icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
501505
V SHIVA NAGARAJUV SHIVA NAGARAJUFollow17 Jul 2024, 05:58 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

RR vs GT Highlights: రాజస్థాన్‌కు మరో ఓటమి.. భారీ విజయంతో ప్లేఆఫ్స్‌ రేసులోకి గుజరాత్‌ టైటాన్స్‌

Jaipur, Rajasthan:

IPL 2026 RR vs GT Highlights: ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకెళ్లిన రాజస్థాన్‌ రాయల్స్‌ క్రమంగా డీలా పడిపోతున్నది. వరుస ఓటములను చవిచూస్తున్న రాజస్థాన్‌ మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏమాత్రం ప్రభావం చూపని రాజస్థాన్‌ పరాజయం పొంది ప్లేఆఫ్స్‌ రేసు నుంచి దూరమవుతోంది. మరోవైపు గుజరాత్‌ టైటాన్స్‌ అద్భుతంగా పుంజుకుని మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవడమే కాకుండా మెరుగైన రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. 77 పరుగుల తేడాతో గుజరాత్‌ నెగ్గిన ఈ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.

0
0
Report
Advertisement

Bandi Bagirath: కొడుకు బండి భగీరథ పోక్సో కేసుపై బండి సంజయ్‌ తొలి స్పందన

Baddipadaga, Telangana:

Bandi Bagirath POCSO Case: మద్యం తాగించి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ సాయిపై పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదడంతో తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ వ్యవహారంపై జాతీయ స్థాయిలో రచ్చ మొదలవగా.. బీఆర్‌ఎస్‌ పార్టీతోపాటు కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసింది. తెలంగాణలో తీవ్ర రాజకీయ దుమారం రేపిన ఈ సంఘటనపై తొలిసారి నిందితుడి తండ్రి, కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్‌ స్పందించారు. తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Also Read: Tirumala VVIPs: తిరుమలకు సెలవుల రద్దీ.. భారీగా తరలివచ్చిన ప్రముఖులు

తన కుమారుడు బండి భగీరథ్‌ సాయిపై నమోదైన పోక్సో కేసుపై కేంద్ర సహాయ మంత్రి, కరీంనగర్‌ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ 'ఎక్స్‌' వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా తన ఎదుగుదలను ఓర్వలేక.. రాజకీయంగా ఎదుర్కోలేక తన కుటుంబసభ్యులను రాజకీయాల్లోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కష్టపడి కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగిన సామాన్య బీసీ వ్యక్తినని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా తన కుమారుడిపై ఆరోపణలు చేస్తున్న వారిపై సమాధానం వస్తుందని.. ప్రతి కుట్ర బహిర్గతం అవుతుందని బండి సంజయ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

Also Read: Operation Sindoor: ఆపరేషన్‌ సింధూర్‌కు ఏడాది.. ఉదయం 1.05 గంటలకు ఏం జరిగిందో తెలుసా?

నిరాధారమైన ఆరోపణలు వెలుగు చూసిన నేపథ్యంలో ఈ ప్రకటన చేస్తున్నట్లు బండి సంజయ్‌ తెలిపారు. 'నాకు చట్టంపై గౌరవం, న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. జీవితాంతం భారత రాజ్యాంగానికి కట్టుబడే ఉన్నా. దశాబ్దాలుగా ప్రజలతోనే ఉన్న నేను మచ్చ లేని జీవితం గడిపానని గర్వంగా చెప్పగలను' అని పేర్కొన్నారు. 'నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు నా పిల్లలను, కుటుంబసభ్యులను రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఇది వారిలో గూడుకట్టుకున్న నిరాశ నిస్పృహలకు అద్దం పడుతుంది. అట్టడుగు స్థాయి నుంచే నా ప్రజా జీవితాన్ని మొదలుపెట్టా. కష్టపడి పనిచేసి ప్రజల ఆశీర్వాదంతో నాడు కార్పొరేటర్‌గా, నేడు ఎంపీగా ఎన్నికై కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వెనకబడి వర్గాలకు చెందిన బీసీ వ్యక్తి, నాయకుడిగా కేంద్రమంత్రి స్థాయికి ఎదగడాన్ని కొన్ని శక్తులు జీర్ణించుకోలేక కుట్రలకు తెరతీశాయి' అని ఆరోపించారు.

