icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
501505
V SHIVA NAGARAJUV SHIVA NAGARAJUFollow17 Jul 2024, 05:58 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Chandrababu: వైఎస్‌ జగన్‌కు సీఎం చంద్రబాబు సవాల్‌.. ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

Velgapudi, Andhra Pradesh:

AP Assembly Session: 'మా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా వహిస్తాం. కుట్రలు చేసే పార్టీలకు, వ్యక్తులకు కాదు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాలు విసురుతున్నా. అసెంబ్లీకి వస్తే అడ్డంగా దొరికిపోతారనే వాళ్లు రావటం లేదు. రోడ్డుపై హిట్ అండ్ రన్ తరహాలో వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఏ కుట్రలూ పనిచేయవని డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన వారికి చెబుతున్నా. పూర్తి పారదర్శకతతో బాధ్యతతో , పూర్తి జవాబుదారీ తనంతో నియామకాలు జరిగాయి' అని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

మెగా డీఎస్సీపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు అసెంబ్లీలో కీలక ప్రసంగం చేశారు. 'ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా చేపట్టేందుకు ప్రత్యేకంగా ఓ చట్టమే తీసుకువచ్చాం. గడచిన 30 ఏళ్లుగా విద్యారంగంలో వినూత్న సంస్కరణలతో మార్పులు తెచ్చాం' అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఐఐటీ, ఐఐఎం లాంటి విద్య సంస్థల సహా పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. 10 నుంచి 12 లక్షల మంది విద్యార్ధులు పాఠశాలకు రావడం మానేయడంతోనే అందుకే తల్లికి వందనం పేరిట పిల్లలందరికీ ఆర్ధికసాయం అందించేలా మేం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో విద్య ప్రమాణాలు పెంచడంతో లక్ష మందికి పైగా విద్యార్ధులు ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లకు వచ్చారని ప్రకటించారు.

'మేం అధికారంలోకి వస్తూనే తొలి సంతకం చేసి మెగా డీఎస్సీతో 15,941 ఉద్యోగాలను భర్తీ చేశాం. కేవలం 148 రోజుల్లోనే ప్రక్రియ అంతా పారదర్శకంగా పూర్తి చేసి నియామకాలు పూర్తి చేశాం. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు సహా  హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ల ప్రక్రియను అత్యంత శ్రద్ధగా చేపట్టాం. 13 సబ్జెక్టుల్లో 42 వేల ప్రశ్నల్ని ఎంపిక చేసి అత్యుత్తమ విధానంలో పరీక్ష నిర్వహించాం. 154 సెంటర్లలో పరీక్షలు సీబీటీ విధానంలో, ఫలితాలను కూడా పారదర్శకంగా చేపట్టాం. పూర్తి ప్రతిభ ప్రకారం 15,941 మందిని ఎంపిక చేసి నియామకాలు చేపట్టాం' అని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వెల్లడించరాఉ.

'జోనల్, రాష్ట్రస్థాయి కమిటీతో పాటు అప్పీలేట్ అథారిటినీ కూడా పెట్టి ఫిర్యాదులను పరిష్కరించాం. స్పోర్ట్స్ కోటా కింద కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నిబంధనలను అమలు చేశాం. ఉద్యోగాలు వచ్చిన వారంతా అత్యుత్తమ ప్రతిభ కలిగిన వ్యక్తులు, ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నారు. మెగా డీఎస్సీ ద్వారా తమ కష్టానికి ఫలితం దక్కిందని వారంతా చెప్పారు. మెరిట్ కమ్ రోస్టర్ విధానంలోనే ఎప్పటికప్పుడు రిజల్ట్స్ ఇచ్చాం. ఎంపిక ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ఉంది. ఇంతకంటే పారదర్శకత ఎక్కడ ఉంటుంది?' అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.

'ప్రభుత్వంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఓ ఐఏఎస్ అధికారి, ఓ మాజీ మంత్రి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇచ్చిన నోటిఫికేషన్‌లో ఒక్క డీవియేషన్ కూడా లేదు. లిటిగెంట్ పార్టీకి చెందిన వ్యక్తులు 3 వందలకు పైగా కేసులు వేసి అడ్డంకులు సృష్టించారు. వారు చేసిన ఆరోపణలపై అధికారులు పూర్తి అధికారిక సమాచారంతో వివరణ ఇచ్చారు. ఈ ఆరోపణల్ని ఇక సహించలేక ఇప్పుడు డీఎస్సీ టీచర్లే రోడ్డుపైకి వచ్చారు' అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

