంటి క్రియేటివ్ ఐడియాల వల్ల నానో మళ్లీ వార్తల్లో నిలుస్తోంది.. కేవలం రవాణా కోసమే కాకుండా స్టైలిష్ గా మార్చుకోవచ్చని ఈ యువత నిరూపించారు.. క్రియేటివిటీ ఉంటే ఏదైనా సాధ్యమే.. పాత నానోకు సరికొత్త జీవం పోసిన యువత ప్రతిభ మహా అద్భుతం అంటూ ఆటోమొబైల్ నిపుణులు సైతం ఈ వీడియో చూసి ప్రశంసిస్తున్నారు..

\n

Read more: Two-headed Snake Video: ఒకే పాము రెండు తలలు.. ఇలాంటి వీడియో ఎప్పుడైనా చూశారా?

\n

\n

\n

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

\n

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

\n

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

\n

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

\n

  

\n","keywords":"news by pincode, pin news,local news, treading news, latest news, hyperlocal news sites, hyperlocal news app, best news app, local news in hindi, zee newz, ram mandir","image":{"@type":"ImageObject","url":"https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_700x400/public/2026/03/22/567240-tata-nano-modification-video-viral.jpg?itok=-khWkoFq","height":900,"width":1200},"datePublished":"2026-03-22T08:54:31+05:30","dateModified":"2026-03-22T08:54:31+05:30","author":{"@type":"Person","name":"Dharmaraju Dhurishetty"},"publisher":{"@type":"Organization","name":"Hyper local PWA","logo":{"@type":"ImageObject","url":"https://images2.pinewz.com/images/logo-big.png","width":600,"height":60}}}

\n

Read more: Two-headed Snake Video: ఒకే పాము రెండు తలలు.. ఇలాంటి వీడియో ఎప్పుడైనా చూశారా?

\n

ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబాల సొంత కారు కలలను నిజం చేసిన నానో.. సేఫ్టీ రేటింగ్ తో పాటు మార్కెటింగ్ వ్యూహాల వల్ల వెనకబడిన మాట వాస్తవమే.. కానీ ఇలాంటి క్రియేటివ్ ఐడియాల వల్ల నానో మళ్లీ వార్తల్లో నిలుస్తోంది.. కేవలం రవాణా కోసమే కాకుండా స్టైలిష్ గా మార్చుకోవచ్చని ఈ యువత నిరూపించారు.. క్రియేటివిటీ ఉంటే ఏదైనా సాధ్యమే.. పాత నానోకు సరికొత్త జీవం పోసిన యువత ప్రతిభ మహా అద్భుతం అంటూ ఆటోమొబైల్ నిపుణులు సైతం ఈ వీడియో చూసి ప్రశంసిస్తున్నారు..

\n

Read more: Two-headed Snake Video: ఒకే పాము రెండు తలలు.. ఇలాంటి వీడియో ఎప్పుడైనా చూశారా?

\n

\n

\n

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

\n

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

\n

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

\n

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

\n

  

\n","thumbnailUrl":"https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_700x400/public/2026/03/22/567240-tata-nano-modification-video-viral.jpg?itok=-khWkoFq","uploadDate":"2026-03-22T08:54:30+05:30","dateModified":"2026-03-22T08:54:31+05:30","datePublished":"2026-03-22T08:54:31+05:30","contentUrl":"NOT AVAILABLE","url":"https://pinewz.com/telugu/story/telangana/rangareddy-tata-nano-video-it-39-s-not-a-nano-it-39-s-a-nano-sports-everyone-is-amazed-by-the-makeover-car-video-1774169670817","isFamilyFriendly":"http://schema.org/True","requiresSubscription":"http://schema.org/False","inLanguage":"en-hi","publisher":{"@type":"Organization","name":"pinewz","url":"https://pinewz.com/","logo":{"@type":"ImageObject","url":"https://images2.pinewz.com/images/logo-big.png","width":"512","height":"512"}}}
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rangareddy500033
Tata Nano Video: నానో కాదు..ఇది నానో స్పోర్ట్స్.. మేకోవర్ కారు చూసి అందరూ ఫిదా.. వీడియో!
DDDharmaraju Dhurishetty
Mar 22, 2026 08:54:31
Hyderabad, Telangana

 Tata Nano Modification Video Watch Here: భారత ఆటోమొబైల్ రంగంలో రతన్ టాటా కలల ప్రాజెక్టు టాటా నానో ఒక గురించి ప్రత్యక్షంగా పరిచయం అక్కర్లేదు.. కేవలం లక్ష రూపాయలకే కారును సామాన్యుడికి చేరువ చేసిన ఈ చిన్న కారు.. అప్పట్లో ఒక సంచలనం.. కాలక్రమమైన అమ్మకాలు తగ్గి ఉత్పత్తులు నిలిచిపోయినప్పటికీ రోడ్లమీద ఇప్పటికీ నానో కార్లు కనిపిస్తూనే ఉంటాయి. అయితే తాజాగా కొందరు యువకులు ఈ బుజ్జి కారును ఓ రేంజ్ లో రీ మోడలింగ్ చేసి ఏకంగా స్పోర్ట్స్ కారుగా మార్చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఆటో మొబైల్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తోంది..

సాధారణంగా నానో కారు అంటేనే చాలా చిన్నదిగా.. సింపుల్ గా ఉంటుంది.. కానీ ఈ రీ మోడలింగ్ కారు చూస్తే ఎవరు అది నానో అని గుర్తుపట్ట లేకపోతూ ఉంటారు.. యువ ఇంజనీర్లు దీని బాడీని పూర్తిగా మార్చేసి.. చిన్న చక్రాలను తీసేసి పెద్ద చక్రాలను అమర్చారు. దీంతో డిజైన్ పూర్తిగా మారిపోయింది.. కారుకు వెడల్పాటి టైర్లతో పాటు మెరిసే అల్లాయ్ వీల్స్‌ను కూడా అమర్చినట్లు మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అంతేకాకుండా ఆ కారుకు ఆకర్షణీయమైన ఎల్లో కలర్ వేయడం అద్భుతమైన ప్రీమియం లుక్కునందించింది.. 

ఈ స్పోర్ట్స్ నానో కారు రోడ్లమీద వేగంగా దూసుకుపోతుంటే జనం కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు.. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు ఇంస్టాగ్రామ్ తో పాటు ప్రముఖ సోషల్ మీడియా వేదికల్లు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. లక్ష రూపాయల కారును 10 లక్షల కారుగా మార్చేశారు అంటూ కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. కొందరైతే ఇది నానో లేక ఏదైనా పెద్ద కంపెనీకి సంబంధించిన స్పోర్ట్స్ కారా అని ఫన్నీ కామెంట్లు పెడుతూ వస్తున్నారు..

 
 
 
 
 

Read more: Two-headed Snake Video: ఒకే పాము రెండు తలలు.. ఇలాంటి వీడియో ఎప్పుడైనా చూశారా?

ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబాల సొంత కారు కలలను నిజం చేసిన నానో.. సేఫ్టీ రేటింగ్ తో పాటు మార్కెటింగ్ వ్యూహాల వల్ల వెనకబడిన మాట వాస్తవమే.. కానీ ఇలాంటి క్రియేటివ్ ఐడియాల వల్ల నానో మళ్లీ వార్తల్లో నిలుస్తోంది.. కేవలం రవాణా కోసమే కాకుండా స్టైలిష్ గా మార్చుకోవచ్చని ఈ యువత నిరూపించారు.. క్రియేటివిటీ ఉంటే ఏదైనా సాధ్యమే.. పాత నానోకు సరికొత్త జీవం పోసిన యువత ప్రతిభ మహా అద్భుతం అంటూ ఆటోమొబైల్ నిపుణులు సైతం ఈ వీడియో చూసి ప్రశంసిస్తున్నారు..

