Gold Rate Today: పసిడి, వెండి ధరలు ఊహించని రీతిలో పెరుగుతూ.. రోజుకో సరికొత్త గరిష్ట రికార్డులను నమోదు చేస్తున్నాయి. గత కొంత కాలంగా అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోతపై పెరుగుతున్న అంచనాలు.. డాలర్ కదలికలు..ఇవన్నీ కలిసి విలువైన లోహాలపై పెట్టుబడులను మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. దీని ప్రభావం దేశీయ మార్కెట్లలో స్పష్టంగా కనిపిస్తోంది.
గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ తాజా గణాంకాల ప్రకారం.. బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,560కు చేరుకుని ఆల్టైమ్ రికార్డును సృష్టించింది. గత రోజు ధరతో పోలిస్తే ఇది రూ.2,400 పెరిగింది. అలాగే 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.2,200 పెరిగి రూ.1,27,010 వద్ద స్థిరపడింది. ఈ ధరలు సామాన్య కొనుగోలుదారులకు గట్టి షాక్ ఇస్తున్నాయి.
వెండి పరిస్థితి మరింత ఆందోళన కలిగించేలా ఉంది. కిలో వెండి ధర ఒక్కరోజులోనే రూ.3,100 పెరిగి రూ.2,34,100కు చేరి చరిత్రాత్మక గరిష్ఠాన్ని తాకింది. గత కొన్ని నెలలుగా వెండి ధరల్లో కొనసాగుతున్న ర్యాలీ ఇప్పుడు వేగం పెంచుకుంది. అమెరికా – వెనెజువెలా మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు.. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత వాతావరణం ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
డాలర్ విలువలో మార్పులు కూడా బంగారం ధరలపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. డాలర్ బలహీనపడినప్పుడు పెట్టుబడిదారులు సురక్షిత ఆశ్రయంగా బంగారాన్ని ఎంచుకుంటారు. ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు పెరగడంతో బంగారం మీద డిమాండ్ మరింత పెరిగింది. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ బలపడిన సందర్భాల్లోనూ ధరల ఊగిసలాట కనిపిస్తోంది.
ఈ ఏడాది పెట్టుబడుల విషయానికి వస్తే.. బంగారంతో పోలిస్తే వెండి పెట్టుబడులు అధిక లాభాలను ఇచ్చినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. పారిశ్రామిక అవసరాల కోసం వెండిపై డిమాండ్ గణనీయంగా పెరగడం, సరఫరా పరిమితంగా ఉండడం వల్ల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సోలార్ ఎనర్జీ రంగాల్లో వెండి వినియోగం పెరగడం ధరలకు మరింత బలం ఇస్తోంది.
బంగారం ధరలు ఈ స్థాయికి చేరుకోవడంతో సామాన్యులు ఆభరణాల కొనుగోలును వాయిదా వేసుకునే పరిస్థితి ఏర్పడింది. వెండి ధర కూడా ఏడాది కాలంలో దాదాపు రెట్టింపుకు పైగా పెరగడం విశేషం. ఈ పరిస్థితులు కొనసాగితే, రానున్న రోజుల్లో విలువైన లోహాల ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Tirumala Senior Citizen Darshan Free: కలియుగ ప్రత్యక్ష్య దైవం తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎంతో మంది నెలల తరబడి ఎదురుచూస్తుంటారు. అయితే కొందరికి ఇప్పటికీ అతని సేవలో తరించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. అందులోనూ ఆ దర్శనం ఉచితంగా కేవలం అరగంటలో దర్శనం అయిపోతుందంటే భక్తులు ఎగిరి గంతేస్తారు. ఇప్పుడదే విషయంపై సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.
శ్రీవారి దర్శనం కోసం 65 ఏళ్ల పైబడిన వారికి ఉచితంగా అది కూడా ఏరోజుకు ఆ రోజు టికెట్ లేకుండా దర్శనం కల్పిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇదే విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తీవ్రంగా స్పందించింది. వృద్ధుల కోసం కొత్తగా 'ఉచిత దర్శన పథకం' ప్రారంభమైందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, అవన్నీ తప్పుడు వార్తలని స్పష్టం చేసింది.
ఏం జరిగిందంటే?
గత కొన్ని రోజులుగా వాట్సాప్, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక సందేశం విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అందులో ఏముందంటే, "65 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఉచిత దర్శన పథకం ప్రారంభించారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు దర్శనం ఉండనుంది. ఎస్-1 కౌంటర్ వద్ద ఐడీ కార్డు చూపిస్తే చాలు.. కేవలం 30 నిమిషాల్లో దర్శనం పూర్తవుతుందని" అందులో రాసుంది. అయితే దర్శనం పూర్తయిన వెంటనే వృద్ధులకు ఉచిత భోజనం, వేడి పాలు అందిస్తారని.. ఏవైనా సహాయం కోసం 87722 77777 నంబర్ను సంప్రదించవచ్చని ఓ మెసేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుతోంది.
టీటీడీ ఖండన - అసలు నిజం ఇదీ!
ఈ వైరల్ మెసేజ్పై టీటీడీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. భక్తులు ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. వృద్ధుల కోసం ఎలాంటి కొత్త ఉచిత దర్శన పథకాన్ని టీటీడీ ప్రస్తుతానికి ప్రారంభించలేదు. వృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ ప్రతి నెలా ఒక నిర్దిష్ట కోటాను ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే విడుదల చేస్తుంది. ఆ టికెట్లు ఉన్న వారికి మాత్రమే ప్రత్యేక లైన్ ద్వారా దర్శనం కల్పిస్తారు.
హెచ్చరిక: సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక మెసేజ్లను చూసి నేరుగా తిరుమలకు వచ్చి ఇబ్బంది పడొద్దని భక్తులకు సూచించారు.
భక్తులు ఏం చేయాలి?
శ్రీవారి దర్శనం, టికెట్లు లేదా ఇతర సేవల గురించి సరైన సమాచారం కోసం కేవలం ఈ మార్గాలనే నమ్మాలని టీటీడీ కోరింది. అధికారిక వెబ్సైట్ లేదా టీటీడీ అధికారిక మొబైల్ యాప్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకునేందుకు వీలు ఉంది.
ముఖ్య సూచన: తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. భక్తులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.
Also Read: 8th Pay Commission: ఉద్యోగులకు గుడ్న్యూస్..జీతాల పెంపు అప్పటి నుంచే..ఎంత శాతం పెరుగుతుందంటే?
Also REad: January 2026 Holidays: జనవరిలో సెలవుల జాతర..13 రోజులు సెలవులే సెలవులు..పండగలతో ఫుల్ ఎంజాయ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
BP Control Foods: మన దేశంలో బీపీ పేషెంట్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. షుగర్, బీపీతో బాధపడుతున్నారు ఉన్నారు. వీరి డైట్లో కొన్ని ఫుడ్స్ చేర్చుకోవాలి. తద్వారా బీపీ నియంత్రణలో ఉంటుంది. అయితే కొన్ని వేదికల ప్రకారం మనం తీసుకునే ఫుడ్స్ ద్వారా కూడా బీపీ నియంత్రించవచ్చు. బీట్రూట్ బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ అవుతుంది. ఇది 24 గంటలు పైగా దీని ప్రభావం ఉంటుంది. అయితే రెగ్యులర్ డైట్ లో ఎలాంటి ఫుడ్స్ చేర్చుకోవాలి తెలుసుకుందాం.
కొవ్వు చేప..
కొవ్వు చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. సాల్మన్, మేకరల్, సార్డినైన్, ట్రౌట్ చేపలు తినాలి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రక్తనాళాలు కూడా ఉపశమనం కలిగిస్తాయి. ఈ చేపలు తీసుకోవడం వల్ల నైట్రైట్స్ రక్తనాళాల్లో కలిసి పోతాయి. బీపీ నియంత్రణలో ఉంటాయి.
ఆకుకూరలు..
ఆకుకూరల్లో పాలకూర, కాలే వంటివి తీసుకోవడం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటాయి. రక్తనాళాలకు ఉపశమనం కలిగిస్తాయి. మన శరీరంలో ఉండే అధిక సోడియం సమతులం చేస్తుంది. డైట్ లో ఈ ఆకుకూరలు చేర్చుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
బెర్రీ పండ్లు..
బెర్రీ జాతికి చెందిన పండ్లు డైట్లో చేర్చుకోవడం వల్ల కూడా బ్లడ్ ప్రెజర్ అదుపులో ఉంటుంది. స్ట్రాబెరీ, బ్లూబెర్రీ పండ్లు తీసుకోవాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళాలకు ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు రక్తపోటుని నియంత్రిస్తాయి. బెర్రీ పండ్లు తాజావి లేదా ఫ్రోజెన్ చేసినవి స్నాక్ లో తీసుకోవచ్చు.
కీవీ పండు..
కొన్ని నివేదికల ప్రకారం కీవీ పండులో కూడా బ్లడ్ ప్రెజర్ నియంత్రించే గుణం ఉంటుంది. వీటిలో విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన రక్తనాళాలకు సహాయపడతాయి. నైట్రిక్ ఆక్సైడ్ పెంచుతుంది. ఆక్సిడేటివ్స్ డామేజ్ కాకుండా కాపాడుతుంది. ఈ కీవీ పండు పుల్లగా తీపిగా ఉంటాయి. రెగ్యులర్ గా తాజాగా తినవచ్చు.
ఇవి మాత్రమే కాదు శనగలు, బీన్స్ వంటివి కూడా డైట్లో చేర్చుకోవాలి. వీటిని వారంలో ప్రతిరోజు ఏదో ఒక విధంగా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ అదుపులో ఉంటుంది. హైబీపీతో బాధపడుతున్న వాళ్ళు ఈ తృణధాన్యాలు కూడా తీసుకోవడం వల్ల ఫైబర్ పుష్కలంగా అందుతుంది. రక్తప్రసరణ మెరుగు చేస్తుంది. రక్తనాళాల పనితీరును మెరుగు చేస్తుంది. రెగ్యులర్గా ఏదో విధంగా వీటిని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
Read more: ఈ 5 ఆయుర్వేదిక్ ఇంటికి చిట్కాలు 2025లో ఎక్కువమంది ఫాలో అయ్యారు..!
Read more: ఈ 5 కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడే పండ్లు.. ఎలాంటి క్రీములు అవసరం లేదు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Bangladesh Dependence on India: భారత్, బంగ్లాదేశ్ ల మధ్య వాణిజ్య సంబంధాలు దశాబ్దాలుగా బలంగా కొనసాగుతున్నాయి. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు అనేక కీలక రంగాల్లో పరస్పరం ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ రోజువారీ జీవితం, పరిశ్రమలు, ఆహార భద్రతకు అవసరమైన అనేక వస్తువుల కోసం భారత్ పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. అయితే ఇటీవలి కాలంలో ద్వైపాక్షిక సంబంధాల్లో వచ్చిన ఒత్తిడి, అలాగే బంగ్లాదేశ్లోని అంతర్గత రాజకీయ అస్థిరత ఈ వాణిజ్య ప్రవాహాలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. సరఫరా గొలుసుల్లో అంతరాయం ఏర్పడితే.. అక్కడి ప్రజల రోజువారీ జీవితంపై గణనీయమైన ప్రభావం పడే పరిస్థితి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
భారత్ నుంచి దిగుమతి చేసుకునే కీలక వస్తువులు:
గోధుమలు.. బంగ్లాదేశ్ ఆహార భద్రతకు అత్యంత కీలకం. భారత్ నుంచి పెద్ద ఎత్తున గోధుమలు దిగుమతి అవుతుంటాయి. నిషేధానికి ముందు కాలంలో మాత్రమే భారత గోధుమల దిగుమతుల విలువ సుమారు 734 మిలియన్ డాలర్లకు పైగా ఉండగా.. ఇది లక్షల టన్నుల పరిమాణంలో జరిగింది. నిషేధం తరువాత కొంతమేర మినహాయింపులతో మాత్రమే సరఫరా కొనసాగింది.
బియ్యం: విషయంలో కూడా భారతదేశం ప్రధాన సరఫరాదారే. బాస్మతి కాకుండా సాధారణ బియ్యం రకాలను బంగ్లాదేశ్ తన దేశీయ అవసరాలు, ప్రభుత్వ నిల్వల కోసం భారత్ నుంచి దిగుమతి చేసుకుంటుంది.
చక్కెర మరో ముఖ్యమైన ఉత్పత్తి. ఆహార తయారీ పరిశ్రమతో పాటు గృహ వినియోగానికి కూడా ఇది అవసరం. ఒకే సంవత్సరంలో భారతదేశం నుంచి బంగ్లాదేశ్కు వందల మిలియన్ డాలర్ల విలువైన చక్కెర ఎగుమతి జరిగింది.
రోజువారీ వంటలో ఉపయోగించే ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, వెల్లుల్లి వంటి కూరగాయలు కూడా ప్రధానంగా భారత్ నుంచే వస్తాయి. వీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే, బంగ్లాదేశ్లో ధరలు ఒక్కసారిగా పెరిగిపోతాయి.
అదే విధంగా సుగంధ ద్రవ్యాలు, ఇతర ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు కూడా భారత ఎగుమతుల్లో ముఖ్యమైన భాగం. ఇవి అక్కడి వినియోగదారుల అవసరాలతో పాటు ఆహార పరిశ్రమను నిలబెడతాయి.
పరిశ్రమలకు కీలకమైన భారతీయ సరఫరాలు:
బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమకు పత్తి వెన్నెముక లాంటిది. భారతదేశం నుంచి వెళ్లే మొత్తం పత్తి ఎగుమతుల్లో సుమారు మూడవ వంతు బంగ్లాదేశ్కే చేరుతుంది. ఇది అక్కడి గార్మెంట్ రంగానికి కీలక ఆధారం. ఇదే కాకుండా శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు, ప్లాస్టిక్లు, ఉక్కు, విద్యుత్ పరికరాలు వంటి పారిశ్రామిక వస్తువులు కూడా భారత్ నుంచే పెద్ద ఎత్తున దిగుమతి అవుతాయి. మందులు, వైద్య పరికరాలు విషయంలోనూ భారతదేశం బంగ్లాదేశ్కు ప్రధాన సరఫరాదారుగా ఉంది.
భారతదేశంపై బంగ్లాదేశ్ ఆధారపడటానికి కారణాలు:
భౌగోళికంగా బంగ్లాదేశ్కు భారతదేశంతో 4,300 కి.మీ.లకు పైగా సరిహద్దు ఉంది. ఇది దాదాపు 94 శాతం భూసరిహద్దు భారత్తోనే పంచుకుంటుంది. ఈ సమీపత వల్ల రవాణా ఖర్చులు తక్కువగా ఉండటం, సరఫరా వేగంగా చేరడం బంగ్లాదేశ్కు పెద్ద లాభం. అందుకే చౌకగా, త్వరగా లభించే భారతీయ వస్తువులపై అక్కడి ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఆధారపడుతోంది.
వాణిజ్యం, అభివృద్ధిపై ప్రభావం:
ఇటీవలి సంవత్సరాల్లో భారత్–బంగ్లాదేశ్ ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 16 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. బంగ్లాదేశ్ భారత్కు ఎగుమతులు చేస్తున్నప్పటికీ, దిగుమతుల పరిమాణం ఎక్కువగా ఉంది. గత ఎనిమిదేళ్లలో భారత్ బంగ్లాదేశ్కు సుమారు 8 బిలియన్ డాలర్ల అభివృద్ధి సహాయాన్ని అందించింది. రహదారులు, రైల్వేలు, పోర్టులు వంటి మౌలిక వసతుల అభివృద్ధిలో ఇది కీలక పాత్ర పోషించింది.
ఈ సహకారం వల్ల షేక్ హసీనా పాలన కాలంలో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా విస్తరించింది. మొత్తం GDP, తలసరి ఆదాయం రెండూ భారీగా పెరిగాయి. అందుకే భారత్తో వాణిజ్య సంబంధాల్లో వచ్చే ఏ చిన్న అంతరాయం కూడా బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది.
Also Read: EPS Pension: రూ. 1000 నుంచి రూ. 7500కు పెన్షన్ పెంపు... ప్రభుత్వం కీలక అప్డేట్..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
8th Pay Commission Salary Hike: పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిత్యావసర ధరల భారంతో సతమతమవుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒక భారీ ఊరట లభించబోతోంది. 2025 డిసెంబరు 31 నాటికి 7వ వేతన సంఘం పదవీకాలం ముగియనుండటం వల్ల అందరి దృష్టి ఇప్పుడు 8వ వేతన సంఘం అమలుపైనే ఉంది. దీని ద్వారా వేతనాలు, కరువు భత్యం (DA), పెన్షన్లలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది.
నిబంధనల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 ఏళ్లకు ఒకసారి వేతన సంఘాన్ని సవరించాల్సి ఉంటుంది. ప్రస్తుత 7వ వేతన సంఘం గడువు డిసెంబర్ 31, 2025తో ముగుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అక్టోబర్ 2025లో 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి, దానికి సంబంధించిన విధివిధానాలను ఆమోదించినట్లు సమాచారం. కొత్త వేతన సంఘం అనగా 8వ వేతన సంఘం సిఫార్సులు జనవరి 1, 2026 నుండి అధికారికంగా ప్రారంభం కానున్నాయి.
జీతాలు ఎంత పెరగొచ్చు? (అంచనా)
గతంలో ఏర్పాటైన 6వ, 7వ వేతన సంఘాల గణాంకాలను పరిశీలిస్తే.. రాబోయే 8వ వేతన సంఘం సిఫారసు చేయనున్న జీతాల పెంపు ఏ స్థాయిలో ఉండబోతుందో ఒక అంచనాకు రావచ్చు.
| వేతన సంఘం | పెంపు శాతం (సుమారుగా) |
| 6వ వేతన సంఘం | 40% |
| 7వ వేతన సంఘం | 23% - 25% |
| 8వ వేతన సంఘం (అంచనా) | 20% - 35% |
ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. కనీస వేతనం, ఫిట్మెంట్ ఫ్యాక్టర్లో గణనీయమైన పెరుగుదల ఉంటుందని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి.
జీతం ఎప్పటి నుండి చేతికి అందుతుంది?
8వ వేతన సంఘం జనవరి 2026 నుండి అమల్లోకి వచ్చినప్పటికీ, పెరిగిన జీతం వెంటనే చేతికి అందకపోవచ్చు. ఎందుకంటే, కమిషన్ సిఫార్సులను సమర్పించిన తర్వాత కేంద్ర మంత్రివర్గం వాటిని ఆమోదించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. ఈ క్రమంలో పెరిగిన జీతాలు, పెన్షన్లు 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అమలులో జాప్యం జరిగినప్పటికీ, జనవరి 1, 2026 నుండి లెక్కగట్టి అరియర్స్ రూపంలో ప్రభుత్వం ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది.
గమనిక: పైన పేర్కొన్న సమాచారం వివిధ వర్గాల నుండి సేకరించిన అంచనాలపై ఆధారపడి ఉంటుంది. అధికారిక పెంపుదల, నిబంధనల కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే గెజిట్ నోటిఫికేషన్ చూడటం ఉత్తమం. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.
Also Read: January 2026 Holidays: జనవరిలో సెలవుల జాతర..13 రోజులు సెలవులే సెలవులు..పండగలతో ఫుల్ ఎంజాయ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
School Holidays In January 2026: మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాది (2026 సంవత్సరం)లోకి అడుగుపెట్టబోతున్నాం. సాధారణంగా కొత్త సంవత్సరం రాగానే అందరూ చూసేది క్యాలెండర్. అయితే రాబోయే జనవరి నెలలో ఎక్కువ పబ్లిక్ హాలీడేలు ఉండడం వల్ల సెలవుల పరంగా విద్యార్థులకు, ఉద్యోగులకు భారీ ఊరట కలగనుంది. పండగలు, ఆప్షనల్ హాలిడేస్, ఆదివారాలు అన్నీ కలిపి జనవరిలో దాదాపు 13 రోజులు సెలవులు రానున్నాయి. అయితే ఈ క్రమంలో 2026 జనవరిలో ఏఏ రోజులు సెలవులు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
న్యూఇయర్ వేడుకలు..
జనవరి 1 (గురువారం): న్యూ ఇయర్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆప్షనల్ హాలిడే ఉంది. చాలా విద్యాసంస్థలు కూడా దీనికి సెలవు ప్రకటిస్తాయి.
జనవరి 3 (శనివారం): హజ్రత్ అలీ పుట్టినరోజు సందర్భంగా ఆప్షనల్ హాలిడే.
జనవరి 4 (ఆదివారం): సాధారణ సెలవు.
సంక్రాంతి సందడి
తెలుగు వారి పెద్ద పండుగే కాకుండా తమిళనాడు, కర్ణాటకలో సంక్రాంతిని ఘనంగా జరుపుకొంటారు. ఈసారి సంక్రాంతి పండుగకు వరుస సెలవులు రానున్నాయి. జనవరి 10న రెండో శనివారం కారణంగా ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లకు సెలవు ఉండనుంది. ఆ తర్వాత జనవరి 11న ఆదివారం కావున సాధారణ సెలవు కానుంది.
అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14, 15, 16 (బుధ, గురు, శుక్ర).. అనగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగల నాడు వరుసగా మూడు రోజులు సెలవు రానుంది. ఏపీలో ఈ మూడ్రోజులు సాధారణ సెలవులు కాగా, తెలంగాణలో 16వ తేదీన (కనుమ) ఆప్షనల్ హాలిడేగా ఉంది.
జనవరి 17 (శనివారం): షబ్-ఈ మేరాజ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే.
జనవరి 18 (ఆదివారం): సాధారణ సెలవు.
గమనిక: విద్యార్థులకు జనవరి 10 నుండి 20 వరకు సంక్రాంతి సెలవులు ఉండే అవకాశం ఉంది.
రిపబ్లిక్ డే, లాంగ్ వీకెండ్..
నెల ఆఖర్లో మరో లాంగ్ వీకెండ్ మనకు స్వాగతం పలుకుతోంది. జనవరి 23న శుక్రవారం నాడు శ్రీపంచమి (వసంత పంచమి) సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఉండనుంది. అలాగే జనవరి 25న ఆదివారం కావడం వల్ల ఆ రోజున సాధారణ సెలవు కానుంది.
జనవరి 26 (సోమవారం): రిపబ్లిక్ డే (నేషనల్ హాలీడే). ఆది, సోమవారాలు వరుసగా సెలవులు రావడంతో పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారికి ఇది మంచి అవకాశం. ఈ విధంగా జనవరి నెలలో అత్యధికంగా 13 రోజుల పాటు సెలవులు వచ్చే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
PM Jan Aushadhi VS Dawa India: నేడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా డయాబెటిస్, హైపర్ టెన్షన్, కిడ్నీ సంబంధిత వ్యాధులు, లివర్ సంబంధిత వ్యాధులు, నరాల బలహీనతలు, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో దేశంలో అధిక ధరల కారణంగా చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు అవసరమైన ఔషధాలను కొనుగోలు చేయలేకపోతున్నారు. భారతదేశంలో వైద్య ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో.. తక్కువ ధరలకు నాణ్యమైన మందులు అందించడమే లక్ష్యంగా రెండు ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకొచ్చాయి. అవే పీఎం జన ఔషధి కేంద్రాలు, దావా ఇండియా స్టోర్లు. రెండింటి ఉద్దేశం ఒకటే అయినా.. నిర్వహణ విధానం, ధరల నిర్ణయం, విస్తరణ విధానంలో స్పష్టమైన తేడాలు ఉన్నాయి.
పీఎం జన ఔషధి అంటే ఏమిటి?
ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. 2008లో ప్రారంభమైంది. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేత్రుత్వంలో విస్త్రుతంగా అమలు అవుతోంది. భారతదేశ ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు దారి తీసిన ప్రధాన కార్యక్రమాల్లో ఇది ఒకటి. ఈ జన ఔషధి ఔషధాలు అధిక ఖర్చుతో కూడిన బ్రాండ్ ఔషధాలకు బదులుగా ప్రజలకు తక్కువ ధరకే లభించడం వల్ల వారిపై ఉన్న వైద్య ఖర్చుల భారాన్ని కూడా తగ్గిస్తున్నాయి. గ్రామీణ, అర్బన్ పేద ప్రజలు కూడా తక్కువ ధరలకే నాణ్యమైన ఔషధాలను కొనుగోలు చేసే అవకాశం లభించింది. ఈ స్కీమును దీనిని Bureau of Pharma PSUs of India (BPPI) నిర్వహిస్తోంది.
ఈ కేంద్రాల్లో ప్రధానంగా జెనరిక్ మందులు విక్రయిస్తారు. అంటే బ్రాండ్ పేరు లేకుండా.. అదే ఫార్ములాతో తక్కువ ధరకు ఔషధాలు లభిస్తాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10,000కు పైగా జన ఔషధి కేంద్రాలు ఉన్నాయి. ఇవి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ విస్తరించాయి. దేశంలో అత్యధికంగా ఉత్తర ప్రదేశ్ లో ఉన్నాయి. తర్వాత కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లోనూ వేగంగా విస్తరిస్తున్నాయి.
దవా ఇండియా అంటే ఏమిటి?
దవా ఇండియా ఒక ప్రైవేట్ ఫార్మసీ చైన్. దీనిని డాక్టర్ సుజయ్ సన్దర్ స్థాపించారు. దవా ఇండియా కూడా జెనరిక్ మందులనే విక్రయిస్తుంది. కానీ ఇది పూర్తిగా ఫ్రాంచైజీ మోడల్ మీద నడుస్తుంది. ప్రస్తుతం దావా ఇండియా స్టోర్లు 15కిపైగా రాష్ట్రాల్లో ఉన్నాయి. వేగంగా విస్తరిస్తూ, మెట్రో నగరాలు, టియర్-2, టియర్-3 పట్టణాలపై ఎక్కువ దృష్టి పెడుతోంది. సాధారణ దుకాణాలతో పోలిస్తే జనరిక్ షాపుల్లో మెడిసిన్స్ ధర తక్కువగా ఉంటాయి. అందుకే ప్రజలు జనరిక్ మెడికల్ షాపులను వెతుక్కుంటూ వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే దావా ఇండియా ఏర్పడింది. ఈ కంపెనీ ఉత్పత్తులు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. దవా ఇండయా స్టోర్లు దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నాయి. జనరిక్ ఔషధాలు, ఓటీసీ, సౌందర్య సాధనాలు, న్యూట్రాస్యూటికల్స్, ప్రొటీన్ సప్లిమెంట్స్, ఆయుర్వేద ఉత్పత్తుల విభాగంలో దవా ఇండియా సేవలను అందిస్తోంది. ముఖ్యంగా జనరిక్ ఔషధాలను తక్కువ ధరలకు అందించడం దీనికి ప్రధాన లక్ష్యం.
ఈ రెండింటిలో ఔషధాల ధరలు ఎందులో తక్కువ?
-ధరల విషయంలో రెండు కూడా బ్రాండ్ మందుల కంటే 50శాతం నుంచి 90శాతం వరకు తక్కువ ధరలకు ఔషధాలను అందిస్తాయి.
-పీఎం జన ఔషధి మందులు ప్రభుత్వ నియంత్రణలో ఉండటం వల్ల సాధారణంగా అత్యల్ప ధరలు ఉంటాయి.
-దవా ఇండియా మందులు కూడా చౌకగానే ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో జన ఔషధి కంటే స్వల్పంగా ఎక్కువ ఉండొచ్చు.
-అయితే దవా ఇండియా స్టోర్లలో ఒకే చోట అన్ని రకాల మందులు అందుబాటులో ఉండటం కొంతమందికి సౌకర్యంగా ఉంటుంది.
ఔషధాల నాణ్యతలో తేడా ఉందా?
ఈ రెండు వేదికల్లో విక్రయించే మందులు భారత ఔషధ నియంత్రణ సంస్థల అనుమతితో తయారవుతాయి. పీఎం జన ఔషధి మందులు ప్రభుత్వ పర్యవేక్షణలో తయారవుతాయి. దవా ఇండియా కూడా WHO-GMP ప్రమాణాలు పాటించే తయారీదారుల నుంచే మందులు తీసుకుంటుంది. అందువల్ల నాణ్యత పరంగా పెద్దగా తేడా లేదు. బ్రాండ్ పేరు మాత్రమే మారుతుంది.
అవుట్లెట్స్ ఎక్కడ ఎక్కువ?
-పీఎం జన ఔషధి: గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో విస్తృతంగా ఉన్నాయి.
-దవా ఇండియా: నగరాలు, అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?
-వైద్య ఖర్చులు భారీగా తగ్గుతాయి.
-దీర్ఘకాలిక వ్యాధుల మందులు చౌకగా లభిస్తాయి.
-ప్రభుత్వ, ప్రైవేట్ ఎంపికలు రెండూ అందుబాటులో ఉంటాయి.
-ఆరోగ్య భద్రత పెరుగుతుంది.
మీకు తక్కువ ధరకే మెడిసిన్స్ లభ్యం కావాలంటే.. పీఎం జన ఔషధి మంచిది. సులభంగా లభ్యత, ప్రైవేట్ సర్వీస్ అనుభవం కావాలంటే దవా ఇండియా అనుకూలం. రెండు కూడా సామాన్యుల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన వ్యవస్థలే అని చెప్పాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
RRB Group D Recruitment 2026: రైల్వే భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్, ఎలక్ట్రిక్, మెకానికల్, ట్రాఫిక్ విభాగాల్లో ఈ ఖాళీలు భర్తీ చేయనుంది. ఎన్నో రోజులుగా కేంద్ర ప్రభుత్వ కొలువు కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు ఇది బంపర్ ఛాన్స్. దేశవ్యాప్తంగా అన్ని జోన్లలో కలిపి 22 వేల గ్రూప్ డీ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఆర్ఆర్బీ ప్రధానంగా పూర్తిస్థాయి నోటిఫికేషన్ అయితే త్వరలో విడుదల కానుంది. దీనికి అర్హత 18 నుంచి 33 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులు. 2026 జనవరి 21 నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరోవైపు కేంద్ర బలగాల్లో 25 వేలకు పైగా పోస్టుల భర్తీకి కూడా ఇప్పటికే ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో 22 వేల గ్రూప్ డీ లెవెల్ 1 పోస్టుల భర్తీ చేయనుంది. ఎన్నో రోజులుగా రైల్వే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. మొత్తంగా 11 వేల వేకెన్సీలు పూర్తిగా ట్రాక్ మెయింటెనెన్స్ గ్రేడ్ 4 పోస్టులకు కేటాయించారు.
రైల్వే షార్ట్ నోటిఫికేషన్ ప్రకారం ట్రాక్ మెయింటెనెన్స్ గ్రేడ్ 4, పాయింట్స్మెన్ బీ అసిస్టెంట్ రోల్స్ లలో ఇంజినీరింగ్ ఎలక్ట్రికల్ మెకానికల్ డిపార్ట్మెంట్లలో వారికి భర్తీ చేయనున్నారు. వీరికి మొదట్లో రూ.18 వేల జీతం ప్రారంభంలో ఉంటుంది.
అర్హత..
ఆర్ఆర్బీ గ్రూప్ డీ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు. పదో తరగతి గుర్తింపు పొందిన బోర్డు నుంచి పొంది ఉండాలి. ఐటిఐ సర్టిఫికెట్ లేదా నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికెట్ కూడా తప్పనిసరి. ఇక వీరి వయసు 18 నుంచి 32 మధ్యలో ఉండాలి
అప్లై చేసుకునే విధానం..
రైల్వే రిక్రూట్ మెంట్ గ్రూప్ డీ పోస్టులు 2026 దరఖాస్తు చేసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా RRB వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అక్కడ హోం పేజీలో 'CEN 2026 గ్రూప్ డి' ఆప్షన్ ఎంపిక చేసుకుని మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. అక్కడ మీ వివరాలు నమోదు చేసి, స్కాన్ చేసిన ఫోటో, సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. చివరిగా నిర్దిష్ట ఫీజు చెల్లించి ప్రింట్ అవుట్ తీసి భద్రపరుచుకోవాలి.
ఎంపిక ప్రక్రియ..
ఆర్ఆర్బీ గ్రూప్ డీ పోస్టులకు 90 నిమిషాల కంప్యూటర్ బెస్ట్ పరీక్ష ఉంటుంది. మొత్తం 100 మార్కులకు జనరల్ సైన్స్ ,మ్యాథమెటిక్స్ నుంచి ఒక్కొక్కటి 25 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ 30 ప్రశ్నలు. జనరల్ అవేర్నెస్, కరెంట్ ఎఫైర్స్ 20 మార్కుల ప్రశ్నలు ఉంటాయి.
శారీరిక పరీక్ష..
పురుషులకు 100 మీటర్ల దూరాన్ని 35 కిలోల బరువుతో రెండు నిమిషాలు అధిగమించాలి. 1000 మీటర్ల పరుగు పందెం 4:15 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక స్త్రీలు 100 మీటర్ల దూరం 20 కిలోల బరువుతో రెండు నిమిషాల్లో అధిగమించాలి. 1000 మీటర్ల పరుగు పందెం 5: 42 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.
Read more: రైలు ప్రయాణీకులకు బ్యాడ్న్యూస్.. భారీగా టిక్కెట్ ఛార్జీల పెంపు..! ఏసీ, నాన్ఏసీ ధరలు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Business Ideas: ఆర్థికంగా ఎదగాలన్న బలమైన సంకల్పంతో ఉన్నవారికి ఉద్యోగం చేస్తే వచ్చే జీతం సరిపోదు. ఆదాయం వచ్చినంత వేగంగా ఖర్చులు, అవసరాలు, బాధ్యతలు, పొదుపులు అన్నీ పోయిన తర్వాత.. చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. అందుకే అదనపు ఆదాయ మార్గం తప్పనిసరిగా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. ఈ అవసరాన్ని గ్రహించిన కొందరు ఫ్రీలాన్సింగ్ వైపు అడుగులు వేస్తే.. మరికొందరు ఆన్లైన్ వ్యాపారాలు లేదా రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో అవకాశాలు వెతుక్కుంటారు. ప్రతి ఒక్కరూ తమ ఆసక్తులు, నైపుణ్యాలను బట్టి ఒక సైడ్ బిజినెస్ను ఏర్పాటు చేసుకుని అదనపు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.
ఈ క్రమంలో మరో లాభదాయకమైన.. కానీ చాలా మందికి పూర్తిగా తెలియని మార్గం అగ్రి–బిజినెస్. ముఖ్యంగా గంధపు చెట్ల సాగు ఒక దీర్ఘకాలిక పెట్టుబడిగా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశముంది. గంధపు చెక్కకు మన దేశంలోనే కాదు.. అంతర్జాతీయ మార్కెట్లో కూడా భారీ విలువ ఉంది. ప్రత్యేకమైన సువాసన, ఔషధ, ఆధ్యాత్మిక ఉపయోగాల కారణంగా దీనికి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. అయితే ఈ వ్యాపారంలో విజయం సాధించాలంటే సహనం, ప్రణాళిక, సరైన సంరక్షణ చాలా కీలకం.
గంధపు తోటల సాగు ప్రారంభించాలంటే ముందుగా సరైన భూమిని ఎంపిక చేసుకోవాలి. ఉష్ణమండల లేదా ఉపఉష్ణమండల వాతావరణం గంధపు చెట్లకు అనుకూలంగా ఉంటుంది. నేల రకం, వాతావరణ పరిస్థితులు దిగుబడిపై నేరుగా ప్రభావం చూపుతాయి. మంచి నాణ్యత గల విత్తనాలు లేదా మొలకలను ఎంపిక చేయడం అత్యంత ముఖ్యం. సాధారణంగా వీటిని ముందుగా నర్సరీల్లో పెంచి, తర్వాత తోటల్లో నాటుతారు. నీటిపారుదల, తెగుళ్ల నియంత్రణ, క్రమమైన కత్తిరింపు వంటి సంరక్షణ చర్యలు చెట్ల ఆరోగ్యానికి, నూనె అధికంగా ఉన్న హార్ట్వుడ్ అభివృద్ధికి అవసరం దోహదపడుతుంది.
గంధపు చెక్క సాగు తక్షణ లాభాలు ఇచ్చే వ్యాపారం కాదు. ఇది దీర్ఘకాలిక దృష్టితో చేయాల్సిన పెట్టుబడి. చెట్లు పూర్తిగా పరిపక్వం చెందడానికి సాధారణంగా 15 నుంచి 20 సంవత్సరాల వరకు సమయం పడుతుంది. సేంద్రీయ పద్ధతులు అనుసరిస్తే ఈ కాలాన్ని కొంత తగ్గించవచ్చు. చెట్లు పెరిగే కొద్దీ వాటి నుంచి ప్రత్యేకమైన సువాసన రావడం మొదలవుతుంది. ఆ దశలో జంతువులు, అక్రమంగా చెట్లు నరికి వేయే వారి నుంచి రక్షణ అవసరం అవుతుంది. ఇసుకతో నిండిన ప్రాంతాలు లేదా తీవ్రమైన మంచు వాతావరణం మినహా, గంధపు చెట్లు చాలా ప్రాంతాల్లో బతికే సామర్థ్యం కలిగి ఉంటాయి.
లాభాల విషయానికి వస్తే, గంధపు చెక్క వ్యాపారం నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. ఒక పూర్తిగా పెరిగిన చెట్టు నుంచి సంవత్సరానికి లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కొద్ది చెట్లతోనే మంచి ఆదాయం సాధించవచ్చు. పెద్ద స్థాయిలో సాగు చేసినవారికి ఇది కోట్ల రూపాయల వ్యాపారంగా మారే అవకాశమూ ఉంది.
అయితే.. ఈ రంగంలోకి అడుగుపెట్టే ముందు ప్రభుత్వ నిబంధనలను తప్పకుండా తెలుసుకోవాలి. గంధపు చెట్లను నాటుకోవడం చట్టబద్ధమైనదే అయినప్పటికీ, వాటి అమ్మకం ప్రభుత్వం నియంత్రణలో ఉంటుంది. అటవీ శాఖ అనుమతితోనే చెట్ల విక్రయం జరగాలి. అందువల్ల, చట్టపరమైన ప్రక్రియలను పాటిస్తూ ముందుకెళ్లినప్పుడే ఈ అగ్రి–బిజినెస్ నిజమైన లాభాలను అందిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Union Budget 2026: 2026-27 కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టే ముందు కేంద్రం ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సారి బడ్జెట్ రూపకల్పనలో సామాన్య ప్రజల అభిప్రాయలను నేరుగా చేర్చాలన్న ఉద్దేశ్యంతో.. పౌరుల నుంచి సూచనలు, సలహాలను ఆహ్వానిస్తోంది. పన్నులు, ద్రవ్యోల్బణం, ఉపాధి, అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలు వంటి అంశాలపై ప్రజలు.. ఇప్పుడు తమ అభిప్రాయాలను డైరెక్టుగా ప్రభుత్వానికి తెలియజేసే అవకాశాన్ని కల్పించింది. ఈ సౌకర్యం MyGov వేదిక ద్వారా అందుబాటులో ఉంది.
ప్రతి ఏడాది బడ్జెట్ కు సంబంధించి సాధారణ ప్రజల్లో అనేక ఆశలు, అంచనాలు ఉంటాయి. కొందరు పన్నుల భారాన్ని తగ్గించాలని కోరుకుంటే.. ఇంకొందరు ధరల పెరుగుదల నియంత్రణపై దృష్టి పెట్టాలని కోరుతుంటారు. అదేవిధంగా యువతకు ఉపాధి అవకాశాలు, రైతులకు మద్దతు ధరలు, మధ్య తరగతి కుటుంబాలకు ఊరట కల్పించే అంశాలను కూడా ప్రజల చర్చల్లో ముందుగా ఉంటాయి. అయితే ఇలాంటి అభిప్రాయాలను ప్రభుత్వానికి నేరుగా తెలిపేందుకు సరైన వేదిక ఉండకపోవడం ఒక ప్రధాన సమస్యగా మారింది. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసేందుకు కేంద్రం ప్రభుత్వం ముందడుగు వేసింది.
బడ్జెట్ మరింత సమగ్రంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలంటే.. పౌరుల అభిప్రాయం కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే సాధారణ పౌరులు గొంతు వినిపించాలి అనే ఐడియాతో MyGov ఫ్లాట్ ఫామ్ ద్వారా సూచనలకు ఆహ్వానిస్తోంది. ఈ వేదిక ద్వారా ప్రజలు తమ ఆలోచనలు.. సమస్యలు.. సలహాలు నేరుగా పంచుకునే ఛాన్స్ ఉంది. ఇక ప్రభుత్వానికి మీ సూచలను ఎలా పంపించాలన్న విషయం చాలా సులభంగా ఉంది.
-ముందుగా MyGov.in అనే అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
-హోం పేజీలో కిందికి స్క్రోల్ చేస్తే పాల్గొనండి.. దేశ నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొనండి అనే కేటగిరి కనిపిస్తుంది.
-అక్కడ చర్చించు ( Discuss) అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
-ఇప్పుడు కేంద్ర బడ్జెట్ 2026-27కు సంబంధించి ప్రత్యేక బ్యానర్ కనిపిస్తుంది.
-దానిపై క్లిక్ చేసి తర్వాత.. మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి.
-లాగిన్ అయ్యాక ఒక కామెంట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలను పంచుకోవచ్చు.
మరింత సులభంగా చేయాలనుకుంటే నేరుగా MyGov.in వెబ్ సైట్లోని బడ్జెట్ సూచనల పేజీకి వెళ్లి లాగిన్ అయిన తర్వాత మీ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. అదే విధంగా MyGov.in మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని.. యాప్ ద్వారానే ప్రభుత్వానికి నేరుగా సలహాలు పంపించే ఛాన్స్ ఉంది. పోర్టల్ లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. జనవరి 16వ తేదీ వరకు ప్రజలు తమ సూచనలు సమర్పించవచ్చు. ఆ తర్వాత వాటిని పరిశీలించి బడ్జెట్ సన్నాహాల్లో ఉపయోగించే ఛాన్స్ ఉంటుంది.
ప్రతి ఏడాది మాదిరిగానే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ను ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. 2026 ఫిబ్రవరి 1 ఆదివారం వచ్చినా.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అదే రోజున బడ్జెట్ సమర్పించే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. కాగా ఇప్పటికే బడ్జెట్ కు సంబంధించిన ప్లాన్స్ ప్రారంభం అయ్యాయి. మందుస్తు బడ్జెట్ సంప్రదింపుల్లో భాగంగా ఆర్థిక మంత్రి, ఆర్థిక నిపుణులు, పలు రంగాల ప్రతినిధులు, రైతుల సంఘాలతో సమావేశం నిర్వహిస్తున్నారు. వీరితోపాటు ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములు అయ్యే ఛాన్స్ లభించడం విశేషమని చెప్పాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Couple kissing and hugs in delhi metro video: ఇటీవల కాలంలో కొంత మంది యువతీ, యువకులు మరీ నీచంగా ప్రవర్తిస్తున్నారు. కామంతో మరీ బరితెగించి ప్రవర్తిస్తున్నారు. అసలు వారు చేస్తున్న పనులు చూస్తుంటే చుట్టుపక్కల ఉన్న వారు భయంతో పారిపోతున్నారు. బస్టాండ్ లు , రైల్వేలు, మెట్రోలు, పబ్లిక్ ప్రదేశాల్లో కామంతో పాడుపనులు చేస్తున్నారు. ఒకరికి మరోకరుముద్దులు పెట్టుకుంటూ, హగ్ లు చేసుకుంటున్నారు.
Delhi Metro में आपका स्वागत है 😄🚇 pic.twitter.com/WgBpUpvssA
— HasnaZarooriHai🇮🇳 (@HasnaZaruriHai) December 22, 2025
రన్నింగ్ కారుల్లో, బైక్ ల మీద పాడుపనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట బాగా వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇటీవల మెట్రోలు , రైల్వేలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారాయని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీ మెట్రొలో జరిగిన ఘటన నెట్టింట బాగా వైరల్గా మారింది.
ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువతీ, యువకులు డొర్ వద్ద నిలబడ్డారు. యువకుడు అమ్మాయి వెనకాల నిల్చొని ఆమెను కామంతో రెచ్చగొట్టాడు. ఆమెకు ముద్దులు పెడుతూ, హగ్ చేసుకున్నాడు. యువతి కూడా తానేం తక్కువనాఅన్నట్లుయువకుడ్ని వాటేసుకుని అతడి కామదాహన్ని తీర్చింది.
మొత్తంగా ఇద్దరు కూడా చుట్టుపక్కల జనాలు ఉన్నారన్న మినిమం విషయంకూడా మర్చిపోయి రోడ్డుపైన పశువుల్లా మారి రొమాన్స్ చేసుకున్నారు. వీరి యవ్వారంను కొంత మంది సీక్రెట్ గా రికార్డుచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. మరీ ఇంత బరితెగింపు ఏంటని ఫైర్ అవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Nihao China VS UPI One World: కొత్త ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే చైనా.. ఇప్పుడు విదేశీ ప్రయాణికుల కోసం ఈ మధ్యే నిహావో చైనా అనే కొత్త మొబైల్ యాప్ ప్రారంభించింది. ఈ యాప్ భారత్ లో అందుబాటులో ఉన్న యూపీఐ పిన్ వరల్డ్ సర్వీసుతో చాలా మంది దాన్ని పోల్చుతున్నారు. ఈ రెండు సర్వీసుల ముఖ్య ఉద్దేశ్యం విదేశీ పర్యాటకులకు ప్రయాణాన్ని సులభతరం చేయడమే అయినప్పటికీ.. వాటి విధానం.. ఫీచర్లు, ఉపయోగంలో భారీగా తేడాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నిహావో చైనా యాప్ ఏంటో..?యూపీఐ వన్ వరల్డ్ ఏంటి?.. ఈ రెండింటి మధ్య తేడాలు ఏంటో?.. తెలుసుకుందాం.
నిహావో చైనా యాప్ అంటే ఏమిటి?
నిహావో చైనా యాప్.. అనేది చైనాను సందర్శించే విదేశీ ప్రయాణికుల కోసం రూపొందించిన ఒక ఆల్-ఇన్-వన్ మొబైల్ యాప్. చైనాలో గూగుల్.. ఉబెర్.. వాట్సాప్ వంటి అంతర్జాతీయ యాప్లు పనిచేయవు. దీంతో అక్కడికి వెళ్లే పర్యాటకులకు నావిగేషన్.. కమ్యూనికేషన్.. చెల్లింపులు వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఈ సమస్యలకు పరిష్కారంగా చైనా ప్రభుత్వం నిహావో చైనా యాప్ను తీసుకొచ్చింది.
ఈ యాప్ ద్వారా డిజిటల్ చెల్లింపులు.. మ్యాప్లు.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వివరాలు.. బస్సు–మెట్రో సమాచారం.. లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్ వంటి అనేక సర్వీసులను ఒకే చోట పొందవచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ట్రాన్స్ క్షన్స్ చేసుకోవచ్చు. అక్కడి భాష గురించి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థానిక సర్వీసులను ఉపయోగించుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. అంతేకాదు వీసా సమాచారం, ఈ సిమ్ వివరాలు, పర్యాటక గైడ్ లైన్స్, ట్యాక్స్ రీఫండ్ సమాచారం వంటి ఇతర సౌకర్యాలను కూడా ఈ యాప్ అందిస్తుంది. ఈ యాప్ ద్వారా చైనాలో ప్రయాణం, నివాసం మరింత సులభంగా మారుతుంది.
UPI వన్ వరల్డ్ అంటే ఏమిటి?
UPI వన్ వరల్డ్ అనేది భారత్ వచ్చే విదేశీ ప్రయాణికుల కోసం రూపొందించిన డిజిటల్ చెల్లింపు సర్వీసు. ఇది ఒక ప్రత్యేక యాప్ కాదు.. కానీ UPI వ్యవస్థలో భాగంగా పనిచేసే సదుపాయం కల్పిస్తుంది. ఈ యాప్ ద్వారా విదేశీ పర్యాటకులు భారత్ లో తాత్కాలిక UPI IDని పొందుతారు. వారు తమ అంతర్జాతీయ బ్యాంక్ అకౌంట్స్ లేదా కార్డులను ఉపయోగించి మన దేశంలో UPI ద్వారా ట్రాన్స్ క్షన్స్ చేసుకోవచ్చు. హోటళ్లలో, రెస్టారెంట్లలో, దుకాణాల్లో, టాక్సీల్లో నగదు అవసరం లేకుండా సులభంగా డిజిటల్ పేమెంట్స్ చేయడానికి ఈ యాప్ సహాయపడుతుంది. విదేశీ కరెన్సీ మార్పిడి అవసరాన్ని తగ్గించడం ద్వారా పర్యాటకులకు ఇది చాలా అనుకూలంగా మారింది. భారతదేశాన్ని మరింత పర్యాటక స్నేహపూర్వక గమ్యస్థానంగా మార్చడంలో UPI వన్ వరల్డ్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పవచ్చు.
#China has launched “Nihao China” App for International Visitors
- Can register with your country's number. Indian number worked seamless.
- Add your Visa/MasterCard/JCB/Diners card to Top Up wallet for making payments while in China.
- Citywise merchant offers etc
- Book… pic.twitter.com/dUjQTFSCVo— Backpacking Daku (@outofofficedaku) December 21, 2025
నిహావో చైనా vs UPI వన్ వరల్డ్: తేడాలు ఏమిటి?
నిహావో చైనా ఒక ప్రత్యేకమైన మొబైల్ యాప్. UPI వన్ వరల్డ్ అనేది ట్రాన్స్ క్షన్స్ చేసే సర్వీస్ మాత్రమే. నిహావో చైనా యాప్లో చెల్లింపులతో పాటు మ్యాప్లు, ట్రాన్స్ లేషన్, రవాణా, eSIM, టికెట్ బుకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది మొత్తం ప్రయాణ అనుభవాన్ని కవర్ చేస్తుంది. UPI వన్ వరల్డ్ ప్రధానంగా డిజిటల్ చెల్లింపులకే పరిమితమని చెప్పాలి. ఇది భారతదేశంలో ఉన్నప్పుడు విదేశీ ప్రయాణికులు సులభంగా పేమెంట్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇతర ట్రావెల్ సంబంధించి సర్వీసులు ఇందులో ఉండవు.
భారత్లో ఇలాంటి యాప్పై డిమాండ్:
నిహావో చైనా యాప్ విడుదలైన తర్వాత.. భారత్లో కూడా విదేశీ పర్యాటకుల కోసం ఇలాంటి ఆల్-ఇన్-వన్ యాప్ ఉండాలనే డిమాండ్ సోషల్ మీడియాలో పెరిగింది. కేవలం చెల్లింపులకే పరిమితం కాకుండా.. మ్యాప్లు, ట్రాన్స్పోర్ట్, ట్రాన్స్ లేషన్, ట్రావెల్ గైడ్ వంటి అన్ని ఫీచర్లు ఒకే యాప్లో ఉండాలని పలువురు సూచిస్తున్నారు. భారత్ కూడా ఇలాంటి సమగ్ర యాప్ను ప్రారంభిస్తే.. విదేశీ పర్యాటకులకు దేశం మరింత ఆకర్షణీయంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read: EPS Pension: రూ. 1000 నుంచి రూ. 7500కు పెన్షన్ పెంపు... ప్రభుత్వం కీలక అప్డేట్..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
EPFO New Guidelines: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఈపీఎఫ్ఓ. ఈపీఎస్ కాంట్రిబ్యూషన్లలో ఉన్న తప్పులను సరిదిద్దుకునేందుకు ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ తాజాగా కొత్త గైడ్ లైన్స్ జారీ చేసింది. తప్పుగా లేదా అసంపూర్ణంగా జమ అయిన పెన్షన్ విరాళాల కారణంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తగ్గించడం, పెన్షన్ క్లెయిమ్లను సులభతరం చేయడం ఈ మార్గదర్శకాల ప్రధాన లక్ష్యంగా EPFO పేర్కొంది.
ఇప్పటివరకు అనేక సందర్భాల్లో పెన్షన్కు అర్హత లేని ఉద్యోగుల పేర్లపై EPS కాంట్రిబ్యూషన్లు జమ కావడం.. అలాగే అర్హత ఉన్న ఉద్యోగులకు సంబంధించిన విరాళాలు జమ కాకపోవడం వంటి లోపాలు చోటుచేసుకున్నాయని EPFO గుర్తించింది. ఈ కారణంగా పెన్షన్ సేవా కాలం లెక్కింపు.. క్లెయిమ్ ప్రాసెసింగ్.. తుది పరిష్కారాల్లో తీవ్ర జాప్యాలతోపాటు అయోమయం ఏర్పడింది. ఈ కేసులను వివిధ ఫీల్డ్ ఆఫీసులు వేర్వేరు విధానాల్లో నిర్వహించడంతో సమస్య మరింత క్లిష్టంగా మారింది. ఈ పరిస్థితిని మార్చేందుకు ఒకే విధమైన, స్పష్టమైన ప్రక్రియ అవసరమని EPFO భావించి ఈ కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది.
పెన్షన్కు అర్హత లేని ఉద్యోగుల విషయంలో... తప్పుగా EPS కు జమ చేసిన మొత్తాన్ని EPFO తిరిగి లెక్కిస్తుంది. ఆ మొత్తానికి సంబంధిత కాలానికి వర్తించే వడ్డీని కూడా జోడిస్తుంది. మినహాయింపు లేని సంస్థలలో, ఈ మొత్తం పెన్షన్ ఖాతా నుంచి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాకు ట్రాన్స్ ఫర్ అవుతుంది. అలాగే, ఉద్యోగి రికార్డులో నమోదైన తప్పుడు పెన్షన్ సర్వీస్ కాలాన్ని పూర్తిగా తొలగిస్తారు. మినహాయింపు పొందిన సంస్థల విషయంలో.. ఈ మొత్తాన్ని వడ్డీతో కలిసి సంబంధిత PF ట్రస్ట్కు బదిలీ చేసి.. ఉద్యోగి పెన్షన్ సర్వీసును రద్దు చేస్తారు.
అదే సమయంలో.. పెన్షన్కు అర్హత ఉన్నప్పటికీ తప్పుగా EPS నుంచి మినహాయించిన ఉద్యోగుల విషయంలో కూడా స్పష్టమైన విధానాన్ని EPFO ఖరారు చేసింది. అలాంటి ఉద్యోగులకు బకాయిలుగా ఉన్న EPS కాంట్రిబ్యూషన్లను వడ్డీతో సహా లెక్కించి, మినహాయింపు లేని సంస్థలైతే PF ఖాతా నుంచి పెన్షన్ ఖాతాకు బదిలీ చేస్తారు. ఉద్యోగి పెన్షన్ సేవా కాలం, అవసరమైతే నాన్-కంట్రిబ్యూటరీ కాలాన్ని కూడా రికార్డుల్లో చేర్చుతారు. మినహాయింపు పొందిన సంస్థలలో అయితే సంబంధిత PF ట్రస్ట్ ఈ మొత్తాన్ని EPFOకి బదిలీ చేస్తుంది.
ఖచ్చితమైన అకౌంటింగ్ కోసం అవసరమైన చోట నిధుల భౌతిక బదిలీలు తప్పనిసరిగా జరుగుతాయని EPFO స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలు దేశవ్యాప్తంగా అన్ని ఫీల్డ్ ఆఫీసుల్లో ఒకే విధంగా అమలు అవుతాయని.. దీని వల్ల ఉద్యోగుల పెన్షన్ హక్కులు మరింత భద్రమవుతాయని తెలిపింది. మొత్తంగా.. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో EPS లోపాల కారణంగా తలెత్తే పెన్షన్ సమస్యలు తగ్గి, ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత స్పష్టమైన పెన్షన్ రికార్డులు లభిస్తాయని EPFO చెబుతోంది.
Also Read: EPS Pension: రూ. 1000 నుంచి రూ. 7500కు పెన్షన్ పెంపు... ప్రభుత్వం కీలక అప్డేట్..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
RBI Repo Rate Cut: హోమ్ లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్ వంటి రుణాలు తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మరోసారి భారీ ఊరట కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కీలక పాలసీ రేట్లపై సానుకూల నిర్ణయం తీసుకునే దిశగా ఆర్బీఐ అడుగులు వేయవచ్చని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) విడుదల చేసిన తాజా నివేదిక సూచిస్తోంది. వచ్చే ఫిబ్రవరి 2025లో జరగనున్న మానీటరీ పాలసీ కమిటీ సమావేశంలో రెపో రేటును మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని ఆ నివేదిక పేర్కొంది.
ప్రస్తుతం రెపో రేటు 5.25 శాతంగా కొనసాగుతోంది. ఆర్బీఐ మరోసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే.. రెపో రేటు నేరుగా 5 శాతానికి దిగి వస్తుంది. ఇది రెపో రేటుకు అనుసంధానమైన అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గేందుకు దారి తీస్తుంది. ముఖ్యంగా హోమ్ లోన్, వెహికల్ లోన్ వంటి దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న వారికి నెలవారీ ఈఎంఐలు భారీగా తగ్గే అవకాశం ఉంది. దీంతో కుటుంబ బడ్జెట్పై ఉన్న భారం కొంతమేర తగ్గుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
యూబీఐ నివేదిక ప్రకారం.. ద్రవ్యోల్బణ పరిస్థితులు క్రమంగా నియంత్రణలోకి వస్తుండటం ఆర్బీఐకి అనుకూలంగా మారుతోంది. అంతర్గత ధరల ఒత్తిళ్లు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వడ్డీ రేట్లలో మరింత కోతకు అవకాశం ఉందని పేర్కొంది. బంగారం ధరల వల్ల వచ్చే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. మొత్తం ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఇంకా మితంగా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది.
ఇదే క్రమంలో 2026 ఫిబ్రవరి లేదా ఏప్రిల్లో జరిగే ద్వైమాసిక మానీటరీ పాలసీ సమీక్షలో కూడా మరోసారి 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందని యూబీఐ అంచనా వేస్తోంది. అగ్రెసివ్ పాలసీ వైఖరి కొనసాగితే.. 2026 ఫిబ్రవరి సమావేశంలో తుది దశ వడ్డీ కోత జరిగి రెపో రేటు 5 శాతానికి చేరుకోవచ్చని నివేదిక తెలిపింది. అయితే ఇది చివరి తగ్గింపు అవుతుందా? లేదా అంతకంటే దిగువకు కూడా వెళ్లే అవకాశముందా? అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదని పేర్కొంది.
ఇటీవలే డిసెంబర్లో జరిగిన మానీటరీ పాలసీ సమావేశంలో ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించిన సంగతి తెలిసిందే. దాంతో బ్యాంకులు కూడా తమ రెపో ఆధారిత రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాయి. అదే విధంగా వచ్చే ఫిబ్రవరిలో మరోసారి రేటు కోత జరిగితే, రుణగ్రహీతలకు మరింత ప్రయోజనం కలగనుంది. ముందున్న పాలసీ సమావేశాల్లో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI).. దేశ ఆర్థిక వృద్ధి రేటు (GDP) వంటి అంశాలు కీలక పాత్ర పోషించనున్నాయి. మొత్తం మీద చూస్తే.. వడ్డీ రేట్ల తగ్గింపుల పరంపర కొనసాగితే.. రాబోయే కాలంలో రుణగ్రహీతలకు మరింత ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: EPS Pension: రూ. 1000 నుంచి రూ. 7500కు పెన్షన్ పెంపు... ప్రభుత్వం కీలక అప్డేట్..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల మధ్య 8వ వేతన సంఘానికి సంబంధించిన చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ఈసారి ప్రధానంగా కనీస వేతనం ఎలా నిర్ణయించాలి? ఫిట్మెంట్ కారకం ఎంత ఉండాలి? అనే అంశాలపై దృష్టి కేంద్రీకృతమైంది. ప్రస్తుతం అమలులో ఉన్న వేతన నిర్ణయ విధానం కాలానికి అనుగుణంగా లేదని, నేటి జీవన వ్యయాలను పూర్తిగా ప్రతిబింబించడంలేదని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి.
వేతన సంఘం TORల్లో ఏముంది?
వేతన సంఘానికి నిర్దేశించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (TOR) ప్రకారం.. జీతాలు.. అలవెన్సులు.. ఇతర ప్రయోజనాలను సమగ్రంగా సమీక్షించి అవసరమైన మార్పులను సూచించడం కమిషన్ ప్రధాన బాధ్యత. ఈ ప్రక్రియలో మారుతున్న పని విధానాలు.. విభాగాల వారీ అవసరాలు.. ప్రభుత్వ ఆర్థిక భారం వంటి అంశాలను సమతుల్యం చేయాలని TOR స్పష్టం చేస్తుంది. అలాగే.. ప్రభుత్వ సేవలను ప్రతిభావంతులకు ఆకర్షణీయంగా మార్చడం.. ఉద్యోగుల్లో సామర్థ్యం, బాధ్యతాభావం పెరిగేలా జీత నిర్మాణం ఉండాలనే అంశాన్ని కూడా TORలో ప్రత్యేకంగా పేర్కొన్నారు.
కనీస వేతన సూత్రంపై ఈ వివాదం ఎందుకు ?
TORలో కనీస వేతనాన్ని ఏ సూత్రం ఆధారంగా నిర్ణయించాలనే అంశంపై స్పష్టత లేకపోవడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. పాత కాలానికి చెందిన ప్రమాణాల ఆధారంగా మాత్రమే వేతనాలను నిర్ణయించడం సమంజసం కాదని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుత జీవన పరిస్థితులు.. ఖర్చుల సరళి పూర్తిగా మారిపోయాయని.. అందుకే కొత్త సూత్రం అవసరమని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఏంటి?
ఇటీవలి సమావేశాల్లో NC-JCM ఉద్యోగుల పక్షం 8వ వేతన సంఘానికి కనీస వేతనంపై సమగ్ర ప్రతిపాదన ఇవ్వాలని నిర్ణయించింది. కనీస వేతనం కేవలం ఆహారం.. దుస్తుల ఖర్చులకు మాత్రమే పరిమితం కాకూడదని వారు స్పష్టం చేశారు. కనీస వేతనాన్ని నిర్ణయించేటప్పుడు ఈ అంశాలు తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి:
-పెద్దవారి రోజువారీ కేలరీ అవసరాలు
-కుటుంబ సభ్యుల సంఖ్య
-ఆహారం, దుస్తులు, ఇతర ఆహారేతర అవసరాల గురించి
-రేషన్ దుకాణాలు, సహకార మార్కెట్లలో వాస్తవ ధరల గురించి
-పండుగలు, సామాజిక బాధ్యతలకు అయ్యే ఖర్చులు
-మొబైల్, ఇంటర్నెట్, డిజిటల్ సేవలు వంటి సాంకేతిక అవసరాలు
-సాంకేతికత ఇక నుంచి విలాసం కాదని.. అది ప్రాథమిక అవసరంగా మారిందని ఉద్యోగ సంఘాలు స్పష్టంగా చెబుతున్నాయి.
7వ వేతన సంఘంతో పోలిస్తే కొత్త ప్రతిపాదన ఎలా భిన్నంగా ఉంది?
7వ వేతన సంఘం కనీస వేతనాన్ని 1957లో జరిగిన 15వ భారత కార్మిక సమావేశం ప్రమాణాల ఆధారంగా నిర్ణయించింది. ఆ సూత్రం ప్రకారం ఉద్యోగి.. అతని లేదా ఆమె జీవిత భాగస్వామి.. 14 ఏళ్ల లోపు ఇద్దరు పిల్లల అవసరాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఆ విధానం గౌరవనీయమైన జీవన ప్రమాణాలకు సరిపోతుందని అప్పట్లో భావించారు. అయితే.. మొబైల్ ఫోన్, ఇంటర్నెట్, వై-ఫై వంటి ఆధునిక అవసరాలకు సంబంధించిన ఖర్చులు అప్పట్లో ప్రత్యేకంగా లెక్కించలేదు. ఈ లోటును 8వ వేతన సంఘంలో సరిదిద్దాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
8వ వేతన సంఘం ప్రస్తుత స్థితి ఎలా ఉంది?
ప్రస్తుతం 8వ వేతన సంఘానికి సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. దాని పరిధి.. ప్రాధాన్యతలపై చర్చలు సాగుతున్నాయి. తుది సిఫార్సులు రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ.. కనీస వేతనం, పే మ్యాట్రిక్స్, ఫిట్మెంట్ కారకం వంటి అంశాలపై ఉద్యోగ సంఘాలు గట్టిగా తమ వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలోనే వేతన సవరణ వల్ల ప్రభుత్వ ఖజానాపై పడే ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేయడానికి వివిధ శాఖలు అంతర్గతంగా సన్నాహాలు మొదలుపెట్టాయి.
ఫిట్మెంట్ కారకంపై ఉద్యోగుల అంచనాలు ఎలా ఉన్నాయి?
ఫిట్మెంట్ కారకం అంశం కూడా ఉద్యోగుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. 6వ వేతన సంఘంలో ఫిట్మెంట్ కారకం సుమారు 1.86గా ఉండగా, 7వ వేతన సంఘం దానిని 2.57కి పెంచి కనీస ప్రాథమిక జీతాన్ని రూ. 18,000గా నిర్ణయించింది. ఇప్పుడు 8వ వేతన సంఘంలో ఇంకా ఎక్కువ ఫిట్మెంట్ కారకం ఉండాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. అయితే.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, గృహ ఖర్చులు, పిల్లల విద్య, వైద్య వ్యయాలు, సాంకేతిక జీవనశైలి ఖర్చులు దీనికి ప్రధాన కారణాలుగా వారు చెబుతున్నారు. కానీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, ఉద్యోగుల వాస్తవ అవసరాల మధ్య సమతుల్యత సాధించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారని అంచనా వేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
