Andhra Pradesh Rain Alert: రానున్న 24 గంటల్లో ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.
మరోవైపు నిన్న దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. అలాగే ఉత్తర కోస్తాలో పొగమంచు కురుస్తుందని, 2-3డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని తెలిపింది. మరోవైపు ఏపీలో చలి తీవ్రత ఇంకా తగ్గలేదు. సంక్రాంతి తర్వాత చలి తగ్గుతుందని అంచనా వేసినా.. అనూహ్యంగా మళ్లీ చలిపులి పెరిగింది.
Read more: సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!
Read more: సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..
చలితో పాటు ఉదయం 7 గంటలు అయ్యేంత వరకు సూర్యుడు కనిపించంచడం లేదు. మరోవైపు పొగమంచు కారణంగా ఉదయం పూట వాహనాదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు కనబడకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వారం పది రోజులు పరిస్థితులు ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Rats in annavaram Prasadam Basket: పవిత్ర క్షేత్రం అన్నవరంలో దారుణ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతినిత్యం ఏదో వివాదానికి పుణ్యక్షేత్రం కేంద్ర బిందువుగా మారుతోంది. సత్యదేవును ప్రసాదంపై ఎలుకలు తిరగడం కలకలం రేపుతోంది. సాక్షాత్తూ ప్రసాద విక్రయ కేంద్రంలో కళ్లెదురుగా ఎలుకలు ఇష్టారీతిన తిరుగుతున్నా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఓ భక్తుడు హైవే వద్దనున్న ప్రసాదం కౌంటర్లో ప్రసాదం తీసుకునేందుకు వెళ్ళగా ఎలుకలు అందులోంచి బిలబిలమంటూ బయటికి రావడంతో భయానికి గురయ్యారు. దీనిపై ప్రశ్నిస్తే సిబ్బంది నిర్లక్ష్యంగా బదులిచ్చారు.
భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. దీంతో ఆలయ ఈవో త్రినాథరావు తక్షణం చర్యలకు ఆదేశించారు. పాత నమూనాలయం వద్ద పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి తాత్కాలికంగా తొలగించాలని ఆదేశించారు. మొత్తంగా ఎలుకలు తిండి పదార్ధాలు ఎక్కడున్న అక్కడ వాలిపోతాయి.
Read more: సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!
Read more: సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..
అది గుడి కావొచ్చు.. ఏదైనా తినుబండారాలకు సంబంధించిన హోటల్ కావొచ్చు. అక్కడ ఎప్పటికపుడు పరిశుభ్రత పాటించడం మూలానా.. ఇలాంటి వాటిని అరికట్టవచ్చు. మరి ఈ ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తున్నాదేది చూడాలి. అయినా.. ఆలయ పరిసరాల్లో ఎలుకలు రాకుండా కట్టుదిట్టైమన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
ICC Refused Bangladesh: 2026 టీ20 ప్రపంచకప్ వేదికల వివాదంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నుండి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్లో మ్యాచ్లు ఆడేందుకు ససేమిరా అంటున్న బంగ్లాదేశ్కు ఇప్పుడు అన్ని ద్వారాలు మూసుకుపోతున్నాయి.
భారత్లో మ్యాచ్లు నిర్వహించాలన్న ఐసీసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బంగ్లాదేశ్ వేసిన అప్పీల్ను ఐసీసీ వివాద పరిష్కార కమిటీ (DRC) తోసిపుచ్చింది. దీనితో బంగ్లాదేశ్ ఆశలు అడియాశలయ్యాయి.
డీఆర్సీ నిర్ణయం ఏంటి?
ఐసీసీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరిపే అధికారం తమకు లేదని డీఆర్సీ స్పష్టం చేసింది. ఇప్పటికే ఐసీసీ బోర్డు సభ్యులు 14-2 మెజారిటీతో బంగ్లాదేశ్ మ్యాచ్లను భారత్లోనే నిర్వహించాలని ఓటింగ్ ద్వారా ఖరారు చేశారు. నిబంధనల ప్రకారం ఈ నిర్ణయమే అంతిమమని కమిటీ తేల్చి చెప్పింది.