Read more: Two-headed Snake Video: ఒకే పాము రెండు తలలు.. ఇలాంటి వీడియో ఎప్పుడైనా చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

  

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Mar 22, 2026 10:02:55
Hyderabad, Telangana:

LPG Gas Shortage News: పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ క్రమంలో తాజాగా ఇరాన్‌తో చర్చలు జరిపి భారత్‌కు ముడిచమరు, గ్యాస్ తీసుకురావడంలో దౌత్యం ఫలించింది. తాజాగా అందుకు సంబంధించిన నౌకలు కూడా భారత్‌కు సురక్షితంగా చేరుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఓ కీలక ప్రకటన చేసింది. గత మూడు వారాలుగా ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడిన కారణంగా ఇప్పుడు పరిశ్రమలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. 

ఈ నేపథ్యంలో రెస్టారెంట్లు, హోటళ్లు, చిన్న తరహా పరిశ్రమలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కేంద్రం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై కీలక నిర్ణయాన్ని వెలువరించింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్లను తక్షణమే 20 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి నెలాఖరు నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అనేక రెస్టారెంట్లు, హెటళ్లు, డాబాలు మూతపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో యథావిధిగా హోటళ్లు తెరచుకోనున్నాయి. 

అయితే పెంచిన సరఫరాలో మొదటగా రెస్టారెంట్లు, హోటళ్లు, ఇండస్ట్రియల్ క్యాంటీన్లు, డైరీ యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అలాగే వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడిపే సబ్సిడీ క్యాంటీన్లకు కూడా గ్యాస్ కొరత లేకుండా చూడాలని మోదీ సర్కార్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

మరోవైపు వలస కూలీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రంలోని మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వలస కార్మికుల కోసం 5 కిలోల గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇదే నిర్ణయాన్ని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖను రాసింది. అయితే వలస దారులకు 5 కిలోల గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రక్రియను రేపటి నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. 

అయితే గ్యాస్ వినియోగంలో ఎటువంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు కేంద్రం కొన్ని నిబంధనలను జారీ చేసింది. వలస కూలీలు, కమర్షియల్ యూజర్లు  సంబంధిత యాప్‌ల ద్వారా లేదా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరని స్పష్టం చేసింది. దేశంలో గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని.. కేవలం సరఫరాను క్రమబద్ధీకరించే వరకు ఈ చర్యలు తీసుకుంటున్నామని మోదీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Also Read: LPG Gas Price Hike 2026: భారీగా పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధరలు..ఇప్పుడే బుక్ చేసుకోండి! కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే!

Also Read: LPG ATM Gurugram: యుద్ధం వేళ సామాన్యులకు గుడ్‌న్యూస్..గ్యాస్ సిలిండర్లకు ATM..2 నిమిషాల్లో గ్యాస్ రీఫిల్ అయిపోతుంది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 22, 2026 09:11:07
Nuzendla, Andhra Pradesh:

Garikipati Narasimha Rao On Anushka Shetty: తెలుగులో అద్భుతమైన ప్రవచనాలు చేస్తూ గుర్తింపు పొందిన గరికిపాటి నరసింహా రావు ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో తన ప్రవచనాలతో నిత్యం ట్రెండింగ్‌లో ఉండే గరికిపాటి నరసింహారావు మరో వివాదంలో చిక్కుకున్నారు. హీరోయిన్‌ అనుష్క శెట్టిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఓ వీడియో చక్కర్లు తిరుగుతోంది. గతంలో ఓ సమావేశంలో పాల్గొన్న గరికిపాటి నరసింహారావు తన కొడుకుతో జరిగిన సంభాషణను వివరించారు. ఈ సందర్భంగా అనుష్క శర్మ ఫొటోను తాను తన కుమారుడు చూశాడని గరికిపాటి చెప్పుకొచ్చారు. వారిద్దరి మధ్య అనుష్క ఫొటో విషయమై జరిగిన సంఘటన వెల్లడించారు. అర్ధనగ్నంగా ఉన్న ఫొటో తనను.. తన కొడుకును ఆకర్షించింది.. దానిలో తప్పేం లేదని ప్రకటించారు.

Also Read: Cyber Crime: ఆర్‌టీఏ చలాన్‌ పేరిట సైబర్‌ నేరగాళ్ల మోసం.. జనసేన ఎమ్మెల్యే రూ.12 లక్షలు నష్టం

'నేను ఒకసారి పేపర్‌ అలా చూస్తుంటే ఏమిటుంది కుర్రాళ్లు ఎందుకు ఇలా చూస్తున్నారని చూశా. నా చూపు కూడా ఒక చోట నిలిచిపోయింది. చేసిన తప్పు చెప్పాలి కదా. ఎవరంటే మహానటి అనుష్క. అలా నిలబడి ఉన్న ఓ ఫోజు.. ఓ స్టిల్‌ ఇచ్చింది' అని గరికిపాటి నరసింహారావు తెలిపారు. 'మా అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు. వాడేమిటో నా కాళ్ల దగ్గర కూర్చున్నాడు. స్నానం చేసిన వచ్చి నా కాళ్లకు దండం పెట్టడానికి కూర్చున్నాడని ఆశీర్వాదం చేద్దామనుకున్నా. లేదు కానీ వాడు అనుష్క ఫొటో చూస్తున్నాడు. వాడి ధోరణిలో వాడు ఉన్నాడు నా ధోరణిలో నేను ఉన్నాడు. దానికేముంది? ఇప్పుడు ఎవడికి కావాల్సినది వాడు చూసుకుంటున్నాడు' అని గరికిపాటి నరసింహారావు తెలిపాడు.

Also Read: LPG Gas: ఎల్పీజీ గ్యాస్‌ సంక్షోభం నుంచి భారీ ఊరట.. వాణిజ్య గ్యాస్ కోటా 50 శాతానికి పెంపు

'ఏమిటి రా అంటే ఏమీ లేదని వెళ్లిపోయాడు. మన దృష్టి తిన్నగా ఉండదు కదా? నేను చూసేసరికి.. వీడు ఈ అమ్మాయిని చూశాడంటే తప్పేం లేదు మరి. నన్నే ఆకర్షిస్తుందంటే వాడిని ఆకర్షించదా?' గరికిపాటి నరసింహా రావు తెలిపారు. కానీ ఒక కవిని ఆకర్షించిందంటే వెంటనే ఒక పద్యం వస్తుంది. నిజంగా అనుష్క ఒక మంచి.. అందమైన అర్ధనగ్న స్థితి సుమారుగా అనుకోండి. మనకే అనిపించింది సరదాగా.. అంటూ హీరోయిన్ అనుష్కపై గరికిపాటి నరసింహారావు పద్యం అందుకున్నాడు.

Also Read: Harish Rao: శిలాఫలకాలపై రేవంత్ రెడ్డి పేరు ఉండొచ్చు కానీ.. ప్రజల మనస్సులో ఉండేది కేసీఆర్ పేరే!

