సాఫ్ట్వేర్ బాలికపై అత్యాచారం చేసిన వనస్థలిపురంలోని హోటల్ను పోలీసులు సీజ్ చేశారు
Vanasthalipuram, Telangana:వనస్థలిపురం సీఐ అశోక్రెడ్డి, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కందుకూరు రంగారెడ్డి జిల్లా అధికారి సుధీర్బాబు ఆదేశాల మేరకు ఈరోజు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరస్తు బార్ అండ్ రెస్టారెంట్ బొమ్మరిల్లు కాంప్లెక్స్ను సీజ్ చేశారు పట్టించుకోలేదు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Wife Killed: ప్రియుడితో రహాస్య సంబంధం.. భర్తను భార్య హత్య చేసి జేసీబీతో పూడ్చివేత
Narayankhed (CT), Telangana:Extramarital Affair Crime: భర్తతో వివాహమై ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత భార్య వేరొకరితో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను వదిలేయాలని చూసింది. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్రణాళిక రచించింది. భర్తను ఫుల్లుగా తాగించి మద్యం మత్తులో ఉండడంతో అతడిని ప్రియుడితో కలిసి భార్య హత్య చేసింది. భర్త మృతదేహాన్ని అతడి సొంత పొలంలోనే జేసీబీతో గుంతలో పూడ్చివేసింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన ముత్యంరెడ్డికి, భార్య కల్పన ఉంది. వీరిద్దరికీ టీనేజ్ కలిగిన పిల్లలు ఉన్నారు. భర్త రోజువారీ వ్యవసాయ పనులు చేస్తుండేవాడు.. భార్య ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆమెకు మానూరు మండలం ఎల్గోయి గ్రామానికి చెందిన గైనీ పండరితో పరిచయమైంది. ఆ పరిచయం కాస్త వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. తరచూ వీరిద్దరూ కలుసుకునేవారు. ఈ క్రమంలో తమ బంధానికి ముత్యంరెడ్డి అడ్డుగా ఉన్నాడని భావించారు. అతడి అడ్డు తొలగించుకుంటే హాయిగా తామిద్దరం కలిసి జీవించవచ్చనే భావన ఏర్పడింది.
ఒకరోజు భర్త ముత్యంరెడ్డికి భార్య పీకలదాకా మద్యం తాగించింది. అనంతరం హత్య చేసి భర్త పొలంలోనే మృతదేహాన్ని జేసీబీ సహాయంతో పూడ్చిపెట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా పూడ్చిపెట్టిన ప్రాంతంలో రాళ్లు పెట్టారు. అయితే తొమ్మిది రోజులుగా ముత్యంరెడ్డి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు నారాయణఖేడ్ పోలీసులను ఆశ్రయించారు. భర్త కనిపించడం లేదని భార్య మిస్సింగ్ కేసు పెట్టింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా భార్య కల్పనపై పోలీసులు అనుమానం వ్యక్తం చేసి తమదైన విచారణ చేశారు. ఆమెతో పోలీసులు విస్తుగొలిపే నిజాలు బయటపెట్టారు. ఆమెతోపాటు ప్రియుడు పండరిని అదుపులోకి తీసుకుని విచారించారు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా మారుతున్నాడనే కారణంతోనే ముత్యంరెడ్డిని హత్య చేసినట్లు భార్యతోపాటు ఆమె ప్రియుడు పండరి పోలీసుల విచారణలో అంగీకరించారు. ఈ ఘటన నారాయణఖేడ్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల అధికారిక ప్రకటన అనంతరం వెల్లడి కానున్నాయి.
Petrol Card Offer: ఇలా చేస్తే 172 లీటర్ల పెట్రోల్ పూర్తిగా ఉచితం..వాహనదారులు ఎగిరి గంతేసే వార్త!
Hyderabad, Telangana:IDFC Petrol Card Offer: రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరలతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. ఇలాంటి సమయంలో ఇంధన ఖర్చులతో పాటు రోజువారీ షాపింగ్లపై వేల రూపాయలు ఆదా చేసుకునే అద్భుతమైన అవకాశం మార్కెట్లోకి వచ్చింది. అదే IDFC పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఏడాదికి 171 లీటర్ల పెట్రోల్ను ఉచితంగా పొందే అవకాశం ఉంది అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే క్రెడిట్ కార్డు కొనుగోలు చేయాలంటే రూ.499గా వార్షిక రుసుము వెచ్చించాల్సి ఉంటుంది. రెండో ఏడాది నుండి రూ.499 వసూలు చేస్తారు. అయితే, ఏడాదిలో రూ.1,50,000 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే ఈ వార్షిక రుసుము పూర్తిగా మాఫీ అవుతుంది. అయితే ఈ కార్డు జారీ చేసిన వెంటనే కస్టమర్లకు భారీ ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. HPCL బంకుల్లో చేసే మొదటి రూ.500 ఖర్చుపై రూ.500 విలువైన గిఫ్ట్ వోచర్ లభిస్తుంది. అలాగే మొదటి EMI కన్వర్షన్పై గరిష్టంగా రూ.1000 వరకు (5%) క్యాష్బ్యాక్ వస్తుంది. వీటికి అదనంగా రూ.1000 విలువైన మర్చంట్ ఆఫర్లు సొంతమవుతాయి.
అదనపు ప్రయోజనాలు..
ఈ క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఉచిత ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఉంటుంది. ప్రతి నెలా కనీసం రూ.20,000 ఖర్చు చేస్తే, త్రైమాసికానికి ఒకసారి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ను ఉచితంగా వాడుకోవచ్చు. అలాగే మూవీ టిక్కెట్లపై 25% వరకు (గరిష్టంగా రూ.100) తగ్గింపు లభిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఏటీఎం నుండి నగదు తీసుకుంటే గడువు తేదీ వరకు 0% వడ్డీ వర్తిస్తుంది (కేవలం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది). అదే విధంగా ఈ కార్డు వినియోగదారుల రూ.2,00,000 విలువైన ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా లభిస్తుంది. రోడ్సైడ్ అసిస్టెన్స్ కోసం రూ.1,399 విలువైన రోడ్సైడ్ సహాయం ఉచితంగా అందుకోవచ్చు.
172 లీటర్ల పెట్రోల్ లెక్క ఎలా?
ఒక లీటర్ పెట్రోల్ ధర సుమారు రూ.110 గా లెక్కిస్తే.. ఈ కార్డు ద్వారా లభించే రివార్డులు, క్యాష్బ్యాక్ల రూపంలో ఏడాదికి మొత్తం రూ.18,918 వరకు ఆదా చేసుకోవచ్చు. అంటే దాదాపు 172 లీటర్ల పెట్రోల్ ఉచితంగా పొందినట్లే లెక్క! అంతేకాకుండా, మీ స్నేహితులకు ఈ కార్డును రిఫర్ చేయడం ద్వారా అదనంగా మరో 10,000 రివార్డ్ పాయింట్లను కూడా సొంతం చేసుకోవచ్చు. తక్కువ వడ్డీ రేట్లు, ఎక్కువ ప్రయోజనాలు ఉన్న ఈ క్రెడిట్ కార్డ్ నిత్యం ప్రయాణాలు చేసే వారికి ఒక గొప్ప అసెట్ అని చెప్పవచ్చు.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం పాఠకాస్తకి కోసమే పొందుపరిచింది. దీన్ని పాటించే ముందు సంబంధిత అధికారిక వెబ్సైట్ను సందర్శించగలరు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: మందుబాబులకు మత్తు దిగిపోయే వార్త..భారీగా పెరగనున్న మద్యం ధరలు..ఎంత పెరుగుతుందంటే?
Also Read: వడదెబ్బతో రాష్ట్రంలో 34 మంది మృతి..ఒక్కొక్కరికి రూ.4 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chiyaan Vikram Fitness: 60 ఏళ్ల వయసులో కుర్రోడిలా చియాన్ విక్రమ్..ఫిట్నెస్, డైట్ సీక్రెట్స్ ఏంటో తెలుసా?
Hyderabad, Telangana:Chiyaan Vikram Workout: తమిళ చిత్ర పరిశ్రమలో చియాన్ విక్రమ్ తిరుగులేని నటుడిగా నిరూపించుకున్నారు. సినిమాలోని క్యారెక్టర్ కోసం ఆయన తన బాడీని పూర్తిగా ట్రాన్స్ఫర్మేన్ చేసుకోవడం దిట్ట. ఉదాహరణకు 'ఐ: మనోహరుడు' సినిమాలోని మూడు విభిన్న పాత్ర కోసం ఆయన శరీరాన్ని మలుచుకున్న తీరు ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చింది. దాదాపుగా 60 ఏళ్ల వయసున్న నటుడు విక్రమ్.. ఈ వయసులోనూ ఫిట్గా కుర్రాళ్లకు దీటుగా కనిపిస్తున్నాడు.
ఎంతో అంకితభావంతో తన ఫిట్నెస్ను ఆ విధంగా కొనసాగిస్తున్నాడు. తాజాగా ఆయన కొన్ని జిమ్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వాటిని చూసిన ఫ్యాన్స్ 60 ఏళ్ల వయసులోనూ ఇంత యవ్వనంగా ఉండడం ఎలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారు.
చియాన్ విక్రమ్ ఎప్పుడూ ఒకే రకమైన వ్యాయామాలు చేయరట. అతను ప్రతి పాత్రకు తగినట్లుగా తన శిక్షణ దినచర్యను మార్చుకుంటాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్లైయోమెట్రిక్ వ్యాయామాలు అతని ఫిట్నెస్ దినచర్యలో ఒక ముఖ్యమైన భాగమని అన్నారు. ఈ వ్యాయామాలు శరీరానికి వేగం, చురుకుదనాన్ని ఇవ్వడమే కాకుండా, కండరాల బలాన్ని కూడా మెరుగుపరుస్తాయట.
అదేవిధంగా, కార్డియో వ్యాయామాలు, వెయిట్లిఫ్టింగ్ వ్యాయామాలు అతని దినచర్యలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. 'ఐ' చిత్రంలో బాడీబిల్డర్ పాత్ర కోసం భారీ వెయిట్లిఫ్టింగ్, గూనన్ పాత్ర కోసం బరువు తగ్గడానికి కార్డియో వ్యాయామాలు వంటి పూర్తిగా భిన్నమైన వర్కౌట్లను అతను చేశాడు.
డైటింగ్ ఎంతో ముఖ్యం..
విక్రమ్ తన శరీరాకృతి మార్పులో ఆహార నియంత్రణకు చాలా ప్రాముఖ్యత ఇస్తాడు. శరీరాకృతి కేవలం వ్యాయామం వల్ల మాత్రమే కాకుండా, మనం తీసుకునే ఆహారం ప్రభావం వల్ల కూడా ఏర్పడుతుందని అతను నమ్ముతాడు. అందుకే, షూటింగ్ సమయంలో అతను చాలా ప్రణాళికాబద్ధమైన ఆహారాన్ని పాటిస్తాడు. బరువు తగ్గే సమయంలో, అతను ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లను ఎక్కువగా తింటాడు. అతను కార్బోహైడ్రేట్ ఆహారాలను తగ్గించి, గుడ్డులోని తెల్లసొన, ఉడికించిన చేపలు, చికెన్ వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకుంటాడు.
దర్శకుడు శంకర్ 'ఐ' చిత్రంలోని పాత్ర కోసం విక్రమ్ చూపిన అంకితభావమే ఇందుకు ప్రధాన ఉదాహరణ. ఆ చిత్రంలో ఆయన దాదాపు 90 కిలోల బరువు తగ్గి 52 కిలోలకు చేరుకున్నారు. ఆ సినిమా కోసం, ఆయన కఠినమైన ఆహార నియమాలు పాటిస్తూ, చాలా తక్కువ కేలరీలు తీసుకుంటూ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు.
అదేవిధంగా పి.రంజిత్ 'తంగలన్' కోసం ఒక సాధారణ కూలీ పాత్రలో ఒదిగిపోవడానికి ఆయన తన శరీరాకృతిని మార్చుకున్నారు. ఆయన కండల శరీరం నుండి ముఖ కవళికల వరకు, పాత్రలోని భావోద్వేగాలను పండించడానికి ఎంతగానో కష్టపడ్డారనేది గమనించదగ్గ విషయం.
విక్రమ్ శారీరక పరివర్తన వెనుక గొప్ప పోరాటం ఉంది. అతని కళాశాల రోజుల్లో జరిగిన ఒక ఘోర ప్రమాదంలో, అతను మళ్లీ నడవలేడని వైద్యులు చెప్పారట. కాళ్లు తీసివేయాల్సిన పరిస్థితి వచ్చినా, విక్రమ్ వెనుకాడలేదు. ఎన్నో శస్త్రచికిత్సలు, సుదీర్ఘ విశ్రాంతి, ఊతకర్రల సహాయంతో ప్రయాణించడం వంటి వాటిని తట్టుకుని అతను ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నాడు. ఆ అనుభవం అతని సంకల్ప బలాన్ని మరింత బలపరిచిందని అంటారు. ఈ రోజు తమిళ చిత్రసీమలో అత్యంత కష్టపడి పనిచేసే నటులలో ఒకరిగా గుర్తింపు పొందడం అతనికి అంత సులభమైన విషయం కాదు.
Also Read: 'పెద్ది' సినిమాలోని ఐటెంసాంగ్ వచ్చేసింది! జాన్వీ కపూర్, శ్రుతిహాసన్ రచ్చలేపేశారు!
Also REad: విద్యార్థులకు బిగ్ అలర్ట్..మే 31తో వేసవి సెలవులు ముగింపు..జూన్ 1 నుంచి క్లాసులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KT Rama Rao: మూసీ ప్రాజెక్టు పేరిట రేవంత్ రెడ్డి రూ.లక్షల కోట్ల దోపిడీ: కేటీఆర్
Hyderabad, Telangana:BRS Party: 'ఉన్న నగరాన్ని పట్టించుకునే శక్తి లేదు కానీ.. 'ఫ్యూచర్ సిటీ' అంటూ అడ్డగోలు మాటలు చెబుతున్నారు. ఉన్న నగరాన్ని పట్టించుకోవడం చేతగాని రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో పోజులు కొడుతున్నాడు' అని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న హైదరాబాద్ నగరంలో కనీసం మోరి తీసి చెత్త ఎత్తే పరిస్థితిలో కూడా లేని రేవంత్ రెడ్డి.. ఫ్యూచర్ సిటీ అంటే ఎవరూ నమ్మరని తెలిపారు. ఫ్యూచర్ లేని రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కడతా అంటే పట్టించుకునేది ఎవరూ అని ప్రశ్నించారు.
Also Read: KTR: కాంగ్రెస్ వస్తే ఉచిత విద్యుత్ పోతుంది.. కరెంట్ కష్టాలు వస్తాయి: కేటీఆర్
'హైదరాబాద్ నగరంలో మూసీని ప్రక్షాళన చేస్తా అంటున్న రేవంత్ రెడ్డి లక్షల కోట్ల రూపాయలు దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపు కేసీఆర్ ప్రభుత్వం హయాంలోనే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టి.. దాదాపుగా పూర్తయిన మూసీ నది ప్రక్షాళన పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకునేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు' అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ముగిసిపోయిన మూసీ ప్రక్షాళనపై రేవంత్ రెడ్డి కేవలం కాంట్రాక్ట్ కమిషన్ల కోసమే మాట్లాడుతున్నారని ఆరోపణలు చేశారు.
Also Read: AP Govt Holiday: సెలవులు ఇచ్చేయండి.. సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
'ఎలాంటి విధ్వంసం లేకుండా.. ఎలాంటి ఇళ్ల తొలగింపు లేకుండా మూసీ ప్రక్షాళన చేయాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిస్తే.. ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం వేలాది మంది ఇండ్లు కూలగొట్టి, మూసీ నది ప్రక్షాళన పేరుతో లక్షలాది మంది ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మూసీపై ఎస్టీపీలు, బ్రిడ్జీల నిర్మాణం ప్రారంభించిన తర్వాత.. ఇప్పుడు మళ్లీ రూ.లక్షన్నర కోట్లతో మూసీ ప్రక్షాళన పేరుతో నాటకాలు ఎందుకు అని ప్రశ్నించారు.
అడ్డగోలు హామీలు ఇచ్చి.. అడుగడుగునా అరాచకాలు, అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రజలు ఇచ్చిన ఐదు సంవత్సరాల కాలంలో సగం పూర్తయినా ఇప్పటిదాకా ప్రజలకు, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేక చేతులెత్తేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు, పరిపాలనా వైఫల్యాలు, అవినీతిపైన ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని గుర్తుచేశారు. కచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: Rajya Sabha Elections: తెలుగుదేశం పార్టీకి జోష్.. పెద్దల సభలో పెరగనున్న బలం
త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించిన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామని.. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 1000 మంది పార్టీ కార్యకర్తలకు ఈ శిక్షణ ఇస్తామని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలపై.. అన్యాయాలపై.. ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చి మోసం చేస్తున్న తీరుపై కూడా అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.
ఈసారి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పూర్తిగా డిజిటల్ రూపంలో ఉంటుందని పార్టీ వర్కంగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ముందుగా సభ్యత్వ నమోదు.. తర్వాత శిక్షణా కార్యక్రమాలు ఉంటాయ్నారు. హైదరాబాద్ నగర పరిధిలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై, కాంగ్రెస్ ప్రభుత్వంపైన పోరాటం చేసిన వారికే కార్పొరేటర్ టికెట్లు ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. కేవలం గెలుపే లక్ష్యంగా సర్వేల ఆధారంగా పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులకు అవకాశం ఇస్తుందని తెలిపారు.
ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ రెండున్నర సంవత్సరాల కాలంలో చేసిన అన్యాయాలు, అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. రెండున్నర సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టని రేవంత్ రెడ్డి.. అడ్డగోలుగా 'హైడ్రా' పేరుతో వేల ఇండ్లు కూలగొట్టారని గుర్తుచేశారు. గతంలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్ీ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో లక్ష ఇళ్లు నిర్మాణం చేస్తే, కాంగ్రెస్ మాత్రం వేల ఇండ్లు కూలగొట్టిందని తెలిపారు.
KTR: కాంగ్రెస్ వస్తే ఉచిత విద్యుత్ పోతుంది.. కరెంట్ కష్టాలు వస్తాయి: కేటీఆర్
Hyderabad, Telangana:Free Power To Farmers: ఉచిత విద్యుత్తు రద్దు కోసమే కాంగ్రెస్ మోటర్లకు మీటర్లను పెడుతుందని.. ప్రీపెయిడ్ మీటర్లతో విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయబోతున్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వస్తే ఉచిత విద్యుత్తు పోతుందని ఆనాడే హెచ్చరించామని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రీపెయిడ్ మీటర్లు రాబోతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ కరెంటు కుట్రలను ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
Also Read: AP Govt Holiday: సెలవులు ఇచ్చేయండి.. సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
హైదరాబాద్లోని అంబర్పేటలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సమావేశంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్తో కలిసి పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. 'రాష్ట్రంలో ప్రీపెయిడ్ మీటర్లు తీసుకువచ్చేందుకు.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలో ఉన్న ఉచిత విద్యుత్ను ఎగొట్టేందుకు.. ప్రీపెయిడ్ మీటర్ల పేరుతో విద్యుత్ రంగాన్ని పూర్తిగా అదానీ వంటి ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పెందుకే రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు' అని కేటీఆర్ ఆరోపించారు.
Also Read: Rajya Sabha Elections: తెలుగుదేశం పార్టీకి జోష్.. పెద్దల సభలో పెరగనున్న బలం
మోటర్లకు మీటర్లు పెట్టి పూర్తిగా రైతన్నలకు ఉచిత విద్యుత్తును కాంగ్రెస్ ఎత్తగొట్టే కుట్ర చేస్తున్నదని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతోపాటు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రస్తుతం ఉన్న మీటర్లు తొలగించి ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నిన్న మంత్రివర్గంలో మీటర్లన్నింటినీ తొలగించి ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తం గ్రామాల్లో, పట్టణాల్లో వ్యవసాయాలకు ప్రీపెయిడ్ మీటర్లు వస్తాయి' అని చెప్పారు.
మోటార్లకు మీటర్లు రాకముందే.. ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రీపెయిడ్ మీటర్లు తేకముందే కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు తీసివేయాలని మాజీ మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ విద్యుత్ రంగంలో చేస్తున్న కరెంటు కుట్రలపైన తిరగబడాలని కోరారు. ఎన్నికలకు ముందే ప్రజలకు కాంగ్రెస్ వస్తే ఉచిత విద్యుత్ పోతుందని హెచ్చరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మోటర్ల దగ్గర మీటర్లు వస్తాయని.. ప్రీపెయిడ్ మీటర్ల పేరుతో ప్రవేట్ సంస్థలకు విద్యుత్ రంగాన్ని అప్పజెప్తారని కేసీఆర్ హెచ్చరించారని కేటీఆర్ జ్ఞాపకం తెచ్చుకున్నారు.
దేశవ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్న ప్రీపెయిడ్ మీటర్లను కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తీసుకురావడం దారుణమని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని గతంలో నరేంద్ర మోదీ ఎంత ఒత్తిడి చేసినా.. రూ.30 వేల కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఆపినా కేసీఆర్ ఎదిరించారు, మీటర్లు పెట్టలేదని గుర్తుచేశారు. రానున్న మూడు నెలల్లోనే మొత్తం మీటర్లు పెడతామని చెప్పి నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
రానున్న మూడు నెలల్లోనే ఉన్న మీటర్లు పీకేసి, ప్రీపెయిడ్ మొబైల్స్ మాదిరి ప్రీపెయిడ్ కరెంట్ మీటర్లను తీసుకురాబోతున్నదని.. అయితే కాంగ్రెస్ ఉచిత కరెంట్ను ఎగొట్టడం కోసమే ప్రీపెయిడ్ మీటర్లను తీసుకువస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కేవలం ఉచిత విద్యుత్ను రద్దు చేయాలనే ఏకైక ఉద్దేశంతోనే అదానీ, అంబానీలకు విద్యుత్ సంస్థలను అప్పగించాలనే లక్ష్యంతోనే తెలంగాణ మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకున్నదని వివరించారు. కాంగ్రెస్ పార్టీపైన ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని.. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు బలమైన గుణపాఠం కాంగ్రెస్ పార్టీకి చెప్తారని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Kaleshwaram: కాళేశ్వరంలోని ఈ రహస్య ఆలయ మీకు తెలుసా? కాశీతో సమానమైన ముక్తినిచ్చే క్షేత్రం..
Hyderabad, Telangana:Adi Mukteshwar Temple Kaleshwaram: భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కాలేశ్వరంలో మరో అద్భుత ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది.. ఇక్కడి ప్రధాన ఆలయానికి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో కొలువై ఉన్న ఆది ముక్తేశ్వరాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. కాశీ క్షేత్రానికి వెళ్తే ఎలాంటి పుణ్యం, ముక్తి లభిస్తుందో.. ఇక్కడి ఆది ముక్తేశ్వరుడిని దర్శించుకుంటే అలాంటి ముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.. ఈ ఆలయ విశిష్టత గురించి ఆలయ ప్రధాన పూజారి స్రవణ్ కుమార్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు..
ఆలయ విశిష్టతను పూజారి శ్రవణ్ కుమార్ వివరిస్తూ.. ఈ ఆలయానికి ఆ పేరు రావడం వెనక ఒక గొప్ప పురాణ నేపథ్యం ఉందని తెలిపారు.. కలియుగం ప్రారంభం కాకముందే.. అంటే కాలం ఆదిలోనే ఇక్కడ శివుడు స్వయంభుగా వెలిశాడు.. సృష్టి ఆదిలోనే ఇక్కడ ఈశ్వర లింగం ఆవిర్భవించడం వల్లనే ఈ స్వామికి ఆది ముక్తేశ్వరుడు అనే పేరు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. యుగయుగాలుగా ఈ ఆలయం ఇక్కడ భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతూ వస్తోంది..
హిందూ సాంప్రదాయంలో కాశీ క్షేత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.. కాశీలో మరణిస్తే పునర్జన్మ లేకుండా నేరుగా ముక్తి లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, అంతటి సుదూర ప్రాంతంలో ఉన్న కాశీకి వెళ్లలేనని భక్తుల కోసం కాలేశ్వరంలోనే ఈ ఆదిముక్తేశ్వరుడు కొలువుదీరాడని భక్తులు విశ్వసిస్తారు.. కాశీ క్షేత్రంలో మరణిస్తే మానవుడికి ఎలాంటి ముక్తి మోక్షం లభిస్తాయో.. పవిత్ర గోదావరి తీరాన ఉన్న ముక్తేశ్వరంలోని ఈ ఆది ముక్తేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటే అలాంటి లాభాలే కలుగుతాయని ఆలయ పూజారి శ్రవణ్ కుమార్ తెలిపారు..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
కాలేశ్వరానికి వచ్చే భక్తులు కేవలం ప్రధాన ఆలయాన్ని మాత్రమే కాకుండా ఈ ఆది ముక్తేశ్వర ఆలయాన్ని కూడా తప్పకుండా సందర్శించుకుంటున్నారు. ముఖ్యంగా కార్తీక మాసంతో పాటు మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో ఈ ఆలయం భక్తుల కోలాహలంతో.. వేదమంత్రాలతో మారు మోగుతుంది. ఇక్కడి పవిత్ర వాతావరణంతో పాటు ప్రాచీన లింగం భక్తులకు మానసిక ప్రశాంతతను అందిస్తున్నాయి. కాలేశ్వరం వెళ్లే ప్రతి ఒక్కరు ఈ ముక్తి ప్రధాన దర్శించుకుంటే జీవితంలో అద్భుతం జరుగుతుందని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Anaconda Video: చావు నోట్లో తలపెట్టి వెనక్కి వచ్చాడు.. అనకొండ నోటికి చిక్కకుండా యువకుడి మిరాకిల్ ఎస్కేప్.. వీడియో..
Hyderabad, Telangana:Anaconda Viral Video Watch Now: ప్రకృతి అందాలను ఆస్వాదించడానికైనా.. కాసేపు సేద తీరడానికి సేదతీరడానికైనా నదులతో పాటు చెరువుల వద్దకు వెళ్లడం సర్వసాధారణం. అయితే నీటి వనరుల వద్ద ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని హెచ్చరించే గటనే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒక చిన్న నది పరివాహక ప్రాంతంలో ఇద్దరు యువకులు స్నానం చేయడానికి వెళ్ళగా.. అక్కడ ఊహించని రీతిలో భారీ అనకుండా ప్రత్యక్షమైంది.. కేవలం సెకండ్ల వ్యవధిలో ఒక యువకుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా విపరీతంగా వైరల్ అవుతుంది.
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక చిన్న నది పరివాహక ప్రాంతంలో ఇద్దరు స్నేహితులు సరదాగా స్నానం చేయడానికి వెళ్లారు.. వారిలో ఒక యువకుడు అప్పటికే నది నీటిలో దిగి హాయిగా స్నానం చేస్తూ ఉండడం మీరు చూడొచ్చు.. మరో యువకుడు నది పక్కనే ఎత్తుగా ఉన్న గట్టుపై నిలబడి.. నీటిలోకి దూకడానికి సిద్ధమయ్యాడు. చుట్టుపక్కల వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉండడంతో అంతా ప్రశాంతంగానే సాగితుందని వారి భావించారు..
అయితే, నది పక్కనే ఉన్న బొడ్డుపై యువకుడు నీటిలోకి డైవ్ చేయడానికి ఒక్కసారిగా ముందుకు దూకాడు.. సరిగ్గా అదే సెకండ్లో.. గట్టు పక్కన ఉన్న పొదల్లో నుంచి ఒక భారీ అనకొండ మెరుపు వేగంతో అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. నోరు తెరిచి ఆ యువకుడిని పట్టుకోవాలని చూసింది.. కానీ అప్పటికే ఆ యువకుడు గాల్లో నుంచి నీటిలోకి దూకేయడంతో అనకుండా దాడి విఫలమైంది..నీటిలోకి దూకిన తర్వాత ఆ యువకుడు సురక్షితంగా పైకి లేచాడు.. అయితే, అప్పటికే నదిలో స్నానం చేస్తున్న మొదటి వ్యక్తి.. గట్టుపై జరిగిన ఈ భయానకమైన దృశ్యాన్ని కళ్లారా చూశాడు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
క్షణాల్లో జరిగిన ఈ ఘోరాన్ని చూసి అతడు ఒక్కసారిగా భయపడి పోయినట్లు తెలుస్తోంది. తన స్నేహితుడు చావు అంచుల దాకా వెళ్లి వచ్చాడని గ్రహించి.. జరిగిందంతా అతనితో పంచుకున్నట్లు కూడా తెలుస్తోంది.. ఈ మొత్తం ఉదాంతాన్ని అక్కడే ఉన్న మరో వ్యక్తి తమ స్మార్ట్ ఫోన్స్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే ఈ వీడియో అప్పట్నుంచి వైరల్ అవుతూనే వస్తుంది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు పెడుతూ వస్తున్నారు. నిజంగా ఆ యువకుడి ఆయుస్సు గట్టిగా ఉన్నట్లుంది అందుకే.. ఆ పాము చేతిలో చిక్కకుండా బయటపడిపోయాడని కొంతమంది కామెంట్లు పెడుతూ వస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో మాత్రం విపరీతంగా వైరల్ గా మారింది..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Cobra Video: స్కూటీలో దూరిన నాగుపాము.. పట్టుకున్న యువతి.. వీడియో చూస్తే ఫ్యూజులు అవుట్!
Hyderabad, Telangana:Cobra Inside Scooty Viral Video Watch: సాధారణంగా పాము కనిపిస్తేనే అమ్మో అని ఆమడ దూరం పరిగెడతాం.. అలాంటిది కదిలే స్కూటీలో అత్యంత ప్రమాదకరమైన నాగుపాము ఉందంటే ఆ ఊహే ఒంటికి చెమటలు పట్టిస్తుంది. తాజాగా సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఒక వ్యక్తి నడుపుతున్న స్కూటీలోకి నాగుపాము దూరిన ఉదాంతం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఒక లేడీ స్నేక్ క్యాచర్ ప్రాణాలకు తెగించి ఆ పామును రక్షించిన దృశ్యాలు సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక బైక్ యజమాని తన యాక్టీవ స్కూటీపై రోడ్డుపై వెళ్తుండగా.. ఒక్కసారిగా అతడి వాహనం లోపల ఏదో కదలడం గమనించాడు.. అయితే ఆ స్కూటీని అక్కడే ఆపి గమనించగా.. అందులో పొడవాటి అత్యంత ప్రమాదకరమైన నాగుపాము దూరి ఉండడం చూసి అతడికి గుండె ఆగిపోయినంత పని అయింది.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అతను ఆ రోడ్డు వెంట వెళ్తున్న స్థానికులకు సమాచారం అందించాడు. అయితే వారి వెంటనే ఒక లేడీస్ స్నేక్ క్యాచర్ కి సమాచారం అందించినట్లు సమాచారం..
సమాచారం అందుకున్న వెంటనే ఆ యువతి స్పాట్కు చేరుకుంది.. స్కూటీ లోపల ఇరుక్కుపోయిన నాగుపామును ఆ యువతి వినూత్న ఉపాయంతో బయటికి తీసేందుకు ప్రయత్నిస్తోంది. మొదట బైకును రోడ్డుపై పక్కకు పడుకోబెట్టడం మీరు చూడొచ్చు. ఆ తర్వాత ఎలాంటి భయం లేకుండా అత్యంత చాకచక్యంగా బైక్ బాడీ షార్ట్ మధ్యలో దాక్కొని ఉన్న పామును పట్టుకునేందుకు ప్రయత్నించడం మీరు చూడొచ్చు. నాగుపాము పడక విప్పి బుసలు కొడుతున్నప్పటికీ ఆమె ఏమాత్రం బెదరకుండా ఎంతో చాకచక్యంగా ఆ పామును బయటికి లాగడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
ఈ రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న కొంతమంది స్మార్ట్ఫోన్లో చిత్రీకరించి instagramలో రీల్ రూపంలో షేర్ చేశారు. అంతే ఈ వీడియో షేర్ చేసిన కొంత వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ప్రారంభమైంది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆ యువతి ధైర్య సాహసాలను చూసి అవాక్కయ్యారు. నిజంగా ఈమెకు చాలా గుండె ధైర్యం ఉంది.. ఆ లేడీ స్నేక్ క్యాచర్ పాము కాటేస్తే ఎందుకు ప్రయత్నిస్తుంటే ఎంతో సులభంగా తప్పించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని కామెంట్లు చేస్తూ వస్తున్నారు. కొంతమంది ఈ వీడియో చూసి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Earbuds: రూ.14 వేలకే టచ్స్క్రీన్ డిస్ప్లే ఇయర్బడ్స్.. మార్కెట్లోకి సౌండ్కోర్ లిబర్టీ 5 ప్రో సిరీస్!
Hyderabad, Telangana:Soundcore Liberty 5 Pro Max Earbuds: ప్రముఖ ఆడియో పరికరాల తయారీ సంస్థ అంకర్ తన సౌండ్ కోర్ బ్రాండ్ కింద సరికొత్త ఫ్లాగ్షిప్ వైర్లెస్ ఇయర్బడ్స్ సౌండ్కోర్ లిబర్టీ 5 ప్రో (Soundcore Liberty 5 Pro), లిబర్టీ 5 ప్రో మాక్స్ (Liberty 5 Pro Max) అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లతో అధునాతన డిజైన్తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఇందులో కేసు పైనే ప్రత్యేకమైన టచ్ స్క్రీన్ డిస్ప్లేను కూడా అందించారు. అలాగే ఇది అద్భుతమైన ప్రీమియం ఆడియోతో అందుబాటులోకి రావడం విశేషం. అయితే ఇయర్బడ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఇయర్బడ్స్లో కంపెనీ అద్భుతమైన Thus AI చిప్సెట్ను వినియోగించినట్లు తెలుస్తోంది. సాధారణ ఇయర్బడ్స్తో పోలిస్తే.. ఇది అత్యంత వేగవంతమైన డేటాను ప్రాక్సింగ్ చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా రెండు మోడల్స్ లు ఎనిమిది మైక్రోఫోన్లతో పాటు రెండు బోన్ కండక్షన్ సెన్సార్లు అందుబాటులో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. ఇవి శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎంతగానో సహాయ పడతాయి. అంతేకాకుండా అత్యంత స్పష్టమైన వాయిస్ కాల్ను అందిస్తాయి. అలాగే ఈ ఇయర్బడ్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేషన్ కూడా సొంతం చేసుకోవడం విశేషం..
ఈ ఇయర్బడ్స్లో అద్భుతమైన చార్జింగ్ కేస్ ను అందిస్తున్నారు. లిబర్టీ 5 ప్రో మోడల్లో 0.96 అంగుళాల చిన్న స్క్రీన్ ను అందుబాటులో ఉంచగా.. ప్రత్యేకమైన ప్రీమియం మోడల్ అయిన లిబర్టీ ఫైవ్ ప్రో మ్యాక్స్ లో ఏకంగా 1.78 అంగుళాల పూర్తి స్థాయి అమోలెడ్ (AMOLED) టచ్స్క్రీన్ డిస్ప్లేను అందించినట్లు కంపెనీ వెల్లడించింది దీనివల్ల వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ తీసే అవసరం లేకుండా కేస్ స్క్రీన్ ద్వారా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) తో పాటు ఈక్వలైజర్ సెట్టింగ్స్, బ్లూటూత్ పెయిరింగ్ వంటి పలు ఫీచర్లను ఎంతో సులభంగా నియంత్రించవచ్చు. ఇవే కాకుండా ఇందులో కంపెనీ ఎన్నో రకాల స్పెషల్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ప్రోడక్టివిటీని పెంచేందుకు లిబర్టీ ఫైవ్ ప్రో మాక్స్ మోడల్లో AI నోట్ టేకర్ ఫీచర్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కంపెనీ వెల్లడించింది ఆఫీస్ మీటింగ్ లేదా ముఖ్యమైన సంభాషణల సమయంలో చార్జ్ కేసును డబుల్ టాప్ చేయడం వల్ల వాయిస్ రికార్డును ఎంతో సులభంగా ఆన్ చేయవచ్చు. అంతేకాకుండా ఇందులో ఇంటర్నెట్ లేకపోయినా ఇది రికార్డు టెక్స్ట్గా మార్చడమే కాకుండా ఎవరు మాట్లాడుతున్నారు.. గుర్తించి సమ్మరీని అందించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది.
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
అలాగే రెండు మోడల్లలో రియల్ టైం ఏ వాయిస్ ట్రాన్స్లేషన్ కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల వివిధ భాషల్లో మాట్లాడుతున్న వారిని గుర్తించి మన భాషలోకి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఈ ఇయర్బడ్స్ 9.2mm డ్రైవర్లు, డాల్బీ అట్మోస్ స్పేషియల్ ఆడియోను సపోర్ట్ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఈ కేస్ ను దాదాపు 5 నిమిషాల పాటు చార్జింగ్ చేస్తే నాలుగు గంటల వరకు వాడుకోవచ్చు. ఇక దీని ధర వివరాల్లోకి వెళితే ఇది రూ.14 వేల నుంచి ప్రారంభమవుతుంది. హై ఎండ్ వేరియంట్ ధర రూ.19 వేల నుంచి అందుబాటులో ఉంది..
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Xiaomi 17t Series: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
Hyderabad, Telangana:Xiaomi 17t Series Global Launch On May 28: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ Xiaomi నుంచి విడుదల కాబోతున్న మోస్ట్ పవర్ఫుల్ షావోమి 17T, షావోమి 17T ప్రో (Xiaomi 17T Pro) స్మార్ట్ఫోన్ల గ్లోబల్ లాంచింగ్ తేదీ అధికారికంగా ఖరారు అయ్యింది.. ఈ సిరీస్ను కంపెనీ మే 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే, అధికారికంగా మార్కెట్లోకి రాకముందే ఈ స్మార్ట్ఫోన్స్ ధరలతో పాటు ఫీచర్లు ఇంటర్నెట్లో లీకై హల్చల్ చేస్తున్నాయి. ఈ మొబైల్స్ రెండు అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇది గత మోడల్స్ కంటే చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. అయితే వీటికి సంబంధించిన ఫీచర్స్ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఇటీవలే లీకైన వివరాల ప్రకారం.. ఫిలిప్పీన్స్ మార్కెట్ ధరల ప్రకారం బేస్ వేరియంట్ అయిన షావోమి 17T స్మార్ట్ ఫోన్ 256gb స్టోరేజ్ వేరియంట్ దాదాపు రూ.51 వేల రూపాయలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మరో మోడల్ దాదాపు రూ.57 వేలు ఉండబోతోంది. అంతేకాకుండా అయ్యుండు మోడల్ వేరియంట్ షావోమి 17T ప్రో 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్ ధర రూ.72 వేల రూపాయలు ఉండబోతోంది. అంతేకాకుండా బేస్ వేరియంట్ మొబైల్ ధర దుబాయ్ మార్కెట్లో రూ.58 వేల నుంచి ప్రారంభమవుతుంది. ఇక గ్లోబల్ మార్కెట్లో ఈ సిరీస్ ధరలు రూ.58 వేల నుంచి ప్రారంభమై హై ఎండ్ వేరియంట్ రూ.91 వేలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే..స్టాండర్డ్ షావోమి 17T మోడల్ 6.59-ఇంచుల 120Hz OLED డిస్ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 8500-అల్ట్రా ప్రాసెసర్తో విడుదల కాబోతోంది. ఇందులో కంపెనీ మోస్ట్ పవర్ఫుల్ 6,500mAh భారీ బ్యాటరీని అందించడమే కాకుండా చాలా ప్రత్యేకమైన 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా అందిస్తున్నారు. ఇక ఈ మొబైల్ లోని కెమెరా వివరాల్లోకి వెళ్తే.. వెనక వైపు కెమెరా 50 మెగాపిక్సెల్ తో అందుబాటులోకి రాబోతోంది. ఇది ఎంతో శక్తివంతమైన పవర్ఫుల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో విడుదల కాబోతోంది.
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
ఇక ఇదే సిరీస్లోని ప్రీమియం మోడల్ షావోమి 17T ప్రో స్మార్ట్ఫోన్ వివరాల్లోకి వెళ్తే.. ఇది 6.83-ఇంచుల 144Hz OLED డిస్ప్లే ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో విడుదల కాబోతోంది. ఈ ప్రో మోడల్లో కంపెనీ ఎంతో శక్తివంతమైన 7,000mAh బ్యాటరీతో పాటు 100W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ను అందించడం విశేషం. దీనిలో ఎంతో శక్తివంతమైన త్రిపుల్ కెమెరా సెటప్ ను కంపెనీ అందిస్తోంది. ఇందులో 5x ఆప్టికల్ జూమ్ కలిగిన 50MP టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రావైడ్ కెమెరాలు లభిస్తున్నాయి. అయితే, ఈ మొబైల్ను కంపెనీ మే 28వ తేదీన జరిగే అధికారిక ఈవెంట్లో భాగంగా భారతదేశ దేశంతో పాటు వివిధ దేశాల్లో లాంచ్ చేయబోతోంది..
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Peddi Item Song:'పెద్ది' సినిమాలోని ఐటెంసాంగ్ వచ్చేసింది! జాన్వీ కపూర్, శ్రుతిహాసన్తో కలిపి మెగా పవర్స్టార్ కుమ్మేశాడు!
Hyderabad, Telangana:Peddi Item Song Release: మెగాస్టార్ రామ్చరణ్ హీరోగా తెరకెక్కిన రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'పెద్ది' నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. నిన్న రాత్రి భోపాల్లో 'పెద్దికి ఆవాజ్' కార్యక్రమంలో హీరో రామ్చరణ్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సందడి చేసిన సంగతి తెలిసిందే.
ఇందులో ఏఆర్ రెహమాన్ స్పెషల్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఐటెం సాంగ్ రిలీజ్ చేయాల్సి ఉండగా.. కానీ, అనుకోని కారణాల వల్ల ఆ సాంగ్ రిలీజ్ను చేయలేదు. ఈ క్రమంలో 'పెద్ది' మేకర్స్ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. తాజాగా 'పెద్ది' ఐటెం సాంగ్ను చిత్రబృందం విడుదల చేసింది.
ఈ సినిమాలోని స్పెషల్ ఐటెం సాంగ్ 'చీర..చొక్క.. చిక్కెడిపోవాలో..' లిరికల్ వీడియోను చిత్రబృందం ఆదివారం విడుదల చేసింది. ఈ పాటలో రామ్ చరణ్తో కలిసి స్టార్ బ్యూటీ శ్రుతి హాసన్ తన డ్యాన్స్తో స్టేజ్ షేక్ చేశారు. అలాగే ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్గా నటిస్తున్న జాన్వీ కపూర్ కూడా ఈ పాటలో మెరిసి సందడి చేయడం విశేషం.
ముగ్గురు స్టార్ల గ్రేస్, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ స్పెషల్ సాంగ్ను లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ రచించగా.. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్లో రక్షిత్ సురేష్ ఆలపించారు.
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ హై-వోల్టేజ్ ఎంటర్టైనర్ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ఇది. చరణ్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ 'అచ్చమ్మ' అనే పాత్రలో నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'చికిరి చికిరి', 'రయ్ రయ్ రారా' సాంగ్ నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇప్పుడీ సినిమాలోని ఐటెంసాంగ్ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాను వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించాయి.
Also Read: రిలీజ్కు ముందు 'పెద్ది' నిర్మాతలకు షాక్..అడ్డం తిరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!
Also Read: "మరీ సిగ్గులేకుండా ఇంత ఖాళీగా ఉన్నారా?" సోషల్మీడియాలో యాంకర్ అనసూయ ఫైర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Summer Holidays: విద్యార్థులకు బిగ్ అలర్ట్..మే 31తో వేసవి సెలవులు ముగింపు..జూన్ 1 నుంచి క్లాసులు!
Vijayawada, Andhra Pradesh:Summer Holidays 2026: తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. అటు ఆంధ్రప్రదేశ్.. ఇటు తెలంగాణలోని విద్యాసంస్థలకు వేసవి సెలవులు తుదిదశకు చేరుకున్న ఇప్పుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవులను మే 31 నాటికి పూర్తి చేసి, జూన్ మొదటి వారం నుంచి కాలేజీలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ మేరకు ఇరు రాష్ట్రాల విద్యాశాఖలు ఉత్తర్వులతో పాటు కొత్త అకడమిక్ క్యాలెండర్లను విడుదల చేశాయి.
జూన్ 1 నుంచే ఇంటర్ క్లాసులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు జూన్ 1వ తేదీ నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24న ప్రారంభమైన ఇంటర్ వేసవి సెలవులు మే 31తో ముగియనున్నాయి. జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతాయి. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ మొత్తంగా 232 రోజుల పాటు అకాడమిక్ క్యాలెండర్ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇంటర్లోని NCERT, CBSE సిలబస్ను అమలు చేస్తున్నారు. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఏపీలో గత విద్యాసంవత్సరం (2025-26) నుంచే ఇంటర్లో NCERT సిలబస్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ దిశగానే ఈ ఏడాది అకడమిక్ క్యాలెండర్ను రూపొందించారు. అదే విధంగా తెలంగాణలో 2026-27 విద్యాసంవత్సరంలో 224 పనిదినాలతో మార్చి 30నే అకాడమిక్ క్యాలెండర్ ను విడుదల పూర్తి చేశారు.
స్కూళ్లు జూన్ 12 నుంచే..
ఇంటర్ విద్యార్థులకు జూన్ 1 నుంచే కాలేజీలు ప్రారంభం అవుతున్నప్పటికీ, పాఠశాల విద్యార్థులకు మాత్రం మరికొద్ది రోజులు సెలవులు కొనసాగనున్నాయి. స్కూల్ పిల్లలకు జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 12వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అన్నీ తిరిగి తెరుచుకోనున్నాయి. కాబట్టి, సుదీర్ఘ సెలవుల అనంతరం విద్యార్థులు జూన్ 12 నుంచి తిరిగి బడిబాట పట్టనున్నారు. విద్యార్థులు ఈ షెడ్యూల్ ప్రకారం తరగతులకు హాజరుకావాలని అధికారులు సూచించారు.
Also Read: మందుబాబులకు మత్తు దిగిపోయే వార్త..భారీగా పెరగనున్న మద్యం ధరలు..ఎంత పెరుగుతుందంటే?
Also Read: వడదెబ్బతో రాష్ట్రంలో 34 మంది మృతి..ఒక్కొక్కరికి రూ.4 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
IPL Playoffs Scenario: ప్లేఆఫ్స్కు అడుగుదూరంలో పంజాబ్..రాజస్థాన్-కోల్కతా పరిస్థితి ఏంటి? అసలు కథ ఇది!
Hyderabad, Telangana:IPL Playoffs Scenario 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇప్పుడు తుదిదశకు చేరుకుంది. నేటితో లీగ్ మ్యాచ్లు పూర్తి కానున్నాయి. అదే విధంగా ప్లేఆఫ్స్కు చేరనున్న నాలుగో జట్టు ఏదో తెలిసిపోతుంది. అయితే ప్లేఆఫ్స్ నాలుగో స్థానం కోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే పంజాబ్ తన చివరి లీగ్ మ్యాచ్ గెలిచి ముందడుగు వేయగా.. నేడు జరగబోయే రెండు మ్యాచ్ల్లో నాలుగో స్థానం ఖరారు అవుతుంది.
ప్లేఆఫ్స్ రేసులో రాయల్ ఛాలెంజర్స్, గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు వరుసగా పాయింట్స్ టేబుల్లో నిలవగా.. అయితే ఇప్పుడు నాలుగో స్థానం కోసం పంజాబ్ కింగ్స్ జట్టు 15 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. రాజస్థాన్ రాయల్స్ జట్టు 14 పాయింట్లతో ఐదో స్థానంలో.. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 13 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది.
ఐపీఎల్లో నేడు జరగనున్న తొలి మ్యాచ్లో ముంబయి ఇండియన్స్తో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధిస్తే.. ఎలాంటి సమీకరణాలు లేకుండా 16 పాయింట్లతో ప్లేఆఫ్స్లో నాలుగో బెర్త్ను ఖరారు చేసుకుంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఓడితే.. ఆ తర్వాత మ్యాచ్ ఫలితం బట్టి ఆధారపడి ఉంటుంది.
నేడు జరగనున్న రెండో మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడనుంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లేఆఫ్స్ నుంచి తప్పుకోగా.. కోల్కతా జట్టుకు చిన్న ఛాన్స్ ఉంది. అది కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టు గెలుపును బట్టి ఆధారపడి ఉంటుంది. రాజస్థాన్ ఓడితే కేకేఆర్ విరోచితంగా పోరాడాల్సి ఉంటుంది. రాజస్థాన్ గెలిస్తే కోల్కతా ఎలిమినేట్ అయినట్లే లెక్క.
ముంబై ఇండియన్స్తో జరగనున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓడితే పంజాబ్, కేకేఆర్కు ఛాన్స్ ఉంటుంది. రాజస్థాన్ ఓడితే పాయింట్లు, నెట్ రన్రేట్ బట్టి ఆ జట్టు ప్లేఆఫ్స్కు చేరుతుంది. 15 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు +0.309 నెట్ రన్రేట్నూ కేకేఆర్ అధిగమించాల్సిన అవసరం ఉంది. ఢిల్లీపై కేకేఆర్ గెలిస్తే 15 పాయింట్లతో +0.011 నెట్రన్రేట్తో నిలుస్తుంది. అయితే పంజాబ్కు కేకేఆర్తో పోలిస్తే మెరుగైన రన్రేట్ ఉన్న కారణంగా ఆ జట్టు ప్లేఆఫ్స్కు చేరుతుంది.
ఒకవేళ పంజాబ్ను పక్కకి నెట్టి కోల్కతా నైట్రైడర్స్ జట్టు ప్లేఆఫ్స్లో నాలుగో బెర్తు ఖరారు చేసుకోవాలంటే కేకేఆర్ ముందు కొన్ని కీలక సవాళ్లు ఉన్నాయి. తొలుత బ్యాటింగ్ చేస్తే 200+ టార్గెట్ సెట్ చేసి 77 పరుగుల తేడాతో గెలుపొందాల్సి ఉంటుంది. అదే విధంగా ఒకవేళ తొలుత బౌలింగ్ చేస్తే.. 200+ టార్గెట్ను 12.1 ఓవర్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే పంజాబ్ను దాటుకొని కోల్కతా ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉంది. అయితే ఇదంతా రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓడితేనే!
Also Read: శ్రేయస్ అయ్యర్ సెంచరీ..ఎట్టకేలకు విజయం సాధించిన పంజాబ్ కింగ్స్..ప్లేఆఫ్స్ ఉన్నట్టే!
Also Read: పంజాబ్ కింగ్స్కు లక్నోతో నేడు చావో రేవో మ్యాచ్..గెలిస్తే ప్లేఆఫ్స్, ఓడితే ఇంటికే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Budget Cars: సగం ధరకే లగ్జరీ కార్లు.. రూ.2.5 లక్షల డిస్కౌంట్తో క్రెటా, థార్, నెక్సాన్!
Hyderabad, Telangana:Delhi Second-hand Car Market: కొత్త కార్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఒక్క నిమిషం ఆగండి.. లక్ష రూపాయల కష్టార్జితాన్ని షోరూమ్స్లలో పెట్టే ముందు ఇవి తెలుసుకోండి. దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సెకండ్ హ్యాండ్ కార్లకు సంబంధించిన మార్కెట్ ఊహించని రీతిలో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఢిల్లీలోని సెకండ్ హ్యాండ్ షోరూమ్స్ ఉన్న కొన్ని ప్రదేశాల్లో కేవలం కొద్ది నెలలు మాత్రమే వినియోగించిన.. సరికొత్త కండిషన్లో ఉన్న లగ్జరీ కార్లతో పాటు బడ్జెట్ కార్లు ఏకంగా రూ.2.5 లక్షల వరకు భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా వాటిపై అదనంగా ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి..
ప్రస్తుతం మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta), మహీంద్రా థార్ (Mahindra Thar), టాటా నెక్సాన్ (Tata Nexon) వంటి కార్లు ఇక్కడ షోరూం కండిషన్లో అత్యంత తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఇతర లగ్జరీ బ్రాండ్లకు సంబంధించిన కార్లు అయితే చాలా చీప్ ధరలకే లభిస్తున్నాయి. కొన్ని కార్లు సగం ధరలకే అందుబాటులో ఉండడం విశేషం.. ముఖ్యంగా ఇక్కడ మహీంద్రా థార్ రాక్స్ (Thar Roxx) అత్యంత తక్కువ ధరలకే లభిస్తున్నాయి. కేవలం 1500 కిలోమీటర్లు తిరిగిన 2026 రిజిస్టర్ చేసిన ఈ కార్లు అత్యంత చీకు ధరలకే అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా వాటిపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందిస్తూ వస్తున్నారు.
అలాగే హ్యుందాయ్ క్రెటా (Creta) పెట్రోల్తో పాటు డీజిల్ మోడల్ 2024, 25 కు సంబంధించిన ఈ కార్లు దాదాపు నాలుగు లక్షల తగ్గింపుతో అందుబాటులో ఉండడం విశేషం. అయితే, మార్కెట్లో దీని ధర 15 లక్షలు.. అయితే దీనిని ఇప్పుడే ఈ ఢిల్లీ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కొనుగోలు చేసే వారికి దాదాపు 13 లక్షల నుంచి 14 లక్షల లోపే లభిస్తున్నాయి. అంతేకాకుండా టాటా నెక్సన్ 2024 మోడల్ కార్లు ఇక్కడ మరింత చీపు ధరకే లభిస్తున్నాయి. కేవలం 12000 కిలోమీటర్లు తిరిగిన ఈ కార్లు 9 లక్షల బడ్జెట్ లోనే లభించడం విశేషం.
Also Read: బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్లు..మే 28న సరికొత్త డిజైన్తో టాటా టియాగో ఫేస్లిఫ్ట్ లాంచ్
మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ తో పాటు ఇంధన ధరల భారాన్ని తగ్గించేందుకు టాటా టియాగో ఐ-సీఎన్జీ (Tata Tiago iCNG) ఆటోమేటిక్ మోడల్ వేరియంట్ అత్యంత తక్కువ ధరలో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో షో రూమ్ లోకి అందుబాటులో కారు దాదాపు 8 లక్షలు కాగా.. అయితే దీనిని ఇప్పుడే కొనుగోలు చేస్తే 6.5 లక్షలకే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనిపై ఇతర డిస్కౌంట్ ఆన్సర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ నాన్ యాక్సిడెంట్ కార్లు మాత్రమే విక్రయిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అలాగే షోరూం ట్రాక్ కలిగిన కార్లను మాత్రమే కస్టమర్లకు అందిస్తున్నట్లు వారు చెబుతున్నారు.
Also Read: బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్లు..మే 28న సరికొత్త డిజైన్తో టాటా టియాగో ఫేస్లిఫ్ట్ లాంచ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jagtial: వైన్ షాప్ ముందు సన్న వడ్లు ఫ్లెక్సీ.. మందుబాబుల మైండ్ బ్లాక్ చేసిన రైస్ మిల్లర్స్ ఐడియా!
Hyderabad, Telangana:Sanna Vadlu Paddy Cultivation: వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో సభలు పెట్టినప్పటికీ.. కరపత్రాలు పంచిన రాని స్పందన.. అక్కడ ఏర్పాటుచేసిన ఒకే ఒక ఫ్లెక్సీ తో వచ్చింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లో జరిగిన ఈ వినూత్న ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. సన్నబట్ల సాగుపై అవగాహన కల్పించేందుకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎంచుకున్న వేదిక, పద్ధతి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది..
గొల్లపల్లి మండలం నల్లగుట్ట సమీపంలోని వైన్స్ షాప్ ఎదుట.. ఈ ఖరీఫ్లో సన్నబడ్లు వేయండి.. అంటూ ఒక పెద్ద ఫ్లెక్సీ వెలిసింది. సాధారణంగా ప్రభుత్వ పథకాల ప్రచారాలతో పాటు రాజకీయ ఫ్లెక్సీలు వీధుల్లో మనం తరచుగా చూస్తూ ఉంటాం. కానీ నేరుగా వైన్ షాప్ ముందు రైతులను ఉద్దేశించి ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిత్యం వందలాది మందితో రద్దీగా ఉండే ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం వెనక ఒక వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది..
పల్లెల్లో వ్యవసాయం చేసే రైతుల్లో అత్యధికులు సాయంత్రం వేళల్లో సేద తీరడానికి వైన్ షాపుల వైపు వస్తూ ఉంటారని.. ఇక్కడ ఫ్లెక్సీ పెడితే సందేశం నేరుగా.. చాలా వేగంగా రైతు వర్గానికి చేరుతుందనే ఉద్దేశంతో రైస్ మిల్లర్స్ అసోసియేషన్.. ఈ వినూత్న ప్రయోగానికి తెరలేపినట్లు సమాచారం. ఈ ఫ్లెక్సీ ని చూసిన స్థానికులతో పాటు మందుబాబులు భిన్నంగా స్పందిస్తూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
రోజు అధికారులు వచ్చి చెప్పిన వినని వాళ్ళు కూడా.. ఇక్కడ ఫ్లెక్సీ చూడగానే అవును కదా. ఈసారి సన్నబడ్లు వేయాల్సిందే అని మాట్లాడుకుంటున్నారట. మందు కొట్టడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇంటికి వెళ్లి సన్నబడ్ల గురించే ఆలోచిస్తున్నారని సమాచారం. మార్కెట్లో సన్న రకం బియ్యానికి ఉండే డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని.. రాబోయే వానాకాలం సీజన్లో రైతులు ఎక్కువగా సన్నబడ్ల సాగు వైపు మొగ్గు చూపేలా చేయడమే ఈ ఫ్లెక్సీ ముఖ్య ఉద్దేశం.. సాధారణ ప్రచారాల కంటే ఈ తరహా షాక్ వాల్యూ ఉన్న ప్రచారాలు జనాలోకి బలంగా దూసుకెళ్తాయని.. అందుకే వైన్ షాప్స్ అడ్డాను ఎంచుకున్నామని మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు తెలుపుతున్నారు..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
