సాఫ్ట్వేర్ బాలికపై అత్యాచారం చేసిన వనస్థలిపురంలోని హోటల్ను పోలీసులు సీజ్ చేశారు
Vanasthalipuram, Telangana:వనస్థలిపురం సీఐ అశోక్రెడ్డి, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కందుకూరు రంగారెడ్డి జిల్లా అధికారి సుధీర్బాబు ఆదేశాల మేరకు ఈరోజు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరస్తు బార్ అండ్ రెస్టారెంట్ బొమ్మరిల్లు కాంప్లెక్స్ను సీజ్ చేశారు పట్టించుకోలేదు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Fuel Prices Decrease: కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గుదల?
Wadgaon, Maharashtra:Fuel Prices Likely To Decrease: అనూహ్యంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతోపాటు విమాన ధరలు తగ్గముఖం పట్టనున్నట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్తోపాటు గ్యాస్, విమాన ఇంధన ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెంచింది. ధరల పోటుతో సతమతమవుతున్న ప్రజలకు భారీ ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న కీలక నిర్ణయంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్, విమాన ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉంది.
వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ సహా విమాన ఇంధన ధరలు క్రమంగా పెరుగుతున్న వేళ భగ్గుమన్నాయి. ఈనేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ఇంధన ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.10,000 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర మంత్రివర్గంలో ఆమోదం పొందిన విషయాన్ని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన చేశారు. నిధులు కేటాయించడంతో విమానయాన సంస్థలకు భారీ ప్రయోజనం సమకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీలో బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏటీఎఫ్ ధరల స్థిరీకరణకు మద్దతు అందించేందుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రూ.10,000 కోట్లకు మించని బడ్జెట్ మద్దతుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్ మద్దతు, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ద్వారా వడ్డీ లేని అడ్వాన్స్ల రూపంలో చెల్లించనుంది.
కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీలు, ఎంఆర్ఓలు, ట్రావెల్ ఏజెన్సీలు, ఆతిథ్య , లాజిస్టిక్స్ రంగాలలో ఉపాధి రక్షణకు తోడ్పాటు లభిస్తుందని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణంతో ఏవియేషన్ టర్బైన్ ఇంధనాన్ని 2.5 రెట్లు పెంచాల్సి వచ్చిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ గుర్తుచేశారు. మార్చి 2026లో ఏవియేషన్ టర్బైన్ ఇంధనాన్ని లీటర్కు రూ.60.5, మే 2026లో లీటర్కు రూ.142కు చేరిందని వివరించారు.
తెలంగాణకు భారీ శుభవార్త
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు భారీ శుభవార్త వినిపించింది. జాతీయ రహదారి (ఎన్హెచ్)-63లోని ఆర్మూర్- జగిత్యాల- మంచిర్యాల రోడ్డును విస్తరించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రహదారిని హ్యామ్ పద్ధతిలో అభివృద్ధి చేయనుంది. ఇక జాతీయ రహదారి (ఎన్హెచ్)-563లోని జగిత్యాల- కరీంనగర్ రోడ్డును బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (టోల్) పద్ధతిలో 4 లేన్ల మేర విస్తరించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పనులు మూడు వర్క్ ప్యాకేజీల కింద మొత్తం 190.76 కిలోమీటర్ల పొడవుతో రూ.7597.16 కోట్ల వ్యయంతో చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
India Vs New Zealand 2026: న్యూజిలాండ్ పర్యటనకు సిద్ధమైన భారత జట్టు..కోహ్లీ, రోహిత్ శర్మతో 5 మ్యాచ్లు..ఎప్పుడంటే?
Hyderabad, Telangana:India Vs New Zealand 2026 Schedule: క్రికెట్ అభిమానులకు పండగే! టీమిండియా ఈ ఏడాది అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు న్యూజిలాండ్లో సుదీర్ఘంగా పర్యటించనుంది. దాదాపు 40 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ఇరు జట్లు అన్ని ఫార్మాట్లలో తలపడనున్నాయి. ఇందులో భాగంగా 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్లు జరగనున్నాయి. ఈ విధంగా కివీస్ పర్యటనలో టీమ్ఇండియా మొత్తంగా 12 మ్యాచ్ల్లో ఆడనుంది.
వందేళ్ల బంధం, చారిత్రాత్మక పర్యటన..
న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలోని ఇంత సుదీర్ఘ పర్యటన జరగటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గతంలో ఏ దేశ జట్టు కూడా కివీస్ గడ్డపై ఇన్ని మ్యాచ్లు సుదీర్ఘ సిరీస్ ఆడిన సందర్భాలు లేవు. పైగా భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య నెలకొన్న వందేళ్ళ క్రీడా సంబంధాలను ఈ పర్యటన ఒక చారిత్రాత్మక ప్రత్యేకంగా నిలవనుంది.
భారత్ చివరిసారిగా 2019-20 సీజన్లో న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ఆడింది. అయితే ఆ సిరీస్ తర్వాత కివీస్ జట్టు రెండుసార్లు భారత్లో పర్యటించింది. ముఖ్యంగా 2024-25 భారత పర్యటనలో కివిస్ జట్టు 3-0 తేడాతో టెస్ట్ సిరీస్ ను క్లీన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి బదులుగా తీర్చుకునేందుకు టీమ్ఇండియా రెడీ అవుతుంది. వన్డే సిరీస్లో భాగంగా టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 5 వన్డేలు ఆడనున్నారు.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ పూర్తి షెడ్యూల్
అక్టోబర్ 22న టీ20 సిరీస్ తో పర్యటన ప్రారంభమై నవంబర్ 4న వన్డే సిరీస్, నవంబర్ 19 నుంచి టెస్ట్ సిరీస్ జరగనున్నాయి.
1) టీ20 సిరీస్ షెడ్యూల్ (5 మ్యాచ్లు)
మొదటి టీ20 మ్యాచ్: అక్టోబర్ 22 (క్రైస్ట్చర్చ్)
రెండో టీ20 మ్యాచ్ : అక్టోబర్ 24 (క్రైస్ట్చర్స్)
మూడో టీ20 మ్యాచ్: అక్టోబర్ 27 (వెల్లింగ్టన్)
నాలుగో టీ20 మ్యాచ్: అక్టోబర్ 30 (ఆక్లాండ్)
అయిదో టీ20 మ్యాచ్: నవంబర్ 1 (హామిల్టన్)
2) వన్డే సిరీస్ షెడ్యూల్ (5 మ్యాచ్లు)
తొలి వన్డే మ్యాచ్: నవంబర్ 4 (ఆక్లాండ్)
రెండో వన్డే మ్యాచ్: నవంబర్ 7 (వెల్లింగ్టన్)
మూడో వన్డే మ్యాచ్: నవంబర్ 10 (హామిల్టన్)
నాలుగో వన్డే మ్యాచ్: నవంబర్ 13 (మౌంట్ మాంగనూయి)
అయిదో వన్డే మ్యాచ్: నవంబర్ 15 (మౌంట్ మాంగనూయి)
3) టెస్ట్ సిరీస్ షెడ్యూల్ (2 మ్యాచ్లు)
మొదటి టెస్ట్ నవంబర్ 19 నుండి 23 వరకు వెల్లింగ్టన్ వేదికగా జరగనుంది.