 'రేపు ప్రధానమంత్రి బహిరంగ సభ నేపథ్యంలో నన్ను వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేయాలన్నదే ఆ కుట్రల వెనకున్న అసలు లక్ష్యం. తప్పేదో.. ఒప్పేదో.. న్యాయవ్యవస్థ నిర్ణయిస్తుందన్న నమ్మకం నాకుంది. సమయం ప్రతి ఆరోపణకు సమాధానం ఇస్తుంది. ప్రతి కుట్రను బహిర్గతం చేస్తుంది' అని బండి సంజయ్‌ పేర్కొన్నారు. చివరికి సత్యమేవ జయతే అని పోస్టు చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Tirumala VVIPs: తిరుమలకు సెలవుల రద్దీ.. భారీగా తరలివచ్చిన ప్రముఖులు

Tirupati Urban, Andhra Pradesh:

Summer School Holidays: ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. రోజురోజుకు భక్తుల సంఖ్య పెరిగిపోతుండగా.. వారికితోడు ప్రముఖులు కూడా తరలివస్తున్నారు. దీంతో తిరుమల గిరులు భక్తులతో కళకళలాడుతున్నాయి. శనివారం రోజు సినీ ప్రముఖులతోపాటు రాజకీయ, ప్రభుత్వ అధికారులు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

Also Read: LSG vs RCB: హ్యాట్రిక్‌ ఓటముల నుంచి లక్నోకు ఊరట.. కీలక మ్యాచ్‌లో బెంగళూరు బోల్తా

ఏపీ ప్రభుత్వ విప్ గణబాబు, దివంగత నటుడు కృష్ణంరాజు భార్య, సినీ నటుడు ప్రభాస్‌ పెద్దమ్మ శ్యామల దేవి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ నిర్మాత బన్నీ వాసు, దర్శకుడు మెహర్ రమేష్, విలక్షణ నటుడు, దర్శకుడు సముద్రఖని శనివారం తిరుమల శ్రీవారిని వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరందరికీ ఆలయ అధికారులు ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లు చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Also Read: Operation Sindoor: ఆపరేషన్‌ సింధూర్‌కు ఏడాది.. ఉదయం 1.05 గంటలకు ఏం జరిగిందో తెలుసా?

తిరుమల స్వామిని దర్శించుకున్న అనంతరం ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తమిళనాడులో చోటుచేసుకుంటున్న పరిణామాలపై స్పందించారు. దర్శనం ముగించుకుని ఆలయం వెలుపలకు వచ్చిన సముద్రఖని మీడియాతో మాట్లాడుతూ.. 'నా ఆప్తమిత్రుడు, తోబుట్టువు లాంటి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి కావడం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి విజయ్ తమిళనాడులో సుపరిపాలన అందించాలని నేను స్వామిని వేడుకున్నా' అని నటుడు సముద్రఖని తెలిపారు.

తిరుమల ఆలయాన్ని శ్రీవాణి విరామ సమయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్ దంపతులు దర్శించుకున్నారు. రెండు రోజుల తిరుపతి, తిరుమల పర్యటనలో భాగంగా మొదటగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని తిరుమలకి వచ్చారు. వారికి టీటీడీ ఈఓ స్వాగతం పలికి ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపం లో వేద అర్చకులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రం తో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Jangaon Snake Bite: ఒకేసారి రెండు పాములు కాటేస్తే..శరీరంలో జరిగే భయంకరమైన మార్పులు ఏంటి?

Jangaon, Telangana:

Jangaon Snake Bite Incident: సాధారణంగా ఒక విష సర్పం కాటు వేస్తేనే ప్రాణాలు కాపాడుకోవడం కష్టమవుతుంది. అలాంటిది ఒకే సమయంలో రెండు జాతుల పాములు కాటు వేస్తే? ఊహించడానికే భయంకరంగా ఉన్న ఈ ఘటన జనగామ జిల్లాలో జరిగింది. నిద్రలో ఉన్న నాలుగేళ్ల బాలుడిని నాగుపాము, రక్తపింజరి ఒకరి తర్వాత ఒకరు కాటు వేయడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

భారతదేశంలోని ప్రధాన విష సర్పాల్లో ఒక్కో రకమైన విషం ఉంటుంది. నాగుపాము/కట్లపాము (న్యూరోటాక్సిన్) విషం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇది మెదడు నుంచి శరీరానికి అందే సంకేతాలను నిలిపివేస్తుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల కండరాలు పనిచేయవు, దీనివల్ల శ్వాస తీసుకోవడం సాధ్యం కాక మనిషి ఊపిరి ఆడక చనిపోతాడు.

అదే విధంగా రక్తపింజరి పాము విషం రక్తాన్ని గడ్డకట్టనివ్వదు లేదా అసాధారణంగా గడ్డకట్టేలా చేస్తుంది. కణజాలాన్ని నాశనం చేస్తుంది. దీనివల్ల అంతర్గత రక్తస్రావం జరిగి కిడ్నీలు, గుండె వంటి అవయవాలు విఫలమవుతాయి.

ఈ విధంగా రెండు పాములు ఒకేసారి కరిచినప్పుడు, శరీరంపై రెట్టింపు భారం పడుతుంది. ఒకవైపు శ్వాస వ్యవస్థ ఆగిపోతుంటే, మరోవైపు రక్తం విషతుల్యమై అవయవాలు కుప్పకూలతాయి. సాధారణంగా ఒక పాము కరిచినప్పుడు విషం వ్యాపించడానికి పట్టే సమయం కంటే, రెండు పాములు కరిచినప్పుడు ఆ వేగం విపరీతంగా పెరిగి మనిషికి కోలుకునే అవకాశం కూడా ఉండదు.

ఇలాంటి అరుదైన, సౌకర్యమైన కేసుల్లో వైద్యులకు కూడా చికిత్స చేయడం పెద్ద సవాలుగా మారుతుంది. ఏ పాము కరిచిందో తెలియనప్పుడు లేదా ఒకటి కంటే ఎక్కువ పాములు కరిచినప్పుడు వైద్యులు 'పాలివాలెంట్ యాంటీ వీనమ్' (పాలీవాలెంట్ యాంటీ-వెనం) వాడతారు. ఇది మన దేశంలో కనిపించే నాలుగు ప్రధాన విష సర్పాల (నాగుపాము, కట్లపాము, రెండు రకాల రక్తపింజరులు) విషాన్ని అడ్డుకోగలదు. అయితే, పాముల విషం శరీరంలో ఉన్నప్పుడు రెండు వీనమ్ డోసేజ్ భారీగా పెంచాల్సి ఉంటుంది. బాధితుడిని ఎంత త్వరగా ఆసుపత్రికి చేర్చామనే దానిపైనే ప్రాణాపాయం ఉంటుంది.

గమనిక: డాక్టర్ల సూచన మేరకు పాము కాటుకు గురైన వ్యక్తిని ఎలాంటి గాబరా లేకుండా.. వెంటనే అత్యవసర చికిత్స అందించడం కీలకం.

Also Read: త్వరలోనే హీరో విజయ్-త్రిషల పెళ్లి?! వీళ్లిద్దరి మధ్య వయసు గ్యాప్ ఎంత ఉందంటే?

Also Read: బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు..ఈ పనులు వెంటనే పూర్తి చేసుకోండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

West Bengal CM Salary: బెంగాల్‌ కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారి జీతం ఎంత?

Chhotobainan, West Bengal:

Chief Minister Salary And Allowances: భారతదేశంలో అతి పెద్ద రాష్ట్రం.. బ్రిటీష్‌ కాలం నుంచి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి కాషాయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి, ఎన్డీయే నాయకులు హాజరయ్యారు. అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టిన సువేందు ఎంత జీతం పొందుతారో తెలుసుకుందాం.

Also Read: Suvendu Adhikari: సువేందు అధికారి ఆస్తులు ఇవే.. తులం బంగారం లేని బెంగాల్‌ కొత్త సీఎం

15 ఏళ్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నెరవేర్చిన మమతా బెనర్జీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. మరి ఆమె లాగా సువేందు అధికారి జీతం, ఇతర అధికారిక సౌకర్యాలు పొందుతారో చూడాలి. వాస్తవంగా తీసుకున్నా తీసుకోకపోయినా ప్రభుత్వపరంగా ముఖ్యమంత్రికి జీతం, భత్యాలతోపాటు కొన్ని అధికారిక సౌకర్యాలు ముఖ్యమంత్రికి లభిస్తుంటాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సువేందు అధికారికి జీతం ఎంత, ఏమేమీ ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుందాం.

Also Read: Vizag Big Trishul: వైజాగ్‌కు మరో అదనపు అందం.. కైలాసగిరిపై భారీ త్రిశూలం

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దేశంలోనే చాలా పెద్దది. జనాభా కూడా అదే స్థాయిలో ఉంది. సంపద అధికంగా ఉండే పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రికి కూడా భారీగా జీతం ఉంది. జీతంతోపాటు అధికారిక నివాసం.. ఇతర అలవెన్స్‌లు, సేవలు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు పొందుతారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారికి నెలకు సుమారు రూ.2.10 లక్షల జీతం పొందుతారు.

వాస్తవంగా పశ్చిమ బెంగాల్‌ ఎమ్మెల్యేకు రూ.50,000 చొప్పున జీతం ఇస్తారు. ముఖ్యమంత్రికి రూ.లక్ష జీతం ఇస్తుండగా.. భత్యంగా రూ.51,600 చెల్లిస్తారు. అన్నీ కలిపితే రూ.2.10 లక్షలు జీతం, భత్యం రూపంలో ముఖ్యమంత్రి పొందుతారు. ముఖ్యమంత్రి అధికారిక ఖర్చులు, బహిరంగ సభల కోసం ప్రత్యేక భత్యాలు పొందుతారు. ఎమ్మెల్యేగా, ఆయన కార్యాలయ పనుల కోసం, తన నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించడానికి రూ.48,000 భత్యం చెల్లిసతారు.

రోజువారీ సమావేశ భత్యంగా రూ.2,000 అందిస్తారు. ఇది నెలకు మొత్తం రూ.60,000 అవుతుంది. ముఖ్యమంత్రికి ప్రభుత్వ నివాసం, ప్రభుత్వ వాహనం, సిబ్బంది, టెలిఫోన్, ఇంటర్నెట్ బిల్లులు, భద్రతా కాన్వాయ్ లభిస్తాయి. జెడ్-ప్లస్ భద్రత ఉన్నవారు ఉచిత వైద్య చికిత్స, ఉచిత ప్రయాణ భత్యంతో సహా అనేక అదనపు ప్రయోజనాలను పొందుతారు. అయితే వీటన్నిటి సీఎంగా బాధ్యతలు చేపట్టిన సువేందు అధికారి పొందుతారో లేదో తెలియాల్సి ఉంది. మమతా బెనర్జీ బాటలో సువేందు పొందుతాడో లేదో చూడాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

BRS Party: బండి సంజయ్‌ కొడుకు పోక్సో కేసుపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు

Hyderabad, Telangana:

Bandi Sanjay Son POCSO Case: 'కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడుపై పోక్సో కేసు ఉత్తిగా నమోదు కాదు కదా? దీని వెనుక ఏం జరిగింది అనే దానిపై విచారణ జరపాలి. కేంద్ర మంత్రి కొడుకు అయినా సామాన్యుడు అయినా ఒకటే. బండి సంజయ్ కుమారుడిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు తీసుకోవాలి. బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదు చేసి చట్ట పరంగా చర్యలు తీసుకోవాలి' అని హోం శాఖ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు. 'రేవంత్ రెడ్డి హోం శాఖా మంత్రిగా, విద్యా శాఖా మంత్రిగా, మున్సిపల్ శాఖా మంత్రిగా ఫెయిల్ అయ్యారు' అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠను రేవంత్‌ రెడ్డి దిగజార్చాడని మండిపడ్డారు.

Also Read: Suvendu Adhikari: సువేందు అధికారి ఆస్తులు ఇవే.. తులం బంగారం లేని బెంగాల్‌ కొత్త సీఎం

 

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో బుధవారం బీఆర్‌ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. 'కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రం అన్ని రంగాల్లో ముందు ఉంది. కేసీఆర్ హయాంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయి. తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. శాంతి భద్రతలను విస్మరిస్తే రాష్ట్రం వెనక్కి పోతుంది.

Also Read: Ashu Reddy Engagement: పెళ్లి పేరుతో మోసం.. ఇంకొకరితో అషూరెడ్డి నిశ్చితార్థం

'ప్రతిపక్షాలపై వేధింపులు తప్ప ప్రభుత్వం శాంతిభద్రలపై దృష్టి పెట్టడం లేదు. రాష్ట్రంలో హోం శాఖా మంత్రి లేరు. హోం మంత్రి బాధ్యతలను రేవంత్‌ రెడ్డి పూర్తిగా విస్మరించారు. కమాండ్ కంట్రోల్‌లో కూర్చుని రేవంత్ రెడ్డి హోం శాఖపై సమీక్ష చేయడం లేదు. కేసీఆర్ హోం శాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. దేశంలో మొదటిసారిగా మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో పట్టపగలు హత్యలు జరుగుతున్నాయి. మాజీ ఐపీఎస్ భార్యను హత్య చేశారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ అర్ధరాత్రి గస్తీకి వెళ్తే పోకిరీలు ఎలా వేధించారో అందరికీ తెలుసు' అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

'తెలంగాణలో క్రైమ్ రేట్ పెరిగిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ చెబుతున్నాయి. 2023 కంటే 2024లో 34 వేల కేసులు పెరిగాయి. రాష్ట్రంలో 18.4 శాతం క్రైమ్ రేట్ పెరిగింది. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులను తిట్టడానికే రేవంత్ రెడ్డి సమయం వృథా చేస్తున్నారు. పెట్టుబడుల సదస్సులో ప్రతిపక్షాలను తిడితే పెట్టుబడులు పెడతారా?' అని మాజీ మంత్రి సబిత ప్రశ్నించారు. 'కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి ఉన్న కరీంనగర్‌లో పట్టపగలు గోల్డ్‌షాప్‌లో చోరీ జరిగితే నివేదికలు తెప్పించుకునే తీరిక రేవంత్ రెడ్డికి, బండి సంజయ్‌కు లేదు. రెండేళ్ల నుంచి ప్రతిపక్ష ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ గూండాలు దాడి చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని బండి సంజయ్ అంటున్నారు. రెండున్నరేళ్లలో రేవంత్‌ రెడ్డి ఎన్ని మాటలు మాట్లాడారు ఎన్ని దాడులు జరిగి ఉండాలి' అని మాజీ మంత్రి సబితా ప్రశ్నించారు.

'నేను జడ్చర్ల వెళ్తుంటే నాపైన పోలీసు నిఘా పెట్టారు. ఇదెక్కడి వ్యవస్థ? పోలీసు వాళ్లను వారి పని చేసుకోనివ్వండి. మహిళలు, చిన్నారులపై దాడుల్లో తెలంగాణ దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది. హైదరాబాద్ క్రైమ్ హబ్‌గా మారింది. పోలీసులు చలాన్లకు పరిమితమయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడికి వెళ్తున్నారు అనే దానిపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. పోలీసులకు సంబంధించిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను రేవంత్‌ రెడ్డి వాళ్లకే వదిలిపెట్టాలి. రేవంత్‌ రెడ్డి సచివాలయం వదిలి పెట్టి కమాండ్ కంట్రోల్ సెంటర్ వెళ్లడంతో పోలీసులు తాము చేసే ప్రాథమిక పనులు చేయడం లేదు. పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి' అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు.

రేవంత్ రెడ్డిది విఫల ప్రభుత్వం: ఎమ్మెల్సీ వాణీదేవి
'రాష్ట్రంలో పరిస్థితులు దిగజారాయి. ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చింది. శాంతిభద్రతల సమస్య రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున మాజీ ఐపీఎస్ భార్య హత్య జరిగింది. రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరగడం దురదృష్టకరం' అని ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి తెలిపారు. 'మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ధైర్యంతో రాత్రి సమయంలో శాంతి భద్రతల సమస్యలు తెలుసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఉండేది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫల ప్రభుత్వం. హైదరాబాద్‌లో శాంతి భద్రతల అంశం చాలా కీలకం. రాష్ట్రంలో విద్యా రంగం గందరగోళంలో ఉంది' అని విమర్శించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Snake Video: నువ్వు తోపు భయ్యా.. బుసలు కొడుతున్న పాముకు నీళ్లను తాగిస్తూ మరీ.. వీడియో వైరల్..

Hyderabad, Telangana:

Man gently pours water on venomous snake video: కొన్ని రోజులుగా భానుడు తన ప్రతాపంను చూపిస్తున్నాడు. అసలు ఇంట్లో నుంచి బైటకు వెళ్లాలంటేనే జనాలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పలుచోట్ల ఒకవైపు ఎండలు, మరికొన్ని చోట్ల ఆకస్మిక వర్షాలతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో  మండిపోతున్న ఎండలతో మనుషులు మాత్రమే కాదు..నోరు లేని జీవాలు సైతం ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. చాలా మంది సమ్మర్ లో నోరులేని జీవాల కోసం ఇంటి మిద్దెల మీద మగ్ లో నీళ్లను  పెడుతారు. మరికొంత మంది ఇంటి ముందు బకెట్ లో నీళ్లను ఉంచుతారు. ఇదంతా మనంచూస్తుంటాం. అయితే ప్రస్తుతం ఒక వ్యక్తి రోడ్డు మీద పాము నీరసంగా ఉండటంను చూశాడు. బహుశా దానికి సమ్మర్ ఎఫెక్ట్ తో ఎటు కదల్లేక పోతుంది.

 

ఇంతలో అతను ఆలోచించి పామును మీద నెమ్మదిగా ఒక బాటిల్ లో నీళ్లను తీసుకుని దాని మీద పోశాడు. అది ఏంచక్కా తన ప్రాణాలు తిరిగొచ్చినట్లు ఆ నీళ్లను తాగింది. అతను కూడా పాముపైన నెమ్మదిగా నీళ్లను వేస్తు దానికి ఇబ్బంది కల్గకుండా చేశాడు. మొత్తంగా కోబ్రా నీళ్లను తాగడంతో ప్రాణాపాయం నుంచి బైటపడింది. అక్కడి వారు ఈ ఘటనను వీడియో తీశారు. అది కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. కాటు వేసే పాము కష్టంలో ఉందని తెలిసి దానికి మంచి నీళ్లను పోసిన వ్యక్తిని చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.

మొత్తంగా కోబ్రాకు అతను చేసిన సాయంను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చాలా మంది ఇటీవల పాములు కన్పిస్తే దూరంగా పారిపొవడంలేదు. వాటితో స్టంట్ లు చేస్తు వార్తలలో ఉంటున్నారు.

Read more: Pm modi and Makhanlal Sarkar: 98 ఏళ్ల పెద్దాయన కాళ్లు మొక్కిన ప్రధాని.. మఖన్ లాల్

ఈ నేపథ్యంలో సమ్మర్ వేళ పాములు ఎక్కువగా అడవులు, పుట్టల నుంచి జనావాసాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి పూట పంటలకు నీళ్లు పెట్టడానికి వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండలు మండుతున్న వేళ తమ వంతుగా నోరులేని జీవాల కోసం ఏమైన మంచి నీళ్ల సాయం చేయడం, బకెట్ లు, మగ్ లలో నీళ్లలో పెట్టాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

0
0
Report

Kondagattu: ఒకే విగ్రహం.. రెండు రూపాలు.. కొండగట్టు అంజన్న ఆలయ ఈ రహస్యాలు మీకు తెలుసా?

Hyderabad, Telangana:

Kondagattu Temple History Telugu News: తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం ఆధ్యాత్మికతకు ఒక అత్యద్భుతమైన నిదర్శనం. కొండల మధ్య కొలువైన ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా మనం ఎక్కడా చూసిన హనుమంతుడు ఏకముఖంతో లేదా పంచముఖ ఆంజనేయుడు రూపంలోనో కనిపిస్తారు. కానీ కొండగట్టు లోని మాత్రం స్వామి వారు అత్యంత అరుదైన ద్వీముఖ రూపంలో భక్తులకు దర్శనమివ్వడం ఇక్కడి విశిష్టత. అంతేకాకుండా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

కొండగట్టు అంజన్న విగ్రహం వెనక ఒక అద్భుతమైన పురాణ నేపథ్యము ఉందని అక్కడి పూజారులు చెబుతున్నారు. ఇక్కడ స్వామి వారు ఒకవైపు ఆంజనేయ స్వామి ముఖంతో పాటు మరోవైపు నరసింహ స్వామి ముఖంతో కొలువై ఉన్నారు. నరసింహ స్వామి అవతారమైన వెంకటేశ్వరుని అంశ కూడా.. ఇందులో ఉండటం.. భక్తులు ఈయనను అత్యంత శక్తివంతుడిగా కొలుస్తారు. అందుకే ఈ క్షేత్రానికి వచ్చే భక్తులకు అటు హనుమంతుడి ఆశీస్సులతో పాటు ఇటు నరసింహస్వామి రక్షణ లభిస్తుందని అక్కడి అర్చకులు చెబుతూ ఉంటారు.. 

కొండగట్టు లో ఉన్న విగ్రహం కేవలం ద్విముఖానికే పరిమితం కాలేదు.. మరిన్ని విశేషాలు స్వామి వారి రూపురేఖల్లో కనిపిస్తాయి. స్వామి వారి భుజాలపై విష్ణుమూర్తి చిహ్నమైన శంకు చక్రాలు చెక్కబడి ఉన్నాయి. అంతేకాకుండా రామదూతగా పేరుగాంచిన ఆంజనేయుని వక్షస్థలంలో శ్రీరామచంద్ర మూర్తుల విగ్రహాలు కొలువై ఉండడం విశేషం.. అలాగే హనుమంతుడు భక్తులందరికీ అభయమిస్తున్నట్లుగా ఇక్కడి విగ్రహం ఉండడం చాలా ప్రత్యేకమని పూజారులు చెబుతున్నారు..

Also Read: నీ కాళ్లు మొక్కుతా సారూ.. మా ధాన్యం కొనండి!.. జగిత్యాలలో రైతు ఆవేదన..

కొండగట్టు అంజన్న అంటేనే భక్తులకు కొండంత ధైర్యం.. అన్నది ఇక్కడి జనాలు తరచుగా చెబుతూ ఉంటారు. మానసిక సమస్యలతో పాటు గ్రహదోషాలు లేదా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఇక్కడ 11 నుంచి 21 రోజులపాటు మండల దీక్ష చేపడితే సత్ఫలితాలు ఉంటాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా హనుమాన్ జయంతి పర్వదినాల్లో లక్షలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. రాష్ట్రం నలుమూలల నుంచి కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చే ఈ క్షేత్రం త్వరలో మరింత అభివృద్ధి చెందబోతోంది. ప్రకృతి ఒడిలో.. ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్న కొండగట్టు అంజన్నను దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోయి ధైర్యం సిద్ధిస్తుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం..

Also Read: నీ కాళ్లు మొక్కుతా సారూ.. మా ధాన్యం కొనండి!.. జగిత్యాలలో రైతు ఆవేదన..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Luxury Cars In Delhi: రూ.11 లక్షలకే మహీంద్రా థార్.. రూ.18 లక్షలకే మెర్సిడెస్.. ఈ డీల్స్ మిస్ అవ్వకండి!

Hyderabad, Telangana:

Cheap Luxury Cars India: సొంతంగా ఒక లగ్జరీ కారు ఉండాలని ప్రతి ఒక్కరు కలలు కంటూ ఉంటారు. కానీ వాటి ధరలు వింటేనే సామాన్యులకు గుండె గుబేలు మంటుంది.. అయితే అలాంటి వారి కల నిజం చేస్తూ ఢిల్లీలోని అశోక్ విహార్ లో ఉన్న సెకండ్ హ్యాండ్ షోరూమ్స్ లగ్జరీ కార్లను అత్యంత చీప్ ధరలకే విక్రయిస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసే వారికి భారీ ఆఫర్లతో పాటు అదనంగా వారంటీ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ షోరూంలో మెరిసిటీస్ బెంజ్ తో పాటు ఫోర్డ్ ఎండీవర్, టయోటా కామ్రీ వంటి ప్రీమియం కార్లు మార్కెట్ ధర కంటే చాలా తక్కువకే లభించడం విశేషం.. 

ముఖ్యంగా ఇక్కడ మెర్సిడెస్ బెంజ్ లవర్స్ కోసం కొన్ని కార్లపై ఏకంగా 50 శాతం వరకు కూడా ప్రత్యేకమైన తగ్గింపున అందిస్తున్నారు. ఈ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో మొత్తం మెర్సిడెస్ బెంజ్ కు సంబంధించిన కార్లు మూడు వేరియన్స్ లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా 2017 మోడల్ Mercedes C200 పెట్రోల్ వేరియంట్ కార్ కేవలం ఇక్కడ రూ.18 లక్షల లోపే అందుబాటులో ఉంది. అయితే ఇది కేవలం 33 వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. అదేవిధంగా ఇక్కడ  కాంపాక్ట్ ఎస్‌యూవీ 2018 మోడల్ కేవలం 35000 కిలోమీటర్లు తిరిగిన Mercedes GLA 200 కారు 18 లక్షల లోపే అందుబాటులో ఉంది.

అంతేకాకుండా ఇక్కడి మార్కెట్‌లో లాంగ్ వీల్ బేస్ కలిగిన అత్యంత శక్తివంతమైన లగ్జరీ కార్లలో ఒకటైన Mercedes E200 కారు కేవలం ఇప్పుడు 28 లక్షల లోపే అందుబాటులో ఉంది. దీనిపై వివిధ రకాల ఆఫర్స్ ను కూడా అందిస్తూ వస్తున్నారు. అలాగే ఈ కార్లను తక్కువ డౌన్ పేమెంట్ కట్టి కూడా డైరెక్ట్ గా విక్రయించవచ్చు.. అదేవిధంగా ఇక్కడి మార్కెట్లో ఎస్‌యూవీ దిగ్గజాలుగా భావించే ఎండీవర్ తో పాటు మహీంద్రా కు సంబంధించిన థార్ అత్యంత తక్కువ ధరల్లో లభించడం విశేషం..

Also Read: రూ.95 వేలకే ఫ్యామిలీ కార్లు.. స్కార్పియో, క్రెటా చీప్‌ ధరలకే.. సగం ధరకే థార్..

ముఖ్యంగా 2021కి సంబంధించిన మోడల్ Ford Endeavour బ్లాక్ కలర్ ఎడిషన్ కారు ఇక్కడ కేవలం 24 లక్షలు లోపే లభిస్తోంది. ఇక 2019 మోడల్ వైట్ కలర్ ఎండివర్ రూ.18 వేల లోపే విక్రయించవచ్చు. అదేవిధంగా ఆఫ్ రోడింగ్ ప్రియుల కోసం Mahindra Thar (4x4) చాలా చీప్ ధరకే లభిస్తున్నాయి. ముఖ్యంగా 2021 మోడల్ డీజిల్ మాన్యువల్ thar కేవలం ఇక్కడ 11 వేల నుంచి ప్రారంభమవుతుంది. అంతేకాకుండా టయోటా కామ్రీ హైబ్రిడ్ కార్లు కేవలం 23 లక్షల నుంచి లభించడం విశేషం. అదేవిధంగా ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా అమ్ముడుపోతున్న ఎం జి బ్రాండ్ కు సంబంధించిన హెక్టార్ ప్లస్ ఇక్కడి కేవలం 13 లక్షల లోపే అందుబాటులో ఉంది. అలాగే మారుతి గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ అత్యంత చమక ధరలో కేవలం 14 లక్షలకే లభిస్తుంది. ఇవే కాకుండా ఎన్నో రకాల కార్లు అత్యంత చీప్ ధరలకు అందుబాటులో ఉన్నాయి.

Also Read: రూ.95 వేలకే ఫ్యామిలీ కార్లు.. స్కార్పియో, క్రెటా చీప్‌ ధరలకే.. సగం ధరకే థార్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Cheapest Cars: రూ.95 వేలకే ఫ్యామిలీ కార్లు.. స్కార్పియో, క్రెటా చీప్‌ ధరలకే.. సగం ధరకే థార్, ఫార్చ్యూనర్!

Hyderabad, Telangana:

Dream Cars At Dirt Cheap Prices: సొంత కారు కొనాలని కల ఉన్న మధ్యతరగతి ప్రజలకు హర్యానాలోని చర్కీ దాద్రి సమీపంలో ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. కొత్త కొత్త సెకండ్ హ్యాండ్ కార్లను అత్యంత చీప్ ధరలకే విక్రయిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన కార్లు సగం ధరలకే లభిస్తున్నాయి. ఢిల్లీకి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లో కొన్ని రకాల కార్లపై కళ్లు చెదిరే ఆఫర్స్ ను ప్రకటిస్తూ సంచలనం సృష్టిస్తూ వస్తున్నారు. మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరల్లోనే.. పెద్ద పెద్ద కార్లను రూ.15 లక్షలు లోపే విక్రయిస్తున్నారు..

ఈ సెకండ్ హ్యాండ్ కార్లకు సంబంధించిన మార్కెట్‌లో మహీంద్రాతో పాటు హ్యుందాయ్, మారుతీ సుజుకి వంటి ప్రముఖ కంపెనీల కార్లు  అత్యంత తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ముఖ్యంగా యువత ఎక్కువగా ఇష్టపడే మహీంద్రా థార్ (Thar), స్కార్పియో (Scorpio), ఫార్చ్యూనర్ (Fortuner) వంటి లగ్జరీ కార్లపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉండడం విశేషం. కొత్తగా షో రూమ్ నుంచి వచ్చే అన్‌రిజిస్టర్డ్ వాహనాలపై కూడా రూ. 2 లక్షల  నుంచి రూ. 4 లక్షల వరకు  స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ ను కూడా అందిస్తున్నారు. 

ముఖ్యంగా ఈ కార్లకు సంబంధించిన మార్కెట్లో కేవలం రూ.95 వేల నుంచి ఇక్కడ కార్లు ప్రారంభమవుతున్నాయి. పాత డీజిల్ కార్లు అయితే, ఇక్కడ రూ.1.5 లోపే లభించడం విశేషం. ఇక ఇవే కాకుండా 2019 మోడల్ డీజిల్ వేరియంట్‌కు సంబంధించిన హ్యుందాయ్ క్రెటా (Creta) కేవలం ఇక్కడ ఐదు లక్షల కే లభిస్తోంది. అంతేకాకుండా మార్కెట్లో ఎంతో క్రేజీ ఉన్న స్కార్పియో క్లాసిక్ s-11 మోడల్ దాదాపు రూ.13 లక్షలకి విక్రయిస్తూ వస్తున్నారు. ఇవే కాకుండా టాప్ ఎండ్ డీజిల్ ఆటోమేటిక్ మహేంద్ర థార్ కారుపై ఏకంగా నాలుగు లక్షల వరకు ప్రత్యేకమైన బంపర్ డిస్కౌంట్ అందిస్తున్నారు. 

Also Read: మండే ఎండలకి గుడ్‌బై.. రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. ఇక దేశవ్యాప్తంగా వర్షాలే వర్షాలు

అంతేకాకుండా మారుతి స్విఫ్ట్‌తో పాటు i20, వాగన్ ఆర్ వంటి ఫ్యామిలీ కార్లు కూడా ఇక్కడ కేవలం రూ.2 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. కొత్త మోడల్స్ అయితే కేవలం ఇక్కడ రూ.4 లక్షల లోపే అందుబాటులో ఉండడం విశేషం. అలాగే కేవలం ఇక్కడ క్యాష్ పైనే కాకుండా.. కస్టమర్లకు లోన్స్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. కేవలం 30 నిమిషాల్లో లోన్ అర్హతను చెక్ చేసి.. రెండు రోజుల్లోనే వాహనాన్ని డెలివరీ చేస్తామని నిర్వాహకులు హామీ కూడా ఇస్తున్నారు. అంతేకాకుండా 2025 తర్వాత మోడల్స్ కార్లన్నీ ఫైనాన్స్లో అందుబాటులో ఉన్నట్లు కూడా చెబుతున్నారు. అంతేకాకుండా వీరు విక్రయించే వాహనాలపై ప్రత్యేకమైన వారంటీతో పాటు ఎన్ఓసి సౌకర్యాలను కూడా అందిస్తున్నారు.

Also Read: మండే ఎండలకి గుడ్‌బై.. రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. ఇక దేశవ్యాప్తంగా వర్షాలే వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement
Advertisement
Back to top