తారామతి పేట్ లో భారీ చోరి,30 తులాల బంగారు ఆభరణాలు కిలో వెండి అపహరణ
అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్కు ఆనుకుని ఉన్న తారామతిపేట్ గ్రామంలో ఓ ఇంటి తాళం పగులగొట్టి సుమారు 30 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి అపహరించారు. ప్రజల ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. గ్రామంలో అమర్చిన సీసీ కెమెరాలను పరిశీలించారు. 8 సంవత్సరాల క్రితం ఈ ఇంట్లో 18 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని, ఆ సమయంలో పోలీసులు 1 తులాల బంగారం కూడా రికవరీ చేయలేదని మీకు తెలియజేద్దాం. పోలీసులు దొంగలను పట్టుకుని మాకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
TTD Room Booking Fraud: తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదుల బుకింగ్ పేరుతో భక్తులు మరోసారి నిలువునా మోసపోతున్నారు. భక్తులను మోసం చేస్తున్న దళారులు, నకిలీ వెబ్సైట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తీవ్రస్థాయిలో మండిపడింది. భక్తులు మోసపోకుండా ఉండేందుకు టీటీడీ విజిలెన్స్ విభాగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది.
వెలుగులోకి వచ్చిన ఘటన
కేరళకు చెందిన సి.కె. సురేష్ బాబు అనే భక్తుడు తిరుమలలో గదులు ఇప్పిస్తామన్న దళారుల మాటలు నమ్మి మోసపోయారు. 'కర్ణాటక ప్రవాసి సౌధ' పేరుతో గదులు బుక్ చేస్తామని చెప్పి ఆయన దగ్గర డబ్బులు వసూలు చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్ విభాగం, దళారుల నెట్వర్క్ను ఛేదించే పనిలో పడింది.
నకిలీ వెబ్సైట్లు ఎలా గుర్తిస్తారు?
టీటీడీ ఐటీ విభాగం జరిపిన విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. టీటీడీ అధికారిక చిహ్నాలు, శ్రీవారి ఆలయ చిత్రాలను వాడుతూ అచ్చం ఒరిజినల్ వెబ్సైట్లాగే భక్తులను నమ్మిస్తున్నారు. గూగుల్లో సర్చ్ చేసినప్పుడు ఈ ఫేక్ సైట్లు ముందుగా కనిపిస్తూ, ఆన్లైన్ పేమెంట్ల ద్వారా భక్తుల సొమ్మును కాజేస్తున్నాయి. ఇప్పటికే అటువంటి వెబ్సైట్లపై కాపీరైట్ చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
భక్తులు పాటించాల్సిన జాగ్రత్తలు..
శ్రీవారి భక్తులు కింది విషయాలను గుర్తుంచుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. దర్శనం, వసతి, సేవ టికెట్ల కోసం కేవలం అధికారిక వెబ్సైట్ను మాత్రమే సంప్రదించండి. తిరుమలలో వసతి గదులు ఇప్పిస్తామనే దళారులను అస్సలు నమ్మకండి. ఏదైనా అనుమానాస్పద ఫోన్ కాల్స్ లేదా వెబ్సైట్లు కనిపిస్తే వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం అందించండి.
ముఖ్య సూచన: భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఒకే ఒక అధికారిక వెబ్సైట్ను నిర్వహిస్తోంది. దయచేసి ఇతర ప్రైవేట్ లింకుల ద్వారా డబ్బులు చెల్లించి మోసపోవద్దు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Crime News: ఒకే రోజు డబుల్ షాక్.. రూ.7 లక్షల ఫేక్ గోల్డ్ స్కాం.. 6 తులాల బంగారం దోపిడి..!!
Fake Gold Scam: తెలంగాణలోని రెండు జిల్లాల్లో చోటుచేసుకున్న వేర్వేరు ఘటనలు ప్రజల్లో భయాందోళన రేపుతున్నాయి. ఒకటి ఫేక్ గోల్డ్ పేరుతో జరిగిన ఘరానా మోసం కాగా, మరొకటి పట్టపగలే జరిగిన ఇంటి దొంగతనం. నల్లగొండ జిల్లాలో ఫేక్ గోల్డ్ పేరుతో 7 లక్షల వరకు మోసపోయిన బాధితులు బోరుమంటుంటే.. నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మండలం హాజీపూర్ గ్రామంలో ఓ ఇంట్లోకి చొరబడిన దుండగలు 6 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ రెండు సంఘటనలు అప్రమత్తత ఎంత ముఖ్యమో మళ్లీ గుర్తు చేస్తున్నాయి.
నల్లగొండ జిల్లాలోని శాలిగౌరారం మండలం రామానుజపురంలో మోసగాళ్ల ముఠా చాకచక్యంగా పన్నిన పథకం వెలుగులోకి వచ్చింది. విజయవాడ ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు మరో వ్యక్తితో కలిసి గ్రామాల్లో సంచరిస్తూ అమాయకులను టార్గెట్ చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. విజయవాడ వరదల్లో దొరికిన బంగారం అని చెప్పి తక్కువ ధరకు అమ్ముతామని నమ్మబలికారు. మొదట అసలు బంగారం ముక్కను నమూనాగా చూపించి నమ్మకం కలిగించారు. ఆ నమ్మకంతో గ్రామానికి చెందిన వ్యక్తి రూ.7 లక్షలు చెల్లించి ఆభరణాలు కొనుగోలు చేశాడు. అయితే తర్వాత పరీక్షించగా అవి ఇత్తడి అని తేలడంతో అసలు మోసం బయటపడింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని, ఈ ముఠా వెనుక మరెవరైనా ఉన్నారా అనే దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ వస్తే నమ్మవద్దని అధికారులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.