బంగ్లాదేశ్ తదుపరి అడుగు..
డీఆర్సీలో చుక్కెదురు కావడంతో, బీసీబీ ఇప్పుడు స్విట్జర్లాండ్లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS)ను ఆశ్రయించాలని ఆలోచిస్తోంది. అయితే టోర్నీ సమయం దగ్గరపడుతుండటంతో ఇది ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుందనేది సందేహమే.
బంగ్లా స్థానంలో స్కాట్లాండ్?
బంగ్లాదేశ్ మొండివైఖరి వీడకపోవడంతో ఐసీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం భారత్లో ఆడేందుకు అంగీకరించని పక్షంలో, బంగ్లాదేశ్ను టోర్నీ నుండి తప్పించి స్కాట్లాండ్ జట్టుకు అవకాశం ఇవ్వాలని ఐసీసీ భావిస్తోంది. దీనిపై శనివారం ఐసీసీ నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
భద్రతా కారణాలను చూపుతూ భారత్లో ముంబై, కోల్కతా వేదికల్లో మ్యాచ్లు ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరిస్తోంది. వీటికి బదులుగా శ్రీలంక లేదా పాకిస్తాన్ను వేదికలుగా మార్చాలని కోరుతోంది. కానీ ఐసీసీ మాత్రం ముందుగా ఖరారు చేసిన షెడ్యూల్కే కట్టుబడి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Realme 16 Pro Offer Price Cut: ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ రియల్ మీ లేటెస్ట్గా విడుదల చేసిన స్మార్ట్ఫోన్స్లో రియల్ మీ 16 ప్రో (Realme 16 Pro) ఒకటి. దీనిని కంపెనీ ఈ ఏడాది జనవరిలో లాంచ్ చేసింది. అయితే, ఇది ఎన్నో రకాల ప్రత్యేకమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఇది అద్భుతమైన డిజైన్ను కలిగి ఉంది. వెనక భాగంలోని కెమెరా మాడ్యూల్ గతంలో కంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే, ఇప్పుడు ఈ మొబైల్ ఫ్లిప్కార్ట్ ఆఫర్స్లో భాగంగా అత్యంత తగ్గింపు ధరకు లభిస్తోంది. దీనిపై ఉన్న ఆఫర్స్ వివరాలేంటో? ఫీచర్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్లో రియల్ మీ 16 ప్రో (Realme 16 Pro) అత్యంత తగ్గింపు ధరకి లభించడం విశేషం. ఇక ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది ఎంతో శక్తివంతమైన 7,000mAh బ్యాటరీతో వచ్చిన మొట్టమొదటి రియల్ మీ మొబైల్గా కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. అంతేకాకుండా ఇది 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్ ను కలిగి ఉంటుంది. ఇక ఈ Realme 16 Pro స్మార్ట్ఫోన్కు సంబంధించిన డిస్ప్లే వివరాల్లోకి వెళ్తే.. ఇది ఎంతో ప్రత్యేకమైన 6.78 అంగుళాల 1.5K AMOLED స్క్రీన్తో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తోంది. అలాగే ఇది 6,500 నిట్స్ (Nits) బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది. ఇది ఇతర కాంతి ఉన్నచోట కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 16 (Realme UI 7.0) ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తుంది.
వెనక భాగంలో అద్భుతమైన కెమెరా మాడ్యూల్ని కలిగి ఉంటుంది. రియల్ మీ బ్యాక్ సెటప్లో 200MP మెయిన్ కెమెరా (Samsung HP5 సెన్సార్, OIS సపోర్ట్) ప్రధాన కెమెరా అందించింది. అంతేకాకుండా అదనంగా 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఫ్రంట్ భాగంలో 50MP ఫ్రంట్ కెమెరా కూడా లభిస్తోంది. ఇది ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ Dimensity 7300 Max 5G చిప్సెట్ ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది.
ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో ఈ Realme 16 Pro స్మార్ట్ఫోన్ మొత్తం మూడు వేరియన్స్లో అందుబాటులో ఉంది. ఇందులోని మొదటి వేరియంట్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ను కలిగి ఉంటుంది. దీని ధర రూ.31,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక రెండవ వేరియంట్ 256 జిబి ఇంటర్నల్ స్టోరీస్తో లభిస్తోంది. కానీ ఇది 8gb ర్యామ్ ని మాత్రం కలిగి ఉంటుంది. ఇక చివరి వేరియంట్ 12gb ర్యామ్తో పాటు 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ను కలిగి ఉంటుంది. దీని ధర రూ.36,999 నుంచి ప్రారంభమవుతుంది.
స్పెషల్ ఆఫర్స్లో భాగంగా ఫ్లిప్కార్ట్ ఎంపిక చేసిన ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఫ్లిప్కార్ట్ అనుసంధాన ఆక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే బేస్ వేరియంట్పై రూ.3,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్ఫోన్ కేవలం రూ.28,999కే అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా అదనంగా భారీ తగ్గింపు పొందాలి అనుకునేవారు ఎక్స్చేంజ్ బోనస్ పొందవచ్చు. అయితే, ఏదైనా పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తే రూ.27 వేల వరకు బోనస్ లభిస్తుంది.. దీంతో మీరు కేవలం రూ.1,999 చెల్లిస్తే.. ఈ Realme 16 Pro స్మార్ట్ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jiohotstar Cheapest Subscription: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం సరికొత్త, అత్యంత చవకైన ఓటీటీ ప్లాన్లను ప్రవేశపెట్టింది. జియో హాట్స్టార్ (JioHotstar) పేరుతో వచ్చిన ఈ కొత్త సర్వీస్ ఇప్పుడు కేవలం రూ.79 నుంచే ప్రారంభం కానుంది.
ఇప్పటివరకు కేవలం మూడు నెలలు (త్రైమాసిక) లేదా ఏడాది (వార్షిక) ప్లాన్లను మాత్రమే అందించిన కంపెనీ, ఇప్పుడు వినియోగదారుల వెసులుబాటు కోసం నెలవారీ ప్లాన్లను కూడా అందుబాటులోకి తెచ్చింది.
1. మొబైల్ ప్లాన్ (Mobile Plan)
తక్కువ బడ్జెట్లో కంటెంట్ను వీక్షించాలనుకునే వారి కోసం ఈ ప్లాన్ అనువైనది. నెలవారీ సేవల కోసం రూ.79.. త్రైమాసిక (3 నెలలు) ప్లాన్ కోసం రూ.149.. వార్షిక (1 ఏడాది) ప్లాన్ కోసం రూ.499 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
2. సూపర్ ప్లాన్ (Super Plan)
మెరుగైన నాణ్యతతో వినోదాన్ని ఆస్వాదించాలనుకునే వారి కోసం ఈ విభాగం ఉంది.
నెలవారీ: రూ. 149
త్రైమాసిక: రూ. 349
వార్షిక: రూ. 1099
3. ప్రీమియం ప్లాన్ (Premium Plan)
యాడ్స్ లేని అనుభూతిని, అత్యున్నత నాణ్యతను కోరుకునే వారి కోసం ప్రీమియం ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి.
నెలవారీ: రూ. 299
త్రైమాసిక: రూ. 699
వార్షిక: రూ. 2199
వినియోగదారులు తమ అవసరానికి అనుగుణంగా నెలవారీ, మూడు నెలల లేదా సంవత్సర ప్లాన్ను ఎంచుకోవచ్చు. జియో హాట్స్టార్ ఇప్పటికే మిలియన్ల కొద్దీ డౌన్లోడ్లను సాధించి దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ప్లాట్ఫామ్గా అవతరించింది. స్పోర్ట్స్ నుంచి మూవీస్ వరకు అన్ని రకాల వినోదాన్ని ఈ ప్లాన్ల ద్వారా వీక్షించవచ్చు.
ఓటీటీ ప్రియులకు జియో హాట్స్టార్ ప్లాన్లు మంచి వెసులుబాటును కల్పిస్తున్నాయి. ముఖ్యంగా కేవలం రూ.79 తో ప్రారంభమయ్యే నెలవారీ ప్లాన్ సాధారణ వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.
Also REad: 500 Note Ban: రూ.500 నోట్లు రద్దు కానున్నాయా? ఏటీఎంల నుంచి మాయమవుతాయా? కేంద్రం ఏం చెప్పిందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Giant Cobra Video Watch Here: అడవికి దగ్గరగా ఉన్న ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇంటి లోపల ఎప్పుడు ఎప్పుడు పరీక్షిస్తూ శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అడవుల్లో నీటి కోరత విపరీతంగా పెరిగి.. ఆహార సమస్యలు వస్తున్నాయి.. దీనికి కారణంగా పాములు పెద్ద మొత్తంలో జనావాసాల వైపు సంచారం చేస్తూ ఉన్నాయి. ఇలా ఇప్పటివరకు చాలా పాములు జనాభాసాల్లో సంచారం చేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటి సందర్భానికి సంబంధించిందే. అడవిలోకి వచ్చిన ఓ పాము ఏకంగా ఇంట్లో వంట గదిలో ఉండే ఫ్రిడ్జ్ వెనక భాగంలో దూరింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలే వైరల్ గా మారాయి.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. సర్పమిత్ర ఆకాష్ జాదవ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేసిన వీడియో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. ఈ వీడియోలో స్నేక్ క్యాచర్ నెమ్మదిగా ఫ్రిజ్ను జరుపుతూ అందులో దూరిన పామును బయటకు తీయడం మీరు చూడొచ్చు. ముందుగా స్నేక్ క్యాచర్ ఆ పామును చాలా నెమ్మదిగా అందులో ఇరుక్కున్న పామును తన దగ్గర ఉన్న స్నేక్ స్టిక్ వినియోగించి నెమ్మదిగా బయటికి తీయడం మీరు చూడొచ్చు. అలాగే దానిని చూసిన ఆ పాము ఫ్రిడ్జ్ వెనక భాగం నుంచి స్పీడ్గా బయటికి దూసుకురావడం కూడా మీరు గమనించవచ్చు.
స్నేక్ క్యాచర్ ఎంతో నెమ్మదిగా ఆ పామును పట్టుకొని బయటికి లాగేసాడు. బయటికి లాగేసిన వెంటనే దాని తల పట్టి నెమ్మదిగా ఆ ఇంట్లో నుంచి బయటికి తెచ్చేసాడు. అయితే, ఈ సమయంలో పాము అతనిపై దాడి చేసేందుకు ఎంతగానో ప్రయత్నించింది. అతను ఏమాత్రం భయపడకుండా ఎంతో చాకచక్యంగా ఆ పామును పట్టుకొని.. దానిని సులభంగా ఓ బ్యాగ్లో బంధించాడు. ఇలా బంధించిన వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఈ వీడియో చూసిన కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు.. ఇలాంటి పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా ఆ పాము ఎంత యాక్టివ్గా ఉందోనని.. ఎప్పుడైనా ఎవరినైనా సులభంగా దాడి చేసే సామర్థ్యం కలిగి ఉంటుందని.. దీనికి దూరంగా ఉండటం చాలా మంచిదని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ పట్టుకున్న పామును ఎంతో సులభంగా బ్యాంకులో బంధించి దానిని అడవి ప్రదేశంలో వదిలిపెట్టినట్లు వన్యప్రాణి సంరక్షకులు ఆకాష్ చెప్పారు.
Also Read: ktr On Revanth Video: రేవంత్ కాదు.. వాడి జేజేమ్మకు భయపడేది లేదు.. కేటీఆర్ ఫైర్..వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cobra Drinking Water Video Water: ప్రకృతిలో అనేక వింతలు విశేషాలు మనల్ని ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. ముఖ్యంగా అప్పుడప్పుడు వన్యప్రాణులకు సంబంధించిన కొన్ని ఆసక్తికర వీడియోలు సోషల్ మీడియా వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. తాజాగా అటువంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది. ఈ వీడియోలో అత్యంత ప్రమాదకరమైన భారీ నాగుపాముకు ఒక వ్యక్తి ప్లాస్టిక్ డబ్బాతో నీటిని పట్టిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. దీనిని చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది? ఈ వీడియోలో ఉన్న వారెవరు? వీటన్నిటికీ సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇరవై ఒక్క సెకన్ల నిడివి గల యూట్యూబ్ షార్ట్ వీడియో లో ఓ భారీ నాగుపాము పడగవిప్పి నిలబడి ఉండడం మీరు చూడొచ్చు. సాధారణంగా ఏ పాములైన పడక విప్పాయ అంటే దాడి చేస్తాయని అర్థం. ఈ వీడియోలో కూడా ఆ నాగుపాము ముందు ఉన్న వ్యక్తిపై దాడి చేసేందుకు పడగ విప్పింది. ఇంతటి భారీ నాగుపాము పడకవింపడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా దూరం జరిగి పోయారు. కానీ ఒక వ్యక్తి మాత్రం డబ్బాలు నీళ్లు తీసుకువచ్చి ఆ నాగుపాము ముందు ఉంచాడు. దీంతో ఆ పాము ఏం చేసిందో చూస్తే ఆశ్చర్యానికి గురవ్వాల్సిందే..
డబ్బాలో నీళ్లు తీసుకువచ్చిన ఆ వ్యక్తి.. నెమ్మదిగా నాగుపాము తల ముందు ఉంచి కిందికి నీటిని విడుస్తూ ఉన్నాడు. అయితే, ఈ సమయంలోనే ఆ ప్రమాదకరమైన నాగుపాము ఆ డబ్బాలో నీటిని తాగేందుకు ప్రయత్నిస్తోంది. నెమ్మది నెమ్మదిగా ఆ పాము డబ్బాలో ఉన్న నీటిని తాగడం ప్రారంభించింది. ఇలా ఆ పాము అందులో ఉన్న కొద్ది నీటిని తాగేసింది. ఈ దృశ్యాలు అక్కడున్న కొంతమంది స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తుంది.
తీవ్రమైన వేడి వాతావరణం అడవుల్లో నీటి కోరత కారణంగానే వన్యప్రాణులు ఇలా ఎక్కువగా జనాలు తిరిగే ప్రదేశాల్లో సంచారం చేస్తున్నాయి. అంతేకాకుండా కనబడిన చోట నీటిని తాగేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈపాము కూడా ఇలా అడవిలో నుంచి బయటికి వచ్చి దాహం కోసం ఇళ్లలోకి సంచారం చేయాలని చూసింది. అయితే, దీనిని ముందుగానే గమనించిన వన్యప్రాణి సంరక్షకులు.. దానిని పట్టుకొని నీటిని తాగించారు. ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: ktr On Revanth Video: రేవంత్ కాదు.. వాడి జేజేమ్మకు భయపడేది లేదు.. కేటీఆర్ ఫైర్..వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kondagattu News: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, భక్తుల కొంగు బంగారం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద చిన్నపాటి ఉద్రుక్త వాతావరణం నెలకొంది. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వ్యవహార శైలిని నిరసిస్తూ అర్చకులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు.. విధులను బహిష్కరించి ఆలయ ముఖ ద్వారం వద్ద బయటాయించడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇంతకీ అర్చకులు ఆందోళన చేయడానికి ప్రధాన కారణాలేంటి? అసలు ఏం జరుగుతుంది? వీటన్నిటికీ సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
గత కొంతకాలంగా ఆలయ అధికారులకు అర్చకులకు మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.. తాజాగా ఈవో తీసుకున్న కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు అర్చకుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు.. తమ సమస్యలను విన్నవించుకున్న ఈవో పట్టించుకోవడంలేదని.. అలాగే తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని అర్చకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని కారణంగానే శుక్రవారం ఉదయం నుంచి అర్చకులు అందరూ ఏకమై ఆలయం ముందు ధర్నా చేపట్టినట్లు సమాచారం.
Also Read: ktr On Revanth Video: రేవంత్ కాదు.. వాడి జేజేమ్మకు భయపడేది లేదు.. కేటీఆర్ ఫైర్..వీడియో..
ముఖ్యంగా ఆలయ అధికారి అర్చకులకు కనీస గౌరవం ఇవ్వకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఈఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్చకులు నిరసనకు దిగడంతో స్వామివారికి జరగాల్సిన నిత్య కైంకర్యాలు, పూజలు ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సుదూర ప్రాంతం నుంచి వచ్చిన భక్తులు దర్శనం కోసం గంటల తరబడి వేసి చూడాల్సి వచ్చిందట. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇతరు ఉన్న అధికారులు ఘటన స్థలానికి చేరుకొని అర్చకులతో చర్చలు జరిపే ప్రయత్నం చేశారు..
పోలీస్ అధికారులు రావడంతో కాస్త పరిస్థితి కాస్త సర్దుమనిగినట్లు తెలుస్తోంది. మంచి పేరున్న కొండగట్టు ఆలయంలో అర్చకుల నిరసన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అలాగే అర్చకులు ప్రధాన ద్వారం ముందు నిరసనకు దిగిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ వస్తున్నాయి.
Also Read: ktr On Revanth Video: రేవంత్ కాదు.. వాడి జేజేమ్మకు భయపడేది లేదు.. కేటీఆర్ ఫైర్..వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Govt Employees Gift: కేంద్ర బడ్జెట్కు ముందే ప్రభుత్వ ఉద్యోగులకు భారీ కానుక ఉండబోతున్నట్లు సమాచారం. బడ్జెట్ ప్రవేశపెట్టక ముందే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు భారీ ఆర్థిక ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కరువు భత్యం విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కరువు భత్యం దాదాపు 63 శాతం పెంచనుందని సమాచారం. డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేయనుందని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Red Nagamani: స్కూల్లో కలకలం.. నాగుపాము తలపై ఎర్రటి నాగమణి
కేంద్ర ప్రభుత్వం 2026-27కు సంబంధించిన బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనుంది. బడ్జెట్కు ముందు డీఏ 63 శాతానికి పెరుగుతుందని సమాచారం. ద్రవ్యోల్బణ డేటాను పరిశీలిస్తే అది జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం డీఏ 58 శాతం ఉంది. ఉద్యోగులకు సంబంధించి డీఏ పెంచి 5 శాతం వేయనుందని.. దీనిద్వారా డీఏ 63 శాతానికి పెరగనుందని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు ప్రస్తుతం డిసెంబర్ 2025 ద్రవ్యోల్బణ డేటాను చూస్తున్నారు. ఈ డేటా ఆధారంగా జనవరి 2026 నుంచి కరువు భత్యం పెంపు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
Also Read: PM Kisan: రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. పీఎం కిసాన్ సహాయం డబ్బుల్ డబుల్
ద్రవ్యోల్బణ డేటాను కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ప్రభుత్వం చివరిసారిగా డీఏని జూలై 2025లో 55 శాతం నుంచి 58 శాతానికి పెంచింది. డిసెంబర్ డేటా తదుపరి డీఏ పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ పెరుగుదల సుమారు 50.14 లక్షల మంది ప్రస్తుత ఉద్యోగులకు, సుమారు 69 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. బడ్జెట్కు ముందు ప్రభుత్వం డీఏను పెంచుతుందో లేదో చూడాలి. కేంద్ర ప్రభుత్వం దసరా సమయంలో డీఏను ప్రకటించిన విషయం తెలిసిందే. నాడు ప్రకటించడంతో ఊరట చెందిన ఉద్యోగ వర్గాలు ఇప్పుడు బడ్జెట్ ముందు డీఏ ప్రకటించనుండడంతో ఆనందంలో మునిగారు. దీంతోపాటు 8వ వేతన సంఘం కూడా ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే మాత్రం భారీ ఆర్థిక ప్రయోజనం లభించనుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు సంతోషంలో ఉన్నారు.
Also Read: KTR: సిట్ నోటీసులపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
BRS Party News: మున్సిపల్ ఎన్నికల వేళ వివిధ జిల్లాల్లో రాజయకీల్లో ఊహించని మార్పులు వస్తున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో పెను రాజకీయ సంచలనం చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.. గత రెండు దశాబ్దాల నుంచి పార్టీకి నియోజవర్గం స్థాయిలో వెన్నుముకగా ఉన్న కీలక నేత అనూప్ రావు బీఆర్ఎస్ పార్టీని వీడబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్కు కోలుకోలేని దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీలో 2001 ఆవిర్భావం నుంచి అనూప్ రావు చాలా చురుకైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆయన లాఠీ దెబ్బలు తిని, జైలుకు వెళ్లిన చరిత్ర కూడా ఉంది. అలాగే పార్టీ ఎంతో కష్టకాలంలో ఉన్న సమయంలో కూడా నియోజకవర్గంలో కేడర్ను సమన్వయం చేస్తూ బలమైన శక్తిగా ఎదుగుతూ వచ్చారు. అయితే, గత కొద్ది రోజుల నుంచి పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని.. కష్టపడిన వారికి కాకుండా ఇతర ఇతరులకు పార్టీ పెద్దపీట వేస్తోందని ఆయన తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధి పనులకు.. నామినేటెడ్ పదవుల భర్తీలో పాతతరం నేతలను పట్టించుకోవడం లేదని, కొత్తగా వచ్చిన వారికి ఎమ్మెల్యే సంజయ్ ప్రాధాన్యత ఇస్తున్నారని.. అనూప్ రావు ప్రధాన ఆరోపణగా వినిపిస్తోంది. అయితే, మున్సిపల్ ఎన్నికలు వస్తున్న సమయంలో తన అనుచరవర్గానికి టికెట్ల కేటాయింపు విషయాల్లో కూడా సరైన స్పష్టత లేనందున, ఆయన పార్టీ వీడాలనే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది..
Also Read: ktr On Revanth Video: రేవంత్ కాదు.. వాడి జేజేమ్మకు భయపడేది లేదు.. కేటీఆర్ ఫైర్..వీడియో..
అలాగే అనూప్ రావు పార్టీ మారడానికి ఇప్పటికే.. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్తో ప్రత్యేకమైన సంప్రదింపులు కూడా జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కోరుట్ల నియోజకవర్గంలో BJPని బలోపేతం చేసేందుకు చూస్తున్న అరవింద్.. అనూప్ రావుకు ప్రత్యేమైన కీలక బాధ్యతలు కూడా అప్పగించిన్నట్లు హామీ ఇచ్చినట్లు సమాచారం.. అలాగే త్వరలోనే తన అనుచరులతో భారీ బహిరంగ సభను కూడా నిర్వహించి.. వారి సమక్షంలోనే కాషాయ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో అనూప్ రావు వంటి కీలక నేతలు పార్టీ వీడడం వల్ల BRSకు ఓటు బ్యాంకుపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Also Read: ktr On Revanth Video: రేవంత్ కాదు.. వాడి జేజేమ్మకు భయపడేది లేదు.. కేటీఆర్ ఫైర్..వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook