Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Chittoor517590
Chandrababu: చెడు ఆలోచనలు కలిగిన నేరస్తులతో ఏపీ నాశనం: సీఎం చంద్రబాబు
RKRavi Kumar Sargam
Jan 24, 2026 10:06:51
Nagari, Andhra Pradesh

Swarnandhra Swachhandhra: 'చెడు ఆలోచనలు పెట్టుకుని నేరస్తులు రాజకీయాలు చేసి రాష్ట్రానికి భవిష్యత్ లేకుండా చేశారు. దేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంలో జన్మభూమి, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు చేపట్టి స్వచ్ఛత కోసం పనిచేశాం' అని సీఎం చంద్రబాబు తెలిపారు. పరిశుభ్రత విషయంలో మన అందరి ఆలోచనలూ మారాలని.. ఇల్లు ఒక్కటే కాదు మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.

Also Read: KTR Press Meet: ఫోన్‌ ట్యాపింగ్‌ విచారణ తర్వాత కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

నగరిలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. 'ఏడాది కిందట స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర ఓ ఉద్యమంగా ప్రారంభించా. ప్రతీ నెలా మూడో శనివారం ప్రత్యేకమైన థీమ్‌తో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపడుతున్నా. స్వచ్ఛాంధ్ర అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు ఇది మన జీవన విధానం కావాలి' అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. 'ప్రతీ నెలా మొదటి తారీఖున పేదల సేవలో కార్యక్రమం ద్వారా పెన్షన్ల పంపిణీ చేస్తున్నాం. ప్రజల సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పనిచేయాలనే ఉద్దేశంతోనే పేదల సేవలో కార్యక్రమాన్ని పెట్టాం' అని తెలిపారు.

Also Read: DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గిఫ్ట్‌.. బడ్జెట్‌కు ముందే 63 శాతం డీఏ పెంపు

'కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసి చూపించింది. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆడపడుచులు ఉచితంగా ఎక్కడికైనా వెళ్లగలుగుతున్నారు. ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లను అక్కచెల్లెళ్ల సంక్షేమం కోసమే ఇస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా ద్వారా ఏడాదికి రూ.33 వేల కోట్లను పంపిణీ చేస్తున్నది కూటమి ప్రభుత్వమే' అని సీఎం చంద్రబాబు తెలిపారు. పీల్చేగాలి, తినేతిండి, తాగేనీరు కాలుష్య రహితంగా ఉండాలని ప్రకటించారు.

Also Read: Red Nagamani: స్కూల్‌లో కలకలం.. నాగుపాము తలపై ఎర్రటి నాగమణి

'రూ.573 కోట్లతో స్వచ్ఛాంధ్ర కోసం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశాం. 110 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌ యూనిట్ల ఏర్పాటుకు రూ.510 కోట్లు వ్యయం చేస్తున్నాం. కంపోస్ట్ తయారీ కోసం డస్ట్ బిన్‌లను కూడా ఇస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం ఈ-ఆటోలు, ట్రై సైకిళ్లు, పుష్ కార్డులను ఇచ్చాం. గత ప్రభుత్వం లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను పట్టణ ప్రాంతాల్లో వదిలేసి వెళ్లిపోయింది. దీంతో భూమి, భూగర్భజలాలు, వాయు కాలుష్యం పెరిగిపోయింది' అని సీఎం చంద్రబాబు తెలిపారు.

Also Read: PM Kisan: రైతులకు మోదీ సర్కార్‌ శుభవార్త.. పీఎం కిసాన్‌ సహాయం డబ్బుల్‌ డబుల్‌

'ఇప్పుడు ఆ వ్యర్ధాలన్నీ తొలగించి మళ్లీ శుభ్రమైన పరిస్థితులు తీసుకువస్తున్నాం. 112 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను పూర్తిగా తీసేసి పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తాం. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ 100 శాతం చెత్త సేకరణ చేపట్టేలా కృషి చేస్తున్నాం' అని సీఎం చంద్రబాబు చెప్పారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారు చేసే యూనిట్లు 4 ఉన్నాయి. రాజమండ్రి, విజయవాడలలోనూ మరో రెండు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. వీటితో పాటు కాంపోస్టు ఎరువు తయారీ కోసం కూడా ప్రత్యేకంగా కార్యాచరణ చేపట్టినట్లు వెల్లడించారు.

'ప్లాస్టిక్, ఈ-వేస్ట్‌లను సేకరించేందుకు 130 స్వచ్ఛ రథాలను ఏర్పాటు చేశాం. 2026 మార్చి నాటికి 660 స్వచ్ఛ రథాలను రాష్ట్రవ్యాప్తంగా తీసుకువస్తాం. పాఠశాలల్లో విద్యార్థులు పరిశుభ్రంగా ఉండడానికి ముస్తాబు అనే వినూత్న కార్యక్రమం చేపట్టాం. ఈ చర్యతో విద్యార్ధులకు ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నగరాల్లో భారీ స్వీపింగ్ యంత్రాలను కూడా కొనుగోలు చేసి వినియోగిస్తున్నాం' అని సీఎం చంద్రబాబు వివరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Jan 24, 2026 11:29:12
Hyderabad, Telangana:

Google Pixel 10 Offer Price: గూగుల్ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గూగుల్ పిక్సెల్ 10 (Google Pixel 10) పై భారత మార్కెట్లో అదిరిపోయే ఆఫర్‌ అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ ప్రేమికులకు, ముఖ్యంగా బెస్ట్ కెమెరా ఫోన్ కోరుకునే వారికి ఇది సరైన సమయం. ఎటువంటి ఎక్స్ఛేంజ్ లేకుండానే కేవలం బ్యాంక్ ఆఫర్లతో ఈ ఫోన్ ధరను భారీగా తగ్గించుకోవచ్చు.

ధర, ఆఫర్ల వివరాలు:
గూగుల్ పిక్సెల్ లాంచ్ ధర రూ.79,999గా (12GB RAM + 256GB వేరియంట్) ఉంది. ప్రస్తుతం రిపబ్లిక్ సేల్ నేపథ్యంలో ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లో నేరుగా రూ.5,000 తగ్గించి రూ.74,999 కి అందుబాటులో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ (HDFC) ఉపయోగించి EMI ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.7,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ రెండు ఆఫర్లు కలిపితే పిక్సెల్ 10 మీకు కేవలం రూ.67,999కే లభిస్తుంది. 

ICICI బ్యాంక్ కార్డ్స్ ద్వారా 5% (గరిష్టంగా రూ.3,000) వరకు తగ్గింపు పొందే వీలుంది. దీంతో పాటు మీ పాత మొబైల్‌ను ఎక్ఛేంజ్ చేయడం ద్వారా మీకు దాదాపుగా రూ.25,000 వరకు తగ్గింపు లభించే అవకాశం ఉంది. అయితే ఎక్ఛేంజ్ ఆఫర్ అనేది మీ మొబైల్ బ్రాండ్, వాల్యూ, కొనుగోలు చేసిన సంవత్సరం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది.

గూగుల్ పిక్సెల్ 10 - ఫీచర్లు..
అత్యాధునిక డిస్‌ప్లే: 6.3-అంగుళాల యాక్చువా OLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గరిష్టంగా 3,000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

టెన్సర్ G5 చిప్‌సెట్: గూగుల్ సొంతంగా తయారు చేసిన సరికొత్త Tensor G5 ప్రాసెసర్ ద్వారా ఇది అత్యంత వేగంగా పనిచేస్తుంది.

ప్రో-గ్రేడ్ కెమెరా: 48MP మెయిన్ సెన్సార్, 13MP అల్ట్రావైడ్, 10.8MP టెలిఫోటో కెమెరాలతో అద్భుతమైన ఫోటోలు తీయవచ్చు.

ఆండ్రాయిడ్ 16 & AI: ఇది నేరుగా ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌తో వస్తుంది. గూగుల్ జెమిని AI (Gemini AI), మ్యాజిక్ ఎడిటర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

7 ఏళ్ల భరోసా: గూగుల్ ఈ ఫోన్‌కు 2033 వరకు (ఏకంగా 7 సంవత్సరాలు) సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని హామీ ఇచ్చింది.

బ్యాటరీ: 4,835mAh బ్యాటరీతో పాటు 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలదు.

పిక్సెల్ సిరీస్‌లో కెమెరా క్వాలిటీ, సాఫ్ట్‌వేర్ అనుభవం ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటాయి. ప్రస్తుతం లభిస్తున్న రూ.12,000 తగ్గింపు ఈ ప్రీమియం ఫోన్‌ను మంచి డీల్‌గా మారుస్తోంది.

Also Read: 8th Pay Commission: ఉద్యోగులకు కీలకమైన అప్‌డేట్..70 శాతానికి డీఏ పెంపు? ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో భారీ మార్పులు!

Also REad: Kavitha Municipal Election: ఎన్నికల బరిలో దిగనున్న కేసీఆర్ కూతురు..సింహం గుర్తుతో పోటీ..ఎక్కడ నుంచి పోటీ చేస్తుందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 24, 2026 11:27:33
Hyderabad, Telangana:

Maoist Surrender Today News: మారుతున్న కాలంతో పాటు ప్రభుత్వ పునరావాస కార్యక్రమాలకు ఆకర్షితులైన మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి కలిసిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో 8 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝ (Amber Kishore Jha) ఎదుట లొంగిపోయారు. శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా సిపి వారికి ఘనస్వాగతం పలికి.. ప్రభుత్వం తరఫున అందాల్సిన తక్షణ సహాయాన్ని అక్కడే అందజేశారు.  

లొంగిపోయిన వారిలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంపూర్ గ్రామానికి చెందిన ఏడుగురు సభ్యులతో పాటు తెలంగాణలోని జగిత్యాల జిల్లా చెగ్యాం గ్రామానికి చెందిన ఒకరు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.  వీరంతా గత కొద్ది కాలం నుంచి మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులై మిలీషియా సభ్యులుగా కొనసాగుతున్నారని సమాచారం.. అయితే, ఇటీవలే అడవుల్లో కఠినమైన పరిస్థితులు ఏర్పడడం, పోలీసులనిగా, ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల అవగాహన పెరగడంతో వారు లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో వారు పోలీసుల ఎదుట పొంగిపోయినట్లు తెలుస్తోంది. 

లొంగిపోయిన ఎనిమిది మంది సభ్యులకు ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి తక్షణమే రూ.25 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని సిపి అందజేశారు. అంతేకాకుండా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లొంగిపోయిన వారికి తప్పకుండా పూర్తిస్థాయిలో పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు.. అలాగే ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రతి ఫలాలను వారికి అందేలా చూస్తామన్నారు.. ప్రస్తుతం చదువుకున్న వారెవరు మావోయిస్టు పార్టీ వైపు వెళ్లేందుకు మొగ్గు చూపటం లేదని.. అందరూ ఉపాధి అవకాశాల వైపు, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారని ఆయన తెలిపారు. 

అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా చేపడుతున్న అభివృద్ధి పనులతో పాటు పోలీస్ కౌన్సిలింగ్ వల్ల మావోయిస్టులు లొంగుబాట పడుతున్నారని.. అడవుల్లో మిగిలిన వారు కూడా ఆయుధాలు వీడి.. జనజీవన స్రవంతిలో కలవాలని సిపి అంబర్ కిషోర్ ఝ సూచించారు.. లొంగుతున్న సభ్యుల్లో ఒకరైన శ్రీకాంత్ మాట్లాడుతూ.. అడవుల్లో ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వివరించారు.. ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస ప్యాకేజీలు.. ఉపాధి హామీలు తమలో ధైర్యాన్ని నింపాయని, అలాగే గౌరవమైన జీవితాన్ని గడపాలని ఉద్దేశంతోనే లొంగిపోతున్నట్లు ఆయన తెలిపారు. తమలాగే ఇతరులు కూడా అడవుల నుంచి బయటికి వచ్చి ప్రశాంతమైన జీవితాన్ని ప్రారంభించాలని ఆయన కోరారు..

Also Read: Samsung Galaxy F07: ఫ్లిప్‌కార్ట్‌లో సంక్రాంతి బంపర్‌ డిస్కౌంట్‌.. రూ.1,499కే Samsung Galaxy F07 మొబైల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
IPInamdar Paresh
Jan 24, 2026 11:00:55
Hyderabad, Telangana:

Massive fire accident at furniture shop in nampally:  హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ దుకాణంలో గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో మొత్తంగా ఆరుగురు చిక్కుకున్నారు. రెప్పపాటులో బిల్డింగ్ అంతా మంటలు వ్యాపించాయి.ఈ ప్రాంత మంతా దట్టమైన నల్లని పొగలు అలుముకున్నాయి. వెంటనే స్థానికులు ఫైర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన స్థలంకు చేరుకున్న ఫైర్ డిపార్ట్ మెంట్ అధికారులు నాలుగు ఫైరింజన్ లతో మంటలు అదుపు చేస్తున్నారు.

 

మొత్తంగా మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.  భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.  అగ్ని ప్రమాదంకు షార్ట్ సర్క్యూట్ కారణం కావొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.  మొత్తంగా ఈ ఘటన మాత్రం నాంపల్లిలో గందర గోళంగా మారింది. నుమాయిష్ నేపథ్యంలో చాలా మంది వీకెండ్ కావడంతో నాంపల్లి పరిసర ప్రాంతంలో షాపింగ్ చేస్తారు.

Read more: Mallu Bhatti vikramarka: తెలంగాణ ఆస్తుల మీద ఏ గద్దల్ని వాలనివ్వ.! . మరోసారి మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు..

ఇలాంటి తరుణంలో ఈ ఘటన సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు.  ప్రమాద సమయంలో నాలుగు అంతస్తుల భవనంలో ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ఆరుగురు వ్యక్తులు చిక్కుకున్నట్లు సమాచారం. మొత్తంగా ఇంకా అధికారులు మంటలను ఆర్పుతున్నారు.  దీనిపై అధికారులు రియాక్ట్ అయితే అసలు విషయాలు బైటకు రానున్నాయని చెప్పుకొవచ్చు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Jan 24, 2026 10:47:42
Hyderabad, Telangana:

Lion Symbol For Kavitha Municipal Election: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మాజీ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత, తన సొంత రాజకీయ ప్రస్థానాన్ని స్థానిక మున్సిపల్ ఎన్నికల ద్వారా ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. భారత రాష్ట్ర సమితి (BRS) నుండి బయటకు వచ్చిన ఆమె, తన 'జాగృతి' సేనను ఎన్నికల బరిలోకి దించుతున్నారు. జాగృతి పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో, రాబోయే మున్సిపల్ ఎన్నికల కోసం కవిత ఒక వ్యూహాత్మక అడుగు వేశారు.

1. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB)తో ఒప్పందం..
కవిత తన సొంత పార్టీ 'జాగృతి' రిజిస్ట్రేషన్ పూర్తి కావడానికి ఇంకా 4-5 నెలల సమయం పట్టేలా ఉంది. అయితే ఈనెల 27న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో, ఆమె ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో జతకట్టారు. ఆ పార్టీకి చెందిన 'సింహం' గుర్తుపైనే జాగృతి అభ్యర్థులు పోటీ చేయనున్నారు.

2. 'సింహం' గుర్తు ఎందుకు?
తెలుగు రాష్ట్రాల్లో 'సింహం' గుర్తుకు ప్రత్యేక ఆదరణ ఉంది. స్వతంత్రులు, రెబల్ అభ్యర్థులు ఈ గుర్తును ఎక్కువగా కోరుకుంటారు. గతంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ మున్సిపాలిటీలో ఇదే గుర్తుతో ఘనవిజయం సాధించి, ప్రధాన పార్టీలకు షాక్ ఇచ్చారు. ఓటర్లలో ఈ గుర్తు సులభంగా రిజిస్టర్ అవుతుందని, ధైర్యానికి ప్రతీకగా కనిపిస్తుందని భావిస్తున్నారు.

3. ఎన్నికల బరిలో 'జాగృతి' వ్యూహం..
ఎన్నికలు జరుగుతున్న అన్ని మున్సిపాలిటీల్లోనూ జాగృతి అభ్యర్థులను నిలబెట్టాలని కవిత నిర్ణయించారు. ఫార్వర్డ్ బ్లాక్ బీ-ఫార్మ్‌లను ఉపయోగించి ఈ అభ్యర్థులు ఎన్నికల రంగంలోకి దూకనున్నారు.

4. ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
కవిత అభ్యర్థుల ఎంట్రీ ఇప్పుడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీల్లో వణుకు పుట్టిస్తోంది. జాగృతి అభ్యర్థులు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలుస్తారా? లేక బిఆర్ఎస్ ఓట్ బ్యాంక్‌ను దెబ్బతీస్తారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. కేసీఆర్ కుమార్తెగా కవితకు ఉన్న పట్టు, ఇప్పుడు సొంతంగా పోటీ చేయడంపై బిఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.

మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత కవిత ఏ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తారో చూడాలి. 'సింహం' గుర్తు ఆమె రాజకీయ భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తుందో కాలమే నిర్ణయించాలి.

Also Read: 8th Pay Commission: ఉద్యోగులకు కీలకమైన అప్‌డేట్..70 శాతానికి డీఏ పెంపు? ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో భారీ మార్పులు!

Also REad: Telangana DA Hike: తెలంగాణ ఉద్యోగులకు అలర్ట్..విధులకు డుమ్మా కొడితే ఉద్యోగం గోవిందా! రూల్స్ మార్చిన సర్కార్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 24, 2026 09:49:54
Hyderabad, Telangana:

8th Pay Commission DA Hike Update: 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటు, రాబోయే రోజుల్లో కరువు భత్యం (DA) పెంపుపై ప్రభుత్వ ఉద్యోగులలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జీతాల పెంపు, డీఏ విలీనం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై సమగ్ర విశ్లేషణ ఇక్కడ ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన సంఘం అమలు కోసం ఎదురుచూస్తున్నారు. 2026 నాటికి డీఏ గణనీయంగా పెరిగి, కొత్త పే కమీషన్ అమల్లోకి వచ్చే సమయానికి జీతాల ముఖచిత్రం పూర్తిగా మారనుంది.

1. 70% డీఏ దిశగా అడుగులు?
నవంబర్ 2025లో 8వ వేతన సంఘం ఏర్పడినప్పటికీ, నివేదిక సమర్పించడానికి సమయం పడుతుంది. ప్రస్తుతం డీఏ ప్రాథమిక వేతనంలో 58% గా ఉంది. జనవరి 2026 నాటికి ఇది 60% కి చేరుతుందని అంచనా. 2027 మధ్య నాటికి పే కమీషన్ నివేదిక వచ్చే సమయానికి, డీఏ కనీసం మూడు సార్లు సవరించబడి సుమారు 70% కి చేరుకునే అవకాశం ఉంది.

2. గత వేతన సంఘాల డీఏ గణాంకాలు
కొత్త వేతన సంఘం అమల్లోకి వచ్చిన ప్రతిసారీ డీఏను ప్రాథమిక వేతనంలో విలీనం చేసి, డీఏను సున్నా (0) నుండి తిరిగి ప్రారంభిస్తారు.

వేతన సంఘం ముగిసే సమయానికి డీఏ శాతం
5వ వేతన సంఘం 74%
6వ వేతన సంఘం 125%
7వ వేతన సంఘం 58% - 60% (ప్రస్తుత అంచనా)

3. ప్రాథమిక వేతనంలో డీఏ విలీనం?
కొత్త పే స్కేల్ అమలు చేసేటప్పుడు, ఆ సమయంలో ఉన్న డీఏను మూల వేతనానికి (Basic Pay) జోడించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. డీఏ మొత్తాన్ని పూర్తిగా మూల వేతనంలో కలిపి, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో గుణించి కొత్త జీతాన్ని నిర్ణయించడం. 50% డీఏను మాత్రమే కలిపి మిగిలిన దానిని విడిగా ఉంచడం. అయితే, ఇది పూర్తిగా ప్రభుత్వ అభీష్టానుసారం జరుగుతుంది.

4. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ప్రభావం
7వ వేతన సంఘంలో 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను వాడారు. దీనివల్ల కనీస జీతం ₹7,000 నుండి రూ.18,000 కి పెరిగింది. ప్రస్తుతం డీఏ శాతం (60%) గతంలో కంటే తక్కువగా ఉన్నందున, 8వ వేతన సంఘం అమలులో ప్రాథమిక జీతం పెరిగితే, అది ఉద్యోగుల చేతికి వచ్చే జీతంపై మరింత సానుకూల ప్రభావం చూపుతుంది.

8వ వేతన సంఘం నివేదిక వచ్చే నాటికి డీఏ 70% కి చేరితే, ఉద్యోగుల జీతాలు గత కమిషన్ల కంటే మరింత సమర్థవంతంగా పెరిగే అవకాశం ఉంది. అయితే, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది. డీఏ విలీనం ఎలా జరుగుతుందనే దానిపై ప్రభుత్వం నుండి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

Also Read: Private School Fees Bill: ప్రైవేట్ స్కూల్ ఫీజులకు బ్రేక్..కీలక బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం..తల్లిదండ్రులకు ఊరట!

Also Read: Telangana DA Hike: తెలంగాణ ఉద్యోగులకు అలర్ట్..విధులకు డుమ్మా కొడితే ఉద్యోగం గోవిందా! రూల్స్ మార్చిన సర్కార్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 24, 2026 08:06:14
Hyderabad, Telangana:

Giant King Cobra Video Watch Now: ప్రస్తుతం చాలామంది వన్యప్రాణులను ఇంట్లో పెంచుకుంటున్నారు. వాటికి ఎన్నో రకాల ఆహారాలను అందిస్తూ.. అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. ప్రమాదకరమైన వన్యప్రాణులను సైతం ఏ మాత్రం భయపడకుండా ఇంట్లో సురక్షితంగా పెంచుకుంటున్నారు. అనారోగ్య సమస్యలకు గురైనప్పుడు వాటికి ప్రత్యేకమైన చికిత్సలు కూడా ఇంట్లోనే చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తుంది. ఈ వీడియోలో ఓ యువకుడు అత్యంత ప్రమాదకరమైన భారీ కింగ్ కోబ్రాకు చికిత్స చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో చూడొచ్చు..

వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ భారీ కింగ్ కోబ్రా అనారోగ్య సమస్యకు గురైంది.. దీనిని గుర్తించిన పెంపుడు యజమాని వెంటనే తన ప్రాణాలను సైతం తెగించి ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆ కింగ్ కోబ్రాను ఒంటి చేతితో పట్టుకొని చికిత్స చేశాడు. ఈ అరుదైన చికిత్సకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది. అయితే చర్మ సంరక్షణలో భాగంగా.. ఆ యువకుడు అత్యంత ప్రమాదకరమైన పామును పట్టుకొని దాని నోటి భాగం కింద ఉన్న పాత చర్మాన్ని తొలిచేందుకు ప్రయత్నించాడు. అయితే, ఈ పాము గత కొద్ది రోజుల నుంచి ఈ పాత చర్మం కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతూ వస్తోందట.. దీనిని దృష్టిలో పెట్టుకొని అతను ఆ పాముని పట్టుకొని మరి దానిని పట్టుకొని చికిత్స చేసేందుకు ప్రయత్నించడం మీరు వీడియోలో చూడొచ్చు. 

ఈ పాముకు సంబంధించిన యజమాని ప్రమాదకరమైన పాములను పట్టుకునే నైపుణ్యం ఉండడంవల్ల.. ఎంతో చాకచక్యంగా ముందుగా దాని నడుము భాగాన్ని పట్టుకొని.. చాలా నెమ్మది నెమ్మదిగా ఒకే చేతిని ఆ పాము తలభాగం వైపుగా తీసుకువచ్చి ఒకేసారి ఉన్నట్టుండి దాని తలను పట్టేసుకున్నాడు. ఈ సమయంలో ఆ పాము అతని వైపు తిరిగి చూడలేకపోయింది. అందుకే ఎంతో చాకచక్యంగా దాని తలభాగాన్ని పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో అతను నన్ను కరువద్దు.. నీకు ఇంకా చాలా సహాయం చేయాల్సి ఉంది.. అంటూ మాట్లాడుతూ ఉండిపోయిన పాత చర్మాన్ని తీయడానికి ప్రయత్నించాడు..

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

ఆ యువకుడు చర్మాన్ని తొలగించిన వెంటనే పాము కాస్త ఉపశమనం పొందినట్లు తెలుస్తోంది. అది అప్పటివరకు కోపంగా ఉన్నప్పటికీ.. ఆ చర్మాన్ని తొలచి వేసిన తర్వాత కాస్త ప్రశాంతంగా అటు ఇటు తిరగడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సాధారణంగా అన్ని పాములు వాటి శరీర రక్షణలో భాగంగా సంవత్సరంలో ఒకటి నుంచి రెండుసార్లు కుబుసాన్ని విడుస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో కొన్ని పాములు చర్మ సమస్యల బారిన పడుతూ ఉంటాయి. ఇందులో భాగంగానే ఈ పాము కూడా ఇలాంటి చర్మ సమస్యను ఎదుర్కొంటున్నట్లు కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు.

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Jan 24, 2026 07:50:27
Hyderabad, Telangana:

Tamil Nadu Private School Fees Bill: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రభుత్వం సామాన్యులకు భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ రూపొందించిన 'ఫీజుల నియంత్రణ బిల్లు'కు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థలు ఏకపక్షంగా ఫీజులు పెంచకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. దీనివల్ల మధ్యతరగతి, పేద కుటుంబాలపై విద్యాభారం తగ్గనుంది.

ప్రైవేట్ పాఠశాలల ఫీజులు నియంత్రణ కోసం ఏడుగురు సభ్యులతో శక్తివంతమైన కమిటీ వేశారు. ఫీజుల నిర్ణయం, పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులుగా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి (ఛైర్మన్), పాఠశాల విద్య డైరెక్టర్, పిడబ్ల్యుడి (PWD) జాయింట్ చీఫ్ ఇంజనీర్, పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి, రాష్ట్ర తల్లిదండ్రుల-ఉపాధ్యాయ సంఘం ప్రతినిధి, ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధి, ప్రాథమిక విద్యా విభాగ ప్రతినిధి

చట్టంలోని కీలక నిబంధనలు..
పాఠశాలలు తమ ఇష్టానుసారంగా ఫీజులను పెంచడానికి వీలుండదు. కమిటీ నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాలి. కమిటీ ఒకసారి ఫీజును ఖరారు చేస్తే, అది వరుసగా మూడు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. ఆ లోపు ఫీజు మార్చడానికి వీలుండదు. రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.

ఎన్నికల వేళ రాజకీయ ప్రాధాన్యత..
తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం అధికార పార్టీకి మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల అంశం రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్య. దీనిపై చట్టబద్ధమైన నియంత్రణ తీసుకురావడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే, అమలు తేదీపై విద్యాశాఖ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఫీజుల విధానం అమల్లోకి వస్తుంది.

Also Read; Telangana DA Hike: తెలంగాణ ఉద్యోగులకు అలర్ట్..విధులకు డుమ్మా కొడితే ఉద్యోగం గోవిందా! రూల్స్ మార్చిన సర్కార్!

ALso Read; Jiohotstar 79 Plan: జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్.. రూ.79కే అతితక్కువ రీఛార్జ్ ప్లాన్..ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కూడా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 24, 2026 07:29:28
Hyderabad, Telangana:

Two Snakes Dance Video Watch Now: మహారాష్ట్రలోని అహ్మదాబాద్ జిల్లా కేడ్‌గావ్ ప్రాంతంలోని ఓ రైతుకు సంబంధించిన పొలంలో రెండు అత్యంత ప్రమాదకరమైన పాములు ప్రత్యక్షమవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ పాములు చేస్తున్న పనులు చూసిన కొంతమంది రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అత్యంత విషపూరితమైన పాములు పంట పొలాల్లోకి రావడం సర్వసాధారణమే.. కానీ ఒకే చోట రెండు పాములు కనిపించడం ఆశ్చర్యమేస్తోంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అందుకున్న ప్రముఖ స్నేక్ క్యాచర్ వెంటనే అక్కడికి చేరుకొని.. ఆ ప్రమాదకరమైన పాములను పట్టుకున్నారు. ఇప్పుడు ఈ దృశ్యాలే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

స్థానికులు అందించిన సమాచారం ప్రకారం ఎండిన పంట పొలాల్లో రెండు అత్యంత ప్రమాదకరమైన పాములు కనిపించాయట.  వారికి ముందుగా కేవలం ఒక పాము మాత్రమే కనిపించింది.. అయితే, ఆ తర్వాత ఆ పాము ఉన్నచోటే మరో పాము ప్రత్యక్షమవడం.. రెండు పెద్ద పాములు కనిపించడంతో ఆ పొలానికి సంబంధించిన యజమాని షాక్ అయిపోయాడు. దీంతో వెంటనే అతను స్నేక్ క్యాచర్ బృందానికి సమాచారం అందించారు. వారెక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే, ఈ సమయంలో రెండు పాములు ఒకదానిపై మరొకటి పాకుతూ ఉండడం మీరు గమనించవచ్చు. 

ఇలా రెండు పాములు ఒకదానిపై ఒకటి పాకుతూ.. ఉండడం చూసి స్నేక్ క్యాచర్ బృందం కూడా షాక్ అయ్యారు. ఇందులో ఓ స్నేక్ క్యాచర్ ఎంతో సులభంగా రెండు పాములను పట్టుకుని బంధించాడు. అయితే, ఈ సమయంలో ఆ పాములు రెండు పొదల్లోకి దూరెందుకు ప్రయత్నించాయి. అంతేకాకుండా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం కూడా చేశాయి. దీనిని గమనించిన స్నేక్ క్యాచర్ ముందుగానే వాటి తోక భాగాలను పట్టుకున్నాడు. దీంతో ఆ రెండు పాములు ఎంతో సులభంగా పట్టుకొని ఓ సంచిలో బంధించి అక్కడి నుంచి తీసుకెళ్లారు.

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

ఈ సందర్భంగా ఒక స్నేక్ క్యాచర్ మాట్లాడుతూ.. ఈ పాములు ఒకదానిపై ఒకటి పాకడానికి అనేక కారణాలు ఉన్నాయని. ముఖ్యంగా ఫిబ్రవరి నెల నుంచి మార్చి నెలలో వీటి సంతానోత్పత్తి సమయం ప్రారంభమవుతుందని. కాబట్టి సుమారు రెండు నుంచి మూడు నెలల పాటు ఈ పాములు ఇలాగే ఒకదానికొకటి కలయిక జరుపుతాయని వివరించాడు. అందుకే ఈ పాముల జంట ఒకదానిపై ఒకటి పాకుతూ నాట్యం చేస్తున్నట్లు కనిపించాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోను పోస్ట్ చేసి చాలా రోజులైనప్పటికీ.. ఇప్పుడు వైరల్ అవ్వడం విశేషం..

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Jan 24, 2026 07:11:23
Hyderabad, Telangana:

Telangana DA Hike News: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అటు నిబంధనల కఠినతరం, ఇటు సంక్షేమ పథకాల ప్రకటనతో కూడిన కీలక అప్‌డేట్స్ వెలువడ్డాయి. ఒకవైపు విధుల్లో క్రమశిక్షణపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండగా, మరోవైపు డీఏ పెంపు, బీమా వంటి వరాలను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల 'సివిల్ సర్వీసెస్ రూల్స్'లో తెలంగాణ ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. ముఖ్యంగా అనధికారిక గైర్హాజరుపై నిబంధనలను మరింత కఠినతరం చేసింది.

1. కొత్త నిబంధనలు ఇవే (రూల్ 9, రూల్ 25 సవరణ)..
ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా ఏడాది కాలం పాటు విధులకు దూరంగా ఉంటే ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. ఐదేళ్లకు మించి నిరంతరంగా విధులకు గైర్హాజరైతే, వారిని సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తారు. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా విదేశాలకు వెళ్లినా కఠిన చర్యలు తప్పవు. ఏదైనా చర్య తీసుకునే ముందు సంబంధిత ఉద్యోగికి 'షోకాజ్ నోటీసు' ఇవ్వడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

2. సంక్రాంతి కానుకగా డీఏ (DA) పెంపు
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరువు భత్యాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. డీఏను 30.03% నుండి 33.67% కి సవరిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీనివల్ల ప్రభుత్వంపై ప్రతి నెలా రూ.227 కోట్ల అదనపు భారం పడనుంది.

3. రూ.1.02 కోట్ల ఉచిత ప్రమాద బీమా
ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒక భారీ పథకాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని సుమారు 5.14 లక్షల మంది పర్మినెంట్ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల విలువైన ఉచిత ప్రమాద బీమా వర్తిస్తుంది. దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలతో చర్చలు జరిపింది. ఎటువంటి ప్రీమియం భారం లేకుండానే ఉద్యోగులకు ఈ సౌకర్యం కలగనుంది.

విధుల్లో బాధ్యతారాహిత్యాన్ని ఏమాత్రం సహించబోమని హెచ్చరిస్తూనే, ఉద్యోగుల అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోంది. అనధికార సెలవుల్లో ఉన్న వారు తక్షణమే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.

Also Read: Bangladesh T20 World Cup: బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..అప్పీల్‌ను కొట్టివేసిన డీఆర్‌సీ..టోర్నీ నుంచి బంగ్లా అవుట్?

Also Read: Jiohotstar 79 Plan: జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్.. రూ.79కే అతితక్కువ రీఛార్జ్ ప్లాన్..ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కూడా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 24, 2026 07:11:18
Hyderabad, Telangana:

Vivo V70 Launch Date: అతిపెద్ద స్మార్ట్ ఫోన్ కంపెనీల్లో ఒకటైన వివో త్వరలో తమ కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ వివో v70 సిరీస్ పేరుతో లాంచ్ చేయబోతోంది. గత సంవత్సరం మార్కెట్‌లోకి విడుదల చేసిన వివో v6 సిరీస్ సక్సెస్‌ను దృష్టిలో పెట్టుకొని దీనిని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. వివో కంపెనీ ఈ సిరీస్‌ను మొత్తం నాలుగు మోడల్స్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ గతంలో కంటే అద్భుతమైన డిజైన్‌తో, ప్రత్యేకమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే ఈ మొబైల్ సిరీస్‌కు సంబంధించిన అన్ని వివరాలు యూరోపియన్ సర్టిఫికేషన్ సైట్‌లో అందుబాటులో ఉంచారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

యూరోపియన్ ప్రొడక్ట్ రిజిస్ట్రీ ఫర్ ఎనర్జీ లేబులింగ్ (EPREL) డేటాబేస్‌లో కొత్తగా విడుదల కాబోయే అన్ని స్మార్ట్‌ఫోన్లకు సంబంధించిన వివరాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇందులో భాగంగానే వివో v70 స్మార్ట్‌ఫోన్ సిరీస్‌కు సంబంధించిన వివరాలు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సిరీస్‌ని కంపెనీ V2550 అనే మోడల్ నంబర్‌తో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది కొన్ని ప్రాంతాల్లో Vivo V70 FE సిరీస్‌గా విడుదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన 7,000 mAh బ్యాటరీతో లాంచ్ చేయబోతోంది. దీనికి తోడుగా 55W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టు కూడా లభిస్తుంది. కాబట్టి ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 67 గంటలకు పైగా ఇది ప్లే బ్యాక్‌ను అందిస్తుంది.

అలాగే ఈ Vivo V70 మొబైల్ ఐదు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్డేట్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఈ సిరీస్‌లో భాగంగా కంపెనీ  వివో V70, వివో V70 ఎలైట్‌తో పాటు వివో V70 లైట్ 5G, వివో V70 EPREL మోడల్స్‌ను అందుబాటులో ఉంచబోతోంది. ఇక ఇందులోని హైడ్ ఎండ్ మోడల్ V2538 మోడల్ నెంబర్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇక దీనిని కంపెనీ 2026 సంవత్సరం ఆగస్టు నెలలో భారతదేశంలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక ఈ స్మార్ట్‌ఫోన్స్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. దీనిని కంపెనీ 6.77-అంగుళాల 1.5K క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు  5,000 నిట్‌ల పీక్ బ్రైట్‌నెస్ సపోర్టుతో విడుదల కాబోతోంది. 

Also Read: Samsung Galaxy F07: ఫ్లిప్‌కార్ట్‌లో సంక్రాంతి బంపర్‌ డిస్కౌంట్‌.. రూ.1,499కే Samsung Galaxy F07 మొబైల్..

అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ వెనక భాగంలో చాలా ప్రత్యేకమైన కెమెరా మాడ్యూల్‌ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా అన్ని మోడల్స్ త్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎంతో ప్రత్యేకతతో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అదనంగా 50-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో బేస్ వేరియంట్స్ ఎంతో శక్తివంతమైన 6500mAh బ్యాటరీ 90W ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉండబోతోంది. అలాగే ఎన్నో రకాల ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ ప్రత్యేకమైన ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Samsung Galaxy F07: ఫ్లిప్‌కార్ట్‌లో సంక్రాంతి బంపర్‌ డిస్కౌంట్‌.. రూ.1,499కే Samsung Galaxy F07 మొబైల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
TKTA Kiran Kumar
Jan 24, 2026 05:00:40
Hyderabad, Telangana:

Rats in annavaram Prasadam Basket: పవిత్ర క్షేత్రం అన్నవరంలో దారుణ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతినిత్యం ఏదో వివాదానికి పుణ్యక్షేత్రం కేంద్ర బిందువుగా మారుతోంది. సత్యదేవును ప్రసాదంపై ఎలుకలు తిరగడం కలకలం రేపుతోంది. సాక్షాత్తూ ప్రసాద విక్రయ కేంద్రంలో కళ్లెదురుగా ఎలుకలు ఇష్టారీతిన తిరుగుతున్నా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఓ భక్తుడు హైవే వద్దనున్న ప్రసాదం కౌంటర్లో ప్రసాదం తీసుకునేందుకు వెళ్ళగా ఎలుకలు అందులోంచి బిలబిలమంటూ బయటికి రావడంతో భయానికి గురయ్యారు. దీనిపై ప్రశ్నిస్తే సిబ్బంది నిర్లక్ష్యంగా బదులిచ్చారు. 

భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో ఆలయ ఈవో త్రినాథరావు తక్షణం చర్యలకు ఆదేశించారు. పాత నమూనాలయం వద్ద పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి తాత్కాలికంగా తొలగించాలని ఆదేశించారు. మొత్తంగా ఎలుకలు తిండి పదార్ధాలు ఎక్కడున్న అక్కడ వాలిపోతాయి. 

Read more:​ సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!

Read more:​  సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

అది గుడి కావొచ్చు.. ఏదైనా తినుబండారాలకు సంబంధించిన హోటల్ కావొచ్చు. అక్కడ ఎప్పటికపుడు పరిశుభ్రత పాటించడం మూలానా.. ఇలాంటి వాటిని అరికట్టవచ్చు. మరి ఈ ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తున్నాదేది చూడాలి. అయినా.. ఆలయ పరిసరాల్లో ఎలుకలు రాకుండా కట్టుదిట్టైమన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. 

Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..

Also Read: ఒకప్పుడు తెలుగు సహా అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్.. నేడు రూ.2 వేల కోట్లకు యజమాని.. 5 కంపెనీలకు బాస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

0
comment0
Report
HDHarish Darla
Jan 24, 2026 04:59:23
Hyderabad, Telangana:

ICC Refused Bangladesh: 2026 టీ20 ప్రపంచకప్ వేదికల వివాదంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నుండి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు ససేమిరా అంటున్న బంగ్లాదేశ్‌కు ఇప్పుడు అన్ని ద్వారాలు మూసుకుపోతున్నాయి.

భారత్‌లో మ్యాచ్‌లు నిర్వహించాలన్న ఐసీసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బంగ్లాదేశ్ వేసిన అప్పీల్‌ను ఐసీసీ వివాద పరిష్కార కమిటీ (DRC) తోసిపుచ్చింది. దీనితో బంగ్లాదేశ్ ఆశలు అడియాశలయ్యాయి.

డీఆర్‌సీ నిర్ణయం ఏంటి?
ఐసీసీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరిపే అధికారం తమకు లేదని డీఆర్‌సీ స్పష్టం చేసింది. ఇప్పటికే ఐసీసీ బోర్డు సభ్యులు 14-2 మెజారిటీతో బంగ్లాదేశ్ మ్యాచ్‌లను భారత్‌లోనే నిర్వహించాలని ఓటింగ్ ద్వారా ఖరారు చేశారు. నిబంధనల ప్రకారం ఈ నిర్ణయమే అంతిమమని కమిటీ తేల్చి చెప్పింది.

బంగ్లాదేశ్ తదుపరి అడుగు..
డీఆర్‌సీలో చుక్కెదురు కావడంతో, బీసీబీ ఇప్పుడు స్విట్జర్లాండ్‌లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS)ను ఆశ్రయించాలని ఆలోచిస్తోంది. అయితే టోర్నీ సమయం దగ్గరపడుతుండటంతో ఇది ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుందనేది సందేహమే.

బంగ్లా స్థానంలో స్కాట్లాండ్?
బంగ్లాదేశ్ మొండివైఖరి వీడకపోవడంతో ఐసీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం భారత్‌లో ఆడేందుకు అంగీకరించని పక్షంలో, బంగ్లాదేశ్‌ను టోర్నీ నుండి తప్పించి స్కాట్లాండ్ జట్టుకు అవకాశం ఇవ్వాలని ఐసీసీ భావిస్తోంది. దీనిపై శనివారం ఐసీసీ నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

భద్రతా కారణాలను చూపుతూ భారత్‌లో ముంబై, కోల్‌కతా వేదికల్లో మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరిస్తోంది. వీటికి బదులుగా శ్రీలంక లేదా పాకిస్తాన్‌ను వేదికలుగా మార్చాలని కోరుతోంది. కానీ ఐసీసీ మాత్రం ముందుగా ఖరారు చేసిన షెడ్యూల్‌కే కట్టుబడి ఉంది.

Also Read: Jiohotstar 79 Plan: జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్.. రూ.79కే అతితక్కువ రీఛార్జ్ ప్లాన్..ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కూడా!

Also Read: Allu Arjun Review: మామ 'మెగాస్టార్' సినిమాకి అల్లుడు 'ఐకాన్ స్టార్' రివ్యూ..సినిమా చూసి ఏం చెప్పాడంటే? లాస్ట్ లైన్ మిస్ అవ్వొద్దు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
TKTA Kiran Kumar
Jan 24, 2026 04:59:17
Hyderabad, Telangana:

Andhra Pradesh Rain Alert: రానున్న 24 గంటల్లో  ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.  బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. 

మరోవైపు నిన్న దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. అలాగే ఉత్తర కోస్తాలో పొగమంచు కురుస్తుందని, 2-3డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని తెలిపింది. మరోవైపు ఏపీలో చలి తీవ్రత ఇంకా తగ్గలేదు. సంక్రాంతి తర్వాత చలి తగ్గుతుందని అంచనా వేసినా.. అనూహ్యంగా మళ్లీ చలిపులి పెరిగింది. 

Read more:​ సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!

Read more:​  సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

చలితో పాటు ఉదయం 7 గంటలు అయ్యేంత వరకు సూర్యుడు కనిపించంచడం లేదు. మరోవైపు పొగమంచు కారణంగా ఉదయం పూట వాహనాదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు కనబడకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వారం పది రోజులు పరిస్థితులు ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..

Also Read: ఒకప్పుడు తెలుగు సహా అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్.. నేడు రూ.2 వేల కోట్లకు యజమాని.. 5 కంపెనీలకు బాస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 24, 2026 04:21:52
Bengaluru, Karnataka:

Realme 16 Pro Offer Price Cut: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ రియల్ మీ లేటెస్ట్‌గా విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్స్‌లో రియల్ మీ 16 ప్రో (Realme 16 Pro) ఒకటి. దీనిని కంపెనీ ఈ ఏడాది జనవరిలో లాంచ్ చేసింది. అయితే, ఇది ఎన్నో రకాల ప్రత్యేకమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఇది అద్భుతమైన డిజైన్ను కలిగి ఉంది. వెనక భాగంలోని కెమెరా మాడ్యూల్ గతంలో కంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే, ఇప్పుడు ఈ మొబైల్ ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్స్‌లో భాగంగా అత్యంత తగ్గింపు ధరకు లభిస్తోంది. దీనిపై ఉన్న ఆఫర్స్ వివరాలేంటో? ఫీచర్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో రియల్ మీ 16 ప్రో (Realme 16 Pro) అత్యంత తగ్గింపు ధరకి లభించడం విశేషం. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది ఎంతో శక్తివంతమైన 7,000mAh బ్యాటరీతో వచ్చిన మొట్టమొదటి రియల్ మీ మొబైల్‌గా కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. అంతేకాకుండా ఇది 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్ ను కలిగి ఉంటుంది. ఇక ఈ Realme 16 Pro స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన డిస్ప్లే వివరాల్లోకి వెళ్తే.. ఇది ఎంతో ప్రత్యేకమైన 6.78 అంగుళాల 1.5K AMOLED స్క్రీన్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు 144Hz రిఫ్రెష్ రేట్‌తో  వస్తోంది. అలాగే ఇది 6,500 నిట్స్ (Nits) బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది. ఇది ఇతర కాంతి ఉన్నచోట కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 16 (Realme UI 7.0) ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తుంది.

వెనక భాగంలో అద్భుతమైన కెమెరా మాడ్యూల్‌ని కలిగి ఉంటుంది. రియల్ మీ బ్యాక్ సెటప్‌లో 200MP మెయిన్ కెమెరా (Samsung HP5 సెన్సార్, OIS సపోర్ట్) ప్రధాన కెమెరా అందించింది. అంతేకాకుండా అదనంగా 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఫ్రంట్ భాగంలో 50MP ఫ్రంట్ కెమెరా కూడా లభిస్తోంది. ఇది ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ Dimensity 7300 Max 5G చిప్‌సెట్ ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. 

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ Realme 16 Pro స్మార్ట్‌ఫోన్‌ మొత్తం మూడు వేరియన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులోని మొదటి వేరియంట్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. దీని ధర రూ.31,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక రెండవ వేరియంట్ 256 జిబి ఇంటర్నల్ స్టోరీస్‌తో లభిస్తోంది. కానీ ఇది 8gb ర్యామ్ ని మాత్రం కలిగి ఉంటుంది. ఇక చివరి వేరియంట్ 12gb ర్యామ్‌తో పాటు 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. దీని ధర రూ.36,999 నుంచి ప్రారంభమవుతుంది.

Also Read: Samsung Galaxy F07: ఫ్లిప్‌కార్ట్‌లో సంక్రాంతి బంపర్‌ డిస్కౌంట్‌.. రూ.1,499కే Samsung Galaxy F07 మొబైల్..

స్పెషల్ ఆఫర్స్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ ఎంపిక చేసిన ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన ఆక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే బేస్ వేరియంట్‌పై రూ.3,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.28,999కే అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా అదనంగా భారీ తగ్గింపు పొందాలి అనుకునేవారు ఎక్స్చేంజ్ బోనస్ పొందవచ్చు. అయితే, ఏదైనా పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తే రూ.27 వేల వరకు బోనస్ లభిస్తుంది.. దీంతో మీరు కేవలం రూ.1,999 చెల్లిస్తే.. ఈ Realme 16 Pro స్మార్ట్‌ఫోన్‌ సొంతం చేసుకోవచ్చు.

Also Read: Samsung Galaxy F07: ఫ్లిప్‌కార్ట్‌లో సంక్రాంతి బంపర్‌ డిస్కౌంట్‌.. రూ.1,499కే Samsung Galaxy F07 మొబైల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
Advertisement
Back to top