ఇక మరో ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. అచ్చంపేట మండలం హాజీపూర్ గ్రామంలో సైదులు అనే వ్యక్తి ఇంట్లో మధ్యాహ్నం సమయంలోనే దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంటి యజమాని పనిమీద బయటకు వెళ్లిన సమయంలో తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాను పగలగొట్టి నగదు, సుమారు 6 తులాల బంగారం అపహరించారు. సాయంత్రం ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు ఇల్లు చిందరవందరగా ఉండటాన్ని చూసి షాక్కు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. క్లూస్ టీమ్ సహాయంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. గ్రామాల్లో కొత్త వ్యక్తుల కదలికలపై సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. రెండు జిల్లాల్లో జరిగిన ఈ ఘటనలు గ్రామీణ ప్రాంతాల్లోనూ నేరగాళ్లు చురుగ్గా ఉన్నారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఇక ఫేక్ గోల్డ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. బంగారం పేరుతో కాపర్, బ్రాస్ వంటి లోహాలను ప్రత్యేక్షంగా పాలిస్ చేసి గోల్డ్ లుక్ వచ్చే విధంగా తయారు చేస్తారు. రెడ్ కలర్ షేడ్ ఉండటంతో ఇది సాధారణ బంగారం వలే కనిపిస్తుంది. మొదట కొనుగోలు చేసినప్పుడు మెరుస్తుంది. కానీ కొద్ది వారాల్లోనే రంగు తగ్గుతుంది. మచ్చలు పడటం, మెటల్ వెలిసిపోతుంది. ముఖ్యంగా ఇందులో గోల్డ్ కంటెంట్ జీరో. అందుకే రీసేల్ వాల్యూ ఉండదు. లోన్ తీసుకోవడం కూడా సాధ్యం కాదు. ఈ స్కామ్ ఎక్కువగా రూడ్లపై.. చిన్న మార్కెట్లో సోషల్ మీడియాలో గ్రూపుల్లో సర్క్యూలేట్ అవుతోంది. ఇంపోర్ట్ గోల్డ్, స్మగ్లింగ్ స్టాక్, డ్యూటీ లేకుండా వచ్చిన బంగారం అంటూ మార్కెట్ ధర కంటే 20శాతం నుంచి 40శాతం తక్కువ ఇస్తామని నమ్మబలుకుతున్నారు. వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ ఒత్తిడి చేస్తుంటారు. బిల్లు ఉండదు. అసలు బిస్ హాల్ మార్క్ఉండదు. ఫేక్ స్టాంప్ వేసి ఇస్తారు. కొన్న తర్వాత వారి ఫోన్ నెంబర్స్ కూడా పనిచేయవు. ఇదే వారి మోసం. ఇలాంటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.
Also Read: Gold: మార్కెట్లో బంగ్లాదేశ్ ఫేక్ గోల్డ్ చక్కర్లు.. గుర్తు పట్టడం దేవుడి వల్ల కూడా కాదు..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
India Vs Zimbabwe Match Preview: చెన్నైలోని చెపాక్ స్టేడియం నేడు బ్లూ జెర్సీలతో నిండిపోనుంది. టీ20 ప్రపంచకప్ సూపర్-8లో టీమ్ఇండియా ఈ రోజు కీలక మ్యాచ్ ఆడనుంది. టోర్నీ సెమీఫైనల్కు వెళ్లేందుకు ఈ మ్యాచ్ చావోరేవో తేల్చుకోవాల్సిన సమయం సూర్యసేన ఎదురుకొంటోంది. జింబాబ్వేతో జరిగే ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఉండడం వల్ల అభిమానుల్లో కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరోవైపు ప్రత్యర్థి జట్టు కూడా బలంగా కనిపించడం వల్ల ఇప్పుడు ఫ్యాన్స్లో మరింత టెన్షన్ వాతావరణం నెలకొంది.
మ్యాచ్ సమాచారం:
టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా నేడు అనగా ఫిబ్రవరి 26న భారత్, జింబాబ్వే మధ్య మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకు (IST) చెన్నైలోని చెపాక్ స్టేడియం ఈమ్యాచ్కు వేదిక కానుంది. సెంట్రల్ పిచ్ (నెం. 5)పై మ్యాచ్ జరగనుంది. ఇది నల్లరేగడి నేల పిచ్.. గత మ్యాచ్ల్లో ఈ పిచ్ పై జరిగిన స్కోర్లు 200 వరకు నమోదయ్యాయి. దీంతో ఈ పిచ్లో జరిగే మ్యాచ్ బ్యాటర్లకు పండగే.
భారత జట్టు
భారత బ్యాటింగ్ లైనప్పై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా టాప్-ఆర్డర్ విఫలం కావడం ఆందోళన కలిగిస్తోంది. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం సంజు శామ్సన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు తన తండ్రి అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమైన రింకూ, బుధవారం సాయంత్రం తిరిగి జట్టుతో చేరాడు. జింబాబ్వేలో ఎక్కువ మంది కుడిచేతి వాటం బ్యాటర్లు ఉన్నందున అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
టీమ్ఇండియా జట్టు అంచనా..
అభిషేక్ శర్మ, సంజు శామ్సన్ (wk), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (c), శివం దుబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ CV, జస్ప్రీత్ బుమ్రా.
జింబాబ్వే తుదిజట్టు విశ్లేషణ..
వెస్టిండీస్ చేతిలో ఓటమి తర్వాత జింబాబ్వే కూడా ఇప్పుడు గెలిచి తీరాల్సిన స్థితిలో ఉంది. ముంబై మ్యాచ్లో గాయపడిన కెప్టెన్ సికందర్ రజా కోలుకున్నాడు, అతను 100% ఆడుతున్నట్లు జట్టు వర్గాలు తెలిపాయి. జింబాబ్వేలో వైవిధ్యమైన బౌలింగ్ ఆప్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా లెగ్ స్పిన్నర్ ర్యాన్ బర్ల్ భారత్కు సవాల్ విసరే అవకాశం ఉంది.
జింబాబ్వే తుదిజట్టు అంచనా..
బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మరుమాని (wk), డియోన్ మైయర్స్, ర్యాన్ బర్ల్, సికందర్ రాజా (c), టోనీ మున్యోంగా, తషింగా ముసేకివా, బ్రాడ్ ఎవాన్స్, గ్రేమ్ క్రీమర్, రిచర్డ్ న్గారావ, బ్లెస్సింగ్ ముజారబాని.
మీకు తెలుసా?
1) ఈ ప్రపంచకప్లో భారత ఓపెనింగ్ వికెట్ సగటు కేవలం 6.80 మాత్రమే. ఇది అన్ని జట్ల కంటే తక్కువ.
2) 2024 నుంచి ఇప్పటివరకు T20Iలలో 1748 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బెన్నెట్ రికార్డు సృష్టించాడు.
3)భారత్ తరపున బుమ్రా (33), అర్ష్దీప్ (32) వికెట్లతో టాప్ ఫామ్లో ఉన్నారు.
దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత సెమీఫైనల్ బెర్త్ కోసం నెట్ రన్ రేట్ (-3.800) కీలకం కానుంది. కాబట్టి జింబాబ్వేపై భారీ విజయం సాధించడం టీమ్ ఇండియాకు అత్యవసరం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cardiac Arrest Death: పాఠశాలలో తన స్నేహితులతో సరదాగా ఆడుకుంటున్న బాలిక అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఆట స్థలంలో ఆడుకుంటున్న సమయంలో బాలిక కూలిపోయింది. తోటి విద్యార్థులు.. ఉపాధ్యాయులు బాలికను లేపి చూడగా ఎంతకీ లేవలేదు. వెంటనే హడావుడిగా ఆస్పత్రికి తరలించగా.. పరిశీలించిన వైద్యులు అప్పటికే బాలిక మృతి చెందిందని వాపోయారు. ఈ సంఘటన రాజస్థాన్లోని ఓ పట్టణంలో జరిగింది. బాలిక కుప్పకూలుతున్న వీడియో వైరల్గా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Milk Tragedy: తెలంగాణలో కల్తీపాలు తయారీ.. డబ్బు కోసం వ్యాపారి కక్కుర్తి
రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా గోటన్ పట్టణానికి చెందిన రాజేంద్ర బపేడియా కుమార్తె దివ్య (9) స్థానికంగా ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్లో 5వ తరతగతి చదువుతుండేది. నిత్యం పాఠశాలకు వెళ్లి బుద్ధిగా చదువుకునేది. ఆటల సమయంలో ఆటలు ఆడేది. ఈనెల 23వ తేదీన యథావిధిగా పాఠశాలకు వచ్చిన దివ్య పాఠశాల తరగతులు అయిపోయిన తర్వాత మైదానంలో ఆటలాడుకుంటోంది. ఈ సమయంలో అకస్మాత్తుగా దివ్య కుప్పకూలిపోయింది.
Also Read: Save Punarvika: చిన్నారి పునర్వికకు నారా లోకేశ్ అండ.. రూ.6 కోట్ల భారీ విరాళం
తమ స్నేహితురాలు కుప్పకూలిపోవడంతో తోటి స్నేహితులు లేపి చూసినా లేవలేదు. దీంతో అక్కడే ఉన్న పాఠశాల సిబ్బందితోపాటు టీచర్లు దివ్యను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతిచెందారని వైద్యులు ధ్రువీకరించారు. అయితే బాలికకు ఎలాంటి గాయాలు కాకపోవడం గమనార్హం. ఎలాంటి గాయాలతో మృతి చెందలేదని.. గుండెపోటు కారణంగా బాలిక మృతి చెంది ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో దివ్య కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. అయితే ఆ కుటుంబంలో ఇలాంటి సంఘటన రెండోది కావడం కలచివేస్తోంది.
రాజేంద్ర బపేడియాకు గతంలో కుమారుడు కూడా ఉండేవాడు. ఆ బాలుడు కూడా దివ్య మాదిరి చనిపోయాడు. దివ్య సోదరుడు అభిషేక్ గుండెపోటుతోనే మరణించినట్లు వారి బంధుమిత్రులు గుర్తుచేస్తున్నారు. గతేడాది సెప్టెంబర్లో ఆ బాలుడు ఇంట్లో ఆడుకుంటూ కూలిపోయాడు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే అభిషేక్ మరణించాడు. ఇప్పుడు బాలుడి చెల్లెలు దివ్య కూడా అదే తీరున మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది. నెలల వ్యవధిలో ఇద్దరు పిల్లలను కోల్పోయిన ఆ కుటుంబం తీరని విషాదంలో మునిగింది. ఒక కుటుంబంలోని ఇద్దరు ఇలా హఠాన్మరణం చెందడం చూస్తే జన్యుపరమైన లోపం ఏమైనా ఉంటుందా? అనే చర్చ జరుగుతోంది. వంశపారంపర్యగా వచ్చిన అనారోగ్య సమస్యలతో ఇలా మరణిస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది. దీంతో ఆ కుటుంబం వైద్య పరీక్షలు చేయించుకోనుంది. కాగా తోటి బాలిక మృతితో ఆ పాఠశాలలో తీవ్ర విషాదం ఏర్పడింది. పాఠశాలలో బాలిక కుప్పకూలిపోయిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.
Nagaur में 9 साल की बच्ची की हार्ट अटैक से मौत!
खेल के मैदान में मासूम की अचानक तबीयत बिगड़ी और जान चली गई। pic.twitter.com/C7yxKEb1KM— एक नजर (@1K_Nazar) February 26, 2026
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
SCSS: రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం ఎలా పొందాలన్న ఆందోళన చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా పెన్షన్ సౌకర్యం లేని వారికి భద్రమైన పెట్టుబడి మార్గం అవసరం అవుతుంది. అలాంటి వృద్ధుల కోసం పోస్టాఫీసు అందిస్తున్న సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) ఒక విశ్వసనీయమైన ఎంపికగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం మద్దతుతో అమలవుతున్న ఈ పథకం ప్రస్తుతం 8.2 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. ఇది సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే ఆకర్షణీయమైన రాబడిగా భావిస్తున్నారు.
ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన మొత్తంపై వడ్డీ ప్రతి మూడు నెలలకు ఒకసారి నేరుగా ఖాతాదారుడి సేవింగ్స్ ఖాతాలో జమ అవుతుంది. దీని వల్ల నెలనెలా ఖర్చులకు అవసరమైన స్థిరమైన నగదు ప్రవాహం లభిస్తుంది. ఉదాహరణకు.. గరిష్ట పరిమితి అయిన రూ.30 లక్షలు ఒకేసారి డిపాజిట్ చేస్తే, 8.2 శాతం వడ్డీ ప్రకారం సంవత్సరానికి సుమారు రూ.2,46,000 ఆదాయం వస్తుంది. దాన్ని నెలవారీ సగటుగా లెక్కిస్తే దాదాపు రూ.20,500 వరకు పొందవచ్చు. అయితే వడ్డీ చెల్లింపులు త్రైమాసికంగా జరుగుతాయి.
పన్ను ప్రయోజనాల పరంగా కూడా ఈ పథకం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందే అవకాశం ఉంది. దీని ద్వారా పెట్టుబడిదారులకు అదనపు ఆర్థిక ఉపశమనం లభిస్తుంది. ఇక అర్హత విషయానికి వస్తే, సాధారణంగా 60 ఏళ్లు నిండినవారు ఇందులో చేరవచ్చు. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నవారు 55 ఏళ్ల వయస్సు నుంచే అర్హులవుతారు. మాజీ సైనికోద్యోగులకు వయస్సు పరిమితి 50 ఏళ్లు. కనీస పెట్టుబడి రూ.1,000 కాగా, గరిష్టంగా రూ.30 లక్షలు వరకు ఒకేసారి డిపాజిట్ చేయాలి; విడతలుగా పెట్టుబడి పెట్టే అవకాశం లేదు.
అయితే.. రిస్క్ తక్కువగా ఉండే, ప్రభుత్వ హామీతో కూడిన స్థిర ఆదాయం కోరుకునే సీనియర్ సిటిజన్లకు ఈ పథకం ఒక భరోసా మార్గంగా నిలుస్తోంది. పదవీ విరమణ తర్వాత ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవాలనుకునే వారికి ఇది సముచితమైన ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Gold: మార్కెట్లో బంగ్లాదేశ్ ఫేక్ గోల్డ్ చక్కర్లు.. గుర్తు పట్టడం దేవుడి వల్ల కూడా కాదు..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Assembly Session: '2047 విజన్లో భాగంగా నీటి భద్రతపైనే కూటమి ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. గోదావరి, కృష్ణా పుష్కరాలను కూడా ఘనంగా నిర్వహించే బాధ్యత మా ప్రభుత్వానికే వచ్చింది' అని తెలిపారు. గోదావరికి అఖండ హారతి, కృష్ణా నదికి పవిత్ర హారతి ఇచ్చి జలాలను అత్యంత విలువైన వనరుగా భావిస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. సాగునీటి రంగంపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా సాగునీటిపై కీలక ప్రకటనలు చేశారు.