'విద్యావిధానంలో సంస్కరణలతో పాటు పరీక్షల్లోనూ మరింత పారదర్శకత తీసుకువస్తాం. బురద జల్లితే జీరో టాలరెన్సు అని హెచ్చరిస్తున్నా. సిగ్గులేని ఆ పార్టీ అసెంబ్లీకి రాకుండా బయట పబ్జీలు ఆడుకుంటున్నారు. బాధ్యత కలిగిన వ్యక్తులు అసెంబ్లీకి వచ్చి డిమాండ్ చేయాలి. చెప్పేది వాస్తవం అయితే సరిచేసుకుంటాం' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రెండున్నరేళ్ల నుంచి అసెంబ్లీకి రాని పార్టీని చూడటం తన జీవితంలో ఇదే తొలిసారి అని తెలిపారు. 'అసెంబ్లీకి రాకుండానే జీతాలు తీసుకుంటున్నారు. ప్రివిలేజెస్ తీసుకుంటున్నారు. అనే నేనుగా నాకు ప్రజలపై పూర్తి బాధ్యత ఉంది. వారికి ఏముందో ప్రజలే చెప్పాలి. భవిష్యత్తులో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపడతాం' అని శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

0
0
Report

Thella Panchami: తేళ్లతో ఆడుకున్న భక్తులు.. తేళ్ల పంచమి విశిష్టత ఏమిటో తెలుసా?

Narayanpet, Telangana:

Nag Panchami: సాధారణంగా తేలు కనిపిస్తేనే భయపడే మనకు ఈ దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. కానీ తెలంగాణ సరిహద్దులోని కర్ణాటకలో ఉన్న ఓ గ్రామ ప్రజలకు మాత్రం తేళ్లంటే అస్సలు భయం లేదట. గ్రామస్తుల నమ్మకం ప్రకారం నాగుల పంచమి రోజున తేళ్లు ఎవరినీ కుట్టవని విశ్వసిస్తారు. సాధారణంగా నాగుల పంచమి రోజు పాముల పుట్టలో పాలు పోసి పూజలు చేయడం ఆనవాయితీ. కానీ ఆ గ్రామంలో మాత్రం దానికి భిన్నంగా తేళ్లకు పాలు పోసి పూజలు చేస్తారు.

కర్ణాటక రాష్ట్రంలోని యాద్గిర్ జిల్లా కందుకూరు గ్రామం. తెలంగాణలోని నారాయణపేట జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఈ గ్రామంలో తేళ్లను చూస్తేనే చాలామందికి ఒళ్లు జలదరిస్తుంది.. అదే తేలు ఒంటి మీదకు ఎక్కితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు కానీ ఈ గ్రామంలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్. ఏటా నాగుల పంచమి రోజున తేళ్ల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. కందుకూరు గ్రామంలోని కొండమవ్వ గుట్ట ఈ వేడుకలకు ప్రత్యేక కేంద్రంగా మారుతుంది. గుట్టపై ఉన్న తేళ్ల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తేళ్లకు పాలు పోసి మొక్కులు చెల్లించుకుంటారు.తేళ్లను చేతులతో పట్టుకుంటారు.. ముఖంపై తలపై పెట్టుకుంటారు. చివరికి నాలుకపై కూడా పెట్టుకుని ఆడుకుంటారు. 

ప్రతి ఏడాది నాగుల పంచమి రోజున ఇక్కడ ‘తేళ్ల పంచమి’ పేరుతో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అసలు వింత దృశ్యాలు మొదలవుతాయి. గుట్టపై రాళ్ల కింద, చెట్ల పొదల్లో ఉన్న తేళ్లను గ్రామస్థులు చేతులతో పట్టుకుంటారు.చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా తేళ్లను చేతులపై పెట్టుకుంటారు.కొంతమంది ముఖంపై, తలపై పెట్టుకుని ఆడుకుంటే మరికొందరు ఏకంగా నాలుకపై కూడా తేళ్లను పెట్టుకుంటారు. 

కొండమవ్వ గుట్టపై ఉన్న తేళ్ల విగ్రహాలకు పూజలు చేసి ఆ తర్వాత అక్కడి తేళ్లను పట్టుకుని ఒంటిపై వేసుకుని ఆడుకుంటారు. ఈ వింత వేడుకలను చూసేందుకు కర్ణాటకతో పాటు తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు కందుకూరుకు తరలివస్తారు. తేళ్లను చూస్తేనే భయపడే మనుషులు ఒకవైపు. తేళ్లను చేతులతో పట్టుకుని ఒంటిపై వేసుకుని ఆడుకునే కందుకూరు గ్రామస్థులు మరోవైపు.నాగుల పంచమి రోజున జరిగే ఈ ‘తేళ్ల పంచమి’ వేడుకలు ప్రతి ఏడాది ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.అయితే తేళ్లను చేతులతో పట్టుకోవడం ప్రమాదకరం కావడంతో ఇలాంటి ఆచారాలను నిర్వహించేటప్పుడు తగిన జాగ్రత్తలు తప్పనిసరి.

0
0
Report

Ayesha Gilani Death: ప్రముఖ టిక్‌టాకర్ అయేషా గిలానీ దారుణ హత్య..నడిరోడ్డుపై కాల్చి చంపారు!

Hyderabad, Telangana:

Ayesha Gilani Murder News: పాకిస్తాన్‌కు చెందిన సోషల్ మీడియా స్టార్, 28 ఏళ్ల టిక్‌టాకర్ అయేషా గిలానీ (అసలు పేరు షమ్సు బీబీ) దుండగుల కాల్పుల్లో దారుణ హత్యకు గురయ్యారు. టిక్‌టాక్‌లో దాదాపు 13 లక్షల (1.3 మిలియన్ల) మంది ఫాలోవర్లతో ఎంతో పాపులర్ అయిన ఆమె, పట్టపగలు కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ హృదయవిదారక ఘటన పాకిస్తాన్‌తో పాటు సోషల్ మీడియా వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

హత్య వెనుక అసలు ఏం జరిగిందంటే?
ఆగస్టు 14న అయేషా గిలానీకి ఒక అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తక్షణమే ఇంటి నుంచి బయటకు రావాలని ఆ వ్యక్తి కోరడంతో, ఆమె తన 15 ఏళ్ల సోదరి అసిమా, తమ్ముడు ఇమాతుల్లాతో కలిసి కారులో బయలుదేరారు.

కొద్దిసేపటికే 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై వచ్చి వారి కారును అకస్మాత్తుగా అడ్డుకున్నారు. దుండగులు జరిపిన కాల్పుల్లో ఒక బుల్లెట్ నేరుగా అయేషా మెడలోకి దూసుకెళ్లడంతో ఆమె కారులోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ హఠాత్ పరిణామంతో కారు అదుపుతప్పి మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అయేషా సోదరి అసిమా తీవ్రంగా గాయపడగా, ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

డబ్బు లావాదేవీలు, ప్రాణ బెదిరింపులే కారణమా?
కొంతకాలంగా కొంతమంది వ్యక్తులతో తన కుమార్తెకు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివాదాలు ఉన్నట్లు అయేషా తండ్రి ఫజల్ సాహిబ్జాదా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము ఇవ్వాల్సిన డబ్బును తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసినప్పటి నుంచి అయేషాకు నిరంతరం ప్రాణ బెదిరింపులు వస్తున్నాయని, ఈ విషయమై గతంలోనే ఇస్లామాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

ఘటన స్థలానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితులు మోటార్‌సైకిల్‌పై పారిపోతున్న దృశ్యాలను గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మరియు సీసీటీవీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు.

ఎవరీ అయేషా గిలానీ?
అయేషా గిలానీ పాకిస్తాన్‌లోని ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లలో ఒకరు. షమ్సు బీబీ అసలు పేరుతో టిక్‌టాక్‌లో తెగ హల్ చల్ చేసిన ఆమెకు 1.3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె చేసే వీడియోలకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె ఆకస్మిక మరణం ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపగా, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Irumudi Pre-Release Event: 'ఇరుముడి' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరో రవితేజ స్పీచ్..

Also Read: Faria Abdullah Troll: సోషల్ మీడియాలో హీరోయిన్ ఫరియాపై ట్రోలింగ్..వెక్కివెక్కి ఏడ్చిన హీరోయిన్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

BRS Party Protest: 'కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌' రద్దుకు రేవంత్ రెడ్డి కుట్ర.. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆందోళనలు

Baddipadaga, Telangana:

Kalyana Lakshmi Scheme Ban: కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు తూట్లు పొడిచే కుట్ర జరుగుతోందని.. ఎన్నికల్లో ఇచ్చిన తులం బంగారం హామీ ఇవ్వలేక ఆ పథకాలను రద్దు చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు కొనసాగించాలని.. ఆర్థిక సహాయంతోపాటు తులం బంగారం కూడా ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల రద్దుకు రేవంత్‌ రెడ్డి కుట్ర చేస్తున్న దానికి నిరసనగా ధర్నాలు చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

