Back
B.Mohan Kumar
West Godavari534447

చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే

B.Mohan KumarB.Mohan KumarJun 24, 2024 10:39:29
Jangareddigudem, Andhra Pradesh:
ఏలూరు జిల్లా చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం చింతలపూడి ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు.రోగులతో మాట్లాడి వైద్య సహాయం గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు.పాయిజన్ తీసుకున్న ఇంటర్మీడియట్ విద్యార్థి పై మండిపడ్డారు, చాలా భవిష్యత్తు ఉంది, పాయిజన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏంటి అని ఇంకొక్కసారి తీసుకోకూడదని హెచ్చరించారు. ఆసుపత్రులలో సదుపాయాలపై వైద్యుల ను ఆరా తీశారు
0
Report
West Godavari534260

కూటమికి అండగా నిలిచిన ఎన్నారై లకు ధన్యవాదాలు

B.Mohan KumarB.Mohan KumarJun 22, 2024 10:13:37
Palakollu, Andhra Pradesh:
ఆంధ్ర రాష్ట్రభవితవ్యం , భవిష్యత్ తరాలు బాగుండాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి కి అండగా నిలిచి విజయాన్ని చేకూర్చిన ఎన్నారైలకు జల వనరుల శాఖ మంత్రి , పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రా లో విజయోత్సవాలు జరుపుకుంటున్న ఎన్నారై టిడిపి, జనసేన, బిజెపి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు.
0
Report
Prakasam523182

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి

B.Mohan KumarB.Mohan KumarJun 22, 2024 09:58:00
Aluru, Andhra Pradesh:
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం సమీపంలో తల్లాడ , దేవరపల్లి జాతీయ రహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరినిు లారీ ఢీకొనడంతో చుండ్రు దేవా (22) అనే వ్యక్తి ఘటనా స్థలంలో మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో జంగారెడ్డి గూడెం ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్త తరలించారు. జంగారెడ్డిగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
0
Report
East Godavari533289

మత్స్యకార వేషధారణలో ఎమ్మెల్యే

B.Mohan KumarB.Mohan KumarJun 21, 2024 10:57:01
Narsapuram, Andhra Pradesh:
మత్స్యకార వేషధారణలో నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ శుక్రవారం వినూత్న రీతిలో అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్ 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. సాంప్రదాయ మత్స్యకారునిగా అసెంబ్లీలో జరగబోయే ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఎమ్మెల్యే వెంట పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు
0
Report
Advertisement
West Godavari534260

డంపింగ్ యార్డులో చెత్త నుండి సంపదల సృష్టించేలా చర్యలు

B.Mohan KumarB.Mohan KumarJun 20, 2024 06:18:06
Palakollu, Andhra Pradesh:
పాలకొల్లు పట్టణ యడ్లబజార్ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా దీర్ఘకాలికంగా వేధిస్తున్న డంపింగ్ యార్డ్ సమస్య తీరెలా ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేస్తామని తెలిపారు. డంపింగ్ యార్డులో చెత్తను సంపదగా చేసేలా చర్యలు చేపడతామని అన్నారు.
0
Report
Prakasam523182

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

B.Mohan KumarB.Mohan KumarJun 20, 2024 06:09:37
Aluru, Andhra Pradesh:
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం లోని లక్ష్మీపురం వద్ద జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ , ప్రైవేట్ ట్రావెల్ బస్, ఆటో ఢీ కొట్టాయి. ఈ ఘటనలో ప్రైవేట్ బస్సు ముందు భాగం దెబ్బతింది. ప్రమాద ఘటనలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాద ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
0
Report
West Godavari534447

కూటమి నేతల సంబరాలు

B.Mohan KumarB.Mohan KumarJun 19, 2024 10:46:16
Jangareddigudem, Andhra Pradesh:
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం లో కూటమి నేతలు బుధవారం సంబరాలు జరుపుకున్నారు. డిప్యూటీ సీఎం గా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారికి జన సేన మండల పార్టీ అధ్యక్షుడు తోట రవి కుమార్ , కూటమి నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి పంచారు. ఈ కార్యక్రమంలో కూటమినేతలు , కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
0
Report
West Godavari534460

చింతలపూడిలో 'నేను బడికి పోతా' ర్యాలీ, విద్యా వ్యవస్థపై నాయకుల ఆకాంక్షలు వేలాడుతున్నాయి

B.Mohan KumarB.Mohan KumarJun 19, 2024 10:45:48
Chintalapudi, Andhra Pradesh:
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పాత చింతలపూడి గ్రామంలో బుధవారం నేను బడికి పోతా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు దామోదర్ మాట్లాడుతూ బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలన్నారు. టిడిపి నాయకులు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ విద్యారంగంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారని అన్నారు. పిల్లలను స్కూళ్లలో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
0
Report
West Godavari534447

జంగారెడ్డిగూడెం పలు ప్రాంతాలలో వర్షం

B.Mohan KumarB.Mohan KumarJun 19, 2024 09:05:36
Jangareddigudem, Andhra Pradesh:
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామాలలో మంగళవారం సాయంత్రం వాతావరణం చల్లబడింది. అకస్మాత్తుగా కురిసిన వర్షాలకు లక్కవరం లో భారీ వర్షాలు కురిసాయి. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామాల మధ్య ఈదురు గాలుల కారణంగా వృక్షం నేలకొరిగింది. భారీ వృక్షం నేలకొరగడంతో రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి వృక్షాన్ని తొలగించాలని వాహనదారులు కోరుకుంటున్నారు.
0
Report
West Godavari534447

మద్ది అంజన్న ఆలయ ఆదాయం రూ. 2,25,291

B.Mohan KumarB.Mohan KumarJun 19, 2024 06:35:27
Jangareddigudem, Andhra Pradesh:

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి ఆలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. స్వామి దర్శనం అనంతరం సుమారు 1600 మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. మద్యాహ్నం గం.2 ల.వరకు సామి వారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ రూ. 2,25,291/- లు సమకూరినట్లు ఆలయ ఈవో కొండలరావు తెలిపారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు

0
Report
West Godavari534447

వర్షాలకు కూలిన ఇంటి గోడ

B.Mohan KumarB.Mohan KumarJun 19, 2024 06:34:49
Jangareddigudem, Andhra Pradesh:
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో వర్షం భీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. ఇదే క్రమంలో గ్రామానికి చెందిన దడాల శ్రీను అనే వ్యక్తికి చెందిన ఇల్లు మంగళవారం కురిసిన భారీ వర్షానికి ఇంటి గోడ కూలింది.ఇటుకలు గోడ బయటికి పడడంతో అదే సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి ఎటువంటి ప్రమాదం జరగకపోవడం తో ఊపిరి పీల్చుకున్నారు.
0
Report
West Godavari534447

ఏలూరులో మున్సిపాలిటీ నగర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించింది

B.Mohan KumarB.Mohan KumarJun 19, 2024 06:24:32
Jangareddigudem, Andhra Pradesh:

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నగర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. అంతేకాకుండా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం నూతన భవనాల నిర్మాణం, పరిశుభ్రత కోసం కాంపాక్టర్ల నిర్మాణం, పట్టణ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం తదితర 26 అజెండాలను కౌన్సిల్ సమావేశంలో ప్రదర్శించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వీధిలైట్లు పనిచేయడం లేదని, పారిశుద్ధ్య వ్యవస్థ పాడైపోయిందని పలువురు సభ్యులు ఆరోపించారు.

0
Report