Also Read: Milk Tragedy: తెలంగాణలో కల్తీపాలు తయారీ.. డబ్బు కోసం వ్యాపారి కక్కుర్తి
'గోదావరి నది నుంచి సగటున ఏడాదికి 3 వేల టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృథాగా పోతున్నాయి. వంశధార నుంచి పెన్నా వరకూ రాష్ట్రంలో నదులను అనుసంధానిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. గంగా-కావేరీ అనుసంధానం జరగాలన్నది నా ప్రగాఢమైన ఆకాంక్ష' అని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. 'గంగా-కావేరి అనుసంధానం సాధ్యాసాధ్యాలపై ఆనాడే చర్చలు జరిగాయి. నదులు అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇచ్చేలా ప్రణాళికలు చేస్తున్నాం. హంద్రీనీవా కాలువ ద్వారా 738 కిలోమీటర్ల మేర కాలువల విస్తరించి కుప్పంలో పరమ సముద్రం చెరువు వరకూ నీరిచ్చాం. మడకశిర వరకూ నీళ్లు తీసుకెళ్లి ఆ ప్రాంత దాహార్తిని తీర్చాం' అని వివరించారు.
Also Read: Save Punarvika: చిన్నారి పునర్వికకు నారా లోకేశ్ అండ.. రూ.6 కోట్ల భారీ విరాళం
'ఆంధ్రప్రదేశ్లో కట్టిన ప్రాజెక్టులన్నీ టీడీపీ, కూటమి హయాంలో వచ్చినవే. ధవళేశ్వరం బ్యారేజి కట్టిన కాటన్ దొరను ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నాం. ఆనాడు రాయలసీమకు తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రినీవా లాంటి ప్రాజెక్టులు చేపట్టింది ఎన్టీఆర్' సీఎం చంద్రబాబు ప్రకటించారు. '2014-19లో రూ.68 వేల కోట్లు సాగునీటిపై వ్యయం చేశాం. గడచిన 20 నెలలుగా రూ.20 వేల కోట్ల వరకూ ఖర్చు చేయగలిగాం. పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు నీరిచ్చి, శ్రీశైలంలో నీటిని పొదుపు చేసి 100 టీఎంసీలను రాయలసీమకు తరలించాం. అందుకే ఆ ప్రాంతం రతనాల సీమగా మారింది' అని సీఎం చంద్రబాబు తెలిపారు.
Also Read: VK Sasikala: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. కొత్త పార్టీ పెట్టనున్న చిన్నమ్మ
వెలిగొండ పూర్తి చేసి మార్కాపురం సహా వివిధ ప్రాంతాలకు న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా మార్కాపురం, ఒంగోలు జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. '30 ఏళ్ల ముందు ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేసి.. మొదటి దశను ఈ ఏడాది జూలైలోనే పూర్తి చేసి నీళ్లు ఇస్తాం. వెలిగొండ ప్రాజెక్టుకు రూ.2500 కోట్ల మేర ఇంకా ఖర్చు చేయాల్సి ఉంది. రూ.456 కోట్లతో ఫీడర్ కాలువ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేశాం. క్రెడిట్ చోరీ చేసే అంశం ఆ పార్టీదే. వెలిగొండకు నీళ్లు రాకుండా రిబ్బన్ కట్ చేశారు. కుప్పంలోనూ ట్యాంకర్లు తీసుకువచ్చి కాలువలో పోశారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై 5 ఏళ్ల పాటు గత పాలకులు నిర్లక్ష్యం చేశారు' అని సీఎం చంద్రబాబు వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Congress AIMIM Party Alliance: తెలంగాణలో ఎంఐఎం దోస్తానాపై కాంగ్రెస్ పెద్దలు.. సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎంఐఎం తమ మిత్రపక్షమని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని జాగ్రత్తగా ఉండాలని రాహుల్ గాంధీ సూచించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను నిలువరించడంతో పాటు మజ్లిస్ పార్టీని కట్టడి చేసే అంశం రాహుల్ గాంధీ ప్రస్తావించినట్లు టాక్ వినిపిస్తోంది. ఎంఐఎం ఎంతగా విస్తరిస్తే అంతగా బీజేపీ ఎదుగుతుందని రాహుల్ అభిప్రాయపడినట్టు సమాచారం. ఇప్పటికే అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఎదు గుదలకు ఎంఐఎం పరోక్షంగా సహకరిస్తోందని రాహుల్ గాంధీ నేతలను వారించినట్టు తెలిసింది. ఎంఐఎంను కాంగ్రెస్ భాగస్వామిగా ప్రజలు భావిస్తే గ్రామీణ ప్రాంతాల్లో హిందువుల ఓట్లలో చీలిక వచ్చే అవకాశాలపై అనుమానాలు లేవనెత్తినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై మరోమారు విస్తృతంగా చర్చిద్దామని ఖర్గే అన్నట్టు చెబుతున్నారు.
ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లను దక్కించుకుంది. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్, పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 29 శాతం ఓట్లు సాధిస్తే, బీజేపీ 16 శాతం ఓట్లును దక్కించుకుంది. అంతకుముందు సర్పంచ్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీకి 30 శాతం సీట్లు వచ్చాయి. బలం మరింత పెంచుకునేందుకు రెండు పార్టీలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలను జాతీయ నాయకత్వం అలర్ట్ చేసినట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసుకుంటేనే ఆ పార్టీలను నిలువరించాలని ఆదేశించినట్టు సమాచారం. దీనికి తోడు కొన్ని సామాజిక వర్గాల్లో ఈ రెండు పార్టీలు పట్టు సాధిస్తున్నాయి. దీనిని అభివృద్ధి మంత్రంతో అడ్డుకోవాలని చెప్పారట. అటు యువత, మహిళలను మరింతగా పార్టీకి చేరువ చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read: Collectors Transfer: మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్.. తెలంగాణలో 10 జిల్లాల కలెక్టర్లు బదిలీ
మరోవైపు ఇటీవల పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ముఖ్యంగా బీహార్, ఢిల్లీ లాంటి పెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుస్తుందని అన్ని సర్వేలు అంచనా వేశాయి. కానీ కాంగ్రెస్ గెలుపు అవకాశాలను ఎంఐఎం పార్టీ దెబ్బ తీసినట్టు తెలిసింది. ఎంఐఎం పార్టీ పోటీకి దిగిపోయి బీజేపీ గెలుపు అవకాశాలను సులువు చేసిందని అంటున్నారు. అంతకుముందు ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలను ఎంఐఎం పార్టీనే దెబ్బ కొట్టిందని కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు భావిస్తున్నారట. అందుకే ఎంఐఎం పార్టీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. అయినప్పటికీ ఏమాత్రం ఏమరుపాటు తగదని, ప్రధాన పక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ సైతం బలంగా ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తతతో వ్యవహరించాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ ఆదేశించిందట. సామాజిక న్యాయం అంశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నప్పటికీ.. జాతీయవాదం, ప్రాంతీయ వాదం నినాదాలతో ప్రతిపక్షాలు జనంలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించినట్టు తెలుస్తోంది.
Also Read: Milk Tragedy: తెలంగాణలో కల్తీపాలు తయారీ.. డబ్బు కోసం వ్యాపారి కక్కుర్తి
మొత్తంమీద ఎంఐఎం విషయంలో కాంగ్రెస్ పెద్దలు అలర్ట్ అయ్యారని తెలుస్తోంది. ఎందుకంటే.. ఎంఐఎం పార్టీ కారణంగా బీజేపీ, బీఆర్ఎస్ బలపడొద్దని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట. తెలంగాణలో కూడా ఎంఐఎం కారణంగా రెండు పార్టీ పార్టీలు బలపడితే.. తమ అడ్రస్ గల్లంతు అవుతుందని హైకమాండ్ పెద్దలు భావిస్తున్నారట. అందుకే మజ్లిస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే రాహుల్ గాంధీ ఆదేశాల తర్వాత.. ఎంఐఎం పార్టీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలా వ్యవహారిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రేవంత్ సర్కార్కు అనేక విషయాల్లో ఎంఐఎం మద్దతుగా నిలుస్తోంది. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికలో ఎంఐఎం మద్దతు తప్పనిసరిగా తీసుకుని గ్రేటర్ లో పాగా వేయాలని రేవంత్ భావిస్తున్నారు. ఈ సమయంలో ఎంఐఎం ను కంట్రోల్ చేస్తూ.. మిగతా పార్టీలను ఎలా కట్టడి చేస్తారనేది మాత్రం ఇంట్రెస్టింగ్ మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Iran Fertility Rate Fall: ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్లో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గింది. ఒకప్పుడు ప్రతి మహిళకు సగటున 5–6 మంది పిల్లలు ఉండేవారు. ఇప్పుడు ఈ సంఖ్య రెండు కంటే తక్కువకు పడిపోయింది. ఇది చిన్న కుటుంబాలను ప్రోత్సహించే ప్రభుత్వం విధానాలు, ఆర్థిక ఒత్తిడి, మహిళల విద్యా స్థాయిల పెరుగుదల, సమాజంలోని మార్పుల ఫలితంగా ఏర్పడింది.
1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత.. ప్రారంభ దశల్లో ప్రభుత్వ వ్యూహం ఎక్కువ మంది పిల్లలను ప్రోత్సహించడం దిశగా ఉండేది. 1980–1988 ఇరాన్-ఇరాక్ యుద్ధం సమయంలో జనన రేటు మరింత పెరిగింది. అయితే యుద్ధం ముగిసి ఆర్థిక పరిస్థితులు క్షీణించినప్పటి నుండి.. 1990లలో ఇరాన్ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను అమలు చేసింది. ఉచిత గర్భనిరోధక మందులు, వివాహానికి ముందు కుటుంబ నియంత్రణ శిక్షణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల విస్తరణ వంటి చర్యల ద్వారా పిల్లల సంఖ్య వేగంగా తగ్గింది.
ఇరాన్లో మహిళల విద్యా స్థాయిలు వేగంగా పెరిగాయి. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థినుల సంఖ్య పెరిగింది. ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. సగటు వివాహ వయస్సు కూడా పెరిగింది. మహిళలు విద్య.. కెరీర్లపై దృష్టి సారించినప్పుడు, వారు సాధారణంగా ఆలస్యంగా వివాహం చేసుకుంటారు. తక్కువ మంది పిల్లలను కనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.ఇప్పుడు ఈ ధోరణి ఇరాన్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో వివాహం, ఎక్కువ మంది పిల్లలు ఉండటం సర్వసాధారణం అయితే, పట్టణ కుటుంబాలు ఇప్పుడు ఒకటి లేదా ఇద్దరు పిల్లలకు పరిమితం కావడానికి ఎంచుకుంటున్నాయి.
Also Read: Gold Silver Rate: బంగారం.. వెండిపై చైనా కీలక ప్రకటన.. ధరలు భారీగా తగ్గే అవకాశం..?
ఇరాన్ మాత్రమే కాదు.. అనేక దేశాలు జనన రేటులో వేగంగా తగ్గుదల చూశాయి. 1970లలో ఒక మహిళకు సుమారు ఐదుగురు పిల్లలు ఉన్న భారతదేశంలో, ఇప్పుడు ఆ సంఖ్య రెండుకు చేరింది. దక్షిణ కొరియాలో పరిస్థితి మరింత దిగ్భ్రాంతికరంగా ఉంది. 1950లలో ఒక మహిళకు సుమారు ఆరుగురు పిల్లలు ఉండగా, 2023లో ఈ రేటు ఒకటి కంటే తక్కువకు పడిపోయింది. అయితే, ఈ తగ్గుదల ప్రతి దేశంలోనూ సరళంగా లేదు. జనన రేటు పెరిగిన 1940, 1960 మధ్య యునైటెడ్ స్టేట్స్ బేబీ బూమ్ను అనుభవించింది.
అయితే ఇరాన్ ప్రభుత్వం ఇప్పుడు తగ్గుతున్న జనన రేటు గురించి ఆందోళన చెందుతోంది. దేశ జనాభా వేగంగా వృద్ధాప్యం అవుతోంది. పని చేసే వయస్సు జనాభాలో తగ్గుదల భవిష్యత్తులో ఆర్థిక ఒత్తిడిని పెంచుతుంది. అందువల్ల, ఇటీవలి సంవత్సరాలలో, ప్రభుత్వం ఎక్కువ మంది పిల్లలను ప్రోత్సహించడానికి ప్రోత్సాహకాలను ప్రారంభించింది. అయితే, మారుతున్న సామాజిక వైఖరులు , ఆర్థిక వాస్తవాల దృష్ట్యా ఈ సవాలు కష్టంగా కనిపిస్తోంది.
Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు అలర్ట్.. ఫిబ్రవరి 26వ తేదీ గురువారం ధరలు ఎలా ఉన్నాయో చూడండి..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Garikapati Narasimha Rao Telugu Latest News: ప్రస్తుతం సమాజంలో యువత అనుసరిస్తున్న కొన్ని ఇతర దేశాలకు సంబంధించిన పాశ్చాత్య ధోరణులపై ప్రముఖ ప్రవచనకర్త, సహస్రావధాని గరికిపాటి నరసింహారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.. పెద్దపల్లి జిల్లా మంథనిలోని బుధవారం రాత్రి ఏర్పాటుచేసిన ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రసంగిస్తూ.. లివింగ్ రిలేషన్షిప్ సాంస్కృతిపై కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వేదికగా గరికపాటి ఏమన్నారు? చర్చనీ అంశానికి గల కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ వంటి కొన్ని ప్రధాన నగరాల్లో లీవింగ్ రిలేషన్షిప్ అనే ఒక కొత్త దరిద్రం మొదలైందని గరికపాటి వ్యాఖ్యానించారు.. పెళ్లి అనే పవిత్ర బంధం లేకుండా ఒక అబ్బాయి తో పాటు ఒక అమ్మాయి కలిసి ఉండడం భారతీయ సాంస్కృతికి విరుద్ధమని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు.. ఇటువంటి పద్ధతులు సమాజానికి ఏ మాత్రం మంచివి కాదని.. వీటిని ప్రతి ఒక్కరు ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు.. అంతేకాకుండా ఇలాంటి ధోరణి వల్ల చాలామంది యువత చెడిపోతున్నారని ఆయన అన్నారు.
అంతేకాకుండా ప్రస్తుత కాలంలో యువత అంతా ప్రేమ పేరుతో తప్పుదోవ పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లికి ముందే కలిసి ఉండడం అనేది ప్రేమ కాదని.. అది కేవలం కా**మం మాత్రమేనని ఆయన కుండలు బద్దలు కొట్టి చెప్పారు. ప్రేమకు ఇష్టానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆయన ఈ సందర్భంగా వివరించారు.. ప్రేమ అనేది విశ్వవ్యాప్తమైనదని.. చాలా పవిత్రమైందని తెలిపారు. ఇష్టమనేది వ్యక్తికి సంబంధించిన తాత్కాలిక భావన మాత్రమేనని ఆయన అన్నారు..
ఇలాంటి వికృత పోగడాలు పెరగకుండా చూడాల్సిన బాధ్యత సమాజంపై తప్పకుండా ఉందన్నారు.. యువత తమ బాధ్యతలను గుర్తించి విలువతో కూడిన జీవనాన్ని గడపాలని ఆయన కోరారు.. మన సాంప్రదాయాలను గౌరవించినప్పుడే సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.. మంథనిలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు స్థానికులు పాల్గొని గరికపాటి ప్రవచనాలను ఎంతో ఆసక్తిగా విన్నారు. అంతేకాకుండా అక్కడి పెద్దలు ఆయనకు ప్రత్యేకమైన సత్కారం కూడా చేశారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Rabies Latest Telugu News: మనం ఎంతో ప్రాణంగా పెంచుకునే పెంపుడు జంతువులే కొన్నిసార్లు మన మన ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయి. ఇలాంటి ఘటనలు ఇప్పటివరకు ఎన్నో చోటుచేసుకున్నాయి.. సాధారణంగా కరిస్తే రేబిస్ వస్తుందని భయపడుతూ ఉంటా.. కానీ ఒక పెంపుడు కుక్క కేవలం నాకడం వల్ల మహిళ తన చేతులతో పాటు కాళ్ళను పోగొట్టుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పెంపుడు కుక్క నాకడం వల్ల ఆ యువతి తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
లండన్ కు చెందిన మంజీత్ సంఘ అనే మహిళ అనూహ్యమైన రీతిలో ప్రాణాపాయం ఎదురయింది.. గత కొద్ది రోజుల క్రితం ఆమె కాలిపై చిన్న గాయమైంది.. అయితే ఆమె పెంచుకుంటున్న కుక్క ఆ గాయాన్ని నాకేసింది.. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె తీవ్ర అనారోగ్య సమస్యలకు గురై.. ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది.. వైద్యులు ఆమెను పరీక్షించి షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.. దీనిని విన్న ఆమె కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఇలా జరిగి ఉంటుంది? దీనికి కారణాలు ఏంటి అని వెతుక్కోగా.. అసలు విషయం బయటపడింది..
కుక్క నాకడం వల్ల ఆమె రక్తంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా చేరి సెస్పిస్ అని తీవ్రమైన ఇన్ఫెక్షన్కు దారితీసింది.. దీనివల్ల ఆమె శరీరం అంతర్గతంగా పూర్తిగా దెబ్బ తింటూ వచ్చింది. ఆమె ఏకంగా 32 వారాలపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉంది.. చికిత్స సమయంలో ఆమె పలుమార్లు గుండెపోటుకు గురైనట్లు కూడా వైద్యులు చెప్పారు. ఇన్ఫెక్షన్ శరీరం మొత్తం పాకకుండా ఉండడానికి వైద్యులు తప్పని పరిస్థితుల్లో ఆమె రెండు కాళ్లతో పాటు రెండు చేతులను తొలగించాల్సి వచ్చింది.
సాధారణంగా కొన్ని కుక్కల నోటిలో ఉండే రకరకాల బ్యాక్టీరియాలు మానవ రక్తంలోకి చేరినప్పుడు సెప్సిస్ లాంటి ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడతాయి.. ఇది చాలా అరుదైనప్పటి.. శరీరానికి గాయాలు ఉన్నప్పుడు పెంపుడు జంతువులను దగ్గరకు రానివ్వడం లేదా అవి గాయాలు నాకడం వంటి పరిస్థితుల్లో ఇలాంటి జబ్బు వస్తుందని వైద్య నిపుణులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. తన జీవితంలో జరిగిన ఈ విషాదాన్ని హెచ్చరికగా ఉండాలని ఆమె పంచుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Nellore Municipal Corporation: నెల్లూరు నగర కార్పొరేషన్పై టీడీపీ జెండా ఎగిరింది. నెల్లూరు మేయర్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం కార్పొరేషన్ మేయర్ ఎన్నిక చేపట్టారు. ఈ సమావేశానికి ముందుగా తెలుగుదేశం పార్టీ మద్దతు కౌన్సిలర్లు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లి అక్కడ నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి 34 మంది కార్పొరేటర్లు కార్పొరేషన్కు చేరుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల అధికారి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో మేయర్ ఎన్నిక నిర్వహించారు.
Also Read: Collectors Transfer: మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్.. తెలంగాణలో 10 జిల్లాల కలెక్టర్లు బదిలీ
నెల్లూరు మేయర్గా 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాతను డిప్యూటీ మేయర్ రవికుమార్ యాదవ్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను మిగిలిన కౌన్సిలర్లు ఆమోదించడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు గైర్హాజరు కావడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి వెంకటేశ్వర్లు ప్రకటించారు. మేయర్ ఎన్నిక పత్రాన్ని ఆమెకు అందజేశారు. 9 నెలల కాలం దేవరకొండ సుజాత నెల్లూరు మేయర్గా కొనసాగనన్నారు. మేయర్గా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు దేవరకొండ సుజాత కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరు నగరం మేయర్ సుజాత ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చెందుతుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కార్పొరేషన్పై తెలుగుదేశం జెండా ఎగరవేసిన కార్పొరేటర్లందరికీ ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.
Also Read: Pawan Kalyan: జనసేన నాయకత్వంపై పవన్ కల్యాణ్ ఫైర్.. కౌంటర్ ఏదంటూ నిలదీత
ఎమ్మెల్యే సమన్వయం
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కార్పొరేటర్లు భేటీ సయ్యారు. ఎన్నికల సందర్భంగా సమాలోచనలు చేశారు. మేయర్ ఎన్నికపై కార్పొరేటర్లకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఎన్నిక సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు చేపట్టారు.
వైసీపీ నుంచి టీడీపీకి
నెల్లూరు నగర కార్పొరేషన్కు 2021 నవంబర్లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో 54 డివిజన్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే వైఎస్సార్సీపీ అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అనంతరం వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. గతేడాది డిసెంబర్లో అప్పటి మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమవగా.. దానికి ముందుగానే మేయర్ రాజీనామా చేశారు. దీంతో రెండు నెలలుగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇన్చార్జ్ మేయర్ పాలన కొనసాగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మేయర్ ఎన్నిక నిర్వహించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Privacy Display Feature: స్మార్ట్ఫోన్ వినియోగదారులకు ప్రైవసీ అనేది ఒక సవాలుగా మారుతూ వస్తోంది. ముఖ్యంగా బస్సులతో పాటు రైళ్లలో లేదా రద్దీగా ఉండే ప్రదేశాల్లో మనం ఫోన్ వాడుతుంటే.. మన పక్కన ఉండేవారు మన స్క్రీన్లో తొంగి చూడడం ఒక అలవాటైపోయింది. చాలామంది ఇది ఇబ్బందిగా మారుతూ వస్తోంది. ఈ సమస్యకు చెక్ పెడుతూ ప్రముఖ దిగ్గజ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ సాంసంగ్ తమ లేటెస్ట్ ప్రీమియం ఫోన్ సాంసంగ్ గెలాక్సీ s26 అల్ట్రా వినూత్న ఫీచర్తో మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లతో పాటు ప్రైవసీ ఫీచర్ని కూడా కలిగి ఉంటుంది.
ప్రైవసీ డిస్ప్లే ఫీచర్ను సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. సాంసంగ్ గాలక్సీ s26 అల్ట్రా లో ఈ ప్రత్యేకమైన ఫీచర్ అందుబాటులో ఉంది.. సాధారణంగా మనం ఫోన్ చూసినప్పుడు మన పక్కనున్న వారికి కూడా స్క్రీన్ కొన్ని సందర్భాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ కొత్త టెక్నాలజీ తో.. ఫోను నేరుగా చూసే వినియోగదారుడికి మాత్రమే స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది. పక్కనుంచి చూసేవారికి స్క్రీన్ చీకటిగా కనిపించడమే కాకుండా మసక మసకగా కనిపిస్తూ ఉండడం విశేషం..
స్క్రీన్ నుంచి వచ్చే కాంతి కేవలం 90 డిగ్రీల కోణంలో మాత్రమే ప్రసరించేలా ఈ డిస్ప్లేని రూపొందించినట్లు సాంసంగ్ కంపెనీ వెల్లడించింది. దీనివల్ల సైడ్ యాంగిల్స్ నుంచి చూసేవారికి ఏమి కనిపించదు. అంతేకాకుండా దానినే సైడ్ నుంచి స్పష్టంగా చూస్తే మసకగా కూడా కనిపించే అవకాశాలున్నాయి.. ఈ స్మార్ట్ ఫోన్ను నిలువుగా పట్టుకున్న.. సినిమాలు చూసేటప్పుడు అడ్డంగా తిప్పిన ప్రైవసీ ఫీచర్ అద్భుతంగా పనిచేస్తుంది..
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
అంతేకాకుండా వ్యక్తిగత చాట్ తో పాటు బ్యాంకింగ్ యాప్స్, పిన్ నెంబర్స్, పాస్వర్డ్ టైప్ చేసినప్పుడు పక్కన వారికి కనిపించకుండా ఇది అద్భుతమైన రక్షణగా నిలుస్తుందని సాంసంగ్ కంపెనీ గతంలోనే వెల్లడించింది. గజంలో ఇలాంటి ప్రైవసీ కోసం విడిగా స్క్రీన్ గార్డులను కొనుక్కునేవారు.. కానీ సాంసంగ్ ఇప్పుడు ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ తో పాటు హార్డ్వేర్ ల కలయికతో ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురావడం విశేషం. హైఎండ్ ఫీచర్లతో పాటు భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే వారికి సాంసంగ్ గాలక్సీ s26 అల్ట్రా వరంగల్ కంటే ఎక్కువని టెక్ నిపుణులు చెబుతున్నారు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
District Collectors Tranfers: తెలంగాణలో తరచూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరుగుతుండగా.. తాజాగా మరోసారి బదిలీలు జరిగాయి. ఈ సారి ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసారి పెద్ద ఎత్తున కలెక్టర్ల మార్పులు చేర్పులు జరిగాయి. కీలకమైన జిల్లా కలెక్టర్లను బదిలీ చేస్తూ.. ఇతరులకు బాధ్యతలు అప్పగించారు. వాటిలో జనగామ, గద్వాల, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Save Punarvika: చిన్నారి పునర్వికకు నారా లోకేశ్ అండ.. రూ.6 కోట్ల భారీ విరాళం
తెలంగాణలో మరోసారి పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాగునీటి శాఖ నుంచి రాహుల్ బొజ్జాను, ఆర్థిక శాఖ నుంచి సందీప్కుమార్ సుల్తానియాను, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ నుంచి ముషారఫ్ అలీ ఫరూఖీని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ ఫార్ములా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కుమార్కు విపత్తు నిర్వహణ శాఖ నుంచి బదిలీ చేయగా.. ఎలాంటి పోస్టు ఇవ్వకపోవడం గమనార్హం. ఈ ఫార్ములా కేసులో ప్రాసిక్యూషన్కు డీవోపీటీ అనుమతిచ్చిన నేపథ్యంలో ఆయనకు ఎలాంటి పోస్టు ఇవ్వలేదు.
Also Read: Milk Tragedy: తెలంగాణలో కల్తీపాలు తయారీ.. డబ్బు కోసం వ్యాపారి కక్కుర్తి
కొత్త జిల్లా కలెక్టర్లు
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్గా అనురాగ్ జయంతి నియామకం. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ స్థానం నుంచి బదిలీ
జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్గా రిజ్వాన్ బాషా షేక్. జనగామ కలెక్టర్ నుంచి బదిలీ
నారాయణపేట జిల్లా కలెక్టర్గా ప్రతీక్ జైన్. వికారాబాద్ కలెక్టర్ నుంచి బదిలీ
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్గా స్నేహ శబరీశ్. హనుమకొండ కలెక్టర్ నుంచి బదిలీ
కరీంనగర్ జిల్లా కలెక్టర్గా చిత్రా మిశ్రా నియామకం. ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ నుంచి బదిలీ
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా దీపక్ తివారీ నియామకం
మెదక్ కలెక్టర్గా ప్రతీమ సింగ్ నియామకం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్గా అంకిత్ నియామకం
హనుమకొండ జిల్లా కలెక్టర్గా చాహత్ బాజ్పేయ్
మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్గా ఖుష్బూ గుప్తా
విద్యుత్ శాఖలో కీలకమైన జీజీఎస్పీడీసీఎల్ సీఎండీగా ఉన్న ముషారఫ్ను బదిలీ చేసి జితేశ్ వి పాటిల్కు బాధ్యతలు అప్పగింత
కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్గా పమేలా సత్పత్తి బదిలీ. కరీంనగర్ కలెక్టర్ బాధ్యతల నుంచి తొలగించి కొత్త బాధ్యతలు అప్పగింత
సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్కు అదనంగా ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా బాధ్యతలు
బదిలీలు వీరే..
సంజయ్ కుమార్, సబ్యసాచి ఘోష్, దానకిశోర్, ఎన్ శ్రీధర్, రాహుల్ బొజ్జా, ఈ శ్రీధర్, గౌరవ్ ఉప్పల్, బీ విజేంద్ర, అద్వైత్ కుమార్ సింగ్, ఎం హనుమంత రావు, సిక్తా పట్నాయక్, ముషారఫ్ అలీ, రాహుల్ పాజ్, భవేశ్ మిశ్రా, కాత్యాయని దేవి, ఫణీంద్ర రెడ్డి, మంద మకరాండు, ఫైజన్ అహ్మద్, శివేంద్ర ప్రతాప్, పర్మార్ పింకేశ్ కుమార్ లలిత్ కుమార్, ఉమా శంకర్ ప్సాద్, జీ శ్యామల్ ప్రసాద్ లాల్, చంద్రయ్య, వైవీ గణేశ్, అబ్దుల్ హమీద్, వి వెంకటేశ్వర్లు, ఖీమ్యా నాయక్, విద్యసాగర్, సురేందర్ బదిలీలయ్యాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Vijay Rashmika Wedding Gift News: ఎన్నో ఏళ్లుగా అభిమానులు ఎదురుచూస్తున్న ఆ శుభఘడియ రానే వచ్చింది. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న వైవాహిక బంధంతో ఒకటయ్యారు. రాజస్థాన్లోని చారిత్రాత్మక నగరం ఉదయ్పూర్ వేదికగా, అత్యంత సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది.
రెండు సంప్రదాయాల కలయిక
ఈ వివాహ వేడుకలో ప్రత్యేకత ఏమిటంటే, ఇటు తెలుగు, అటు కొడవ (కూర్గ్) సంప్రదాయాలను గౌరవిస్తూ వేడుకలు నిర్వహించారు. ఉదయం 10 గంటల 10 నిమిషాలకు శాస్త్రోక్తంగా, హిందూ సంప్రదాయం ప్రకారం ముహూర్తం జరిగింది. పట్టు వస్త్రాల్లో వధూవరులు చూడముచ్చటగా మెరిసిపోయారు. రష్మిక పుట్టిన గడ్డ అయిన కూర్గ్ ఆచారాల ప్రకారం.. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు మరోసారి వివాహ తంతు నిర్వహించనున్నారు.
తెల్లవారుజాము నుంచే పెళ్లి పనులు మొదలయ్యాయి. గులాబీ రేకులు, సుగంధ ద్రవ్యాలతో కలిపిన నీటితో వధూవరులకు మంగళ స్నానాలు చేయించి, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూజలు నిర్వహించారు.
వరుడి తరపున ఖరీదైన కానుక
పెళ్లి వేడుకలో భాగంగా విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులు రష్మికకు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయం ప్రకారం.. వరుడి తరపు వారు పెళ్లి కుమార్తెకు కళ్లు చెదిరే బంగారు గాజులను బహుమతిగా అందజేశారు.
'విరోష్' ప్రేమాయణం..
'గీత గోవిందం' సినిమాతో మొదలైన వీరి పరిచయం, 'డియర్ కామ్రేడ్' సమయానికి ప్రేమగా మారింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తున్న మూడవ చిత్రం 'రణబాలి' షూటింగ్ దశలో ఉండగానే, ఈ జంట నిజ జీవితంలోనూ ఒక్కటవ్వడం విశేషం. రష్మిక కెరీర్ ఆరంభం నుండి విజయ్ ఆమెకు అండగా నిలవగా, రష్మిక కూడా దేవరకొండ కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉంటూ వస్తోంది.
Also Read: VI Recharge Plan 140: మొబైల్ యూజర్లకు తీపికబురు.. కేవలం రూ.140 లకే 28 రోజుల అన్లిమిటెడ్ కాలింగ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rajahmundry Milk Tragedy: ఏపీలోని రాజమండ్రిలో కల్తీ పాలు తాగి దాదాపు ఏడు మంది దాకా మృతిచెందడంతో ఏపీతోపాటు తెలంగాణలో తీవ్ర సంచలనం రేపింది. పాలను కూడా కల్తీ చేస్తున్న దుర్మార్గులపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పాలు తాగాలంటేనే భయమేస్తోంది. కల్తీ పాల ఘటనతో తెలుగు రాష్ట్రాల్లో అధికారులు పాల కేంద్రాలను పరిశీలిస్తున్నారు. పాల సేకరణ, పాల తయారీ, డెయిరీలను పరిశీలిస్తుండగా.. ఓ చోట కల్తీ పాలు తయారుచేస్తున్న పాల సేకరణ కేంద్రాన్ని పరిశీలించారు. దీంతో తెలంగాణ పోలీసులు ఆ వ్యాపారిని అరెస్ట్ చేసి పాలను సీజ్ చేశారు. మరో చోట డెయిరీలో పేలుడు సంభవించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Adulterated Milk Tragedy: పాలు కాదు కాలకూట విషం.. రాజమండ్రిలో ఆరేళ్ల బాలుడు మృతి
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచెడ్ గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్న స్థావరంపై ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. కడ్తాల్ మండలంలోని రావిచేడు గ్రామంలో శ్రీశైలం అనే వ్యక్తి పాల సేకరణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అక్రమంగా డబ్బులు సంపాదించాలని ఆలోచనతో కల్తీపాల తయారు చేస్తున్నాడు. ముడి సరుకులతో పాలను విక్రయిస్తున్నాడు. షాద్నగర్లో కల్తీ పాలు తయారు చేసే ముడి పదార్థాలు లూజ్ షుగర్, కాఫీ క్రీమ్, సాల్ట్ను కొనుగోలు చేసి కేంద్రంలో డెయిరీకి సరఫరా చేసేవాడు. సమాచారం తెలుసుకున్న మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు రావిచెడ్ గ్రామంలో శ్రీశైలం ఇంటిపై దాడి చేసి కృత్రిమంగా పాలను తయారు చేసే కేంద్రాన్ని గుర్తించారు. పాలతో పాటు వాహనాన్ని సీజ్ చేసి.. నిర్వాహకుడు శ్రీశైలాన్ని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కడ్తాల్ సీఐ గంగాధర్ తెలిపారు.
Also Read: Save Punarvika: చిన్నారి పునర్వికకు నారా లోకేశ్ అండ.. రూ.6 కోట్ల భారీ విరాళం
జనగామ జిల్లా పాల డైరీలో పేలుడు
జనగామ జిల్లా రఘునాథపల్లి గోవర్ధనగిరి గ్రామంలో ఉన్న శక్తి మిల్క్ డెయిరీలో పేలుడు సంభవించింది. మిల్క్ డెయిరీలో బాదం మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న రామ్ గోపాల్ రెడ్డి, వివేక్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. బాదం మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లోని కంప్రెషర్లో సాంకేతిక సమస్య కారణంగా పేలుడు జరిగినట్టుగా తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి