Back
Thousif Ahmed
Mancherial504204

మందమర్రిలో ఎన్నికలు నిర్వహించాలి: జేఏసీ

Thousif AhmedThousif AhmedJun 26, 2024 04:48:03
Mandamarri, Mamidighat, Telangana:
మందమర్రిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని కోరుతూ ఎన్నికల సాధన జేఏసీ నాయకులు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో కు వినతిపత్రం అందజేశారు. గత 31 సంవత్సరాలుగా పాలకవర్గం లేక పరిపాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. ప్రజా సంక్షేమ అభివృద్ధి కుంటుపడిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని అధికారులను కోరారు.
0
Report
Nirmal504202

చెన్నూర్ ఎమ్మెల్యే మరియు కలెక్టర్‌కు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు

Thousif AhmedThousif AhmedJun 25, 2024 07:06:18
Chennur, Telangana:
ట్రాక్టర్ తో దున్నుకునే అవకాశం కల్పించిన చెన్నూరు ఎమ్మెల్యేకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ లకు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మంచిర్యాల జిల్లా కమిటీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. నాయకులు మాట్లాడుతూ.. పోడు సాగుదారులందరికీ చట్టం ప్రకారం హక్కుపత్రులు వచ్చాయి. హక్కుపత్రాలు ఉన్న భూములలో ట్రాక్టర్తో దున్నితే రైతులపై ఎలాంటి కేసులు పెట్టవద్దని వెసలుబాటు కల్పించారని ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.
1
Report
Mancherial504216

జైపూర్: పీఎఫ్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సెల్ టవర్ ఎక్కిన కార్మికుడు

Thousif AhmedThousif AhmedJun 24, 2024 11:38:07
Jaipur, Telangana:
మంచిర్యాల జిల్లా జైపూర్ లో పీఎఫ్ డబ్బులు చెల్లించడం లేదని ఎస్టీపీపీ కార్మికుడు మధు జైపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని టవర్ ఎక్కిన మధు అనే కార్మికుడు. వెంటనే తనకు రావల్సిన పీఎఫ్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశాడు.
1
Report
Mancherial504204

మందమర్రి: మందుబాబులకు అడ్డాగా మినీ ట్యాంకు బండ్

Thousif AhmedThousif AhmedJun 24, 2024 08:22:38
Mandamarri, Mamidighat, Telangana:
మందమర్రి పట్టణంలోని మినీ ట్యాంకు బండ్ మందుబాబులకు అడ్డగా మారింది. రాత్రి వేళల్లో మందుబాబులు మద్యం, కూల్ డ్రింక్స్ తాగి కాలి బాటిల్లను అక్కడనే పడవేసి వెళ్లిపోతున్నారు. దీంతో వ్యర్థాలు పోగవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఏర్పాటు చేసిన ట్యాంకు బండ్ మందుబాబుల అడ్డాగా మారిందని ఆరోపించారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
1
Report
Advertisement
Mancherial504204

తల్లి అంత్యక్రియలకు రాని మందమారి కొడుకు

Thousif AhmedThousif AhmedJun 20, 2024 13:12:33
Mandamarri, Mamidighat, Telangana:

మందమరి నగరంలో మానవత్వం మంటగలుస్తోంది. పాత బస్టాండ్ ప్రాంతంలోని మున్సిపాలిటీ పక్కనే ఉన్న కాలనీలో మల్లక్క అనే వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. వీరికి ముగ్గురు కుమారులు తిరుపతి, వెంకటేష్, సురేష్ ఉన్నారు. సురేష్ ఆర్మీ జవానుగా పనిచేస్తున్నాడు. మల్లక్క గురువారం మృతి చెందడంతో కుమారులు అంత్యక్రియలకు ముందుకు రాలేదు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరకు అంత్యక్రియలు నిర్వహించారు.

1
Report
Mancherial504204

మందమరిలో విద్యార్థుల్లో సికిల్ సెల్ వ్యాధిపై అవగాహన కల్పించారు

Thousif AhmedThousif AhmedJun 20, 2024 05:43:22
Mandamarri, Mamidighat, Telangana:

ప్రపంచ సికిల్ సెల్ ఎనీమియా కార్యక్రమం కింద మందమరి నగరంలోని మోడల్ స్కూల్ విద్యార్థులకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ అనిత ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జిప్ అధ్యక్షురాలు నల్లాల భాగ్యలక్ష్మి, జిల్లా పాలనాధికారి కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ రాహుల్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నివారణకు విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు.

1
Report
Mancherial504216

జైపూర్: పశువుల అక్రమ రవాణా.. పట్టివేత

Thousif AhmedThousif AhmedJun 19, 2024 10:41:35
Jaipur, Telangana:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న గోవులను పట్టుకున్నట్లు స్థానికులు తెలిపారు. జైపూర్ మండలంలోని రసూల్ పల్లి మీదుగా అక్రమంగా తరలిస్తున్న గోవుల వ్యాను స్థానికులు పట్టుకొని ఆపేశారు. సమాచారాన్ని జైపూర్ పోలీసులకు తెలిపారు. పోలీసులు చేరుకుని వ్యాన్ను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు స్థానికులు తెలిపారు
1
Report
Mancherial504216

జైపూర్: చుక్కల దుప్పిని రక్షించిన గ్రామస్థులు

Thousif AhmedThousif AhmedJun 19, 2024 09:07:13
Jaipur, Telangana:
జైపూర్ మండలంలో చుక్కల దుప్పిని కుక్కలు తరుముతుండగా గ్రామస్థులు రక్షించి అటవీ అధికారులకు అప్పగించారు. ముదిగుంట గ్రామ నీలగిరి ప్లాంటేషన్ లో చుక్కల దుప్పిని కుక్కలు తరుముతుండగా వాటి నుంచి తప్పించుకునే క్రమంలో పరిగెడుతూ దుప్పి స్పృహ తప్పిపోయింది. గమనించిన గ్రామస్థులు కుక్కలను తరిమేసి ఆ దుప్పిని రక్షించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు దుప్పిని అటవీ ప్రాంతంలో వదిలేశారు.
1
Report
Mancherial504204

మందమర్రి: సిబ్బందిని బాధ్యులు అనడం సరికాదు

Thousif AhmedThousif AhmedJun 19, 2024 08:57:37
Mandamarri, Mamidighat, Telangana:
సీఎం పి ఎఫ్ చీటీల ఆలస్యానికి జీఎం కార్యాలయ సిబ్బంది బాధ్యులని ఏఐటీయూసీ నాయకులు ప్రచారం చేయడం సమంజసం కాదని సిఐటియు నాయకులు అన్నారు. మందమర్రి బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు వెంకటస్వామి, రాజేందర్ మాట్లాడుతూ.. సీఎం పి ఎఫ్ చీటీల పంపిణీ ఆలస్యం అవుతున్నందున కార్మికులు ఎక్కడ ప్రశ్నిస్తారో అని కార్యాలయ సిబ్బందిపై సమస్యలు నెట్టడం సరైనది కాదన్నారు. వెంటనే సీఎం పి ఎఫ్ చీటీల పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేశారు.
1
Report
Mancherial504208

మంచిర్యాలలో ముస్లింలు ఈద్ అల్ అదా వేడుకలను ఘనంగా జరుపుకున్నారు

Thousif AhmedThousif AhmedJun 17, 2024 13:28:51
Mancherial, Telangana:

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఈద్ అల్ అదా వేడుకలు జరుపుకున్నారు. సోమవారం ఉదయం నిద్రలేచి నూతన వస్త్రాలు ధరించి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఈద్గా, ఆయా ప్రాంతాల్లోని మసీదులకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఈద్ నమాజ్ చేసి ప్రత్యేక ఆశీర్వచనాలు చేశారు. నమాజ్ అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

2
Report