సాఫ్ట్వేర్ బాలికపై అత్యాచారం చేసిన వనస్థలిపురంలోని హోటల్ను పోలీసులు సీజ్ చేశారు
Vanasthalipuram, Telangana:వనస్థలిపురం సీఐ అశోక్రెడ్డి, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కందుకూరు రంగారెడ్డి జిల్లా అధికారి సుధీర్బాబు ఆదేశాల మేరకు ఈరోజు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరస్తు బార్ అండ్ రెస్టారెంట్ బొమ్మరిల్లు కాంప్లెక్స్ను సీజ్ చేశారు పట్టించుకోలేదు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Yadadri Temple: యాదాద్రికి సెలవుల రద్దీ.. ఉచిత దర్శనానికి 5 గంటల సమయం
Yadagirigutta, Telangana:Devotees Heavy Rush To Yadadri Temple Ongoing Summer Holidays Effect Watch VideoWife And Husband: ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్య
Sangareddy, Telangana:Wife Kills To Husband With Help Of Boyfriend At Narayanakhed Of Sangareddy DistrictWife And Husband: ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా భార్య హత్య
Narayankhed (CT), Telangana:Wife Kills To Husband With Help Of Boyfriend At Narayanakhed Know Villagers WordsKKR vs DC: ఆఖరి మ్యాచ్లో కలకత్తాపై ఢిల్లీ విజయం.. ముగిసిన ఐపీఎల్ 2026 లీగ్ దశ
Kolkata, West Bengal:DC Beat KKR By 40 Runs: దాదాపు రెండు నెలల పాటు అలరించిన ఐపీఎల్ 2026 చివరి దశకు చేరుకుంది. ఆదివారంతో లీగ్ దశ ముగియగా ఆఖరి మ్యాచ్లో కలకత్తా నైట్రైడర్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ భారీ విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఫలితాలు టోర్నీని ఎలాంటి మలుపు తిప్పకపోయినా పరువు కాపాడుకునేందుకు ఇరు జట్లు అత్యంత ప్రాధాన్యంతో మ్యాచ్లో తలపడ్డాయి. కలకత్తాపై ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన ఢిల్లీ ఆఖరు విజయాన్ని అందుకుని పరువు కాపాడుకుంది. 40 పరుగుల తేడాతో కలకత్తాపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. మ్యాచ్ విశేషాలు ఇలా ఉన్నాయి.
తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాజస్థాన్ రాయల్స్ గెలిచి ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ బెర్తును దక్కించుకున్న వేళ ఢిల్లీ క్యాపిటల్స్, కలకత్తా నైట్రౌడర్స్ మధ్య జరిగిన మ్యాచ్కు ప్రాధాన్యం లేదు. ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఢిల్లీ 2023 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (60) అర్ధ శతకంతో చెలరేగి ఆడగా.. 4 ఫోర్లు బాదాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ 39 పరుగులతో రాణించగా.. సాహిల్ పరాఖ్ (24), డేవిడ్ మిల్లర్ (28), అశుతోష్ శర్మ (18) తలా కొన్ని పరుగులు చేశారు. కలకత్తా బౌలర్లు పరిమితంగా వేసి ఢిల్లీ స్కోర్బోర్డును కొంత నియంత్రించారు. సౌరభ్ దుబే రెండు వికెట్లతో పర్వాలేదనిపించగా.. అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలా ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఢిల్లీ విధించిన లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన కలకత్తా నైట్రైడర్స్ కుప్పకూలి 18.4 ఓవర్లు 163 పరుగులు చేసి మ్యాచ్ను చేజార్చుకుంది. కెప్టెన్ అజింక్యా రహానే అద్భుతమైన అర్ధ శతకంతో మెరిసినా.. మిగతా బ్యాటర్లు సహకరించలేకపోయారు. 39 బంతుల్లో 63 పరుగులు చేసిన అజింక్యా నాలుగేసి ఫోర్లు, సిక్సర్లు నమోదు చేశాడు. ఫిన్ అలెన్ (20), మనీష్ పాండే (25), రావుమెన్ పావెల్ (29) పోరాడినా విజయానికి కావాల్సిన పరుగులు రాబట్టలేకపోయారు. కామెరూన్ గ్రీన్ రెండు పరుగులకే పరిమితమవగా.. రింకూ సింగ్, కార్తీక్ త్యాగి డకౌటయ్యాడు. అనుకూల్ రాయ్ (9), వరుణ్ చక్రవర్తి (5) తక్కువ పరుగులు నమోదు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు అద్భుతంగా బంతులు వేసి ప్రత్యర్థిని లక్ష్యాన్ని చేరుకోకుండా అడ్డగించింది. బౌలర్లంతా సమష్టి కృషితో కలకత్తా కుప్పకూలింది. లుంగి ఎంగిడి, కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీసి కలకత్తాను భారీ దెబ్బతీశారు. మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు, కెప్టెన్ అక్షర్ పటేల్ ఒక వికెట్ పరిమితమయ్యాడు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పరువు నిలబెట్టుకోగా.. కలకత్తా నైట్రైడర్స్ సొంత గడ్డపై చివరి మ్యాచ్ను కూడా కోల్పోయి ఘోర పరాభవం ఎదుర్కొంది.
ఈ మ్యాచ్తో ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగిసింది. అన్ని జట్లు 14 మ్యాచ్లు ఆడగా కలకత్తా, ఢిల్లీ జట్లు కూడా పూర్తి చేశాయి. మొత్తం 14 ఆడిన ఇరు జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఏడేసి విజయాలు, ఓటములను చవిచూసిన 14 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఇక కలకత్తా నైట్రౌడర్స్ మొత్తం 14 మ్యాచ్లు ఆడి 6 విజయాలు, ఏడు ఓటములను చవిచూసింది. వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్ ముగియడంతో ఐపీఎల్ 2026 లీగ్ మ్యాచ్ల దశ ముగిసింది. ఇక సోమవారం ఒక రోజు విరామం తర్వాత మంగళవారం బెంగళూరు, గుజరాత్ మధ్య ఎలిమినేటర్ తొలి మ్యాచ్ జరగనుండగా.. బుధవారం హైదరాబాద్, రాజస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
Best CNG Car: మధ్యతరగతి గుండెల్లో చేరిన సూపర్ హిట్ కారు.. 33 కిమీ మైలేజ్తో పాటు Top Safety.. ధర ఎంతంటే?
Lakshmapur, Telangana:Maruti Dzire CNG: ఇండియన్ ఆటో మొబైల్ మార్కెట్లో మారుతీ సుజుకీ బ్రాండ్ కు ఉన్న ప్రత్యేకతే వేరు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు, కమర్షియల్ వెహికల్స్ రంగంలో ఈ కంపెనీ కార్లకు భారీగా డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం దేశంలోనే నెంబర్ సెడాన్ కారుగా నిలిచింది మారుతీ సుజుకీ డిజైర్. అమ్మకాల్లోనూ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తోంది. అద్భుతమైన మైలేజీ, తక్కువ మెయింటనెన్స్, పవర్ ఫుల్ ఫీచర్లతో ఈ కారు వినియోగదారుల్లో నిరంతరం ప్రజాదరన పొందుతోంది. అందుకే ఇది అమ్మకాల పరంగా అనేక పెద్ద మోడళ్లతో పోటీ పడుతోంది.ప్రతి నెలా వేలాది మంది కొనుగోలు చేస్తున్నారు.
గత కొన్ని నెలలుగా ఈ కారు సేల్స్ పరంగా అన్ని బ్రాండ్ల కార్ల మీద భారీ పై చేయి సాధిస్తూ వస్తోంది. డిజైర్ సాధిస్తున్న ఈ అద్భుతమైన విజయానికి ప్రధాన కారణం అందులోని సీఎన్జీ వేరియంట్ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 . మారుతి సుజుకి డిజైర్ CNG 1.35 లక్షలకు పైగా యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. అంటే ప్రతి నెలా 11,000 మందికి పైగా కస్టమర్లు ఈ కారును ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. టాక్సీ, ప్రైవేట్ విభాగాలలో దీనికి డిమాండ్ బలంగా ఉంది. ఒక కేజీ గ్యాస్ కు ఏకంగా 33.73 కి.మీ.ల అద్భుతమైన మైలేజీ అందిస్తోంది.
Also Read: రెండు దశాబ్దాలుగా కుర్రాళ్ళ గుండెల్లో పల్స్ పెంచుతున్న బైక్
ఇక మారుతి డిజైర్ CNG అతిపెద్ద ప్రత్యేకత దాని ఇంధన సామర్థ్యం. కంపెనీ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. CNG వేరియంట్ సుమారుగా 33.73 కి.మీ/కేజీ మైలేజీని అందిస్తుంది. అందువల్ల ఇది సుదూర ప్రయాణాలు చేసే వారికి గొప్ప ఎంపికగా నిలుస్తుంది.ఫీచర్ల విషయంలో కూడా ఎక్కడా రాజీ పడలేదని చెప్పాలి. ఈ కారులో 9-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఏసీ, అనేక ఆధునిక ఫీచర్లు అందించింది అంతేకాదు ఈ కారు సేఫ్టీలోనూ నెంబర్ వన్ గా నిలిచింది. 5-స్టార్ సేఫ్టీ ఫీచర్ తో వస్తుంది. భద్రత కోసం, మారుతి డిజైర్ CNGలో ఆరు ఎయిర్బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెనుక పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి. ఈ కారు తన పటిష్టమైన భద్రతా ఫీచర్ల కారణంగా వినియోగదారుల నమ్మకాన్ని పొందుతోంది.
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల తరుణంలో ఇలాంటి బంపర్ మైలేజీ ఇవ్వడం వల్లే వాహనదారులు డిజైర్ కు జై కొడుతున్నారని చెప్పాలి. ధర చూస్తే మారుతీ డిజైర్ బేస్ మోడల్ ప్రారంభ ధర ఎక్స్ షోరూమ్ రూ. 6,25,600గా ఉంది. మైలేజీ పరంగా టాప్ లో ఉండే సీఎన్జీ వేరియంట్ ప్రారంభ ధర రూ. 8,03,100 ఉంది. ఈ కారులో 1.2 లీటర్, త్రీ సిలిండర్ నేచరుల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 80 బ్రేక్ హార్స్ పవర్ శక్తిని, 112 న్యూటన్ మీటర్స్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుందని కంపెనీ తెలిపింది. ఇంటీరియర్ చూస్తే కారు లోపల బేజ్, బ్లాక్ కలర్ థీమ్ తో డ్యాష్ బోర్డుపై ఫాక్స్ వుడ్ ఫినిషింగ్ ఇచ్చారు.
ఒకప్పుడు మారుతీ కార్లలో భద్రత తక్కువగా ఉంటుందన్న విమర్శలు వచ్చేవి. కానీ ఈ సరికొత్త రివైజ్డ్ కాంపాక్ట్ సెడాన్ కారుతో మారుతీ సుజుకి ఆ విమర్శలను పూర్తిగా చెరిపేసిందని చెప్పాలి. భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ కారులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, బ్యాక్ పార్కింగ్ సెన్సార్స్, అన్ని వేరియంట్లోనూ స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లను ఇచ్చింది. ఈ రేటింగ్స్ వల్లే ఇప్పుడు ఫ్యామిలీ కస్టమర్లు కూడా ఎలాంటి భయం లేకుండా ఈ కారును కొనుగోలు చేస్తున్నారు.
Also Read: కార్ లవర్స్కు పూనకాలే.. సరికొత్త అవతారంలో Honda City
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
IPL 2026 Playoffs: ముంబై ఇండియన్స్ ఓటమి.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్లోకి రాజస్థాన్ రాయల్స్
Mumbai, Maharashtra:MI vs RR Highlights: ఆరంభంలో అదిరే విజయాలు సాధించి.. అనంతరం వెనకబడిపోయిన రాజస్థాన్ రాయల్స్ ఆఖరి లీగ్ మ్యాచ్లో అద్భుతం చేసింది. ముంబై ఇండియన్స్ను ఓడించిన రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్లో బెర్త్ దక్కించుకుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్లో చేరిన సన్రైజర్స్తో ఎలిమినేటర్ 2 మ్యాచ్ ఆడనుంది. అదిరే ప్రదర్శన చేసిన రాజస్థాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో ముంబైపై విజయం సాధించింది. ఈ మ్యాచ్కు సంబంధించిన విశేషాలు ఇవే.
Sunstroke Death: ఎండకు పండుటాకుల్లా రాలిపోతున్న జనం..తెలంగాణలో వడదెబ్బకు ఏకంగా 107 మంది మృతి!
Baddipadaga, Telangana:Telangana Sunstroke Death: తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు ఎండలు తీవ్రతరం అవుతున్నాయి. వడదెబ్బ కారణంగా ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 51 మంది మరణించారు. వడదెబ్బ కారణంగా గత మూడు రోజుల్లో 107 మంది మరణించారు. దీంతో ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. అయితే ఇటీవలే వడదెబ్బ కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షలను ఇవ్వనున్నట్లు ఇటీవలే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.Crime News: తెలంగాణలో దారుణం..ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..జేసీబీతో డెడ్బాడీ పూడ్చేశారు!
Narayankhed (CT), Telangana:Telangana Crime News: రోజురోజుకు మానవ సంబంధాలు దారుణంగా మారుతుండగా.. తాజాగా మరో విస్తుపోయే సంఘటన చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి జేసీబీతో భార్య పూడ్చివేసింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.Traffic Diversions: హైదరాబాద్ ప్రజలకు భారీ అలర్ట్.. మెహిదీపట్నంలో ట్రాఫిక్ ఆంక్షలు
Hyderabad, Telangana:Smart Skywalk Works: హైదరాబాద్ నగరంలో రద్దీ ప్రాంతమైన మెహిదీపట్నంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. హైదరాబాద్లో నిత్యం బిజీగా ఉండే మెహిదీపట్నం రైతుబజార్ వద్ద స్కైవాక్ నిర్మాణ పనులతోపాటు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వేపై సీసీటీవీ కెమెరా పోల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనుల నేపథ్యంలో హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ డైవర్షన్స్ ప్రకటించారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా మే 24, 25 తేదీలలో సాయంత్రం 4 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు, ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ట్రాఫిక్ మళ్లింపులు, ప్రత్యామ్నాయ మార్గాల వివరాలు
మాసబ్ ట్యాంక్ నుంచి రేతిబౌలి వైపు
మాసబ్ ట్యాంక్, ఎన్ఎండీసీ, సరోజిని దేవి కంటి ఆసుపత్రి వైపు నుంచి రేతిబౌలి - నానల్ నగర్ వైపు వెళ్లే ట్రాఫిక్ను పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే పిల్లర్ నెం. 2 నుంచి 3 (అజీజియా మసీదు) వద్ద మెరాజ్ కేఫ్ మీదుగా కుడి వైపునకు మళ్లించి.. మెహదీపట్నం పిల్లర్ నెం. 15 వద్ద సాధారణ మార్గంలోకి వాహనాలను అనుమతిస్తారు
టోలిచౌకి, లంగర్హౌస్ నుంచి మాసబ్ ట్యాంక్ వైపు
టోలిచౌకి, లంగర్హౌస్, అత్తాపూర్ నుంచి నానల్ నగర్ - రేతిబౌలి మీదుగా మాసబ్ ట్యాంక్ వైపు వెళ్లే ట్రాఫిక్ను పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే పిల్లర్ నంబర్ 23 వద్ద యూ-టర్న్ చేయించి.. వ్యతిరేక దిశలో పంపి.. అనంతరం పిల్లర్ నంబర్ 4, 5 వద్ద మళ్లీ సాధారణ మార్గంలో కలుపుతారు
మాసబ్ ట్యాంక్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వైపు
మాసబ్ ట్యాంక్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వైపు వెళ్లే వాహనాలను సరోజిని దేవి కంటి ఆసుపత్రి వద్ద లక్ష్మీనగర్ రాంప్ (పిల్లర్ నంబర్ 77) వైపునకు మళ్లిస్తారు
శంషాబాద్ విమానాశ్రయం నుంచి మెహదీపట్నం వైపు
శంషాబాద్ విమానాశ్రయం నుంచి మెహదీపట్నం వైపు వచ్చే వాహనాలు లక్ష్మీనగర్ రాంప్ (పిల్లర్ నంబర్ 88) వద్ద ఎగ్జిట్ తీసుకోవాల్సి ఉంటుంది. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వేపై పనుల పురోగతికి అనుగుణంగా వాహనాలను ఆయా డౌన్ రాంపుల ద్వారా కిందకు అనుమతిస్తారు.
ట్రాఫిక్ పోలీస్ విజ్ఞప్తి
వాహనదారులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అప్డేట్ల కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారిక ఫేస్బుక్ పేజీ (facebook.com/HYDTP), ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ (@HYDTP)లను పరిశీలించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ప్రయాణంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా.. సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్లైన్ నంబర్ 9010203626ను సంప్రదించవచ్చు. నగర ప్రజలు, వాహనదారులు ఈ ట్రాఫిక్ మళ్లింపులను గమనించి ట్రాఫిక్ ఇబ్బందులు లేని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సంపూర్ణంగా సహకరించాలని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజ్ఞప్తి చేశారు.
Wife Killed: ప్రియుడితో రహాస్య సంబంధం.. భర్తను భార్య హత్య చేసి జేసీబీతో పూడ్చివేత
Narayankhed (CT), Telangana:Extramarital Affair Crime: భర్తతో వివాహమై ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత భార్య వేరొకరితో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను వదిలేయాలని చూసింది. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్రణాళిక రచించింది. భర్తను ఫుల్లుగా తాగించి మద్యం మత్తులో ఉండడంతో అతడిని ప్రియుడితో కలిసి భార్య హత్య చేసింది. భర్త మృతదేహాన్ని అతడి సొంత పొలంలోనే జేసీబీతో గుంతలో పూడ్చివేసింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన ముత్యంరెడ్డికి, భార్య కల్పన ఉంది. వీరిద్దరికీ టీనేజ్ కలిగిన పిల్లలు ఉన్నారు. భర్త రోజువారీ వ్యవసాయ పనులు చేస్తుండేవాడు.. భార్య ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆమెకు మానూరు మండలం ఎల్గోయి గ్రామానికి చెందిన గైనీ పండరితో పరిచయమైంది. ఆ పరిచయం కాస్త వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. తరచూ వీరిద్దరూ కలుసుకునేవారు. ఈ క్రమంలో తమ బంధానికి ముత్యంరెడ్డి అడ్డుగా ఉన్నాడని భావించారు. అతడి అడ్డు తొలగించుకుంటే హాయిగా తామిద్దరం కలిసి జీవించవచ్చనే భావన ఏర్పడింది.
ఒకరోజు భర్త ముత్యంరెడ్డికి భార్య పీకలదాకా మద్యం తాగించింది. అనంతరం హత్య చేసి భర్త పొలంలోనే మృతదేహాన్ని జేసీబీ సహాయంతో పూడ్చిపెట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా పూడ్చిపెట్టిన ప్రాంతంలో రాళ్లు పెట్టారు. అయితే తొమ్మిది రోజులుగా ముత్యంరెడ్డి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు నారాయణఖేడ్ పోలీసులను ఆశ్రయించారు. భర్త కనిపించడం లేదని భార్య మిస్సింగ్ కేసు పెట్టింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా భార్య కల్పనపై పోలీసులు అనుమానం వ్యక్తం చేసి తమదైన విచారణ చేశారు. ఆమెతో పోలీసులు విస్తుగొలిపే నిజాలు బయటపెట్టారు. ఆమెతోపాటు ప్రియుడు పండరిని అదుపులోకి తీసుకుని విచారించారు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా మారుతున్నాడనే కారణంతోనే ముత్యంరెడ్డిని హత్య చేసినట్లు భార్యతోపాటు ఆమె ప్రియుడు పండరి పోలీసుల విచారణలో అంగీకరించారు. ఈ ఘటన నారాయణఖేడ్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల అధికారిక ప్రకటన అనంతరం వెల్లడి కానున్నాయి.
Petrol Card Offer: ఇలా చేస్తే 172 లీటర్ల పెట్రోల్ పూర్తిగా ఉచితం..వాహనదారులు ఎగిరి గంతేసే వార్త!
Hyderabad, Telangana:IDFC Petrol Card Offer: రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరలతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. ఇలాంటి సమయంలో ఇంధన ఖర్చులతో పాటు రోజువారీ షాపింగ్లపై వేల రూపాయలు ఆదా చేసుకునే అద్భుతమైన అవకాశం మార్కెట్లోకి వచ్చింది. అదే IDFC పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఏడాదికి 171 లీటర్ల పెట్రోల్ను ఉచితంగా పొందే అవకాశం ఉంది అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే క్రెడిట్ కార్డు కొనుగోలు చేయాలంటే రూ.499గా వార్షిక రుసుము వెచ్చించాల్సి ఉంటుంది. రెండో ఏడాది నుండి రూ.499 వసూలు చేస్తారు. అయితే, ఏడాదిలో రూ.1,50,000 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే ఈ వార్షిక రుసుము పూర్తిగా మాఫీ అవుతుంది. అయితే ఈ కార్డు జారీ చేసిన వెంటనే కస్టమర్లకు భారీ ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. HPCL బంకుల్లో చేసే మొదటి రూ.500 ఖర్చుపై రూ.500 విలువైన గిఫ్ట్ వోచర్ లభిస్తుంది. అలాగే మొదటి EMI కన్వర్షన్పై గరిష్టంగా రూ.1000 వరకు (5%) క్యాష్బ్యాక్ వస్తుంది. వీటికి అదనంగా రూ.1000 విలువైన మర్చంట్ ఆఫర్లు సొంతమవుతాయి.
అదనపు ప్రయోజనాలు..
ఈ క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఉచిత ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఉంటుంది. ప్రతి నెలా కనీసం రూ.20,000 ఖర్చు చేస్తే, త్రైమాసికానికి ఒకసారి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ను ఉచితంగా వాడుకోవచ్చు. అలాగే మూవీ టిక్కెట్లపై 25% వరకు (గరిష్టంగా రూ.100) తగ్గింపు లభిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఏటీఎం నుండి నగదు తీసుకుంటే గడువు తేదీ వరకు 0% వడ్డీ వర్తిస్తుంది (కేవలం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది). అదే విధంగా ఈ కార్డు వినియోగదారుల రూ.2,00,000 విలువైన ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా లభిస్తుంది. రోడ్సైడ్ అసిస్టెన్స్ కోసం రూ.1,399 విలువైన రోడ్సైడ్ సహాయం ఉచితంగా అందుకోవచ్చు.
172 లీటర్ల పెట్రోల్ లెక్క ఎలా?
ఒక లీటర్ పెట్రోల్ ధర సుమారు రూ.110 గా లెక్కిస్తే.. ఈ కార్డు ద్వారా లభించే రివార్డులు, క్యాష్బ్యాక్ల రూపంలో ఏడాదికి మొత్తం రూ.18,918 వరకు ఆదా చేసుకోవచ్చు. అంటే దాదాపు 172 లీటర్ల పెట్రోల్ ఉచితంగా పొందినట్లే లెక్క! అంతేకాకుండా, మీ స్నేహితులకు ఈ కార్డును రిఫర్ చేయడం ద్వారా అదనంగా మరో 10,000 రివార్డ్ పాయింట్లను కూడా సొంతం చేసుకోవచ్చు. తక్కువ వడ్డీ రేట్లు, ఎక్కువ ప్రయోజనాలు ఉన్న ఈ క్రెడిట్ కార్డ్ నిత్యం ప్రయాణాలు చేసే వారికి ఒక గొప్ప అసెట్ అని చెప్పవచ్చు.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం పాఠకాస్తకి కోసమే పొందుపరిచింది. దీన్ని పాటించే ముందు సంబంధిత అధికారిక వెబ్సైట్ను సందర్శించగలరు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: మందుబాబులకు మత్తు దిగిపోయే వార్త..భారీగా పెరగనున్న మద్యం ధరలు..ఎంత పెరుగుతుందంటే?
Also Read: వడదెబ్బతో రాష్ట్రంలో 34 మంది మృతి..ఒక్కొక్కరికి రూ.4 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chiyaan Vikram Fitness: 60 ఏళ్ల వయసులో కుర్రోడిలా చియాన్ విక్రమ్..ఫిట్నెస్, డైట్ సీక్రెట్స్ ఏంటో తెలుసా?
Hyderabad, Telangana:Chiyaan Vikram Workout: తమిళ చిత్ర పరిశ్రమలో చియాన్ విక్రమ్ తిరుగులేని నటుడిగా నిరూపించుకున్నారు. సినిమాలోని క్యారెక్టర్ కోసం ఆయన తన బాడీని పూర్తిగా ట్రాన్స్ఫర్మేన్ చేసుకోవడం దిట్ట. ఉదాహరణకు 'ఐ: మనోహరుడు' సినిమాలోని మూడు విభిన్న పాత్ర కోసం ఆయన శరీరాన్ని మలుచుకున్న తీరు ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చింది. దాదాపుగా 60 ఏళ్ల వయసున్న నటుడు విక్రమ్.. ఈ వయసులోనూ ఫిట్గా కుర్రాళ్లకు దీటుగా కనిపిస్తున్నాడు.
ఎంతో అంకితభావంతో తన ఫిట్నెస్ను ఆ విధంగా కొనసాగిస్తున్నాడు. తాజాగా ఆయన కొన్ని జిమ్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వాటిని చూసిన ఫ్యాన్స్ 60 ఏళ్ల వయసులోనూ ఇంత యవ్వనంగా ఉండడం ఎలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారు.
చియాన్ విక్రమ్ ఎప్పుడూ ఒకే రకమైన వ్యాయామాలు చేయరట. అతను ప్రతి పాత్రకు తగినట్లుగా తన శిక్షణ దినచర్యను మార్చుకుంటాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్లైయోమెట్రిక్ వ్యాయామాలు అతని ఫిట్నెస్ దినచర్యలో ఒక ముఖ్యమైన భాగమని అన్నారు. ఈ వ్యాయామాలు శరీరానికి వేగం, చురుకుదనాన్ని ఇవ్వడమే కాకుండా, కండరాల బలాన్ని కూడా మెరుగుపరుస్తాయట.
అదేవిధంగా, కార్డియో వ్యాయామాలు, వెయిట్లిఫ్టింగ్ వ్యాయామాలు అతని దినచర్యలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. 'ఐ' చిత్రంలో బాడీబిల్డర్ పాత్ర కోసం భారీ వెయిట్లిఫ్టింగ్, గూనన్ పాత్ర కోసం బరువు తగ్గడానికి కార్డియో వ్యాయామాలు వంటి పూర్తిగా భిన్నమైన వర్కౌట్లను అతను చేశాడు.
డైటింగ్ ఎంతో ముఖ్యం..
విక్రమ్ తన శరీరాకృతి మార్పులో ఆహార నియంత్రణకు చాలా ప్రాముఖ్యత ఇస్తాడు. శరీరాకృతి కేవలం వ్యాయామం వల్ల మాత్రమే కాకుండా, మనం తీసుకునే ఆహారం ప్రభావం వల్ల కూడా ఏర్పడుతుందని అతను నమ్ముతాడు. అందుకే, షూటింగ్ సమయంలో అతను చాలా ప్రణాళికాబద్ధమైన ఆహారాన్ని పాటిస్తాడు. బరువు తగ్గే సమయంలో, అతను ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లను ఎక్కువగా తింటాడు. అతను కార్బోహైడ్రేట్ ఆహారాలను తగ్గించి, గుడ్డులోని తెల్లసొన, ఉడికించిన చేపలు, చికెన్ వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకుంటాడు.
దర్శకుడు శంకర్ 'ఐ' చిత్రంలోని పాత్ర కోసం విక్రమ్ చూపిన అంకితభావమే ఇందుకు ప్రధాన ఉదాహరణ. ఆ చిత్రంలో ఆయన దాదాపు 90 కిలోల బరువు తగ్గి 52 కిలోలకు చేరుకున్నారు. ఆ సినిమా కోసం, ఆయన కఠినమైన ఆహార నియమాలు పాటిస్తూ, చాలా తక్కువ కేలరీలు తీసుకుంటూ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు.
అదేవిధంగా పి.రంజిత్ 'తంగలన్' కోసం ఒక సాధారణ కూలీ పాత్రలో ఒదిగిపోవడానికి ఆయన తన శరీరాకృతిని మార్చుకున్నారు. ఆయన కండల శరీరం నుండి ముఖ కవళికల వరకు, పాత్రలోని భావోద్వేగాలను పండించడానికి ఎంతగానో కష్టపడ్డారనేది గమనించదగ్గ విషయం.
విక్రమ్ శారీరక పరివర్తన వెనుక గొప్ప పోరాటం ఉంది. అతని కళాశాల రోజుల్లో జరిగిన ఒక ఘోర ప్రమాదంలో, అతను మళ్లీ నడవలేడని వైద్యులు చెప్పారట. కాళ్లు తీసివేయాల్సిన పరిస్థితి వచ్చినా, విక్రమ్ వెనుకాడలేదు. ఎన్నో శస్త్రచికిత్సలు, సుదీర్ఘ విశ్రాంతి, ఊతకర్రల సహాయంతో ప్రయాణించడం వంటి వాటిని తట్టుకుని అతను ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నాడు. ఆ అనుభవం అతని సంకల్ప బలాన్ని మరింత బలపరిచిందని అంటారు. ఈ రోజు తమిళ చిత్రసీమలో అత్యంత కష్టపడి పనిచేసే నటులలో ఒకరిగా గుర్తింపు పొందడం అతనికి అంత సులభమైన విషయం కాదు.
Also Read: 'పెద్ది' సినిమాలోని ఐటెంసాంగ్ వచ్చేసింది! జాన్వీ కపూర్, శ్రుతిహాసన్ రచ్చలేపేశారు!
Also REad: విద్యార్థులకు బిగ్ అలర్ట్..మే 31తో వేసవి సెలవులు ముగింపు..జూన్ 1 నుంచి క్లాసులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KT Rama Rao: మూసీ ప్రాజెక్టు పేరిట రేవంత్ రెడ్డి రూ.లక్షల కోట్ల దోపిడీ: కేటీఆర్
Hyderabad, Telangana:BRS Party: 'ఉన్న నగరాన్ని పట్టించుకునే శక్తి లేదు కానీ.. 'ఫ్యూచర్ సిటీ' అంటూ అడ్డగోలు మాటలు చెబుతున్నారు. ఉన్న నగరాన్ని పట్టించుకోవడం చేతగాని రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో పోజులు కొడుతున్నాడు' అని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న హైదరాబాద్ నగరంలో కనీసం మోరి తీసి చెత్త ఎత్తే పరిస్థితిలో కూడా లేని రేవంత్ రెడ్డి.. ఫ్యూచర్ సిటీ అంటే ఎవరూ నమ్మరని తెలిపారు. ఫ్యూచర్ లేని రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కడతా అంటే పట్టించుకునేది ఎవరూ అని ప్రశ్నించారు.
Also Read: KTR: కాంగ్రెస్ వస్తే ఉచిత విద్యుత్ పోతుంది.. కరెంట్ కష్టాలు వస్తాయి: కేటీఆర్
'హైదరాబాద్ నగరంలో మూసీని ప్రక్షాళన చేస్తా అంటున్న రేవంత్ రెడ్డి లక్షల కోట్ల రూపాయలు దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపు కేసీఆర్ ప్రభుత్వం హయాంలోనే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టి.. దాదాపుగా పూర్తయిన మూసీ నది ప్రక్షాళన పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకునేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు' అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ముగిసిపోయిన మూసీ ప్రక్షాళనపై రేవంత్ రెడ్డి కేవలం కాంట్రాక్ట్ కమిషన్ల కోసమే మాట్లాడుతున్నారని ఆరోపణలు చేశారు.
Also Read: AP Govt Holiday: సెలవులు ఇచ్చేయండి.. సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
'ఎలాంటి విధ్వంసం లేకుండా.. ఎలాంటి ఇళ్ల తొలగింపు లేకుండా మూసీ ప్రక్షాళన చేయాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిస్తే.. ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం వేలాది మంది ఇండ్లు కూలగొట్టి, మూసీ నది ప్రక్షాళన పేరుతో లక్షలాది మంది ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మూసీపై ఎస్టీపీలు, బ్రిడ్జీల నిర్మాణం ప్రారంభించిన తర్వాత.. ఇప్పుడు మళ్లీ రూ.లక్షన్నర కోట్లతో మూసీ ప్రక్షాళన పేరుతో నాటకాలు ఎందుకు అని ప్రశ్నించారు.
అడ్డగోలు హామీలు ఇచ్చి.. అడుగడుగునా అరాచకాలు, అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రజలు ఇచ్చిన ఐదు సంవత్సరాల కాలంలో సగం పూర్తయినా ఇప్పటిదాకా ప్రజలకు, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేక చేతులెత్తేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు, పరిపాలనా వైఫల్యాలు, అవినీతిపైన ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని గుర్తుచేశారు. కచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: Rajya Sabha Elections: తెలుగుదేశం పార్టీకి జోష్.. పెద్దల సభలో పెరగనున్న బలం
త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించిన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామని.. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 1000 మంది పార్టీ కార్యకర్తలకు ఈ శిక్షణ ఇస్తామని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలపై.. అన్యాయాలపై.. ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చి మోసం చేస్తున్న తీరుపై కూడా అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.
ఈసారి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పూర్తిగా డిజిటల్ రూపంలో ఉంటుందని పార్టీ వర్కంగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ముందుగా సభ్యత్వ నమోదు.. తర్వాత శిక్షణా కార్యక్రమాలు ఉంటాయ్నారు. హైదరాబాద్ నగర పరిధిలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై, కాంగ్రెస్ ప్రభుత్వంపైన పోరాటం చేసిన వారికే కార్పొరేటర్ టికెట్లు ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. కేవలం గెలుపే లక్ష్యంగా సర్వేల ఆధారంగా పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులకు అవకాశం ఇస్తుందని తెలిపారు.
ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ రెండున్నర సంవత్సరాల కాలంలో చేసిన అన్యాయాలు, అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. రెండున్నర సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టని రేవంత్ రెడ్డి.. అడ్డగోలుగా 'హైడ్రా' పేరుతో వేల ఇండ్లు కూలగొట్టారని గుర్తుచేశారు. గతంలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్ీ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో లక్ష ఇళ్లు నిర్మాణం చేస్తే, కాంగ్రెస్ మాత్రం వేల ఇండ్లు కూలగొట్టిందని తెలిపారు.
KTR: కాంగ్రెస్ వస్తే ఉచిత విద్యుత్ పోతుంది.. కరెంట్ కష్టాలు వస్తాయి: కేటీఆర్
Hyderabad, Telangana:Free Power To Farmers: ఉచిత విద్యుత్తు రద్దు కోసమే కాంగ్రెస్ మోటర్లకు మీటర్లను పెడుతుందని.. ప్రీపెయిడ్ మీటర్లతో విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయబోతున్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వస్తే ఉచిత విద్యుత్తు పోతుందని ఆనాడే హెచ్చరించామని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రీపెయిడ్ మీటర్లు రాబోతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ కరెంటు కుట్రలను ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
Also Read: AP Govt Holiday: సెలవులు ఇచ్చేయండి.. సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
హైదరాబాద్లోని అంబర్పేటలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సమావేశంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్తో కలిసి పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. 'రాష్ట్రంలో ప్రీపెయిడ్ మీటర్లు తీసుకువచ్చేందుకు.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలో ఉన్న ఉచిత విద్యుత్ను ఎగొట్టేందుకు.. ప్రీపెయిడ్ మీటర్ల పేరుతో విద్యుత్ రంగాన్ని పూర్తిగా అదానీ వంటి ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పెందుకే రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు' అని కేటీఆర్ ఆరోపించారు.
Also Read: Rajya Sabha Elections: తెలుగుదేశం పార్టీకి జోష్.. పెద్దల సభలో పెరగనున్న బలం
మోటర్లకు మీటర్లు పెట్టి పూర్తిగా రైతన్నలకు ఉచిత విద్యుత్తును కాంగ్రెస్ ఎత్తగొట్టే కుట్ర చేస్తున్నదని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతోపాటు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రస్తుతం ఉన్న మీటర్లు తొలగించి ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నిన్న మంత్రివర్గంలో మీటర్లన్నింటినీ తొలగించి ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తం గ్రామాల్లో, పట్టణాల్లో వ్యవసాయాలకు ప్రీపెయిడ్ మీటర్లు వస్తాయి' అని చెప్పారు.
మోటార్లకు మీటర్లు రాకముందే.. ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రీపెయిడ్ మీటర్లు తేకముందే కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు తీసివేయాలని మాజీ మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ విద్యుత్ రంగంలో చేస్తున్న కరెంటు కుట్రలపైన తిరగబడాలని కోరారు. ఎన్నికలకు ముందే ప్రజలకు కాంగ్రెస్ వస్తే ఉచిత విద్యుత్ పోతుందని హెచ్చరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మోటర్ల దగ్గర మీటర్లు వస్తాయని.. ప్రీపెయిడ్ మీటర్ల పేరుతో ప్రవేట్ సంస్థలకు విద్యుత్ రంగాన్ని అప్పజెప్తారని కేసీఆర్ హెచ్చరించారని కేటీఆర్ జ్ఞాపకం తెచ్చుకున్నారు.
దేశవ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్న ప్రీపెయిడ్ మీటర్లను కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తీసుకురావడం దారుణమని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని గతంలో నరేంద్ర మోదీ ఎంత ఒత్తిడి చేసినా.. రూ.30 వేల కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఆపినా కేసీఆర్ ఎదిరించారు, మీటర్లు పెట్టలేదని గుర్తుచేశారు. రానున్న మూడు నెలల్లోనే మొత్తం మీటర్లు పెడతామని చెప్పి నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
రానున్న మూడు నెలల్లోనే ఉన్న మీటర్లు పీకేసి, ప్రీపెయిడ్ మొబైల్స్ మాదిరి ప్రీపెయిడ్ కరెంట్ మీటర్లను తీసుకురాబోతున్నదని.. అయితే కాంగ్రెస్ ఉచిత కరెంట్ను ఎగొట్టడం కోసమే ప్రీపెయిడ్ మీటర్లను తీసుకువస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కేవలం ఉచిత విద్యుత్ను రద్దు చేయాలనే ఏకైక ఉద్దేశంతోనే అదానీ, అంబానీలకు విద్యుత్ సంస్థలను అప్పగించాలనే లక్ష్యంతోనే తెలంగాణ మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకున్నదని వివరించారు. కాంగ్రెస్ పార్టీపైన ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని.. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు బలమైన గుణపాఠం కాంగ్రెస్ పార్టీకి చెప్తారని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Kaleshwaram: కాళేశ్వరంలోని ఈ రహస్య ఆలయ మీకు తెలుసా? కాశీతో సమానమైన ముక్తినిచ్చే క్షేత్రం..
Hyderabad, Telangana:Adi Mukteshwar Temple Kaleshwaram: భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కాలేశ్వరంలో మరో అద్భుత ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది.. ఇక్కడి ప్రధాన ఆలయానికి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో కొలువై ఉన్న ఆది ముక్తేశ్వరాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. కాశీ క్షేత్రానికి వెళ్తే ఎలాంటి పుణ్యం, ముక్తి లభిస్తుందో.. ఇక్కడి ఆది ముక్తేశ్వరుడిని దర్శించుకుంటే అలాంటి ముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.. ఈ ఆలయ విశిష్టత గురించి ఆలయ ప్రధాన పూజారి స్రవణ్ కుమార్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు..
ఆలయ విశిష్టతను పూజారి శ్రవణ్ కుమార్ వివరిస్తూ.. ఈ ఆలయానికి ఆ పేరు రావడం వెనక ఒక గొప్ప పురాణ నేపథ్యం ఉందని తెలిపారు.. కలియుగం ప్రారంభం కాకముందే.. అంటే కాలం ఆదిలోనే ఇక్కడ శివుడు స్వయంభుగా వెలిశాడు.. సృష్టి ఆదిలోనే ఇక్కడ ఈశ్వర లింగం ఆవిర్భవించడం వల్లనే ఈ స్వామికి ఆది ముక్తేశ్వరుడు అనే పేరు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. యుగయుగాలుగా ఈ ఆలయం ఇక్కడ భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతూ వస్తోంది..
హిందూ సాంప్రదాయంలో కాశీ క్షేత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.. కాశీలో మరణిస్తే పునర్జన్మ లేకుండా నేరుగా ముక్తి లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, అంతటి సుదూర ప్రాంతంలో ఉన్న కాశీకి వెళ్లలేనని భక్తుల కోసం కాలేశ్వరంలోనే ఈ ఆదిముక్తేశ్వరుడు కొలువుదీరాడని భక్తులు విశ్వసిస్తారు.. కాశీ క్షేత్రంలో మరణిస్తే మానవుడికి ఎలాంటి ముక్తి మోక్షం లభిస్తాయో.. పవిత్ర గోదావరి తీరాన ఉన్న ముక్తేశ్వరంలోని ఈ ఆది ముక్తేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటే అలాంటి లాభాలే కలుగుతాయని ఆలయ పూజారి శ్రవణ్ కుమార్ తెలిపారు..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
కాలేశ్వరానికి వచ్చే భక్తులు కేవలం ప్రధాన ఆలయాన్ని మాత్రమే కాకుండా ఈ ఆది ముక్తేశ్వర ఆలయాన్ని కూడా తప్పకుండా సందర్శించుకుంటున్నారు. ముఖ్యంగా కార్తీక మాసంతో పాటు మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో ఈ ఆలయం భక్తుల కోలాహలంతో.. వేదమంత్రాలతో మారు మోగుతుంది. ఇక్కడి పవిత్ర వాతావరణంతో పాటు ప్రాచీన లింగం భక్తులకు మానసిక ప్రశాంతతను అందిస్తున్నాయి. కాలేశ్వరం వెళ్లే ప్రతి ఒక్కరు ఈ ముక్తి ప్రధాన దర్శించుకుంటే జీవితంలో అద్భుతం జరుగుతుందని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
