KCR In Assembly: ప్రత్యర్థులు రెచ్చగొడుతూ.. దూషణలు చేస్తూ విచక్షణ లేకుండా మాట్లాడుతుంటే మౌనంగా చూసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కదిలి వస్తున్నాడు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు. శీతాకాల సమావేశాల ప్రారంభానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రానున్నారు. ఇప్పటికే ప్రెస్మీట్ పెట్టి 'ఐ యామ్ ఆన్ ద ఫీల్డ్' అని ప్రకటించిన కేసీఆర్ ఇక అసెంబ్లీకి హాజరవుతున్నారంటే సభ ఎలా జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ శీతాకాల శాసన సభ సమావేశాల టేబుల్పై 11 కీలక పత్రాలు ప్రభుత్వం ఉంచనుంది. జీఎస్టీ సవరణ ఆర్డినెన్స్ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. జీహెచ్ఎంసీ సవరణ ఆర్డినెన్స్లు సభ టేబుల్ చేయనుంది. తెలంగాణ మున్సిపాలిటీస్ రెండో సవరణ ఆర్డినెన్స్ ప్రవేశం, సమగ్ర శిక్ష (టీఎస్ఎస్ఎస్) 2023-24 ఆడిట్ నివేదిక సమర్పణ, పీఎం శ్రీ (పీఎం శ్రీ) పాఠశాలల ఆడిట్ నివేదికను సభలో ప్రభుత్వం పెట్టనుంది.
సమావేశాల్లో ప్రభుత్వ నియామకాల చట్ట సవరణ ఆర్డినెన్స్ను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. సిబ్బంది నిర్మాణం, జీతాలపై రెండో సవరణ ఆర్డినెన్స్ పెట్టనుండగా.. పంచాయతీరాజ్ మూడో సవరణ ఆర్డినెన్స్ ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది. పంచాయతీరాజ్ శాఖ గెజిట్ నోటిఫికేషన్ సమర్పించనుంది. తెలంగాణ హార్టికల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వార్షిక నివేదికలు ఉండనున్నాయి. అయితే తొలి రోజు మాత్రం మాజీ సభ్యులకు సంతాపం తెలిపే కార్యక్రమం మాత్రమే ఉంటుంది.
ఇటీవల మరణించిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యుల మృతిపై సంతాప తీర్మానాలు సభ చేయనుంది. సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి దామోదర్ రెడ్డికి, రంగారెడ్డి జిల్లా మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డికి సభ సంతాపం తెలపనుంది. అనంతరం శాసనసభ వాయిదా పడుతుంది. సభా సలహా మండలి (బీఏసీ) సమావేశం కానుంది. స్పీకర్ చాంబర్లో జరగనున్న బీఏసీ భేటీకి అసెంబ్లీ సమావేశాల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చ జరగనుంది.
ఈ సమావేశానికి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కు, రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆహ్వానం పలకగా.. శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొననుండగా.. ప్రభుత్వ విప్ బీర్ల ఐలెయ్య, పలువురు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. 2,3 వ తేదీలో నిర్వహించే సభకు సంబంధించిన ఎజెండా, సభను ఎన్ని రోజులు నిర్వహించాలి అనేది బీఏసీ సమావేశం నిర్ణయం తీసుకోనుంది.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Tirumala Lands: తిరుపతి అలిపిరి సమీపంలోని దేవలోక్ ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) చెందిన పవిత్ర భూములను కార్పొరేట్ హోటల్కు కేటాయించడం ఘోర అపచారంగా సీపీఐ జాతీయ నాయకుడు కె. నారాయణ విమర్శించారు. దేవస్థానం భూములను కాపాడిన ఫలితంగానే నేడు ఆ భూములు విద్యాలయాలు, ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. అలాంటి భూములు ఇప్పుడు కార్పొరేట్లకు అప్పగించడాన్ని తప్పుబట్టారు.
తిరుపతి అలిపిరి సమీపంలోని దేవలోక్ వద్ద ఒబెరాయ్ హోటల్కు కేటాయించిన భూమిని ఆదివారం సీపీఐ పార్టీ నాయకులతో కలిసి కె. నారాయణ పరిశీలించారు. భూమి వివరాలు ఆరా తీసి ఇక్కడ హోటల్ కట్టరాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనులను క్షుణ్ణంగా పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుపతి అలిపిరి వద్ద ఒబెరాయ్ హోటల్ నిర్మాణంపై తమ అభ్యంతరాలను నారాయణ స్పష్టంగా వెల్లడించారు.
Also Read: KCR In Assembly: తెలంగాణ అసెంబ్లీ షెడ్యూల్ ఇదే!.. అసెంబ్లీకి కేసీఆర్ సారూ వచ్చేస్తున్నాడు
ఈ భూమంతా పూర్తిగా టీటీడీ పరిధిలోదేనని.. నేరుగా ఇవ్వలేక టూరిజం లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఇచ్చినట్లు చూపించి, అక్కడి నుంచి ఒబెరాయ్ హోటల్ గ్రూప్కు సుమారు 25 ఎకరాలు కేటాయిస్తున్నారని కె. నారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. ధర ఎంత, లంచాలు ఎంత అన్నది పక్కనపెడితే.. అసలు దేవస్థానానికి చెందిన భూమిలో స్టార్ హోటల్ ఎలా కడతారని ప్రశ్నించారు. స్టార్ హోటల్ అంటే పబ్లు, బార్లు, మాంసాహారం ఉంటాయని, ఇలాంటి వాటిని దేవుడు ఒప్పుకుంటాడా అని నిలదీశారు.
Also Read: Drugs Case: పండుగలప్పుడే డ్రగ్స్ కేసులు నమోదు చేస్తారా? బండి సంజయ్ ఆగ్రహం
స్టార్ హోటల్కు అలిపిరిలో భూమి కేటాయింపు నిర్ణయం తీసుకునే హక్కు టీటీడీ బోర్డుకు ఉందా? లేక రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఉందా? అని నారాయణ ప్రశ్నించారు. దీనికి అసలు రిమోట్ కంట్రోల్ ఢిల్లీలో ఉందని తమకు స్పష్టమవుతోందని విమర్శించారు. ఢిల్లీ కార్పొరేట్ కంపెనీల అధిపతులు.. వారికి మద్దతుగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సంబంధం లేకుండా ఇలాంటి నిర్ణయాలు జరగవని తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు తిరుపతిలోనే చదువుకుని, ఈ ప్రాంతాన్ని బాగా తెలిసిన వ్యక్తి అని నారాయణ తెలిపారు. దేవుడిపై నిజమైన భక్తి ఉంటే ఇలాంటి పవిత్ర భూమిని కార్పొరేట్ హోటల్కు ఇచ్చే ఆలోచన రాదని స్పష్టం చేశారు. తిరుమల తిరుపతిని కార్పొరేట్ పరం చేయరాదని.. ఇక్కడ హోటల్ నిర్మాణం ఆపివేయాలని నారాయణ డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Congress Loots Telangana: తన ప్రాణాలు పణంగా పెట్టి కేసీఆర్ పోరాడి సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణను చేస్తే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దోచుకుంటోందని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. పాలమూరును మళ్లీ వలసల జిల్లాగా మార్చిన ఘనత రేవంత్కే దక్కుతుందని ప్రకటించారు. పాలమూరు నీళ్ల కోసం కేసీఆర్ పోరాటానికి సిద్ధమని తెలిపారు. రైతు బంధు పోయి రాబంధు పాలన వచ్చిందని.. యూరియా క్యూలైన్లే దీనికి నిదర్శనం అని పేర్కొన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పండబెట్టిన కాంగ్రెస్పై కేసీఆర్ మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారని.. దీంతో కాంగ్రెస్–బీజేపీ చీకటి స్నేహం బయటపడిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు.
