Back
K Rajesh Yadav
Mahabubnagar509001

కూతురి ప్రేమకు అడ్డుగా ఉన్నాడని భర్తను హతమార్చింది భార్య

K Rajesh YadavK Rajesh YadavJun 25, 2024 08:23:43
Mahbubnagar, Telangana:

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఆంజనేయులు వృత్తిరీత్యా గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. కూతురి ప్రేమ విషయం బయటపెట్టి తరచూ వేధిస్తున్నాడనే కోపంతో భర్తను భార్య హత్య చేసిందని పోలీసులు తెలిపారు. జడ్చర్ల పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో మేకల కాపరి ఆంజనేయులు హత్య కేసును జడ్చర్ల పోలీసులు శనివారం ఛేదించారు.

0
Report
Mahabubnagar509301

ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందిన ఘటన నవాబ్ పేట్ మండలంలో కలకలం రేపింది.

K Rajesh YadavK Rajesh YadavJun 22, 2024 09:50:59
Jadcherla, Telangana:

నవాబ్ పట్టె మండలం కరూర్ గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందిన ఘటన కలకలం రేపింది. అతను, నాగోలుకు చెందిన విట్టలాచారి, స్నేహితులతో కలిసి బయటకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిపోయాడు. చీకటి పడే వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే ఆలస్యం అవుతుందని చెప్పారు. కుటుంబీకులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించడంతో ఎస్‌ఐ అభిషేక్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

0
Report
Mahabubnagar509001

పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది.

K Rajesh YadavK Rajesh YadavJun 22, 2024 09:26:36
Mahbubnagar, Telangana:

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల టౌన్ మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన నెక్కం చిన్న ఆంజనేయులు(42) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పట్టణంలో కలకలం రేపింది. కాలనీ సమీపంలోని మేకల గుడిసెలో నిద్రిస్తున్న ఆంజనేయుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కారం చల్లి గొంతు కోసి పరారయ్యారు. ఈరోజు కుటుంబ సభ్యులు వెళ్లి చూసే సరికి ఆంజనేయులు అప్పటికే మృతి చెంది ఉండడంతో కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు.

0
Report
Mahabubnagar509001

జడ్చర్ల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్

K Rajesh YadavK Rajesh YadavJun 20, 2024 05:55:06
Mahbubnagar, Telangana:
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి. ధరణి సమస్యల పరిష్కారాన్ని తర్వాత గతిన పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉండడంతో జిల్లాలో అతిపెద్ద మండలం గా పేరుగాంచిన జడ్చర్ల తహసిల్దార్ కార్యాలయంలో భూ సమస్య పరిష్కారాల అప్లికేషన్ ఎక్కువ ఉండడంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన జిల్లా కలెక్టర్.
0
Report
Advertisement
Mahabubnagar509301

రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ పాఠశాలల పై నూతన శకానికి నాంది

K Rajesh YadavK Rajesh YadavJun 19, 2024 09:10:01
Badepalle, Telangana:

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పాఠశాలలు పున ప్రారంభించడంతో ప్రభుత్వ పాఠశాలలలో చదివే నిరుపేద విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తన సొంత డబ్బులతో జడ్చర్ల నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలలో కోటి 75 లక్షల విలువైన (షూస్) బూట్లను 53,000 మంది విద్యార్థులకు అందజేయబోతున్నామని అవి కూడా బ్రాండెడ్ (బాటా) కంపెనీకి చెందిన బూట్లను మాత్రమే పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 

0
Report
Mahabubnagar509301

జాతీయ రహదారి 44 పై పెట్రోల్ ట్యాంకర్ బోల్తా...

K Rajesh YadavK Rajesh YadavJun 19, 2024 05:22:01
Badepalle, Telangana:
మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం ముదిరెడ్డి పల్లి సమీపంలో జడ్చర్ల నుండి హైదరాబాద్ వెళ్లే పెట్రోల్ ట్యాంకర్ అదుపు తప్పి హైదరాబాద్ నుండి జడ్చర్ల వైపు వెళ్లే రోడ్ వైపు దూసుకుపోయి రహదారి పక్కన ఉన్న కలవలోకి వెళ్ళగా డ్రైవర్ కు మరియు అందులో ఉన్న మహిళకు గాయాలు కాగా అంబులెన్స్ లో క్షతగాత్రులను జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
0
Report