వదలనీదు చూపు
కదలనీదు చూపు
వదలనీదు మనసు
అంగమంగమoధు అతుకుకుని

దీని దుంపతెగ చూపు ఎక్కడ పడితే అక్కడే అతుకుపోతున్నది. కిందకు రావాట్లేదు.. పైకి వెళ్లట్లేదు. అన్నీ అవయవాలు అలాగే ఉన్నాయి. మరి వాడు చూశాడంటే తప్పేం ఉంది?' అని అనుష్కపై గరికిపాటి నరసింహా రావు నీచంగా మాట్లాడారు. ఆ తర్వాత మళ్లీ కదలనీదు చూపు అంటూ పద్యం అందుకున్నాడు. ఇలా అవయవాలు.. అర్ధనగ్నం అంటూ నీతి వాక్యాలు చెప్పే గరికిపాటి నరసింహారావు నోటి నుంచి రావడాన్ని సర్వత్రా తప్పుపడతారు. ప్రవచనాలు అంటే నీతి వాక్యాలు.. ఆదర్శనీయమైన పదాలు చెప్పాల్సి ఉండగా.. ఇలా చేయడాన్ని నెటిజన్లు ఖండిస్తున్నారు. కొడుకు చూసేదే తప్పంటే అది తప్పు కాదని కొడుకును వెనకేసుకొచ్చాడు. మొన్న మధ్యాహ్న భోజనం.. ఇప్పుడు అనుష్కపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

986
comment0
Report
HDHarish Darla
Mar 22, 2026 07:59:01
Hyderabad, Telangana:

LPG Gas Price Hike News: భారతదేశంలో ఎల్‌పీజీ గ్యాస్‌ ధరలు మరింత పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్‌పై ఇటీవలే రూ.60 పెరిగిన సంగతి తెలిసిందే. అయితే దేశీయంగా గ్యాస్ సిలిండర్ల కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుంది. అయితే మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కారణంగా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అతిపెద్ద LNG కేంద్రమైన ఖతార్ పారిశ్రామిక నగరంలోని రాస్ లఫాన్‌పై ఇరాన్ చేసిన దాడి ప్రపంచానికి వినాశకరంగా మారే అవకాశం ఉంది. ఖతార్ గ్యాస్ కేంద్రాలపై ఇరాన్ జరిపిన దాడుల వల్ల పశ్చిమాసియాలో సహజ వాయువు (LNG) ఎగుమతి సామర్థ్యానికి భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఖతార్ ఇంధన శాఖ మంత్రి సాద్ అల్-కాబీ పేర్కొన్నారు.

ఈ దాడి ఎప్పుడు జరిగిందంటే?
మార్చి 18వ తేదీ రాత్రి ఖతార్‌లోని కొన్ని గ్యాస్ కర్మాగారాలపై ఇరాన్ దాడులు జరిపింది. సహజ వాయువును క్లీన్ డీజిల్, కిరోసిన్ వంటి ద్రవ ఇంధనాలుగా మార్చే పెర్ల్ GTL ప్లాంట్‌పై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసిన కారణంగా ఎంతో నష్టం వాటిల్లింది. ఇరాన్ తాజా క్షిపణి లక్ష్యంగా చేసిన దాడితో గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్, నిల్వ ట్యాంకుల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది.

అలాగే మార్చి 19న ఖతార్‌లోని అనేక LNG కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ తన రెండవ దాడి చేసింది. రాస్ లఫాన్‌లోని రెండు ప్లాంట్స్‌తో పాటు మొత్తం 14 LNG ట్రాన్స్-గ్యాస్ యూనిట్లు లక్ష్యంగా చేసుకొని దాడికి తెగబడ్డాయి. తమ సోదర భావంగా భావించే ముస్లిం దేశం రంజాన్ మాసంలో ఈ విధంగా దాడులకు తెగబడుతుందని ఖతార్ ఎనర్జీ సీఈఓ కాబీ వెల్లడించారు.

అయితే ఇరాన్ చేసిన దాడుల వల్ల ఖతార్‌లోని LNG ఎగుమతి సామర్థ్యంలో 17% పూర్తిగా దెబ్బతిన్నదని అంచనా వేశారు. దీనివల్ల ఏటా సుమారు $20 బిలియన్ల ఆదాయ నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఖతార్ ఎనర్జీ సీఈఓ కాబీ తెలిపారు. దాడుల తర్వాత ఈ ప్లాంట్ల మరమ్మతులు అవసరమని, దీనివల్ల రాబోయే మూడు నుండి ఐదు సంవత్సరాల పాటు 12.8 మిలియన్ టన్నుల LNG ఉత్పత్తికి అంతరాయం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ప్రభావితం అయ్యే దేశాలు ఇవే..
సుమారు 40-50 శాతాన్ని భారతదేశం తన LNG అవసరాల కోసం ఖతార్ నుండి దిగుమతి చేసుకుంటుంది. సరఫరా తగ్గితే, దేశంలో సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు నిస్సందేహంగా పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎల్‌పీజీలో గణనీయమైన భాగం సహజ వాయువును శుద్ధి చేయడం ద్వారా వస్తుంది. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, గ్యాస్ ధరలతో పాటు దేశీయ, వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

అదే విధంగా భారత్‌తో పాటు పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌, పాకిస్తాన్ దేశాలు  ఇప్పటికే ఇంధన సంక్షోభంతో సతమతమవుతున్నాయి. ఈ క్రమంలో సరఫరా కూడా తగ్గితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలపై భారీగా ప్రభావం పడనుంది.

మరికొన్ని ఆసియా దేశాలైన చైనా, దక్షిణ కొరియా, జపాన్ కూడా ఖతార్ నుండి పెద్ద ఎత్తున LNGని కొనుగోలు చేస్తాయి. 2025లో ఖతార్ నుంచి తెచ్చుకుంటున్నLNG దిగుమతుల్లో 90 శాతం వాటా వీటిదే. దీంతో గ్యాస్ సరఫరాలో కొరత ఏర్పడితే పక్షంలో ఈ దేశాలు స్పాట్ మార్కెట్లో అధిక ధరలకు గ్యాస్ కొనుగోలు చేయాల్సి పరిస్థితి ఏర్పడింది.

మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఐరోపా దేశాలు గ్యాస్ కోసం ఖతార్‌పై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. రాస్ లఫాన్‌పై ఇరాన్ దాడి ఐరోపాలో గ్యాస్ ధరలు 30-35% పెరిగేందుకు భారీగా ఛాన్స్ ఉంది.

Also Read: LPG ATM Gurugram: యుద్ధం వేళ సామాన్యులకు గుడ్‌న్యూస్..గ్యాస్ సిలిండర్లకు ATM..2 నిమిషాల్లో గ్యాస్ రీఫిల్ అయిపోతుంది!