నాగర్ కర్నూల్ సభలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు జిల్లాను కేసీఆర్ సస్యశ్యామలం చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయిందని తెలిపారు. 'తట్టెడు మట్టి కూడా తీయకుండా నికృష్టపు మాటలు మాట్లాడుతున్నాడు. కాంగ్రెసోళ్లు పాలమూరును మళ్లీ వలసల జిల్లాగా మార్చారు' కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులను పండబెట్టి పాలమూరు జిల్లాను ఎండబెట్టారని విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వంలో పాలమూరు ప్రాజెక్టు 90 శాతం పూర్తి చేశామని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. టెండర్లను రద్దు చేసి ప్రాజెక్టును పండబెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీటి కేటాయింపుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి రాజీ పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును కాపాడుకుని రైతులకు అండగా నిలబడేందుకు, తెలంగాణ నీటి వాటాల ప్రయోజనాలను కాపాడేందుకు కేసీఆర్ మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారని కేటీఆర్ తెలిపారు. త్వరలోనే పాలమూరుకు కేసీఆర్ రాబోతున్నారని.. ఆయన చేయబోయే ఈ పోరాటానికి పాలమూరు బిడ్డలంతా అండగా నిలబడాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు.
కమీషన్ల మీద ఉన్న ప్రేమ రేవంత్ రెడ్డికి రైతుల మీద లేదని.. ఈ సమయంలో ప్రజలు కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. రైతు బంధు పాలన పోయి రేవంత్ రాబంధు పాలన వచ్చిందని ఎద్దేవా చేశారు. రైతులు యూరియా బస్తాల కోసం కాళ్ల మీద పడి గోస పడుతున్నారని, చలిలో చెప్పులు క్యూలైన్లో పెట్టి నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని వివరించారు. రేవంత్కు రైతుల పట్ల ప్రేమ లేదని, కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని వచ్చాయని గుర్తు చేశారు.
రేవంత్ ఎక్కడికి పోయినా కేసీఆర్ మీద ఏడుపే కనిపిస్తోందని.. రేవంత్ ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే రేపోమాపో కరుస్తాడేమో అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. దమ్ముంటే యూరియా బస్తాలు దొరికేలా చేస్తా అని రేవంత్ రెడ్డి శపథం చేయాలని, రూ.4000 పెన్షన్ ఇస్తానని శపథం చేయాలని సవాల్ విసిరారు. ప్రజలను మోసం చేస్తున్నారని.. కేసీఆర్ కంటే అన్ని ఎక్కువిస్తామని ఆశ పెట్టారని, హామీల అమలు ఏమైందని నిలదీస్తే రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతున్నారని వెల్లడించారు. పథకాలు అడిగితే రేవంత్ బూతులు మాట్లాడుతున్నాడని, మహాలక్ష్మి పథకం ఏమైందంటే గుడ్లు పీకి గోటీలాడతానంటున్నాడని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రామాలను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని, వైకుంఠధామాలు కట్టారని, డంప్ యార్డ్లు నిర్మించారని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. ప్రతి గ్రామాన్ని దేశానికే ఆదర్శవంతంగా తీర్చిదిద్దింది కేసీఆర్ అని గుర్తుచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
LIC New Jeevan Shanti: ఉద్యోగం, వ్యాపారం ఇలా జీవితాంతం కష్టపడి ఎన్నో బాధ్యతలను భుజాన వేసుకుని డబ్బు సంపాదించేవారు ఎంతో మంది ఉన్నారు. పెళ్లి, పిల్లలు, కుటుంబం, పిల్లలు చదువు, పెళ్లిళ్లు ఇలా సంపాదించిన డబ్బంతా ఖర్చు అవుతుంది. కానీ రిటైర్మెంట్ తర్వాత భవిష్యత్తు ఏంటి? వయస్సు ఉన్నప్పుడు సంపాదించిన డబ్బు.. వయస్సు మీద పడిన తర్వాత ఆర్థిక కష్టాలు రాకుండా ఉండేందుకు చాలా మంది పలు రకాలుగా పెట్టుబడి పెడుతుంటారు. మీరు కూడా రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ ప్లాన్ ఒకేసారి పెట్టుబడి పెడితే జీవితాంతం పెన్షన్ లభిస్తుంది. అదే ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి పథకం. ఈ స్కీములో ఇన్వెస్ట్ చేస్తే నెల నెలా చేతికి డబ్బు అందుతుంది. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్ఐసీ అందించే స్కీములపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉంటుంది. భద్రతతోపాటు స్థిరమైన రాబడి కోరుకునేవారికి న్యూ జీవన్ శాంతి స్కీమ్ ప్రత్యేకంగా రూపొందించింది ఎల్ఐసీ. రిటైర్మెంట్ తర్వాత కూడా క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే విధంగా ఈ స్కీమ్ పనిచేస్తుంది.
LIC న్యూ జీవన్ శాంతి అంటే ఏమిటి?
ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి ఒక డిఫర్డ్ యాన్యుటీ పెన్షన్ ప్లాన్. అంటే మీరు ఈ స్కీము తీసుకునే సమయంలో ఒకేసారి డబ్బు ఇన్వెస్ట్ చేస్తారు. ఆ తర్వాత నిర్ణీత కాలం తర్వాత లాక్ ఇన్ పీరియడ్ పూర్తయిన తర్వాత మీకు పెన్షన్ వస్తుంది. ఒకసారి పెన్షన్ ప్రారంభం అవుతే.. జీవితాంతం అంతే మొత్తాన్ని పొందుతారు. ఈ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత.. పెన్షన్ ఎంత రావాలి.. ఏవిధంగా రావాలనే విషయాలను మొదట్లోనే నిర్ణయించుకోవచ్చు. ఆ తర్వాత మార్చుకునేందుకు అవకాశం ఉండదు. అందుకే ఇది రిటైర్మెంట్ అయిన వారికి మంచి భరోసానిస్తుంది.
5 సంవత్సరాల లాక్-ఇన్ తోపాటు రెండు పెన్షన్ ఎంపికలు:
ఈ స్కీములో 5ఏళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు ఐదేళ్ల వరకు లాక్ లోనే ఉంటుంది. ఈ కాలం పూర్తి అయిన తర్వాత మీకు పెన్షన్ వస్తుంది.
ఈ ప్లాన్లో రెండు ఎంపికలు ఉన్నాయి:
- సింగిల్ లైఫ్ డిఫర్డ్ యాన్యుటీ – ఒకే వ్యక్తికి జీవితాంతం పెన్షన్
- జాయింట్ లైఫ్ డిఫర్డ్ యాన్యుటీ – దంపతుల కోసం, ఒకరు లేనప్పుడు మరొకరికి పెన్షన్ కొనసాగుతుంది
- మీ అవసరాన్ని బట్టి ఈ రెండింటిలో ఏదైనా ఎంచుకోవచ్చు.
యాన్యుటీ ఎలా పని చేస్తుంది?
-ఈ పథకంలో పెన్షన్ జీవితాంతం వస్తుంది.
