Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad508211
Actress Kidnapped: సీరియల్ హీరోయిన్ కిడ్నాప్..తాళి కట్టిన భర్తే దారుణంగా..ఏం జరిగిందంటే!
HDHarish Darla
Dec 18, 2025 10:30:25
Hyderabad, Telangana

Actress Chaitra Kidnap: ప్రముఖ సీరియల్ నటి చైత్ర ఆర్. కిడ్నాప్ వ్యవహారం ఇప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టిస్తోంది. తన ఏడాది కుమార్తె సంరక్షణను దక్కించుకోవడానికి ఆమె భర్త హర్షవర్ధన్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక అందిన సమాచారం. అయితే ఇందులో నిజనిజాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కలహాలే కారణమా?
సీరియల్ నటి చైత్ర సోదరి లీలా ఆర్. ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. చైత్ర, హర్షవర్ధన్‌లకు 2023లో పెళ్లి చేసుకున్నారు.  అయితే, గత ఏడెనిమిది నెలలుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్న క్రమంలో వారు విడివిడిగా ఉంటున్నారు. చైత్ర తన ఏడాది కుమార్తెతో కలిసి బెంగళూరులోని మాగడి రోడ్డులో నివసిస్తుండగా, హర్షవర్ధన్ హాసన్‌లో ఉంటున్నాడు.

పక్కా ప్లాన్‌తో కిడ్నాప్?
డిసెంబర్ 7న షూటింగ్ పని మీద మైసూర్‌కు వెళ్తున్నానని చైత్ర తన కుటుంబ సభ్యులకు చెప్పింది. అయితే ఈ కిడ్నాప్ ఆమె భర్త పన్నిన ముందస్తు వ్యూహమని పోలీసులు అనుమానిస్తున్నారు. హర్షవర్ధన్ తన సహచరుడు కౌశిక్‌కు రూ. 20,000 అడ్వాన్స్‌గా ఇచ్చి ఈ కిడ్నాప్‌కు ప్లాన్ చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో మైసూర్ రోడ్ మెట్రో స్టేషన్ వద్ద చైత్రను బలవంతంగా కారులోకి ఎక్కించుకుని బిడది మార్గం గుండా తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.

బిడ్డను ఇస్తేనే విడుదల.. బెదిరింపు కాల్స్!
కిడ్నాప్ జరిగిన కొద్దిసేపటికే (ఉదయం 10:30 గంటలకు) చైత్ర ఎలాగోలా తన స్నేహితుడు గిరీష్‌కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సాయంత్రం హర్షవర్ధన్ నేరుగా చైత్ర తల్లికి ఫోన్ చేసి అసలు విషయం బయటపెట్టాడు. చైత్ర సురక్షితంగా ఉండాలంటే.. తన కుమార్తెను చెప్పిన ప్రదేశానికి తీసుకురావాలని హర్షవర్ధన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. 

లేదంటే చైత్రను వదిలిపెట్టేదే లేదు అంటూ వార్నింగ్ ఇచ్చాడట. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాప్ చేసిన వారిలో ప్రధాన నిందితుడు హర్షవర్ధన్, వర్ధన్ ఎంటర్‌ప్రైజెస్ యజమాని, ఒక సినీ నిర్మాత ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

ALso Read: EPS-95 Pension Hike: ఉద్యోగులకు ముఖ్యగమనిక..రూ.7,500 పెన్షన్ పెంపుపై పార్లమెంట్‌లో మోదీ సర్కార్ క్లారిటీ ఇచ్చేసింది!

Also Read: Snake Dance Video: నాగిని పాటకు పాము డ్యాన్స్! ఒక్క రోజులోనే 2 కోట్ల వ్యూస్..విపరీతంగా వీడియో వైరల్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DDDharmaraju Dhurishetty
Dec 18, 2025 10:17:31
Bengaluru, Karnataka:

Realme Neo 8 Turbo 5G Launch Date In India: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Realme మీ తమ మరో కొత్త టర్బో సిరీస్ మొబైల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ 2026 సంవత్సరం లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు సమాచారం. విడుదలకు ముందే ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్స్‌తో పాటు స్పెసిఫికేషన్స్ కూడా ఇటీవల సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీని ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్‌ Realme Neo 8 Turbo పేరుతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మొబైల్‌కు సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ Realme Neo 8 Turbo స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది చాలా ప్రత్యేకమైన 6.8-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. దీంతోపాటు ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్టుతో రాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఎంతో శక్తివంతమైన కెమెరా సెట్ అప్ ను కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇది మోస్ట్ పవర్ఫుల్ లెన్స్‌తో 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఈ మొబైల్ హైయ్యండ్ మోడల్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉండబోతోంది. దీంతోపాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 8000 mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. 

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఇవే కాకుండా ఎన్నో రకాల స్పెషల్ ఫీచర్లను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ మొబైల్ HD+ రిజల్యూషన్‌తో 6.8-అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉండబోతోంది. దీంతోపాటు ప్రొటెక్షన్ కోసం ప్రత్యేకమైన ప్రొటెక్షన్ గ్లాస్ సపోర్ట్ ను కూడా అందిస్తోంది. ఇక ఇందులో ఇన్-డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ కూడా లభిస్తోంది. Realme Neo 8 Turbo స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ఇతర కెమెరా వివరాల్లోకి వెళ్తే.. అదనంగా ఈ మొబైల్‌కి 8MP అల్ట్రా-వైడ్ లెన్స్‌ కూడా లభిస్తుంది. దీంతోపాటు ఇది ఎంతో శక్తివంతమైన 8000 mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. దీనికి చాలా ప్రత్యేకమైన 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టు కూడా లభిస్తుంది.. ఇక ఈ మొబైల్ ను కంపెనీ Realme UI 7.0తో Android 16 ఆపరేటింగ్ సిస్టంతో విడుదల చేస్తుంది. 

Also Read: Kia Vision Ev: త్వరలోనే కియా నుంచి సూపర్‌ EV కారు.. ఇక మార్కెట్‌లో అద్భుతమే!

Realme నియో 8 టర్బో స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన విడుదల తేదీ వివరాల్లోకి వెళితే.. కంపెనీ ఈ మొబైల్‌కు సంబంధించిన విడుదల, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ అధికారిక సమాచారం ప్రకారం ఈ మొబైల్ ను మొదటగా చైనాలో 2026 సంవత్సరం రెండవ నెలలో లేదా మూడవ నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చైనాలో విడుదల చేసిన తర్వాతే ప్రపంచ మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Kia Vision Ev: త్వరలోనే కియా నుంచి సూపర్‌ EV కారు.. ఇక మార్కెట్‌లో అద్భుతమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Dec 18, 2025 08:52:32
Hyderabad, Telangana:

EPS-95 Pension Hike Update: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ కనీస నెలవారీ పెన్షన్‌ను ప్రస్తుతం ఉన్న రూ. 1,000 నుండి రూ. 7,500కి పెంచాలని ఎంతో కాలంగా పోరాడుతున్నారు. అయితే ఈ పెన్షన్ పెంపు ప్రక్రియ ఎందుకు సాధ్యం కావడం లేదనే విషయంపై కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పార్లమెంటులో స్పష్టత ఇచ్చింది. ఎంపీ రాజేష్ రంజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ప్రభుత్వం పెన్షన్ పెంపుదలకు ఎదురవుతున్న సవాళ్లను వివరించింది.

పెన్షన్ పెంచకపోవడానికి ప్రధాన కారణాలు ఇవే..
పెన్షన్ మొత్తాన్ని పెంచడానికి మోదీ ప్రభుత్వం ప్రధానంగా మూడు కారణాలను ప్రస్తావించింది. EPS-95 అనేది ఒక సామాజిక భద్రతా పథకం. ఇందులో వచ్చే ప్రయోజనాలు పూర్తిగా ఫండ్‌కు అందే సహకారంపై ఆధారపడి ఉంటాయి. అంటే, జమ అయ్యే నిధులను బట్టే పెన్షన్ చెల్లింపులు జరుగుతాయి.

నిబంధనల ప్రకారం ప్రతి ఏడాది ఈ ఫండ్‌ను ఆడిట్ చేస్తారు. 2019 మార్చి నాటి లెక్కల ప్రకారం.. ఈ పెన్షన్ ఫండ్‌లో భారీ లోటు ఉన్నట్లు గుర్తించారు. ఈ లోటు కారణంగా పెన్షన్ మొత్తాన్ని ఎక్కువకు పెంచడం ఆర్థికంగా సాధ్యం కాదని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

అదే విధంగా పెన్షన్‌ను జీవన వ్యయ సూచికతో అనుసంధానించడం లేదా కరువు భత్యం (డీఏ) కల్పించడంపై గతంలో ఒక కమిటీ అధ్యయనం చేసింది. అయితే పెన్షన్ ఫండ్ వాస్తవిక స్థితిని బట్టి ఇది ఆచరణాత్మకమైనది కాదని ఆ కమిటీ తేల్చిచెప్పింది.

EPS నిధి ఎలా సమకూరుతుంది?
ఉద్యోగుల పెన్షన్ నిధి ప్రధానంగా యజమాని మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహకారంతో ఏర్పడుతుంది. ఉదాహరణకు కంపెనీ యజమాని తరఫున ఉద్యోగి ప్రాథమిక వేతనం నుంచి 8.33% సహకారం అందితే.. కేంద్ర ప్రభుత్వం నుంచి 1.16 శాతం ఇవ్వాల్సి ఉంది. అయితే ఉద్యోగి కనీస వేతనం రూ.15,000 ఉన్న నేపథ్యంలో వారి పెన్షన్ రూ.7,500 పెంచడం పెద్ద సవాలుతో కూడుకున్న పని. ప్రస్తుతం ఉన్న రూ. 1,000 కనీస పెన్షన్‌ను నిర్ధారించడానికి ప్రభుత్వం ఇప్పటికే అదనపు బడ్జెట్ సపోర్ట్ అందిస్తోందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీంతో పెన్షన్ రూ.7,500 పెరుగుదల ఇప్పట్లో లేనట్టే అని తెలుస్తోంది.

Also Read: Chandrababu Awards: సీఎం చంద్రబాబుకు అరుదైన గౌరవం..దేశంలోని ప్రతిష్టాత్మక అవార్డు..సంతోషంలో నారా లోకేష్!

Also Read: Ayesha Takia Photo: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాగార్జున హీరోయిన్..'సూపర్' హీరోయిన్ ఆయేషా ఇప్పుడెలా ఉందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Dec 18, 2025 08:31:51
Hyderabad, Telangana:

Chandrababu Naidu Business Reformer Award: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. భారత్‌లోనే అత్యంత ఫేమస్ ఆర్థిక దినపత్రిక 'ది ఎకనామిక్ టైమ్స్' ఏటా అందించే ప్రతిష్టాత్మక అవార్డ్ ఫంక్షన్‌ను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాదికి గానూ 'బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్' (Business Reformer of the Year) అవార్డుకు ఏపీ సీఎం చంద్రబాబు ఎంపికయ్యారు. 

అవార్డుకు ఎంపికయ్యేందుకు ప్రధాన కారణాలు..
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్న చొరవను 'ది ఎకనామిక్ టైమ్స్' అవార్డ్స్ జ్యూరీ ప్రత్యేకంగా ప్రశంసించింది. ముఖ్యంగా రాష్ట్రంలో వ్యాపార అనుకూల విధానాల (Ease of Doing Business) అమలుకు ఈ అవార్డు దక్కింది. కీలకమైన పారిశ్రామిక సంస్కరణలు చేపట్టడం ద్వారా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ సంస్థలను ఆకర్షించి, ఏపీకి భారీగా పెట్టుబడులు తీసుకురావడంలో విజయం సాధించడం వంటి వాటిని ఆధారంగా చేసుకొని సీఎం చంద్రబాబును 'బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్'గా ఎంపిక చేశారు.

హేమాహేమీలతో కూడిన జ్యూరీ..
దేశంలోని అత్యున్నత స్థాయి పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, న్యాయవేత్తలతో కూడిన జ్యూరీ ఈ ఎంపిక చేసింది. దీనికి డెలాయిట్ సంస్థ సలహాదారుగా వ్యవహరించింది. జ్యూరీలోని సభ్యులుగా ఉన్న ప్రముఖుల్లో.. సునీల్ భారతి మిట్టల్ (భారతీ గ్రూప్ చైర్మన్), సజ్జన్ జిందాల్ (జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్), ఉదయ్ కోటక్ (కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకులు), డాక్టర్ దేవిశెట్టి (నారాయణ హెల్త్ వ్యవస్థాపకులు), నోయెల్ టాటా (టాటా ట్రస్ట్స్ చైర్మన్), అభిషేక్ మను సింఘ్వి (సీనియర్ న్యాయవాది) ఉన్నారు.

గతంలో విజేతల జాబితా ఇలా ఉంది..
'బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్' ప్రతిష్టాత్మక అవార్డును గతంలో దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రముఖులు అందుకున్నారు. ఇప్పటి వరకు అవార్డు అందుకున్న ప్రముఖులు వీరే..

2024: అశ్విని వైష్ణవ్ (కేంద్ర మంత్రి)

2023: ఎస్. జైశంకర్ (విదేశాంగ మంత్రి)

2021: నిర్మలా సీతారామన్ (ఆర్థిక మంత్రి)

2019: దేవేంద్ర ఫడణవిస్ (మహారాష్ట్ర మాజీ సీఎం)

అవార్డు ప్రదానోత్సవం ఎప్పుడు..
వచ్చే ఏడాది అనగా 2026 మార్చిలో నిర్వహించనున్న ఒక ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ అవార్డుకు ఎంపికైన సందర్భంగా రాష్ట్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, పార్టీ శ్రేణులు సీఎం చంద్రబాబుకు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also Read: Kedi Movie Director: టాలీవుడ్‌లో విషాదం..అక్కినేని నాగార్జున డైరెక్టర్ హఠాన్మరణం..యంగ్ డైరెక్టర్ మృతికి సంతాపం!

Also Read: Snake Dance Video: నాగిని పాటకు పాము డ్యాన్స్! ఒక్క రోజులోనే 2 కోట్ల వ్యూస్..విపరీతంగా వీడియో వైరల్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Dec 18, 2025 08:25:37
Hyderabad, Telangana:

Shani Dev Blessing Effect On Zodiac Telugu: నవంబర్ 28వ తేదీన శని గ్రహం మీన రాశిలో హీరోగమనం నుంచి సక్రమ మార్గంలోకి వచ్చింది. 2026 సంవత్సరం జూలై 26 వరకు ఇదే స్థితిలో శని గ్రహం కొనసాగుతూ ఉంటుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని నూతన సంవత్సరంలో రాగి పాదాలతో కొనసాగబోతోంది. కొన్ని కొన్ని సందర్భాల్లో శనిగ్రహం బంగారంతో పాటు వెండి పాదాలతో ముందుకు కొనసాగుతుంది. అలాంటిది 2026 సంవత్సరంలో ఈ గ్రహం రాగి పాదాలతో కదులుతోంది. శని గ్రహం రాగి పాదాలతో కదలడం వల్ల కృషికి ఫలితాలను అందిస్తుంది. అంటే ఈ సమయంలో కొన్ని రాశుల వారు ఎలాంటి పనులు చేసిన తప్పకుండా అద్భుతమైన విజయాలు సాధించుతారు. అంతేకాకుండా కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తూ ఉంటుంది. కాబట్టి అన్ని సంవత్సరాలతో పోలిస్తే 2026 సంవత్సరం శనిపరంగా చాలా మంచిది. ఈ సమయంలో శని రాగి పాదాలతో కదలడంతో అద్భుతమైన లాభాలు పొందబోతున్న రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రాశుల వారికి బోలెడు లాభాలు..
మకర రాశి 2026 సంవత్సరంలో మకర రాశి వారికి శని అనుగ్రహం లభించబోతోంది. ముఖ్యంగా రాగి పాదాలతో కదలడం వల్ల వీరికి అద్భుతమైన ఆర్థిక లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఎలాంటి ప్రయత్నాలు చేసినా విశేషమైన ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా భాగస్వామితో సంబంధాలు చాలా మధురంగా మారతాయి. అలాగే శత్రువులపై అఖండ విజయాలు సాధించుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆస్తుల కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో కొత్త పెట్టుబడుల నుంచి ఊహించని ఆదాయం పొందగలుగుతారు. అలాగే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అద్భుతమైన సమయంగా మారుతుంది.

మిథున రాశి
2026 సంవత్సరం మిధున రాశి వారికి కూడా గణనీయమైన మార్పులను తీసుకువస్తుంది. ముఖ్యంగా శని రాగి పాదాలతో ముందుకెళ్లడం వల్ల వీరికి పురోగతిపరంగా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా కెరీర్ పరంగా స్థిరత్వం కూడా లభిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా ఈ సమయంలో బయటపడే అవకాశాలున్నాయి. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా మారుతాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. అదృష్టం సహకరించి ఎన్నో రకాల ఆర్థిక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు ఈ సమయంలో కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అదృష్టం పెరిగి భారీ మొత్తంలో ఇతరులనుంచి డబ్బులు కూడా పొందగలుగుతారు. 

Also Read: Chatugrahi Yoga 2026: త్వరలో 4 గ్రహాల అరుదైన కలయికతో రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..

కన్యారాశి 
కన్యా రాశి వారికి శని రాగి పాదాలతో ముందుకు వెళ్లడం వల్ల చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా వీరికి ఉద్యోగాలు వ్యాపారాలపరంగా చాలావరకు కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు ఇతరుల సహకారం పొంది.. కార్యాలయాల్లో మంచి పేరు సంపాదించుకుంటారు. వ్యాపారాల్లో కూడా అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. కొత్త కొత్త బాధ్యతలు లభిస్తాయి. వీరికి సమాజంలో గౌరవంతో పాటు ఆర్థిక స్థిరత్వం కూడా లభిస్తుంది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇక ఎప్పటినుంచో దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న కన్య రాశి వారికి శని వీటి నుంచి విముక్తి కలిగించబోతున్నాడు. ప్రణాళికల బద్ధంగా పనులు చేయడం వల్ల అద్భుతమైన సంపాదనను పొందగలుగుతారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్య శాస్త్ర నిపుణుల నుంచి సేకరించింది. ఇది మీ నమ్మకాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. దీనిని జీ తెలుగు న్యూస్ ధృవీకరించదు.

Also Read: Chatugrahi Yoga 2026: త్వరలో 4 గ్రహాల అరుదైన కలయికతో రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Dec 18, 2025 07:58:30
Hyderabad, Telangana:

Giant Anaconda Latest Video Viral: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వింత పాములు, జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా కొంతమంది వీటిని చూసి ఇతరులకు షేర్ కూడా చేస్తున్నారు. చాలామంది పాముల వీడియోలు అంటే ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. అయితే తాజాగా   "Jay Prehistoric Pets" అనే ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన ఒక పాములకు సంబంధించిన షార్ట్ వీడియో వైరల్‌గా మారింది. వీడియోను చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఇతరులకు షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏంటో? దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

చాలామంది ఎన్నో రకాల వింత జంతువులను చూసి ఉంటారు. మరి కొంతమంది సోషల్ మీడియాలో పెద్ద పెద్ద పాములకు సంబంధించిన వీడియోలు చూస్తున్నారు. వీడియోలో కూడా అత్యంత పెద్ద అనకొండ పామును చూడొచ్చు. చాలామంది వీడియోలో కనిపించే అతి భారీ అనకొండ పరిమాణం చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. అందరికీ జయ్ బ్రూవర్ గురించి పరిచయం అక్కర్లేదు. ఆయన ఓ వన్యప్రాణి నిపుణులు. అయితే అతను రోజు పెంచుకుంటున్న పాములకు కావలసిన ఆహారాన్ని అందిస్తూ ఉంటాడు. అంతేకాకుండా వాటిని శుభ్రం చేయడం వంటివి కూడా చేస్తాడు. ఇలాంటి సమయాల్లోనే వీడియోలు తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. తాజాగా ఇలా పోస్ట్ చేసిన వీడియోనే ఇప్పుడు వైరల్‌గా మారింది. 

ఈ వీడియోలో.. జయ్ బ్రూవర్ అత్యంత ప్రమాదకరమైన ఓ అనకుండా పాము తోకను పట్టుకొని ఉండడం మీరు చూడొచ్చు. ఆ పాము ముందుకు కదలడం కూడా మీరు క్లియర్‌గా గమనించవచ్చు. అతను ఆ పాము తోక పట్టుకున్నప్పటికీ.. ఆ పాము ముందుకు పాకుతూ ఉండడం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే, ఈ వీడియోలో ఆయన.. నా అనకొండ నీ అనకొండ కంటే పెద్దది అంటూ మాట్లాడడం మీరు చూడొచ్చు.  ఆ పాము ఎంతో పెద్దదిగా ఉన్నప్పటికీ.. ఆయనపై ఏమాత్రం దాడి చేయకుండా కేవలం నేలపై పాకుతూ ఉండడం మీరు చూడొచ్చు. అయితే ఇది పెంపుడు పాము కావడంతో అతనిపై దాడి చేయలేకపోతుందని కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు భావిస్తున్నారు.

సాధారణంగా ఈ వీడియోలో కనిపించిన దానికంటే అనకొండ పాములు మరింత పొడుగు ఉంటాయి. అంతేకాకుండా అత్యంత భారీ శరీరాన్ని కలిగి ఉంటాయి. ఇవి టన్నుల సంఖ్యలో బరువుంటాయి. పెద్ద పెద్ద జంతువులను సైతం ఎంతో సులభంగా ఆహారంగా చేసుకుని తింటూ ఉంటాయి. అందుకే చాలామంది వీటిని పెంచుకునేందుకు భయపడుతూ ఉంటారు. అలాగే ఇవి కేవలం అమెజాన్ అడవులకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది ఈ పాములను పట్టుకొని పరిశోధన శాలల్లో ఉంచి.. వాటిపై పరిశోధనలు కూడా చేస్తున్నారు.

Also Read: King Cobra Video: ఏంగుండెరా వాడిది.. 20 అడుగుల కింగ్ కోబ్రాతో ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్.. వీడియో మీకోసం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Dec 18, 2025 07:47:13
Hyderabad, Telangana:

Giant Green Anaconda Viral Video Watch: ప్రకృతిలో అనేక వింతలు విశేషాలకు సంబంధించిన వీడియోలు నిత్యం ఏదో ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా సరిస్కృపాలకు సంబంధించిన వీడియోలైతే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి సోషల్ మీడియా వినియోగదారులను ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడవక మానదు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన బరువైన గ్రీన్ అనకొండ ఒక యువకుడి మెడకు చుట్టుకొని అతనిని ఊపిరాడకుండా చేయడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ వీడియో ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.

వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. వీడియోలో కనిపించే ఓ యువకుడు అత్యంత భారీ అనకొండ పాములు తన భుజాలపై వేసుకుంటూ ఉంటాడు. ఆ పాము భారీ బరువుతో ఉండడం వల్ల మోయడానికి కూడా ఎంతో కష్టంగా అనిపించడం మీరు ఈ వీడియోలో యువకుడిని చూస్తే అర్థమయిపోతుంది. వీడియో మొదట్లో అంత సాధారణంగానే ఉన్నట్లు కనిపించడం మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఆ తర్వాత ఒక్కసారిగా అనకొండ తన శరీరంతో ఆ వ్యక్తి మెడను గట్టిగా చుట్టేయడం మొదలుపెడుతుంది. అనకొండ పాములు ఆహారాన్ని సమకూర్చుకోవడానికి ఏమాత్రం విషాన్ని వినియోగించవు.. వాటికి ఉన్న బలమైన కండరాలతో జంతువులను చుట్టుకొని ఊపిరాడకుండా చేస్తాయి. ఇందులో భాగంగానే ఆ యువకుడు మెడకు అనకొండ పాము చుట్టుకోవడం మీరు చూడొచ్చు.

ఆ అనకొండ పాము యువకుడి మెడకు చుట్టుకున్న సమయంలోనే వీడియోలు మాట్లాడడం మీరు చూడొచ్చు. అయితే ఇదే సమయంలో ఆ పాము దాని కండరాలను ఎంతో గట్టిగా సంకోచించడంతో యువకుడికి ఊపిరాడలేకుండా పోతుంది. ఇదంతా మీరు క్లియర్‌గా వీడియోలో కూడా చూడొచ్చు. ఈ సమయంలో ఆ యువకుడు మాట్లాడడం అసాధ్యంగా మారింది. అయినప్పటికీ యువకుడు ఏమాత్రం భయపడకుండా మెడ చుట్టూ పాము చుట్టుకుంటున్నప్పటికీ.. అలాగే మాట్లాడుతూ ఉండిపోయాడు. ఎవరికి ఆ పాము అతని మెడకు గట్టిగా బలం వినియోగించి చుట్టుకోవడంతో ఇతరుల సహాయంతో అతని మెడ నుంచి విడిపించుకున్నాడు. 

Also Read: King Cobra Video: ఏంగుండెరా వాడిది.. 20 అడుగుల కింగ్ కోబ్రాతో ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్.. వీడియో మీకోసం..

ఇలాంటి ప్రమాదకరమైన పాములు ఏవైనా జంతువుల చుట్టూ చుట్టుకుంటే తప్పకుండా అవి మరణించే వరకు వదిలిపెట్టవు. అవి మరణించిన తర్వాతే... వదిలిపెట్టి వాటిని ఆహారంగా అక్కడే తినేస్తాయి. అందుకే ఈ పాములను అత్యంత దృఢమైన కండరాలు కలిగిన స్నేక్స్‌గా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే నిక్ ద రాంగ్లర్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ షార్ట్ వీడియోను కొన్ని కోట్ల మందికి పైగా వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వీడియోను 12 లక్షల మందికి పైగా లైక్ కూడా చేశారు.

Also Read: King Cobra Video: ఏంగుండెరా వాడిది.. 20 అడుగుల కింగ్ కోబ్రాతో ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్.. వీడియో మీకోసం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Dec 18, 2025 07:39:44
Hyderabad, Telangana:

Snake Dancing For Nagin Tune: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వింతలు మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. ముఖ్యంగా అడవిలోని వన్యప్రాణులు.. అందులోనూ పాములకు సంబంధించిన వీడియోలంటే ఇంటర్నెట్‌లో తెగ ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా బీహార్‌లో జరిగిన ఒక వింత సంఘటన ఇప్పుడు నెటిజన్లను ఊపేస్తోంది.

ఒక్క రోజులో 2 కోట్ల వ్యూస్!
సాధారణంగా సినిమాల్లో మాంత్రికులు నాగస్వరం ఊదగానే పాములు లేదా పాము రూపంలో ఉన్న మహిళ డ్యాన్స్ చేయడం మనం చూస్తుంటాం. కానీ, నిజ జీవితంలో అలాంటి వీడియోలు ఎప్పుడూ చూడలేదు. బీహార్‌కు చెందిన ఒక బాలుడు తన మొబైల్‌లో 'నాగిని' ట్యూన్‌ను తన మొబైల్‌లో ప్లే చేయగా.. ఓ పాము దానికి స్పందించిన తీరు అందర్ని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన 24 గంటల్లోనే అత్యధికంగా 2 కోట్లకు పైగా వ్యూస్ సంపాదించి రికార్డు సృష్టించింది.

వీడియోలో పాము డ్యాన్స్ ఎలా ఉందంటే?
వైరల్ అవుతున్న ఆ వీడియోలో కొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి. నాగిని మ్యూజిక్ మొదలవ్వగానే వీడియోలోని పాము వేగంగా కదలడం, ట్యూన్‌కు స్పందించడం ప్రారంభించింది. ఆ ట్యూన్‌కు మెలికలు తిరిగిపోవమే కాకుండా.. ఆ పాము తన నోరు చాచి నేలపై దొర్లుతూ వింత విన్యాసాలు చేయడం ఆ వీడియోలో కనిపిస్తుంది. పాము చేస్తున్న ఈ డ్యాన్స్‌ను చూసి చుట్టుపక్కల వారు ఆశ్చర్యంతో తమ ఫోన్లలో బంధించారు.

ఇది స్నేక్ డ్యాన్సేనా?
ఈ వీడియో చూసిన నెటిజన్లు అనేక రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే శాస్త్రీయంగా చూస్తే.. పాములకు అసలు చెవులు ఉండవని చెబుతారు. కాబట్టి అవి సంగీతాన్ని వినలేవు కదా. మరి ఆ సంగీతానికి అవెలా స్పందించాయి అనేది కొందరి వాదన. కేవలం అవి నేలపై వచ్చే కదలికలను మాత్రమే పాములు తమ శరీరం ద్వారా గ్రహించగలవు. ఇలాంటి ఆలోచనల నడుమ పాము నిజంగా ఆ పాటకు డ్యాన్స్ చేసిందా? లేక అది కేవలం యాదృచ్చికంగా జరిగిందా? అనే విషయం పక్కన పెడితే, ప్రస్తుతం ఈ వీడియో మాత్రం నెట్టింట సెన్సేషన్‌గా మారింది.

ALso Read: 2026 Astrology: 2026లో మొదటి రోజున దీన్ని మీ గుమ్మానికి కట్టండి! ఏడాది పొడవున ఇంట్లో డబ్బుకు ఢోకా ఉండదు!

Also REad: 8th Pay Commission: ఉద్యోగులకు, పెన్షనర్లకు షాకింగ్ న్యూస్..DA పెంపు, ఇతర ప్రయోజనాలు రద్దు..క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Dec 18, 2025 07:03:51
Hyderabad, Telangana:

2026 Astrology Tips: 2026 నూతన సంవత్సరానికి మరో కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది.  వచ్చే ఏడాది అంతా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటిపై ఉండాలని ఆశిస్తున్నారా? అయితే జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్న ఈ చిన్న పరిహారాన్ని పాటించి ఐశ్వర్యవంతులు అవ్వండి.

హిందూ ధర్మంలో లేదా హిందూ సాంప్రదాయం ప్రకారం.. తులసి మొక్కను అత్యంత పవిత్రంగా భావిస్తారు. తులసి కోటలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని భక్తుల నమ్మకం. అందుకే తులసికి సంబంధించిన కొన్ని ఆచారాలు పాటిస్తే ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని వారు నమ్ముతారు.

తులసి చెట్టు వేరుతో అద్భుత పరిహారం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఇంటి ప్రధాన ద్వారానికి తులసి వేరును కట్టడం వల్ల ప్రతికూల శక్తి (చెడు కన్ను) దూరమై, సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుందని జోతిష్య శాస్త్రం చెబుతోంది. దీనివల్ల ధన ప్రవాహం పెరగడమే కాకుండా, ఇంట్లో ఎల్లప్పుడూ ధాన్యానికి, సంపదకు కొరత ఉండదట.

ఈ పరిహారాన్ని ఎలా పాటించాలి?
కావలసిన వస్తువులు: ముందుగా ఎండిపోయిన తులసి మొక్క వేర్లను సేకరించాలి. వీటితో పాటు ఒక ఎర్రటి గుడ్డ, కొన్ని అక్షతలు (బియ్యం) ఒక నాణెం సిద్ధం చేసుకోండి.

పూజా విధానం ఏంటి?
ఎర్రటి వస్త్రంలో తులసి వేర్లు, అక్షతలు, నాణెం ఉంచి ఎర్రటి దారంతో ఒక మూటలా కట్టాలి. ఈ మూటను లక్ష్మీదేవి పటం ముందు ఉంచి భక్తితో పూజించి, మీ మనసులోని కోరికను కోరుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత, ఆ ఎర్రని వస్త్రంతో కప్పిన మూటను మీ ఇంటి ప్రధాన ద్వారం (మెయిన్ డోర్) బయటి వైపున, కుడి పక్కన స్పష్టంగా కనిపించేలా కట్టండి.

వచ్చే ఏడాది మొదటి రోజైన జనవరి 1, 2026న ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారట.. ఆర్థిక కష్టాల నుండి విముక్తి పొందవచ్చని జోతిష్య నిపుణులు చెబుతున్నారు.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం జోతిష్య నిపుణులు, మత విశ్వాసాల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: IPL Vs PSL 2026: ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్‌కు మరో గట్టిదెబ్బ..ఐపీఎల్ వల్ల 28 కోట్ల రూపాయల నష్టం!

Also Read: Ayesha Takia Photo: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాగార్జున హీరోయిన్..'సూపర్' హీరోయిన్ ఆయేషా ఇప్పుడెలా ఉందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Dec 18, 2025 05:01:32
Secunderabad, Telangana:

Atal Pension Yojana Increase Decision 2025:అటల్ పెన్షన్ యోజన కింద పెన్షన్ మొత్తాలను పెంచుతారా? లేదా ? అనే ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో స్పష్టత ఇచ్చింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులు ఈ పథకంపై ఆధారపడుతున్న నేపథ్యంలో.. పెన్షన్ పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశం మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ పథకానికి 84 మిలియన్లకు పైగా చందాదారులు ఉన్నారు.

అటల్ పెన్షన్ యోజన స్కీమును మే 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలో సార్వత్రిక సామాజిక భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ పథకపు ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయం కల్పించాలనే ఉద్దేశంతో దీనిని అమలులోకి తీసుకొచ్చారు. ఈ పథకం కింద చందాదారులు తమ ఎంపిక ప్రకారం నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు హామీ పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.

ఎంచుకున్న పెన్షన్ మొత్తాన్ని.. అలాగే చందాదారుడి చేరిక వయస్సును బట్టి నెలవారీ కాంట్రిబ్యూషన్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఈ సహకారం నెలకు కనీసంగా రూ.42 నుంచి గరిష్టంగా రూ.1,454 వరకు ఉంటుంది. తక్కువ ఆదాయం కలిగినవారు కూడా సులభంగా చేరేలా ఈ పథకాన్ని రూపొందించారు.

ఇటీవల అటల్ పెన్షన్ యోజన చందాదారుల్లో వచ్చిన ఓ సందేహం చర్చకు దారి తీసింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో, ఈ పథకం కింద కనీస పెన్షన్ మొత్తాన్ని ప్రభుత్వం పెంచుతుందా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ విషయంపై లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను మరింత బలోపేతం చేయడానికి పెన్షన్ మొత్తాలను పెంచే యోచన ఉందా, లేదా కాంట్రిబ్యూషన్ నిర్మాణంలో మార్పులు చేయాలా, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్ విధానాన్ని తీసుకురావాలా అనే అంశాలపై స్పష్టత కోరారు.

Also Read: EPFO Pension: 2030లో రిటైర్ అవుతున్నారా? మీకు ప్రతీ నెలా ఎంత పెన్షన్ అందుతుందంటే? పూర్తి లెక్కలివే..!!

దీనికి స్పందించిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి..ప్రస్తుతం అటల్ పెన్షన్ యోజన కింద పెన్షన్ మొత్తాలను పెంచే ప్రతిపాదన ఏదీ లేదని పార్లమెంటుకు లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. పెన్షన్ మొత్తాన్ని పెంచితే, చందాదారులు చెల్లించాల్సిన నెలవారీ సహకారం కూడా పెరుగుతుందని, దీని వల్ల తక్కువ ఆదాయం కలిగిన వారికి అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడింది. అందుకే ప్రస్తుత నిబంధనలు, షరతులతోనే ఈ పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2025 నవంబర్ 30 నాటికి అటల్ పెన్షన్ యోజనలో మొత్తం 84,517,419 మంది చందాదారులు నమోదయ్యారు. అంటే దాదాపు 84 మిలియన్ల మంది ఈ పథకంతో అనుసంధానమై ఉన్నారు. ఇది ఈ పథకం ప్రజల్లో ఎంత విశ్వాసం సంపాదించుకుందో చూపిస్తోంది. పెన్షన్ స్లాబ్‌ల వారీగా చూస్తే, అత్యధికంగా చందాదారులు రూ.1,000 పెన్షన్ స్లాబ్‌ను ఎంచుకున్నారు. మొత్తం చందాదారుల్లో సుమారు 86.9 శాతం మంది, అంటే 73 మిలియన్లకు పైగా ఈ స్లాబ్‌లో ఉన్నారు. రూ.2,000 పెన్షన్ స్లాబ్‌లో సుమారు 3 శాతం మంది ఉండగా, రూ.3,000 స్లాబ్‌లో 1.41 శాతం, రూ.4,000 స్లాబ్‌లో 0.53 శాతం మంది ఉన్నారు. అత్యధిక పెన్షన్ అయిన రూ.5,000 స్లాబ్‌ను దాదాపు 8.15 శాతం మంది, అంటే సుమారు 6.87 మిలియన్ల మంది ఎంపిక చేసుకున్నారు.

అటల్ పెన్షన్ యోజనలో నమోదు ప్రతి సంవత్సరం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకంలో కేవలం 2.48 మిలియన్ల మంది మాత్రమే చేరారు. అయితే కాలక్రమేణా ప్రజల్లో అవగాహన పెరగడంతో, 2024–25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ సంఖ్య 76 మిలియన్లకు మించిపోయింది. ప్రస్తుత 2025–26 ఆర్థిక సంవత్సరంలోనే, నవంబర్ 30 నాటికి 8.426 మిలియన్ల కొత్త చందాదారులు చేరారు. దీంతో మొత్తం చందాదారుల సంఖ్య 84.5 మిలియన్లను దాటింది.

Also Read: EPFO Latest Update: కొత్త ఏడాదిలో ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. కేంద్ర మంత్రి కీలక అప్ డేట్..!!

ప్రభుత్వం స్పష్టంగా చెబుతున్నది ఏమిటంటే.. అటల్ పెన్షన్ యోజన ప్రధానంగా పేదలు, వెనుకబడిన వర్గాలు, అసంఘటిత రంగ కార్మికులను దృష్టిలో పెట్టుకొని రూపొందించింది. వృద్ధాప్యంలో వారికి కనీస ఆర్థిక భద్రత కల్పించడం, పదవీ విరమణ తర్వాత కూడా స్థిరమైన నెలవారీ పెన్షన్ అందించడం ఈ పథకపు అసలు ఉద్దేశ్యం. ప్రస్తుతం పెన్షన్ పెంపు ప్రణాళికలు లేకపోయినప్పటికీ.. ఈ పథకం లక్షలాది మందికి భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ కొనసాగుతోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Dec 18, 2025 04:49:05
Hyderabad, Telangana:

Ketu Blessing Effect On Zodiac: గ్రహాలు అప్పుడప్పుడు రాశి లేదా నక్షత్ర సంచారం చేయడానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. దీనివల్ల వ్యక్తుల జాతకాల్లో గ్రహాలు మారి జీవితాల్లో అనేకమైన మార్పులు వస్తూ ఉంటాయి. ఈ గ్రహ ప్రభావాలు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు అందిస్తే.. మరికొన్ని రాశుల వారికి ఆశుభ ఫలితాలను అందిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే జాతకంలో కొన్ని గ్రహాలు అశుభ స్థానంలో ఉంటే తప్పకుండా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా కొన్ని చెడు గ్రహాలు అశుభ స్థానంలో ఉంటే అనేకమైన విషయాల్లో బలహీనపడటమే కాకుండా.. వ్యక్తులు వివిధ రకాల వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ముఖ్యంగా కేతువు లాంటి గ్రహం సంచారం చేసినప్పుడు అన్ని రాశుల వారిపై ప్రత్యేకంగా ప్రభావం చూపుతుంది. ఈ గ్రహం దాదాపు 18 నెలలకు ఒకసారి మాత్రమే రాశి ప్రవేశం చేస్తుంది. రాహువు కేతువు రెండు గ్రహాలు చాలా శక్తివంతమైనవిగా భావిస్తారు. అయితే ఈ రెండు గ్రహాలు చాలా అరుదుగా మాత్రమే సంచారం చేస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో నక్షత్ర సంచారం తప్పకుండా చేస్తాయి. ఇదిలా ఉంటే 2026 సంవత్సరంలో కేతువు గ్రహం నక్షత్ర సంచారం చేస్తుంది. 2026 సంవత్సరం ప్రారంభ నెల జనవరిలో పూర్వ ఫల్గుణి నక్షత్రంలోని మొదటి స్థానంలోకి వెళ్తుంది. ఆ తర్వాత కేతువు గ్రహం మార్చి 29 ఆదివారం మాఘ నక్షత్రంలోని నాల్గవ స్థానంలోకి ప్రవేశిస్తాడు. దీంతో రాబోయే ఏడాదిలో కేతువు రెండుసార్లు సంచారం చేస్తాడు. 

వృశ్చిక రాశి 
కేతువు సంచారంతో వృశ్చిక రాశి వారికి నో శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి కెరీర్ పరంగా కలిసి వస్తుంది. ఈ సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్ తులు ఈ సమయంలో తప్పకుండా మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే చదువుకుంటున్న విద్యార్థులకు కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో ఉపాధ్యాయులతో పాటు ఇతర రంగాల్లో ఉన్న వ్యక్తులకు మేలు జరుగుతుంది. కొంతమందికి పెద్ద సమస్యల నుంచి అద్భుత పరిష్కారం లభిస్తుంది.

వృషభ రాశి 
కేతు నక్షత్ర మార్పుల కారణంగా వృషభ రాశి వారికి ఆలోచన మార్పు విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా వీరికి మానసిక ఒత్తిడి క్రమక్రమంగా తగ్గి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దీంతోపాటు ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు ఈ సమయంలో మంచి ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. కార్యాలయాల్లో వస్తున్న అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో సంబంధాన్ని మెరుగుపడడమే కాకుండా ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వీరికి ఆత్మవిశ్వాసం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో వృషభ రాశి వారు కొన్ని అద్భుతమైన పనుల్లో పాల్గొంటారు.

Also Read: Chatugrahi Yoga 2026: త్వరలో 4 గ్రహాల అరుదైన కలయికతో రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..

సింహరాశి 
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు వచ్చే ఏడాది విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఆర్థికంగా మానసికంగా చాలా వరకు కలిసి వస్తుంది. ఎప్పటినుంచో అనుకుంటున్నా పనులు కూడా ఎంతో సులభంగా చేయగలుగుతారు. అలాగే ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. తీవ్ర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. అంతేకాకుండా ఖర్చులు కూడా పూర్తిగా అదుపులో ఉండే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల వీరికి సంపాదన కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. 

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్య శాస్త్ర నిపుణుల నుంచి సేకరించి రాసింది మాత్రమే. దీనిని జీ తెలుగు న్యూస్ దృవీకరించదు.

Also Read: Chatugrahi Yoga 2026: త్వరలో 4 గ్రహాల అరుదైన కలయికతో రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
Advertisement
Back to top