Also Read; AP Weather Update: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హెచ్చరిక..రాబోయే 3 రోజులు అల్లకల్లోలం..బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరిక!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1040
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 22, 2026 07:03:14
Polavaram, Andhra Pradesh:

MLA Chirri Balaraju Cyber Crime: కళ్ల ముందు కనిపిస్తున్నా.. మనకు తెలియకుండా సైబర్‌ నేరగాళ్లకు చిక్కుకుంటాం. చదువుకున్నవారు కూడా తెలియకుండా నష్టపోతుంటారు. దీనికి సామాన్య ప్రజలతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు పోలీసులు కూడా తేడాలేదు. అందరూ సైబర్‌ మాయగాళ్ల వలలో చిక్కి డబ్బును అప్పగించేస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ ఎమ్మెల్యే సైబర్‌ నేరగాళ్లకు చిక్కి రూ.12 లక్షలు నష్టపోయిన ఉదంతం ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆర్‌టీఏ చలాన్‌ పేరిట ఓ లింక్‌ పంపి ఎమ్మెల్యే డబ్బులను సైబర్‌ నేరగాళ్లు కాజేశారు. ఈ వార్త వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: LPG Gas: ఎల్పీజీ గ్యాస్‌ సంక్షోభం నుంచి భారీ ఊరట.. వాణిజ్య గ్యాస్ కోటా 50 శాతానికి పెంపు

ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సైబర్ మాయాగాళ్ల వలలో చిక్కకుని భారీగా నష్టపోయారు. కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో ఆయన బ్యాంక్ ఖాతా ఖాళీ అయిపోయింది. ఆర్టీఏ చలానా పేరుతో ఎమ్మెల్యే మొబైల్‌కు ఒక మెసేజ్ వచ్చింది. అందులో ఆయన వాహనానికి సంబంధించి ట్రాఫిక్ చలానా పెండింగ్‌లో ఉందని.. దాన్ని చెల్లించాలని కోరుతూ ఒక లింక్ పంపారు. అది నిజమైన చలానా అని నమ్మిన ఎమ్మెల్యే ఆ మెసేజ్‌లో పంపిన లింక్‌ను క్లిక్ చేశారు. అది ఒక మాల్వేర్ ఉన్న యాప్ డౌన్‌లోడ్ అయ్యింది. లింక్ ఓపెన్ చేసిన కాసేపటికే జంగారెడ్డిగూడెంలోని ఇండస్ లేండ్ బ్యాంక్ లో ఉన్న ఆయన ఖాతా నుంచి ఏకంగా రూ.12 లక్షలు మాయమయ్యాయి.

Also Read: Harish Rao: శిలాఫలకాలపై రేవంత్ రెడ్డి పేరు ఉండొచ్చు కానీ.. ప్రజల మనస్సులో ఉండేది కేసీఆర్ పేరే!

తన ఫోన్ హ్యాక్ అయిందని, నగదు విత్‌డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆందోళనకు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైనా ఫలితం లేకుండాపోయింది. అతడి బ్యాంకు ఖాతాలో నుంచి రూ.12 లక్షలు విత్‌ డ్రా అయ్యాయి. ఈ విషయంపై జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. సైబర్ క్రిమినల్స్ ఐపీ అడ్రస్ ట్రాకింగ్, యాప్ డేటా విశ్లేషణ వంటి సాంకేతిక పద్ధతులను ఉపయోగించి నిందితులను అదుపులోకి తీసుకోవడం కోసం అన్ని విధాలుగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Also Read: TMC Manifesto: నాలుగోసారి అధికారమే లక్ష్యం.. తృణమూల్‌ అధినేత్రి మమతా టాప్‌ 10 హామీలు

ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికే ఇలాంటి పరిస్థితి ఎదురైందంటే, సామాన్యులు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈఘటనలో అర్థం చేసుకోవచ్చు. చలానాలు, గిఫ్ట్ ఓచర్లు, కేవైసీ అప్‌డేట్ పేరుతో వచ్చే లింక్‌లతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అధికారిక వెబ్‌సైట్లు మాత్రమే చూడాలని తెలిపారు. ట్రాఫిక్ చలానాల కోసం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ ఈ చలాన్‌ లేదా అధికారిక యాప్స్ మాత్రమే వాడాలని సూచించారు. ఏదైనా యాప్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు అది మీ కాంటాక్ట్స్, ఎస్ఎంఎస్ రీడ్ చేయడానికి పర్మిషన్ అడిగితే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని అన్నారు. ఒకవేళ మీరు మోసపోతే తక్షణమే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1032
comment0
Report
HDHarish Darla
Mar 22, 2026 05:45:16
Hyderabad, Telangana:

Petrol Price Today News: పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ముడిచమురు రవాణాపై తీవ్ర ఆంక్షలు నెలకొన్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరపై భారీగా ప్రభావం పడింది. తాజాగా భారతదేశంలో పవర్/స్పీడ్ పెట్రోల్‌పై రూ.2 నుంచి రూ.2.30 మేర పెంచిన సంగతి తెలిసిందే. అయితే నేడు అనగా 2026 మార్చి 22న దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

భారతదేశంలో మార్చి 22 అనగా ఆదివారం నాడు ఉదయం పెట్రోల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులకు ఇంధన ధరలపై స్థిరత్వం కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతా, జైపూర్, లక్నో, నోయిడాతో సహా ప్రధాన నగరాల్లోనూ నిన్న ఉన్న ధరలే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ఇంధన ధరలను ఇప్పుడు పరిశీలిద్దాం.

భారత రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు రూ.94.77 విక్రయిస్తుండగా..ముంబైలో దీని ధర లీటరుకు రూ.103.54గా ఉంది. అయితే ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో ప్రపంచ ముడి చమురు ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు ఉన్నా ఎంతో స్థిరమైన ధోరణి కొనసాగుతుంది. అయితే దేశంలోని ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) ప్రస్తుత రిటైల్ ధరలను కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి. 

దేశంలోని ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర ఏ విధంగా ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం.
1) ఢిల్లీ  Rs. 94.77
2) ముంబై  Rs. 103.54
3) చెన్నై  Rs. 100.80
4) కోల్‌కతా    Rs. 105.45
5) బెంగళూరు    Rs. 102.99
6) హైదరాబాద్    Rs. 107.46
7) పూణే     Rs. 103.99
8) అహ్మదాబాద్    Rs. 94.68
9) లక్నో    Rs. 94.72
10) జైపూర్    Rs. 105.11
11) నోయిడా    Rs. 94.90
12) గురుగ్రామ్    Rs. 95.51
13) ఘజియాబాద్    Rs. 94.58
14) శ్రీనగర్    Rs. 100.64
15) జోధ్‌పూర్    Rs. 104.43

పశ్చిమ ఆసియాలోని రాజకీయ పరిణామాలతో పాటు ముడిచమురు సరఫరాపై ప్రభావం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నప్పటికీ.. దేశంలో ఉన్న పంప్ ధరలు స్థిరంగా కొనసాగడం గమనార్హం. బ్రెంట్ క్రూడ్ ఇటీవల అస్థిరమైన శ్రేణిలో ట్రేడ్ అవుతున్నప్పటికీ, తుది వినియోగదారునికి తక్షణ ధరల పెరుగుదలను నివారించడానికి భారతీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) ఈ హెచ్చుతగ్గులను చాలా వరకు తట్టుకున్నాయి. 

ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా ప్రీమియం పెట్రోల్ ధరలను లీటరుకు సుమారుగా రూ.2 నుంచి రూ.2.30 మేర పెంచారు. ఎంపిక చేసిన నగరాల్లోని డీలర్ల సమాచారం ఆధారంగా.. ఇండియన్ ఆయిల్ వారి ఎక్స్‌పి95, హిందుస్థాన్ పెట్రోలియం వారి పవర్ పెట్రోల్ వంటి హై-ఆక్టేన్ ఇంధనాలకు ఈ పెంపు వర్తిస్తుంది. సవరించిన ధరలు నిన్నటి (మార్చి 21) నుంచి అమల్లోకి వచ్చాయి.

Also Read: Petrol Price Today: దేశంలో భారీగా పెరిగిన పెట్రోల్ ధర..లీటరుకు రూ.2.09 పెంచిన కంపెనీలు..ఎక్కడెక్కడంటే?

Also Read: LPG ATM Gurugram: యుద్ధం వేళ సామాన్యులకు గుడ్‌న్యూస్..గ్యాస్ సిలిండర్లకు ATM..2 నిమిషాల్లో గ్యాస్ రీఫిల్ అయిపోతుంది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1061
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 22, 2026 01:30:09
Kothagudem, Telangana:

Bhadrachalam Temple: తెలంగాణలోని ప్రసిద్ధి సీతారామచంద్రుల ఆలయం భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం సమీక్ష చేసి అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలని.. గోదావరి పుష్కరాలకు కూడా భారీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆగమశాస్త్రం ప్రకారం అభివృద్ధి పనులు జరగాలని స్పష్టం చేశారు.

Also Read: LPG Gas: ఎల్పీజీ గ్యాస్‌ సంక్షోభం నుంచి భారీ ఊరట.. వాణిజ్య గ్యాస్ కోటా 50 శాతానికి పెంపు

హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఉన్నతాధికారులతో భద్రాచలం ఆలయ అభివృద్ధి, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమావేశంలో సమీక్ష చేశారు. భద్రాచలం ఆలయ అభివృద్ధికి ఇప్పటివరకు పూర్తయిన భూసేకరణకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయ సహజత్వానికి ఏమాత్రం భంగం కలగకుండా.. అభివృద్ధి పనులు పూర్తిగా ఆగమ శాస్త్రానుసారం చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆగమశాస్త్రానుసారం అభివృద్ధి పనుల నిర్వహణ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మూడు దశల్లో పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి చేయగలిగిన పనులను ముందుగా గుర్తించి.. దానికి సంబంధించిన  అంచనాలతో తొలి దశ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలంగాణ సీఎం ఆదేశించారు.

Also Read: Tirumala: భక్తుల నమ్మకం కాపాడతాం.. నాణ్యమైన ప్రసాదాన్ని అందిస్తాం: సీఎం చంద్రబాబు

గోదావరి పుష్కరాల ప్రణాళికలకు అనుగుణంగా ఆలయ సమీపంలోని పుష్కర ఘాట్ల నిర్మాణం, అభివృద్ధి పనులు జరగాలని ముఖ్యమంత్రి సూచించారు. 2027 మార్చి 31 నాటికి తొలిదశ అభివృద్ధి పనులు పూర్తి చేసే లక్ష్యంతో పనులు జరగాలని స్పష్టం చేశారు. పుష్కరాలు ముగిసిన అనంతరం మిగతా పనులు పూర్తి చేసేందుకు కూడా ఇప్పుడే ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించనున్న కల్యాణోత్సవానికి తాను వస్తున్నట్లు సీఎం చెప్పినట్లు సమాచారం. కల్యాణోత్సవ ఏర్పాట్లపై కూడా సమీక్ష చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా భద్రాచలం ఆలయంలో శ్రీరామనవమి వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

Also Read: Harish Rao: శిలాఫలకాలపై రేవంత్ రెడ్డి పేరు ఉండొచ్చు కానీ.. ప్రజల మనస్సులో ఉండేది కేసీఆర్ పేరే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

1039
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 21, 2026 14:18:36
Hyderabad, Telangana:

Telangana Budget: ఆర్భాటంగా.. గొప్పగా ప్రకటించిన తెలంగాణ బడ్జెట్‌లో బీసీలకు మోసం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌ కృష్ణయ్య విమర్శించారు. రూ.3 లక్షల 24 వేల కోట్లల్లో బీసీలకు కేవలం 12.511 కోట్లు మాత్రమే కేటాయించి తీవ్ర అన్యాయం చేశారని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు ఒక్కటీ కూడా బడ్జెట్‌లో అమలు చేయలేదని తెలిపారు. ఇచ్చిన వాగ్ధానం ప్రకారం బడ్జెటు రూ.20 వేల కోట్లకు పెంచాలి.. బీసీ కార్పొరేషన్, బీసీ కుల ఫెడరేషన్లకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని గుర్తుచేశారు.

Also Read: LPG Gas: ఎల్పీజీ గ్యాస్‌ సంక్షోభం నుంచి భారీ ఊరట.. వాణిజ్య గ్యాస్ కోటా 50 శాతానికి పెంపు

హైదరాబాద్‌లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన 14 సంఘాల సమావేశంలో ఆర్‌ కృష్ణయ్య మాట్లాడారు. తెలంగాణ బడ్జెట్‌లో బీసీ వర్గాలకు దక్కిన ప్రయోజనాలు ఏమీ లేవని తెలిపారు. బీసీలకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ తీరని మోసం చేసిందని మండిపడ్డారు. ఒక్కొక్క బీసీ కుటుంబానికి రూ.20 లక్షలు, 80 శాతం సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా ఆర్‌ కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.

Also Read: Tirumala: భక్తుల నమ్మకం కాపాడతాం.. నాణ్యమైన ప్రసాదాన్ని అందిస్తాం: సీఎం చంద్రబాబు

ఎస్సీ/ ఎస్టీ/ మైనారటీ విద్యార్థులకు పూర్తి ఫీజులు ఇస్తూ కేవలం బీసీ విద్యార్ధులకు అన్యాయం చేస్తున్నారని రేవంత్ రెడ్డి వైఖరిని ఎంపీ ఆర్‌ కృష్ణయ్య తప్పుబట్టారు. 'మంత్రివర్గంలో కేవలం  ముగ్గురు బీసీలే. సమాచార కమిషన్ల 6 మందిని నియమిస్తే ఒకటి కూడా బీసీలకు ఇవ్వకుండా ఆన్యాయం చేశారు. రాజ్యసభ ఎన్నికలలో ఒకటి కూడా బీసీలకు ఇవ్వలేదు. ప్రభుత్వం అడుగడుగునా బీసీ వ్యతిరేక ఆ చర్యలు పాల్పడుతోంది' అని విమర్శించారు.

సమావేశంలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్,  జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకుడు నీలం వెంకటేష్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, జిల్లపల్లి అంజి - రాష్ట్ర అధ్యకులు రాష్ట్ర యువజన సంఘం, బీసీ ఐక్య వేదిక అధ్యక్షుడు అనంతయ్య, తెలంగాణా బి.సి సంఘం అధ్యక్షుడు రాజేందర్, తెలంగాణా బీసీ విద్యార్ధి సంఘం శివ కుమార్, తెలంగాణా బి.సి విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి నిఖిల్‌, తెలంగాణా బీసీ యువజన సంఘం ఆశిష్ గౌడ్ తదితర కులసంఘాల నాయకులు పాల్గొన్నారు.

బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం
ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పాటిస్తామని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి నిలబెట్టుకోలేకపోయారు. 42 శాతం బీసీల రిజర్వేషన్ బిల్లును ఆమోదించారు కానీ అది అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదు. ఇలా ప్రతీ అంశంలో బీసీలకు మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ లోనూ మోసం చేశాడని బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1077
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 21, 2026 12:58:08
Wadgaon, Maharashtra:

Commercial Gas Quota: ఇరాన్‌, ఇజ్రాయెల్‌, అమెరికా దేశాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారతదేశంపై ఊహించని రీతిలో ప్రభావం పడడంతో భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతానికి పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేకపోయినా భవిష్యత్‌లో ముప్పు పొంచి ఉండగా.. ఎల్పీజీ గ్యాస్‌ సంక్షోభం మాత్రం కొనసాగుతోంది. మూడు దేశాలు ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి భారతదేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడింది. ముఖ్యంగా కమర్షియల్‌ గ్యాస్‌ ఇబ్బంది ఏర్పడగా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య సిలిండర్‌ కోటా పెంచుతూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది.

Also Read: Chiranjeevi: ఉగాది పండుగ రోజు చిరంజీవి కీలక ప్రకటన.. విద్యా దానం చేసేందుకు సిద్ధం!

దేశంలోని అన్ని రాష్ట్రాలకు గ్యాస్‌ సరఫరాపై తీవ్ర ఇబ్బందులు పడుతుండగా.. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత కొరత నేపథ్యంలో రాష్ట్రాలకు కేటాయించే వాణిజ్య గ్యాస్ కోటాను 50 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.

Also Read: Devuni Kadapa: ఉగాది ప్రత్యేకం.. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ముస్లిం భక్తులు

రాష్ట్రాల్లో గ్యాస్‌ కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న 20 శాతం కేటాయింపులతోపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణలతో మరో 10 శాతం అదనంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో 20 శాతం అదనపు కమర్షియల్‌ గ్యాస్‌ కోటాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది మార్చి 23వ తేదీ నుంచి అమలులోకి వచ్చేలా పెట్రోలియం శాఖ కేటాయించింది.

కేంద్ర ప్రభుత్వ పెంపుతో రాష్ట్రాలకు అందే మొత్తం కమర్షియల్‌ గ్యాస్ సరఫరా అదనంగా 50 శాతానికి చేరుకోనుంది. అదనపు 20 శాతం గ్యాస్ కేటాయింపుల్లో ప్రభుత్వం కొన్ని ప్రత్యేక రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. రెస్టారెంట్లు, హోటళ్లు, దాబాలు, ఇండస్ట్రియల్ క్యాంటీన్లు, ఆహార శుద్ధి పరిశ్రమలు, డెయిరీ రంగాలు, ప్రభుత్వ లేదా స్థానిక సంస్థల ద్వారా నడపబడే రాయితీ క్యాంటీన్లు, కమ్యూనిటీ కిచెన్లకు కేటాయించిన అదనపు గ్యాస్‌ కేటాయింపులు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచనలు చేసింది.

అదనంగా కేటాయించిన 50 శాతం కోటాను పొందాలంటే వినియోగదారులకు పెట్రోలియం శాఖ కొన్ని నిబంధనలు విధించింది. వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు తప్పనిసరిగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓంఎస్‌సీలు) వద్ద వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గ్యాస్‌ సంక్షోభం నేపథ్యంలో వాణిజ్య సిలిండర్‌ తప్పుదారి పట్టకుండా.. దుర్వినియోగం కాకుండా కేంద్ర పెట్రోలియం శాఖ ధ్రువీకరణ తప్పనిసరి చేసింది. గ్యాస్ మళ్లింపు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించడంతో ఆ వాణిజ్య సిలిండర్లు రాష్ట్రాలకు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రాల్లోని కమర్షియల్‌ గ్యాస్‌ వినియోగదారులకు భారీ ప్రయోజనం లభించనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1020
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 21, 2026 12:50:06
Hyderabad, Telangana:

 Giant Burmese Python Viral Video Watch: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి మనం నిత్యం ఎన్నో రకాల వింతలతో పాటు విశేషాలకు సంబంధించిన వీడియోలను చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా క్రూర మృగాలతో పాటు విసర్పాలకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియా వినియోగదారులు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. తాజాగా ఒక బర్మీస్ పైతాన్ కు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. సాధారణంగా ఈ పాము కనిపిస్తేనే ఆమడ దూరం పారిపోతూ ఉంటారు.. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా ఆ భారీ కొండచిలువకు తన చేతులతో నీళ్లను తాగించడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.  

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి తన ప్రాణాలను ఏమాత్రం లెక్కచేయకుండా ఒక భారీ పర్మిష్ బర్మీస్ పైథాన్‌కు నీటిని అందించడం మీరు చూడొచ్చు. ఒక చేతిలో ఒక గ్లాసు పట్టుకొని ఆ వ్యక్తి.. తన మరో అరచేతిని దోసిలిలా పట్టుకొని అందులో నీటిని పోస్తున్నాడు. ఆ భారీ సర్పం కూడా అతనిని ఏమీ చేయకుండా.. ఆ వ్యక్తి అరచేతిలో నుంచి నీటిని తాగుతోంది.. ఆ వ్యక్తి అలా నీటిని పోస్తూనే ఉన్నాడు.. ఆ పాము తాగుతూనే ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది..

సాధారణంగా బర్మీస్ పైథాన్‌లు చాలా శక్తివంతమైనవిగా చెప్పుకుంటూ ఉంటారు. వివిధ ఆహారాన్ని చుట్టేసి ఊపిరాడకుండా చేసి చంపేయగలవు.. అలాంటి భయంకరమైన పాము అంత శాంతంగా నీటిని తాగడం చూస్తుంటే.. ఏదో తేడానే అనిపిస్తోంది.  అయితే ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం ఒక్కసారిగా కంగు తింటున్నారు.. అతడి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.. కానీ అది చాలా ప్రమాదకరమని కొంతమంది ఈ వీడియో చూసినవారు అంటుంటే.. ఇక మరి కొంతమంది అయితే ప్రకృతిలో మనుషులు, జంతువుల మధ్య ఉండే సంబంధానికి ఇదొక అద్భుతమైన నిదర్శనమని వివరిస్తూ వస్తున్నారు..

 
 
 
 
 

Read more: Two-headed Snake Video: ఒకే పాము రెండు తలలు.. ఇలాంటి వీడియో ఎప్పుడైనా చూశారా?

ఇక మరి కొంతమంది అయితే ఆ పాముకు నీళ్లు సరిపోయాయా? దాని దాహం తీర్చిన ఆ వ్యక్తి రియల్ హీరో అంటూ కామెంట్లలో రాస్తు వస్తున్నారు.. ఇలాంటి సాహసాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని వన్యప్రాణి నిపుణులు సూచిస్తున్నారు.. పాములు ఎప్పుడు ఎలా స్పందిస్తాయో ఊహించడం చాలా కష్టమని.. శిక్షణ లేని వారు ఇలాంటి పనులు చేయడం ప్రాణానికే ప్రమాదమని వారు చెబుతున్నారు. ఏది ఏమైనా ఎండల తీవ్రత పెరిగే సమయంలో ఇలా మూగజీవాల దాహం తీర్చడం గొప్ప విషయమేనని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కొనియాడుతున్నారు..

Read more: Two-headed Snake Video: ఒకే పాము రెండు తలలు.. ఇలాంటి వీడియో ఎప్పుడైనా చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

  

1076
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 21, 2026 12:37:12
Hyderabad, Telangana:

 Two-headed Snake Video Watch: ప్రకృతి సృష్టిలో అప్పుడప్పుడు కొన్ని వింతలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో సోషల్ మీడియా వినియోగదారులను నోరెళ్లబెట్టుకునేలా చేస్తోంది.. సాధారణంగా ఒకతలతో ఉండే పామును మాత్రమే మనం చూస్తూ ఉంటాం.. అలాంటిది ఒకే శరీరానికి రెండు తలలు కలిగిన నల్లత్రాచు పిల్ల దర్శనం ఇవ్వడం ఇప్పుడు ఇంటర్నెట్లో చర్చనీ అంశానికి దారితీసింది. ఈ వీడియో చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఇలా రెండు తలలతో కూడా పాములు జన్మిస్తాయా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.. అయితే, ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక వ్యక్తి తన చేతితో అప్పుడే జన్మించిన ఒక చిన్న నల్ల త్రాచును చూపించడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు.. మొదటి చూపుతో అందరూ ఈ వీడియో చూడగానే అది మామూలు పాము పిల్ల అని అనుకుంటూ ఉంటారు.. అంతేకాకుండా అందరికీ ముందుగా అలాగే కనిపిస్తూ ఉంటుంది.. కానీ దానిని క్లియర్‌గా గమనిస్తే దాదాపు రెండు వేరువేరు తలలు ఉండటం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వ్యక్తి కెమెరాకు దగ్గరగా ఆ పామును చూపిస్తుండగా.. ఈ వింత పాము తన రెండు తలలు అటు ఇటు వేగంగా కదుపుతూ పరిసరాలను గమనించడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు..

ఓకే వెన్నుముకకు రెండు తలలు ఉన్నట్లు మీకు ఈ వీడియోలో పామును చూస్తే అర్థమవుతుంది. ఆ వ్యక్తి పామును సున్నితంగా చేత్తో పట్టుకునేందుకు కూడా ప్రయత్నించారు.. అయితే, ఈ వీడియోలో ఆ పాము అటు ఇటు ఎంతో వేగంగా కదలడం చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు.. సైన్స్ ప్రకారం ఇలాంటి వింతలను బైసెఫాలీ అని అంటూ ఉంటారు. మానవులలో కవలలు ఎలాగైతే అతుక్కొని పుడతారో.. పాముల్లో కూడా పిండం అభివృద్ధి చెందే సమయంలో విభజన సరిగ్గా జరగకపోవడం వల్ల ఇలాంటి అరుదైన పాములు రెండు తలలతో జన్మిస్తూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు..

 
 
 
 
 

Read more: Jagtial News: పాపం.. కిడ్నీలు ఫెయిలైన భర్తను శ్మశానంలో వదిలేసిన భార్య

ఇలాంటి పాములు ప్రకృతిలో ఎక్కువ కాలం జీవించడం కష్టమని కొంతమంది సైంటిస్టులు తెలుపుతున్నారు.  ఎందుకంటే రెండు తలలు వేర్వేరు దిశల్లో వెళ్లాలని ప్రయత్నించడం వల్ల ఆహారం తీసుకోవడంలోనూ, ఇతర పనుల్లోను ఇబ్బంది పడుతూ ఉంటాయి.. కాబట్టి వీటికి భూమ్మీద బతికే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు.. ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే వేల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. కొంతమంది దీనిని చూసి కామెంట్లు కూడా పెడుతున్నారు. పామును చూడటానికి భయం.. ఇందులోను రెండు తలలా! అని కామెంట్లలో వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Read more: Jagtial News: పాపం.. కిడ్నీలు ఫెయిలైన భర్తను శ్మశానంలో వదిలేసిన భార్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

  

1074
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 21, 2026 12:25:11
Hyderabad, Telangana:

 20-foot Massive Python Video Watch Here: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఏదో ఒక ఆశ్చర్యాన్ని కలిగించే వీడియో వెలుగులోకి వస్తూనే ఉంటుంది.. అయితే, ప్రతిరోజు ఎన్నో వింతలకు సంబంధించిన వీడియోలు మనం చూస్తూ ఉంటాం. అయితే, తాజాగా వైరల్ అవుతున్న వీడియో మాత్రం సామాన్యులకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఒక 20 అడుగులు కలిగిన భారీ కొండచిలువను.. ఓ వ్యక్తి ఏమాత్రం భయం లేకుండా తోకని పట్టుకొని లాక్కెళ్ళడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీనిని చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు. 

వైరల్ అవుతున్న ఈ రీల్‌లో ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో భారీ శరీరంతో ఉన్న  కొండచిలువ పాము నెమ్మదిగా కదులుతూ ఉండడం మీకు కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా అంత పెద్ద పాము చూస్తే ఎవరైనా ఆవిడ దూరం పరుగులు తీస్తారు.. కానీ ఈ వీడియోలో ఉన్న వ్యక్తి మాత్రం దానికి భిన్నంగా వ్యవహరించాడు.. ఆ కొండచిలువ వెనక భాగంలో ఉండి తోకను రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు.. ఆ వ్యక్తి అంతటితో ఆగకుండా దాన్ని వెనక్కి లాక్కు వెళ్లడం మొదలుపెట్టాడు. అయితే ఆ పాము ఒకపక్క ముందుకు వెళ్లాలని చూస్తున్నప్పటికీ.. ఆ వ్యక్తి వెనుకకు ఈడ్చుకు వెళ్లడంతో అది తీవ్ర అవస్థల పాలవుతున్నట్లు తెలుస్తోంది..

ఈ వీడియో పోస్టు చేసిన కొన్ని రోజుల్లోనే లక్షలాది వ్యూస్ ను సంపాదించుకుంది.. అంతేకాకుండా దీనిని వేలాదిమంది లైక్ చేసినట్లు కూడా తెలుస్తోంది. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియో కింద కామెంట్లు కూడా చేస్తున్నారు. మరికొంతమంది ఈ వీడియోని చూసి డైరెక్టుగా స్పందిస్తున్నారు.. ఇతనికి ప్రాణం మీద ఆశ లేదా అని కొంతమంది అంటుంటే.. మరి కొంతమంది బహుశా ఆ వ్యక్తి పాములు పట్టడంలో ప్రత్యేకమైన శిక్షణ పొంది ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..

 
 
 
 
 

Read more: Jagtial News: పాపం.. కిడ్నీలు ఫెయిలైన భర్తను శ్మశానంలో వదిలేసిన భార్య!

ఇక మరి కొంతమందైతే ఇలాంటి వన్యప్రాణుల పట్ల క్రూరంగా ప్రవర్తించడం సరికాదని.. ఇలాంటి విన్యాసాలు ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.. కొండచిలువకు విషయం లేకపోయినప్పటికీ.. అవి తమకు ఉండే కండరాలతో మనుషులను ఎంతో సులభంగా ఉక్కిరిబిక్కిరి చేయగలుగుతాయి. కేవలం న్యూస్ కోసం లేదా రీల్స్ కోసం ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేయడం ఏమాత్రం సరైనది కాదు.. ఈ వీడియో ఎక్కడ చిత్రీకరించారు అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.  కానీ ఈ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది..

Read more: Jagtial News: పాపం.. కిడ్నీలు ఫెయిలైన భర్తను శ్మశానంలో వదిలేసిన భార్య!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

  

1029
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 21, 2026 12:24:32
Tirupati Urban, Andhra Pradesh:

Chandrababu Naidu: తిరుమల భక్తుల నమ్మకానికి విఘాతం కలిగించకుండగా.. నిరంతరం వారి నమ్మకాన్ని కాపాడేలా కృషి చేస్తూనే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. భక్తులకు నాణ్యమైన ప్రసాదాన్ని, తాగునీటిని అందించేందుకు టెక్నాలజీని వినియోగిస్తూ చిత్తశుద్ధితో పని చేయాలని టీటీడీ అధికారులకు సూచించారు. తిరుమలకు వచ్చే కోట్లాది మంది భక్తుల నమ్మకం, విశ్వాసాలను మరింత పెంచేలా.. ఆరోగ్య భద్రతే ధ్యేయంగా టీటీడీ మరో చారిత్రాత్మక అడుగు వేసిందని ప్రకటించారు.

Also Read: RK Roja: ఉగాది రోజు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, బీఆర్‌ నాయుడు గాడిదలు కాస్తున్నారా?

తన మనమడు దేవాన్ష్‌ జన్మదినం సందర్భంగా తిరుమలను సందర్శించిన సీఎం చంద్రబాబు అనంతరం కొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించారు. స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సంయుక్తంగా టీటీడీ సహకారంతో రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక వాటర్ - ఫుడ్ అనాలసిస్ ల్యాబ్‌కు రిబ్బన్‌ కట్‌ చేశారు. దేశంలోనే ఒక ఆలయం కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి అత్యున్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్ ఇదే అని ప్రకటించారు.

Also Read: Chiranjeevi: ఉగాది పండుగ రోజు చిరంజీవి కీలక ప్రకటన.. విద్యా దానం చేసేందుకు సిద్ధం!

ల్యాబ్ ప్రారంభోత్సవం చేసిన అనంతరం ల్యాబ్‌లోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి.. పనితీరు, సామర్థ్యం గురించి అధికారులను  సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ప్రసాదాల తయారీలో వాడే ముడి పదార్థాల నాణ్యతను ఏ స్థాయిలో విశ్లేషించవచ్చని ప్రశ్నించారు. ఆహార పదార్థాల రుచి, వాసనను డిజిటల్ పద్ధతిలో కచ్చితంగా విశ్లేషిస్తాయని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. 1981లో నీటి పరీక్షల కేంద్రం ప్రారంభమవగా.. ఇప్పుడు నెలకు వెయ్యి నుంచి 1,500 శాంపిళ్లను విశ్లేషించే స్థాయికి చేరిందని అధికారులు వెల్లడించారు.

శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి, ఇతర పదార్థాల కల్తీ నివారణకు తీసుకుంటున్న చర్యలపై టీటీడీ అధికారులను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. కల్తీ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని అధికారులను ప్రశ్నించారు. ఆధునిక జీసీ/హెచ్‌పీఎల్‌సీ యంత్రాలతో నెయ్యి స్వచ్ఛతను అత్యంత శాస్త్రీయంగా ఇక్కడే నిర్ధారించవచ్చని అధికారులు తెలిపారు. దీంతో కల్తీకి ఏమాత్రం అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ముడి పదార్థాల్లో ఉండే పురుగు మందుల అవశేషాలు, యాంటీ బయోటిక్స్, లెడ్, ఆర్సినిక్ వంటి హెవీ మెటల్స్ కనుగొనే సామర్థ్యం ఉన్న పరికరాలను కూడా ఈ ల్యాబులో ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు.

తిరుమల శ్రీవారి ప్రసాదాలపై భక్తులకు ఉన్న అపారమైన నమ్మకాన్ని కాపాడటమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అని.. ఆ మేరకు అధికారులు పని చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ల్యాబ్ పరీక్షలకే పరిమితం కాకుండా అన్నప్రసాద కేంద్రాల్లోని వంటశాలల శుభ్రతపై నిరంతర తనిఖీలు చేసి పరిశుభ్రతను నిర్ధారించాలని చెప్పారు. శ్రీవారి ప్రసాదాలపై మరింత నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచాలని కోరారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1062
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 21, 2026 12:12:39
Hyderabad, Telangana:

Adulterated Samosa Seized In Hyderabad News: మీరు బయట దొరికే వేడి వేడి సమోసాలను ఎంతో ఇష్టంగా తింటారా? అయితే ఈ వార్త చదివాక మీరు మరోసారి ఆలోచించాల్సిందే.. హైదరాబాద్‌లో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక అక్రమ సమోసా తయారీ కేంద్రాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం ఉదయం గుర్తించారు. ఎలాంటి శుభ్రత లేని వాతావరణంలో.. ప్రమాదకరమైన పదార్థాలతో సమోసా తయారు చేస్తున్న దృశ్యాలు చూసి అధికారులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.. భద్రత ప్రమాణాలు పాటించకుండా తయారు చేస్తున్న సమోసా కేంద్రాలపై అధికారులు మెరుపు దాడులు చేశారు..

హైదరాబాద్‌లోని జియాగూడ ప్రాంతంలో అబ్దుల్ రసీద్ అనే వ్యక్తి ఎటువంటి ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) అనుమతులు, మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ లేకుండా గత కొంతకాలంగా ఈ క్రేంద్రాన్ని నడుపుతున్నారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం.  అక్కడ జరుగుతున్న దారుణాలను బయటపెట్టింది.. తయారు కేంద్రం అంతా ఈగలతో పాటు మురికి నుండి ఉండటమే కాకుండా కనీస ఆరోగ్య సూత్రాలు పాటించడం లేదని పోలీసులు నిర్ధారించారు...

ఈ తనిఖీల్లో భాగంగా.. సమోస మిశ్రమాల్లో కలిపి ఎందుకు పాడైపోయిన, దుర్వాసన వస్తున్న గుడ్లను వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఇప్పటికే నల్లగా మారిన నూనెలను పదేపదే వేడి చేస్తూ సమోసాలను వేయిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పురుగులు పట్టిన మైదా పిండితో పాటు నాణ్యతలేని మసాలా దినుసులను కూడా నిల్వ ఉంచినట్లు శోదాలలో తెలిపారు.. అంతేకాకుండా సమోసా స్టఫింగ్ కోసం కుళ్లిపోయిన ఆహార పదార్థాలు వినియోగిస్తున్నారని తేల్చి చెప్పారు..

Read more: Jagtial News: పాపం.. కిడ్నీలు ఫెయిలైన భర్తను శ్మశానంలో వదిలేసిన భార్య!

ఈ దాడుల్లో భాగంగా అధికారులు సుమారు ఐదు లక్షల విలువైన విలువ ఉంచిన సమోసాలతో పాటు ముడి పదార్థాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ సమోసా తయారీ కేంద్రం నుంచి ప్రతి రోజు వేల సంఖ్యలో సమోసాలు నగరంలోని వివిధ హోటళ్లతో పాటు తోపుడుబండ్లకు సరఫరా ఐతున్నట్లు విచారణలో తేలింది.. నిందితుడు అబ్దుల్ రషీద్ ను అరెస్టు చేసి అధికారులు రిమాండ్ కు తరలించారు.. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఆక్రమంగా వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ డీసీపీ హెచ్చరించారు.. అంతేకాకుండా ఇలా భద్రత ప్రమాణాలు పాటించకుండా ఎక్కడ ఆహార కేంద్రాలున్న అధికారులకు సమాచారం అందించాలని కోరారు..

Read more: Jagtial News: పాపం.. కిడ్నీలు ఫెయిలైన భర్తను శ్మశానంలో వదిలేసిన భార్య!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

1096
comment0
Report
Advertisement
Back to top