హైదరాబాద్‌లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కి హబ్సిగూడ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేద కుటుంబాలకు అండగా నిలిచే ఈ పథకాల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి హితవు పలికారు. సోమా శేఖర్, సైజన్ శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

వికారాబాద్‌లో..
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలపై స్టేను వెంటనే ఎత్తివేసి అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు వికారాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలపై స్టే కొనసాగడంతో అనేక మంది అర్హులైన లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే స్పందించి స్టేను ఎత్తివేసి.. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి అర్హులకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు అండగా నిలిచే ఈ పథకాలను ఎలాంటి జాప్యం లేకుండా కొనసాగించాలని నాయకులు కోరారు. 

సంగారెడ్డిలో
కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకాలను కొనసాగించాలని కోరుతూ గులాబీ శ్రేణులు సంగారెడ్డిలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వెంటనే పునరుద్ధరించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ తీసుకువచ్చిన ఆ పథకాలను రద్దు చేయాలనే కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి ఆ పథకాలు నిలిపివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

0
0
Report

AP MLC Governor Quota: ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఖరారు.. సీనియర్ నేతతో పాటు సాధారణ మహిళకు అవకాశం!

Velgapudi, Andhra Pradesh:

AP MLC Governor Quota Candidates: ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో ఆసక్తికరంగా మారిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక ఒక కొలిక్కి వచ్చింది. వైసీపీ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన పండుల రవీంద్రబాబు, జకియా ఖానంల పదవీ కాలం ముగియడంతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. ఈ నేపథ్యంలో సీనియర్ నాయకులతో పాటు సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఇద్దరి పేర్లను ఖరారు చేశారు.

వర్ల రామయ్యకు దక్కిన అవకాశం
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌గా సుదీర్ఘకాలం పార్టీకి సేవలందించిన సీనియర్ నేత వర్ల రామయ్య ఎట్టకేలకు చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం దక్కించుకున్నారు. గడచిన కాలంలో రాజ్యసభ రేసులో పలుమార్లు ఆయన పేరు పరిశీలనలోకి వచ్చినప్పటికీ చివరి నిమిషంలో అవకాశాలు చేజారాయి. తాజాగా ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఖరారు కాగా, భవిష్యత్తులో శాసనమండలి ఛైర్మన్ పదవి కూడా దక్కే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

సాధారణ మహిళకు ఛాన్స్
ఈ ఇద్దరు అభ్యర్థుల ఎంపికలో ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ ఎస్సీ నేత వర్ల రామయ్యకు ఒక స్థానం కేటాయించారు. అనూహ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన బీసీ వర్గ మహిళ, అనంతపురం లోక్‌సభ నియోజకవర్గ అంగన్‌వాడీ సంఘం అధ్యక్షురాలు దళవాయి రమాదేవి పేరును ఖరారు చేసి సంచలనం సృష్టించారు.

ఎన్నికల సమయంలో టికెట్లు దక్కని పలువురు సీనియర్లు ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశపడినప్పటికీ, ప్రభుత్వం మాత్రం ఒక సీనియర్ నేతతో పాటు క్రిందిస్థాయి నుంచి కష్టపడిన ఒక సాధారణ మహిళకు ప్రాధాన్యత కల్పించింది. ఎస్సీ, బీసీ వర్గాలకు సముచిత స్థానం కల్పించిన ఈ ఇద్దరి పేర్లను ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.

Also Read: శ్రావణ మాసం ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన చికెన్, కోడిగుడ్ల ధరలు..

ALso Read: ఏపీలో దారుణం.. భర్తను గొంతుకోసి చంపిన భార్య.. అనుమానంతో చంపి తల వద్ద దీపం పెట్టింది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Bihar Stampede: బీహార్‌లో ఘోర ప్రమాదం..ప్రముఖ ఆలయంలో తొక్కిసలాట..ఏడుగురు మహిళలు దుర్మరణం!

Balgudar, Bihar:

Bihar Stampede Today: భారీగా తరలివచ్చిన భక్తుల రద్దీతో బీహార్‌లోని ప్రసిద్ధ లఖిసరాయ్ అశోక్‌ధామ్ ఆలయం వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పవిత్ర శ్రావణ మాసోత్సవాల సందర్భంగా ఆలయంలో పూజలు చేసేందుకు వచ్చిన భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాటలో కనీసం ఏడుగురు మహిళలు దుర్మరణం చెందినట్లు సమాచారం అందుతోంది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఘటనకు అసలు కారణం ఇదే..
శ్రావణ మాసం కావడంతో సోమవారం తెల్లవారుజామున అశోక్‌ధామ్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అదే సమయంలో రెండు రైళ్లు లఖిసరాయ్ స్టేషన్‌కు చేరుకోవడంతో ప్రయాణికులు, భక్తుల రద్దీ ఒక్కసారిగా విపరీతంగా పెరిగింది. అశోక్‌ధామ్ స్టేషన్ నుంచి ఆలయానికి వెళ్లే మార్గంలో జనసమూహం నియంత్రణ దాటింది. అధిక ఒత్తిడి కారణంగా ఒక వైపు ఉన్న బారికేడింగ్ తెగిపోవడంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారు.

మరోవైపు, క్యూలైన్లలో వేలాది మంది నిలబడి ఉన్న సమయంలో అక్కడే ఉన్న ఒక విద్యుత్ స్తంభం కూలిపోయి దాని నుంచి విద్యుత్ ప్రవహించిందనే వదంతులు ఒక్కసారిగా వ్యాపించాయి. ఈ రూమర్ భక్తులలో తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ప్రాణభయంతో భక్తులు ఒక్కసారిగా పరుగులు తీయడంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది.

అధికారుల స్పందన..
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను తక్షణమే సమీప ఆస్పత్రులకు తరలించారు.

ఈ ఘటనపై లఖిసరాయ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (DM) శైలేంద్ర కుమార్ మాట్లాడుతూ.. "ఉదయం సమయంలో రెండు రైళ్లు రావడంతో జనసమూహం అసాధారణ రీతిలో పెరిగింది. బారికేడింగ్ తెగిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది" అని తెలిపారు. 

అలాగే ఎస్‌డిపిఓ శివం కుమార్ మాట్లాడుతూ.. విద్యుదాఘాత వదంతుల వల్ల తొక్కిసలాట జరిగిందా అనే కోణంతో పాటు అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతున్నామని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని స్పష్టం చేశారు. పవిత్ర శ్రావణ వేళ జరిగిన ఈ పెను ప్రమాదం స్థానికంగా తీవ్ర విషదాన్ని నింపింది.

Also Read: వందేమాతరం వివాదం..కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై పోలీస్ కేసు నమోదు!

Also Read: Karur Stampede Govt Job: కరూర్ తొక్కిసలాట బాధితులకు సుప్రీంకోర్టులో ఊరట..ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం పట్ల హర్షం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Irumudi Pre-Release Event: "బల్లగుద్ది చెప్తున్నా..ఈ సినిమా అందరికి నచ్చుతుంది" ఇరుముడి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరో రవితేజ!

Hyderabad, Telangana:

Irumudi Pre Release Event Speech: మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఇరుముడి' ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేయగా.. తాజాగా విడుదలైన 'మల్లెపూల పల్లకి' పాట ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చింది.

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న 'మల్లెపూల పల్లకి' సాంగ్
అయ్యప్ప భక్తుల్లో అత్యంత ప్రత్యేకమైన స్థానం ఉన్న ఒరిజినల్ 'మల్లెపూల పల్లకి' పాటలోని భక్తి భావాన్ని అలాగే ఉంచుతూ.. 'ఇరుముడి' కోసం సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ దీనికి మోడరన్ మ్యూజికల్ టచ్ ఇచ్చారు.

పవర్‌ఫుల్ బీట్స్, డప్పు రిథమ్స్‌తో పాటను చాలా ఎనర్జిటిక్‌గా తీర్చిదిద్దారు. ఒరిజినల్ పాటకు తన వాయిస్‌తో ప్రాణం పోసిన డప్పు శ్రీను, ఈసారి కూడా తన గాత్రంతో రా, డివోషనల్ ఫీల్‌ను తీసుకువచ్చారు. అయ్యప్ప స్వామి భక్తుడి గెటప్‌లో రవితేజ వేసిన మాస్ డ్యాన్స్ మూవ్స్, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖుల మాటలు..
ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరో రవితేజ మాట్లాడుతూ.. "ఇది ఒక మంచి ఎమోషనల్ రైడ్. ఇందులో నటించిన ప్రతి ఒక్కరి క్యారెక్టర్ మైండ్‌లో ఉండిపోతుంది. ముఖ్యంగా సాయికుమార్ గారిని ఒక డిఫరెంట్ వేలో చూస్తారు. బల్లగుద్ది చెబుతున్నా.. ఈ సినిమా మీకు తెగ నచ్చేస్తుంది, ఒక డిఫరెంట్ రవితేజను థియేటర్లలో చూస్తారు" అని అన్నారు.

దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.."ఇది తెలుగు సినిమాల్లో వచ్చిన మోస్ట్ ఇంటెన్స్ అండ్ సీరియస్ ఫ్యామిలీ డ్రామా. చివరి 40 నిమిషాలు మిమ్మల్ని ఒక ఇంటెన్స్ డ్రామాలో ముంచేస్తుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక గొప్ప ఎమోషనల్ అనుభూతిని మిగుల్చుతుంది" అని వెల్లడించారు.

"అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ఒక భక్తుడి బ్యాక్‌గ్రౌండ్‌లో సాగే థ్రిల్లర్ ఇది. అద్భుతమైన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుంది." - నిర్మాత రవిశంకర్ 

సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ.. "రవితేజ కెరీర్‌లో ఇదొక మెమొరబుల్ మూవీ అవుతుంది. యాక్షన్, సెంటిమెంట్, మాస్ మూమెంట్స్ అన్నీ బ్యాలెన్స్ చేస్తూ మ్యూజిక్ అందించాను. థియేటర్లలో ప్రేక్షకులు దీనిని బాగా ఎంజాయ్ చేస్తారు" అని అన్నారు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు..
ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తుండగా.. తన భార్య పాత్రలో ప్రియా భవానీ శంకర్, కూతురి పాత్రలో బేబీ నక్షత్ర కనువిందు చేయనున్నారు. అలాగే సినిమాలో సాయికుమార్, అజయ్ ఘోష్, శ్వాసిక తదితరులు కీలక పాత్రలో పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తుండగా.. శివ నిర్వాణ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం వహించారు. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిచగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్, విష్ణుశర్మ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైనర్‌గా సాహి సురేష్ వ్యవహరించారు. ఈ సినిమా ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది. 

Also Read: విరాట్ కోహ్లీకి ఈ టాలీవుడ్ హీరోయిన్ మరదలు అవుతుంది..ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా?

ALso Read: Prabhas Fauzi New Poster: 'ఫౌజీ' కొత్త పోస్టర్..ఒకవైపు గాంధీ, మరోవైపు ప్రభాస్ మాస్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Sonia Gandhi Vande Mataram: వందేమాతరం వివాదం..కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై పోలీస్ కేసు నమోదు!

Delhi, Delhi:

Sonia Gandhi Vande Mataram Case: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని జాతీయ కాంగ్రెస్ కార్యాలయంలో 'వందేమాతరం' గీతాలాపన వేళ తీవ్ర వివాదం చెలరేగింది. వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అమర్యాదగా ప్రవర్తించారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తాయి. ఇప్పుడు ఈ పరిణామాలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. జాతీయ గేయాన్ని అవమానించారనే ఆరోపణలతో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై కర్ణాటకలో బీజేపీ నేతలు అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మంగళూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు
ఢిల్లీలోని ఏఐసీసీ (కాంగ్రెస్) ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ గేయం (వందేమాతరం) పాడుతున్న సమయంలో సోనియా గాంధీ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. వందేమాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించారంటూ కర్ణాటకలోని మంగళూరు ఉర్వా పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నాయకులు ఆదివారం ఫిర్యాదు దాఖలు చేశారు.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన తర్వాత వందేమాతరం గీతాలాపన జరుగుతుండగా వేదికపై ఉన్న సోనియా గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడుతూ, గీతాన్ని మధ్యలోనే ఆపేయాలన్నట్లుగా సైగలు చేశారనే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే సోనియా గాంధీ చేసిన ఈ ప్రవర్తనపై సర్వత్రా విమర్శలకు దారితీసింది. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు మరో విషయంపై సోనియా గాంధీ మాట్లాడారని.. జాతీయ గీతం ఆపేయాలంటూ వచ్చిన వ్యాఖ్యలను వారు తప్పుబట్టారు. అయితే వందేమాతరం పాడే సమయంలో అలా కదలాడి, మాట్లాడాల్సిన అవసరం ఏమిటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జాతీయ గేయాన్ని పూర్తిగా పాడకుండా అడ్డుకోవాలని సోనియా సూచించారని, కాంగ్రెస్‌కు జాతీయ చిహ్నాలపై కనీస గౌరవం లేదని బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాల్వియా ఎక్స్ వేదికగా తీవ్రంగా విమర్శించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపాటు
రాజస్థాన్‌లోని చిత్తౌర్‌గఢ్ సభలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలోనే జాతీయ గేయాన్ని ఆపేయాలని పార్టీ అధ్యక్షుడికి సోనియా గాంధీ చెప్పడం వారి సిగ్గుమాలిన చర్యలకు, దురహంకారానికి అద్దం పడుతోందని ఆయన దుయ్యబట్టారు.

కాంగ్రెస్ పార్టీ వివరణ
మరోవైపు బీజేపీ చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ వర్గాలు పూర్తిగా ఖండించాయి. వందేమాతరం గీతాన్ని ఆపేయాలని సోనియా గాంధీ ఎలాంటి సైగలు చేయలేదని స్పష్టం చేశాయి. వేదికపై ఎక్కువసేపు నిలబడలేక ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూర్చోవడానికి వెంటనే ఒక కుర్చీ ఏర్పాటు చేయాలని మాత్రమే సోనియా కోరారని కాంగ్రెస్ నాయకులు వివరణ ఇచ్చారు.

Also Read; శ్రావణ మాసం ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన చికెన్, కోడిగుడ్ల ధరలు..

ALso Read: మరో వివాదంలో హీరో అల్లు అర్జున్.. స్వాతంత్ర్య దినోత్సవ పోస్ట్ డిలీట్..ఏం జరిగిందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Vande Bharat Accident: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం..వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని యువ నర్స్ మృతి!

Secunderabad, Telangana:

Vande Bharat Moulali Incident: తల్లిదండ్రులతో కలిసి సాగిన ఆ సంతోషకరమైన ప్రయాణం క్షణాల వ్యవధిలోనే తీరని విషాదంగా మారింది. గమ్యస్థానానికి చేరుకున్న వెంటనే జరిగిన అనూహ్య ప్రమాదం ఓ యువతి ప్రాణాలను బలితీసుకుంది. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ సమీపంలోని మౌలాలిలో చోటుచేసుకున్న ఈ రైలు దుర్ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అసలేం జరిగింది?
తెలంగాణలోని జనగాంకు చెందిన 20 ఏళ్ల మానేపల్లి మానస వృత్తిరీత్యా నర్సుగా పనిచేస్తున్నారు. ఆదివారం (ఆగస్టు 16న) మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆమె తన తల్లిదండ్రులతో కలిసి గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి మౌలాలి చేరుకున్నారు. మౌలాలి రైల్వే ఎల్‌సీ గేట్ నంబర్-6 సమీపంలోని అప్‌లైన్ వద్ద రైలు దిగిన మానస.. ప్లాట్‌ఫామ్ మారేందుకు పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

అదే సమయంలో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు అతివేగంగా వస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఆమెను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మానస తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కళ్లముందే కుమార్తె విగతజీవిగా పడిపోవడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు వర్ణనాతీతం.

రైల్వే పోలీసుల దర్యాప్తు
గోల్కొండ ఎక్స్‌ప్రెస్ నుంచి దిగిన మానస రైలు పట్టాలు దాటడానికి కారణం ఏమిటి? వందేభారత్ వస్తున్న విషయాన్ని ఆమె గమనించలేదా? అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై సికింద్రాబాద్ రైల్వే పోలీసులు క్రైమ్ నంబర్ 418/2026 కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

ప్రాథమికంగా ఇది ప్రమాదవశాత్తు జరిగినట్లు భావిస్తున్నప్పటికీ, అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడేవారి ప్రాణాలు కాపాడే నర్సు వృత్తిలో ఉన్న మానస, ఇలా రైలు ప్రమాదంలో దుర్మరణం చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Also Read: ఏపీలో దారుణం.. భర్తను గొంతుకోసి చంపిన భార్య.. అనుమానంతో చంపి తల వద్ద దీపం పెట్టింది!

Also Read: Balapur Ganesh Theme: ఈసారి బాలాపూర్ గణేష్‌కు పూరీ జగన్నాథ్ ఆలయం థీమ్..ఎలా ఉండబోతుందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

AP Rains: రేపు ఆంధ్రప్రదేశ్‌కు అక్కడక్కడ భారీ వర్షాలు.. ఎక్కడెక్కడో తెలుసా?

Nuzendla, Andhra Pradesh:

AP Rain Alert: ఎల్‌నినో ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడగా.. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏపీలో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితుల్లో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో రేపు, ఎల్లుండి వర్షాలు పడతాయని తెలిపింది. అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు ప్రకటించారు.

వాయవ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ - ఉత్తర ఒడిశా తీరప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. స్పష్టమైన అల్పపీడనంగా  బలపడి కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయవ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో వాయవ్య, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తరాంధ్ర తీరప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

రేపు సోమవారం, ఎల్లుండి మంగళవారం వరకు గంటకు 40 నుంచి 60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగసిపడే అవకాశం ఉందని హెచ్చరించింది. మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లరాదని సూచనలు చేసింది. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు తక్షణమే తీరానికి తిరిగి రావాలని సూచించింది. వీటి ప్రభావంతో రేపు సోమవారం  శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ  పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.

అంతేకాకుండా మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, మార్కాపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని వాతవరణ శాఖ వెల్లడించింది. మంగళవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈదురుగాలులు, పిడుగులు పడే ప్రమాదం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

0
0
Report
Advertisement

Konda Surekha: మళ్లీ కొండా సురేఖ డుమ్మా.. రేవంత్‌ రెడ్డిపై ఇంకా చల్లారని అసంతృప్తి

Parkal, Telangana:

Warangal Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో ఇంకా భేదాభిప్రాయాలు తారస్థాయిలో ఉన్నాయి. క్షేత్రస్థాయిలోనే కాదు అత్యున్నత పదవుల్లో ఉన్న వారి మధ్య కూడా విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర స్థాయిలో లుకలుకలు ఉన్నాయి. పరకాల బహిరంగ సభతో అవి మరింత ముదిరాయని స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి హాజరైన సభకు కీలక శాఖకు మంత్రి అయిన కొండా సురేఖ డుమ్మా కొట్టారు. రేవంత్‌ రెడ్డిపై కొండా దంపతులు ఇంకా అసంతృప్తి.. ఆగ్రహంతో ఉన్నారని మరోసారి రుజువైంది.

ములుగురు జిల్లాలో రేవంత్ రెడ్డి విస్తృత స్థాయి పర్యటన చేశారు. మేడారం సమ్మక్క, సారక్క ఆలయాన్ని సందర్శించడమే కాకుండా ములుగు జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని సీఎం హోదాలో రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. ఇక అనంతరం పరకాలలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇది కొండా సురేఖ నియోజకవర్గం పక్కన ఉన్నదే. కానీ ఏ కార్యక్రమంలోనూ కొండా సురేఖ పాల్గొనలేదు. రేవంత్‌ రెడ్డి కార్యక్రమానికి ఆమె దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది.

దేవాదాయ శాఖకు చెందిన కార్యక్రమంలో కూడా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ హాజరుకాలేదు. మేడారం జాతర పనుల పరిశీలనకు వచ్చిన రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధిత శాఖ మంత్రిగా కొండా సురేఖ డుమ్మా కొట్టడంతో చర్చనీయాంశంగా మారింది. మేడారం జాతరతోపాటు మరికొన్ని అంశాలపై రేవంత్‌ రెడ్డితోపాటు పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కొండా సురేఖకు విబేధాలు కొనసాగుతున్నాయి. రేవంత్‌ రెడ్డి, పొంగులేటిపై కొండా సురేఖ కుమార్తె గతంలో బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక జిల్లాలో ఉన్న మరో మంత్రి సీతక్కతో కూడా కొండా సురేఖకు విభేదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

కొండా సురేఖకు షాకిచ్చిన రేవంత్ రెడ్డి
వరంగల్ జిల్లా పర్యటనకు దూరమైన కొండా సురేఖ దంపతులకు బహిరంగ సభ వేదికగా రేవంత్ రెడ్డి షాకిచ్చే ప్రకటన చేశారు. పరకాల నియోజకవర్గంలో తమ కుమార్తె కొండా సుష్మితను పోటీ చేయాలని కొండా దంపతులు ప్రయత్నాలు చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి మరోసారి రేవూరి ప్రకాశ్‌ రెడ్డి పోటీ చేస్తాడని.. తిరిగి గెలిపించాలని రేవంత్‌ రెడ్డి పిలుపునివ్వడంతో కొండా దంపతులకు కౌంటర్‌ ఇచ్చారు. తన కూతురు సుష్మితను పరకాలలో బరిలోకి దింపాలని కొండా సురేఖ పలుమార్లు బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తనతో భేదాభిప్రాయాలు పెట్టుకున్న కొండా సురేఖకు రాజకీయంగా ఇలా రేవంత్ రెడ్డి దెబ్బతీశారని చర్చ జరుగుతోంది.

0
0
Report
Advertisement
Advertisement
Back to top