- సింగిల్ లైఫ్ ప్లాన్ తీసుకుని పాలసీదారు మరణిస్తే, పెట్టుబడి చేసిన మొత్తం నామినీకి చెల్లిస్తారు.
- జాయింట్ లైఫ్ ప్లాన్లో ఒకరు మరణించినా, రెండో వ్యక్తికి పెన్షన్ కొనసాగుతుంది. ఇద్దరూ మరణిస్తే, మొత్తం డబ్బు నామినీకి ఇస్తారు.
-అందువల్ల పెట్టుబడి చేసిన డబ్బు సురక్షితంగా ఉంటుంది.
వయోపరిమితి..ఇతర ముఖ్యమైన ప్రయోజనాలు:
ఈ పాలసీ తీసుకోవాలంటే.. కనీస వయస్సు 30 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయస్సు 79 సంవత్సరాలుగా ఉండాలి. ఇందులో లైఫ్ రిస్క్ కవర్ ఉండదు. స్థిరమైన ఆదాయం కోరుకునేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
ఈ పథకంలో మరో ముఖ్యమైన లాభం ఏమిటంటే:
-మీరు కావాలంటే పాలసీని మధ్యలో సరెండర్ చేయవచ్చు
-పెన్షన్ను నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక లేదా వార్షికంగా తీసుకోవచ్చు
రూ.1 లక్ష వార్షిక పెన్షన్ ఎలా వస్తుంది?
ఉదాహరణకు..55 ఏళ్ల వయస్సులో ఉన్న వ్యక్తి ఈ ప్లాన్లో సుమారు రూ. 11 లక్షలు ఒకేసారి పెట్టుబడి పెట్టి, 5ఏళ్ల లాక్-ఇన్ పూర్తి చేసినట్లయితే వార్షికంగా సుమారు రూ. 1,01,880 పెన్షన్ వస్తుంది. అర్ధవార్షికంగా రూ.49,911..నెలవారీగా సుమారు రూ. 8,149 పెన్షన్ పొందవచ్చు. అలాగే, కనీసంగా రూ. 1.5 లక్షల పెట్టుబడితో కూడా సుమారు రూ. 1,000 హామీ పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం పొందాలనుకునేవారికి ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి స్కీమ్ ఒక సురక్షితమై.. నమ్మదగిన పెన్షన్ ప్లాన్ అని చెప్పవచ్చు. ఒకేసారి ఇన్వెస్ట్ చేసి.. జీవితాంతం ఆదాయం పొందాలనుకునేవారికి ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
EPFO Single Window: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సేవలను మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మార్పుల వల్ల ఇక నుంచి పీఎఫ్ విత్ డ్రా, ఫిర్యాదుల పరిష్కారం, కేవైసీ ధ్రువీకరణ వంటి పనుల కోసం ఖాతాదారులు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. కేంద్రం తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యమైనది.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఈపీఎఫ్ఓ కార్యాలయాలను సింగిల్ విండో సర్వీస్ సెంటర్లుగా మార్చడమే. దీని ద్వారా పీఎఫ్ ఖాతాదారులు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇక నుంచి తమ ఖాతా అనుబంధంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. దేశంలోని ఏ ఈపీఎఫ్ఓ కార్యాలయం సందర్శించినా తమ పనులు పూర్తవుతాయి.
పాస్పోర్ట్ కార్యాలయాల తరహాలో EPFO సేవలు:
ఈపీఎఫ్ఓ ప్రావిడెంట్ ఫండ్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ విషయాలను వెల్లడించారు. EPFO కార్యాలయాలను పాస్పోర్ట్ కార్యాలయాల మాదిరిగా పునఃరూపకల్పన చేస్తామని.. అక్కడ సింగిల్ విండో వ్యవస్థను అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా ఢిల్లీలో ప్రారంభించారు.
ఈ మార్పులతో EPFO సేవలు పూర్తిగా డిజిటల్ ఆధారితంగా మారనున్నాయి. ఆన్లైన్ విధానాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు సహాయం చేయడానికి EPF సువిధ ప్రొవైడర్లు అనే కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. వీరు ఖాతాదారులు EPFO మధ్య వారధిగా పనిచేస్తూ, క్లెయిమ్ ప్రాసెసింగ్, KYC, ఫిర్యాదుల పరిష్కారంలో సహకరిస్తారు.
ఖాతాదారులకు లభించే ముఖ్యమైన ప్రయోజనాలు:
ఈ కొత్త వ్యవస్థ వల్ల విదేశాల్లో పనిచేసి తిరిగి వచ్చిన ఉద్యోగులు తమ పీఎఫ్ డబ్బును కోల్పోరు. వారు భారత్కు వచ్చిన తర్వాత సులభంగా తమ డిపాజిట్లను విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే ఏళ్లుగా క్లెయిమ్ చేయకుండా నిలిచిపోయిన పీఎఫ్ ఖాతాల విషయంలో ప్రభుత్వం మిషన్ మోడ్లో KYC ధృవీకరణ చేపడుతుంది. ఖాతాదారులు లేకపోతే వారి కుటుంబ సభ్యులను గుర్తించి, నిజమైన వారికే డబ్బు తిరిగి అందజేస్తారు.
సామాజిక భద్రతలో విస్తృత కవరేజ్:
మంత్రి మాండవీయ మాట్లాడుతూ.. 2014లో దేశ జనాభాలో కేవలం 19 శాతం మందికే సామాజిక భద్రత లభించేదని.. ప్రస్తుతం అది 64 శాతానికి పెరిగిందని తెలిపారు. చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశమని.. నేడు దాదాపు 94 శాతం మంది ప్రజలు ఏదో ఒక రూపంలో సామాజిక భద్రతను పొందుతున్నారని ఆయన వివరించారు.
గతంతో పోలిస్తే ఇప్పుడు మార్పులు ఏంటి?
పీఎఫ్ సమస్యల కోసం తప్పనిసరిగా మీ బ్రాంచ్ ఆఫీసుకే వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం ఏ EPFO కార్యాలయాన్ని అయినా సందర్శించవచ్చు. గతంలో బ్రోకర్లపై ఆధారపడాల్సి వచ్చేది లేదా మీరే క్లిష్టమైన ప్రక్రియను ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇకపై EPF సువిధ ప్రొవైడర్లు పూర్తి మార్గనిర్దేశం చేస్తారు. KYC కారణంగా డబ్బు నిలిచిపోవడం వంటి సమస్యలు తగ్గి, డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా వేగంగా పరిష్కారం లభిస్తుంది.
EPFOలో తీసుకొస్తున్న ఈ సంస్కరణలు పీఎఫ్ ఖాతాదారులకు నిజమైన ఊరటను కలిగించేలా ఉన్నాయి. తక్కువ సమయం.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కువ పారదర్శకత అందించడమే ఇదే ఈ కొత్త వ్యవస్థ లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Explanation for the Rise in Silver Prices: బంగారం.. కాదు.. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది వెండి. బంగారాన్ని పక్కకు నెట్టి వెండి జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డులు బద్దలు కొడుతోంది. కిలో వెండి ధర రూ. 2.75లక్షలు ఉంది. రాబడి పరంగా చూస్తే.. వెండి బంగారాన్ని మాత్రమే కాదు ఈక్విటీ మార్కెట్లను కూడా వెనక్కి నెట్టేసింది. అయితే.. ఈ పెరుగుదల చూసి చాలామందికి ఇది కేవలం ఊహాజనిత బుడగేనా అనే అనుమానం వస్తోంది. కానీ లోతుగా పరిశీలిస్తే.. వెండి ధరల ర్యాలీకి వెనుక చాలా బలమైన, దీర్ఘకాలిక కారణాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇది కేవలం ఇన్వెస్టర్ల భావోద్వేగాల వల్ల వచ్చిన పెరుగుదల కాదు.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న పారిశ్రామిక అవసరాల ఫలితమని చెప్పవచ్చు. వెండి వెలుగుల వెనుకున్న ఐదు రంగా గురించి తెలుసుకుందాం. డిమాండ్ ఇలాగే కొనసాగినట్లయితే కిలో వెండి ధర రూ. 6లక్షలకు చేరుకోవడం ఖాయమని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.
ప్రస్తుతం వెండి డిమాండ్ను ముందుకు నడిపిస్తున్న ఐదు కీలక రంగాలు ఉన్నాయి. ఇవి ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా అత్యంత అవసరమైన రంగాలు కావడం విశేషం. ఈ రంగాలు బలంగా ఉన్నంతకాలం వెండికి డిమాండ్ తగ్గే అవకాశమే లేదు.
సౌర విద్యుత్ రంగం:
ప్రపంచం మొత్తం గ్రీన్ ఎనర్జీ వైపు మళ్లుతున్న నేపథ్యంలో.. సౌర విద్యుత్ రంగం వెండికి అతిపెద్ద డిమాండ్ కేంద్రంగా మారింది. ఒక సౌర ప్యానెల్ తయారీలో సగటున 15 నుంచి 20 గ్రాముల వెండిని ఉపయోగిస్తారు. గత నాలుగేళ్లలో సౌర రంగం నుంచి వచ్చే వెండి డిమాండ్ రెండింతలు పెరిగింది. 2020లో సుమారు 94 మిలియన్ ఔన్సులుగా ఉన్న డిమాండ్.. 2024 నాటికి 240 మిలియన్ ఔన్సులకు పైగా చేరింది. భారత్ కూడా ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తోంది. దేశం ఇప్పటికే 100 గిగావాట్లకు పైగా సౌర సామర్థ్యాన్ని సాధించింది. 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర శక్తి లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈ వేగంతో చూస్తే, భవిష్యత్తులో ప్రపంచ వెండి డిమాండ్లో సౌర రంగం వాటా మరింత పెరగనుంది.
ఎలక్ట్రిక్ వాహనాల రంగం:
పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే.. ఎలక్ట్రిక్ వాహనాల్లో వెండి వినియోగం రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. బ్యాటరీలు, వైర్లు, కనెక్టర్లు, పవర్ కంట్రోల్ యూనిట్లలో వెండి కీలక పాత్ర పోషిస్తుంది. ఒక ఎలక్ట్రిక్ కారుకు సగటున 25 నుంచి 50 గ్రాముల వెండి అవసరం అవుతుంది. అంతేకాదు, ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లకు కిలోల కొద్దీ వెండి అవసరం అవుతోంది. భారతదేశం 2030 నాటికి తన ప్రైవేట్ వాహనాల్లో 30 శాతం EVలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల, వెండి డిమాండ్ మరింత పెరగడం ఖాయం.
ఎలక్ట్రానిక్స్ , AI డేటా సెంటర్లు:
డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు డేటా సెంటర్లు ప్రాణం. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, పవర్ డిస్ట్రిబ్యూషన్ ఇలా అన్ని రంగాల్లో వెండి కీలక లోహంగా మారింది. భారత్లో రిలయన్స్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు భారీ AI డేటా సెంటర్లను నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులు వెండి వినియోగాన్ని గణనీయంగా పెంచుతున్నాయి. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా వెండి సరఫరా డిమాండ్ను తట్టుకోలేకపోతోంది. 2024లో డిమాండ్ 1.16 బిలియన్ ఔన్సులు ఉండగా.. ఉత్పత్తి మాత్రం 820 మిలియన్ ఔన్సులకే పరిమితమైంది.
వైద్య, ఆరోగ్య సంరక్షణ రంగం:
వెండికి ఉన్న యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాల వల్ల, ఇది వైద్య పరికరాల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. కాలిన గాయాల డ్రెస్సింగ్లు, శస్త్రచికిత్స పరికరాలు, కాథెటర్లు, ఇంప్లాంట్లు ఇలా అన్నింటిలో వెండి పూతలు వాడుతున్నారు. భారతదేశంలో ఆరోగ్య రంగం వేగంగా విస్తరిస్తుండటంతో, వెండి ఆధారిత వైద్య ఉత్పత్తుల డిమాండ్ కూడా పెరుగుతోంది.
5G భవిష్యత్తు 6G మౌలిక సదుపాయాలు:
5G టెక్నాలజీకి అత్యుత్తమ విద్యుత్ వాహకత అవసరం. అది వెండిలో ఉంది. యాంటెనాలు, బేస్ స్టేషన్లు, సర్క్యూట్ బోర్డులు, స్విచ్లలో వెండి తప్పనిసరి. భారత్ ఇప్పటికే లక్షల సంఖ్యలో 5G టవర్లను ఏర్పాటు చేసింది. 2030 నాటికి దాదాపు బిలియన్ మంది 5G వినియోగదారులు ఉండనున్నారని అంచనా.
మొత్తంగా చూస్తే.. వెండి ధరల ర్యాలీ వెనుక ఊహాగానాల కంటే బలమైన పారిశ్రామిక అవసరాలే ప్రధాన కారణమని చెప్పవచ్చు. సరఫరా పరిమితంగా ఉండగా.. డిమాండ్ మాత్రం బహుళ రంగాల నుంచి వేగంగా పెరుగుతోంది. అందుకే వెండి పెరుగుదల ఒక తాత్కాలిక ట్రెండ్ కాకుండా, దీర్ఘకాలిక నిర్మాణాత్మక మార్పుగా కనిపిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Huge Python Video Watch Now: ప్రకృతి ఒడిలో సరదాగా గడపాలనుకొని ఆశతో వెళ్లిన పర్యటకులకు చేదు అనుభవం ఏర్పడింది. పచ్చని చెట్ల మధ్యల పారేటి సెలయేటిలో ఎంజాయ్ చేస్తున్న సమయంలో యముడిలా ఓ భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఈ భయానకరమైన దృశ్యాలకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. సాధారణంగా ప్రకృతిలో ఇలాంటి ప్రమాదకరమైన పాములు ఉండడానికి సర్వసాధారణం. కానీ జనాల అలికిడి ఉన్న ప్రాంతాల్లోకి ఇలా ఒక్కసారిగా రావడం భయాందోళనకు గురి చేసేలా చేస్తుంది. అయితే, తాజాగా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ముగ్గురు యువకులు దట్టమైన అడవి ప్రాంతంలో ప్రవహిస్తున్న నీటి ప్రవాహం వద్దకి సరదాగా గడిపేందుకు వెళ్లారు. ఒక యువకుడు ఆ నీటిలో ఆనందంతో ఈత కొడుతూ ఉండడం.. మరో యువకుడు ఒడ్డున ఉన్న రాయిపై కూర్చుని ఉండడం మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. అలాగే మూడవ యువకుడు ఒడ్డున నిలబడి నీటిలోకి దూకేందుకు చూస్తూ ఉన్నాడు. చుట్టూ ఉన్న పచ్చదనంతో పాటు స్వచ్ఛమైన నీరు వారిని ఎంతగానో అలరిస్తోంది. అయితే, ఈ ప్రశాంతత ఎంతో సేపు లేకుండా పోయింది.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
అంతా సాఫీగా సాగిపోతున్న క్రమంలో నదికి చాలా దగ్గరగా ఉన్న ఒడ్డున ఉన్న పొదల నుంచి ఓ భారీ కొండచిలువ ఒక్కసారిగా బయటికి రావడం వీడియోలో చూడొచ్చు. ఆ పాము పరిమాణం చూస్తే వెన్నులో వణుకు రావడం ఖాయం.. అయితే, ఆ ఒడ్డున ఉన్న యువకుడిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీనిని ముందుగానే గమనించిన ఆ యువకుడు వెంటనే ఒక్కసారిగా నీటిలో దూకాడు. ఒక నిమిషం పాటు అక్కడ ఏం జరిగిందో అర్థం కాక.. ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని నీటిలో నుంచి వారంతా అవతలి బొడ్డుకి వెళ్లేందుకు ప్రయత్నించారు.
అంతేకాకుండా దీనిని అంతా గమనించి ముందుగానే ఆ పాముని చూసిన ఒక యువకుడు మాత్రం భయంతో కేకలు వేస్తూ ఒడ్డుకు చేరుకున్నాడు. దీని అందరూ అనుసరించి.. ఆ నీటిలో నుంచి ఒడ్డుకు వెళ్ళిపోయారు.. అయితే, ఆ పాము వారి కేకలు విని వెంటనే పొదల్లోకి వెళ్లిపోయింది. దీంతో ఆ యువకులంతా ఒక్కసారిగా ఊపిరి పెళ్లి చేసుకున్నారు. 12 సెకండ్ల నిడివి గల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోని ఎవరు తీసారో తెలియదు కానీ ఇప్పుడు ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది.. దీనిపై కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇది నిజమైన వీడియో కాదని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సృష్టించిందని అంటున్నారు. అయితే ఇది అసలైన వీడియోను కాదో తెలుసుకోవడానికి తప్పకుండా ప్యాక్ చెక్ చేయాల్సిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Husband Kills Wife: నేటి కాలంలో కుటుంబం గడవాలంటే.. భార్య భర్తలు ఉద్యోగాలు చేస్తే ఆర్థిక ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. అందుకే చాలా మంది మహిళలు.. ఇంటి పనులు చూసుకుంటూ.. ఉద్యోగాలు చేస్తున్నారు. కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. అయితే మహిళలపై జరుగుతున్న ఘటనలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. తాజాగా బెంగళూరులో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన మరోసారి కుటుంబ సంబంధాల్లో పెరుగుతున్న అనుమానాలు, ఆగ్రహం ఎంతటి వినాశనానికి దారి తీస్తుందో.. స్పష్టంగా చూపించింది. భార్య ఉద్యోగంపై అనుమానాలు, విభేదాలు చివరికి హత్యగా మారి.. ఆ కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేసింది.
అగ్రహార లేఅవుట్లో నివసిస్తున్న ఆయేషా సిద్ధిఖీ (39) ఒక మసాజ్ పార్లర్లో పనిచేస్తోంది. ఆ ఉద్యోగమే ఆమె జీవితాన్ని బలిగొన్నది. ఆమె భర్త సయ్యద్ జబీకి భార్య మసాజ్ పార్లర్ లో ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. ఇదే విషయం గురించి దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని పోలీసులు చెబుతున్నారు. ఆయేషా ఉద్యోగం మానేయాలని జబీ పదే పదే ఒత్తిడి చేయడం.. ఆమె మాత్రం కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పని కొనసాగించడం వల్ల వారి మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి.
మంగళవారం రాత్రి కూడా అదే విషయం మీద ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. మాటలు కాస్తా పెరిగి.. తీవ్ర వాగ్వాదంగా మారాయి. క్షణికావేశానికి లోనైన సయ్యద్ జబీ తనలోని ఆగ్రహాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. ఆ క్షణంలో తీసుకున్న నిర్ణయం భార్యను అంతమొందించింది. కిచెన్లో ఉన్న కత్తిని తీసుకుని భార్యపై దాడి చేసి.. ఆమె గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
భార్యను హతమార్చిన తర్వాత జబీ అక్కడి నుంచి నేరుగా సంపిగెహళ్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. నేనే నా భార్యను చంపేశాను అంటూ పోలీసులకు లొంగిపోవడం అక్కడి సిబ్బందిని కూడా షాక్కు గురిచేసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో మృతదేహంగా గుర్తించారు.ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇది కేవలం ఉద్యోగ వివాదమేనా? లేక ఇతర కారణాలు కూడా ఉన్నాయా ? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆయేషా మృతితో వారి కుటుంబం పూర్తిగా విచ్ఛిన్నమైంది.
ఇలాంటి సంఘటనలు నేటి సమాజంలో భార్యాభర్తల మధ్య అనుమానాలు, సహనం లోపించడం ఎంత ప్రమాదకరమో గుర్తు చేస్తున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు జీవితాలను, కుటుంబాలను ఎలా నాశనం చేస్తున్నాయో ఈ బెంగళూరు హత్య కేసు ఒక విషాదకర ఉదాహరణగా నిలిచింది.
Also Read: Copper Price: బంగారం కాదు, వెండి అంతకన్నా కాదు.. మార్కెట్లో ఇప్పుడు ఈ లోహమే కింగ్..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Gold Rate Today: గత కొంతకాలంగా.. బంగారం, వెండి ధరలు రోజుకో కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. వరుసగా 6 రోజులుగా కొనసాగుతున్న ఈ ర్యాలీ శనివారం మరింత వేగం పుంజుకుంది. ఈ నెలలో మాత్రమే బంగారం ధరలు సుమారు 7 శాతం పెరిగితే, వెండి ధరలు ఏకంగా రూ.2.5 లక్షల మార్కును దాటడం మార్కెట్లలో చర్చనీయాంశంగా మారింది.
గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ సమాచారం ప్రకారం.. ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,220గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,450 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికి వస్తే, ఒక్క రోజులోనే భారీ ఎగబాకి కిలో వెండి ధర దాదాపు రూ.11 వేల పెరుగుదలతో రూ.2,51,000కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లలోనూ పసిడి, వెండి ధరలు ఆల్టైమ్ రికార్డులను నమోదు చేశాయి. స్పాట్ గోల్డ్ ధర ఒక్కరోజులోనే సుమారు 1.2 శాతం పెరిగి 4,549 డాలర్లను తాకింది. ఇదే సమయంలో వెండి ధర దాదాపు 9 శాతం పెరిగి ఒక ఔన్స్కు 78.65 డాలర్ల స్థాయికి చేరింది. సరఫరా లోటు, పెరుగుతున్న పారిశ్రామిక అవసరాలే వెండి ధరలకు ప్రధానంగా ఊతమిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
1979 తర్వాత ఒకే సంవత్సరంలో బంగారం ఇంత స్థాయిలో లాభాలను ఇవ్వడం ఇదే తొలిసారి అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అసలు బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అనే ప్రశ్నకు పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు పెరగడం ప్రధాన కారణంగా మారింది. 2026లో రెండు సార్లు వడ్డీ రేట్ల కోత ఉండొచ్చన్న అంచనాలు ఇప్పటికే మార్కెట్లో బలంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఈ నెలలోనే ఫెడ్ 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గించింది. వడ్డీ రేట్లు తగ్గితే ట్రెజరీ బాండ్లపై రాబడులు తగ్గిపోతాయి. అప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన బంగారం వంటి ఆస్తుల వైపు మొగ్గు చూపుతారు.
ఇక అంతర్జాతీయంగా డాలర్ విలువ బలహీనపడటం కూడా బంగారం ధరల పెరుగుదలకు మరో ప్రధాన కారణం. డాలర్ బలహీనంగా ఉన్నప్పుడు బంగారం విలువ పెరగడం సహజం. ఇది అమెరికా ఆర్థిక పరిస్థితులపై అనిశ్చితిని సూచిస్తుండటంతో, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షిత మార్గాల్లోకి మళ్లిస్తున్నారు.
దీనికితోడు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు కూడా లోహాల ధరలకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్–రష్యా మధ్య మళ్లీ చెలరేగుతున్న ఉద్రిక్తతలు, క్షిపణి దాడులు, ఆఫ్రికాలో అమెరికా చేపట్టిన వైమానిక చర్యలు వంటి పరిణామాలు బంగారం, వెండి వంటి సేఫ్ హావెన్ ఆస్తులపై డిమాండ్ను పెంచుతున్నాయి.వెండి ధరల పెరుగుదల వెనుక కూడా బలమైన కారణాలున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో అంటే 2025 జనవరి 1న కిలో వెండి ధర కేవలం రూ.80,000 మాత్రమే. కానీ ప్రస్తుతం అదే వెండి ధర రూ.2.5 లక్షల స్థాయికి చేరింది. అంటే ఒక్క ఏడాదిలోనే దాదాపు 167 శాతం పెరుగుదల నమోదైంది. అంతర్జాతీయంగా వెండి ధర ఒక ఔన్స్కు 77 డాలర్లను దాటింది.
వెండి సరఫరాలో లోటు ఉండటం, అమెరికా ఇటీవల వెండిని ‘క్రిటికల్ మినరల్’గా గుర్తించడం వల్ల పారిశ్రామిక డిమాండ్ భారీగా పెరగడం ఈ ర్యాలీకి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. దీనికితోడు పెట్టుబడిదారుల ఆసక్తి కూడా వెండిపై మరింత పెరిగింది. నిజానికి 2026లో వెండి ధర ఒక ఔన్స్కు 70 డాలర్లకు చేరుతుందని గతంలో అంచనా వేశారు. కానీ 2026 ప్రారంభం కాకముందే ఆ అంచనాలను దాటేయడం మార్కెట్లను ఆశ్చర్యపరుస్తోంది. జానర్ మెటల్స్కు చెందిన ప్రముఖ విశ్లేషకుడు పీటర్ గ్రాంట్ సిఎన్బీసీకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, వెండి ధర త్వరలోనే 80 డాలర్ల లక్ష్యాన్ని కూడా తాకే అవకాశం ఉందని అంచనా వేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
US-Taiwan Arms Deal Fallout: అమెరికాకు దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చింది చైనా. భారీ మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా ఉండూ అంటూ హెచ్చరికలు జారీ చేసింది. చైనా ఆగ్రహానికి కారణం..తైవాన్ కు అమెరికా ఆయుధాలను విక్రయించడం సహించలేకపోయింది. 20 అమెరికా రక్షణ కంపెనీలు.. 10 మంది సీనియర్ అధికారులపై చైనా ఆంక్షలు విధించింది. ఇది వన్ చైనా సూత్రానికి విరుద్ధమని.. తైవాన్ అంశం చైనా అమెరికా సంబంధాల్లో రెడ్ లైన్ అంటూ బీజింగ్ హెచ్చరికలు జారీ చేసింది.
తైవాన్కు అమెరికా భారీ స్థాయిలో ఆయుధాలు విక్రయించడంపై చైనా తీవ్రంగా స్పందించింది. ఈ ఆయుధ ఒప్పందాన్ని తన సార్వభౌమత్వానికి.. జాతీయ భద్రతకు నేరుగా సవాల్గా భావించిన బీజింగ్.. అమెరికా రక్షణ రంగానికి చెందిన కంపెనీలు, సీనియర్ అధికారులపై కఠిన ఆంక్షలు ప్రకటించింది. ఈ చర్యలు వెంటనే అమల్లోకి వస్తాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
చైనా ప్రకటన ప్రకారం.. మొత్తం 20 అమెరికా రక్షణ కంపెనీలపై ఆంక్షలు విధించింది. వీటిలో నార్త్రోప్ గ్రుమ్మన్, బోయింగ్కు చెందిన విభాగాలు, L3హారిస్ మారిటైమ్ సర్వీసెస్, VSE కార్పొరేషన్, రెడ్ క్యాట్ హోల్డింగ్స్, టీల్ డ్రోన్స్, రీకాన్క్రాఫ్ట్, డెడ్రోన్ హోల్డింగ్స్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. ఈ కంపెనీలకు చెందిన చైనా లోపల ఉన్న చరాస్తులు, స్థిర ఆస్తులన్నింటినీ స్తంభింపజేశారు. ఇకపై చైనా కంపెనీలు లేదా వ్యక్తులు ఈ సంస్థలతో వ్యాపారం చేయడం.. ఒప్పందాలు కుదుర్చుకోవడం పూర్తిగా నిషేధమని పేర్కొంది.
అదేవిధంగా.. 10 మంది అమెరికా సీనియర్ అధికారులపై కూడా చైనా నిషేధాలు విధించింది. ఇందులో అందూరిల్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు పామర్ లక్కీతో పాటు.. L3Harris, VSE కార్పొరేషన్ వంటి సంస్థల కీలక నిర్వాహకులు ఉన్నారు. వీరిపై చైనాలో ప్రవేశ నిషేధం ఉండటమే కాకుండా.. వారి వ్యాపార కార్యకలాపాలపై కూడా కఠిన పర్యవేక్షణ ఉంటుందని చైనా తెలిపింది.
అసలు చైనా ఎందుకు ఇంత తీవ్రంగా స్పందించింది? దీని వెనకున్న కారణం ఏంటి? అంటే.. దీనికి కేంద్రబిందువే తైవాన్. చైనా తైవాన్ను తన భూభాగంలో భాగంగానే చూస్తోంది. వన్-చైనా సూత్రం ప్రకారం.. ప్రపంచంలో ఒకే చైనా ఉందని.. తైవాన్ కూడా దానిలో భాగమేనని బీజింగ్ అభిప్రాయం పడుతోంది. ఈ నేపథ్యంలో.. అమెరికా తైవాన్కు ఆయుధాలు సరఫరా చేయడం చైనా–అమెరికా మధ్య కుదిరిన మూడు సంయుక్త ఒప్పందాలకు (జాయింట్ కమ్యూనిక్స్) విరుద్ధమని చైనా వాదిస్తోంది.
Also Read: China Gen-Z: చైనా Gen-Z విషపూరిత పాములను ఎందుకు కొంటున్నారు? ఈ పైత్యానికి కారణమేంటి..?
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ.. తైవాన్ అంశం చైనా కోర్ ఇంటరెస్ట్ అని స్పష్టం చేశారు. ఇది చైనా–అమెరికా సంబంధాలలో ఒక రెడ్ లైన్ అని.. ఈ విషయంపై జోక్యం చేసుకునే ఎవరైనా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తైవాన్కు ఆయుధాలు అమ్మే కంపెనీలు లేదా వ్యక్తులు తప్పకుండా మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన స్పష్టంగా చెప్పారు.
అమెరికా తైవాన్కు ఆయుధాలు పంపడం వల్ల తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరుగుతాయని చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి చర్యలు ప్రాంతీయ శాంతి.. స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని బీజింగ్ అభిప్రాయపడుతోంది. అందుకే, తైవాన్కు ఆయుధ సరఫరాను వెంటనే నిలిపివేయాలని, పరిస్థితిని మరింత రెచ్చగొట్టే చర్యలకు దూరంగా ఉండాలని చైనా అమెరికాను కోరింది.
తన సార్వభౌమత్వం, భద్రత, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చైనా స్పష్టం చేసింది. అమెరికా–తైవాన్ ఆయుధ ఒప్పందాలపై చైనా తీసుకున్న ఈ కఠిన వైఖరి.. భవిష్యత్తులో ఈ మూడు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాన్ని సూచిస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
America Warns India: భారత్, చైనా మధ్య అరుణాచల్ ప్రదేశ్ కు సంబంధించిన వివాదం నడుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని చైనా వాదిస్తోంది. కాదు.. కాదు.. అరుణాచల్ ప్రదేశ్.. అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ భారత భూభాగమే అని విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. అయితే చైనా ..ఈ విషయంలో తరచుగా భారత్ ను కెలికే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ తరుణంలోనే ఈ అంశానికి సంబంధించి చైనా నుంచి భారత్ కు ప్రమాదం పొంచి ఉందని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది.
అగ్రరాజ్యం అమెరికా తాజాగా విడుదల చేసిన ఓ కీలక రిపోర్టులో భారత్ కు హెచ్చరిక జారీ చేసింది. చైనా, అరుణాచల్ ప్రదేశ్ ను తైవాన్ స్థాయిలోనే అత్యంత కీలకమైన ప్రాంతంగా భావిస్తుందని.. రానున్న కాలంలో ఇదే అంశం భారత్, చైనా మధ్య యుద్ధానికి కారణం కావచ్చని యూఎస్ పెంటగాన్ తన నివేదికలో పేర్కొంది. ఈ రిపోర్టు ప్రకారం.. చైనా తన దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే తైవాన్, దక్షిణ చైనా సముద్రం, అరుణాచల్ ప్రదేశ్ ను ఒకే సరసన పెట్టి చూస్తోంది. అయితే పెంటగాన్ అంచనాల ప్రకారం.. 2019 నాటికి గ్రేట్ నేషనల్ రిజువనేషన్ అనే లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పంతో చైనా ఉంది. ఆ లక్ష్యంలో భాగంగానే..ప్రపంచంలోనే ప్రధాన శక్తిగా ఎదగడంతోపాటు.. అవసరమైతే యుద్ధాలను గెలిచే శక్తివంతమైన సైన్యాన్ని నిర్మించడంపై బీజింగ్ ఫోకస్ పెట్టింది.ఈ క్రమంలోనే.. సరిహద్దు వివాదాలు ఉన్న ప్రాంతాలను చైనా తన కోర్ ఇంటరెస్ట్స్ గా ప్రకటిస్తూ.. వాటిపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ కూడా అందులో ఒకటిగా ఉందని అమెరికా నివేదిక స్పష్టం చేసింది.
అరుణాచల్ ప్రదేశ్ భారత భాగమేనని.. గతంలోనూ.. ఇప్పుడూ.. భవిష్యత్తులోనూ అలాగే ఉంటుందని భారత్ పదేపదే ప్రకటిస్తోంది. అయితే చైనా మాత్రం దీన్ని పెడచెవిన పెడుతోంది. 1914లో బ్రిటిష్ ఇండియా, టిబెట్ మధ్య కుదిరిన మెక్మహాన్ లైన్ను చైనా అధికారికంగా ఒప్పుకోలేదు. అందుకే అరుణాచల్ ప్రదేశ్ను దక్షిణ టిబెట్ లేదా జాంగ్నాన్ అని పిలుస్తోంది. మొదట్లో ఈ వాదన తవాంగ్ ప్రాంతానికే పరిమితమై ఉంది. కానీ.. క్రమంగా మొత్తం అరుణాచల్ ప్రదేశ్ను తనదిగా పేర్కొనే స్థాయికి చైనా వెళ్లిందని నివేదిక చెబుతోంది.చైనా తరచూ అరుణాచల్ ప్రదేశ్లోని గ్రామాలు, పట్టణాలకు కొత్త పేర్లు పెట్టి ప్రకటించడం కూడా ఈ ఒత్తిడి వ్యూహంలో భాగమేనని అమెరికా అభిప్రాయపడుతోంది. ఇది కేవలం మాటల యుద్ధం మాత్రమే కాదు.. భవిష్యత్తులో సరిహద్దు వద్ద ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని నివేదిక హెచ్చరిస్తోంది.
ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు కూడా ఈ వివాద తీవ్రతను చూపిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన భారత పౌరురాలు ప్రేమా థాంగ్డోక్ను షాంఘై విమానాశ్రయంలో దాదాపు 18 గంటల పాటు నిర్బంధించారు. ఆమె పాస్పోర్ట్లో జన్మస్థలంగా అరుణాచల్ ప్రదేశ్, ఇండియా అని ఉండటమే దీనికి కారణం. ఆ సమయంలో ఆమెకు ఆహారం, ఇతర సౌకర్యాలు కూడా కల్పించలేదని సమాచారం. భారత కాన్సులేట్ జోక్యం చేసుకున్న తర్వాత మాత్రమే ఆమెను విడుదల చేశారు. అలాగే.. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో భాగమని చెప్పిన ఒక యూట్యూబర్ను కూడా చైనా అధికారులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది.
ఈ మొత్తం వ్యూహంలో పాకిస్తాన్ పాత్ర కూడా ఉందని అమెరికా నివేదిక పేర్కొంది. భారత్పై ఒత్తిడి పెంచేందుకు చైనా పాకిస్తాన్ను ఒక సాధనంగా ఉపయోగిస్తోందని.. సరిహద్దులో శాంతి పేరుతో ఒకవైపు, పాకిస్తాన్ ద్వారా మరోవైపు ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందని అంచనా వేసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ చైనా తయారీ ఆయుధాలను ఉపయోగించిందన్న అంశాన్ని కూడా నివేదిక ప్రస్తావించింది.
మొత్తంగా.. అరుణాచల్ ప్రదేశ్పై చైనా చేస్తున్న దావాలు కేవలం భూభాగ వివాదం మాత్రమే కాదని.. అది చైనా ప్రపంచ వ్యూహంలో భాగమని అమెరికా స్పష్టం చేస్తోంది. ఇదే కారణంగా.. రాబోయే కాలంలో అరుణాచల్ ప్రదేశ్ భారత్–చైనా మధ్య పెద్ద ఘర్షణకు కేంద్ర బిందువుగా మారే ప్రమాదం ఉందని ఈ నివేదిక హెచ్చరిస్తోంది.
Also Read: China Gen-Z: చైనా Gen-Z విషపూరిత పాములను ఎందుకు కొంటున్నారు? ఈ పైత్యానికి కారణమేంటి..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Giant Anaconda Video Watch: సోషల్ మీడియా యుగంలో వింతలు విశేషాలకు సంబంధించిన దృశ్యాలు మనం రోజు చూస్తూ ఉంటాం. ముఖ్యంగా కొన్ని పాములతో పాటు జంతువులకు సంబంధించిన వింత వీడియోలు ఎంతో ఆసక్తిగా చూస్తాం. అలాగే కొంతమంది జంతువులను పట్టుకుంటున్న సమయంలో కూడా తీసిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. మరి కొంతమంది పాములను పట్టుకుంటున్న సందర్భంలో తీసిన వీడియోలను కూడా పోస్ట్ చేస్తే జనాలు వైరల్ చేస్తున్నారు. ఇలా పాములకు సంబంధించిన వీడియోలైతే జనాలు ఎంతో ఇష్టంగా చూస్తున్నారు.. తాజాగా కూడా ఇలాంటి పాములకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే ద రెప్టైల్ జూ (The Reptile Zoo) అనే యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేసిన వీడియో ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తుంది. చాలామంది చిన్న పాములను చూసి వాటికి ఆమెడ దూరం పరిగెడతారు.. అలాంటిది ఈ వీడియోలో ఓ మహిళ ఏకంగా ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ పాములను నీటిలో నుంచి బయటికి తీస్తోంది. అంతేకాకుండా వాటితో ఆమె ముద్దు ముద్దుగా ఆడుకుంటుంది. ఇప్పుడు ఈ దృశ్యాలే సోషల్ మీడియాలో నెటిజన్స్ను ఆకట్టుకుంటున్నాయి.
వీడియో వివరాల్లోకి వెళితే..జూ కీపర్ జూలియట్ బ్రూవర్ పాములకు ప్రత్యేకంగా తయారుచేసిన ఎన్క్లోజర్ నుంచి అత్యంత భారీ అనకుండా లను ఒక్కొక్కటిగా బయటికి తీసుకురావడం మీరు చూడొచ్చు. ఆమె మొదటగా ఆ ఎన్క్లోజర్లో ఉన్న నీటిలో నుంచి అత్యంత భారీ అనకుండాను బయటికి తీసింది. అంతేకాకుండా బయటికి తీస్తున్న సమయంలో వీడియోకి చూపించడం కూడా మీరు గమనించవచ్చు. అలాగే ఆ వెంటనే ఆశ్చర్యకరంగా మరో పామును బయటకు తీసింది. ఇలా ఆ యువతి వెంట వెంటనే వరుసగా ఐదు అనకొండ పాములను బయటికి తీసి నేలపై ఉంచింది. ఆమె వాటిని అందులో నుంచి ఎత్తి బయటికి తీయడం ఎంతో శ్రమతో కూడుకున్న పని అని తెలుస్తోంది.
అయితే, ఇదే సమయంలో ఆమె అనకొండ గురించి చెబుతూ వచ్చింది.. అనకొండల చర్మం కొంచెం నీలిరంగులో మెరుస్తూ ఉంటుందని.. అలాంటి సమయంలోనే కుబుసం విడిచేందుకు సిద్ధమైందని ఆమె వీడియోలో వివరించింది. వీడియో చివరిలో.. ఆ ఐదు పాములు ఒకే చోట పెద్ద కుప్పగా ఏర్పడడం చూస్తుంటేనే..ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇవి చూడడానికి చాలా భయంకరంగా ఉన్నప్పటికీ ఆ యువతి ఏ మాత్రం భయపడకుండా స్వీట్ గర్ల్ అంటూ పిలుస్తూ ఎంతో ప్రేమగా చూసుకోవడం విశేషం. ఇప్పుడు ఈ దృశ్యాలు చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు వారి అభిప్రాయాలు రకరకాలుగా కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Motorola Signature Series Launch Date In India: ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ మోటోరోలా మరోసారి మార్కెట్ను కుదిపేసేందుకు సిద్ధమైంది. తమ కొత్త సిగ్నేచర్ సిరీస్ను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు వార్తలు విపరీతంగా వస్తున్నాయి. దీనిని కంపెనీ ఫ్లాగ్షిప్ ఫీచర్లతో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది మోటార్లకు మొట్టమొదటి ఫ్లాగ్షిప్ ఫోన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరుగుతోంది. అయితే, కంపెనీ దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా.. కొన్ని లీకైన ఫీచర్లు మాత్రం ఇది ప్రీమియం ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలియజేస్తోంది. అంతేకాకుండా ఇటీవల ఈ స్మార్ట్ఫోన్ బెంచ్మార్క్ ప్లాట్ఫామ్లలో కూడా కనిపించడంతో విడుదలకు సిద్ధమైందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మోటరోలా సిగ్నేచర్ సిరీస్ మొబైల్స్ ఫ్లాగ్షిప్ డిజైన్తో పాటు ఫీచర్లతో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన టీజర్ను ఫ్లిప్కార్ట్లో రన్ చేస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ సిరీస్కు సంబంధించిన డిజైన్ కూడా త్వరలో వెల్లడించబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ సిగ్నేచర్ సిరీస్తో పాటు కంపెనీ మరికొన్ని పరికరాలను కూడా విడుదల చేసేందుకు యోచిస్తోందని సమాచారం.. ముఖ్యంగా ఇప్పటికే ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన కొన్ని ఫీచర్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. ఇక ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 5 చిప్సెట్ ప్రాసెసర్తో విడుదల చేయబోతోంది.
Also Read: Honor Power 2 5G మొబైల్ త్వరలో వచ్చేస్తోంది.. ఫీచర్స్ మొత్తం అదుర్స్!
అంతేకాకుండా ఈ స్మార్ట్ఫోన్ 8జిబి ర్యామ్ బేస్ వేరియంటులో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది 6.7-అంగుళాల OLED డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీని స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్టును కూడా కలిగి ఉంటుంది. అలాగే ఈ మొబైల్ డిజైన్ చూడడానికి ఇటీవల మార్కెట్లోకి విడుదలైన మోటరోలా ఎడ్జ్ 70 మొబైల్ మాదిరిగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వెనక భాగంలో త్రిపుల్ కెమెరా సెటప్ను కలిగి ఉంటుంది. ఇందులోని మూడు కెమెరాలు 50MPతో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. దీనిని కంపెనీ ప్రపంచవ్యాప్తంగా జనవరిలో విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా డిసెంబర్ చివరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో ఈ మొబైల్కు సంబంధించిన ఫీచర్స్ ను కూడా అధికారికంగా వెల్లడించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సిగ్నేచర్ సిరీస్ మొబైల్ ఫ్లాగ్ షిప్ ఫీచర్లతో అందుబాటులోకి రాబోతోంది. కాబట్టి ధరలు కూడా కాస్త ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది విడుదలైన వెంటనే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్లో సేల్కి అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ మొబైల్ ధరపై ప్రత్యేకమైన ఫ్లాట్ డిస్కౌంట్తో పాటు బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించే అవకాశాలు ఉన్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి విడుదల అయితే సాంసంగ్, రెడ్మీ, రియల్ మీ, వన్ ప్లస్ ప్రీమియం ఫీచర్స్ కలిగిన మొబైల్స్తో పోటీపడే అవకాశాలున్నాయి.
Also Read: Honor Power 2 5G మొబైల్ త్వరలో వచ్చేస్తోంది.. ఫీచర్స్ మొత్తం అదుర్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook