తారామతి పేట్ లో భారీ చోరి,30 తులాల బంగారు ఆభరణాలు కిలో వెండి అపహరణ
Taramatipet, Telangana:అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్కు ఆనుకుని ఉన్న తారామతిపేట్ గ్రామంలో ఓ ఇంటి తాళం పగులగొట్టి సుమారు 30 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి అపహరించారు. ప్రజల ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. గ్రామంలో అమర్చిన సీసీ కెమెరాలను పరిశీలించారు. 8 సంవత్సరాల క్రితం ఈ ఇంట్లో 18 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని, ఆ సమయంలో పోలీసులు 1 తులాల బంగారం కూడా రికవరీ చేయలేదని మీకు తెలియజేద్దాం. పోలీసులు దొంగలను పట్టుకుని మాకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
CM Breakfast Scheme Telangana: స్కూల్ విద్యార్థులకు గుడ్న్యూస్.. మధ్యాహ్నం భోజనంతో పాటు ఉదయాన్నే అల్పహారం!
Hyderabad, Telangana:Breakfast Scheme Telangana: వేసవి సెలవులను ముగించుకొని రేపటి నుంచి తెలంగాణలో ప్రభుత్వ విద్యాసంస్థలు తెరచుకోనున్నాయి. అయితే మళ్లీ బడి బాట పట్టిన విద్యార్థులకు రేవంత్ సర్కార్ ఓ తీపికబురు చెప్పింది. ఈ ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పహారాన్ని అందించనున్నట్లు విద్యాశాఖ తెలియజేసింది. రేపటి నుంచి అనగా జూన్ 15 నుంచి అన్నీ పాఠశాల్లో ఉదయాన్నే అల్పాహారాన్ని అందించనున్నారు.Cockroach Janata Party: దక్షిణాదిలో పట్టుపెంచుకునేందుకు 'కాక్రోచ్ జనతా పార్టీ' బిగ్ స్కెచ్..ఏం జరిగిందంటే?
Hyderabad, Telangana:Cockroach Janata Party At Hyderabad: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన 'కాక్రోచ్ జనతా పార్టీ' నేడు తెలంగాణలోని హైదరాబాద్లో నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే జరిగిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీతో పాటు విద్యావ్యవస్థలోని అవకతవకలకు వ్యతిరేకంగా ఈ నిరసనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్త, ఉద్యమ నేత సోనమ్ వాంగ్చుక్తో పాటు తదితరులు పాల్గొన్నారు. అయితే కాక్రోచ్ జనతా పార్టీ ఈ నిరసన హైదరాబాద్లో చేపట్టడంపై భారతీయ జనతా పార్టీ ప్రాబల్యం తక్కువగా ఉన్న దక్షిణాదితో తమ పార్టీ పట్టు పెంచుకునేందుకు పక్కా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.Boat Accident In Krosuru: పల్నాడు జిల్లాలో విషాదం..కృష్ణా నదిలో పడవ బోల్తా..నలుగురు విద్యార్థులు మృతి!
Konuru, Andhra Pradesh:Boat Accident In Krosuru News: పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు (క్రోసూరు ప్రాంతం) సమీపంలోని కృష్ణా నదిలో ఆదివారం ఒక ఘోర పడవ ప్రమాదం జరిగింది. బంధువుల ఫంక్షన్కు వచ్చి సరదాగా గడపాలనుకున్న ఆ కుటుంబంలో ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
అసలేం జరిగిందంటే..?
క్రోసూరు ప్రాంతానికి సంబంధించిన కోనూరులో జరిగిన ఒక బంధువుల శుభకార్యానికి కొందరు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే సుమారు 10 మంది (విద్యార్థులు) కలిసి కృష్ణా నదిలో సరదాగా విహారయాత్ర (బోటింగ్) చేయడానికి ఒక చిన్న పడవలో బయలుదేరారు. అయితే, నదిలో కొంతదూరం వెళ్లాక తిరుగు ప్రయాణంలో ఒక్కసారిగా పడవ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో పడవలో ఉన్న 10 మందీ నీటిలో మునిగిపోయారు.
మృతదేహాలు లభ్యం
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి నదిలోకి దూకారు. నీటిలో మునిగిపోతున్న వారిలో ఆరుగురిని సమయస్ఫూర్తితో ప్రాణాలతో కాపాడి ఒడ్డుకు చేర్చారు. అయితే, మిగిలిన నలుగురు వ్యక్తులు నదీ ప్రవాహానికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. స్థానికులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా.. ఇప్పటివరకు రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన మరో ఇద్దరి కోసం నదిలో తీవ్రంగా గాలిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి గురైన వారు ఎక్కడి నుంచి వచ్చారు? మృతుల వివరాలు ఏమిటి? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో కోనూరు గ్రామంలో స్థానికులు, బంధువుల రోదనలతో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
Also Read: దసరా, సంక్రాంతికి స్కూల్ సెలవుల లిస్టు వచ్చేసింది! ఈ ఏడాది 87 రోజులు సెలవులు!
Also Read: ఏపీలో కూటమి ప్రభుత్వంపై డిప్యూటీ CM పవన్ సంచలన వ్యాఖ్యలు..21 సీట్ల పోటీపై క్లారిటీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cool Drink Death: కూల్డ్రింక్స్ వ్యసనంతో 19 ఏళ్ల యువకుడు మృతి..కిడ్నీలు ఫెయిల్ అయ్యి ప్రాణం పోయింది!
Doni, Karnataka:Cool Drink Death Karnataka: ఎనర్జీ డ్రింక్స్, శీతల పానీయాల (సాఫ్ట్ డ్రింక్స్) వ్యసనం ఎంతటి ప్రమాదకరంగా మారుతుందో హెచ్చరించే ఒక దిగ్భ్రాంతికర ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. మితిమీరిన శీతల పానీయాల వాడకం వల్ల ఓ 19 ఏళ్ల యువకుడు కిడ్నీలు ఫెయిల్ అయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వివరాలు, అధికంగా ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల వచ్చే ఆరోగ్య ముప్పుల గురించిన కథనం ఇప్పుడు తెలుసుకుందాం.
రోజుకు 3 నుంచి 4 బాటిళ్లు..!
కర్ణాటకలోని యాద్గిరి జిల్లా, హునసగి తాలూకా నారాయణపూర్ గ్రామానికి చెందిన బాలు దేశాయ్ (19) అనే యువకుడు విజయపురలోని ముద్దెబిహాల్లో చదువుకుంటున్నాడు. అతడికి గత కొంతకాలంగా మార్కెట్లో దొరికే 'స్టింగ్' ఎనర్జీ డ్రింక్ తాగడం వ్యసనంగా మారిందని వారి సన్నిహితులు వెల్లడించారు. ఇంట్లో వాళ్ళు, స్నేహితులు ఎంత వారించినా వినకుండా.. రోజుకు దాదాపు 3 నుంచి 4 బాటిళ్ల డ్రింక్స్ తాగేవాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
కిడ్నీలు ఫెయిల్యూర్తో మృతి
ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా బాలు దేశాయ్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. తీవ్రమైన నీరసం, శరీరంలో అసౌకర్యం కలగడంతో కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బాగల్కోట్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూన్ 12న బాలు దేశాయ్ మరణించాడు. అతిగా ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్లే అతడి కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయని (కిడ్నీ ఫెయిల్యూర్) వైద్యులు నిర్ధారించారు.
కూల్డ్రింక్స్ ముప్పు ఏంటి?
ఈ ఘటన తర్వాత శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే నష్టాలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. వైద్య నిపుణుల ప్రకారం.. ఈ తరహా పానీయాలలో ఉండే కొన్ని పదార్థాలు శరీర అవయవాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఎనర్జీ డ్రింక్స్లో అధిక కెఫీన్ మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె కొట్టుకునే వేగాన్ని పెంచడమే కాకుండా రక్తపోటు (BP) పై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఈ పానీయాలలో వాడే విపరీతమైన చక్కెర వల్ల ఊబకాయం, మధుమేహం (డయాబెటిస్) వచ్చే ప్రమాదం ఉంది. వీటిలో రంగు, రుచి కోసం వాడే కృత్రిమ రసాయనాలు కాలేయం (లివర్), కిడ్నీలపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతాయి. ఇవి క్రమంగా కిడ్నీల వడపోత సామర్థ్యాన్ని తగ్గించి, వాటిని పూర్తిగా ఫెయిల్ చేస్తాయి.
కూల్డ్రింక్స్ ప్రియులారా జాగ్రత్త!
ఇంట్లో చేసుకునే సహజసిద్ధమైన పండ్ల రసాలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ.. మార్కెట్లో లభించే కార్బోనేటెడ్ డ్రింక్స్, ప్రిజర్వేటివ్స్ కలిపిన ప్యాక్డ్ జ్యూస్లు, ఎనర్జీ డ్రింక్స్కు యువత ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏదీ కూడా అమితంగా తాగడం మంచిది కాదని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
Also Read: తిరుపతిలో దారుణం..హోటళ్లలో కుళ్లిన మాంసంతో బిర్యానీ..నాన్-వెజ్ ప్రియులకు షాక్!
Also Read: దసరా, సంక్రాంతికి స్కూల్ సెలవుల లిస్టు వచ్చేసింది! ఈ ఏడాది 87 రోజులు సెలవులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Dharmapuri: ధర్మపురికి పోటెత్తిన భక్తులు.. గోదావరి తీరంలో కిక్కిరిసిన జనసందోహం!
Hyderabad, Telangana:Dharmapuri Lakshmi Narasimha Swamy Temple News: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది.. పవిత్రమైన అధికమాసం చివరి రోజు కావడంతో.. దానికి తోడు ఆదివారం సెలవు దినం, పాఠశాలల వేసవి సెలవులు ముగియవడం, అలాగే కొంతమంది విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు చదువుల కోసం వెళ్లడం తో ధర్మపురి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు.. ఎటు చూసినా భక్తుల కోలాహాలంతో గోదావరి తీరంతో పాటు ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.. భక్తులంతా నది స్నానాలు ఆచరించి.. స్వామి వారిని దర్శించుకుంటున్నారు..
దక్షిణ వాహినిలో పుణ్యస్నానాలు..
సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన ఎంతోమంది భక్తులు.. ఇక్కడ దక్షిణ వాహినిగా ప్రవహిస్తున్న పవిత్ర గోదావరి నదిలో అత్యంత భక్తి శ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.. అధికమాసం చివరి రోజున గోదావరిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి.. పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.. దీంతో నది తీరమంతా భక్తుల హరినామ స్మరణతో మార్మోగిపోయింది. స్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు తీరంలోనే వెలిసిన గోదావరి మాతకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించి హారతులు కూడా ఇస్తున్నారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు..
నదీ స్నానాలు ముగించుకున్న భక్తులు నేరుగా స్థానిక ఆరాధ్య దైవం.. ఉగ్ర నరసింహుడిగా, యోగ నరసింహుడిగా భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృశ్య ఆలయ అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్లు కూడా సమాచారం.. స్వామి వారి ఉచిత దర్శనం తో పాటు దర్శన క్యూ లైన్లో భక్తులు గంటల తరబడి నిలబడి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణంలోని ఇతర ఉప ఆలయాల్లో కూడా పూజలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
పాఠశాలలు ప్రారంభానికి ఇదే చివరి రోజు కావడంతో కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. ఆలయ కమిటీతో పాటు స్థానిక పోలీసులు గట్టి బందోబస్తుతో పాటు తాగునీరు, క్యూలైన్ల క్రమబద్దీకరణ వంటి వసతులను పర్యవేక్షించారు. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న ధర్మపురి క్షేత్రం.. ఈరోజు భక్తులతో కిటకిటలాడుతోంది. సాధారణంగా పోలిస్తే.. సోమవారం కూడా అమావాస్య కావడంతో భక్తులు ఎక్కువగా ఆలయాన్ని సందర్శించే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Two Snakes Fighting Video: నడిరోడ్డుపై నాగుపాముల ఫైట్.. వీడియో వైరల్..
Hyderabad, Telangana:Two Snakes Fighting On Road Latest Video: సాధారణంగా పాములను దూరం నుంచి చూస్తేనే మనలో చాలామందికి భయం వేస్తూ ఉంటుంది. అలాంటిది రెండు భారీ నాగుపాములు రోడ్డుపై ప్రత్యక్షమై.. ఒకదానికొకటి మెలికలు తిరుగుతూ గాల్లోకి లేచి నృత్యం చేస్తే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే భయం వేస్తుంది కదా? సరిగ్గా ఇలాంటి ఒక అత్యంత ప్రమాదకరమైన.. ఆశ్చర్యం కలిగించే అరుదైన దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఒళ్ళు గగుర్పొడిచే విన్యాసం..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. రెండు భారీ నాగుపాములు నడిరోడ్డుపై ఒకదానికొకటి తమ శరీరాలను పెనవేసుకుని ఉండడం మీరు చూడొచ్చు.. సినిమా సీన్లను తలపించేలా అవి రెండు పోటాపోటీగా పడుతూ గాల్లోకి లేస్తూ అద్భుతమైన నృత్యాలు చేస్తున్నాయి. ఆ పాముల వేగంతో పాటు వాటి శరీర కదలికలు చూస్తే వారికి ఒకవైపు భయాన్ని.. మరోవైపు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. జనావాసాలకు దూరంగా ఒక రోడ్డుపై ఈ రెండు సార్లు తమ లోకంలో తాము విహరిస్తూ ఈ విన్యాసాలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ గా మారింది..
సైన్స్ చెబుతుంది ఇదే..
సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి దృశ్యాలను చూసి నాగ నృత్యం లేదా పాముల శృంగారమని భావిస్తూ ఉంటారు.. కానీ వన్యప్రాణి నిపుణుల ప్రకారం.. ఇది శృంగారం కాదు.. రెండు మగ పాముల మధ్య ఆధిపత్యం కోసం జరిగే పోరాటమని.. తమ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి లేదా వేరే ఇతర ఆడ పాముల కోసం రెండు మగ పాములు ఇలా పరస్పరం తలపడుతూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు పాములు కూడా ఏదో కావాలని పరస్పరం.. తలపడుతున్నాయని మీరు గమనించవచ్చు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
నెటిజన్ల కామెంట్ల వర్షం..
ఈ అరుదైన దృశ్యాన్ని అక్కడున్న కొందరు తమ స్మార్ట్ఫోన్స్లో బంధించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అధి కాస్త క్షణాల్లో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.. నా జీవితంలో ఇలాంటి అద్భుతాన్ని ఎప్పుడూ చూడలేదని.. ఒకరు కామెంట్ చేయగా.. అవి అంత ప్రమాదకరమైన వైనా.. చూడడానికి ఎంతో అందంగా ఉన్నాయని మరికొందరు కామెంట్లు పెడుతూ వస్తున్నారు. మరి కొంతమంది అయితే, అటువైపు వెళ్తే ప్రాణాలు పోతాయి అంటూ చెబుతూ వస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియోని చూసి చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Mechanic Monkey Video: అబ్బా.. ఏం టాలెంట్ సామి.. సైకిల్ రిపేర్ చేస్తున్న కోతి.. వీడియో..
Hyderabad, Telangana:Monkey Repairing Cycle Viral Video: సాధారణంగా కోతులు చేతికి దొరికిన ప్రతి వస్తువును పాడు చేయడంతో పాటు ఆహారం గుంజుకొని తినడం మనం తరచుగా చూస్తూ ఉంటాం.. కానీ ఒక కోతి మాత్రం రూటు మార్చేసింది.. తోటి కోతుల అల్లరి పనులు చేయకుండా.. ఏకంగా సైకిల్ రిపేర్ షాప్ లో మెకానిక్ అవతారం ఎత్తేసింది.. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక అరుదైన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ నెటిజన్లను ఆశ్చర్యపోయేలా చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
రిపేరింగ్ చేస్తున్న కోతి..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక సైకిల్ రిపేర్ షాప్ కనిపించడం మీరు క్లియర్ గా చూడొచ్చు.. అక్కడ ఒక సైకిల్ వెనక టైర్ పంచర్ అయిందో.. లేక చెడిపోయిందో కానీ.. ఆ కోతి దాన్ని బాగు చేసే పనిలో పడింది. మనుషులు ఏ విధంగా అయితే టూల్స్ ఉపయోగించి టైర్ లోపల ఉన్న ట్యూబ్ను జాగ్రత్తగా బయటికి తీస్తారో.. అలాగే ఆ కోతి కూడా ఎంతో సులభంగా.. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మెకానిక్లా.. ఆ ట్యూబ్ను బయటికి లాగుతోంది.. అయితే ఈ సమయంలో దాని పనితనం చూసి అక్కడున్న కొంతమంది కస్టమర్స్ కూడా షాక్ అయిపోయారు..
ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..
ఈ అద్భుతమైన దృశ్యాలను అక్కడున్నవారు తమ స్మార్ట్ఫోన్స్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఇది కాస్త క్షణాల్లో వైరల్గా మారింది. వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు తమదైన శైలిలో కామెంట్లు పెడుతూ వస్తున్నారు.. ఈ కోతికి నెలకు ఎంత జీతం ఇస్తున్నారు యజమాని గారు? అని ఒకరు సరదాగా ప్రశ్నించగా.. మరొకరు మనుషులకంటే చాలా వేగంగా.. ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది.. దీని టాలెంట్ కు జోహార్లు.. అని మరొక సోషల్ మీడియా వినియోగదారుడు ప్రశంసిస్తున్నాడు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
అదేవిధంగా కలికాలం అంటే ఇదేనేమో.. కోతులు కూడా ఉపాధి వెతుక్కుంటున్నాయి.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతూ వస్తున్నారు.. ఏది ఏమైనా ప్రకృతిలో జంతువుల మేధస్సు మనల్ని ఎప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఈ మెకానిక్ కోతి వీడియో కూడా అందుకు ఒక నిదర్శనంగా నిలిచింది.. ఇప్పుడు ఈ వీడియో శుచిత్ దీక్షిత్ అనే ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 34 వేల మందికి పైగా లైక్ చేయగా.. కొన్ని లక్షల మంది ఈ వీడియోను వీక్షించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇలాంటి వీడియోలు సోషల్ మీడియా వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Peddi Collection: బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' ప్రభంజనం..10 రోజుల్లో సినిమా కలెక్షన్స్ ఎంతో తెలుసా?
Hyderabad, Telangana:Peddi Collection Day 10: బాక్సాఫీస్ వద్ద మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' ప్రభంజనం సృష్టిస్తోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. వీక్ డేస్లో కాస్త నిలకడగా సాగినా, వీకెండ్స్ వచ్చేసరికి బాక్సాఫీస్ వద్ద చరణ్ సినిమా దుమ్మురేపుతోంది. తాజాగా ఈ చిత్రం విజయవంతంగా 10 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర బృందం అధికారిక కలెక్షన్ల పోస్టర్ను విడుదల చేసింది.
10 రోజుల్లో రూ.378 కోట్లు..!
విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకెళ్తున్న 'పెద్ది'.. కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.378 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. రెండో వీకెండ్ లో భాగంగా నిన్న శనివారం (జూన్ 13) ఒక్క రోజే ఈ సినిమాకు రూ. 12 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.
ఈరోజు ఆదివారం (జూన్ 14) సెలవు దినం కావడంతో థియేటర్లన్నీ హౌస్ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. నేటితో ఈ కలెక్షన్ల గ్రాఫ్ మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియా, ఓవర్సీస్ (విదేశాల్లో) కూడా 'పెద్ది' చిత్రానికి భారీగా వసూళ్లు వస్తున్నాయి.
#PEDDI GROSSES 378 CRORES+ WORLDWIDE in 10 days ❤🔥
Racing ahead at the box office in style 💥💥
🎟️ https://t.co/EMhY3eMGKq pic.twitter.com/R7q18Z3TIR
— PEDDI (@PeddiMovieOffl) June 14, 2026
సినిమా ప్రత్యేకతలు..
డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో ఫ్యాన్స్ను ఆకట్టుకుంది. సినిమాలో క్రికెటర్ గా, రెజ్లర్ గా, రన్నర్గా రామ్ చరణ్ చూపించిన వేరియేషన్స్, అద్భుత నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభిస్తున్నాయి.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, అప్పల సూరి పాత్రలో జగపతి బాబు నటనకు థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, రావు రమేష్, బొమన్ ఇరానీ, రవి కిషన్, సత్య తదితరులు కీలక పాత్రల్లో మెప్పించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా సక్సెస్లో ప్రధాన పాత్ర పోషించాయి.
వృద్ధి సినిమాస్ సమర్పణలో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ 'మైత్రీ మూవీ మేకర్స్', 'సుకుమార్ రైటింగ్స్' సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్తో నిర్మించాయి. రామ్ చరణ్ కెరీర్లోనే ఇదొక ల్యాండ్మార్క్ మూవీగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: హీరోయిన్ రష్మికపై ఎగబడ్డ ఫ్యాన్స్..తెలుగింటి కోడలికి బాడీగార్డ్గా బాలీవుడ్ బ్యూటీ!
Also Read: ఐటెంసాంగ్ ద్వారా భారీగా సంపాదించిన హీరోయిన్ ఈమెనే! ఒక్క పాటకి అన్ని కోట్ల రూపాయలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cobra Video: పిచ్చెక్కిపోద్ది బాబోయ్.. ప్యాంటు బెల్టు బదులు బతికున్న కోబ్రాను చుట్టుకున్నాడు!
Hyderabad, Telangana:Venomous Cobra Snake Belt Video: ఈ రోజుల్లో సోషల్ మీడియాలో రైతులతో పాటు వ్యూస్ కోసం కొందరు యువకులు ఎంతటి తెగింపుకైనా వెనకాడడం లేదు.. ప్రాణాలను పణంగా పెట్టి మరి ప్రమాదకరమైన స్టంట్లను చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఒక వీడియో నెటిజన్లను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. సాధారణంగా పురుషులు ప్యాంట్లు జారిపోకుండా ఉండేందుకు రకరకాల లెదర్ బెల్ట్లను వాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక యువకుడు ఏకంగా బ్రతికి ఉన్న ఒక ప్రమాదకరమైన నాగుపామును తన ప్యాంటుకు బెల్టుల చుట్టుకున్నాడు. విశ్వ సర్పం నడుము చుట్టూ కదులుతున్న.. ఆ యువకుడు మాత్రం భయం లేకుండా కెమెరాకు ఫోజులు ఇవ్వడం అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది.
అసలేం జరిగిందంటే..?
వైరల్ అవుతున్న వీడియో వివరాల ప్రకారం.. ఒక యువకుడు రోడ్డు పక్కన నిలబడి ఉండడం మీరు చూడొచ్చు. అతడి ప్యాంటు నడుము భాగాన్ని గమనిస్తే.. ఎవరికైనా గుండె ఆగినంత పనవ్వాల్సిందే.. ఒక పెద్ద నాగుపామును అతడు బెల్టు లాగా నడుముకు చుట్టుకున్నాడు.. ఆ పాము తలభాగంతో పాటు తోక భాగం బయటకు కనిపిస్తూ కదులుతున్నాయి. ఆ నాగుపాము ఏ క్షణంలోనైనా కాటు వేసే ప్రమాదం ఉన్నప్పటికీ.. ఆ యువకుడు మాత్రం చాలా కూల్గా రోడ్డుపైనే నిలబడి ఉండిపోయాడు.. పక్కనే ఉన్న కొందరు ఈ దృశ్యాలని తమ మొబైల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త క్షణాల్లో వైరల్గా మారింది..
అయితే ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. వ్యూస్ కోసం ఇంత పిచ్చా? ఒకవేళ అది కాటు వేస్తే ప్రాణాలు పోతాయని తెలీదా? ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొంతమందిని సోషల్ మీడియా వినియోగదారులు కోరుతున్నారు.. ఎక్కువమంది సోషల్ నెటిజన్ల అయితే ఈ వీడియో చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇది ఫ్యాషన్ కాదు ముమ్మాటికి పిచ్చితనం అంటూ.. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు పెడుతున్నారు..
ఇక మరి కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులైతే.. బ్రతికున్న పామును అలా హింసించడంతోపాటు అత్యంత ప్రమాదకరమైన సర్పంచ్ స్టంట్ లు చేయడం చట్టరీత్య నేరమని పలువురు గుర్తు చేస్తున్నారు. అలాగే ఈ వీడియో ఎక్కడ జరిగిందో గుర్తించి.. సదరు యువకుడిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి.. కఠినంగా శిక్షించాలని అటవీశాఖ అధికారులతో పాటు పోలీసులను సోషల్ మీడియా వేదికగా కొంతమంది కోరుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో ఇంస్టాగ్రామ్లో మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది. పోస్ట్ చేసి చాలా రోజులైనప్పటికీ ఇప్పుడు వైరల్ అవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Realme P4R 5G: రూ.4,999లకే Realme P4R 5G స్మార్ట్ఫోన్.. ఫ్లిప్కార్ట్లో భారీ డిస్కౌంట్ ఆఫర్స్!
Hyderabad, Telangana:Realme P4R 5G Launched on Flipkart: బడ్జెట్ ధరలు ప్రీమియం ఫీచర్లను కోరుకునే స్మార్ట్ఫోన్ ప్రియుల కోసం ప్రముఖ మొబైల్ బ్రాండ్ రియల్ మీ సరికొత్త మొబైల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. భారత యువతను లక్ష్యంగా చేసుకొని కంపెనీ Realme P4R 5Gను మోడల్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మోడల్ ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో ప్రత్యేకమైన ఆఫర్లతో సందడి చేస్తోంది. ముఖ్యంగా లావెంటర్ కలర్తో కూడిన 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్ అత్యంత తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చింది..
ప్రస్తుతం Realme P4R 5G మొబైల్ ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart)లో ప్రత్యేక ఆఫర్లతో అందుబాటులో ఉంది. అయితే, దీనికి సంబంధించిన సేల్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది అంతలోనే దీనిపై కంపెనీ ప్రత్యేకమైన స్పెషల్ తీసుకుంటే ఆఫర్స్ అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించి కొనుగోలు చేసే వారికి ఇది అత్యంత చీప్ ధరకు లభిస్తోంది. Realme P4R 5G స్మార్ట్ఫోన్కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది అత్యంత తక్కువ ధరలోనే ఎంతో శక్తివంతమైన బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఇది భారీ 8000mAh టైటాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీనికి తోడు 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండటం విశేషం. అలాగే గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ప్రత్యేకమైన బైపాస్ చార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది..
సినిమాలు, గేమింగ్ ప్రియుల కోసం ఈ స్మార్ట్ఫోన్ కంపెనీ అద్భుతమైన 6.8 అంగుళాలు కలిగిన సన్లైట్ డిస్ప్లేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో అందుబాటులోకి రావడం వల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. అంతేకాకుండా ఫోటోగ్రఫీకి కూడా ఈ స్మార్ట్ఫోన్ ఎంతగానో సహాయపడుతుంది.. ఇందులో వెనక భాగంలో అద్భుతమైన 50 మెగాపిక్సెల్ AI కెమెరాను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో పాటు తక్కువ వెలుగులోను అద్భుతమైన పోర్ట్రైట్ షాట్స్ తీసుకునే విధంగా వివిధ రకాల కొత్త కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ ఎరైజర్ తో పాటు జాల ప్రత్యేకమైన నెక్స్ట్ ఏఐ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల ఫోటో ఎడిటింగ్ మరింత సులభతరం అవుతుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
మార్కెట్లో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ మొబైల్ ధర MRP రూ.30,999 కాగా.. ఇది ఫ్లిప్కార్ట్లో 32 శాతం వరకు ప్రత్యేకమైన తగ్గింపుతో రూ.20,999 లకే లభించడం విశేషం. అంతేకాకుండా ఈ స్మార్ట్ఫోన్ అందుబాటులోకి రాగానే దీనిపై బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇందులో భాగంగా ఫ్లిప్కార్ట్ అనుసంధానం యాక్సిస్ బ్యాంకు తోపాటు ఎస్బిఐ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే రూ.3 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇవే కాకుండా అదనంగా దీనిపై కంపెనీ ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్స్తో పాటు అదనపు బోనస్ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ వినియోగించడానికి తప్పకుండా మీ దగ్గర వినియోగిస్తున్న ఏదైనా బ్రాండ్ కు సంబంధించిన మొబైల్ను ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాని కండిషన్ను బట్టి, దాని వ్యాల్యూని బట్టి ఏకంగా రూ.16 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ రూ.4,999 లోపే సొంతం చేసుకోవచ్చు..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Amazon Offer: సగం ధరకే Aquaguard 9-స్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్.. బ్యాంక్ డిస్కౌంట్ కూడా!
Hyderabad, Telangana:Aquaguard Water Purifier Amazon Offer: ప్రస్తుతం చాలామంది బయట ప్యూరిఫైయర్ చేసిన నీరు తాగకుండా ఇంట్లోనే వాటర్ ప్యూరిఫైయర్ పెట్టించుకుంటున్నారు. వీటి నుంచి ఫిల్టర్ చేసిన నీటిని తాగుతున్నారు. ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా అనారోగ్య సమస్యల భారిన పడకుండా రక్షిస్తూ ఉంటాయి. అయితే, మీరు కూడా ఎప్పటినుంచో మంచి ప్యూరిఫైయర్ కొనాలనుకుంటున్నారా? అమెజాన్ డే సేల్లో భాగంగా.. కొన్ని వాటర్ ప్యూరిఫైయర్ పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్అందుబాటులో ఉన్నాయి. గతంలో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన Aquaguard RO+UV+UF+MC Tech (2X Life) వాటర్ ప్యూరిఫైయర్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్తో లభిస్తుంది. అలాగే ఇది ఎన్నో రకాల కొత్త కొత్త ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇందులో ఉన్న ఫీచర్స్ వివరాలు ఏంటో? ధర పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ వాటర్ ప్యూరిఫైయర్ కు సంబంధించిన పూర్తి ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది ఇది నీటిని 9 విభిన్న దశల్లో శుద్ధి చేస్తుంది. దీనివల్ల నీటిలోని మురికి, కెమికల్స్, బ్యాక్టీరియా తో పాటు వైరస్లు పూర్తిగా తొలగిపోతాయి. దీనివల్ల శరీరం ఎంతో ఆరోగ్యంగా తయారవుతుంది. అంతేకాకుండా ఈ మీరు పిల్లల ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో చాలా ప్రత్యేకమైన RO+UV+UF+MC టెక్నాలజీ అందుబాటులో ఉంది. రివర్స్ ఆస్మోసిస్ సీసంతో పాటు పాదరసం లోహాలు నీటిలోని పురుగులను తొలగించేందుకు సహాయపడతాయి.
అలాగే ఇందులో ఉండే UV నీటిని 20 నిమిషాల పాటు మరిగిస్తే ఎంత శుద్ధిగా మారుతుందో.. అంతటి రక్షణను అందిస్తాయి. అలాగే ఇందులో అల్ట్రా ఫిల్టరేషన్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలతో పాటు ఇసుక రేణువులను సులభంగా వడ కడుతుంది. అంతేకాకుండా మినరల్ చార్జ్.. నీటిని శుద్ధి చేయడమే కాకుండా శరీరానికి అవసరమైన మెగ్నీషియంతో పాటు క్యాల్షియం వంటి పోషకాలను అందించేందుకు సహాయపడుతుంది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
60 శాతం హైయర్ వాటర్ రికవరీ (Aquasaver Tech) సపోర్ట్ కూడా లభిస్తుంది. సాధారణ ఆర్వో ప్యూరిఫైయర్లతో పోలిస్తే 60 శాతం వరకు నీటిని ఆదా చేస్తుంది. అంటే నేటి వృధా చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో రెండు సంవత్సరాల వరకు ఫిల్టర్ లైఫ్ సపోర్ట్ లభిస్తుంది. సాధన ఫిల్టర్ల కంటే ఇవి రెట్టింపు కాలం వరకు పనిచేస్తూ ఉంటాయి. ఇక ఈ వాటర్ ప్యూరిఫైయర్కు సంబంధించిన పూర్తి ధర వివరాల్లోకి వెళితే.. ఇది MRP ధర రూ.26,500 కాగా ఇప్పుడే దీనిని ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్లో కొనుగోలు చేసే వారికి.. అదనంగా 58 శాతం వరకు ఫ్లాట్ తగ్గింపుతో కేవలం.. రూ.10,999 లకే లభిస్తోంది. అంతేకాకుండా హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే అదనంగా రూ.500 వరకు తగ్గింపు లభిస్తుంది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Xiaomi Mix Fold 5: 200MP కెమెరాతో రాబోతున్న Xiaomi Mix Fold 5 ఫోన్.. సామ్సంగ్కు గట్టి పోటీ!
Hyderabad, Telangana:Xiaomi Mix Fold 5 Leaked: ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం Xiaomi మార్కెట్లోకి తమ కొత్త పోల్టబుల్ స్మార్ట్ఫోన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. సాంసంగ్తో పాటు వన్ ప్లస్, వివో వంటి బ్రాండ్లకు గట్టి పోటీని ఇస్తూ నెక్స్ట్ జనరేషన్ పోలిడబుల్ ఫోన్ Xiaomi Mix Fold 5 ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఈ క్రమంలోనే ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన స్పెసిఫికేషన్స్తో పాటు ఫీచర్స్ లీకయ్యాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు, అసలు ఈ మొబైల్లో ఉన్న హైలెట్ ఫీచర్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
200MP కెమెరాతో ఈ మొబైల్..
ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన అత్యంత ప్రధాన విశేషమేంటంటే.. దీని కెమెరా.. ప్రముఖ చైనీస్ మైక్రో బ్లాకింగ్ ప్లాట్ఫామ్ విబోలో ప్రముఖ టిప్స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం...షియోమీ మిక్స్ ఫోల్డ్ 5 వెనుక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్ ను కలిగి ఉండబోతోంది. ఇందులో కంపెనీ ఎంతో పవర్ఫుల్ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. పోలిటబుల్ ఫోన్లలో ఇంత భారీ కెమెరా సెన్సార్ ను తీసుకురావడం మొదటిసారిగా భావించవచ్చు. అయితే, ఇందులో అద్భుతమైన అల్ట్రా-క్లియర్, హై-రిజల్యూషన్ ఫోటోగ్రఫీ అనుభూతి కూడా లభిస్తుంది.
అద్భుతమైన డిస్ప్లే..
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్ఫోన్ ప్రోటో టైపులో 7.5 అంగుళాల నుంచి 7.6 అంగుళాల వరకు ఉండే ఫోల్డబుల్ ఇన్నర్ డిస్ప్లే కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా స్క్రీన్ లపై సాధారణంగా కనిపించే మడత మార్కులను పూర్తిగా తగ్గించేందుకు సరికొత్త మినిమలైజ్డ్ టెక్నాలజీని ఇందులో వినియోగించినట్లు తెలుస్తోంది. భద్రత కోసం ఫోన్ పక్క భాగంలో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. ఇవే కాకుండా ఇందులో ఎన్నో రకాల స్పెషల్ ఫీచర్స్ లభించడం విశేషం..
పవర్ఫుల్ బ్యాటరీ..
కొత్త తరం యూజర్ల అవసరాలకు అనుగుణంగా షియోమీ మిక్స్ ఫోల్డ్ 5 స్మార్ట్ఫోన్లో ఎంతో శక్తివంతమైన 6,000 mAh బ్యాటరీని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పూర్తిగా వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో పాటు అత్యంత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన Xring O3 ప్రాసెసర్ను ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అంతేకాకుండా గేమ్స్ కోసం ప్రత్యేకమైన చిప్ సెటప్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది..
ధర వివరాలు ఇవే..
గత కొన్ని నీళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఫోల్డబుల్ మొబైల్స్ అమ్మకాలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. గతంలో వచ్చిన మిక్స్ ఫోల్డ్ ఫోర్ స్థానంలో రాబోతున్న ఈ సరికొత్త మోడల్ ఆగస్టు నాటికి చైనాలోని లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అనేక కొత్త ఫీచర్ల కారణంగా దీని ధర మునుపటి మోడల్స్ కంటే కాస్త ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయని లీకైన వివరాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర రూ.1,31 లక్షతో ప్రారంభం కాబోతోంది. అలాగే ఇది 200MP కెమెరాతో అందుబాటులోకి రావడం కారణంగా సాంసంగ్ బ్రాండ్ తో పాటు వన్ ప్లస్ బ్రాండ్ కు సంబంధించిన ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లతో పోటీపడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
India-Iran Relations: అమెరికా - ఇరాన్ చర్చలు..భారత్కు భారీ గుడ్న్యూస్! భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
Hyderabad, Telangana:India-Iran Relations News: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా మారుతున్న ఈ సమీకరణాలు భారతదేశానికి వ్యూహాత్మకంగా, ఆర్థికంగా సరికొత్త అవకాశాలను తెచ్చిపెట్టబోతున్నాయి. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన భారత్-ఇరాన్ వాణిజ్య సంబంధాలు మళ్లీ ఊపందుకోవడమే కాకుండా.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడానికి ఇది ఒక సువర్ణావకాశంగా మారనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్కు చేకూరే ప్రధాన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చౌక ధరకే ముడి చమురు..
భారతదేశం తన దేశీయ ఇంధన అవసరాల కోసం దాదాపు 85 శాతం ముడి చమురును దిగుమతులపైనే ఆధారపడుతోంది. అమెరికా, ఇరాన్ ఒప్పందం సఫలమైతే భారత్కు భారీ ఊరట లభించనుంది. వెనిజులా లేదా అమెరికా నుంచి వచ్చే చమురులో సల్ఫర్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల దానిని క్లీన్ చేయడానికి ఎక్కువ ఖర్చవుతుంది. కానీ ఇరాన్ ముడి చమురు సాధారణ రకానికి చెందినది కావడం వల్ల శుద్ధి ఖర్చులు చాలా తక్కువ.
అలాగే ఇరాన్ నుంచి దిగుమతులు పునఃప్రారంభమైతే రవాణా ఖర్చులు, బీమా ప్రీమియంలు గణనీయంగా తగ్గుతాయి. ఫలితంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. భారత్ దిగుమతి చేసుకునే చమురులో 50 శాతం వివాదాస్పద 'హార్ముజ్ జలసంధి' గుండానే ప్రయాణించాలి. ఇరాన్తో సత్సంబంధాలు ఉంటే ఈ సముద్ర రవాణా మార్గానికి పూర్తి భద్రత లభిస్తుంది.
చాబహార్ పోర్ట్ ప్రాజెక్టుకు పునర్జీవం
భారత్ వ్యూహాత్మకంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఇరాన్లోని చాబహార్ నౌకాశ్రయ అభివృద్ధికి ఈ ఒప్పందం కీలక చోదక శక్తి కానుంది. ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ ద్వారా ఈ పోర్ట్ నిర్వహణకు భారత్ 10 ఏళ్ల ఒప్పందం చేసుకుంది. యంత్రాల కోసం 120 మిలియన్ డాలర్ల పెట్టుబడితో పాటు, మౌలిక వసతుల కోసం 250 మిలియన్ డాలర్ల రుణ సదుపాయాన్ని కూడా ప్రకటించింది.
పాకిస్థాన్లో చైనా నిర్మిస్తున్న 'గ్వాదర్' పోర్టుకు చాబహార్ అత్యంత సమీపంలో ఉంటుంది. దీని ద్వారా పశ్చిమాసియాలో చైనా ఆధిక్యానికి భారత్ బ్రేక్ వేయవచ్చు. పాకిస్థాన్తో ఎలాంటి అవసరం లేకుండానే భారత్ నేరుగా మధ్య ఆసియా, యూరప్, ఆఫ్రికా ఖండాలకు వాణిజ్యం సాగించడానికి చాబహార్ ఒక వ్యూహాత్మక గేట్వేగా మారుతుంది.
గతంలో అంతర్జాతీయ వేదికలపై (జమ్మూ కాశ్మీర్ వంటి కీలక అంశాల్లో) ఇరాన్ భారత్కు ఎంతో అండగా నిలిచింది. అయితే అమెరికా ఆంక్షల ప్రభావం ఈ బంధంపై తీవ్రంగా పడింది.
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కేవలం మానవతా సహాయం, ప్రాథమిక అవసరాల వస్తువులకే వాణిజ్యం పరిమితమైంది. భారత్ నుంచి బాస్మతీ బియ్యం, టీ పొడి, మందులు ఇరాన్కు వెళ్తుండగా.. అక్కడి నుంచి ఎండుద్రాక్ష, రసాయనాలు భారత్కు వస్తున్నాయి.
గతంలో అమెరికా ఒత్తిళ్ల కారణంగా భారత్.. ఇరాన్ విషయంలో కొంత తటస్థ వైఖరిని అవలంబించాల్సి వచ్చింది. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన కూడా అప్పట్లో అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అయితే, ఇప్పుడు అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం ముగింపు దశకు చేరడం భారత దౌత్య, ఆర్థిక ప్రయోజనాలకు లభించిన అతిపెద్ద ఊరట. ఆంక్షలు సడలిస్తే చమురు మార్కెట్లో స్థిరత్వం ఏర్పడటంతో పాటు, ఆసియా వ్యాప్తంగా భారత్ తన ఆర్థిక పట్టును మరింత సుస్థిరం చేసుకోగలుగుతుంది.
Also Read: భారత నౌకపై అమెరికా సైన్యం దాడి..ముగ్గురు భారతీయులు
Also Read: అమెరికా దాడిలో ముగ్గురు భారతీయులు ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nitish Kumar Reddy Press Meet: 'అమ్మా.. 5 నిమిషాల్లో కాల్ చేస్తా': లైవ్ ప్రెస్మీట్ మధ్యలో ఆపేసిన నితీశ్ కుమార్ రెడ్డి..తెలుగు వీడియో వైరల్!
Jhikli Barol, Himachal Pradesh:Nitish Kumar Reddy Press Conference: అంతర్జాతీయ క్రికెట్ వేదికపై ఎంత బిజీగా ఉన్నా.. అమ్మ పిలుపు కంటే ఏదీ ఎక్కువ కాదని నిరూపించాడు తెలుగు ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి. ధర్మశాల వేదికగా అఫ్ఘానిస్థాన్తో జరిగిన తొలి వన్డే అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక ఆసక్తికరమైన, అందమైన ఘటన చోటుచేసుకుంది.
ప్రెస్మీట్ మధ్యలో అమ్మ ఫోన్..!
మ్యాచ్ ముగిసిన తర్వాత నితీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతుండగా, ఒక్కసారిగా అతడి మొబైల్ మోగింది. స్క్రీన్పై 'అమ్మ' అని చూడగానే.. చుట్టూ ఉన్న రిపోర్టర్లను క్షమించమని కోరుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. "అమ్మా.. ప్రెస్మీట్లో ఉన్నాను. ఒక 5 నిమిషాల్లో మళ్లీ చేస్తాను" అంటూ పక్కా తెలుగులో మాట్లాడి ఫోన్ కట్ చేశాడు.
అనంతరం అక్కడున్న విలేకరులకు చిరునవ్వుతో 'సారీ' చెప్పి మళ్లీ ప్రెస్మీట్ను కొనసాగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
నెటిజన్ల ప్రశంసల జల్లు
ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు, నెటిజన్లు క్రికెటర్ నితీశ్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "గ్లోబల్ వేదికపై మన తెలుగు భాషను హైలైట్ చేశాడు, గర్వంగా ఉంది!" అని కొందరు అంటుంటే.. "అమ్మ అంటే అంత ప్రేమ మరి.. ఎంత పెద్ద స్టార్ అయినా అమ్మ తర్వాతే ఎవరైనా" అని మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
Mom > Media 📞😂pic.twitter.com/4bqfCZvSKn
— Cricbuzz (@cricbuzz) June 14, 2026
మ్యాచ్ హైలైట్స్
అఫ్ఘానిస్థాన్తో జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వర్షం కారణంగా మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్ జట్టు 194 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలింగ్ దళాన్ని పరిశీలిస్తే.. అరంగేట్రం మ్యాచ్లోనే గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబె తలో 3 వికెట్లతో అదరగొట్టారు. నితీశ్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
భారత్ చేజింగ్లో 195 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 22.5 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 84 పరుగులతో నాటౌట్గా నిలవగా.. కేఎల్ రాహుల్ 39* పరుగులతో అజేయ భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడిన శుభ్మన్ గిల్కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
Also Read: ఫుట్బాల్ మ్యాచ్లో హద్దు దాటిన లేడీ ఫ్యాన్..ప్రైవేట్ పార్ట్స్ కనబడేలా రచ్చ!
ALso REad: ఇక సెలవు..అంతర్జాతీయ క్రికెట్కు కివీస్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వీడ్కోలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kriti Sanon Rashmika: హీరోయిన్ రష్మికపై ఎగబడ్డ ఫ్యాన్స్..తెలుగింటి కోడలికి బాడీగార్డ్గా మారిన బాలీవుడ్ బ్యూటీ!
Pimpri-Chinchwad, Pune, Maharashtra:Kriti Sanon Rashmika News: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ప్రధానపాత్రలో.. కృతి సనన్, రష్మిక మందన్న హీరోయిన్లుగా కలిసి నటించిన చిత్రం 'కాక్టెయిల్ 2'. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ ముగ్గురు స్టార్లు సినిమా ప్రమోషన్స్ కోసం పూణేలోని ఒక మాల్ను సందర్శించారు. అయితే, ఉత్సాహంగా ప్రారంభమైన ఈ ఫ్యాన్ ఈవెంట్, ఊహించని విధంగా భారీ సంఖ్యలో జనం భద్రతా బారికేడ్లను ఛేదించుకుని లోపలికి రావడంతో గందరగోళంగా మారింది.
ఈ గందరగోళం మధ్య, రష్మిక పట్ల కృతి చూపిన విధానం అందర్ని ఆకట్టుకుంది. రష్మిక పైకి ఫ్యాన్స్ ఎగబడుతున్న నేపథ్యంలో ఆమెను సంరక్షిస్తున్న ఓ బాడీ గార్డు మాదిరిగా ఆమె చేతులను అడ్డుపెట్టి రష్మికను సంరక్షించింది. ఇప్పడు అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. హీరోయిన్ కృతి సనన్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ ఈవెంట్కు సంబంధించిన ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా, భారీ సంఖ్యలో జనం హీరోయిన్ల వైపు దూసుకురావడం, దీంతో షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక ఆ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లేందుకు ఇబ్బంది పడటం కనిపించింది. కొన్ని వార్తా నివేదికల ప్రకారం.. నటీనటులకు దగ్గరయ్యే ప్రయత్నంలో అభిమానులు భద్రతా బారికేడ్లను ఛేదించుకుని రావడంతో ప్రచార కార్యక్రమాన్ని మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది.
ఆ గందరగోళం మధ్య జనసమూహంలోంచి దారి వెతుక్కుంటూ వెళ్తున్న షాహిద్, స్పష్టంగా అసహనానికి గురైనట్లు కనిపించాడు. మరోవైపు, భద్రతా సిబ్బంది వారిని ప్రాంగణం నుండి బయటకు తీసుకువెళ్తుండగా, కృతి రష్మిక మందన్నను గట్టిగా పట్టుకుని, తోసుకుంటున్న జనసమూహం నుండి ఆమెను కాపాడుతూ కనిపించింది. ఆ నటి ఆద్యంతం అప్రమత్తంగా ఉంటూ, అభిమానుల మధ్య నుంచి రష్మికకు జాగ్రత్తగా మార్గనిర్దేశం చేసింది. ఆమె చేసిన ఈ పని అప్పటి నుండి ఆన్లైన్లో ప్రశంసలు అందుకుంది.
ఒక అభిమాని ఇలా వ్యాఖ్యానించారు. "కృతి రష్మికను కాపాడుతున్న తీరు.. ఒక చెల్లెల్ని అక్క కాపాడుతున్నట్లు ఉంది." మరొకరు కామెంట్ చేస్తూ.. "కృతి రష్మికను కాపాడుతున్న తీరు వారిద్దరి మధ్య ఉన్న సన్నిహితానికి ప్రతిరూపం" అని అన్నారు. అలాగే మరో నెటిజన్లు ఇలా వ్యాఖ్యానించారు. "కృతి రష్మికను కాపాడటం చాలా ఎంతో చూడముచ్చటగా ఉంది." అని ఫ్యాన్స్ కామెంట్ చేశారు.
'కాక్టెయిల్ 2' సినిమా గురించి..
హోమీ అడజానియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. 2012లో విజయవంతమైన 'కాక్టెయిల్' చిత్రానికి సీక్వెల్గా రూపొందింది. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ట్రాయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేట్రలలో విడుదల కానుంది.
Also Read: ఐటెంసాంగ్ ద్వారా భారీగా సంపాదించిన హీరోయిన్ ఈమెనే! ఒక్క పాటకి అన్ని కోట్ల రూపాయలా?
Also Read: మ్యూజిక్ డైరెక్టర్ను బీచ్లో పాతిపెట్టిన అనిల్ రావిపూడి..ఇలా కూడా చేస్తారా గురూ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