రెండో టెస్ట్ నవంబర్ 27 నుండి డిసెంబర్ 1 వరకు క్రైస్ట్చర్చ్ వేదికగా జరగనుంది.
Also Read: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఇవి గమనించారా? ఆర్సీబీ Vs జీటీ మ్యాచ్లో 5 వింత ఘటనలు!
Also REad: వైభవ్ సూర్యవంశీకి తప్పిన ప్రమాదం..గుజరాత్ బౌలర్లపై మాజీ క్రికెటర్ పఠాన్ ఆగ్రహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Pawan Kalyan Telangana: జనసేనాని పవన్ కళ్యాణ్పై గద్దర్ కూతురు ఘాటు వ్యాఖ్యలు..సీఎం చంద్రబాబు మద్దతు!
Hyderabad, Telangana:Pawan Kalyan Telangana News: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటనలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై ప్రజాగాయకుడు గద్దరు కుమార్తె వెన్నెల స్పందించారు. పవన్ నటుడిగా, తన తండ్రి అభిమానిగా గౌరవిస్తానని చెప్తూనే.. తెలంగాణ అస్తిత్వం, ఉద్యమ త్యాగాలను ఆమె బలంగా గుర్తు చేశారు.
"తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీరు.. ఈరోజు మా జాగీరు.. రేపు మా బిడ్డల జాగీరు" అంటూ ఈ నేలతో తమకున్న విడదీయరా నిబంధాన్ని వెన్నెల స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం కేవలం ఒక ప్రాంత ఉద్యమం కాదని అది కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవ పోరాటమని ఆమె పేర్కొన్నారు. గతంలో తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించినందుకు ఎంతో మందిని ఎన్కౌంటర్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంతోమంది తల్లుల తమ బిడ్డలను కోల్పోయి అసంఖ్యాకమైన త్యాగాలు చేయడం వల్ల ఈరోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా సహకారం ఏందని వెన్నెల గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూనే తెలంగాణ ఉద్యమ చరిత్రను అమరవీరుల బలిదానాలను తక్కువ చేసి చూడద్దని సందేశాన్ని వెన్నెల ఈ సందర్భంగా బలంగా వినిపించారు.
పవన్ కళ్యాణ్కు సీఎం చంద్రబాబు మద్దతు..
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలంగాణ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై కొందరు నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కు పూర్తి మద్దతుగా నిలిచారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభను పర్యటన అడ్డుకోవాలని చూడడం ఏమాత్రం సరికాదని ఆయన హితవు పలికారు.
ఇతర రాష్ట్రాల్లో తాను కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్లినట్టు సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాను కూడా తమిళనాడు వెళ్లి ఎన్నికల ప్రచారం చేసినట్లు అలాగే కర్ణాటకకు చెందిన ఉపముఖ్యమంత్రి శివకుమార్ కూడా ఇతర రాష్ట్రాల ప్రచారానికి వెళ్లారని ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా ప్రచారం చేసుకునే హక్కు ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. "మనం రాష్ట్రాలుగా విడిపోయి ఉండొచ్చు కానీ, తెలుగువారికి మనం అంత కలిసి ఉండాలి. ఒకరు సహకరించుకుంటూ రెండు రాష్ట్రాల అభివృద్ధి చేసుకోవాల"ని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
తెలంగాణ నేతలు విమర్శలను తిప్పికొడుతూనే చంద్రబాబు నాయుడు గత విషయాలను గుర్తు చేశారు. "గతంలో ఆంధ్రప్రదేశ్ లోను బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ అనేది జాతీయ పార్టీ అని అప్పట్లో వాళ్ళు చెప్పుకున్నారు కదా అని మరి ఇప్పుడు అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ని పర్యటన ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నార"ని ఆయన ప్రశ్నించారు.
అమెరికా వంటి దేశాల్లో తెలుగు వారు సెనేటర్లుగా ఎదుగుతున్న తరుణంలో ప్రజలకు సేవ చేయాల్సిన వారు ప్రజల్లో వైషామ్యాలను రెచ్చగొట్టడం సరికాదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తెలంగాణలో కొందరు నేతలు చేస్తున్న విమర్శలను అర్దరహితమని రాజకీయాల కంటే తెలుగువారి ఐక్యత ముఖ్యమని చంద్రబాబు బలంగా గళం వినిపించారు.
Also Read: తెలంగాణ ఏర్పాటుపై పవన్ కల్యాణ్ కీలక పోస్ట్..2009 నాటి వీడియో బయటపెట్టిన జనసేనాని!
Also Read: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు తెలంగాణ ప్రభుత్వం ఝలక్..బహిరంగ సభకు అనుమతి లేదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Rains: వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. తెలంగాణలోని 18 జిల్లాల్లో భారీ వర్షాలు
Baddipadaga, Telangana:Tomorrow Heavy Rains In Telangana: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. వేసవికాలంలో ఎండ వేడిమి.. ఉక్కపోతతో కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలోని 18 జిల్లాల్లో నేటి సాయంత్రంతోపాటు రేపు గురువారం భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వివరించింది. ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఈ వర్షాల ప్రభావం ఉండనుందని తెలిపింది.
వర్షాలు పడే జిల్లాలు ఇవే
ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ. ఈ 18 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ అధికారులు 'ఆరెంజ్' అలర్ట్ ప్రకటించారు.
వర్షాకాలం ఈసారి త్వరగానే ప్రారంభమవుతున్నట్టు కనిపిస్తోంది. వేసవికాలం ముగింపునకు రాగా.. నైరుతి రుతుపవనాలు ఈసారి త్వరగా ముందుకు వస్తున్నాయి. రేపటిలోగా కేరళ, తమిళనాడు తీరాలను తాకనున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నుంచే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాలపై వర్షం ప్రభావం ఉంటుందని తెలిపింది.
ఈ భారీ వర్షాలతోపాటు బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది. మంగళవారం రాత్రి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రాత్రంతా ఎడతెరిపి లేకుండా వాన కురవడంతో ఆ ప్రాంతాలు ఆహ్లాదకరంగా మారాయి. రాబోయే రెండు రోజులు మరిన్ని భారీ వర్షాలు పడనుండడంతో రైతులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ప్రజలకు అధికారులు సూచనలు చేశారు.
నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరబిక్ మహాసముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ దీవులు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, నైరుతి, పశ్చిమ-మధ్య, తూర్పు-మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలలోకి జూన్ 4వ తేదీన నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ద్రోణి 1 పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతం నుంచి ఉత్తర తమిళనాడు వరకు మధ్యప్రదేశ్ విదర్భ తెలంగాణ, రాయలసీమ మీదుగా సగటు సముద్రమట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తులో ఏర్పడింది. దీని ప్రభావం ఎల్లుండి కూడా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
వాతావరణ హెచ్చరికలు
==> ఈరోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, 50 నుంచి 60 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
==> ఎల్లుండి శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు 40 నుంచి 50 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
Dancer Pandu Accident: డాన్స్ మాస్టర్ పండు కారు ప్రమాదం..తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలింపు!
Visakhapatnam, Andhra Pradesh:Dancer Pandu Accident News: బుల్లితెర డ్యాన్స్ షో ద్వారా సుపరిచితమైన డాన్స్ మాస్టర్ పండు బుధవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి మరో వాహనం బలంగా ఢీకొట్టడం వల్ల ఆయన కాళ్లకు తీవ్ర గాయాలైనట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం వైజాగ్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాన్సర్ పండు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.APSRTC Privatisation: ఆర్టీసీ ప్రైవేటీకరణపై తాడోపేడో తేల్చుకోనున్న ఉద్యోగ సంఘాలు..ఆ రోజే యూనియన్ కీలక మీటింగ్!
Vijayawada, Andhra Pradesh:APSRTC Privatisation News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)లో ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయనే ఆందోళనల నడుమ ఉద్యోగ సంఘాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ప్రైవేట్ సంస్థల ద్వారా ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీసీ కార్మికులు ఏకమవుతున్నారు. దీనిపై చర్చించేందుకు జూన్ 8న విజయవాడలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు.
ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే..
1) ప్రైవేట్ సంస్థల ద్వారా విద్యుత్ బస్సులను నడిపించే విధానాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి.
2) ఈ-బస్సుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా అందుకుని, ఆర్టీసీ సిబ్బందితోనే సొంతంగా వాటిని నిర్వహించాలి.
3) లీజుల పేరుతో విలువైన ఆర్టీసీ డిపోల స్థలాలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నాలను వెంటనే అడ్డుకోవాలి.
జూన్ 8న 'జేఏసీ' ఏర్పాటు..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకముందు ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లు ఒకే తాటిపైకి రావాలని నిర్ణయించాయి. దీని కోసం 'ఏపీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ' (JAC) ఏర్పాటు కానుంది. జూన్ 8న విజయవాడలో జరిగే ఈ సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ ప్రైవేటీకరణ వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించి, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు.
"దశాబ్దాలుగా ప్రభుత్వ రంగ సంస్థగా లక్షలాది మంది ప్రజలకు సేవలందిస్తున్న ఆర్టీసీని మరింత బలోపేతం చేయాల్సింది పోయి, ప్రైవేటీకరణ వైపు అడుగులు వేయడం ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది." అని ఏపీ పీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ ఆసోసియేట్ అధ్యక్షుడు వై.శ్రీనివాసరావు, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు సంయుక్తంగా ప్రకటించారు.
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలతో పాటు, ప్రస్తుతం అమలులో ఉన్న 'స్త్రీ-శక్తి' (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) పథకం వల్ల క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కూడా ఈ సమావేశంలో క్షుణ్ణంగా చర్చించనున్నారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఆర్టీసీ ఉద్యోగులు ఆర్-పార్ పోరాటానికి సిద్ధమవుతుండటంతో ఈ జూన్ 8 భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read: వైజాగ్లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన..బాత్రూమ్లో భయంకరమైన చప్పుళ్లు..కమోడ్ తెరిచి చూస్తే
Also Read: ఏపీలో కొత్త పెన్షన్ల పండగ షురూ..దరఖాస్తు అప్పుడే..ఈ పత్రాలు రెడీ చేసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Monitor Lizard: వైజాగ్లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన..బాత్రూమ్లో భయంకరమైన చప్పుళ్లు..కమోడ్ తెరిచి చూస్తే ఘోరం..
Gvmc, Andhra Pradesh:Monitor Lizard In Vizag: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన ఒకటి వెలుగుచూసింది. సెక్టార్-8లోని ఓ ఇంట్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులకు హఠాత్తుగా బాత్రూమ్ నుంచి వింత శబ్దాలు వినిపించాయి. లోపలికి వెళ్లి వెతకగా, వాష్ రూమ్ కమోడ్లో ఏదో పెద్ద జీవి కదులుతూ కనిపించింది. తొలుత దాన్ని చూసి కొండచిలువ లేదా పెద్ద పాము అని భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు, వెంటనే తలుపు మూసివేసి స్నేక్ క్యాచర్కు సమాచారం అందించారు.
పాము కాదు.. ఉడుము పట్టు!
సమాచారం అందుకున్న వెంటనే వందలాది పాములను రెస్క్యూ చేసిన అనుభవం ఉన్న స్నేక్ క్యాచర్ కిరణ్ అక్కడికి చేరుకున్నారు. కమోడ్లోకి నిశితంగా పరిశీలించిన ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ ఉన్నది పాము కాదు.. ఒక పెద్ద ఉడుము (Monitor Lizard).
సాధారణంగా ఉడుములకు పట్టు ఎక్కువ. ఒకసారి ఎక్కడైనా గట్టిగా పట్టుకుంటే వాటిని విడిపించడం చాలా కష్టం. దాదాపు గంటపాటు చాకచక్యంగా, శ్రమించి ఆ ఉడుముకు ఎలాంటి గాయం కాకుండా కిరణ్ సురక్షితంగా రెస్క్యూ చేశారు. దీంతో ఆ కుటుంబంతో పాటు స్థానికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
'బెంగాల్ మానిటర్ లిజర్డ్' గురించి తెలుసా?
మనం సాధారణంగా గ్రామాల్లో, పొలాల గెట్ల వద్ద లేదంటే పెద్ద పెద్ద కొండరాళ్ల మధ్య చూసే ఈ ఉడుమును 'బెంగాల్ మానిటర్ లిజర్డ్' అని పిలుస్తారు. ఇది ప్రకృతి సమతౌల్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది చాలా వేగంగా పరిగెత్తగలదు, చెట్లు ఎక్కగలడంతో అద్భుతంగా ఈదగలదు.
ఈ ఉడుము ఆహారంగా ఎలుకలు, పురుగులు, చిన్న పాములు, పక్షుల గుడ్లను తీసుకుంటుంది. పంటలను నాశనం చేసే జీవులను తింటూ ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుంది. వేసవి చివర్లో లేదా వర్షాకాలం ప్రారంభంలో ఇవి 10 నుండి 30 గుడ్లు పెడతాయి. ఉష్ణోగ్రత స్థిరంగా ఉండేలా చెదపురుగుల గుట్టల్లో లేదా నేలలో గుంతలు తవ్వి గుడ్లను దాచిపెడతాయి. 6 నుండి 9 నెలల తర్వాత పిల్లలు బయటకు వస్తాయి.
ఉడుము నాలుక కూడా పాములాగే రెండుగా చీలి ఉండి.. వాసనను పసిగట్టడానికి సహాయపడుతుంది. ప్రమాదం పొంచి ఉందని భావిస్తే ఇది తన బలమైన తోకతో దాడి చేయగలదు. ఇవి సాధారణంగా మనుషులపై దాడి చేయవు, కానీ రెచ్చగొడితే మాత్రం ప్రమాదకరంగా మారుతాయి.
ఉడుమును చంపితే జైలు శిక్షే!
అనేక అపోహల కారణంగా చాలామంది ఉడుములను చంపుతుంటారు, కానీ వన్యప్రాణుల రక్షణలో ఇవి చాలా కీలకం. భారత ప్రభుత్వ చట్టంలో 'వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972' ప్రకారం ఉడుములను రక్షిత జంతువుల జాబితాలో చేర్చారు. ఉడుములను వేటాడటం, చంపడం, వాటి గుడ్లను సేకరించడం లేదా మాంసం, చర్మం కోసం అక్రమ రవాణా చేయడం చట్టరీత్యా నేరం. ఈ నేరం నిరూపితమైతే 3 నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తారు.
Also Read: తెలంగాణ ఏర్పాటుపై పవన్ కల్యాణ్ కీలక పోస్ట్..2009 నాటి వీడియో బయటపెట్టిన జనసేనాని!
Also REad: ఏపీలో కొత్త పెన్షన్ల పండగ షురూ..దరఖాస్తు అప్పుడే..ఈ పత్రాలు రెడీ చేసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Pawan Kalyan Telangana: తెలంగాణ ఏర్పాటుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కీలక పోస్ట్..2009 నాటి సంచలన వీడియో బయటపెట్టిన జనసేనాని!
Hyderabad, Telangana:Pawan Kalyan On Telangana: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా (ఎక్స్) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాధన పట్ల తనకున్న నిబద్ధత ఈరోజుల్లో పుట్టుకొచ్చింది కాదని, దీనికి దశాబ్ద కాలానికి పైగా చరిత్ర ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గత స్మృతులను గుర్తుచేసుకుంటూ ఒక సుదీర్ఘ పోస్ట్ను పంచుకున్నారు.
2009లోనే గద్దర్తో కలిసి పోరాటం..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు తాను 2009 నుంచే మద్దతుగా నిలిచానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ 'యువరాజ్యం' అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే.. ప్రజా గాయకుడు గద్దర్తో కలిసి 'సామాజిక తెలంగాణ న్యాయ సభ'లో పాల్గొన్న ఆయన గుర్తుచేశారు.
నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యంమంత్రిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తరుణంలో కూడా.. తాను వెనకడుగు వేయకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు బహిరంగంగానే మద్దతు ప్రకటించానని జనసేనాని స్పష్టం చేశారు.
రాజకీయ లబ్ధి కోసం కాదు..
తాను నాడు పిలుపునిచ్చింది కేవలం భౌగోళిక తెలంగాణ కోసం మాత్రమే కాదని.. 'సామాజిక తెలంగాణ' కోసం అని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు తాను తెలిపిన వెనుక ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేదా రాజకీయ కోణాలు లేవని, అది పూర్తిగా సిద్ధాంతపరమైనది, నైతికమైనదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వివరించారు.
తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆవేదనను, వారి ప్రత్యేక రాష్ట్ర కాంక్షను తాను ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటానని పవన్ కల్యాణ్ ఈ పోస్ట్ ద్వారా మరోసారి పునరుద్ఘాటించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదే పోస్టును జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. పవన్ కల్యాణ్పై విమర్శలు చేసిన వారిని బలంగా ప్రశ్నిస్తున్నారు. వేర్పాటు రాజకీయాలకు జనసేనాని అతీతం అని ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు.
Also Read: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు తెలంగాణ ప్రభుత్వం ఝలక్..బహిరంగ సభకు అనుమతి లేదు!
Also Read: ఏపీలో కొత్త పెన్షన్ల పండగ షురూ..దరఖాస్తు అప్పుడే..ఈ పత్రాలు రెడీ చేసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Thalliki Vandanam: తల్లికి వందనం.. ప్రతి విద్యార్థికి రూ.15000 సాయం! ఆధార్ నెంబర్తో ఒకే క్లిక్లో మీ స్టేటస్ తెలుసుకోండి..
Hyderabad, Telangana:Thalliki Vandanam Status Check From Mobile 2026: పాఠశాలల్లో డ్రాప్ అవుట్లను అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'తల్లికి వందనం' ద్వారా ప్రతి ఏటా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 15,000 జమ చేస్తోంది. ఈ పథకం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ఒకటి నుంచి 12వ తరగతి విద్యార్థులకు వర్తిస్తుంది. ఇది విద్యార్థులకు ఆర్థికంగా తోడ్పడటమే కాకుండా.. పుస్తకాలు, యూనిఫాంల కోసం అయ్యే ఖర్చును కూడా తగ్గిస్తుంది. అయితే, ఈ పథకం ప్రయోజనం పొందాలంటే 75 శాతం హాజరు తప్పనిసరి. అలాగే ఆధార్, NPCI ద్వారా బ్యాంకు ఖాతా లింక్ అయి ఉంటేనే నిధులు నేరుగా ఖాతాలో జమ అవుతాయి.
తల్లికి వందనం..ముఖ్యమైన సంక్షేమ పథకం..
మీరు తల్లికి వందనం పథకానికి అర్హులా? కాదా? మీ పేమెంట్ స్టేటస్ను కూడా సులభంగా తెలుసుకోవచ్చు. ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా మీ స్టేటస్ను చెక్ చేసుకునే సౌలభ్యం ఉంది. జూన్ 19, 2026 నాటికి ఈ రూ.15,000 తల్లుల ఖాతాల్లో జమ అవుతాయని సమాచారం. ఏపీలో ఇది ఒక ముఖ్యమైన సంక్షేమ పథకంగా ఉన్న ఈ కార్యక్రమం వల్ల బడి మానేసే వారి సంఖ్య తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
తల్లికి వందనం ఎవరు అర్హులు?
తల్లికి వందనం పథకం కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసి అయి ఉండాలి. విద్యార్థులు గుర్తింపు పొందిన ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి 12వ తరగతి చదువుతూ ఉండాలి. కనీసం 75 శాతం హాజరు ఉండటం, ఆధార్, రేషన్ కార్డు కలిగి ఉండటం తప్పనిసరి. నిధులు నేరుగా లబ్ధిదారులకు చేరడానికి బ్యాంకు ఖాతాకు ఆధార్ NPCI లింక్ అయి ఉండాలి.. KYC కూడా పూర్తి చేసి ఉండాలి.
కావాల్సిన డాక్యుమెంట్లు:
ఈ పథకానికి దరఖాస్తు చేసేటప్పుడు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, స్టూడెంట్ ఐడి కార్డు, బ్యాంకు పాస్బుక్, మొబైల్ నంబర్, అటెండెన్స్ రికార్డ్స్ అవసరమవుతాయి. ఈ అర్హతలు ఉన్నవారికి ప్రతి ఏటా రూ. 15,000 నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.
తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకునే విధానం:
తల్లికి వందనం నిధులు జమ అయ్యాయా? లేదా? అని మీ ఆధార్ నంబర్ , ఓటిపి ద్వారా మొబైల్లోనే తెలుసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout లోకి వెళ్లి 'తల్లికి వందనం స్టేటస్ చెక్' పై క్లిక్ చేయాలి. అక్కడ తల్లి 12 అంకెల ఆధార్ నంబర్ ఇచ్చి, ఓటిపి వెరిఫై చేస్తే మీ అర్హత కనిపిస్తుంది.
READ ALSO: స్కూల్స్ రీఓపెన్ రోజే విద్యార్థులకు రూ.15 వేలు.. జూన్ 19న ఏపీలో మహా పండుగ!
READ ALSO: ఎస్బీఐ భారీ నోటిఫికేషన్ విడుదల.. 7150 అప్రెంటిస్ ఉద్యోగాలు, అప్లికేషన్ ప్రాసెస్, లింక్ ఇదే!
అక్కడ 'ఎలిజిబుల్' అని వస్తే మీ పథకం ఆమోదించబడినట్లు, 'ఇన్ ఎలిజిబుల్' అని వస్తే అర్హత లేనట్లు అర్థం. 'అండర్ వెరిఫికేషన్' అని ఉంటే ప్రాసెసింగ్లో ఉందని, 'పెండింగ్ ఈకేవైసీ' అని వస్తే వెంటనే మీ స్కూల్ హెడ్మాస్టర్ను లేదా బ్యాంకును సంప్రదించి KYC పూర్తి చేయాలని అర్థం. ఒకవేళ 'NPCI నాట్ లింక్' అని వస్తే మీ ఆధార్ బ్యాంకు ఖాతాకు లింక్ కాలేదని అర్థం.
NPCI లింక్ స్టేటస్ ఎలా చూడాలి?
జూన్ 19న నిధులు పొందాలంటే మీ బ్యాంకులో NPCI లింక్ ఉందో లేదో చూసుకోవాలి. దీని కోసం 'మై ఆధార్' వెబ్సైట్లోకి వెళ్లి 'చెక్ ఆధార్ బ్యాంకు లింకింగ్ స్టేటస్' ఆప్షన్ ఎంచుకోవాలి. ఆధార్ నంబర్ వెరిఫై చేసిన తర్వాత, అది 'యాక్టివ్' అని వస్తే లింక్ అయినట్లు, 'ఇనాక్టివ్' అని వస్తే లింక్ లేనట్లు అర్థం. అప్పుడు వెంటనే మీ బ్యాంకుకు పాస్బుక్, ఆధార్ కార్డుతో వెళ్లి NPCI సీడింగ్ ఫారం సమర్పించాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Lalit Modi: రేటింగ్ కోసం స్టార్ క్రికెటర్, చీర్ గర్ల్ మధ్య అఫైర్ పెట్టాం: లలిత్మోదీ
England:IPL Scripted Controversy: ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ఐపీఎల్లో జరిగే పబ్లిసిటీ స్టంట్లు, రేటింగ్ కోసం తాము ఎలా చేస్తామనే విషయాలను ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ వెల్లడించాడు. ఐపీఎల్కు రేటింగ్.. గుర్తింపు వచ్చేందుకు తాము చేసిన ఒక ఉదంతాన్ని లలిత్ వివరించాడు. ఐపీఎల్లో రేటింగ్ కోసం తాము ఒక స్టార్ క్రికెటర్కు ఓ చీర్ లీడర్కు మధ్య సంబంధం ఉందని తామే ఒక కథనం సృష్టించామని లలిత్ మోదీ బహిర్గతం చేశాడు. ఈ వ్యాఖ్యలు క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.
భారతదేశ క్రికెట్కు ఫ్రాంచైజీని పరిచయం చేసి ఐపీఎల్ను లలిత్ మోదీ ప్రారంభించాడు. ఐపీఎల్ వ్యవస్థాపకుడిగా ఉన్న లలిత్ మోదీ అనంతరం కొన్ని అవినీతి పనులు, మనీలాండరింగ్ తదితర నేరాలకు పాల్పడడంతో అతడు 2010లో విదేశాలకు పారిపోయాడు. ప్రస్తుతం లండన్లో నివసిస్తూ విలాసవంతమైన జీవితాన్ని పొందుతున్నాడు. అక్కడ బహిరంగంగా తిరుగుతూ.. ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ హాయిగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తన సోషల్ మీడియాలో పంచుకున్న ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ఐపీఎల్లో గ్రౌండ్లో జరిగేదాని కన్నా మైదానం బయట జరిగేవన్నీ పక్కా ప్రణాళిక ప్రకారం చేసినవేనని ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ప్రకటించాడు. తన దగ్గర కొంత మంది వ్యక్తులు.. రాజకీయ నాయకులు ఉన్నప్పుడు ప్రతిది ప్రణాళిక ఉంటుందని లలిత్ మోదీ తెలిపాడు. 'రేటింగ్స్ పడిపోతున్నప్పుడు మేం కొన్ని వివాదాస్పద కథనాలను సృష్టిస్తాం. దాన్ని వివాదంలాగా బయటపెడుతాం' అని వివరించాడు.
పక్కా ప్రణాళికగా బయటపెట్టిన ఒక వివాదాన్ని తెలపాలని హోస్ట్ కోరగా.. లలిత్ మోదీ కీలక విషయాన్ని బయటపెట్టాడు. 'ఒక ప్రధాన జట్టుకు కెప్టెన్ ఉండేవాడు. అతడు దక్షిణాఫ్రికాకు చెందినవాడు. అతడికి చీర్లీడర్తో అఫైర్ ఉండేది. దాన్ని కావాలని లీక్ చేశాం' అని తెలిపాడు. దానివలన ఐపీఎల్ రేటింగ్స్ బాగా పెరిగాయని చెప్పుకొచ్చాడు. అయితే అఫైర్ పెట్టుకున్న చీర్లీడర్ను ఆ క్రికెటర్ను తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 'రేటింగ్స్ పడిపోయినప్పుడల్లా వివాదం సృష్టిస్తాం. కాంట్రవర్సీ అనే నంబర్-1 పిల్లర్ మీదే ఐపీఎల్ నిర్మితమైంది’ అని లలిత్ మోదీ తెలిపాడు.
Lalit Modi reveals that everything off the pitch is scripted in IPL
A prominent South African captain was having affair with a cheerleader. Modi found out, he leaked the scandal to press, which caused ratings spike for the IPL.
After this leak, he had to marry that cheerleader pic.twitter.com/szGwHmzGkX
— Chota Don (@choga_don) June 2, 2026
ఇదే ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటి సుష్మితా సేన్తో ఉన్న అనుబంధంపై లలిత్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా సుస్మితపై ప్రశంసలు కురిపించాడు. ఆమె కష్టపడి ఎదిగిన మహిళ అని తెలిపాడు. 'ఆమె వద్ద ఎక్కువ వజ్రాలు ఉన్నాయి. అవన్నింటిని సుస్మిత కష్టపడి సంపాదించుకుంది. ఆమెకు డైమండ్ స్టోర్స్ కూడా ఉన్నాయి' అని వివరించాడు. సుస్మిత తనకు చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని.. తాను ఈరోజు ఈస్థాయిలో ఉండడానికి.. ఎదగడానికి ఎంతో సహాయపడిందని ప్రశంసలు కురిపించారు. తమ ఇద్దరిది చాలా ప్రత్యేకమైన బంధం అని ప్రకటించాడు. తామిద్దరం కలిసి ఉన్నప్పుడు తాను డబ్బులు దేనికి ఖర్చు పెట్టే అవకాశం రాలేదని.. అన్నీ సుస్మిత కట్టేది అని లలిత్ మోడీ వివరించాడు. ఆమె ఎవరి దగ్గర నుంచి ఏదీ ఆశించడానికి ఇష్టపడతని.. ఆమె గురించి తెలియనివాళ్లు మాత్రమే ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని లలిత్ మోడీ ఇంటర్వ్యూలో తెలిపాడు.
YS Jagan: అమరావతి రైతులకు అండగా ఉంటా: మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా
Tadepalli, Andhra Pradesh:Capital MAVIGUN: రాజధాని అమరావతి పేరిట రైతులను బలవంతపెట్టడం మంచి పద్ధతి కాదని కూటమి ప్రభుత్వానికి మాజీ సీఎం వైఎస్ జగన్ హితవు పలికారు. ‘రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తాం. రైతులను బలవంతం పెట్టడం మంచిది కాదు. రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం' అని హామీఇచ్చారు. రైతులకు సంతోష పెట్టేలా చేయాలని.. వారిని కష్ట పెట్టేలా చేయకూడదని చంద్రబాబు ప్రభుత్వానికి సూచించారు.
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం రాజధాని రైతులు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రపాలెం, కుర్రగల్లు గ్రామాలకు చెందిన రైతులు తమ గోడును జగన్ ముందు వెళ్లబోసుకున్నారు. రైతుల సమస్యలు, వారి బాధను సావధానంగా విన్న మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'రాజధాని పేరిట మొదట తీసుకున్న 50 వేల ఎకరాలకే దిక్కులేదు. ఇప్పుడు మళ్లీ 50 వేల ఎకరాలు అంటున్నారు. అందుకే ప్రత్యామ్నాయంగా మావిగన్ను సూచించాం' అని గుర్తుచేశారు.
'విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఉంది. అది ఉండి కూడా మరొక ఎయిర్పోర్టు అంటున్నారు. ఇప్పుడ అక్కడ పనులు కూడా జరుగుతున్నాయి. వచ్చే కొద్ది నెలల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. మచిలీపట్నంలో పోర్టు కూడా వచ్చింది. మన హయాంలో మొదలుపెట్టాం, నిధుల కొరతలేకుండా చూశాం. జాతీయ రహదారులు ఉన్నాయి, రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కాని ఇవేమీ చంద్రబాబుకు పట్టదు' అని విమర్శించారు. భవిష్యత్తులో కూడా రాజధాని అనేది లేకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
'కనీస మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు చేయాలి. జీవితమంతా రోడ్లు వేయడానికి, డ్రైనేజీ తవ్వడానికి, నీళ్లు ఇవ్వడానికి, కరెంటు ఇవ్వడానికే ఖర్చుపెట్టాలి. దాదాపు రూ.రెండు లక్షల కోట్లు ఖర్చు చేయాలి' అని రాజధాని పనులపై మాజీ సీఎం వైఎస్ జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతి రాజధానిలో భారీగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ఏది చూసినా కుంభకోణమే కనిపిస్తోందని తెలిపారు. రాజధాని పేరుతో స్కాములు మీద స్కాములు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
'మావిగన్ను గ్రోత్ కారిడర్గా ప్రకటిస్తే చాలు వెంటనే అభివృద్ధి. 110 కిలో మీటర్ అటు ఇటూ గ్రోత్ కారిడర్కు అటు ఇటూ.. ఈ డబ్బు పెడితే మొత్తం కారిడర్ అభివృద్ధి చెందుతుంది’ అని రాజధానిపై మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. అమరావతి ప్రాంత రైతులకు అండగా ఉంటామని, కూటమి ప్రభుత్వ ఆగడాలను అడ్డుకుంటామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.
ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోంది: రైతులు
మాజీ సీఎం వైఎస్ జగన్తో మాట్లాడుతూ రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 'భూములు ఇవ్వని వారిని ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. భూ సేకరణకు నోటిఫికేషన్లు ఇచ్చి దౌర్జన్యం చేస్తోంది. భూములు ఇవ్వని రైతుల పొలాల్లో దారుణాలకు పాల్పడుతున్నారు. అభివృద్ధి పేరు చెప్పి మా పొలాలను ధ్వంసం చేస్తోంది' అని రైతులు తెలిపారు. భూసమీకరణకు అంగీకరించకపోతే భూసేకరణకు సిద్ధమవుతున్నారని.. ఈ పరిస్థితుల్లో తమకు మీరే అండ అని జగన్తో రైతులు వాపోయారు. తొలి విడత సమీకరణలో భూములిస్తే ఏ మాత్రం అనుకూలంగా లేని లోతట్టు ప్రాంతాల్లో ప్లాట్లు చూపారని.. ఇప్పుడు రెండో విడత సమీకరణలో మళ్లీ భూముల కోసం వేధిస్తున్నారని వెల్లడించారు.
K Annamalai: తమిళనాడులో బీజేపీకి భారీ షాక్.. పార్టీకి అన్నామలై రాజీనామా
Nagalapuram, Tamil Nadu:Annamalai Resignation: అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం తమిళనాడు రాజకీయాలు సంచలనాలకు కేంద్రంగా మారింది. ఇప్పటికే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అధికార టీవీకే పార్టీలో చేరుతుండగా.. ఇతర పార్టీలలో కూడా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీజేపీకి భారీ షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన బీజేపీకి ఆ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రాజీనామా చేశారు. త్వరలో ఆయన కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నారని చర్చ జరుగుతోంది.
తమిళనాడు రాజకీయాల్లో అన్నామలై రాజీనామాతో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేస్తూ 5 పేజీల లేఖ రాశారు. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన అన్నామలై అనూహ్యంగా రాజీనామా చేయడం కలకలం రేపింది. రాజ్యసభ అవకాశం కల్పిస్తామని బీజేపీ ఇచ్చిన ఆఫర్ను కూడా ఆయన తిరస్కరించినట్లు సమాచారం. లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్కి పంపారు. రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేందుకు సిద్ధమైనా కూడా అన్నామలై రాజీనామా చేయడం వెనుక ఆయన తీవ్ర మనస్తాపం చెందినట్లు స్పష్టమవుతోంది.
రాజీనామా చేసిన అనంతరం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అన్నామలై సమావేశమయ్యారు. అధిష్టానం బుజ్జగించే ప్రయత్నాలు చేసినా కూడా అన్నామలై వెనక్కి తగ్గకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న సమాచారం ప్రకారం అన్నామలై త్వరలోనే సొంతంగా ఒక కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ తాజా పరిణామాలతో తమిళనాడు రాజకీయాలతోపాటు దేశవ్యాప్తంగా ఆయన తదుపరి అడుగులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇదే కారణమా?
రాజీనామా చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అసెంబ్లీ సీట్ ఇవ్వకపోవడంతో అన్నామలై తీవ్ర నిరాశకు గురయ్యారు. అన్నాడీఎంకేతో పొత్తు కుదుర్చుకోవడంతో అతడికి పోటీ చేసే అవకాశం దక్కలేదు. అప్పటి నుంచి అసంతృప్తితో రగులుతున్న అన్నామలై చివరకు పార్టీని వీడారు. ఐపీఎస్ అధికారి ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీ శ్రేణులతో సింగం అని పిలిపించుకున్న వ్యక్తి అర్ధాంతరంగా బీజేపీ నుంచి వైదొలిగాడు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన ప్రతిసారి అన్నామలై ఓటమి పాలయ్యారు. అయితే టీవీకే పార్టీ స్థాపించిన కొన్ని నెలల్లోనే అధికారంలోకి వచ్చిన విజయ్ మాదిరి అన్నామలై పార్టీని స్థాపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Monkey Video: కోతికి బ్రాందీ తాగించిన యువకుడు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
Hyderabad, Telangana:Monkey Drinking Brandy Viral Video Watch: సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వింత వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని నవ్వు పుట్టిస్తుంటే మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో మాత్రం చూసి ప్రతి ఒక్కరిని తీవ్ర దిగ్భ్రాంతితో పాటు ఆగ్రహానికి గురి చేసేలా చేస్తోంది. ఎండల తీవ్రతకు నీడ కోసం వచ్చిన ఒక మూగ జీవికి నీళ్లు ఇవ్వాల్సింది పోయి. మద్యం తాగించిన ఒక వ్యక్తి వికృతి చేష్టలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. వేసవికాలం కావడంతో ఎండన తీవ్రతకు తట్టుకోలేక కోతుల మంద ఒకచోట పెద్ద చెట్టు కింద ఆశ్రయం పొందడం మీరు చూడొచ్చు.. తీవ్రమైన దాహంతో పాటు అలసటతో ఉన్న ఒక కోతిని చూసి అక్కడున్న ఒక వ్యక్తి అత్యంత ధారణంగా ప్రవర్తించారు.. మానవత్వాన్ని మరిచి.. ఆ కోతి ముందు ఒక గ్లాసులో చల్లని బ్రాందీ ఉంచాడు... అంతే ఆ కోతి ఏం చేసిందో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు..
తీవ్రమైన దాహంతో ఉందో.. లేక అది కూల్డ్రింక్ అనుకుందో ఏమో కానీ. ఆ కోతి మాత్రం ఆ గ్లాసును చేత్తో పట్టుకొని గటగటా తాగేయడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అంతటితో ఆ వ్యక్తి ఆగలేదు.. ఆ కోతి తాగుతున్న కొద్ది.. గ్లాసులో బ్రాందీ పోస్తూనే ఉన్నాడు.. ఇలా ఆ కోతి దాదాపు మూడు నుంచి నాలుగు గ్లాసుల వరకు బ్రాందీ తాగేసింది. మద్యం మత్తు తలకెక్కడంతో ఆ కోతి అటు ఇటు ఆడడం మీరు ఈ వైరల్ అవుతున్న వీడియోలో చూడొచ్చు..
ఈ వీడియో సోషల్ మీడియా ఫ్లాట్ఫార్మ్స్లో వైరల్గా మారడంతో నేటిజెన్లు సదరు వ్యక్తిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.. మూగజీవుల పట్ల ఇంత క్రూరత్వమా? నీళ్లు లేకపోయినా పర్లేదు కానీ ఇలాంటి పాడు పనులు చేయకండి.. అని ఒకరు కామెంట్ పెట్టారు.. లైకుల కోసం.. వ్యూస్ కోసం ఇంత నీచానికి దిగజారుతారా? మరికొందరు కామెంట్లు పెడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. సాధారణంగా కోతులు ఎండాకాలంలో దాహం కారణంగా ఏది దొరికితే అది తాగుతూ ఉంటాయి. ఇందులో భాగంగానే ఈ కోతి ఆ బ్రాందీని తాగినట్లు తెలుస్తోంది.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం మూగజీవులను హింసించడంతోపాటు వాటి ప్రాణాలకు హాని కలిగించేలా ప్రవర్తించడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఈ వీడియో ఆధారంగా సదరు వ్యక్తిని గుర్తించి అటవీ శాఖ అధికారులు తక్షణమే శిక్షించాలని సోషల్ మీడియా వినియోగదారులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి వికృతి చేష్టలు సమాజంలో పెరుగుతున్న మానసిక వికృతికి అడ్డం పడుతున్నాయి.. తక్షణమే సదరు వ్యక్తిపై కేసు నమోదు చేయాలని కొంతమంది ఉన్నత అధికారులు కూడా కోరుతున్నారు. అయితే, ఈ వీడియోను క్లియర్ గా గమనించి చూస్తే.. ఇది మన భారత దేశంలో జరిగినట్లు లేదు.. వేరే ఇతర దేశాల్లో జరిగినట్లు తెలుస్తోంది..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Python Video: ఐదు సింహాలకు చుక్కలు చూపించిన కొండచిలువ.. వీడియో వైరల్..
Hyderabad, Telangana:Massive Python Fights Video Watch: ప్రకృతిలో బలవంతుడిదే మనుగడ అనే సూత్రం అడవికి వర్తిస్తూ ఉంటుంది. అడవికి రాజు అయిన సింహాన్ని చూస్తే ఎంతటి క్రూర మృగాలైనా తోక ముడుచుకొని అక్కడి నుంచి వారి పోతూ ఉంటాయి. అలాంటిది ఒకేసారి ఐదు సింహాలు చుట్టుముడితే ఇక ఆ జీవి పని అయిపోయినట్లే అని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఈ అంచనాలను తలకిందులు చేస్తోంది.. ఐదు ఆకలిగా ఉన్న సింహాల మధ్య చిక్కుకున్న ఒక భారీ కొండచిలువ.. ప్రాణాలకు తెగించి పోరాడిన తీరు సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. అడవి మధ్యలో ఒక భారీ కొండచిలువ వెళ్తుండగా ఐదు సింహాలు దానిని గమనించాయి.. సాధారణంగా పాములను వేటాడేందుకు సింహాలు పెద్దగా ఆసక్తి చూపవు.. కానీ ఇక్కడ సింహాల గుంపు ఆ కొండచిలువను ఆహారంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.. ఒకదాని తర్వాత ఒకటిగా ఐదు సింహాలు ఆ అత్యంత ప్రమాదకరమైన కొండచిలువను చుట్టుముత్తాయి. ముందుగా ఒక సింహం తన పనిజాతం కొండచిలువను కొట్టేందుకు ప్రయత్నించింది..
సాధారణంగా ఇలాంటి సమయంలో ఏదైనా జీవి భయంతో పారిపోవడానికి ప్రయత్నిస్తుంది.. కానీ ఆ కొండచిలువ మాత్రం వెనక్కి అస్సలు తగ్గలేకపోయింది.. సింహాలు దాడికి వస్తున్న కొద్ది.. అది తన శరీరాన్ని గాల్లోకి లేపి.. పడగ విప్పినట్లుగా నోరు తెరిచి ఎదురుదాడికి దిగింది.. ఒక సింహం దగ్గరికి రాగానే మెరుపు వేగంతో దానిపై దూసుకు వెళ్లి తన బలమైన పళ్ళతో పాము కొరికేందుకు ప్రయత్నించింది. కొండచిలువ ఉగ్రరూపాన్ని చూసి అడవికి రాజులైన సింహాలే షాక్కు గురైనట్లు తెలుస్తోంది.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
ఈ వీడియో ప్రస్తుతం ఇంస్టాగ్రామ్తో పాటు ఎక్స్ వేదికల్లో మిలియన్ల కొద్ది వ్యూస్ తెచ్చుకుంటోంది. వన్యప్రాణి ప్రేమికులు ఈ అరుదైన పోరాటాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా కొండచిలువలు తమ ఆహారాన్ని చుట్టుముట్టి ఊపిరాడకుండా చేసి చంపుతూ ఉంటాయి.. కానీ ఇక్కడ అది ఒక యోధుడిలా సింహాలతో తలపడటం చాలా విశేషం.. చివరకు ఆ సింహాలు కొండచిలువను వదిలేసాయ లేక వేటాడయా.. అనేది ఈ వీడియోలో లేనప్పటికీ.. ఆ కొండచిలువ ఉగ్రరూపం చూస్తే మాత్రం తప్పకుండా అవి వదిలిపెట్టి ఉంటాయని ఒక నమ్మకం కుదురుతోంది..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Telangana: 6 గ్యారంటీల అమలులో మా ప్రభుత్వమే ముందుంది: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Hyderabad, Telangana:Telangana 6 Guarantees: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్, మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించి.. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.. అనంతరం ఆయన జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.. ఈ ప్రసంగంలో నాలుగు గ్యారెంటీ ల గురించి మాట్లాడారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పటికే నాలుగు గ్యారెంటీలు విజయవంతం..
మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇప్పటికే నాలుగు ప్రధాన పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని ప్రకటించారు. మహిళలందరికీ మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణంతో పాటు.. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ సరఫరా.. గృహలక్ష్మి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. రాజు ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు వంటి పథకాలను ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తూ వస్తోందని తెలిపారు.
ఈ పథకాల ద్వారా అట్టడుగు వర్గాలకు లబ్ధి చేకూరుతుందని ఆయన వివరించారు.. మిగిలిన గ్యారంటీలను కూడా త్వరలోనే అర్హులైన వారందరికీ అందజేస్తామని హామీ ఇచ్చారు.. గత ప్రభుత్వాల తరహాలో కాకుండా.. ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. లబ్ధిదారుల ఎంపికలు పూర్తి పారదర్శకత పాటిస్తున్నట్లు పేర్కొన్నారు..
తెలంగాణ సమాజం ఆశించిన ఆకాంక్షల నెరవేర్పు కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని.. కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని.. తాగునీరుతో పాటు సాగునీరు, విద్యా వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి.. ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని.. మౌలిక వసతుల కల్పనలు రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర పోలీసు అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
