Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad508211
Bandla Ganesh Padayatra: తిరుమలకు నిర్మాత బండ్ల గణేశ్ భారీ పాదయాత్ర..సీఎం చంద్రబాబు కోసం పవన్ కల్యాణ...
HDHarish Darla
Jan 18, 2026 07:01:47
Hyderabad, Telangana

Bandla Ganesh Sankalp Yatra: సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ తన ఇష్టదైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి మొక్కుకున్న మొక్కును తీర్చుకోవడానికి సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తాను పెట్టుకున్న 'సంకల్పం' నెరవేరినందుకు కృతజ్ఞతగా ఆయన ఈ పాదయాత్రను చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.

తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉండే నిర్మాత బండ్ల గణేశ్‌, ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక, భావోద్వేగ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. అప్పుడు చంద్రబాబు కోసం మొక్కుకున్న మొక్కును తీర్చుకోవడానికి తన ఇంటి నుంచే తిరుమలకు నడక ప్రారంభించనున్నారు.

ఏమిటా మొక్కు? ఎందుకీ యాత్ర?
గత వైకాపా ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో బండ్ల గణేశ్‌ తీవ్ర మనోవేదనకు గురైనట్లు ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబుపై వేసిన అభాండాలు తొలగిపోయి, ఆయన క్షేమంగా బయటకు రావాలని అప్పట్లో సుప్రీంకోర్టు గడపపై నిలుచుని స్వామివారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.

చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యాక, తన ఇంటి గడప నుండి తిరుమల కొండ వరకు పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నట్లు సినీ నిర్మాత బండ్ల గణేశ్ వెల్లడించారు. జనవరి 19న (సోమవారం) ఉదయం 9 గంటలకు షాద్‌నగర్‌లోని ఆయన నివాసం నుంచి ఈ 'సంకల్ప యాత్ర' మొదలవుతుంది. తన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని, ఇంటి ముందు కొబ్బరికాయ కొట్టి ఈ సుదీర్ఘ యాత్రను బండ్ల గణేశ్ ప్రారంభించనున్నారు.

ఇది రాజకీయం కాదు.. కేవలం కృతజ్ఞత!
ఈ యాత్ర గురించి బండ్ల గణేశ్‌ స్పందిస్తూ.. ఇది ఎటువంటి రాజకీయ ఉద్దేశంతో చేస్తున్న యాత్ర కాదని స్పష్టం చేశారు. "ప్రతి తెలుగువాడి ప్రార్థనల వల్ల చంద్రబాబు మళ్లీ అఖండ విజయం సాధించి, పూర్వ వైభవాన్ని పొందారు. ఇటీవల ఆయనపై ఉన్న కేసులన్నీ కొట్టేయడంతో నా మనసు కుదుటపడింది. నా కోరిక నెరవేర్చిన ఆ కలియుగ ప్రత్యక్ష దైవానికి నా మొక్కును చెల్లించుకుంటున్నాను" అని ఆయన పేర్కొన్నారు.

వందలాది కిలోమీటర్ల మేర సాగనున్న ఈ పాదయాత్ర ఇప్పుడు అటు సినీ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తన నాయకుడిపై ఉన్న అభిమానాన్ని బండ్ల గణేశ్‌ ఈ విధంగా చాటుకుంటున్నారు.

Also Read: TTD Special Darshan Tickets: తిరుమల వెళ్లే భక్తులకు సూపర్ గుడ్ న్యూస్..స్పెషల్ దర్శనం టికెట్లు విడుదల! ఎప్పుడో తెలుసా?

Also Read: PM Svanidhi Scheme: ఆధార్ కార్డు ఉంటే మీ అకౌంట్లోకి రూ.90 వేలు..ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేస్కోండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Jan 18, 2026 05:59:49
Tirupati Urban, Andhra Pradesh:

Tirumala April Quota Release Date: తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తీపి కబురు అందించింది. 2026 ఏప్రిల్ నెలకు సంబంధించిన దర్శనం, ఆర్జిత సేవలు, గదుల కేటాయింపు కోటాను విడుదల చేసే తేదీలను ప్రకటించింది. భక్తులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునేందుకు వీలుగా పూర్తి షెడ్యూల్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. గతంలో ఇంటర్నెట్‌లో దర్శనం ఇచ్చిన అనుమానాస్పద లింక్ ఇప్పుడు పూర్తిగా తీసివేయబడింది. ఈ క్రమంలో టికెట్లు విడుదలయ్యే తేదీలు, సమయాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1) జనవరి 19వ తేదీ ఉదయం 10 గంటలకు సుప్రభాతం, తోమాల వంటి ఆర్జిత సేవల 'లక్కీ డిప్' రిజిస్ట్రేషన్‌తో ప్రారంభమై, జనవరి 21వ తేదీ ఉదయం వరకు కొనసాగుతుంది. 

2) జనవరి 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం వంటి ఇతర ఆర్జిత సేవలు, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటా విడుదలవుతుంది.

3) జనవరి 23వ తేదీన ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక కోటా అందుబాటులోకి వస్తాయి. 

4) శ్రీవారి భక్తులు ఎంతగానో వేచి చూసే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లతో పాటు తిరుమల, తిరుపతిలో గదుల బుకింగ్ కోటా జనవరి 24న వరుసగా ఉదయం 10 గంటలకు.. మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి. 

5) చివరగా జనవరి 27న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి సేవ, పరకామణి సేవ కోటాను విడుదల చేయనున్నారు. భక్తులు ఈ తేదీలను గమనించి టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా సకాలంలో తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

ముఖ్య గమనిక..
జనవరి 19న రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి 21వ తేదీన లక్కీ డిప్ తీస్తారు. విజేతలు 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించాల్సి ఉంటుంది. భక్తులు కేవలం TTD అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలి. నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని TTD కోరింది. వేసవి సెలవుల కారణంగా ఏప్రిల్ నెలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, కాబట్టి టికెట్లు విడుదలైన వెంటనే బుక్ చేసుకోవడం మంచిది.

Also Read: Gorantla Madhav Arrest: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టుకు రంగం సిద్ధం..కోర్టు సీరియస్..నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ!

Also Read: AM Green Ammonia Inauguration: కాకినాడకు అంతర్జాతీయ ఖ్యాతి..ప్రపంచంలోనే అతిపెద్ద 'గ్రీన్ అమోనియా' ప్రాజెక్టుకు శంకుస్థాపన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
TKTA Kiran Kumar
Jan 18, 2026 05:39:20
Hyderabad, Telangana:

Telangana Chief Minister Revanth Khammam Tour: సీఎం  రేవంత్‌రెడ్డి నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించ నున్నారు. పాలేరు నియోజకవర్గంలో 362 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఇటు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం కాంగ్రెస్‌ మునిసిపల్‌ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఆ తర్వాత ఖమ్మంలో జరిగే సీపీఐ శతాబ్ది ముగింపు ఉత్సవాల సభకు హాజరై ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి మేడారం పయనవుతారు. 

హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరనున్న సీఎం రేవంత్‌ మద్దులపల్లి వద్ద హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ 108.60 కోట్ల రూపాయలతో జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కాలేజీ నూతన భవనాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే 45 కోట్ల రూపాయలతో నిర్మించిన మద్దులపల్లి నర్సింగ్‌ కళాశాల భవనాలను ప్రారంభిస్తారు. అలాగే మద్దులపల్లిలో 19.90 కోట్లతో నిర్మించిన వ్యవసాయ నూతన మార్కెట్‌ భవనాలను కూడా సీఎం ప్రారంభించనున్నారు. 

Read more:​ సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!

Read more:​  సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

ఇటు రూ. 162.54 కోట్లతో మున్నేరు వృథా జలాలను పాలేరు రిజర్వాయర్‌కు అనుసంధానం చేసే 9.5 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్‌ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మద్దులపల్లిలో మంత్రి పొంగులేటి అధ్యక్షతన జరిగే కాంగ్రెస్‌ మునిసిపల్‌ ఎన్నికల ప్రచార సభలో సీఎం పాల్గొంటారు.అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం ఎస్సార్‌ అండ్‌ బీజీఎన్నార్‌ కళాశాల మైదానంలో జరిగే సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు హాజరై ప్రసంగిస్తారు. తర్వాత హెలికాప్టర్‌లో మేడారం బయలుదేరి వెళ్తారు. సీఎం పర్యటనకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.

Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..

Also Read: ఒకప్పుడు తెలుగు సహా అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్.. నేడు రూ.2 వేల కోట్లకు యజమాని.. 5 కంపెనీలకు బాస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

0
comment0
Report
TKTA Kiran Kumar
Jan 18, 2026 05:36:30
Hyderabad, Telangana:

Sankratni Return Journey Full Traffic Jam:  సంక్రాంతి పండగ ముగియడంతో పల్లెలకు వెళ్ళిన ప్రజలు మళ్ళీ హైదరాబాద్‌ తిరుగు బాట పట్టారు. రిటర్న్‌ జర్నీతో  విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి రద్దీగా మారింది. దీంతో రిటర్న్‌ జర్నీలో ప్రజలు నరకయాతన చూస్తున్నారు. ఈ రోజు పుష్య బహుళ అమావాస్య అంతేకాదు సంక్రాంతి పండగ తర్వాత మాఘమాసం ముందు వచ్చే మౌనీ అమావాస్య కావడంతో చాలా మంది నిన్న సాయంత్రమే సొంతూళ్ల నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. ఆదివారం మౌనీ అమావాస్య మంచిది కాకపోవడంతో అందరు నిన్ననే పోలోమంటూ బయలు దేరడంతో ఒక్కసారిగా జాతీయ రహదారి కిక్కిరిసి పోయింది. 

ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, గుంటూరు, ఒంగోలు నెల్లూరు నుంచి వచ్చే వాహనదారులు హైదరాబాద్‌ హై వే పైకి  రావడంతో రద్దీ ఎక్కువైంది. రద్దీ ఏ మేరకు పెరిగిందంటే గుంటుపల్లి నుంచి ఇబ్రహీంపట్నం రింగు రోడ్‌ జంక్షన్‌ వరకూ దూరం  ఉన్న  5 కిలోమీటర్లు ప్రయాణానికి గంటన్నర పడుతోంది. 

Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..

Also Read: ఒకప్పుడు తెలుగు సహా అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్.. నేడు రూ.2 వేల కోట్లకు యజమాని.. 5 కంపెనీలకు బాస్..

అటు చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. వాహానాలకు స్పెషల్ ట్యాగ్స్ ఉన్నా.. వాహనాలు ఒక్కొక్కటిగా నెమ్మడిగా కదులుతున్నాయి. మొత్తంగా పంతంగి టోల్ ప్లాజా ఇపుడు జాతరను తలపిస్తోంది. మొత్తంగా కొన్ని గంటలు పట్టే సమయం కూడా వాహనాల రద్దీ నేపథ్యంలో మూడు నాలుగు గంటలు ఆలస్యమవుతుంది. మొత్తంగా ఈ రోజు కాకుండా రేపు కూడా జాతీయ రహదారిపై రద్దీ ఉండే అవకాశాలు లేకపోలేదు. దీంతో ప్రజలు రోడ్డుపైనే నరక యాతన అనుభవిస్తున్నారు. 

Read more:​  సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

Read more:​ సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
HDHarish Darla
Jan 18, 2026 05:34:06
Nunna, Vijayawada, Andhra Pradesh:

Gorantla Madhav Pocso Case: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విజయవాడ పోక్సో (POCSO) కోర్టు అతనికి షాక్ ఇచ్చింది. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేస్తూ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మైనర్ బాలికకు సంబంధించిన సున్నితమైన వివరాలను బహిర్గతం చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో, ఆయన విచారణకు గైర్హాజరు కావడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అసలేం జరిగింది?
గతంలో జరిగిన ఒక అత్యాచార ఘటనలో బాధితురాలైన మైనర్ బాలిక వివరాలను మాధవ్ మీడియా ముందు బహిర్గతం చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై అప్పటి మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.

పోక్సో చట్టం నిబంధన: ఏదైనా నేరానికి గురైన మైనర్ల పేర్లను, గుర్తింపును లేదా ఇతర సున్నితమైన వివరాలను వెల్లడించడం చట్టరీత్యా నేరం. దీనిని ఉల్లంఘించినందుకు మాధవ్‌పై ఈ కేసు ఫైల్ అయ్యింది.

కోర్టు ఆగ్రహానికి కారణం..
ఈ కేసు విచారణలో భాగంగా విజయవాడ పోక్సో కోర్టు గతంలోనే మాధవ్‌కు పలుమార్లు నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

కోర్టు ఆదేశాల నేపథ్యంలో గోరంట్ల మాధవ్ వర్గాల్లో కలకలం మొదలైంది. తనపై జారీ అయిన ఈ వారెంట్‌ను రద్దు (Recall) చేయాలని కోరుతూ మాధవ్ రేపు (సోమవారం) కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఒకవైపు మాజీ ఎంపీ కావడం, మరోవైపు అత్యంత సున్నితమైన పోక్సో కేసు కావడంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: EPS-95 Pension Hike: ఉద్యోగులకు పెన్షన్ ధమాకా..కనీస పెన్షన్ రూ.6,000కి పెంపు? బడ్జెట్‌లో ప్రకటన వచ్చే ఛాన్స్!

Also Read: Bank Holiday: వరుసగా 3 రోజులు బ్యాంకులు బంద్..బ్యాంకులో పని ఉంటే ఆ రోజు లోపే వెళ్లండి..ఎందుకంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 18, 2026 05:10:57
Hyderabad, Telangana:

Powerful Pancha Grahi Yoga Effect On Zodiac: మకర సంక్రాంతి తర్వాత మకర రాశిలో ఎన్నో గ్రహాల కలయిక జరుగుతోంది. దీనిని జ్యోతిష్య పరిభాషలో సంయోగంగా పిలుస్తారు. ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన యోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. ముఖ్యంగా సూర్యుడితో పాటు నాలుగు ప్రధాన గ్రహాలు సంయోగం చేయడంతో ఎంతో శక్తివంతమైన పంచగ్రహి రాజయోగం కూడా ఏర్పడుతుంది. జనవరి 19వ తేదీన సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు వంటి నాలుగు ప్రధాన గ్రహాలు కలయిక జరపబోతున్నాయి. దీని కారణంగానే ఎంతో శక్తివంతమైన ఈ యోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై తీవ్ర ప్రభావం పడుతుంది. మకర సంక్రాంతి సమయం తర్వాత 200 ఏళ్ల తర్వాత ఇలాంటి యాదృచ్ఛికం ఏర్పడిందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇంతటి శక్తివంతమైన ప్రభావంతో అద్భుతమైన లాభాలు పొందబోతున్న రాశులు ఏమో తెలుసుకోండి.

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
వృషభరాశి 
పంచగ్రహి రాజయోగం ప్రభావంతో వృషభరాశి వారికి అంతా అనుకూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా వీరికి అదృష్టం విపరీతంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరు అద్భుతమైన మతపారమైన కార్యక్రమాలు పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆకస్మాత్తుగా ఆర్థిక లాభాలు కూడా పొందుతారు. అలాగే వీరు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. పెండింగ్లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. ముఖ్యంగా కొత్త పరిచయస్తుల నుంచి భారీ మొత్తంలో లాభాలు కూడా పొందుతారు.  ప్రణాళిక బద్ధంగా పనులు చేయడం వల్ల ఎన్నో రకాల అద్భుతమైన లాభాలు పొందుతారు.

మకర రాశి 
200 ఏళ్ల తర్వాత ఏర్పడబోతున్న పంచగ్రహి రాజయోగంతో మకర రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉండబోతోంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అలాగే గౌరవం పెరగడమే కాకుండా ఊహించని స్థాయిలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో అనుభవజ్ఞులైన వ్యక్తులతో సంబంధాలు మరింత ఏర్పడతాయి. అలాగే ఇది భవిష్యత్తుకు ఎంతో ప్రయోజనకరంగా మారబోతోంది. ఈ సమయంలో భాగస్వామ్య జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల మంచి లాభాలు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

తులారాశి 
తులారాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా పంచగ్రహి రాజయోగ ప్రభావం చాలా లాభదాయకంగా ఉంటుంది. వీరికి నాలుగవ స్థానంలో ఈ యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో తులా రాశి వారికి భౌతిక సుఖాలు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా మూడు రంగాల్లో సానుకూలమైన మార్పులను పొందగలుగుతారు. ముఖ్యంగా వీరికి సామాజిక స్థితి కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఉద్యోగాలతో పాటు ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. అత్తమామలతో బలమైన సంబంధాలు కూడా ఏర్పడతాయి. అలాగే ఎప్పటి నుంచో వ్యాపారాలు చేయాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. అనుకోకుండా ఈ సమయంలో భారీ మొత్తంలో సంపాదనను కూడా పొందుతారు.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Jan 18, 2026 04:33:43
Hyderabad, Telangana:

Eating Papaya Empty Stomach Benefits: ఆరోగ్యంగా ఉండాలంటే సీజనల్ పండ్లు (ఫ్రూట్స్) తినడం ఎంత ముఖ్యమో అందరికి తెలిసిన సంగతే. అయితే ఏది ఏ సమయంలో తినాలో తెలుసుకోవడం కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం. ప్రకృతి నుంచి మనకు వచ్చిన పండ్లలో బొప్పాయి ఆరోగ్యానికి ఒక సంజీవని లాంటిది. ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల మీ శరీరానికి చేకూరే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. 

1. జీర్ణవ్యవస్థకు పవర్ బూస్టర్
బొప్పాయి పండులో పపైన్ (Papain) అనే ప్రత్యేక ఎంజైమ్ ఉంటుందట. ఇది ప్రోటీన్లను సులభంగా విచ్ఛిన్నం చేయడంలో సాయపడుతుంది. ఉదయాన్నే దీన్ని తీసుకోవడం వల్ల.. జీర్ణక్రియ వేగవంతం అవుతుందట. గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుండి శాశ్వత ఉపశమనం లభిస్తుంది. ప్రేగులలో పేరుకుపోయిన మురికి (Toxins) పూర్తిగా శుభ్రపడుతుంది.

2. బరువు తగ్గాలనుకునే వారికి వరం
బొప్పాయిలో కేలరీలు చాలా తక్కువ అయినా.. ఫైబర్ (పీచు పదార్థం) చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. తద్వారా మీరు అనవసరపు ఆహారం తినకుండా ఉండేందుకు సహకరిస్తుంది. మెటబాలిజం (జీవక్రియ) రేటును పెంచి, వేగంగా బరువు తగ్గడానికి ఇది సహాయం చేస్తుంది.

3. రోగనిరోధక శక్తి పెంపు
బొప్పాయి పండులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల అది మీ ఇమ్యూనిటీని (Immunity) పెంచుతుంది. జలుబు, దగ్గు వంటి సీజనల్ ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని మీ శరీరానికి అందిస్తుంది.

4. గుండె ఆరోగ్యం, కొలెస్ట్రాల్
బొప్పాయి పండులో ఉండే పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు.. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. అలాగే రక్తపోటును (B.P) నియంత్రణలో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయి.

5. మెరిసే చర్మం.. నల్లని జుట్టు
బొప్పాయి కేవలం ఆరోగ్యానికే కాకుండా సౌందర్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్-ఎ, సి, ఇ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. మొటిమలు, మచ్చలు, టానింగ్‌ను నివారిస్తాయి. జుట్టు ఆరోగ్యానికి కావాల్సిన పోషణను అందించి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.

ప్రతిరోజూ అల్పాహారానికి ముందు ఒక గిన్నె తాజా బొప్పాయి ముక్కలను మీ దినచర్యలో భాగం చేసుకోండి. ఇది మీ కిడ్నీల పనితీరును మెరుగుపరచడమే కాకుండా, రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది.

చిన్న సూచన: గర్భిణీ స్త్రీలు బొప్పాయిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం శ్రేయస్కరం. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.

Also Read: EPS-95 Pension Hike: ఉద్యోగులకు పెన్షన్ ధమాకా..కనీస పెన్షన్ రూ.6,000కి పెంపు? బడ్జెట్‌లో ప్రకటన వచ్చే ఛాన్స్!

Also Read: Most Gold Reserves: మూడో ప్రపంచయుద్ధానికి ముందు ఎవరి వద్ద ఎంత బంగారం? భారత్‌తో ఎన్ని టన్నులు ఉన్నాయి?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 17, 2026 14:25:31
Kakinada, Andhra Pradesh:

AM Green Ammonia Kakinada: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చే దిశగా ఒక చారిత్రాత్మక అడుగు పడింది. కాకినాడలో ఏఎమ్ గ్రీన్ (AM Green) సంస్థ ఏర్పాటు చేస్తున్న ప్రతిష్టాత్మక గ్రీన్ అమోనియా ప్లాంట్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు.

ప్రాజెక్టు ప్రత్యేకతలు:
పెట్టుబడి: 2 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 16,000 కోట్లకు పైగా).
విస్తీర్ణం: 495 ఎకరాలు.
ఉత్పత్తి సామర్థ్యం: ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా.
కాలపరిమితి: 2027 జూన్ నాటికి ఉత్పత్తి ప్రారంభం.

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం..
1. గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ఉత్పత్తిలో కాకినాడ త్వరలోనే ప్రపంచ కేంద్రంగా మారుతుందని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఇక్కడ తయారయ్యే గ్రీన్ అమోనియా జర్మనీ వంటి దేశాలకు ఎగుమతి కానుండటం తెలుగువారి గర్వకారణమని పేర్కొన్నారు.

2. ప్రధాని మోదీ నిర్దేశించిన 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంలో భాగంగా, ఏపీలో 160 గిగావాట్ల ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. గతంలో ఇదే ప్రాంతంలో గ్రే అమోనియా తయారయ్యేదని, ఇప్పుడు పర్యావరణానికి మేలు చేసే గ్రీన్ అమోనియా రాబోతోందని వివరించారు.

3. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన క్లీన్-గ్రీన్ ఎనర్జీ పాలసీ-2024 దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం తెలిపారు. 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' ద్వారా పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు ఇస్తున్నామని, కేవలం ఏడాది కాలంలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం విశేషమని అన్నారు.

4. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్‌కు రూ.1.19 మేర తగ్గించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటికే 29 పైసల భారాన్ని తగ్గించామని, ట్రాన్స్‌మిషన్ నష్టాలను కూడా అరికడతామని భరోసా ఇచ్చారు.

అదే విధంగా.. "చరిత్ర తిరగరాయడం తెలుగువాళ్లతోనే సాధ్యం. గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టే గ్లోబల్ సంస్థలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది" అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు

భవిష్యత్ ప్రణాళికలు - నాలెడ్జ్ ఎకానమీ..
క్వాంటం కంప్యూటింగ్: అమరావతిలో ఈ ఏడాది నుంచే క్వాంటం కంప్యూటింగ్ సేవలు ప్రారంభం కానున్నాయి.

ఏఐ డేటా సెంటర్: విశాఖలో 1 గిగావాట్ సామర్థ్యంతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది.

గ్లోబల్ హబ్: స్పేస్ టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో ఏపీని ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం పిలుపునిచ్చారు.

Also Read: EPS-95 Pension Hike: ఉద్యోగులకు పెన్షన్ ధమాకా..కనీస పెన్షన్ రూ.6,000కి పెంపు? బడ్జెట్‌లో ప్రకటన వచ్చే ఛాన్స్!

Also Read: Most Gold Reserves: మూడో ప్రపంచయుద్ధానికి ముందు ఎవరి వద్ద ఎంత బంగారం? భారత్‌తో ఎన్ని టన్నులు ఉన్నాయి?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 17, 2026 12:58:17
Hyderabad, Telangana:

Reserve Bank of India Notification 2026: ఎప్పటినుంచో ప్రభుత్వ ఉద్యోగం కోసం చదువుతూ ఉన్నారా? అయితే మీకోసం శుభవార్త.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో ఉన్న నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకొని ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలుస్తోంది. సెకండరీ స్కూల్ పాసైన ప్రతి ఒక్కరు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే, ఈ ఉద్యోగాల్లో భాగంగా ఖాళీలు, ఉద్యోగ అర్హత, ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలో? జీతాలు వివరాలు మనం ఎప్పుడు తెలుసుకుందాం..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీ కోసం గతంలో అక్టోబర్ 12వ తేదీన 5 సర్కిల్స్లో దాదాపు 572 ఆఫీస్ అటెండెంట్ ల నియామకాలకు అధికారిక నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా సర్కిల్లో వేరువేరు సంఖ్యలు ఖాళీలను అందుబాటులో ఉంచిన సంగతి అందరికీ తెలిసిందే.. ఇక హైదరాబాద్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ కు సంబంధించిన 37 ప్రత్యేకమైన అటెండెంట్ ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లు తెలిపింది. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఏదైనా బోర్డు నుంచి సెకండరీ స్కూల్ ఉత్తీర్ణత కలిగిన సర్టిఫికెట్ను కలిగి ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా జనవరి ఒకటి 2026 సంవత్సరం ముందుకంటే సెకండరీ స్కూల్స్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారి వయోపరిమితికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అభ్యర్థులు తప్పకుండా 18 సంవత్సరాలు నిండి ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా గరిష్టంగా 25 సంవత్సరాలు నిండి ఉండాలని నోటిఫికేషన్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. అలాగే ఇతర కేటగిరీలకు సంబంధించిన వ్యక్తులకు వయోపరిమితిలో మార్పులు కూడా ఉన్నాయి.

ఇక ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినెల రూ.25 వేల జీతం అందించబోతోంది. అలాగే గరిష్టంగా అభ్యర్థులకు రూ.53 వేల వరకు జీతం చేరే అవకాశాలు ఉన్నాయని నోటిఫికేషన్లో RBI క్లియర్‌గా పేర్కొంది. ఉద్యోగాలకు సంబంధించిన నియామక ప్రక్రియ వివరాల్లోకి వెళ్తే.. అర్హత కలిగిన ఉద్యోగ అభ్యర్థులు ఆన్లైన్ రాత పరీక్షకు హాజరు కావలసి ఉంటుంది. ఈ పరీక్షలు భాగంగా ప్రతి విభాగం నుంచి 30 మార్కులకు దాదాపు 30 పరీక్షల వరకు ఉంటాయి. ఇందులో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత నియామకం ఉంటుందట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

Also Read: EPS-95 Pension Hike: ఉద్యోగులకు పెన్షన్ ధమాకా..కనీస పెన్షన్ రూ.6,000కి పెంపు? బడ్జెట్‌లో ప్రకటన వచ్చే ఛాన్స్!

ఇక ఈ ఉద్యోగాలను అప్లై చేసుకోవాలనుకునేవారు నేరుగా ఆన్లైన్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ కనిపించే కొత్త దరఖాస్తును క్లిక్ చేసి అందులో అన్ని రకాల పత్రాలను అప్లోడ్ చేసి.. ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఒక్కొక్క అభ్యర్థి నుంచి రూ.450 వరకు పరీక్ష ఫీజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India)కు చెల్లించాల్సి ఉంటుంది. 

ఇక ఈ దరఖాస్తు ప్రక్రియ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ లో పేర్కొన్న వివరాల ప్రకారం.. 2026 సంవత్సరం జనవరి 15వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. చివరి తేదీ ఫిబ్రవరి నాలుగు వరకు ఉంటుందని నోటిఫికేషన్లో వెల్లడించారు. కాబట్టి ఆసక్తి కలిగిన అభ్యర్థులు పైన పేర్కొన్న తేదీలోగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైటు మాత్రమే సందర్శించాల్సి ఉంటుంది.
 

Also Read: EPS-95 Pension Hike: ఉద్యోగులకు పెన్షన్ ధమాకా..కనీస పెన్షన్ రూ.6,000కి పెంపు? బడ్జెట్‌లో ప్రకటన వచ్చే ఛాన్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Jan 17, 2026 12:45:11
Hyderabad, Telangana:

EPS-95 Pension Hike Update: ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) కింద పెన్షన్ పొందుతున్న లక్షలాది మంది ప్రైవేట్ రంగ రిటైర్డ్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో తీపి కబురు అందించే అవకాశం ఉంది. గత 12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కనీస పెన్షన్ పెంపుదలపై 2026 బడ్జెట్ సమావేశాల్లో స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

6 రెట్లు పెరగనున్న పెన్షన్ మొత్తం!
ప్రస్తుతం EPFO నిబంధనల ప్రకారం కనీస నెలవారీ పెన్షన్ కేవలం రూ.1,000 మాత్రమే ఉంది. దీనిని చివరిగా 2014లో సవరించారు. అయితే పెరిగిన ధరలు, జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ మొత్తాన్ని రూ.6,000కి పెంచాలని కార్మిక సంఘాలు, పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందిస్తే, పెన్షనర్ల ఆదాయం ఏకంగా ఆరు రెట్లు పెరగనుంది.

పెన్షన్ పెంపు ఎందుకు అవసరం?
2014 తర్వాత కనీస పెన్షన్‌లో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో ద్రవ్యోల్బణం ప్రభావం వల్ల పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలకు రూ.1,000 అనేది మందులు, నిత్యావసర వస్తువులకు కూడా సరిపోవడం లేదని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిరంతరం ప్రయోజనాలు అందుతున్న తరుణంలో, ప్రైవేట్ రంగ ఉద్యోగుల సామాజిక భద్రత కోసం EPS-95 పథకాన్ని అప్‌గ్రేడ్ చేయడం అనివార్యమని నిపుణులు భావిస్తున్నారు.

EPS 95 పథకం అంటే ఏమిటి?
ఇది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్వహించే సామాజిక భద్రతా వ్యవస్థ. ఉద్యోగి జీతం నుండి కట్ అయ్యే PF మొత్తంలో కొంత భాగం పెన్షన్ ఫండ్‌కు వెళ్తుంది. పదేళ్ల కంటే ఎక్కువ కాలం సర్వీస్ ఉన్న ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత ఈ పెన్షన్ పొందేందుకు అర్హులు.

ఎప్పుడు అమలులోకి రావచ్చు?
మీడియా నివేదికల ప్రకారం.. రాబోయే కేంద్ర బడ్జెట్‌లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అదే జరిగితే, EPFO చరిత్రలోనే ఇది అతిపెద్ద పెన్షన్ సవరణగా నిలిచిపోతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి ఈ పెంపు అమల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయి.

Also Read: Most Gold Reserves: మూడో ప్రపంచయుద్ధానికి ముందు ఎవరి వద్ద ఎంత బంగారం? భారత్‌తో ఎన్ని టన్నులు ఉన్నాయి?

Also REad: Bank Holiday: వరుసగా 3 రోజులు బ్యాంకులు బంద్..బ్యాంకులో పని ఉంటే ఆ రోజు లోపే వెళ్లండి..ఎందుకంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 17, 2026 12:34:18
Hyderabad, Telangana:

Honor Magic 8 Pro Air Price In India: హానర్ కంపెనీ తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ హానర్ మ్యాజిక్ 8 ప్రో ఎయిర్‌ పేరుతో లాంచ్ చేయబోతోంది. జనవరి 19వ తేదీన అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. చాలా రోజుల నుంచి వార్తల్లో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు వినియోగదారులకు అందుబాటులోకి రాబోతోంది. దీనిని కంపెనీ అద్భుతమైన ప్రాసెసర్ తో విడుదల చేయబోతోంది. ముఖ్యంగా ఈ మొబైల్ మల్టీ టాస్కింగ్ చేసే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ జంబో బ్యాటరీతో విడుదల కాబోతోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

హానర్ మ్యాజిక్ 8 ప్రో ఎయిర్ (Honor Magic 8 Pro Air) స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ మొదటగా జనవరి 19వ తేదీన చైనాలో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే, ఇప్పటికే ఈ మొబైల్‌కు సంబంధించిన ఎన్నో రకాల ఫీచర్ లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ బేస్ వేరియంట్ 16gb ర్యామ్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే దీనిని చైనా మార్కెట్లో LDY-AN00 మోడల్ నెంబర్‌తో విక్రయాలు ప్రారంభించబోతోంది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 9500 చిప్‌ ప్రాసెసర్‌తో విడుదల కాబోతున్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి.  

ఈ స్మార్ట్‌ఫోన్‌ పర్ఫామెన్స్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా గేమింగ్ చేసే యువతకు చాలా బాగా పనికి వస్తున్నట్లు త్వరలో కంపెనీ క్లైమ్ చేయబోతోంది. అలాగే ఇది 4 ఎఫిషియెన్సీ కోర్లు 2.70GHz వద్ద క్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా కంపెనీ మాలి-జి1-అల్ట్రా-ఎంసి12 ప్రాసెసర్‌ను కూడా అందించబోతోంది. అలాగే చాలా ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ 16 MagicOS 10 స్కిన్ ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. దీంతోపాటు ఇందులో కంపెనీ చాలా అద్భుతమైన డిస్ప్లేను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. 

Also Read: Samsung Galaxy F07: ఫ్లిప్‌కార్ట్‌లో సంక్రాంతి బంపర్‌ డిస్కౌంట్‌.. రూ.1,499కే Samsung Galaxy F07 మొబైల్..

ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన డిస్ప్లే వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.31-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండబోతుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీని వెనక భాగం కెమెరా మాడ్యూల్ చాలా స్టైలిష్ గా ఉండబోతోంది. ఇందులోని ప్రధాన కెమెరా 50-మెగాపిక్సెల్ ఉంటుంది. దీనికి తోడు అదనంగా మరో రెండు 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 64-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో ఎంతో శక్తివంతమైన 5500mAh బ్యాటరీని ప్యాక్‌ను కూడా కలిగి ఉంటుంది. దీనిని చార్జ్ చేసేందుకు ప్రత్యేకంగా 80W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్టును కూడా అందిస్తోంది. అలాగే ఇవే కాకుండా ఇందులో ఎన్నో రకాల ఫీచర్లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Samsung Galaxy F07: ఫ్లిప్‌కార్ట్‌లో సంక్రాంతి బంపర్‌ డిస్కౌంట్‌.. రూ.1,499కే Samsung Galaxy F07 మొబైల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Jan 17, 2026 12:04:38
Mumbai, Maharashtra:

Most Gold Reserves Countries: ప్రపంచ దేశాల మధ్య ఇప్పుడు ఒక నిశ్శబ్ద యుద్ధం జరుగుతోంది. అది ఆయుధాలతో కాదు.. 'బంగారం'తో! సామాన్యులు పెరుగుతున్న ధరలను చూసి బెంబేలెత్తుతుంటే, అగ్రరాజ్యాలు మాత్రం టన్నుల కొద్దీ పసిడిని తమ ఖజానాల్లో దాచుకుంటున్నాయి. ప్రపంచంలో అత్యధిక బంగారం ఎవరి దగ్గర ఉంది? ఈ రేసులో భారత్ ఎక్కడ ఉంది? అనే ఆసక్తికర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్ధిక మాంద్యం భయాలు, యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు కాగితపు కరెన్సీ కంటే 'బంగారం' మిన్న అని ప్రపంచ దేశాలు నమ్ముతాయి. అందుకే అమెరికా నుండి చైనా వరకు అగ్రరాజ్యాలన్నీ తమ ఆర్థిక భద్రత కోసం భారీగా పసిడిని నిల్వ చేస్తున్నాయి.

అత్యధిక బంగారు నిల్వలున్న టాప్ దేశాలు..
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న అధికారిక నిల్వలను గమనిస్తే అమెరికా తిరుగులేని అగ్రస్థానంలో ఉంది. ఆ వివరాలను కింది పట్టిక ద్వారా తెలుసుకుందాం.

దేశం బంగారు నిల్వలు (సుమారుగా)
అమెరికా 8,133 టన్నులు
జర్మనీ 3,351 టన్నులు
ఇటలీ 2,452 టన్నులు
ఫ్రాన్స్ 2,437 టన్నులు
రష్యా 2,332 టన్నులు
చైనా 2,264 టన్నులు
భారతదేశం 840 - 900 టన్నులు

ధరలు ఎందుకు ఆకాశాన్ని తాకుతున్నాయి?
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు చారిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి.

భౌగోళిక ఉద్రిక్తతలు: రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా (ఇజ్రాయెల్-హమాస్) ఘర్షణల వల్ల పెట్టుబడిదారులు సురక్షితమైన 'గోల్డ్' వైపు మొగ్గు చూపుతున్నారు.

డీ-డాలరైజేషన్: డాలర్‌పై ఆధారపడటం తగ్గించుకోవడానికి రష్యా, చైనా వంటి దేశాలు తమ వద్ద ఉన్న అమెరికన్ బాండ్లను అమ్మి, బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి.

కేంద్ర బ్యాంకుల వేట: గత రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు రికార్డు స్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల డిమాండ్ విపరీతంగా పెరిగింది.

భారతదేశం పరిస్థితి ఏంటి?
భారతీయులకు బంగారం అంటే కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్. కొన్ని అధికారిక నివేదికల ప్రకారం.. భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) వద్ద సుమారు 840 టన్నులకు పైగా బంగారం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బంగారం నిల్వ చేసుకున్న దేశాల్లో ప్రపంచంలో భారత్ ప్రస్తుతం 9వ స్థానంలో ఉంది.

మన దగ్గర ఉన్న అసలు సంపద ప్రజల దగ్గర ఉంది. భారతీయ గృహిణుల వద్ద సుమారు 25,000 టన్నులకు పైగా బంగారం ఉందని అంచనా. ఇది అమెరికా, జర్మనీ దేశాల మొత్తం నిల్వల కంటే ఎంతో ఎక్కువ!

చివరిగా ఒక్కమాటలో చెప్పాలంటే.. బంగారం ఇప్పుడు కేవలం అలంకరణ వస్తువు కాదు.. అది ఒక బలమైన ఆర్థిక ఆయుధం. భవిష్యత్తులో రాబోయే ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకోవడానికి పసిడి ఒక్కటే అసలైన రక్షణ కవచం. అందుకే సామాన్యుడి నుండి అగ్రరాజ్యం వరకు అందరి చూపు పసిడిపైనే!

Also REad: Bank Holiday: వరుసగా 3 రోజులు బ్యాంకులు బంద్..బ్యాంకులో పని ఉంటే ఆ రోజు లోపే వెళ్లండి..ఎందుకంటే?

Also Read: Blinq EV Car: ఆటో రిక్షా ధరకే ఎలక్ట్రిక్ కారు..కేవలం రూ.3 లక్షలకే EV కారు..5 నిమిషాల్లో ఛార్జింగ్ ఫుల్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 17, 2026 10:49:03
Hyderabad, Telangana:

Bank Holidays This Week: మీరు ఈ వారంలో బ్యాంకుకు వెళ్లి చేయాల్సిన పనులు ఏవైనా ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్యాలెండర్ ప్రకారం.. జనవరి 19 నుండి జనవరి 25 మధ్య ఎటువంటి అదనపు పండుగ సెలవులు లేనప్పటికీ, వారాంతపు సెలవుల కారణంగా బ్యాంకులు రెండు రోజులు మూసి ఉంటాయి.

వారాంతపు సెలవుల వివరాలు..
RBI నిబంధనల ప్రకారం.. ప్రతి నెల రెండో, నాలుగో శనివారాలతో పాటు అన్ని ఆదివారాలు బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఈ క్రమంలో జనవరి 24న నాల్గవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు పనిచేయవు. అలాగే జనవరి 25న ఆదివారం సాధారణ వారాంతపు సెలవు కారణంగా బ్యాంకులన్నీ మూసి ఉంటాయి.

జనవరి 26న 'గణతంత్ర దినోత్సవం' సెలవు
వారాంతపు సెలవుల వెంటనే సోమవారం, జనవరి 26న గణతంత్ర దినోత్సవం (Republic Day) సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. అంటే శని, ఆది, సోమవారాల్లో వరుసగా మూడు రోజులు బ్యాంకు సేవలకు అంతరాయం కలగనుంది. కాబట్టి వినియోగదారులు తమ బ్యాంకింగ్ పనులను జనవరి 23 (శుక్రవారం) లోపే పూర్తి చేసుకోవడం శ్రేయస్కరం.

బ్యాంకులు మూసి ఉన్నా అందుబాటులో ఉండే సేవలు ఇవే!
భౌతిక బ్యాంక్ శాఖలు పని చేయకపోయినప్పటికీ, డిజిటల్ సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయి.

ATM సేవలు: నగదు ఉపసంహరణ, బ్యాలెన్స్ విచారణ కోసం ATMలు యథావిధిగా పనిచేస్తాయి.

డిజిటల్ బ్యాంకింగ్: నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్ ద్వారా నిధుల బదిలీ (IMPS, NEFT, RTGS) చేసుకోవచ్చు.

UPI చెల్లింపులు: గూగుల్ పే, ఫోన్ పే వంటి UPI సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి.

కార్డ్ లావాదేవీలు: డెబిట్, క్రెడిట్ కార్డ్ ద్వారా ఆన్‌లైన్ లేదా షాపింగ్ మాల్స్‌లో చెల్లింపులు చేసుకోవచ్చు.

గమనిక: చెక్కుల క్లియరెన్స్, నగదు డిపాజిట్లు, కొత్త ఖాతాల ప్రారంభం వంటి శాఖలకు వెళ్లి చేయాల్సిన పనులకు మాత్రం ఈ సెలవు దినాల్లో వీలుండదు.

Also Read: Blinq EV Car: ఆటో రిక్షా ధరకే ఎలక్ట్రిక్ కారు..కేవలం రూ.3 లక్షలకే EV కారు..5 నిమిషాల్లో ఛార్జింగ్ ఫుల్!

Also Read: Siva Balaji Madhumitha: విడాకులకు రెడీ అయిన మరో టాలీవుడ్ కపుల్..శివబాలాజీ-మధుమిత బంధంలో విడాకుల సెగ?!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top